నేడు భీమవరానికి వైఎస్‌ జగన్‌ | YS Jagan to visit Bhimavaram today | Sakshi
Sakshi News home page

నేడు భీమవరానికి వైఎస్‌ జగన్‌

Jul 15 2026 3:54 AM | Updated on Jul 15 2026 3:54 AM

YS Jagan to visit Bhimavaram today

ఆక్వా రైతులను పరామర్శించనున్న వైఎస్సార్‌సీపీ అధినేత

ఫీడ్‌ ధరల పెంపు, గిట్టుబాటు ధరల సమస్యలపై రైతులతో ముఖాముఖి

ఆక్వా రైతులను కలిసిన అనంతరం కిర్లంపూడికి జగన్‌ 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం పశ్చిమ­గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించను­న్నారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసు­కొని వారికి అండగా నిలవనున్నారు. ఆక్వా ఫీడ్‌ ధ­ర­­లు విపరీతంగా పెరగడం, ఉత్ప­త్తి వ్యయాలు అ­ధి­కమవడం, రొయ్యలు, చేప­లకు గిట్టుబాటు ధ­ర­లు లేకపోవడం, విద్యుత్‌ చార్జీల భారం, ఎగు­మ­తుల్లో సమస్యలు, ప్రభు­త్వ ని­ర్ల­క్ష్యంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయ­న రైతు­ల నుంచి అభిప్రాయాలు సేకరించను­న్నా­రు. 

ఇందుకోసం వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. భీ­మ­వరం చేరుకున్న అనంతరం ఉండి బైపాస్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఆక్వా రైతులతో సమావేశ­మవుతారు. అనంతరం కిర్లంపూడికి వెళ్లి ముద్రగడ పద్మనాభం భౌతికకాయం వద్ద నివాళి అర్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement