సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కిర్లంపూడికి పోటెత్తారు. ముద్రగడ భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పిస్తున్నారు. కడసారి ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చారు.
మరోవైపు.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. కిర్లంపూడికి బయలుదేరారు. ముద్రగడ పార్థివ దేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.


