తాడేపల్లి: సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. వారి తరఫున చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు.