ఇరాన్‌, పాకిస్తాన్‌ మధ్య మళ్లీ హై టెన్షన్‌ ! | Tensions Again Escalating Between Iran-Pakistan | Sakshi
Sakshi News home page

ఇరాన్‌, పాకిస్తాన్‌ మధ్య మళ్లీ హై టెన్షన్‌ !

Feb 24 2024 8:21 AM | Updated on Feb 24 2024 9:12 AM

Tensions Again Escalating Between Iran Pakistan - Sakshi

టెహ్రాన్‌: ఇరాన్‌,పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జైష్‌ అల్‌ అదిల్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్‌ మిలిటెంట్‌ కమాండర్‌తో పాటు అతడి అనుచరులపై పాకిస్తాన్‌ భూ భాగంలో ఇరాన్‌ ఆర్మీ దాడిచేసి హతమార్చింది. ఈ విషయాన్ని ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడించింది. దక్షిణ ఇరాన్‌లోని సిస్తాన్‌ బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ కేంద్రంగా 2012లో జైష్‌ అల్‌ అదిల్‌ కార్యకలాపాలు మొదలయ్యాయి.

కొన్నేళ్ల తర్వాత ఈ సంస్థ ఉగ్రవాదులు ఇరాన్‌ భద్రతాబలగాలపైనే దాడులు చేయడం ప్రారంభించారు. గతేడాది డిసెంబర్‌లో సిస్తాన్‌ బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో 11  మంది పోలీసులు చనిపోయారు. ఈ దాడి చేసింది తామేనని జైష్‌ అల్‌ అదిల్‌ ప్రకటించుకుంది. గత నెలలో పరస్పరం మిసైల్‌ దాడులకు దిగడంతో ఇరాన్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.  

ఈ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య భద్రతా సహకారం విషయమై ఒప్పందం కూడా జరిగింది. ఈ విషయమై రెండు దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త మీడియా సమావేశం కూడా నిర్వహించారు. వెనక్కి పిలిచిన ఇరు దేశాల రాయబారులను తిరిగి వారి స్థానాల్లో నియమించారు. ఈ నేపథ్యంలో జైష్‌ అల్‌ అదిల్‌ టెర్రరిస్టులపై పాకిస్తాన్‌ భూభాగంలో ఇరాన్‌ బలగాల దాడి మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది.

ఇదీ చదవండి.. రష్యాపై భారీ ఆంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement