రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Trailer). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు.
తాజాగా ఆంధ్ర కింగ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
కర్నూలులోని ఔట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రదర్శించిన డ్రోన్స్ విజువల్స్ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇలా చేయడం తొలిసారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది.


