-
ప్రశాంత కశ్మీర్కు మార్గం
జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదం, రాళ్లదాడులు, హర్తాళ్లు, సరిహద్దుల్లో అలజడి వగైరాలు లేకుండా ఈసారి లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉదమ్పూర్ ర్యాలీలో ఎంతో ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రకటనను బహుశా విపక్షాలు కూడా స్వాగతిస్తాయి. 2019 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుల్వామాలో సైనికులపై ఉగ్రవాద దాడి, ఆ వెనువెంటనే పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం సాగించిన సర్జికల్ దాడులు విపక్షాలకు దేశంలో అప్పటివరకూ కొద్దో గొప్పో ఉందనుకున్న అనుకూలతలను ఆవిరిచేశాయి. బీజేపీకి భారీ మెజారిటీని అందించాయి. కనుక ఈసారి అంతా సవ్యంగా ముగియాలని అవి కోరుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఆ మాటెలావున్నా మోదీ చెప్పిన స్థాయిలో ఉగ్రవాదం బెడద సమసిపోయిందనుకోలేము. ఆ ఉదంతాల సంఖ్య గణనీయంగా తగ్గిన మాట వాస్తవమే అయినా అడపా దడపా వారి ఆగడాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. నిరుడు డిసెంబర్లో పూంచ్లో ఉగ్రవాదులు విరుచుకుపడిన ఉదంతంలో నలుగురు జవాన్లు మరణించటమైనా, మరుసటి నెలలో అదేప్రాంతంలో సైనికులపై జరిగిన దాడి యత్నమైనా, శ్రీనగర్లో ఫిబ్రవరిలో ఒక పంజాబీ పౌరుణ్ణి కాల్చిచంపటమైనా మరింత అప్రమత్తత అవసరమన్న సంకేతాలిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్కు స్వయంప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేయటమైనా, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటమైనా అక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాయన్నది వాస్తవం. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఇది మరింత ప్రస్ఫుటమవుతుంది. లోక్సభ ఎన్నికలకంటే అసెంబ్లీ ఎన్నికలకే జమ్మూ, కశ్మీర్లో ఎప్పుడూ అధిక ప్రాధాన్యత వుండేది. అయితే మారిన పరిస్థితుల్లో లోక్సభ నియోజకవర్గాల్లో పట్టు సంపాదిస్తేనే భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడం సాధ్యమవుతుందని ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కొత్తగా రంగంలోకొచ్చిన గులాంనబీ పార్టీ డీపీఏపీ భావిస్తున్నాయి. ఇక బీజేపీ, కాంగ్రెస్లు రెండూ పార్లమెంటులో తమ సంఖ్యను పెంచుకోవటానికి ఎంతో కొంత దోహదపడుతుందన్నదృష్టితో వున్నాయి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ది విషాద స్థితి. అంతక్రితం గెల్చుకున్న జమ్మూ, లద్దాఖ్లు రెండూ ఆ సార్వత్రిక ఎన్నికల్లో చేజారాయి. ఆ రెండూ బీజేపీ పరమయ్యాయి. కానీ మారిన పరిణామాలు లద్దాఖ్లో ఆ పార్టీకి ఆశలు పుట్టిస్తున్నాయి. ఉపాధి లేమి, హిల్ కౌన్సిళ్లను నీరుగార్చటం, పర్యావరణాన్ని దెబ్బతీసేలా సాగుతున్న కార్పొరేట్ సంస్థల భూదాహం లద్దాఖ్ ప్రజానీకానికి ఆగ్రహం కలిగించాయి. దానికితోడు చైనానుంచి ముప్పువుండొచ్చన్న ఆందోళనతో రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో లద్దాఖ్ను చేరుస్తామన్న హామీనుంచి బీజేపీ వెనక్కి తగ్గింది. అలా చేరిస్తే ఆదివాసీ ప్రాంతాలకు కార్యనిర్వాహక, శాసన, న్యాయ, ఆర్థిక రంగాల్లో స్వయం నిర్ణయాధికారం లభిస్తుంది. తమ ప్రాంతాల్లోని అడవులు, నదులు, వ్యవసాయం, గ్రామపాలన, వారసత్వ ఆస్తి, వివాహం, విడాకులు, సంప్రదాయాలు తదితరఅంశాల్లో చట్టాలు చేసుకునే అధికారం వుంటుంది. పొరుగున చైనా వున్న నేపథ్యంలో ఇది సమస్యాత్మకం కావొచ్చని ఆలస్యంగా గ్రహించటంతో బీజేపీకి ఎటూ పాలుబోవటం లేదన్నది వాస్తవం. అక్కడి ఉద్యమాల పర్యవసానంగా లే ప్రాంతంలో ఆధిపత్యంవున్న బుద్ధిస్ట్లకూ, కార్గిల్లో పైచేయిగా వున్న ముస్లింవర్గాలకూ మధ్య సంప్రదాయ సరిహద్దులు చెరిగిపోయాయి. ఫలితంగా ఇటీవల జరిగిన 26 స్థానాల హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీకి రెండు మాత్రమే దక్కాయి. కనుక బీజేపీ సంకల్పం నెరవేరటం అంత సులభం కాదు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు విడివిడిగా పోటీచేస్తున్నాయి. ఇటీవల సమష్టిగా అడుగులేసినట్టు కనబడిన ఈ రెండు పార్టీలూ ఎన్నికలు వచ్చేసరికి దూరం జరిగాయి. గతంలో ఒప్పందాలకు కట్టుబడి వుండటం అలవాటులేని పీడీపీతో పొత్తు అసాధ్యమన్నది నేషనల్ కాన్ఫరెన్స్ వాదన. చిత్రమేమంటే ఎప్పుడూ ‘మరింత స్వయంప్రతిపత్తి’, జమ్మూ, కశ్మీర్లో శాంతి స్థాపన చర్చలు ప్రధాన ఎజెండాగా చేసుకునే ఆ పార్టీలకు మారిన పరిస్థితుల్లో ఆ అంశాల ప్రస్తావనకే అవకాశం లేకుండా పోయింది. డీపీఏపీ ఎత్తుగడలే ఈ పార్టీలను కలవరపరుస్తున్నాయి. ఆజాద్ తాను బలంగావున్న ఉదంపూర్–దోడా నియోజకవర్గాన్ని వదిలి అనంత్నాగ్–రాజౌరికి ఆయన వలస రావటం వెనక ముస్లింల ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేయాలన్న వ్యూహం వున్నదని వాటి అనుమానం. ఉన్న ఆరు లోక్సభ స్థానాలకూ అయిదు దశల్లో పోలింగ్ నిర్వహించటం జమ్మూ, కశ్మీర్ వర్తమాన స్థితికి అద్దం పడుతుంది. అయిదేళ్లుగా నిద్రాణమైనట్టున్న ఈ ప్రాంతంలో లోక్సభ ఎన్నికల ప్రకటన తర్వాత కదలిక వచ్చింది. ఇప్పుడు లభించే ఓట్ల శాతాన్నిబట్టి భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానం ఏమిటన్నది తేలిపోతుందని బీజేపీ గట్టిగా భావిస్తోంది. మిలిటెంట్ల స్వరం ఈసారి మూగబోయిందన్నది వాస్తవం. అయితే రాష్ట్రంలో హిందూ సీఎంవుండాలన్న బీజేపీ ఆశ నెరవేరాలంటే ఉగ్రవాదాన్ని అణిచేయటం ఒక్కటే చాలదు. అందుకు అభివృద్ధికి బాటలు పరిచి యువతకు ఉపాధి అవకాశాలు పెంచటం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగపరిచే దిశగా చర్యలు తీసుకోవటం, మానవహక్కులకు ప్రాధాన్యతనీయటం తప్పనిసరి. సరిహద్దు ఆవల పాకిస్తాన్, చైనాలు వున్నాయన్న స్పృహతో మెలిగి, సున్నితంగా వ్యవహరించటం నేర్చుకుంటే ఆ ప్రాంత ప్రజల హృదయాలు గెల్చుకోవటం సులభమవుతుంది. -
Lok sabha elections 2024: ఉగ్రవాదులకు చావుదెబ్బ: మోదీ
రిషికేశ్/జైపూర్: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఉగ్రవాదులు చావుదెబ్బ తిన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ముష్కర మూకలను మన భద్రతా దళాలు వారి సొంత గడ్డపైనే మట్టుబెట్టాయని పేర్కొన్నారు. ఫీర్ ఏక్ భార్ మోదీ సర్కారు(మరోసారి మోదీ ప్రభుత్వం) అనే నినాదం దేశమంతటా ప్రతిధ్వనిస్తోందని అన్నారు. స్థిరమైన ప్రభుత్వం వల్ల కలిగే లాభాలను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. గురువారం ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో, రాజస్తాన్లోని కరౌలీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో కేంద్రంలో బలహీన, అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉగ్రవాదులు చెలరేగిపోయారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక తోక ముడిచారని వ్యాఖ్యానించారు. దేశాన్ని లూటీ చేయకుండా అవినీతిపరులను అడ్డుకున్నానని, అందుకే వారంతా తనను దూషిస్తున్నారని ఆక్షేపించారు. -
వలంటీర్లు టెర్రరిస్టులా!?
సాక్షి, అమరావతి/వీరపునాయునిపల్లె/ఏర్పేడు (తిరుపతి జిల్లా)/ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు) /కవితి/టంగుటూరు : నిరంతరం ప్రజల సేవలో ఉంటున్న వలంటీర్లను శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి టెర్రరిస్టులతో పోల్చడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థను మెచ్చుకుంటుంటే టీడీపీ నేతలు మాత్రం రాజకీయ కోణంలో వారిని టార్గెట్ చేయడంపై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. సేవే పరమావధిగా ప్రజలకు మంచి చేస్తున్న వీరిని స్లీపర్స్ సెల్స్ అని.. ఉగ్రవాదులు, డేటా చోరీ చేస్తున్నారని అనడం చాలా బాధాకరమని.. సుధీర్రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా రాష్ట్రంలోని వలంటీర్లందరికీ క్షమాపణలు చెప్పాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బొజ్జల సుధీర్రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్ చంద్రశేఖర్రెడ్డి మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో వలంటీర్ల సేవలను మరచిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారిని ఉగ్రవాదులతో పోల్చడం అమానుషమన్నారు. గతంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్లు కూడా వలంటీర్లను తీవ్రంగా విమర్శించారని.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మంచిగా అమలవుతుండడంతో టీడీపీ, జనసేన పార్టీలకు కడుపుమంటగా మారిందన్నారు. వలంటీర్ల విశ్వసనీయత, తేల్చుకుందామా? మరోవైపు.. బొజ్జల సుధీర్రెడ్డి వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ వలంటీర్స్ అసోషియేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజలోకి మీరు, మేము వెళ్దాం.. ఎవరిపట్ల మంచితనం, విశ్వసనీయత, విశ్వాసం ఉందో చూద్దాం అని వలంటీర్లందరి తరఫున కమిటీ సవాల్ విసిరింది. అప్పట్లో సొంత కుటుంబ సభ్యులే దగ్గరికి రాని పరిస్థితుల్లో వలంటీర్లు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి సేవలు చేశారని.. అలాగే, ఆ రోజుల్లో సుధీర్రెడ్డి హైదరాబాద్కే పరిమితమయ్యారని.. కానీ, వలంటీర్లు ప్రజలకు అందించిన సేవలు ఆయనకేం తెలుసని ప్రశ్నించింది. ‘అలాంటి వారిపై సుధీర్రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమని, సుధీర్రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని వలంటీర్లందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’.. అంటూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పీట నాగమల్లేష్, ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మద్దిలి కాళిదాస్, ఉపాధ్యక్షులు పూజారి ఉదయ్కుమార్, సంయుక్త కార్యదర్శి కొమ్ము సురేష్బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 13 మంది వలంటీర్లు రాజీనామా.. సుధీర్రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని పాయసంపల్లె సచివాలయ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 13మంది వాలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. ఎంపీడీఓ పులి రాంసింగ్, పంచాయతీ కార్యదర్శి విజయ్కుమార్ నాయక్లకు రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ నేతలు వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు. అవ్వతాతలు, చదువురాని పేదలకు సేవచేసేందుకు సీఎం వైఎస్ జగన్ తమకు అవకాశం కల్పించడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని.. కానీ, టీడీపీ నేతలు దీనిని రాజకీయం చేస్తున్నారన్నారు. బొజ్జల సుధీర్రెడ్డి లాంటి నేతలు మరోసారి విమర్శించేందుకు అవకాశంలేకుండా రాజీనామాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక తిరుపతి జిల్లా ఏర్పేడులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ సచివాలయాలకు చెందిన వలంటీర్లు నిరసన చేపట్టారు. టీడీపీ అంటేనే టెర్రరిస్ట్ పార్టీ అని వారు మండిపడ్డారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవచేస్తున్న వలంటీర్లను జిహాదీ తీవ్రవాదులు, బాంబులు పెట్టే టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ అంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జల వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి: మంత్రి సురేష్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సంక్షేమ సారథులుగా సేవలందిస్తున్న వలంటీర్లపై టీడీపీ నాయకులు, కూటమి పార్టీల నేతలు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మీడియా సమక్షంలో చెప్పారు. వలంటీర్లను చూస్తే చంద్రబాబు కూటమికి భయం పట్టుకుందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల సంగతి తెలుస్తామని గతంలో వారు మాట్లాడారన్నారు. ప్రజలకు సేవలు చేస్తున్న వలంటీర్లపై టీడీపీ నేతలు ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వలంటీర్లే బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు. అలాగే, వలంటీర్లపై టీడీపీ, జనసేసే, బీజేపీ కూటమి పగబట్టిందని విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో విమర్శించారు. వలంటీర్లను టెర్రరిస్టులుగా పేర్కొనడం దారుణమన్నారు. వలంటీర్లపై టీడీపీ కూటమి పగబట్టడం దారుణమన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన జన్మభూమి కమిటీలు ప్రజలను ఎలా దోచుకున్నాయో అందరికీ తెలిసిందేనని.. కానీ, వలంటీర్లు అలా కాదని.. వారు అందిస్తున్న సేవలను ప్రజలు మరిచిపోరన్నారు. -
మాస్కో మారణకాండలో 115 చేరిన మృతుల సంఖ్య, 11 మంది అరెస్ట్
రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. క్రాకస్ సిటీ కన్టర్ట్ హాల్లో శుక్రవారం ఐసిస్ తీవ్రవాదులు ఒడిగట్టిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 115 చేరింది. 145 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి 11 మందిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రషన్స్ శాసనసభ్యుడు అలెగ్జాండర్ ఖిన్స్టెయిన్ మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తులు పారిపోయారని.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో కారును వెంబడించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల కారులో పిస్టల్, అసాల్ట్ రైఫిల్కు సంబంధించిన మ్యాగజైన్, తజకిస్థాన్కు చెందిన పాస్పోర్ట్లు లభించాయని తెలిపారు. మరో ఇద్దరు నిందితులు కాలినడకన సమీపంలోని అడవిలోకి పారిపోయారని పేర్కొన్నారు. అనంతరం వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా పశ్చిమ మాస్కోలోని కాన్సర్ట్ హాల్లోకి దుండగులు విరుచుకుపడి కాల్పులు జరిపిన జరిపిన సంగతి తెలిసిందే. కాల్పులతో పాటు బాంబులు విసిరి బిభత్సం సృష్టించారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. చదవండి: మాట మార్చిన మాల్దీవులు.. భారత్ ఎప్పుడూ మిత్రుడే అంటూ.. -
ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. మారణాయుధాలు స్వాధీనం!
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లు, 30 కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై యూఏపీఏ, ఆయుధ చట్టం కింద అమృత్సర్లోని రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ సెల్లో కేసు నమోదు చేశారు. అమెరికాకు చెందిన హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పసియాన్, ఉగ్రవాది హర్విందర్ సింగ్ అలియాస్ రిండా, అర్మేనియాకు చెందిన షంషేర్ సింగ్ అలియాస్ షేరాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం హ్యాపీ పసియాన్, రిండా, షంషేర్లు పంజాబ్లోని యువతను దేశ వ్యతిరేక కార్యకలాపాల దిశగా పేరేపిస్తున్నారు. హర్ప్రీత్ సింగ్, హర్విందర్ సింగ్లను పోలీసులు అరెస్టు చేశారు. In an intelligence-based operation, Punjab Police averts possible target killings with the arrest of 2 members of Babbar Khalsa International (BKI)-backed terror module The module was operated by #USA based Harpreet Singh @ Happy Passian, a close aide of #Pakistan based… pic.twitter.com/Ab9FNk2xtf — DGP Punjab Police (@DGPPunjabPolice) March 7, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement