జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం | Two Terrorists Killed In Jammu And Kashmir Bandipora, More Details Inside | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Aug 28 2025 9:46 AM | Updated on Aug 28 2025 11:43 AM

Two Terrorists Killed Jammu and Kashmir

శ్రీనగర్: భారత సైన్యం మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్‌లోని బందిపోరా సెక్టార్‌లోని నౌషెహ్రా నార్డ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నదని అధికారులు పేర్కొన్నారు. నౌషెహ్రా నార్ సమీపంలో ఈ ఆపరేషన్ జరిగింది. అప్రమత్తమైన దళాలు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొన్నాయి. ఈ సందర్భంగా భారతసైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.

ఈ ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా దళాలు చుట్టుపక్కల ఇంకా  ఎవరైనా చొరబాటుదారులు ఉన్నారా? అనేదానిపై  శోధన ఆపరేషన్ ప్రారంభించింది. 
ఈ నెల ప్రారంభంలో జరిగిన ‘ఆపరేషన్ అఖల్‌’లో ముగ్గురు ఉగ్రవాదుల హతమయ్యారు. ఒక సైనికుడు గాయపడ్డారు. దట్టమైన అటవీ ప్రాంతంలో సాయుధ ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఆగస్టు ఒకటిన ‘ఆపరేషన్ అఖల్‌’  ప్రారంభమైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement