సాక్షి, తాడేపల్లి: విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సాసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాతృమూర్తి మజ్జి కృష్ణవేణి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
కృష్ణవేణి గారి మరణ వార్త తనను ఎంతో కలచివేసిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కుటుంబానికి అండగా నిలుస్తూ, విలువలతో కూడిన జీవితం గడిపిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ విషాద సమయంలో మజ్జి శ్రీనివాసరావు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.


