-
డబుల్ యాక్షన్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’(2019) మూవీ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రూపొందుతోంది. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించి, రామ్ సరికొత్త పోస్టర్ విడుదల చేశారు. ఫేస్ మాస్క్, పులి చారల చొక్కా, టోర్న్ జీన్స్ ధరించి ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో క్రాకర్స్ పట్టుకుని ఇంటెన్స్ లుక్తో కనిపించారు రామ్. ‘‘డబుల్ ఇస్మార్ట్’ లో డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ హై–బడ్జెట్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, సంగీతం: మణిశర్మ, కెమెరా: సామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి. -
'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుం ఆ సినిమాకు సీక్వెల్ పనులు నడుస్తున్నాయి. ఈ చిత్రానికి ‘డబుల్ ఇస్మార్ట్’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించడం విశేషం. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. దీని తరువాత రామ్ ఎవరితో సినిమా చేయనున్నాడో అనేది ఇంకా వెల్లడి కాలేదు. అయితే తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్తో రామ్ ఒక వెబ్సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన డీల్ కుదుర్చకున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించి చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని తెలుస్తోంది. త్వరలో ప్రకటన కూడా రావచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రామ్ పుట్టినరోజు ఈనెల 15న ఉంది. ఆరోజునే ఈ ప్రకటన విడుదల కావచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.మరోవైపు రామ్ రెండు ప్రాజక్ట్లపై గురి పెట్టినట్లు తెలుస్తోంది. గౌతమ్ మీనన్ కథను ఆయన ఇప్పటికే ఓకే చేసినట్లు సమాచారం. అంతేకాకుండా త్రివిక్రమ్ కూడా రామ్కు ఒక కథ చెప్పారట. మంచి లవ్ స్టోరీ కావడంతో రామ్ ఆసక్త చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. -
రామ్ తో త్రివిక్రమ్ సినిమా
-
టార్గెట్ 2024.. ఈ సారైనా హిట్ కొడతారా?
గత ఏడాది కొందరు యూత్ హీరోలకు షాక్ తగిలింది. ఎంతో నమ్ముకున్న సినిమాలు నిండా ముంచాయి. అందుకే...ఈ సారి సరికొత్తగా ఆకట్టుకోవాలి అనుకుంటున్నారు. మంచి సినిమాతో వచ్చి..హిట్ ట్రాక్ మీదికి రావాలి అనుకుంటున్నారు. మరి అందుకోసం ఈ కథానాయకులు ఏం చేస్తున్నారు..? యంగ్ హీరో నితిన్..2022 లో మాచర్ల నియోజక వర్గంతో వచ్చి నిరాశ పడ్డాడు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని మాస్ ప్రయత్నం చేశాడు .. ఇది బెడిసికొట్టింది. అందుకే తనకు అచ్చోచ్చిన ఎంటర్టైనర్ నమ్ముకొని గత ఏడాది..ఎక్ట్రా ఆర్డనరి మ్యాన్ మూవీతో వచ్చాడు. వక్కంతం వంశీ ఈ మూవీకి దర్శకుడు. కాని ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఈ సంవత్సరం రాబోతున్నాడు. (చదవండి: క్లీంకారపై స్పెషల్ సాంగ్.. విన్నారా?) అపజయాలలో ఉన్న మరో కథానాయకుడు పొతినేని రామ్...ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్ తో మంచి వసూల్లు రాబట్టాడు.దాంతో తర్వాత కూడా మాస్ ను ఆకట్టుకోవాలని వారియర్తో వచ్చాడు. 2022 లో వచ్చిన ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఇక స్కంద తో గత ఏడాది మరోసారి మాస్ నే నమ్ముకున్నాడు. ఈ మూవీ హిట్ కాలేదు. అంతేకాదు సోషల్ మీడియోలో ట్రోల్స్ కు గురి అయింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది హిట్ ట్రాక్ మీదికి వస్తాడేమో చూడాలి. (చదవండి: దిక్కులేని అనాథలా నటుడి మరణం.. చివరి చూపునకు ఎవరూ రాలే!) నాగ చైతన్యకు కూడా కాలం కలిసి రావటం లేదు.థాంక్యూ మూవీతో పాటు..కస్టడీతో ..ప్లాపులు చూశాడు.ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తండేల్లో నటిస్తున్నాడు. చందు మోండెటి దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ హీరోలతో పాటు..విజయ్ దేవరకొండ,నిఖిల్,మంచు విష్ణు లాంటి కథాయకులతో పాటు...కుర్ర హీరోలు..వైష్ణవ్ తేజ్ కిరణ్ అబ్బవరం లాంటి హీరోలకు కూడా ఓ విజయం అవసరంగా మారింది. -
రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన,రామ్, కృతిశెట్టి సందడి (ఫొటోలు)
-
డబుల్ ఇస్మార్ట్కు మణిశర్మ స్వరాలు
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సూపర్హిట్గా నిలిచింది. ప్రస్తుతం రామ్, పూరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చనున్నట్లు చిత్రయూనిట్ శనివారం వెల్లడించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ సినిమాలకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చే ఏడాది మార్చి 8న విడుదల కానుంది. -
స్కంద క్లైమాక్స్ సీన్పై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన రామ్
ఓపక్క ట్రోలింగ్.. మరోపక్క ట్రెండింగ్.. బోయపాటి సినిమాకే సాధ్యమైంది. సోషల్ మీడియాలో స్కంద సినిమా తప్పొప్పులను ఎత్తిచూపుతూ డైరెక్టర్ను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు హాట్స్టార్ స్ట్రీమింగ్ అవుతున్న స్కందను ఎగబడి మరీ చూస్తున్నారు జనాలు. కాగా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నవంబర్ 2న ఓటీటీలో విడుదలైంది. ఓటీటీలో ప్రతి సన్నివేశాన్ని జూమ్ చేసి మరీ చూస్తున్నారు. ప్రేక్షకులు. ఫైట్ సీన్లో బోయపాటి.. ఈ క్రమంలో ఓ ఇంటర్వెల్ ఫైట్లో రామ్ ఓ పోలీస్ను షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాతి ఫ్రేమ్లో ఆ సీన్ను చూసి షాకవుతున్న వారిలో ఆ చనిపోయిన వ్యక్తి కనిపిస్తాడు. దీంతో ఈ సీన్పై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అలాగే క్లైమాక్స్ ఫైట్లో రామ్ దీపస్తంభాలు పట్టుకుని విలన్లను చంపుతాడు. ఈ సీన్లో తేడాను గమనించారు ఓటీటీ ఆడియన్స్. ఈ సన్నివేశంలో మొదట రామ్ పోతినేని కనిపించగా తర్వాతి షాట్లో రామ్కు బదులుగా బోయపాటి దర్శనమిచ్చాడు. దీంతో ఈ సీన్ను తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్పై హీరో రామ్ స్పందించాడు. కాలి నుంచి రక్తం,, నడవలేని స్థితిలో.. '22 ఏప్రిల్, 2023 ఆ రోజు నాకు బాగా గుర్తుంది. వేసవి కాలంలో అత్యంత వేడిగా ఉన్న రోజుల్లో ఇది కూడా ఒకటి. మొత్తం 25 రోజుల షెడ్యూల్లో అది మూడవ రోజు.. అప్పుడు నా కాలి పరిస్థితి ఎలా ఉందో ఫోటోలో చూడొచ్చు. కనీసం నడవలేకపోయాను. కాలి పగుళ్ల నుంచి రక్తం కారింది. దర్శకుడు ఆ సన్నివేశం షూట్ అయిపోవాలన్నాడు. నా పరిస్థితి బాలేకపోవడంతో ఆ ఒకే ఒక్క సీన్లో తను నటించాడు. అందుకు దర్శకుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెమట చిందించేందుకు ఎప్పుడూ సిద్ధం సినిమాలోని కంటెంట్ నచ్చడం, నచ్చకపోవడం అనేది మీ అభిప్రాయం. దాన్ని నేను గౌరవిస్తాను. మీకు వినోదాన్ని అందించడం కోసం నేను రక్తం, చెమట చిందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను' అని ట్వీట్ చేశాడు. దీనికి గాయపడిన కాలి ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు 'మీ కష్టానికి విజయం దక్కకపోయినా పర్వాలేదు కానీ కనీసం అభినందనలైనా దక్కితే బాగుండేది' అని కామెంట్లు చేస్తున్నారు. 22.04.23 I still remember..it was one of the hottest days during the peak of summer..this was my feet after filming this episode on the 3rd day of the 25days..couldn’t walk properly..went away for a bit after it started to bleed..so My Director wanted to get the shot right n did… https://t.co/8cSOTW2H7b pic.twitter.com/4DXF0DYDFn — RAm POthineni (@ramsayz) November 4, 2023 చదవండి: శోభ సేఫ్, తేజ ఎలిమినేట్.. చేసిన పాపం ఊరికే పోతుందా? -
స్కంద సినిమాపై ట్రోల్ చేస్తున్న ఆడియన్స్
-
రామ్-బోయపాటి స్కంద మూవీ.. యాక్షన్ ఓకే.. రీ ఎంట్రీ ఎలా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవలే ఓటీటీలో వచ్చిన స్కంద మూవీ ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. నవంబర్ రెండో తేదీ నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజ్తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే?) సినిమా అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరగడం చూస్తుంటాం. ఎడిటింగ్లో అప్పుడప్పుడు కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం రామ్ నటించిన స్కంద చిత్రంలోనూ అలాంటిదే జరిగింది. అయితే ఈ మూవీలోని ఓ సీన్ విషయంలో జరిగిన అతిపెద్ద పొరపాటు తాజాగా బయటకొచ్చింది. ఓటీటీలో సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు.. ఆ సీన్ను కట్ చేసి ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే ఆ సీన్లో జరిగిన ఆ పెద్ద పొరపాటు ఏంటో తెలుసుకుందాం. సినిమా కథలో భాగంగా ఏపీ సీఎం కూతురిని (అజయ్ పుర్కర్) తీసుకురావడానికి.. తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి(శరత్ లోహితస్వ) వద్దకు రామ్ వెళ్తాడు. అదే సమయంలో ఫుల్ మాస్ యాక్షన్ సీన్ ఫైట్ జరుగుతుంది. అక్కడ రామ్ పవర్ఫుల్ డైలాగ్ కూడా చెబుతాడు. అయితే ఆ సీన్లో ఓ ముసలోడి పిస్టల్ తీసుకుని.. నిన్ను వదలను.. చంపేస్తా అంటూ రామ్ వైపు తుపాకి గురి పెడతాడు. అయితే రామ్ అదే తుపాకితీ అతన్ని కాల్చి పడేస్తాడు. కానీ ఆ తర్వాత వచ్చే సీన్లో చనిపోయిన ముసలోడు సీఎం వెనుక కనిపిస్తాడు. అదేంటి చనిపోయిన వ్యక్తి మళ్లీ సినిమాలో కనిపించడమేంటి? ఈ చిన్న మిస్టేక్ బోయపాటి గమనించలేకపోయాడా? అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత భారీ యాక్షన్ చిత్రంలో ఇలాంటి పొరపాటు ఏంటని సోషల్ మీడియా వేదికగా బోయపాటిని ఆడేసుకుంటున్నారు. (ఇది చదవండి: అంత అందంగా లేనన్నారు, వంక పెట్టారు: హీరోయిన్) స్కంద కాదు ఇది బోయపాటి గాడి బొంద🤦♂️ pic.twitter.com/p49ggMdbMQ — ఇవివి పంచ్ లు🤙 (@evvpunchlu333) November 2, 2023 -
పాన్ ఇండియా రికార్డ్స్ తో సిద్ధం అవుతున్న రామ్ పోతినేని
-
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి.. రామ్- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'స్కంద' హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- ఆట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' నెట్ఫ్లిక్స్లో రన్ అవుతుంది. ఈ రెండు చిత్రాలను థియేటర్కు వెళ్లి చూడని వారు ఈ వీకెండ్లో ఇంట్లోనే కూర్చోని చూసి ఎంజాయ్ చేయవచ్చు. జవాన్- నెట్ఫ్లెక్స్ బాలీవుడ్ కలెక్షన్స్ కింగ్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా వచ్చేసింది. నేడు నవంబర్ 2 షారుక్ పుట్టినరోజు సందర్భంగా 'జవాన్'ని ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్లో అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన 'జవాన్' సుమారు రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్,విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఏ మాత్రం తగ్గకుండా మెప్పించారు. థియేటర్లో ఈ సినిమా చూడని వారు నెట్ఫ్లెక్స్లో చూడొచ్చు. స్కంద- హాట్స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. మొదటిరోజు నంచే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు. తాజాగా హాట్స్టార్ ఓటీటీలో 'స్కంద' ఎంట్రీ ఇచ్చేసింది. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ వర్సెన్ కూడా ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే కలిగింది. థియేటర్లలో మెప్పించలేకపోయిన స్కంద.. ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఓటీటీకి స్కంద మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. (ఇది చదవండి: 40 ఏళ్ల బ్యూటీ.. లిప్లాక్ సీన్.. ఇంకా అవుట్ కాలేదు..!) అయితే ఈ సినిమా మొదట అక్టోబర్ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిసింది. కానీ అలా జరగలేదు. ఓటీటీకి రిలీజ్పై సస్పెన్ష్ నెలకొంది. స్కంద స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల కొత్త తేదీని హాట్స్టార్ ప్రకటించింది. నవంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను రిలీజ్ చేసింది. (ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్కు అన్ని రోజులు పట్టిందా?) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
Skanda OTT Release: ఓటీటీలోకి మరింత ఆలస్యంగా రానున్న స్కంద!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తీరా థియేటర్లలో విడుదలయ్యాక ఈ చిత్రం బొక్కబోర్లా పడింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా పేలవంగా వచ్చాయి. ఈ సినిమా అక్టోబర్ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిసింది. అనుకున్నట్లుగానే ఆమేరకు ప్రకటన సైతం వెలువడింది. అయితే అంతలోనే స్కంద ఓటీటీ విడుదల వాయిదా పడింది. ఈరోజు ఓటీటీలోకి రావాల్సిన ఈ చిత్రం మరికొద్ది రోజుల తర్వాతే హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కొత్త డేట్ను ప్రకటించనున్నట్లు హాట్స్టార్ వెల్లడించింది. Bringing MASS like never experienced before🕺🏽 Announcement coming at 5pm today 🕔 @disneyplushstel #RapoRampageonHotstar @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/O5wcuBSE8R — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 27, 2023 చదవండి: హీరోయిన్తో ప్రేమలో ఉన్న హీరో.. ఇలా దొరికిపోతాననుకోలేదంటూ.. -
ఓటీటీలో 'స్కంద' స్ట్రీమింగ్
బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం స్కంద. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. గత నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేయడానికి ఈ మాస్ సినిమా సిద్దమైంది. సినిమా విషయంలో మిశ్రమ స్పందన వచ్చినా బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్గా నిలిచాయి. సుమారు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్కంద అక్టోబరు 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని మొదట స్కందతో ఒప్పందం కుదిరిందట. అయితే ఇప్పుడు ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు సమాచారం. స్కంద సినిమాకు థమన్ స్వరాలు సమకూర్చారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్లో సందడి చేసింది. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్ చిట్టూరి, పవన్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక స్కంద తర్వాత రామ్ పోతినేని- పూరి కాంబినేషన్లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. -
ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రామ్-బోయపాటి కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ 'స్కంద'. గత నెల చివర్లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. కేవలం మాస్ని మాత్రమే ఆకట్టుకుంది. తొలి రెండు మూడు రోజులు కలెక్షన్స్ వచ్చాయి గానీ ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డల్ అయిపోయింది. గత వారం కొత్త సినిమాలు రాకతో పూర్తిగా సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్లో నిజమెంత?) 'స్కంద' సంగతేంటి? బోయపాటి సినిమా అంటే లాజిక్స్ అసలు వెతకాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో తీసిన సినిమాల్లో యాక్షన్, స్టోరీని బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన ఈ డైరెక్టర్.. 'స్కంద' విషయంలో దాన్ని పక్కనబెట్టేశాడు. అయితే ఈ మూవీ యాక్షన్ లవర్స్ కి నచ్చింది గానీ ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్గా నిలిచింది. లాభాల కంటే నష్టాలే వచ్చాయని తెలుస్తోంది. ఓటీటీలోకి అప్పుడేనా? థియేటర్లలో రిలీజ్కి ముందే 'స్కంద' డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఇక సినిమా రిలీజైన నెలలోపే అంటే అక్టోబరు 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందని అంటున్నారు. ఇది నిజమే కావొచ్చు గానీ అధికారిక ప్రకటన వస్తే గానీ క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా 'స్కంద'కి సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కానీ ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూస్తుంటే.. రెండో భాగం తీస్తారా అనే డౌట్ వస్తోంది. (ఇదీ చదవండి: గిఫ్ట్ ఇచ్చిన సమంత.. అతడు తెగ మురిసిపోయాడు!) -
యంగ్ హీరోల కొంపముంచిన బోయపాటి!
ఊరమాస్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఆయన మేకింగ్లో ఓ పవర్ ఉంటుంది. అది మాస్ ఆడియన్స్కు ఎక్కడలేని కిక్ అందిస్తుంది. అయితే ఇది కేవలం సీనియర్ హీరోల విషయంలోనే జరుగుతుంది. యంగ్ హీరోలకు మాత్ర బోయపాటి భారీ ఫ్లాపులను అందిస్తున్నాడు. ఒక్క అల్లు అర్జున్ తప్ప మిగతా ఏ యంగ్ హీరోలకి బోయపాటి హిట్ అందించలేదు. 2012లో యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ‘దమ్ము’ తీశాడు. అది బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో జయ జానకి నాయక(2017) తీస్తే..అది హిట్ కాలేదు. మెగా పవర్స్టార్ రామ్ చరణ్తో ‘వినయ విధేయ రామ’ చిత్రం చేయగా.. అది కూడా ఫ్లాప్ అయింది. ఇక తాజాగా రామ్ పోతినేనితో ‘స్కంద’ చేయగా..అది కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. బోయపాటిపై ‘స్కంద’ ఎఫెక్ట్! బోయపాటిపై ‘స్కంద’ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. స్కంద రిలీజ్కు ముందు ఆయన తర్వాత సినిమా బన్నీతో ఉంటుందనే వార్తలు వినిపించాయి. మరోవైపు సూర్య కూడా బోయపాటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వచ్చింది. చిరంజీవీ కూడా బోయపాటితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే స్కంద రిలీజ్ తర్వాత మాత్రం ఈ పుకార్లు వినిపించడం లేదు. పైగా బోయపాటితో సినిమా చేయడానికి యంగ్ హీరోలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి కూడా ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో బోయపాటి మళ్లీ బాలయ్యతోనే సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. -
హీరో రామ్తో అనుపమ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి!
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనాలకు భలే ఇంట్రస్ట్.. వారు ఏయే సినిమాలు చేస్తున్నారనే కాదు, ఎవరితో క్లోజ్గా కనిపిస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇలా అన్నింటినీ ఆరా తీస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వారి జీవితంలోకి తొంగి చూడాలనుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు గాసిప్రాయుళ్లు సెలబ్రిటీల గురించి లెక్కలేనన్ని పుకార్లు సృష్టిస్తుంటారు. అందులో లేటెస్ట్ రూమర్ ఒకటి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. హీరోతో ప్రేమలో బ్యూటీ? బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రేమలో ఉన్నారట! త్వరలోనే వీరు ఏడడుగులు వేయనున్నారట! ఈ మేరకు ఓ వార్త నెట్టింట కోడై కూస్తోంది. సాధారణంగా ఇలాంటి గాసిప్స్ను అనుపమ లైట్ తీసుకుంటుంది. అయితే ఈ రూమర్లు విని విసుగు పుట్టిన అనుపమ తల్లి సునీత సదరు పుకార్లపై స్పందించినట్లు తెలుస్తోంది. హీరోతో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో పిసరంత నిజం కూడా లేదని కొట్టిపారేసిందట! ఇది చూసిన ఫ్యాన్స్.. హమ్మయ్య, మా అనుపమ ఇంకా సింగిలే అంటూ ఎగిరి గంతేస్తున్నారు. సినిమాల సంగతి.. కాగా అనుపమ, రామ్.. రెండు సినిమాల్లో జంటగా నటించారు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే చిత్రాల్లో వీరు కలిసి యాక్ట్ చేశారు. ప్రస్తుతం రామ్ పోతినేని నటించిన స్కంద సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ విషయానికి వస్తే.. తెలుగులో రవితేజ ‘ఈగిల్’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్వైర్’ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ డైరెక్షన్లోనూ ఓ మూవీ చేస్తోంది. తమిళంలోనూ రెండు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) చదవండి: రతిక బర్రె పిల్ల.. రాత్రంతా నిద్రపట్టలేదన్న ప్రశాంత్.. బ్యూటీ రియాక్షన్ చూశారా? -
ట్రెండ్ సెట్ చేసిన ప్రభాస్..అది ఏంటో నీకు తెలుసా ..?
-
స్కంద మూవీలో రామ్కు చెల్లెలిగా నటించిందెవరో తెలుసా?
మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను- ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే! వీరి కాంబినేషన్లో వచ్చిన తాజా ఊరమాస్ చిత్రం స్కంద. ఈ మూవీలో రామ్ నటనకు, లుక్కు అభిమానులు ఫిదా అయ్యారు. తన యాక్షన్కు థియేటర్స్లో విజిల్స్ వేస్తున్నారు. మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రంలో రామ్ పోతినేనికి చెల్లిగా ఓ కొత్త అమ్మాయి నటించింది. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఈమె ఎవరో కచ్చితంగా తెలిసే ఉంటుంది. రామ్కు చెల్లిగా నటించిన ఆమె పేరు అమృత చౌదరి. ఈమె పక్కా తెలుగమ్మాయి. తనది భీమవరం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అమృత చౌదరి కాలేజీ డేస్లోనే యాక్టింగ్లో తన టాలెంట్ చూపించింది. పలు షార్ట్ ఫిలింస్లో నటించిన ఈ బ్యూటీ కవర్ సాంగ్స్లోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో నటిగా ట్రై చేస్తోంది. ఈ క్రమంలో స్కంద మూవీలో హీరోకి చెల్లెలిగా నటించింది. ఈ ఛాన్స్తో ఆమె దశ తిరిగిపోవడం ఖాయం అంటున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ ఏదో ఒక ఫోటో, వీడియోతో అభిమానులతో నిత్యం టచ్లో ఉంటోంది. హీరోయిన్కు తానేం తక్కువ కాదన్నట్లుగా అందాలు ఆరబోస్తోంది. View this post on Instagram A post shared by AMRUTHA CHOWDARY✨ (@__amrutha__chowdary__) చదవండి: తేజపై విరుచుకుపడ్డ నాగ్.. జైలు శిక్ష తక్కువే.. నేరుగా ఇంటికి పంపించేయడమే.. -
'స్కంద' కలెక్షన్స్.. సగానికి సగం పడిపోయాయి!
యంగ్ హీరో రామ్-బోయపాటి కాంబోలో వచ్చిన సినిమా 'స్కంద'. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని.. బోయపాటి తనదైన శైలిలోనే తీశారు. రామ్ గెటప్స్తో పాటు తమనే నేపథ్య సంగీతం థియేటర్లని దడదడలాడిస్తోంది. మరోవైపు తొలిరోజు కళ్లుచెదిరే వసూళ్లు రాగా, రెండో రోజు సగానికి సగం పడిపోయాయి. తాజాగా పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ విషయం క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) స్కంద సంగతేంటి? బోయపాటి సినిమాలంటే లాజిక్స్ వెతక్కూడదు. హీరోలు లార్జర్ దేన్ లైఫ్ పాత్రల్లో కనిపిస్తుంటారు. ఇందులో హీరో పాత్ర అంతకు మించే ఉంటుంది. మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు గానీ మాస్ ఆడియెన్స్కి మాత్రం ఈ సినిమా నచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.18.2 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. రెండోరోజు వచ్చేసరికి సగానికి పైగా వసూళ్లు పడిపోయాయి. సగానికి సగం అంటే తొలిరోజు రూ.18.2 కోట్లు వసూలు కాగా, రెండో రోజు రూ.9.4 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్గా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.27.6 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని అధికారికంగా రిలీజ్ చేశారు. అయితే వీకెండ్ అయ్యేసరికి 'స్కంద' ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి? మరోవైపు 'స్కంద' మేకింగ్ వీడియోని కూడా తాజాగా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ.. పెళ్లికి అంతా సెట్!) -
ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే
టాలీవుడ్లో ఈ వారం పెద్ద సినిమాల హవా కొనసాగింది. రామ్ పోతినినే స్కందతో పాటు లారెన్స్ ‘చంద్రముఖి -2’, శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు’చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. వీటితో పాటు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ది వాక్సిన్ వార్’ కూడా ఈ నెల 28నే విడుదలయ్యాయి. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ రివ్యూల్లో చదవండి. స్కంద: నో లాజిక్.. ఓన్లీ యాక్షన్ రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘స్కంద’. బోయపాటి సినిమాలు అంటేనే హై వోల్టేజ్ యాక్షన్ కథ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కంద కూడా అదే కాన్సెప్ట్తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి? ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్? ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చంద్రముఖి-2: భయపెట్టని హార్రర్ రజనీకాంత్, పీ.వాసు కాంబోలో వచ్చిన చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళ్లోనే కాదు తెలుగులో ఆ చిత్రం భారీ వసూళ్లని రాబట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. పైగా చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ నటించడంతో ‘చంద్రముఖి-2’పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడాయి. మరి ఆ అంచనాలు ఈ చిత్రం ఏ మేరకు అందుకుంది? చంద్రముఖిగా కంగనా భయపెట్టిందా లేదా? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పెదకాపు-1..తడబడిన సామ్యానుడి సంతకం ఫ్యామిలీ సినిమాకు కేరాఫ్ శ్రీకాంత్ అడ్డాల. ఒక నారప్ప మినహా ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కుటుంబ, ప్రేమ కథలే. అలాంటి దర్శకుడు రాజకీయ నేపథ్యంతో ‘పెదకాపు’ అనే సినిమాను తెరకెకించాడు. అది కూడా కొత్త హీరోహీరోయిన్లతో. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘పెద కాపు -1’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సామాన్యుడి సంతకం అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘ది వ్యాక్సిన్ వార్’ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి నేషనల్ వైడ్గా కాంట్రవర్సీ అయ్యాడు. అంతకు ముందు పలు చిత్రాలను తెరక్కించినా.. ది కాశ్మీర్ ఫైల్స్’తోనే అతనికి గుర్తింపు వచ్చింది. తాజాగా వివేక్ అగ్నిహోత్రి తెరక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజల దుస్థితి ఎలా ఉంది? వ్యాక్సిన్ కనుగోనేందుకు భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ సాగుతుంది ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రామ్ పోతినేని స్కంద.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో వచ్చిన తాజా చిత్రం స్కంద. ఈ మూవీలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈనెల 28న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. పక్కా మాస్ మూవీగా రూపొందించిన ఈ మూవీ తొలిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.18.2 కోట్ల వసూళ్లు సాధించింది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.8.62 వసూళ్లు రాబట్టింది. అయితే కేవలం మాస్ ఆడియన్స్ మెప్పించేలా ఉన్న ఈ చిత్రం నైజాంలో అత్యధికంగా రూ.3.23 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్గా చూస్తే రామ్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా స్కంద నిలిచింది. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రిన్స్, దగ్గుబాటి రాజా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కించబోతున్నట్లు రామ్, బోయపాటి శ్రీను ప్రకటించారు. -
స్కంద సినిమా హిట్టా..ఫట్టా..
-
'స్కంద' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
సెప్టెంబరు 28 పేరు చెప్పగానే మొన్నటివరకు 'సలార్' గుర్తొచ్చేది. కానీ అది వాయిదా పడేసరికి ఈ తేదీ కోసం మిగతా సినిమాలన్నీ పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే రామ్ 'స్కంద' ఇదేరోజున అంటే తాజాగా థియేటర్లలోకి వచ్చింది. బోయపాటి మార్క్ సినిమాల తరహాలోనే ఇది ఉంది. యాక్షన్ ప్రియుల్ని అలరిస్తున్న ఈ చిత్రం అలానే ఓటీటీ పార్ట్నర్తో పాటు స్ట్రీమింగ్ టైమ్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 'స్కంద' కథేంటి? ఏపీ ముఖ్యమంత్రి (అజయ్ పుర్కన్) కూతురి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ వేడుకకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (శరత్ లోహితస్వ) కొడుకుతో లేచిపోతుంది. దీంతో సీఎంలు ఇద్దరూ ఒకరిపై ఒకరు పగ పెంచుకుంటారు. తన కూతురిని తిరిగి రప్పించడం కోసం ఏపీ సీఎం ఓ కుర్రాడిని(రామ్ పోతినేని) తెలంగాణకు పంపిస్తాడు. తెలంగాణ సీఎంకి ఓ కూతురు (శ్రీలీల) ఉంటుంది. ఓ సందర్భంలో ఈ కుర్రాడు.. ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలని తీసుకెళ్లిపోతాడు. అసలు ఈ కుర్రాడెవరు? ఎందుకు తీసుకెళ్లాడనేది 'స్కంద' స్టోరీ. (ఇదీ చదవండి: Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ) ఎలా ఉంది? బోయపాటి గత సినిమాల్లో ఓ మాదిరిగా అయినా కథ ఉండేది. ఇందులో పెద్దగా అలాంటిదేం లేదు. కమర్షియల్ చిత్రాల్లో నలిగిపోయిన రొటీన్ రివేంజ్ డ్రామానే తీసుకున్నాడు. కానీ సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు తనదైన మార్క్ సన్నివేశాలతో నడిపించేశాడు. యాక్షన్ లవర్స్, మాస్ ఆడియెన్స్కి ఇది నచ్చేయొచ్చు కానీ మిగతా వాళ్లకు కాస్త కష్టమే. ఓటీటీ డీటైల్స్ ఇకపోతే రిలీజ్కి ముందే 'స్కంద' మూవీ డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ దక్కించుకుంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం నెల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందట. అంటే సెప్టెంబరు 28న థియేటర్లలోకి సినిమా వచ్చింది కాబట్టి అక్టోబరు చివరి వారంలో ఇందులో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రావొచ్చని సమాచారం. కొన్నిరోజులు ఆగితే దీనిపై క్లారిటీ వచ్చేస్తుందిలే! (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) -
Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ
టైటిల్: స్కంద నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీ రాజ్, ప్రిన్స్ సిసల్, ఇంద్రజ, మురళీ శర్మ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి దర్శకుడు: బోయపాటి శ్రీను సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: సంతోష్ డేటాకే ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 ‘స్కంద’ కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు(అజయ్ పుర్కర్) తన కూతరు పెళ్లి జరిపించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటాడు. గవర్నర్తో సహా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం పెళ్లికి హాజరవుతారు. అయితే ముహుర్తానికి కొన్ని క్షణాల ముందు ఏపీ సీఎం కూతురిని తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి(శరత్ లోహితస్వ) కొడుకు లేపుకెళ్తాడు. దీంతో ఏపీ సీఎం.. తెలంగాణ సీఎంపై పగ పెంచుకుంటాడు. తన పరువు దక్కాలంటే తన కూతురు తిరిగి రావాలని భావిస్తాడు. దాని కోసం ఓ కుర్రాడిని (రామ్ పోతినేని) తెలంగాణకు పంపిస్తాడు. ఏపీ సీఎం కుమార్తెతో తెలంగాణ సీఎం కొడుకు నిశ్చితార్థం జరిగే కొద్ది క్షణాల ముందు.. రామ్ వచ్చి ఏపీ సీఎం కూతురితో పాటు తెలంగాణ సీఎం కూతురి(శ్రీలీల)ని కూడా తీసుకెళ్తాడు. ఎందుకలా చేశాడు? అతను ఎవరు? ప్రముఖ వ్యాపారవేత్త రుద్రగంటి రామకృష్ణరాజు(శ్రీకాంత్)కు, ఇద్దరు సీఎంలతో ఉన్న వైర్యం ఏంటి? రామకృష్ణ రాజుకు, రామ్కు(ఈ సినిమాలు హీరో పాత్రకు పేరు లేదు) ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో 'స్కంద' చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి కేరాఫ్ అంటే బోయపాటి శ్రీను అనే చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన 9 సినిమాలు మాస్ ఆడియన్స్ని మెప్పించేలా ఉంటాయి. స్కంద కూడా అదే స్థాయిలో తెరకెక్కించాడు. అయితే బోయపాటి సినిమాల్లో లాజిక్కులు ఉండవు. హీరో ఏ స్థాయి వ్యక్తినైన ఈజీగా కొట్టగలడు. కాలితో తన్నితే కార్లు సైతం బద్దలవ్వాల్సిందే. ఇదంతా గత సినిమాల్లో చూశాం. ఇక స్కందలో అయితే రెండు అడుగులు ముందుకేశాడు. లాజిక్కు అనే పదమే వాడొద్దనేలా చేశాడు. ఎంతలా అంటే.. ఒక సీఎం ఇంటికి ఓ సామాన్యుడు ట్రాక్టర్ వేసుకొని వెళ్లేంతలా. ఇద్దరు ముఖ్యమంత్రులు అతని చేతిలో తన్నులు తినేంతలా. ఒక ముఖ్యమంత్రి వీధి రౌడీ కంటే నీచంగా బూతులు మాట్లాడేంతలా. పోలీసు బెటాలియన్ మొత్తం దిగి గన్ పైరింగ్ చేస్తుంటే మన హీరోకి ఒక్కటంటే.. ఒక్క బుల్లెట్ కూడా తగలదు అంటే అది బోయపాటితోనే సాధ్యమని స్కందలో చూపించాడు. ఇవన్నీ మాస్ ఆడియన్స్ని ఈలలు వేయిస్తే.. సామాన్య ప్రేక్షకులను మాత్రం సిల్లీగా కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్త రుద్రగంటి రామకృష్ణరాజు(శ్రీకాంత్) జైలు సీన్తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆసక్తికర సన్నివేశాలతో అసలు కథలోకి తీసుకెళ్తాడు. హీరో ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథ కాస్త చప్పగా సాగుతుంది. కాలేజీ సీన్స్ అంతగా ఆకట్టుకోలేవు. హీరో ఎంట్రీ, అతనికిచ్చిన ఎలివేషన్స్ బట్టి ఏదో జరుగబోతుందనే ఆసక్తి ఆడియన్స్లో కలుగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ట్విస్ట్ కూడా సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక బోయపాటి సినిమా గత సినిమాల మాదిరి స్కంద సెకండాఫ్ కూడా ఫ్లాష్బ్యాక్తో ప్రారంభమవుతుంది. రుద్రగంటి రామకృష్ణరాజు ఎందుకు జైలు పాలయ్యాడు? హీరో నేపథ్యం ఏంటి? తదితర సన్నివేశాలతో సెకండాఫ్ సాగుతుంది. క్లైమాక్స్ 15 నిమిషాల ముందు వచ్చే యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. అదే సమయంలో విపరీతమైన హింస, అనవసరపు సంభాషణలు ఓ వర్గం ప్రేక్షకులను ఇబ్బందిని కలిగిస్తాయి. యాక్షన్ సీన్స్ పండినంతగా ఎమోషనల్ సన్నీవేశాలు పండలేదు. క్లైమాక్స్ ట్వీస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. ఓవరాల్గా మాస్ ఆడియన్స్కి అయితే బోయపాటి ఫుల్ మీల్స్ పెట్టాడనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. మాస్ పాత్రలు రామ్కి కొత్తేమి కాదు. ఇంతకు ముందు జగడం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో ఆ తరహా పాత్రలు చేశాడు. అయితే స్కందలో మాత్రం ఊరమాస్ యాక్టింగ్తో అదరగొట్టేశాడు. యాక్షన్స్ సీన్స్. హీరోయిన్లు శ్రీలీల, సయీ మంజ్రేకర్ పాత్రల పరిధి చాలా తక్కువ. అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించారు. శ్రీలీల తనదైన డ్యాన్స్తో మరోసారి ఆకట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా అజయ్ పుర్కర్, శరత్ లోహితస్వ తమ పాత్రల పరిధిమేర నటించారు. వ్యాపారవేత్తగా శ్రీకాంత్ చక్కగా నటించాడు.దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సంతోష్ డేటాకే సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఎక్కడ రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
Election 2024 Voters Selfie Photos: ఓటు హక్కు వజ్రాయుధం (ఫొటోలు)
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement