ఎప్పుడూ అనుములే కాదు.. అన్నారం కూడా పట్టించుకోండి: కేటీఆర్‌ | BRS KTR Serious Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఎప్పుడూ అనుములే కాదు.. అన్నారం కూడా పట్టించుకోండి: కేటీఆర్‌

Jul 11 2026 1:38 PM | Updated on Jul 11 2026 1:40 PM

BRS KTR Serious Comments On Revanth Reddy

సాక్షి, తెలంగాణభవన్‌: నీళ్లు లేక రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే.. నీళ్లు పంపింగ్‌ చేయకుండా రేవంత్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. సీఎం రేవంత్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ కక్షతో ప్రజలపై రుద్దుతున్న కరువు అని అన్నారు. ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో, నల్లమల్ల ఎక్కడుందో తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.

మాజీ మంత్రి కేటీఆర్‌ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘మేడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయవచ్చు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీల్లు లిఫ్ట్‌ చేయవచ్చు. గోదావరి బేసిన్‌లో 77 శాతం నీళ్లు లేవు. సీఎం రేవంత్‌ రెడ్డి బేషజాలకు పోతున్నారు. మేము కన్నెపల్లికి పోగానే సీఎం రేవంత్‌ రెడ్డికి కోపం వచ్చింది. గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకుపోతుందని.. భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని అంటున్నారు. ఎల్‌నినో అంటూ రేవంత్‌ రెడ్డి తప్పించుకుంటున్నారు. సీఎం రేవంత్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సీఎం బండారం బయటపడింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. రోజుకు 9 టీఎంసీల నీళ్లు కొందకు వృథాగా పోతున్నాయి. ఈ నీళ్లతో తెలంగాణలోని అన్ని రిజర్వాయర్లు నింపవచ్చు.

గేట్లు తెరిస్తే మేడిగడ్డ కొట్టుకుపోతుందని రేవంత్‌ అంటున్నారు. రేవంత్‌కు ప్రాజెక్ట్‌లపై అవగాహన తెచ్చుకోవాలి. గతంలో భారీ వరద వచ్చినా మేడిగడ్డ తట్టుకుని నిలబడింది. అన్నారం, సుందిళ్లకు కూడా ఎలాంటి నష్టం జరగలేదు. నీళ్లు లేక రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే.. నీళ్లు పంపింగ్‌ చేయకుండా రేవంత్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ కక్షతో ప్రజలపై రుద్దుతున్న కరువు. వరదను తట్టుకని మేడిగడ్డ.. మేటిగడ్డగా నిలబడింది. కాళేశ్వరంపై బురద చల్లేందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై రేవంత్‌ అజ్ఞాన ప్రదర్శన చేశాడు.

మాపై కక్ష ఉంటే కేసులు.. కానీ, రైతులను పగబట్టకు. మీ రాజకీయం కోసం లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు. ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ, మన సీఎం మాత్రం సొంత రాష్ట్ర ప్రయోజనాలనే ఫణంగా పెడుతున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌పై ఒక్కనాడైనా సీఎం రేవంత్‌ రివ్యూ చేశారా?. ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో, నల్లమల్ల ఎక్కడుందో తెలియదు. ఎప్పుడు అనుముల గురించే కాదు.. అన్నారం గురించి కూడా పట్టించుకోండి’ అంటూ కామెంట్స్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement