-
ముద్రగడ కూతురు వీడియోపై సంచలన నిజాలు బయటపెట్టిన అడ్వకేట్ రామానుజం
-
ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలు, పిఠాపురంవాసులకు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను ముద్రగడ కోరారు.కాగా, ముద్రగడ లేఖలో..‘గతంలో గాజు గ్లాసు పగిలి ఆ ముక్కలు హాని కలిస్తాయని అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారు. ఎన్టీఆర్ పాలనలో అందరూ సైకిల్ తొక్కేవారు. ఇప్పుడు ఆ సైకిల్కి తుప్పు పట్టడంతో మోటర్ సైకిళ్లు, కార్లు వాడుతున్నారు. ప్రస్తుతం అందరి ఇళ్లలో ఫ్యాన్లు ఉన్నాయి. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రేమాశీస్సులు ఉంచమని కోరుతున్నాను.సీఎం జగన్కు ఓటు వేసే విషయంలో తప్పు చేస్తే శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారు. గతంలో వారి రాక్షస పాలన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాను ఒక్కసారి అందరూ చూడండి. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను. పేదల సంక్షేమం చూసే ముఖ్యమంత్రి జగన్ను గౌరవించాలని కోరుతున్నాను’అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్
-
జగన్ది పేదవాడి ఆకలి తీర్చే మేనిఫెస్టో
నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది పేదవాడి ఆకలి తీర్చే మేనిఫెస్టో అని, చంద్రబాబుది అధికార దాహం తీర్చుకునే మోసపూరిత మేనిఫెస్టో అని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు అమలు కాని హామీలు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తాను చాలామంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ చెప్పింది చెప్పినట్టు చేసి చూపించి.. ప్రజల కోసం పాటుపడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. పేదవాడి చేతి ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లాలని కోరుకుని ఆ దిశగా తన ఐదేళ్ల పాలన కొనసాగించిన నేత జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. అలా మంచి చేసే ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి దిగజారాడు చంద్రబాబు అధికారం కోసం కులాల మధ్య చిచ్చుపెట్టే స్థాయి నుంచి చివరకు కుటుంబాల మధ్య కూడా చిచ్చుపెట్టే స్థాయికి దిగజారిపోయారని ముద్రగడ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టారని, ఇప్పుడు తన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నీచ రాజకీయాలపై చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాలని తపిస్తున్న సినీ నటుడు పవన్కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలన్నారు. తుని ఘటన తరువాత చంద్రబాబు తనను వేధించిన తీరు, అవమానాలు మర్చిపోలేకపోతున్నానని ఆయన వాపోయారు. మళ్లీ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సభకు మాజీ జెడ్పీటీసీ, కాపు నేత చాగంటి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. నరసాపురం వైఎస్సార్సీపీ అ«భ్యరి్థ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
-
నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల్లో నీకే దిక్కు లేదు. అటువంటి నువ్వు నా కుమార్తెకు సీటు ఇస్తావా? అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరిగారు. పవన్ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు తానెప్పుడూ ప్రస్తావించకపోయినా.. తన కుమార్తెను రోడ్డు మీదకు తీసుకు వచ్చారని అన్నారు. భీమవరం, గాజువాకల్లో తరిమేస్తే పిఠాపురం వచ్చి పడ్డారని, ఇప్పుడు పిఠాపురం నుంచి కూడా తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పవన్పై ధ్వజమెత్తారు. ఇటీవల ముద్రగడ కుమార్తె క్రాంతి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, తాజాగా తుని సభలో పవన్ను క్రాంతి కలిసినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ ఘాటుగా స్పందించారు. తన కుమార్తెను తుని వేదికపై పరిచయం చేసినప్పుడు తన పేరు ఎందుకు ప్రస్తావించారని, ఆమె మామ పేరు ఎందుకు చెప్పలేదని ప్రశి్నంచారు. ఇది ఎదుటివారిని అవమానపరచాలనే ఉద్దేశంతో చేసినదే అని అన్నారు.తుని సభలో తన కుమార్తెను తన ఇంటి పేరుతో పరిచయం చేసి తన కుటుంబంలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఆడపిల్లకు వివాహమైన తరువాత తండ్రి ఇంటి పేరు ఉండదనే విషయం తెలియదా అని ప్రశి్నంచారు. తన ప్రతిష్టకు భంగం కల్గించేందుకు కుట్ర పన్నారని పవన్పై మండిపడ్డారు. ఇదంతా మీ గురువు ఆదేశాలతో పెట్టిన చిచ్చు కాదా? అని నిలదీశారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టి, మళ్లీ సానుభూతిగా మాట్లాడటం సిగ్గుగా లేదా అని మండిపడ్డారు. రాజకీయాల్లో నటించడం మానేసి సినిమాల్లో మాత్రమే నటించాలని పవన్కు హితవు పలికారు. పైకి అతిగా గౌరవిస్తున్నట్టు నటిస్తూ, లోపల కుళ్లు, కుతంత్రాలతో తమ కుటుంబాన్ని విడదీయాలని పవన్ చూస్తున్నాడన్నారు. తన కుమార్తెను పిఠాపురంలో పాదయాత్రకు, ప్రచారానికి, అలాగే టీవీ డిబేట్లకు, స్టూడియోల్లో ఇంటర్వ్యూలకు తీసుకువెళ్లి ప్రచారానికి ఉపయోగించుకోండని సలహా ఇచ్చారు.వారాహి సభలో నన్నెందుకు దూషించారుపవన్ను కానీ, ఆయన అన్నయ్యను కానీ ఏ రోజూ ఒక్క మాట అనని తనను కాకినాడ వారాహి సభలో ఎందుకు దూషించారో చెప్పాలని ముద్రగడ నిలదీశారు. పవన్ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలను తానెప్పుడూ ప్రస్తావించలేదన్నారు. మెగా ఫ్యామిలీలో మీ పిల్లల పరిస్థితి ఏమిటో పవన్ చెప్పాలన్నారు. ఆయన కుటుంబం నుంచి వచ్చి పబ్లో మద్యం సేవించి పట్టుబడిన అమ్మాయి, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి విషయాలు కూడా చెప్పాలన్నారు.పవన్ పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను పరిచయం చేసి, మూడో భార్యను సభలో పరిచయం చేసి ఉండాల్సిందంటూ ఎద్దేవా చేశారు. నా కుమార్తెకు జనసేనలో టికెట్ ఇస్తామంటున్నారు.. అప్పటి ఎన్నికల వరకూ అసలు మీ పార్టీ ఉంటుందా? అని ముద్రగడ ప్రశి్నంచారు. అబద్ధాలు చెప్పడానికి పవన్ సిగ్గు పడడం లేదన్నారు. తనకు, తన భార్యకు అనారోగ్య పరిస్థితి వచి్చనా తన కుమార్తెను తన ఇంటికి పంపవద్దని పెద్దలకు మనవి చేస్తున్నానని అంటూ ముద్రగడ భావోద్వేగానికి గురయ్యారు. -
నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే
-
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సీరియస్ అయ్యారు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు అని హితవు పలికారు. అలాగే, పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని చురకలంటించారు.కాగా, ముద్రగడ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏనాడూ చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు?.అలాగే, మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు. పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాలలో కాదు. నాకూ నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త.. మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబెట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
-
కుటుంబంలో చిచ్చుపెట్టారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల కోసం కుటుంబంలో చిచ్చుపెట్టి తనను బెదిరిస్తే బెదిరేది లేదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా కుమార్తె క్రాంతి విడుదల చేసిన వీడియోపై ఆయన శుక్రవారం పిఠాపురంలో మీడియా సమావేశంలో స్పందించారు. వివాహమైన రోజు నుంచే తన కుమార్తె మెట్టినింటి మనిషయ్యిందన్నారు. పెళ్లిగాక ముందు వరకే తమ మనిషి అని, ఇప్పుడు మెట్టినిల్లే ఆమెకు ప్రపంచమని పేర్కొన్నారు. తన కుమారులు మాత్రమే తన మనుషులన్నారు. తన కుమార్తె మామ, జనసేన నాయకులు ఆమెతో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని, ఎవరు బెదిరించినా బెదిరేది లేదని చెప్పారు. ఇలా తిట్లు తిట్టించడం వల్ల తనకు బాధ లేదని, అయితే రాజకీయం రాజకీయమే అని తెలిపారు.కుటుంబంలో చిచ్చుపెట్టిన వారికి ఆ భగవంతుడే సరైన సమయంలో సరైన శిక్ష విధిస్తాడని చెప్పారు. తాను 2009లో ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు కూడా తన కుమార్తె మామ ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారని గుర్తుచేశారు. నాటినుంచి నేటివరకు వారు తనకు ఏ విషయంలోను, ఏ రోజూ సహక రించలేదని తెలిపారు. పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదుతాను 40 సంవత్సరాలకుపైగా రాజకీయాల్లో ఉన్నానని, ఇటువంటి బెదిరింపులు, కుట్రలను ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదని చెప్పారు. రాజకీయాల్లో ఇటువంటివన్నీ అలవాటయ్యాయన్నారు. తన తండ్రి ఎప్పుడూ ధైర్యంగా, నిజాయితీగా ఉండాలని ఇచ్చిన పిలుపుతో ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. అందుకే తాను ఈ రోజుకీ ఎవ్వరికీ భయపడకుండా, ఎవరి చేతి కిందా బతకకుండా ఉంటున్నానన్నారు. తాను ఎప్పుడూ ఎవరి దగ్గరకు వెళ్లి పదవులు కావాలని, ఉన్నతస్థానాలు, హోదాలు కల్పించాలని అడగలేదని చెప్పారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. పిఠాపురంలో పవన్కళ్యాణ్ను ఓడించాలని తాను వైఎస్సార్సీపీలో చేరినప్పటి నుంచీ తనవంతు కష్టపడుతూనే ఉన్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఇటువంటి కుట్రలు పన్నడం రాజకీయాల్లో సహజమేనన్నారు.ఇటువంటి పథకాలు ఇచ్చే నాయకుడు భవిష్యత్లో పుట్టడు తాను ఒకసారి వైఎస్సార్సీపీలో చేరాక, ఇక పక్కచూపులు చూసేదిలేదని ముద్రగడ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తోడుగా ఉండటానికే తాను రాజకీయాల్లోకి తిరిగి వచ్చానన్నారు. ఎవరెన్ని అనుకున్నా జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పునరుద్ఘాటించారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఊపిరి పోస్తున్నాయన్నారు.వైఎస్ తనయుడు జగన్ పేదల పెన్నిధిగా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారని తెలిపారు. రాజశేఖరరెడ్డి కుటుంబం నిత్యం పేదల కోసం పాటుపడేదన్నారు. పేదల కోసం ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసే నాయకుడు భవిష్యత్తులో పుట్టడన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన కొనసాగాలంటే జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల కోసం నిత్యం పరితపించే జగన్కు తోడుగా అన్ని వర్గాలు నిలవాలని కోరారు. కూటమి ప్రజాసేవ కోసం వస్తున్నది కాదని, కేవలం అధికార దాహం తీర్చుకునేందుకు మాత్రమే వస్తోందని చెప్పారు. షూటింగ్ల కోసమే పవన్కు ఎమ్మెల్యే పదవి కావాలని ఎద్దేవా చేశారు. కాపులు అంటే నోట్ల కోసం అమ్ముడుపోయే కులమని పవన్కళ్యాణ్ అన్న మాటలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. -
పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కేవలం పదవి కోసమే పిఠాపురం వస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారమనే ఆకలి తీర్చుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉందని మండిపడ్డారు.కాగా, ముద్రగడ పద్మనాభం శుక్రవారం పిఠాపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్బంగా ముద్రగడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. యువత రాబోయే భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. ఓటర్లు చంద్రబాబు మేనిఫెస్టోను ఒక్కసారి గమనించాలి. చంద్రబాబుకు అధికారం అనే ఆకలిని తీర్చుకోవాలనే తాపత్రయంతో ఉన్నాడు. అందుకే ఇలాంటి మేనిఫెస్టోను తెచ్చారు.కానీ, ఓటర్లు చాలా తెలివైన వారు. చంద్రబాబు మాటలను, హామీలను నమ్మే పరిస్థితి లేదు. ఇక, పవన్ హైదరాబాద్కే పరిమితమయ్యే వ్యక్తి. అలాంటి పవన్ సీఎం కావాలని అనుకుంటున్నాడు. పదవి కోసమే మాత్రమే పవన్ పిఠాపురం వస్తున్నాడు. ముఖానికి రంగులు వేసుకుని పవన్ వస్తున్నాడు.ఇక, ఇదే సమయంలో తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై కూడా ముద్రగడ స్పందించారు. ఈ సందర్బంగా ముద్రగడ.. కొందరు వ్యక్తులు నా కూతురితో నన్ను తిట్టించారు. ఇది చాలా బాధాకరం. నా కూతురుకు పెళ్లి అయిపోయింది.. ఇప్పుడు మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే. నేను ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరాను. ఇక, పక్క చూపులు చూడను. ఎవరెన్ని అనుకున్నా సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. నాకు పదవులేమీ వద్దు. నేను కేవలం సేవకుడిని మాత్రమే’అని కామెంట్స్ చేశారు. -
పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్
-
పవన్ను ఓడించి, తరిమేయడం ఖాయం: ముద్రగడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ను పిఠాపురంలో ఓడించి, తన్ని తరిమేసేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖానికి రంగులు వేసుకొని వచ్చేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారా అని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన పవన్, చంద్రబాబు తీరును ఎండగట్టారు. పిఠాపురంలో పవన్కళ్యాణ్ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఉప్మా, కాఫీలు పెడుతున్నారని విమర్శించడం పవన్కు తగదని, ఇంటికి వచ్చినవారికి మర్యాద చేయటం తమ కుటుంబానికి అలవాటని చెప్పారు. 2014 నుంచి బీజేపీతో కలిసే ఉన్న పవన్కళ్యాణ్ ప్రత్యేకహోదా ఎందుకు తీసుకురాలేదని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా ఎందుకు ఆపలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?విషయాలపై అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీలేక పవన్ బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తుని ఘటన 2016లో జరిగిందన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఆ సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు పవన్ పక్కన ఉన్న జ్యోతుల నెహ్రూ వైఎస్సార్సీపీలోనే ఉన్నారని, ఆ ఘటనకు చంద్రబాబే కారణమనే విషయం తెలుసుకోవాలని సూచించారు. తాను చేతగానివాడిననుకున్నప్పుడు కాపుల కోసం పవన్ ఏంచేశారు, ఎందుకు రోడ్డెక్కలేదని ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చాడని ప్రశ్నించారు. అసలు పవన్ కల్యాణ్ అడ్రస్ ఏమిటి? ఎక్కడ పుట్టాడని అడిగారు. త్వరలో ప్యాకప్తెలంగాణ ఎన్నికల్లో పవన్ నిలబెట్టిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు కదా అని ఎద్దేవా చేశారు. సినిమాల్లో నటించండి.. ఇలా రాజకీయాల్లో నటించడం కుదరదని స్పష్టం చేశారు. త్వరలో పవన్ పార్టీ ప్యాకప్ అవుతుందన్నారు. 1978లో చంద్రబాబు, తాను ఒకేసారి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లామన్నారు. 1978లో చంద్రబాబుకు శిథిలమైన పెంకుటింటికి మరమ్మతులు చేయించడానికి కూడా డబ్బులు లేని విషయం మర్చిపోయారా.. అని నిలదీశారు. 2019లో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశానని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బల్లగుద్ది మరీ చెబుతున్నారని, 2014లో ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు చేశానని చంద్రబాబు చెప్పగలరా అని ముద్రగడ ప్రశ్నించారు. ఈ సమావేశంలో ముద్రగడ గిరిబాబు, గౌతు స్వామి, గణేశుల లచ్చబాబు, గోపు చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
కాకినాడ: అధికారం అనే ఆకలితో చంద్రబాబు నాయుడు అలమటిస్తున్నాడని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. కాపు ఉద్యమాన్ని అణిచివేసి... తన కుటుంబాన్ని వేధించిన ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. అటువంటి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ జత కడతారా? అంటూ ముద్రగడ ప్రశ్నించారు.చంద్రబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పెంకుటింటికి మరమత్తులు చేయించుకోలేదా? ఎమ్మెల్యే అయ్యేంత వరకూ పెంకుటింట్లో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఉన్న పళంగా అపరకోటీశ్వరుడు అయిపోయాడు. చంద్రబాబు ఎలా అపర కోటీశ్వరుడు అయ్యారో ప్రజలకు చెప్పమని కోరుతున్నాను. అధికారం అనే ఆకలితో చంద్రబాబు అలమటిస్తున్నాడు.వయస్సు పెద్దదైంది... ఆబద్దాలు ఆపేయండి. జగన్కు ఓటేయద్దని చెప్పే హక్కు చంద్రబాబుకు లేదు. పేదల పెన్నిధి జగన్. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. కుమిలి కుమిలి చనిపోయేలా చేశారు. రాష్ట్రంలో మీరు స్వేచ్చగా తీరుగుతున్నారు. మీరు, మీ సతీమణీ,.కుమారుడుకోడలు..వియ్యంకుడు,దత్తపుత్రుడుస్వేచ్చగాతిరుగుతున్నారు.ఇంకేమి స్వేచ్చ కావాలో తమ సతిమణీని అడగండి.కాపు ఉద్యమాన్ని అణిచివేసి.. .నా కుటుంబాన్ని వేధించిన చంద్రబాబుతో పవన్ జతకడతారా? నన్ను ప్రేమించే జగన్తో నేను జతకట్టకూడదా?, పవన్ సినిమా డైలాగ్లు చదువుతున్నారు. సినిమాల్లోను..రాజకీయాల్లోను పవన్ నటించేస్తున్నారు. యువతను పాడు చేయకండి..వారి జీవితాలను నాశనం చేయకండి.యువత జీవితాల్లో చీకటి నింపకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని యువతను కోరుతున్నాను.సినిమా హీరోలతో తిరిగి మీ బంగారు భవిష్యతు పాడుచేసుకోకండి.మీ కుటుంబాలు నాశనం అవకుండా యువత మేలుకోండి. -
నన్ను తీహార్ జైలుకి పంపాలని కుట్ర చేశారు.. చంద్రబాబు, పవన్పై ముద్రగడ ఫైర్
-
బాబుది రాక్షస రాజ్యం
-
సీఎం జగన్ దాడిపై ముద్రగడ స్ట్రాంగ్ రియాక్షన్..
-
రాజకీయాల్లో నటించకు పవన్..
తాడేపల్లిగూడెం: ప్రజాసేవ అనే మాట పలకని పవన్కళ్యాణ్ తన జనసేన పార్టీని ప్యాకప్ చేసి, సినిమా షూటింగ్లకు వెళ్లిపోవడం మంచిదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం సూచించారు. సినిమాల్లో నటించు.. కానీ రాజకీయాల్లో నటించొద్దంటూ హితవు పలికారు. ఈరోజు పేదల నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే అది జగన్ దయేనని.. పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ బాగుండాలని, ఆయన పది కాలాలపాటు పేదలకు సేవచేయాలని ముద్రగడ ఆకాంక్షించారు. జగన్ ప్రకటించిన అభ్యర్థులను బలపరచాలని, వారి విజయానికి సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో గురువారం జరిగిన కాపు సంఘీయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాలొ్గన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని పవన్ను కోరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కాపు, తెలగ, బలిజలను మోసగించిన బాబు.. 2014లో కాపు, తెలగ, బలిజలకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని చెప్పి చంద్రబాబు మోసగించాడు. ఇచ్చిన హామీని అమలుచేయమంటే నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారు. ఆ ఐదేళ్లూ చంద్రబాబు పక్కనే ఉన్న పవన్ ముద్రగడను అలా ఎందుకు అవమానించారని ఏనాడైనా అడిగారా? పవన్కు దమ్ము, «ధైర్యం ఉండి మగాడైతే నన్ను తిట్టాలి.. అంతేగానీ మెసేజ్లు పెట్టడం మగతనం అనిపించుకోదు. 21 సీట్లకు పరిమితం కావడం దారుణం.. తెలుగుదేశం గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సమయంలో పవన్ పొత్తువల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగింది. పవన్ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకునేవారు. 80 సీట్లు తీసుకుని, పవర్లో షేరు అడగాలని అందరూ భావించారు. కానీ, చంద్రబాబు మాత్రం లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయడానికి తనయుడితో యువగళం పాదయాత్ర చేయించారు. అడగాల్సినన్ని సీట్లు అడగకుండా.. పవర్ షేరింగ్ లేకుండా కేవలం 21 సీట్లకు పవన్ పరిమితం అయిపోవడం చాలా దారుణం. ఆ సీట్లు కూడా త్యాగం చేసి ఉంటే బాగుండేది. మీకు చెప్పుకోవడానికి ఏమీలేదా బాబూ? అసలు పేదల కోసం జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మీరు అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పడం ఏంటి.. మీకంటూ సొంతంగా చెప్పుకోడానికి ఏమీలేవా బాబూ? ఈ మాటలు చెప్పడానికి మీరు సిగ్గుపడటంలేదేమోగాని వినడానికి మాకు సిగ్గుగా ఉంది. వైఎస్సార్సీపీ ఓటుకు లక్ష రూపాయలు ఇస్తుందని మీరు చెప్పడం చూస్తే పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే మనుషుల్లా కనపడుతున్నారా పవన్? అయినా అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు ఇస్తామని చెప్పాలిగానీ స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడం ఏమిటి? నిజానికి.. పవన్కళ్యాణ్ ముందుగా తాడేపల్లిగూడెం నుంచి పోటీచేయాలనుకున్నారు. అయితే ఇక్కడి జనసేన అభ్యర్థి త్యాగాలు చేయడానికి సిద్ధంగాలేనని, వస్తే కాలూచేయీ తీసేస్తానని బెదిరించడంతో పవన్ పిఠాపురం వెళ్లిపోయారు. -
ధైర్యం ఉంటే నన్ను విమర్శించు పవన్
కిర్లంపూడి: గతంలో పవన్ కళ్యాణ్కు ఎవరికీ జరగని రీతిలో హైదరాబాద్లో ఘోరాతిఘోరంగా అవమానం జరిగిందని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఇంటికి వెళ్లి పవన్ టిఫిన్ చేసి వచ్చాడన్నారు. సీఎంను తిట్టడానికి బహిరంగ సభల్లో ఊగిపోతున్న ఆయనకు ఈ కోపం, పౌరుషం, పట్టుదల, ఆవేశం అప్పుడు ఎక్కడికి పోయాయన్నారు. పవన్కు జరిగిన అవమానం సామాన్యుడికి జరిగినా వారు నిలదీస్తారని.. కానీ ఈ పెద్దమనిషి ఒక్క మాటకూడా అనలేదని గుర్తు చేశారు. చిన్న సినిమా ఆర్టిస్టులతో తనను పవన్ తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు ధైర్యం ఉంటే నేరుగా తనను విమర్శించాలని సవాల్ విసిరారు. మీడియా ముందుకొచ్చి తనను కొన్ని ప్రశ్నలు అడిగితే తాను కూడా పవన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతానన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అగ్నికుల క్షత్రియులు, యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున కాకినాడ జిల్లా కిర్లంపూడికి తరలివచ్చి ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయ న మాట్లాడుతూ పవన్ సినిమాలు తీసుకోవడానికి పిఠాపురంలో ఎమ్మెల్యే పదవి కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ తనతోపాటు నారా లోకేశ్ను, నందమూరి బాలకృష్ణను కూడా తీసుకొచ్చి రాష్ట్రమంతా ప్రచారం చేయించగలరా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం ఇస్తామని, వైఎస్సార్సీపీ ఓటరుకి లక్ష రూపాయలు ఇస్తుందని మాట్లాడటం ప్రజలను అవమానించడమేనని ముద్రగడ మండిపడ్డారు. అప్పుడప్పుడూ రాజకీయాలు చేసేవారిని పక్కనపెట్టాలి అప్పుడప్పుడూ వచ్చి రాజకీయాలు చేసే నాయకులను పక్కన పెట్టి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను, పిఠాపురం అభ్యర్థి వంగా గీతను గెలిపించి జగన్ను మరోసారి సీఎం చేయాలని ముద్రగడ అభ్యర్థించారు. మరో 30 ఏళ్లు వైఎస్ జగన్ సీఎంగా ఉంటారు.. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి త్వరలో పిఠాపురంలో సీఎం వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవారికి కడుపు నిండా భోజనం పెడుతున్న వైఎస్ జగన్ మరో 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ముద్రగడ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం చూడలేక, అధికారం దక్కదనే ఉక్రోశంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం సభ్యత అనిపించుకోదన్నారు. జగన్ను తిట్టడం, అధికార దాహంతో నోటికొచ్చిన అబద్ధాలు ఆడడం చంద్రబాబు స్థాయికి తగదన్నారు. -
పవన్ కల్యాణ్ మగాడే అయితే.. ముద్రగడ సవాల్
కాకినాడ, సాక్షి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ మగాడే అయితే నేరుగా తన మీద మాట్లాడాలంటూ ముద్రగడ సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దమ్ముంటే.. మగాడే అయితే నేరుగా నా మీద మాట్లాడాలి. పవన్ హైదరాబాద్లో పుట్టారు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చి పవన్ ఎమ్మెల్యే కావాలనుకోవడం ఎంత వరకు సబబు?. హైదరబాద్లో అవమానం జరిగినప్పుడు, ఈ పౌరుషం, కోపం, పట్టుదల పవన్కు ఏమయ్యాయి. అవమానం చేసిన వారి ఇంటికి వెళ్లి టిఫిన్ చేస్తారా? అంటూ ముద్రగడ పవన్ను నిలదీశారు. -
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాపు నేతల ఆత్మీయ సమావేశం
-
చంద్రబాబు ఎస్టేట్కు పవన్ జనరల్ మేనేజర్: ముద్రగడ సెటైర్లు
సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్టేట్కు జనరల్ మేనేజర్గా పవన్ కల్యాణ్ ఉన్నాడని ఎద్దేవా చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని కోరారు. ఇదే సమయంలో నారా లోకేష్ ఎవరి కోసం యువగళం పాదయాత్ర చేశారని ముద్రగడ ప్రశ్నించారు. కాగా, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆధ్వర్యంలో తణుకులో కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని పేదలకు అండగా ఉన్నారు. పేదలు ఐదు వేళ్లతో అన్నం తినే పరిస్థితి గతంలో ఎవరూ చేయలేదు. సీఎం జగన్ పాలనపై నేను ప్రశ్నించలేదంటున్న పవన్.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎక్కడ దాక్కున్నావ్. పవన్ పేకాట క్లబ్లు నడిపే వారితో నన్ను తిట్టిస్తున్నాడు. సోషల్ మీడియాలో చెత్త మెసేజ్లు పెడుతూ నన్ను అవమానిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉందని సీఎం జగన్ నాడే చెప్పారు. పిఠాపురంలో తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్ అంటున్నారు. మళ్లీ ఆయనే రెండు లక్షల మెజార్టీ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 20 సీట్లకే పవన్ ముఖ్యమంత్రి అవుతారంట. చంద్రబాబు.. లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తాడు కానీ.. పవన్ను ఎందుకు సీఎంను చేయాలనుకుంటాడు. ఆ 20 సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను క్లోజ్ చేస్తే ఆయన త్యాగశీలిగా మిగిలిపోతాడు. సినిమా షూటింగ్స్ చేసుకునే వారిని ఎమ్మెల్యే చేయాలని అంటున్నాడు. ప్రజల్లో ఉండే వారిని మాత్రమే గెలిపించండి. కూటమి అధికారంలోకి వస్తే సీఎం జగన్ పథకాలను అమలు చేస్తామంటున్నారు. దానికి మీకు అధికారం కావాలా?. నాణ్యమైన విద్య, వైద్యం, వస్తువులు అందిస్తామని అంటారు కానీ.. ఎవరైనా స్వచ్చమైన లిక్కర్ ఇస్తామని అంటారా?. పేదల పెన్నిది సీఎం జగన్ను ముఖ్యమంత్రిని చేయాలి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. -
షూటింగ్లు మానేసి ప్రజాసేవకు సిద్ధమా?
కిర్లంపూడి: ముఖానికి రంగు వేసుకునే వారిని ప్రజలు నమ్మరని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం విమర్శించారు. షూటింగ్లు మానేసి, హైదరాబాద్లోని ఆస్తులు పూర్తిగా అమ్మేసి, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీ రామారావును మాత్రమే ప్రజలు విశ్వసించారన్నారు. తన కుమారుడికి సీఎం పీఠం కట్టబెట్టడానికే చంద్రబాబు ప్రజాగళం యాత్ర తప్ప మరొకరికి అధికారం ఇవ్వడానికి కాదన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వివిధ సామాజికవర్గాల నేతలు ముద్రగడను, యువనేత ముద్రగడ గిరిబాబును కిర్లంపూడిలోని వారి నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ముద్రగడ నాయకత్వంలో పిఠాపురంలో వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చెప్పారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ అఖండ మెజార్టీతో మరోసారి గెలిచి, ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్ల పాటు రామరాజ్యం స్థాపిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీలో అన్నివర్గాలకు సముచిత స్థానం ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ, బీసీలకు సముచిత స్థానం కల్పించి, పదవులు ఇ చ్చిన ఏకైక ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్దేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ సముచిత స్థానం కల్పిస్తున్న వైఎస్సార్ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకుని రావాలని కోరారు. ముద్రగడ పద్మనాభం మద్దతుగా నిలవడంతో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి అధికారం అప్పగిస్తే రాష్ట్ర భవిష్యత్తు నియంతల చేతిలోకి పోతుందని హెచ్చరించారు. -
మీది పిరికితనం, చేతగానితనం
రాజమహేంద్రవరం రూరల్: జనసేన అధినేత పవన్కళ్యాణ్ చేతగానితనం, పిరికితనంతోనే బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడానికి వచ్చేస్తోందంటున్నారని మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. అలాంటప్పుడు రాజకీయాలు మానేయాలని సూచించారు. రాజమహేంద్రవరం బొమ్మూరులోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్కళ్యాణ్కు కార్యకర్తలు వచ్చి షేక్హ్యాండ్ ఇవ్వకూడదని, వారిని అడ్డుకునేలా ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున జీతాలిచ్చి బౌన్సర్లను పెట్టుకున్నారని చెప్పారు. ప్రజలు ముట్టుకోకూడదని, షేక్హ్యాండ్ ఇవ్వకూడదనే.. బ్లేడ్బ్యాచ్ వచ్చేస్తోందంటూ పవన్ నెపం వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తామంతా ప్రజల్లోనే తిరుగుతున్నాం కదా.. తమపై బ్లేడ్బ్యాచ్ దాడులు చేయలేదే అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు అసహ్యంగా ఉన్నాయి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాటలు వింటుంటే అసహ్యంగా ఉందని ముద్రగడ పద్మనాభం చెప్పారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబు, ఆయన స్నేహితులు.. గతంలో ఆయన పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు. సీఎం జగన్కు ఒక చాన్స్ ఇచ్చానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఒక్కచాన్స్ ఇచ్చారని, ప్రజాసంక్షేమ పథకాలతో మంచిపాలన చేస్తునఆయన్ని మరోసారి సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పి.కె.రావు, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పాలనలోనే ఏపీలోని పేదలకు న్యాయం జరిగింది
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement