
సాక్షి, కాకినాడ జిల్లా: అధికారం శాశ్వతం కాదని తెలుసుకోండి అంటూ చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం కౌంటర్ వచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ మిథున్రెడ్డి పై దాడి, వినుకొండలో రషీద్ హత్య అత్యంత హేయం అన్నారు.
హత్యలు, దాడులను వెంటనే ఆపండి.. అధికారం శాశ్వతం కాదు.. అధికారంలో మీరే ఉండరని గుర్తించుకోండి. పౌర్ణమి తరువాత అమావాస్య వస్తుంది’’ అని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు.