Gold prices
-
’గోల్డెన్ డేస్’ ఆగని రేస్!
సాక్షి, స్పెషల్ డెస్క్: పుత్తడి సరికొత్త రికార్డులు నమోదు చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ‘గోల్డెన్ డేస్’ నడుస్తున్నాయి. తొలిసారిగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం రేటు 3,000 డాలర్లు దాటింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఔన్స్ పసిడి ధర 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు.. అంటే కేవలం 7 నెలలు మాత్రమే పట్టడం. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది. అంటే దాదాపు 4 సంవత్సరాల 8 నెలలు. దీనినిబట్టి పుత్తడి పరుగు ఏ స్థాయిలో వేగం అందుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే తదుపరి రికార్డు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. 2025లోనే ఔన్స్ ధర 4,000 డాలర్లను తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర (Gold Price) గురువారం రూ.91,650 పలికింది. ఈ నెల 19న రూ.91,950కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. రికార్డులే రికార్డులు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా గణాంకాల ప్రకారం.. 2024లో బంగారం 40 కంటే ఎక్కువసార్లు సరికొత్త ఆల్–టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు మరో 16 కొత్త గరిష్టాలను చేరుకుంది. అంతర్జాతీయంగా 2005 డిసెంబర్లో పసిడి ఔన్స్ ధర తొలిసారిగా 500 డాలర్ల మార్కును తాకింది. ఆ తదుపరి 500 డాలర్లకు.. అంటే 1,000 డాలర్ల స్థాయిని 2008 మార్చిలో చేరుకుంది. 2011 ఏప్రిల్లో 1,500 డాలర్లకు, 2020 ఆగస్టులో 2,000 డాలర్లు, 2024 ఆగస్టులో 2,500 డాలర్ల మార్కును తాకింది. 500 నుంచి 1,000 డాలర్లను చేరుకోవడానికి 834 రోజులు పట్టింది. అక్కడి నుంచి 1,500 డాలర్లకు 1,132 రోజులు, 1,500 నుంచి 2,000 డాలర్లకు 3,394 రోజుల సమయం తీసుకుంది. 2,000 నుంచి 2,500 డాలర్లను అందుకోవడానికి 1,473 రోజులు పట్టింది. సురక్షితమైన ఆస్తిగా బంగారం పుత్తడి 3,000 డాలర్ల కంటే అధిక ధర వద్ధ స్థిరంగా ఉంటే అదనపు కొనుగోళ్లు ధరను మరింత ప్రేరేపించవచ్చని డబ్ల్యూజీసీ జోస్యం చెబుతోంది.కన్సాలిడేషన్కూ అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారని వివరించింది. గతంలో ప్రతి అదనపు 500 డాలర్ల మార్కును చేరుకున్న తరువాత సగటున తొమ్మిది రోజుల తరువాతే పుత్తడి ధర వెనక్కి వచ్చిందని, అయితే అయిదింటిలో నాలుగు సందర్భాల్లో కొన్ని రోజుల్లోనే బంగారం అదే స్థాయి కంటే పైకి పుంజుకుందని తెలిపింది. భౌగోళిక రాజకీయ, భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు, బలహీనమైన యూఎస్ డాలర్.. వెరసి పుత్తడిలో పెట్టుబడి డిమాండ్కు బలమైన ప్రోత్సాహకాలను అందిస్తూనే ఉందని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. ధర ఎగసినా డిమాండ్ తగ్గలేదు అధిక పసిడి ధరలు ఆభరణాల డిమాండ్కు ప్రతికూలతలను సృష్టించవచ్చని డబ్ల్యూజీసీ అంటోంది. ‘ఆభరణాల రీసైక్లింగ్ స్థాయిలను పెంచవచ్చు. పెట్టుబడిదారులలో కొంత లాభాల స్వీకరణకు దారితీయవచ్చు. ఈ అంశాలు బంగారం దీర్ఘకాలిక వృద్ధికి మద్దతు ఇచ్చే విస్తృత ఆర్థిక, ఆర్థిక చోదకాలను అధిగమించే అవకాశం లేదు’ అని వివరించింది. 2024లో పుత్తడి ధర 27 శాతం ఎగిసినా డిమాండ్ తగ్గలేదు. భారత్లో 808.8 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగాయి. -
గోల్డ్.. నాన్ స్టాప్ ర్యాలీ
న్యూఢిల్లీ: పసిడి నాన్ స్టాప్ ర్యాలీ చేస్తోంది. బుధవారం మరో రూ.700 లాభపడింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు 91,950కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. వివాహాల సీజన్కు ముందు జ్యుయలర్లు భారీ కొనుగోళ్లకు దిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. దీనికితోడు మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు ఎగిసిపడడంతో ఇన్వెస్టర్లు సైతం కొనుగోళ్లకు ముందుకు వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.700 పెరిగి రూ.91,500కు చేరుకుంది. మరోవైపు వెండి సైతం కొత్త రికార్డు నమోదు చేసింది. కిలోకి రూ.1,000 పెరగడంతో రూ.1,03,500 జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీ పసిడి కాంట్రాక్ట్ (10 గ్రాములు) రూ.288 పెరిగి రూ.89,000 మార్క్ను దాటేసింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో పసిడి ఔన్స్ ధర ముందురోజుతో పోల్చి చూస్తే పెద్దగా మార్పు లేకుండా 3,038 డాలర్ల వద్ద ఉంది. ఇంట్రాడేలో 3,045.39 డాలర్ల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆసియా మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర 3,052.31 డాలర్లను తాకింది. అప్ ట్రెండ్ కొనసాగుతోంది..బంగారం ధరలు అప్ట్రెండ్లో ఉన్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. ఫెడ్ పాలసీ ప్రకటన ముందు ఒక పరిధిలో ట్రేడ్ అయినట్టు చెప్పారు. యూఎస్ ఫెడ్ పాలసీ కోసం ట్రేడర్లు వేచి చూస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ సైతం తెలిపారు. ఇదీ చదవండి: ఆశా వర్కర్లకు చేదోడుగా ఏఐఈ ఏడాది చివరికి 4,000 డాలర్లు...అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలకుతోడు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సెంట్రల్ బ్యాంక్ల నుంచి కొనుగోళ్ల డిమాండ్ వంటి అంశాలతో 2025 చివరికి బంగారం ఔన్స్కు 4,000 డాలర్ల స్థాయిని చేరుకోవచ్చని కమోడిటీ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఇక్కడ మరో 25 శాతం మేర బంగారం ధరలు పెరిగేందుకు అవకాశాలున్నాయన్నది వారి విశ్లేషణ. ఈ ప్రకారం చూస్తే రూపాయిల్లో బంగారం 10 గ్రాములకు రూ.1.14 లక్షలకు చేరుకోవచ్చని తెలుస్తోంది. -
ఫస్ట్టైమ్ బంగారం ధర ఎంతకు చేరిందంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర బుధవారం జీవితకాల గరిష్టాలను చేరింది. సమీప భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,900 (22 క్యారెట్స్), రూ.90,440 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.ఇదీ చదవండి: స్టార్లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.90,440 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.83,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.90,590 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.1,000 పెరిగి రూ.1,14,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
త్వరలో బంగారం ధర లకారం! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. త్వరలో తులం రూ.లక్షకు చేరుతుందని చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,500 (22 క్యారెట్స్), రూ.90,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.90,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.82,650కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.90,150 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.1,100 పెరిగి రూ.1,13,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్పంగా పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,500 (22 క్యారెట్స్), రూ.87,820 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100, రూ.110 పెరిగింది.ఇదీ చదవండి: 100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,820 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.80,650కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.110 పెరిగి రూ.87,970 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తుంది. సోమవారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండి రేటు(Silver Price) గతంతో పోలిస్తే రూ.100 తగ్గి రూ.1,08,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భగ్గుమంటున్న బంగారం ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,650 (22 క్యారెట్స్), రూ.87,980 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.550, రూ.600 పెరిగింది.ఇదీ చదవండి: ప్లాటినం అల్లాయ్ దిగుమతులపై నిబంధనలు కఠినతరంచెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.550, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.600 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,980 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.550 పెరిగి రూ.88,130కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.600 పెరిగి రూ.88,240 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. బుధవారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు(Silver Price) రూ.1,07,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారు కొండ దిగొస్తోంది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భేరిష్ ధోరణి, అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు రావడానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో బంగారానికి అమ్మకాల సెగ తగిలింది. ఢిల్లీ మార్కెట్లో గురువారం ఒక్కరోజే 10 గ్రాములకు రూ.1,150 నష్టపోయింది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.88,200కు దిగొచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం ఇంతే మేర నష్టపోయి రూ.87,800 స్థాయికి వచ్చేసింది. వెండి సైతం కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.98,500 స్థాయి వద్ద ఉంది. ఎంసీఎక్స్లో బంగారం ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ.554 నష్టపోయి రూ.85,320 వద్ద ఉంది. రూ.84,800 స్థాయిని కోల్పోతే బంగారంలో మరింత బలహీనత ఉండొచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ ఔన్స్కు 40 డాలర్లు నష్టపోయి 2,890 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘‘బంగారం మరో రికార్డు స్థాయికి చేరిన అనంతరం దిద్దుబాటుకు లోనైంది. డాలర్ గరిష్ట స్థాయి దిశగా చలించడంతోపాటు, టారిఫ్ల భయాలు ఇందుకు దారితీశాయి. ఐరోపా యూనియన్ నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామని, మార్చి 4 నుంచి మెక్సికో, కెనడాలపై టారిఫ్లు అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనతో సురక్షిత సాధనంగా బంగారానికి బలమైన డిమాండ్ కొనసాగొచ్చు’’అని అబాన్స్ హోల్డింగ్స్ సీఈవో చింతన్ మెహతా విశ్లేషించారు. -
పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,750 (22 క్యారెట్స్), రూ.88,090 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.220, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.88,090 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.210 పెరిగి రూ.80,900కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.88,240 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. మంగళవారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు(Silver Price) రూ.1,08,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లక్షకు చేరువలో పసిడి ధరలు
-
బంగారం ధరల్లో భారీ మార్పులు
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (ఫిబ్రవరి 21) బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. గోల్డ్ రేటు ఎక్కడ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే..➤హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,100 వద్ద ఉన్నాయి. భాగ్యనగరంలో నేడు 22 క్యారెట్ గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్ బంగారం ధర పెరిగింది.➤విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి. దీంతో ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,7750 వద్ద ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ రేటు వరుసగా రూ. 450, రూ. 290 తగ్గింది. ముంబైలో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి.➤చెన్నైలో కూడా పసిడి రేటు తగ్గుముఖం పట్టింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 8,7550 వద్దకు చేరింది.➤బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 8,7550 వద్ద ఉంది.➤దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 550 తగ్గి రూ. 80300 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 640 తగ్గి రూ. 87550 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నప్పటికీ.. వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉండి, నేడు (శుక్రవారం) రూ. 100 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,900 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,400 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం.. అందుకే ఆల్టైమ్ హై!
ప్రపంచవ్యాప్తంగా ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు (Gold prices) రోజుకో కొత్త గరిష్టాన్ని చేరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్త సుంకాల భయం నేపథ్యంలో పసిడిని సురక్షితమైన స్వర్గధామ ఆస్తిగా భావిస్తున్న ఇన్వెస్టర్లు తమ డబ్బును అందులో పెట్టుబడి పెట్టడానికి తొందరపడటంతో బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.బ్లూమ్బెర్గ్ డేటా ప్రకారం.. ప్రపంచ మార్కెట్లలో బులియన్ ఔన్సు ధర 2,935 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. అంతకుముందు ఇది 2,947.01 డాలర్ల తాజా రికార్డు స్థాయిని తాకింది. ఇక భారతదేశంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 2025 ఏప్రిల్ ఫ్యూచర్స్కు బంగారం 10 గ్రాములకు రూ.85,879 వద్ద ట్రేడైంది. గరిష్ట ధర రూ. 86,592.అమెరికాలోకి వచ్చే ఆటోమొబైల్, సెమీకండక్టర్, ఔషధ దిగుమతులపై 25% సుంకాలను విధిస్తామని గత మంగళవారం ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా, రష్యా సీనియర్ అధికారులు మొదటి రౌండ్ చర్చల కోసం సమావేశమైన తర్వాత పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు దోహదపడే మరో అంశం.ఇది చదివారా? బంగారం, వెండి దిగుమతి ధరలు పెంపు2024లోనే బంగారం పావు వంతుకు పైగా పెరిగింది. 2025లో, ట్రంప్ వాణిజ్య విధానాల వల్ల బంగారం అనేక రికార్డు గరిష్టాలను తాకింది. ఈ వారం ప్రారంభంలో గోల్డ్మన్ సాచ్స్ కూడా బంగారం కోసం సంవత్సరాంతపు లక్ష్యాన్ని ఔన్సుకు 3,100 డాలర్లకు పెంచింది. సెంట్రల్-బ్యాంక్ కొనుగోలు ఊహించిన దానికంటే బలంగా ఉండటం కీలకమైన చోదక శక్తిగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ఆర్థిక విధానంపై విస్తృత అనిశ్చితి కొనసాగితే (ముఖ్యంగా సుంకాలపై) బులియన్ ధర 3,300 డాలర్లకు చేరుకోవచ్చని అభిప్రాయపడింది. -
అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,350 (22 క్యారెట్స్), రూ.87,650 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.650, రూ.700 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.650, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,350 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,650 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 పెరిగి రూ.80,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.700 పెరిగి రూ.87,800 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. బుధవారం వెండి ధరలు(Silver Price) స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు రూ.1,08,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.79,050 (22 క్యారెట్స్), రూ.86,240 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవా ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.950, రూ.1,040 పెరిగింది.ఇదీ చదవండి: యూఎస్-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం.. భారత్కు లాభంచెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.950, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1040 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.79,050 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.86,240 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.950 పెరిగి రూ.79,200కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1040 పెరిగి రూ.86,390 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్న క్రమంలోనే వెండి ధరల్లోనూ మార్పులొచ్చాయి. బుధవారం వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. దీంతో నిన్నటితో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,07,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Gold Prices: ఆగని పసిడి పరుగు
న్యూఢిల్లీ: జ్యుయలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో పసిడి పరుగు కొనసాగుతోంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో వరుసగా అయిదో సెషన్లో లాభపడి రూ. 86,000కు మరింత చేరువైంది. 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర మరో రూ. 500 పెరిగి రూ. 85,800కి చేరిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. జనవరి 1 నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు పసిడి ధర ఏకంగా 8 శాతం పైగా ఎగిసిందని, రూ. 6,410 మేర పెరిగిందని వివరించింది.అటు వెండి ధరల విషయానికొస్తే అయిదు రోజుల ర్యాలీకి బ్రేక్ వేస్తూ మంగళవారం కేజీకి రూ. 500 తగ్గి రూ. 95,500కి పరిమితమైంది. మరోవైపు, టారిఫ్లపై అమెరికా, కెనడా, మెక్సికో మధ్య చర్చలు జరుగుతుండటంతో పసిడి ర్యాలీ కాస్త నెమ్మదించవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ వీపీ జతిన్ త్రివేది తెలిపారు. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్టు ఒక దశలో రూ. 208 తగ్గి రూ. 83,075 వద్ద ట్రేడయిందని వివరించారు. అటు అంతర్జాతీయంగాను పసిడి రికార్డు పరుగు కొనసాగుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాముల) ధర ఒక దశలో 2,876 డాలర్లకు ఎగిసింది. -
రూ.85,000 పైకి పసిడి
న్యూఢిల్లీ: పసిడి పరుగు కొనసాగుతోంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు మరో రూ.400 బలపడింది. 99.9 స్వచ్ఛత బంగారం రూ.85 వేల మార్క్ను దాటేసి రూ.85,300కు చేరుకుంది. రూపాయి బలహీనత, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులు బంగారం ధరలను కొత్త గరిష్టాలకు చేర్చినట్టు ట్రేడర్లు తెలిపారు. రూపాయి ఒక్కరోజే 55 పైసలు పడిపోవడం గమనార్హం. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.400 లాభపడి 10 గ్రాములకు రూ.84,900కు చేరింది. కిలో వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.96,000కు చేరింది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏప్రిల్ నెల బంగారం కాంట్రాక్టుల ధర 10 గ్రాములకు రూ.461 పెరిగి రూ.82,765కు చేరింది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం ఔన్స్కు 7.50 డాలర్ల మేర క్షీణించి 2,827 డాలర్లుగా ఉంది. -
పెట్టుబడి బంగారమే!
తరతరాలుగా ప్రపంచ దేశాల ప్రజలను, కేంద్ర బ్యాంకులను ఆకర్షిస్తున్న అయస్కాంతం పసిడి! గత ఐదు దశాబ్దాలకుపైగా చరిత్రను తీసుకుంటే పసిడి తళతళలు అర్థమవుతాయ్. 1971 నుంచి చూస్తే బంగారం ప్రతీ ఏటా ఈక్విటీలతో సమానంగా సగటున 8 శాతం రిటర్నులు అందించింది!! ఈ బాటలో ఇతర కమోడిటీలతో పోల్చితే నిలకడను చూపుతూ బలాన్ని ప్రదర్శించడం విశేషం.గత ఐదు దశాబ్దాలలో బంగారం ధరలు వార్షిక పద్ధతిన 8 శాతం చొప్పున పుంజుకున్నాయి. అంటే ఇటీవల అత్యంత ఆకర్షణీయంగా మారిన ఈక్విటీలతో సమానంగా లాభపడ్డాయి. ఇదే సమయంలో బాండ్లతో పోలిస్తే అధిక రాబడి అందించాయి. ఈ బాటలో గత రెండు దశాబ్దాలను పరిగణిస్తే అంటే గత 5, 10, 15, 20 ఏళ్లలో సైతం వీటి ధరలు పలు ఇతర ఆస్తులకంటే మెరుగ్గా రాణించాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) మదింపు ప్రకారం బంగారం ఒక వ్యూహాత్మక ఆస్తి! యూఎస్ డాలర్– గోల్డ్ కన్వరి్టబిలిటీని రద్దు చేసిన 1971 నుంచి చూస్తే యూఎస్తోపాటు ప్రపంచ వినియోగ ధరల ద్రవ్యోల్బణ ఇండెక్సు(సీపీఐ)లను సైతం బంగారం అధిగమించింది. మూలధన వృద్ధి ద్రవ్యోల్బణం 2–5 శాతం మధ్య నమోదైన గత కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే సగటున పసిడి 8 శాతం చొప్పున దౌడు తీసింది. వెరసి దీర్ఘకాలానికి ఈ విలువైన లోహం మూలధనాన్ని పరిరక్షించడమేకాకుండా పెట్టుబడి వృద్ధికీ దోహదం చేసింది. అంటే అటు పెట్టుబడి సాధనంగా.. ఇటు విలాసవంత వస్తువుగా కూడా మెరిసింది! వివిధ ఈక్విటీ ఇండెక్సులు, కమోడిటీలు, ఇతర ప్రత్యామ్నాయ ఆస్తులతో పోలిస్తే వివిధ మార్గాలలో బంగారానికి పుడుతున్న డిమాండ్ కారణంగా కొన్ని దశాబ్దాలుగా నిలకడను ప్రదర్శిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని ప్రధాన కరెన్సీలు, కమోడిటీలతో మారకాన్ని పరిగణించినా పసిడిది పైచేయే! ఈ బాటలో ఇటీవల చాలా ప్రధాన కరెన్సీలతో పోలిస్తే మెరుగైన వృద్ధిని అందుకుంది. కారణాలున్నాయ్.. నిజానికి బంగారాన్ని గనుల నుంచి వెలికి తీస్తారు. అయితే గత రెండు దశాబ్దాలలో గోల్డ్ మైనింగ్ వార్షికంగా సగటున 1.7 శాతమే పెరగడం ధరలకు రెక్కలిస్తోంది. కాగా.. డబ్ల్యూజీసీ రీసెర్చ్ ప్రకారం ప్రతిద్రవ్యోల్బణ(డిఫ్లేషన్) పరిస్థితుల్లోనూ పసిడి మెరుగ్గానే రాణించింది. చౌక వడ్డీ రేట్లు, నీరసించిన వినియోగం, బలహీనపడిన పెట్టుబడులు, ఆర్థిక ఒత్తిళ్లు సైతం యెల్లో మెటల్కు డిమాండును పెంచడం గమనార్హం! 2008లో తలెత్తిన ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, తిరిగి 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా పలు దేశాలు సరళతర పరపతి విధానాలను అవలంబించాయి. ద్రవ్య లభ్యత(లిక్విడిటీ)ను భారీగా పెంచాయి. ఓవైపు కరెన్సీలు పతనంకావడం, కొనుగోలు శక్తి క్షీణించడం వంటి పరిస్థితుల్లో రక్షణ(హెడ్జింగ్)గా కేంద్ర బ్యాంకులు, ఇతర ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ బంగారంలో మదుపు చేశాయి. ఒకే ఒక్కటిప్రపంచ దేశాలను కుదిపేసిన సబ్ప్రైమ్ సంక్షోభ కాలంలో ఈక్విటీలు, హెడ్జ్ ఫండ్స్, రియల్టీ, పలు కమోడిటీలు, ఇతర రిస్క్ ఆస్తులు విలువలో పతనమయ్యాయి. అయితే బంగారం మేలిమిగా నిలిచింది. 2007 డిసెంబర్ నుంచి 2009 ఫిబ్రవరి మధ్యకాలంలో పసిడి ధరలు 21 శాతం ఎగశాయి. ఇటీవల ఈక్విటీ మార్కెట్లు పతనబాటలో సాగిన 2020, 2022లోనూ బంగారం ధరలు సానుకూల ధోరణిలోనే సాగాయి. గత కొన్నేళ్లలో ఈక్విటీ మార్కెట్లు బుల్ పరుగు తీస్తున్న నేపథ్యంలోనూ పసిడి పోటీ పడుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పుత్తడి పరుగులు.. ట్రంప్ సుంకాల మోత
-
బంగారు కొండే!..10 గ్రా. @ రూ. 83,750
సాక్షి, బిజినెస్ డెస్క్: బంగారం వెలుగులు విరజిమ్ముతోంది. తగ్గేదేలే అంటూ రోజురోజుకు కొత్త రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఢిల్లీలో తులం మేలిమి బంగారం ధర రూ.83,750కు ఎగబాకింది. ఇది ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపిస్తుంటే.. కొత్తగా నగలు కొనుక్కోవాలనుకునే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో కనకం ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుతుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతోంది.ఎందుకీ ర్యాలీ..:అంతర్జాతీయంగా చూస్తే బంగారం ఔన్స్ (31.1 గ్రాములు) ధర ఈ నెల 24న సరికొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయి 2,822 డాలర్లను తాకింది. గత ఏడాది నవంబర్ 5న నమోదైన 2,541 డాలర్ల కనిష్టం నుంచి ఏకంగా 281 డాలర్లు ఎగబాకింది. ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు మళ్లీ తెర తీస్తారనే భయాలు పెరిగిపోయాయి. అనుకున్నట్లే ముందుగా కెనడా, మెక్సికోలపై దిగుమతి సుంకాల మోత మోగించారు. చైనా, భారత్తోపాటు మరిన్ని దేశాలపైనా సుంకాలు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ఇది అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితికి ఆజ్యం పోసింది. ఇప్పటికే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం ఏడాదికాలంగా ఎగబాకుతూనే వస్తోంది. అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత పెట్టుబడి సాధనంగా పేరొందిన బంగారంలోకి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత మొదలుపెట్టడం కూడా పసిడి ధరలకు దన్నుగా నిలుస్తోంది. 2024లో వరుసగా మూడుసార్లు పావు శాతం చొప్పున ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు తగ్గించింది. ఈ ఏడాది రేట్ల కోత జోరు తగ్గినా, అక్కడే కొనసాగినా కూడా పసిడికి సానుకూలాంశమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు తగ్గాలని పదేపదే చెబుతున్నారు. అంటే రానున్న కాలంలో అమెరికాలో వడ్డీరేట్లు మరింత దిగొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది కనకానికి మరింత కిక్కిచ్చే అంశం!సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల జోరు...అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్నే నమ్ముకుంటున్నాయి. 2024 నవంబర్లో అవి 53 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, ఇందులో భారత్ వాటా 8 టన్నులు. నవంబర్లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసి రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. పోలాండ్ నేషనల్ బ్యాంక్ 90 టన్నులు కొని టాప్లేపింది. ఇలా సెంట్రల్ బ్యాంకులు ఎడాపెడా పసిడి కొనుగోళ్లకు దిగడం కూడా రేట్ల పెరుగుదలకు కారణమవుతోంది.మన దగ్గర అంతకు మించి..అంతర్జాతీయంగా పసిడి ధరలకు మించి భారత్లో పుత్తడి జిగేల్మంటోంది. గతేడాది చివర్లో పండుగల సీజన్కు తోడు, పెళ్లిళ్లు కూడా బాగా ఉండటంతో ఆభరణాలు, రిటైల్ కొనుగోళ్లు దూసుకెళ్లాయి. నవంబర్లో భారత్ 10 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం దీనికి నిదర్శనం. అంతర్జాతీయంగా గోల్డ్ రష్కు తోడు దేశీయంగా ఆభరణాల వర్తకులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు, డాలర్తో రూపాయి మారకం విలువ అంతకంతకూ దిగజారుతుండటం పసిడి ధరలు జోరందుకోవడానికి ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ చెబుతోంది.రూపాయి ఎఫెక్ట్..దేశీయంగా బంగారం ధర జనవరి నెలలోనే 5.5 శాతం (రూ.4,360) ఎగబాకగా.. గత వారం రోజుల్లోనే 2 శాతం (రూ.1,700) జంప్ చేసింది. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రూపాయి నేలచూపులే. రోజురోజుకూ బక్కచిక్కతున్న రూపాయి విలువ తాజాగా 86.85 ఆల్టైమ్ కనిష్టానికి జారిపోయింది. ఇందులో ట్రంప్ గెలిచిన రోజు నుంచి చూస్తే రూపాయి విలువ 250 పైసల మేర ఆవిరి కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర ఈ నెల 24న ఆల్టైమ్ గరిష్టాన్ని తాకి ప్రస్తుతం 2,795 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయినా భారత్లో గత వారం రోజుల్లో పసిడి రేటు పెరుగుతూపోతోంది. డాలరు పుంజుకుని, రూపాయి పడిపోవడం వల్ల బంగారం దిగుమతుల కోసం ఎక్కువ రూపాయలు చెల్లించుకోవాల్సి రావడమే దీనికి కారణం.రేటు పైపైకే...!బంగారం గడిచిన ఏడాది నిజంగా కనకవర్షమే కురిపించింది. అంతర్జాతీయంగా, దేశీయంగా దాదాపు 25–30 శాతం మేర రాబడులు అందించి అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా నిలిచింది. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో పసిడి దూకుడు ఈ ఏడాది కూడా ఖాయమేనని బులియన్ నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. కాయిన్ ప్రైస్ బులియన్ విశ్లేషకుల తాజా అంచనా ప్రకారం.. ఈ ఏడాది బంగారం 3,150 డాలర్లను తాకే అవకాశం ఉంది. ఏడాది చివరికల్లా 3,150–3,356 డాలర్ల రేంజ్లో స్థిరపడొచ్చని లెక్కగట్టారు. ఇక మన రూపాయి ఇలాగే పడిపోతూ.. దేశీయంగా ఆభరణాల డిమాండ్ కూడా పెరిగితే తులం బంగారం అక్షరాలా లక్ష రూపాయలను తాకడం ఖాయమనేది మెజారిటీ నిపుణుల అభిప్రాయం!!‘ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు, ట్రంప్ సుంకాల మోత భయాలతో ఇన్వెస్టర్లు పసిడి జై కొడుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతకు పాజ్ ఇచ్చినా సరే పుత్తడికి సానుకూలమే’– దేవేయ గగ్లానీ, యాక్సిస్ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ ఎనలిస్ట్ఒక్కరోజే రూ.910 పెరుగుదలకొనుగోళ్ల డిమాండ్తో బుధవారం (29న) ఒక్కరోజే 99.9 స్వచ్ఛత బంగారం ధర ఢిల్లీలో 10 గ్రాములకు రూ.910 పెరిగి రూ.83,750కి చేరింది. ఈ నెల 1న బంగారం ధర రూ.79,390 వద్ద ఉండగా.. నెల రోజుల్లో 5.5 శాతం మేర (రూ.4,360) ర్యాలీ చేసింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.910 పెరిగి జీవిత కాల గరిష్టం రూ.83,350కి చేరింది. వెండి ధర కిలోకి రూ.1,000 పెరిగి రూ.93,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ రేటు 2,795 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
భలే ఛాన్స్.. తగ్గిన బంగారం ధర! తులం ఎంతంటే..
సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధర(Gold rate) తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.75,100 (22 క్యారెట్స్), రూ.81,930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.300, రూ.320 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.320 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.75,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.81,930 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.300 తగ్గి రూ.75,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.320 దిగజారి రూ.82,080 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలో ఉన్న తగ్గుదల వెండి ధరలో కనిపించలేదు. సోమవారం ధరతో పోలిస్తే స్థిరంగానే వెండి ధర(Silver Rate) కొనసాగుతుంది. మంగళవారం కేజీ వెండి రేటు రూ.1,04,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నేటి బంగారం ధర ఎలా ఉందంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే బుధవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.73,400 (22 క్యారెట్స్), రూ.80,070 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100, రూ.110 చొప్పున పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.73,400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.80,070 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర(Gold Price) రూ.100 పెరిగి రూ.73,550కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.110 ఎగబాకి రూ.80,220 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగినట్లే వెండి ధరల్లోనూ మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర(Silver rates) కేజీకి రూ.1,000 పెరిగి రూ.1,01,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం, వెండి ధరల అప్డేట్.. తులం ఎంతంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Price) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,150 (22 క్యారెట్స్), రూ.78,710 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధర స్థిరంగానే కొనసాగుతుంది. చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు(Gold Rate) వరుసగా రూ.72,150 రూ.78,710గా ఉంది.ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.72,300గా ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.78,860గా ఉంది. మంగళవారం బంగారం ధరల మాదిరి కాకుండా వెండి ధర(Silver price)ల్లో మార్పులొచ్చాయి. ఈ రోజు వెండి ధర కేజీకి రూ.1000 పెరిగి రూ.1.00,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్థిరంగా బంగారం ధరలు.. తులం ఎంతంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే 2025 సోమవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,150 (22 క్యారెట్స్), రూ.78,710 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఆదివారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధర స్థిరంగానే కొనసాగుతుంది. చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.72,150 రూ.78,710గా ఉంది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి(Gold) ధర రూ.72,300గా ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.78,860గా ఉంది. సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేనట్లే వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు వెండి ధర(Silver Price) కేజీకి రూ.99,000గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే 2025 ఏడాది మొదటిరోజు బుధవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,500 (22 క్యారెట్స్), రూ.78,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 చొప్పున పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.78,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.71,650కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 అధికమై రూ.78,150 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుఏడాది ప్రారంభ రోజు బుధవారం బంగారం ధరలు పెరిగినట్లుగా వెండి ధరల్లో మార్పులేమి రాలేదు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర మారకుండా స్థిరంగా కేజీకి రూ.98,000 వద్దే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాస్ట్ డే.. భలే ఛాన్స్.. బంగారం తులం ఎంతంటే..
సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీ(Equity)ల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధర(Gold Rate Today) తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం 2024 ఏడాది చివరి రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,100 (22 క్యారెట్స్), రూ.77,560 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,560 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 తగ్గి రూ.71,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 దిగజారి రూ.77,710 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. సోమవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు(Silver Price) రూ.1,900 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్పంగా పెరిగిన బంగారం ధర
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం(Gold)లో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే బుధవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Price) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,000 (22 క్యారెట్స్), రూ.77,450 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100 చొప్పున పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,450 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.71,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.100 దిగజారి రూ.77,600 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగినట్లే వెండి ధరల్లో మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర కేజీకి రూ.100 పెరిగి రూ.99,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..
సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీ(Equity)ల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,900 (22 క్యారెట్స్), రూ.77,350 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100 చొప్పున తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,350 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 తగ్గి రూ.71,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.100 దిగజారి రూ.77,500 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. కానీ వెండి ధర(Silver Rate)ల్లో మాత్రం నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి రేటు రూ.98,900 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
తులం బంగారం ధర ఎలా ఉందంటే..
ఇటీవల కాలంలో మదుపర్లు స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు ఆదివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,000 (22 క్యారెట్స్), రూ.77,450 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శనివారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలో ఎలాంటి మార్పులు లేరు.చెన్నైలో ఆదివారం బంగారం ధరలు వరుసగా రూ.71,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,450 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)వద్ద ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా పసిడి ధరలో మార్పు లేదు.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే స్థిరంగానే ఉంది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.71,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.77,600గా ఉంది. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే బంగారంలాగే ఎలాంటి మార్పులేదు. దాంతో కేజీ వెండి రూ.99,000 వద్దే స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధర ఈ రోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,000 (22 క్యారెట్స్), రూ.77,450 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.600, రూ.650 పెరిగింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.600, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,450 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 పెరిగి రూ.71,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.650 పెరిగి రూ.77,600 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు పెరగడంతోపాటు వెండి ధరల్లో మార్పులు జరిగాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర రూ.1,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.99,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ అవకాశం రాదేమో! భారీగా తగ్గిన బంగారం ధర
సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా తగ్గిన నేపథ్యంలో కొన్ని స్టాక్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే గురువారం బంగారం ధర భారీగా తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,700 (22 క్యారెట్స్), రూ.77,130 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.650, రూ.710 తగ్గింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.650, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,130 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.650 తగ్గి రూ.70,850కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.710 దిగజారి రూ.77,280 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. బుధవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.1,000 తగ్గి రూ.99,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పదేళ్లలో ఇదే ప్రచండ బంగారం! కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందా?
ఈ ఏడాది ఇప్పటివరకు 30 శాతానికి పైగా పెరిగిన బంగారం ధరలు భారతీయ మార్కెట్లలో గ్రాముకు రూ. 7,300కి చేరుకున్నాయి. ఒక క్యాలెండర్ ఇయర్లో ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే గడిచిన 10 సంవత్సరాలలో ఈ ఏడాది పెరుగుదలే అత్యధిక కానుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక వెల్లడించింది.అయితే ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ స్థాయి పరుగు 2025 చివరి వరకు కొనసాగకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడానికి కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, పెట్టుబడిదారుల కొనుగోళ్లే కారణమని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొందిడబ్ల్యూజీసీ డేటా ప్రకారం.. 2022లో చూసిన స్థాయిలతో పోలిస్తే 2024 క్యాలెండర్ ఇయర్ మూడో త్రైమాసికం నాటికి బంగారం కొనుగోలు 694 టన్నులకు చేరుకోవడంతో సెంట్రల్ బ్యాంక్ డిమాండ్ బలంగా ఉంది. 2024 అక్టోబర్ నాటికి తుర్కియే, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు వరుసగా 72 టన్నులు, 69 టన్నుల బంగారు నిల్వలను జోడించి బంగారం మార్కెట్లో ఆధిపత్యం ప్రదర్శించాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్లో 27 టన్నులను జోడించింది. ఈ నెల వరకు దాని మొత్తం బంగారం కొనుగోళ్లు 77 టన్నులకు చేరుకున్నాయి. అక్టోబర్ వరకు భారత్ నికర కొనుగోళ్లు దాని 2023 కార్యకలాపాలపై ఐదు రెట్లు పెరిగాయని నివేదిక పేర్కొంది.వచ్చే ఏడాది ఎలా ఉంటుంది?2025 బంగారానికి సవాలుగా ఉండే సంవత్సరంగా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అనేక ఎదురుగాలులను వారు చూస్తున్నారు. వాటిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లపై దాని ప్రభావం ఉన్నాయి. బంగారం అతిపెద్ద వినియోగదారులలో ఒకటైన చైనాలో కూడా పరిణామాలు కీలకంగా ఉన్నాయి. -
దడ పుట్టిస్తున్న బంగారం! తులం ఎంతంటే..?
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కొంత ఒడిదొడుకుల్లో ఉన్న బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,050 (22 క్యారెట్స్), రూ.78,600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.750, రూ.820 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.750, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.820 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.72,050 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.78,600 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.750 పెరిగి రూ.72,200కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.820 పెరిగి రూ.78,750 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలతోపాటు వెండి ధరల్లోనూ భారీగా మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు ఏకంగా కేజీపై రూ.4,000 పెరిగి రూ.1,04,000కు చేరుకుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వరుసగా మూడు రోజులపాటు తట్టిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,300 (22 క్యారెట్స్), రూ.77,780 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.430 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.430 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,780 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.71,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.430 పెరిగి రూ.77,930 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు పెరిగినప్పటికీ..వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,01,000 వద్ద నిలిచింది. నిన్న మాత్రం కేజీపై రూ.500 తగ్గింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సెషన్ల నుంచి ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుతున్నాయి. ఇప్పటివరకు కొంత సేఫ్డ్ అసెట్గా భావించే బంగారం పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు మంగళవారం యూటర్న్ తీసుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,800 (22 క్యారెట్స్), రూ.77,240 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1200, రూ.1310 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1310 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,240 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1200 తగ్గి రూ.70,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1310 దిగజారి రూ.77,390 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. సోమవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.2,500 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,650 (22 క్యారెట్స్), రూ.77,070 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.700, రూ.760 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.760, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,070 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.700 పెరిగి రూ.70,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.760 పెరిగి రూ.77,220 వద్దకు చేరింది.ఇదీ చదవండి: మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్సిల్వర్ ధరలుబంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా మంగళవారం భారీగానే పెరిగాయి. సోమవారంతో పోలిస్తే ఈరోజు కేజీకి రూ.2,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.1,01,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారు కొండ దిగుతోంది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో గురువారం 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రా ముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.77,050కి చేరింది. కాగా, 99.5 స్వచ్ఛత బంగారం ధర రూ.700 తగ్గి రూ.76,650కి దిగివచి్చంది. కిలో వెండి సైతం రూ.2,310 క్షీణించి రూ.90,190కి చేరింది. అంతర్జాతీయంగా పటిష్ట డిమాండ్కు తోడు పండుగ సీజన్ కారణంగా ఈ అక్టోబర్ 31న 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.82,400 వద్ద ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నాటి నుంచి రూ.4,650 తగ్గింది. రెండు వారాల్లో 260 డాలర్లు డౌన్... అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రాములు) ధర 45 డాలర్లు తగ్గి 2,541.70 డాలర్లకు పడింది. ఈ వార్త రాస్తున్న 9 గంటల సమయానికి 13 డాలర్ల తగ్గుదలతో రూ.2,574 వద్ద ట్రేడవుతోంది. జీవితకాల గరిష్టం 2,802 డాలర్ల నుంచి 260 డాలర్లు తగ్గింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక తర్వాత ఏకంగా 4% తగ్గింది.‘‘ట్రంప్ గెలుపుతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు కొనసాగకపోవచ్చు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో యుద్ధ ఉద్రిక్తతలు సద్దుమణగొచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చనే అశలతో డాలర్ ఇండెక్స్(107.06) అనూహ్యంగా బలపడుతోంది. దీంతో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ట్రంప్ వాణిజ్య విధాన నిర్ణయాలు రానున్న రోజుల్లో పసిడి ధరలకు దిశానిర్ధేశం చేస్తాయి’’ అని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
గరిష్ట ధర వద్ద లాభాల స్వీకరణ
న్యూఢిల్లీ: అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా గరిష్ట ధరల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో బంగారం పరుగు కొంత తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర సోమవారం రూ.1,300 తగ్గి రికార్డు స్థాయిల నుంచి రూ.81,100కు దిగివచ్చింది. గత ట్రేడింగ్లో రూ.82,400 ఆల్టైమ్ రికార్డుకు పసిడి దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక వెండి కేజీ ధర ఏకంగా రూ.4,600 తగ్గి రూ.94,900కి చేరింది.ఆభరణ వర్తకులు, రిటైలర్ల నుంచి కూడా డిమాండ్ కొంత మందగించినట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. కాగా, 99.5 స్వచ్ఛత పసిడి ధర న్యూఢిల్లీలో రూ.1,300 దిగివచి్చన రూ.80,700కు చేరింది. ఇదిలావుండగా అంతర్జాతీయ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రా ములు) ధర 2,747 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ పసిడి ధర వారంరోజుల క్రితం 2,802 డాల ర్ల ఆల్టైమ్ రికార్డును తాకిన సంగతి తెలిసిందే. -
171.6 టన్నుల బంగారు ఆభరణాలు!
బంగారంపై మక్కువ రోజురోజుకూ పెరుగుతోంది. గోల్డ్ కొనుగోలును చాలామంది పెట్టుబడిగా భావిస్తారు. అందుకే భారత్లో వాటి రిజర్వ్లు పెరుగుతున్నాయి. బంగారు ఆభరణాల డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 171.6 టన్నులకు చేరిందని నివేదికల ద్వారా తెలిసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో దీని డిమాండ్ 155.7 టన్నుల కంటే ఈసారి 10 శాతం పెరిగింది. దిగుమతి సుంకం తగ్గింపుతో ఆభరణాలకు అనూహ్య డిమాండ్ పెరిగిందని.. 2015 తర్వాతి కాలంలో ఒక ఏడాది మూడో త్రైమాసికంలో ఆభరణాలకు గరిష్ట డిమాండ్ ఏర్పడినట్టు ప్రపంచ పసిడి మండలి(వర్ల్డ్ గోల్డ్ కౌన్సిల్) ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ తెలిపారు.బంగారంపై సుంకం తగ్గింపుతో బంగారం ధరలు తగ్గుతాయని తొలుత అందరూ భావించారు. కానీ అదనంగా ఇతర అంశాలు తొడవ్వడంతో దేశీయంగా డిమాండ్ పెరగడానికి దారితీసినట్టు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఆర్బీఐ నుంచి బంగారం కొనుగోళ్లు కొనసాగడం, మంచి వర్షాల సీజన్ డిమాండ్కు ప్రేరణగా నిలిచినట్టు పేర్కొంది. నివేదిక ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్లో ఆర్బీఐ 13 టన్నుల మేర కొనుగోలు చేసింది. ఆర్బీఐ వద్ద నిల్వలు 854 టన్నులుఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో, ఏప్రిల్–జూన్ కాలంలో 18 టన్నుల చొప్పున ఆర్బీఐ బంగారం కొనుగోలు చేసింది. దీంతో బంగారం నిల్వలు 854 టన్నులకు చేరాయి. 2023 చివరితో పోల్చి చూస్తే ఇది 6% పెరిగాయి. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడుల డిమాండ్ 76.7 టన్నులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 54.5 టన్నులతో పోల్చి చూస్తే 41 శాతం పెరిగినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. పునర్వినియోగానికి సిద్ధం చేసిన (రీసైకిల్డ్) ఆభరణాల పరిమాణం 23.4 టన్నులుగా ఉంది.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!ఇక ముందూ బలమైన డిమాండ్ డిసెంబర్ త్రైమాసికంలోనూ బంగారం డిమాండ్ బలంగా కొనసాగుతుందని సచిన్ జైన్ పేర్కొన్నారు. పండగ సీజన్తోపాటు వివాహాల కోసం కొనుగోళ్లు డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయన్నారు. బంగారం ధరలు పెరగడం దిగుమతి సుంకం ప్రయోజనాన్ని పూర్తిగా హరించిందని..దీంతో కొందరు పెట్టుబడి దృష్ట్యా బంగారం ధరలు తగ్గే వరకు వేచి చూడొచ్చని అభిప్రాయపడ్డారు. -
పసిడికి పెరిగిన డిమాండ్
ముంబై: దిగుమతి సుంకం తగ్గింపుతో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 248.3 టన్నులుగా నమోదైంది. ముఖ్యంగా సుంకం తగ్గింపు ఆభరణాల కొనుగోళ్లను పెంచినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ‘2024 క్యూ3 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదిక తెలిపింది. ‘‘బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరడంతో.. ధరలు తగ్గే వరకు కొనుగోళ్ల కోసం ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించొచ్చు. దీంతో పూర్తి ఏడాదికి (2024) బంగారం డిమాండ్ 700–750 టన్నుల మేర ఉంటుంది. గతేడాదితో పోలి్చతే కొంత తక్కువ. 2024 చివరి త్రైమాసికంలో ధనత్రయోదశి, వివాహాల సీజన్ మొత్తం మీద బంగారం డిమాండ్కు ఊతంగా నిలుస్తాయి’’అని ఈ నివేదిక తెలిపింది. 2023లో బంగారం డిమాండ్ 761 టన్నులుగా ఉంది. ధనత్రయోదశి సందర్భంగా డిమాండ్ పెరగడంతో మంగళవారం ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.300 పెరిగి రూ.81,400కు చేరడం గమనార్హం. ఇక విలువ పరంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 53 శాతం పెరిగి రూ.1,65,380 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,07,700 కోట్లుగా ఉంది. బంగారం, వెండి దిగుమతులపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి బడ్జెట్లో తగ్గించడం తెలిసిందే. బంగారం దిగుమతులు 22% జంప్ పస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు జోరుగా సాగుతున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో 22 శాతం అధికంగా 27 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బంగారం దిగుమతులు 22 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత పండుగల సీజన్ దిగుమతులు పెరగడానికి కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అత్యధికంగా స్విట్జర్లాండ్ 40 శాతం మేర మన దేశానికి బంగారం ఎగుమతి చేయగా, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా ఆక్రమించాయి. దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం దిగుమతుల వాటా 5 శాతంగా ఉంటుంది. బంగారం దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) మొదటి ఆరు నెలల్లో (సెప్టెంబర్ చివరికి) 137.44 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వాణిజ్య లోటు 119.24 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనించొచ్చు. బంగారానికి చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద వినియోగదారుగా భారత్ ఉంటోంది. వెండి దిగుమతులు సైతం 376 శాతం పెరిగి 2.3 బిలియన్ డాలర్లుగా ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి నమోదయ్యాయి. కరెంటు ఖాతా లోటు ఒక శాతం ఎగసి 9.7 బిలియన్ డాలర్లకు చేరింది. -
త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం!
బంగారం.. ఓ సింగారం.. ఓ ఆచారం.. ఓ అవసరం.. ఓ ఫ్యాషన్.. ఇలా పేరు ఏదైనా నిత్య జీవితంలో దీనితో పెనవేసుకున్న బంధం వెలకట్టలేనిది. ఇంతగా ప్రాధాన్యత దక్కించుకున్న ఈ పసిడి ధర ఇప్పుడు కొండెక్కింది. కొండంటే మామూలు కొండ కాదు.. ఏకంగా ఎవరెస్టే ఎక్కి జిగేల్ జిగేల్మంటోంది.సాక్షి ప్రతినిధి కర్నూలు: చరిత్రలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ.80 వేల మార్క్ను దాటింది. బులియన్ మార్కెట్లో బుధవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ.80,070కి చేరింది. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా బంగారం ధరలపై మరోసారి చర్చ మొదలైంది. చాలా వేగంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని కొందరు అంటుంటే.. ఇంకొందరు త్వరలోనే రూ.80 వేలు కాస్త రూ.లక్షకు చేరుతుందని విశ్లేషిస్తున్నారు.ఇంకోవైపు.. ఆశ్వీయుజ మాసంలో పెళ్లిళ్లకు సిద్ధమైన సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు బంగారు ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. బంగారం కొనుగోలు చేసే దేశాల్లో ప్రపంచంలోనే మన దేశం రెండో స్థానంలో ఉంది. బంగారం లేకుండా మన దగ్గర ఏ శుభకార్యం జరగదంటే అతిశయోక్తి కాదు. అయితే.. పదేళ్లుగా బంగారం ధరలు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. మూణ్ణెళ్ల కిందట జూలైలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.75వేల వరకూ ట్రేడ్ అయింది. అదే 22 క్యారెట్లు రూ.68,800 చేరింది.అయితే, కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా 10 గ్రాములపై రూ.6 వేల వరకూ తగ్గింది. అంటే.. 22 క్యారెట్ల బంగారం రూ.63 వేలకు.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.70వేలకు తగ్గింది. కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడంవల్లే ధరలు తగ్గుముఖం పట్టాయని, మరింతగా తగ్గే అవకాశం ఉందని బంగారం కొనేందుకు ఇదే అనువైన సమయమని అప్పట్లో అంతా భావించారు. ఇంకొందరు మరికొంత తగ్గుతాయని వేచిచూశారు. కానీ, అక్కడి నుండి రోజూ ధరలు ధగధగలాడుతూ బుధవారం ఏకంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.80,070కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.73,400కు పెరిగింది. బులియన్ మార్కెట్ చరిత్రలో ఇదే గరిష్టం. 75 ఏళ్ల కిందట రూ.99 మాత్రమే.. నిజానికి.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 10 గ్రాముల బంగారం ధర రూ.వందలోపే ఉండేది. 1950లో 10 గ్రాముల ధర రూ.99. ఐదేళ్ల తర్వాత అంటే 1955లో రూ.20 తగ్గి రూ.79కి చేరింది. ఆ తర్వాత ఐదేళ్లకు రూ.111కు చేరిన పుత్తడి, 1965లో ఏకంగా రూ.39 తగ్గి 20 ఏళ్లలో కనిష్టంగా రూ.72కు చేరింది. ఆ తర్వాత ఏటికేడు ధరలు పెరుగుతూ వచ్చాయి. 2008లో తొలిసారిగా పది గ్రాముల బంగారం రూ.10వేల మార్క్ దాటింది. అప్పట్లో దీనిపై పెద్ద చర్చే నడిచింది. అయితే.. రెండేళ్లలోనే అంటే 2010లో ఏకంగా రూ.8 వేలకు పైగా పెరిగి రూ.18వేల మార్క్ను దాటింది. 2015లో రూ.26,343 ఉండేది. ఇప్పుడు రూ.24 క్యారెట్లు రూ.80,070, 22 క్యారెట్ల ధర రూ.73,400కు పెరిగిందంటే బంగారం ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో తెలుస్తోంది.ప్రభావం చూపని సుంకం తగ్గింపు! బంగారం, వెండి, ప్లాటినంతో పాటు విలువైన లోహాలపై 10 శాతం బీసీడీ (బేసిక్ కస్టమ్ డ్యూటీ) ఉండేది. దీనికి అదనంగా ఏఐడీసీ (అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్) 5 శాతం ఉండేది. కేంద్రం బీసీడీని 5 శాతం, ఏఐడీసీని 4 శాతం తగ్గించింది. కస్టమ్స్ సుంకం ఆరు శాతానికే పరిమితం చేసింది. అయితే, జీఎస్టీలో మాత్రం మార్పుల్లేవు. మూడు శాతంగానే ఉంది. దీంతో మొత్తంగా జీఎస్టీతో కలిపి బంగారు, వెండిపై 18 శాతం ఉన్న సుంకం 9 శాతానికి తగ్గింది. ఫలితంగా.. బంగారు, వెండి ధరలు జూలైలో తగ్గుముఖం పట్టాయి. అయితే, ఆగస్టు నుంచి తిరిగి పెరుగుతూ అక్టోబరులో ఆల్టైం గరిష్టానికి చేరాయి. దీంతో కేంద్రం స్మగ్లింగ్ను నివారించేందుకు తగ్గించిన సుంకం మార్కెట్పై పెద్దగా ప్రభావం చూపలేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి.ప్లాటినం కంటే విలువైన లోహం..పదిహేనేళ్ల కిందటి వరకూ బంగారం కంటే ప్లాటినం విలువైన లోహం. బాగా డబ్బున్న కోటీశ్వరులు బంగారం కంటే ప్లాటినం ఆభరణాలు కొనుగోలు చేసేవారు. అప్పట్లో బంగారం కంటే ప్లాటినం ధర ఎక్కువగా ఉండటంతో ఏదైనా శుభకార్యానికి ప్లాటినం నగలతో వచ్చే స్త్రీలను ప్రత్యేకంగా చూసేవారు. అయితే, ఇప్పుడు ప్లాటినంను దాటి బంగారం ధర రెట్టింపు అయింది.బులియన్ మార్కెట్లో ఇలా జరుగుతుందని ఊహించలేదని బంగారు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర బుధవారం రూ.73,400 ఉంటే, 10 గ్రాముల ప్లాటినం ధర రూ.30,500 ఉంది. దీనికి కారణమేంటని వ్యాపారులను ఆరా తీస్తే ప్రపంచవ్యాప్తంగా ప్లాటినంతో పోలిస్తే బంగారం కొనుగోళ్లు అధికమని.. ఫారెక్స్ మార్కెట్లో కూడా బంగారంపైనే పెట్టుబడులు పెడతారని, దీంతో అది భారీగా పెరుగుతూ వచ్చిందని చెబుతున్నారు.ఇదీ చదవండి: రూ.12 లక్షలు ఉన్నాయి.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?బంగారు కొనాలంటేనే భయం వేస్తోంది. గోల్డ్ ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో సామాన్యులు కొనే పరిస్థితి లేదు. ఇలా ధరలు పెరిగిపోతూ ఉంటే ఆచితూచి కొనాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో గోల్డ్షాపులకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. – నవిత, కిడ్స్ స్టూడియో నిర్వాహకులు, కర్నూలుగోల్డ్ కొనడం కష్టమే..బంగారం ధర రూ.80వేలు దాటింది. మేకింగ్ చార్జీలు, జీఎస్టీ అంతా కలిపి రూ. లక్ష అవుతోంది. 10 గ్రాముల బంగారాన్ని దాదాపు రూ.లక్ష పెట్టి కొనడమంటే చాలా కష్టం. చైన్ హుక్ పోతే చేయించడానికి రూ.10 వేలు అవుతోంది. ధరల పెరుగుదలను ఊహించలేకపోతున్నాం. మధ్య తరగతి కుటుంబాలు బంగారం అంటేనే అమ్మో అనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్లు ఉన్న వారికి పెరిగిన గోల్డ్ ధరలు అదనపు భారమే.– గౌతమి, కర్నూలు -
బంగారం ధర జిగేల్ జిగేల్!
బంగారం.. ఓ సింగారం.. ఓ ఆచారం..ఓ అవసరం.. ఓ ఫ్యాషన్.. ఇలా పేరు ఏదైనా నిత్య జీవితంలో దీనితో పెనవేసుకున్న బంధం వెలకట్టలేనిది.ఇంతగా ప్రాధాన్యత దక్కించుకున్న ఈ పసిడి ధర ఇప్పుడు కొండెక్కింది. కొండంటే మామూలు కొండ కాదు.. ఏకంగా ఎవరెస్టే ఎక్కి జిగేల్ జిగేల్మంటోంది.బంగారు కొనాలంటేనే భయం వేస్తోంది. గోల్డ్ ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో సామాన్యులు కొనే పరిస్థితి లేదు. ఇలా ధరలు పెరిగిపోతూ ఉంటే ఆచితూచి కొనాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో గోల్డ్షాపులకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. – నవిత, కిడ్స్ స్టూడియో నిర్వాహకులు, కర్నూలుసాక్షి ప్రతినిధి కర్నూలు: చరిత్రలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ.80 వేల మార్క్ను దాటింది. బులియన్ మార్కెట్లో బుధవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ.80,070కి చేరింది. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా బంగారం ధరలపై మరోసారి చర్చ మొదలైంది. చాలా వేగంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని కొందరు అంటుంటే.. ఇంకొందరు త్వరలోనే రూ.80 వేలు కాస్త రూ.లక్షకు చేరుతుందని విశ్లేషిస్తున్నారు. ఇంకోవైపు.. ఆశ్వీయుజ మాసంలో పెళ్లిళ్లకు సిద్ధమైన సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు బంగారు ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. -
గరిష్ఠాలను చేరుతున్న బంగారం ధర!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,000 (22 క్యారెట్స్), రూ.76,360 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.210 పెరిగింది. మే నెలలో 24 క్యారెట్ల బంగారం గరిష్ఠంగా రూ.76,450కు చేరింది. తిరిగి ఆ ధరను అందుకునేలా కనిపిస్తోంది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.210 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.76,360 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.70,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.210 పెరిగి రూ.76,510 వద్దకు చేరింది. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.100 తగ్గి రూ.92,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడి.. పరుగో పరుగు!
న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పసిడి పరుగు కొనసాగుతోంది. నైమెక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోలి్చతే సోమవారం 12 డాలర్లు పెరిగి సరికొత్త రికార్డు 2,659.7 డాలర్లను తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫండ్ రేటు కోతతో మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పలు దేశాల్లో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం భయాలు పసిడి పరుగుకు కారణం. ఇక దేశీయంగా కూడా పసిడి ధర పటిష్టంగానే కొనసాగుతున్నప్పటికీ, కస్టమ్స్ సుంకాల తగ్గింపు, రూపాయి బలోపేత ధోరణి పసిడి పరుగును కొంత నిలువరిస్తున్నాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల ధర రూ. 600 ఎగసి రూ. 76,950కి చేరింది. దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్లో 10 గ్రాముల ధర రూ.255 పెరిగి రూ.74,295కు చేరింది. -
ఫెడ్ వడ్డీ కోత పసిడికి బూస్ట్
న్యూఢిల్లీ: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. నాలుగేళ్ల తదుపరి బుధవారం 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. అయితే చౌకగా లభించనున్న ఫైనాన్సింగ్ భారత్ వంటి వర్ధమాన దేశాలకు పెద్దగా కలసిరాకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విదేశీ నిధులు బంగారం ధరలకు దన్నునిచ్చే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. మిశ్రమ అంచనాలు సుమారు 14 నెలలపాటు రెండు దశాబ్దాల గరిష్టం వద్ద కొనసాగిన ఫెడ్ ఫండ్స్ రేట్లు దిగివస్తున్నాయి. తాజాగా రేట్ల తగ్గింపు టర్న్ తీసుకున్న ఫెడ్ ఈ ఏడాది చివరి(డిసెంబర్)కల్లా మరో 0.5 శాతం కోత పెట్టనున్నట్లు అంచనా. అయితే ఫెడ్ రేట్ల తగ్గింపుతో ఈక్విటీలపై రాబడి క్షీణించనున్నట్లు పీహెచ్డీసీసీఐ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ అంచనా వేశారు. మరోవైపు బంగారం ధరలు బలపడే వీలున్నట్లు పేర్కొన్నారు. కామా జ్యువెలరీ ఎండీ కొలిన్ షా సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. సమీపకాలంలో పసిడి ధరలు సరికొత్త గరిష్టాలకు చేరవచ్చని తెలియజేశారు. యూఎస్ రేట్ల కోత బంగారంలో పెట్టుబడులకు దారిచూపుతుందని అభిప్రాయపడ్డారు. రేట్ల కోతకు దారి... ఫెడ్ వడ్డీ తగ్గింపుతో భారత్కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరానున్నట్లు బిజ్2క్రెడిట్ సహవ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ అరోరా పేర్కొన్నారు. అటు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మార్గంలోనూ విదేశీ నిధులు పెరగనున్నట్లు అంచనా వేశారు. ఇది దేశీ కరెన్సీ రూపాయికి బలాన్నిస్తుందని తెలియజేశారు. వెరసి ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు చిక్కుతుందని అభిప్రాయపడ్డారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతంవద్దే కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠిన పరపతి విధానాలను అవలంబిస్తోంది. వచ్చే నెల(అక్టోబర్) 7–9 మధ్య ఆర్బీఐ పాలసీ సమీక్షను చేపట్టనున్న విషయం విదితమే.అయితే ప్రపంచ దేశాల వడ్డీ రేట్ల ప్రభావం భారత్పై ఉండదని ఇండియాబాండ్స్.కామ్ సహవ్యవస్థాపకుడు విశాల్ గోయెంకా పేర్కొన్నారు. రిస్క్ ఆస్తులలో భారీ ర్యాలీ, ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, ద్రవ్యోల్బణ ప్రభావాల కారణంగా ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపునకు చాన్స్ తక్కువేనని తెలియజేశారు. అంచనాలకు మించి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఎడిల్వీజ్ ఎంఎఫ్ ఈక్విటీస్ సీఐవో త్రిదీప్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.భారత్పై ప్రభావం అంతంతే..మార్కెట్వర్గాలు ఇప్పటికే చాలా మటుకు ఫెడ్ వడ్డీ రేట్ల కోతను పరిగణనలోకి తీసుకున్నందున దీని ప్రభావం భారత్పై పెద్దగా ఉందు. దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఇప్పటికే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, మొత్తం మీద రేట్ల తగ్గింపనేది వర్ధమాన మార్కెట్లకు మాత్రం సానుకూలమే. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు -
బంగారం ధరధగ!
న్యూఢిల్లీ/న్యూయార్క్: బంగారం అంతర్జాతీయంగా కొత్త రికార్డు ధరలను తాకింది. కమోడిటీ ఫ్యూచర్స్– నైమెక్స్లో చురుగ్గా ట్రేడయ్యే డిసెంబర్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1 గ్రాములు) ధర శుక్రవారం ఆల్టైమ్ రికార్డు స్థాయిలో 2,611.6 డాలర్లను చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 25 డాలర్లకు పైగా ఎగసి ట్రేడవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేట్ల కోత అంచనాలు పసిడి పరుగులకు దోహదం చేస్తున్నాయి.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన ఫారెక్స్ నిల్వలుదేశంలోనూ అదే తీరు...: దేశీయంగా చూస్తే ఢిల్లీలో పూర్తి స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరిగి రూ.75,500కు చేరింది. ఒక్క జులైలో దేశీయంగా పసిడి ధర రూ.5,000 ఎగసి రూ.71,050కి చేరింది. మరోవైపు వెండి ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. కిలోకు శుక్రవారం రూ.2,000 ఎగసి రూ.89,000కు చేరింది. ముంబైలో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల ధరలు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,260, రూ.1,200 చొప్పున ఎగసి వరుసగా రూ.72,610, రూ.69,150కి చేరాయి. వెండి ధర కేజీకి ఏకంగా రూ.3,500 పెరిగి రూ.95,000కు ఎగసింది. మరోవైపు దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్లో పసిడి డిసెంబర్ కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.700 లాభంతో రూ. 74,000పైన ట్రేడవుతోంది. వెండి ధర రూ. 2,400 పెరిగి రూ. 89,500 వద్ద ట్రేడవుతోంది. -
ముంబయి-ఢిల్లీ టికెట్ కంటే తులం బంగారం చీప్!
భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. పెళ్లిళ్లు, పండగలు, పుట్టినరోజు, పెళ్లి రోజు..ఇలా ప్రత్యేక దినాల్లో మరింత స్పెషల్గా ఆత్మీయులకు ఆనందాన్ని పంచేందుకు బంగారాన్ని కొంటూంటారు. అంతేకాదు గోల్డ్ను స్థిరంగా వృద్ధి చెందే సురక్షితమైన పెట్టుబడిగా భావించి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. చైనా తర్వాత బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ పసిడి ప్రయాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది.1947లో రూ.88.62 రెట్టింపు అయింది.1947లో ముంబయి నుంచి ఢిల్లీ వెళ్లే టికెట్ ధర కంటే 10 గ్రాముల బంగారం ధర తక్కువ.స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే.1950-60 దశాబ్దంలో బంగారం దాదాపు 12 శాతం ఎగిసింది.1970లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.184కు చేరింది.1980లో రూ.1,330కు, 1990 నాటికి రూ.3,200 దాటింది.2001 ఏడాదికి సుమారు 15శాతం చొప్పున పెరిగింది.2008-2009లో ఆర్థిక సంక్షోభం మార్కెట్లను కుదిపేసినప్పటికీ 2000-2010 మధ్య కాలంలో బంగారం ధర రూ 4,400 నుంచి రూ.18,500 వరకు పెరిగింది.2021లో సగటు బంగారం ధర 10 గ్రాములకు రూ.48,720.2023లో రూ.60వేల వద్ద రికార్డు స్థాయిని బ్రేక్ చేసింది.2024 మేలో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా గరిష్ఠంగా రూ.76,450ను తాకింది. ప్రస్తుతం ఈరోజు(ఆగస్టు 14, 2024) రూ.71,150గా ఉంది.బంగారం ధరను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర ప్రభావంభౌగోళిక, రాజకీయ అనిశ్చితులుఆర్థికమాంద్యం భయాలుఆర్థిక, రాజకీయ పరిస్థితులుప్రభుత్వ విధానాలుడాలర్ విలువద్రవ్యోల్బణంభారత్ దిగుమతి చేసుకునే బంగారంలో దాదాపు 44 శాతం స్విట్జర్ల్యాండ్ నుంచే వస్తోంది. తర్వాత యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి సుమారు 11 శాతం పసిడి దిగుమతి అవుతుంది. తర్వాత స్థానంలో సౌత్ ఆఫ్రికా, గినియా ఉంటాయి.ఇదీ చదవండి: పెరుగుతున్న సౌర విద్యుత్ సామర్థ్యంఎక్కువ కొనుగోలు చేసేది ఎప్పుడంటే..పెళ్లిళ్లుపుట్టినరోజుపెళ్లిరోజుదీపావళిఆక్షయ తృతియదంతేరాస్ఇతర ప్రత్యేక రోజులు, పండగలు -
మళ్ళీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇవే..
బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా గరిష్టంగా తులం ధర రూ.270 పెరిగింది. దీంతో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 12) గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 270 పెరిగింది.తెలుగు రాష్ట్రాలలో మాదిరిగానే చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 250, రూ. 270 పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 70580 వద్దకు చేరాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 64850 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70730 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలకంటే కూడా ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 270 పెరిగిందని స్పష్టమవుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. ఆదివారం స్థిరంగా ఉన్న వెండి.. సోమవారం రూ. 600 తగ్గి, కేజీ సిల్వర్ ధర రూ. 82500లకు చేరింది. మారుతున్న పరిణామాలు చూస్తుంటే.. బంగారం వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమైపోతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం పరిశ్రమకు కొత్త సంఘం!
భారత బంగారం పరిశ్రమకు సంబంధించి కొత్త అసోసియేషన్ ఏర్పాటు కానుంది. ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్సలెన్స్ అండ్ స్టాండర్డ్స్ (ఐఏజీఈఎస్) పేరుతో అసోసియేషన్ ఏర్పాటవుతోంది. ఈ పరిశ్రమకు స్వీయ నియంత్రణ సంస్థ (ఎస్ఆర్ఓ)గా ఇది బాధ్యతలు నిర్వహిస్తుంది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఎస్ఆర్ఓకు తగిన మద్దతు, సహాయ సహకారాలను అందిస్తుంది. ఇటు ప్రభుత్వానికి అటు వినియోగదారుకు పరిశ్రమ పట్ల విశ్వసనీయత, పారదర్వకత పెంపొందించడం లక్షంగా తాజా అసోసియేషన్ పనిచేస్తుంది.ఈ సందర్భంగా డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (ఇండియా) సచిన్ జైన్ మాట్లాడుతూ..‘బంగారం పరిశ్రమలో వినియోగదారులకు విశ్వసనీయతను పెంచడమే కొత్త సంఘం లక్ష్యం. ఈ ఏడాది డిసెంబరు లేదా జనవరి 2025 నాటికి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ), ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (జీజేసీ) జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ)సహా ఇతర జాతీయ పరిశ్రమ సంఘాలు కొత్త సంఘం ఏర్పాటులో భాగమవుతున్నాయి’ అన్నారు. అసోసియేషన్ కార్యకలాపాల ఫ్రేమ్వర్క్ను సంస్థ ఏర్పడిన తర్వాత ప్రకటిస్తారని సచిన్ చేప్పారు. సంస్థ సభ్యత్వాలను కూడా అప్పుడే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊహకందని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు! -
అసలు తగ్గింపు ఇక నుంచే.. శ్రావణం ముంగిట శుభవార్త!
శ్రావణ మాసం వస్తోంది. అసలే పెళ్లిళ్ల సీజన్. అదీకాక శుభకార్యాలు అధికంగా జరిగేది ఈ నెలలోనే. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేసేవారికి ఇది నిజంగా శుభవార్త. అది ఏంటంటే..ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం దిగుమతి సుంకాల తగ్గింపును అమలు చేయడంతో బంగారం ధరలు 9% తగ్గుతాయని అంచనా. తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తవడంతో గురువారం నుంచి తక్కువ ధరలో బంగారం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ప్రభావం కొన్ని రోజులుగా బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి నుంచి బంగారం ధరలు రూ.4,000 మేర తగ్గాయి. అయితే అవసరమైన కస్టమ్స్ విధానాల కారణంగా ప్రకటన అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు ఈ ఫార్మాలిటీలన్నీ పూర్తయినందున సవరించిన దిగుమతి సుంకం ప్రకారం బయటి నుంచి బంగారం భారత్ చేరుకోవడం ప్రారంభమవుతుంది. ఆగస్టు 1 నుంచి రిటైల్ అమ్మకానికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.ఎంత మేర తగ్గుతాయి?కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తి కావడానికి వారం రోజుల సమయం పట్టిందని ఆల్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి తగ్గిన దిగుమతి సుంకం ప్రకారం బంగారం దేశంలోకి రావడం ప్రారంభమవుతుంది. ఇది రిటైల్ బంగారం ధరలపై ప్రభావం చూపనుంది. దిగుమతి సుంకంలో 9% తగ్గింపుతో తులం (10 గ్రాములు) బంగారంపై రూ. 5,000 నుంచి రూ. 6,000 తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.దిగుమతి సుంకం తగ్గింపు బంగారం బ్లాక్ మార్కెట్పై కూడా ప్రభావం చూపుతుందని యోగేష్ సింఘాల్ పేర్కొన్నారు. అధిక సుంకం కారణంగా ఆభరణాల వ్యాపారులు అక్రమ దిగుమతి పద్ధతులు అవలంభించేవారు. దీంతో ఆ భారాన్ని కస్టమర్ల మీద వేసేవారు. ఈ రూపంలో వినియోగదారుల నుంచి 15% వసూలు చేసేవారు. ఇప్పుడు సుంకం తగ్గడంతో అక్రమ పద్ధతులకు నగల వ్యాపారులు స్వస్తి పలికే అవకాశం ఉంటుంది. దీంతో ఆ అదనపు భారం కూడా కస్టమర్లపై తగ్గుతుందని భావిస్తున్నారు. -
‘గోల్డెన్’ డేస్!
బంగారం ధరలు దిగొచ్చాయి. గత ఐదేళ్లుగా జెట్ స్పీడ్తో దూసుకెళ్తూ రెట్టింపైన ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ స్థాయిలో ధరలు తగ్గడం చరిత్రలో ఇదే తొలిసారి. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. దీంతో బంగారం దుకాణాలు కొనుగోలుదార్లతో కిటకిటలాడు తున్నాయి. ‘శ్రావణం’ పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బంగారం విక్రయాలు ఇలా.. (కేజీల్లో )రోజుకు 107నెలకు 3,210ఏడాదికి 38,520సాక్షి ప్రతినిధి, కర్నూలు: బంగారం ధరలు ఇటీవల వేగంగా పెరిగాయి. 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.5 వేలుంటే.. 2019 నాటికి రూ.35 వేలకు చేరింది. గత ఐదేళ్లలో ఏకంగా రెట్టింపై.. రూ.70 వేల మార్క్ను దాటింది. 24 క్యారెట్ల ధర అత్యధికంగా రూ.75,050కు చేరితే, 22 క్యారెట్ రూ.68,800 వరకూ ట్రేడ్ అయింది. బంగారం, వెండి, ప్లాటినంతో పాటు విలువైన లోహాలపై 10 శాతం బీసీడీ(బేసిక్ కస్టమ్ డ్యూటీ) ఉండేది. దీనికి అదనంగా ఏఐడీసీ(అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్) 5% ఉండేది. కేంద్రం బీసీడీని 5శాతం, ఏఐడీసీని 4% తగ్గించింది. దీంతో కస్టమ్స్ సుంకాన్ని కేవలం 6 శాతానికే పరిమితం చేసింది. జీఎస్టీలో మాత్రం మార్పుల్లేవు.. 3 శాతంగానే ఉంది. దీంతో మొత్తంగా జీఎస్టీతో కలిపి బంగారు, వెండిపై 18 శాతం ఉన్న సుంకం 9 శాతానికి తగ్గింది. దీంతో బంగారు, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.6 వేల దాకా తగ్గింది. రూ.63 వేల వరకూ తగ్గిన బంగారం తిరిగి కాస్త పెరిగి రూ.63,850 చేరింది. ధరలు మరింత తగ్గే అవకాశం 22 క్యారెట్ల ధర రూ.68,800 నుంచి రూ.63 వేలకు తగ్గింది. అంటే 5,800 తగ్గిందన్నమాట. కొన్ని ప్రాంతాల్లోని మార్కెట్లలో రూ.6 వేలకు పైగా తగ్గింది. అయితే మరింతగా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నెల 5వ తేదీ నుంచి శ్రావణమాసం మొదలవుతుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. వివాహాల కోసం అన్ని వర్గాలు అనివార్యంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఈ కారణంగానే ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నాయని, శ్రావణం తర్వాత 10 గ్రాములపై మరో రూ.2 వేలు లేదా 3 వేల వరకూ ధరలు తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. కొనుగోలుదారులతో కిటకిట శ్రావణమాసం, పైగా ధరలు భారీగా తగ్గడంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. నగదు దాచుకున్న వారు వడ్డీలకు డబ్బులివ్వడం కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం మేలని భారీగా కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలల తర్వాత బంగారం ధర తిరిగి పుంజుకుంటుందని.. 24 క్యారెట్ల ధర రూ.80 వేల వరకూ చేరొచ్చని వ్యాపారులు చెబుతున్నారు. మరి కొద్దిరోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం రేటు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ఏడాదికి రూ.28.89 వేల కోట్లు మలబార్, ఖజానా, జోయ్ అలూక్కాస్, లలిత లాంటి ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు 10 వరకూ ఉన్నాయి. దాదాపు ప్రతి ఉమ్మడి జిల్లాలో వీటి బ్రాంచ్లున్నాయి. వీటిలో ప్రముఖమైన నాలుగు సంస్థల్లో రోజూ 1–1.5 కిలోల బంగారం విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. తక్కిన వాటిలో అరకిలో వరకూ విక్రయం అవుతోంది. వీటితో పాటు స్వర్ణకారుల దుకాణాల్లో విక్రయాలున్నాయి. ఇలా కార్పొరేట్ కంపెనీలు, స్వర్ణకారుల దుకాణాల్లో 13 ఉమ్మడి జిల్లాల్లో రోజూ సగటున 107 కిలోల బంగారం విక్రయం అవుతోందని తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో నెలకు 3,210 కిలోలు విక్రయం జరుగుతోంది. రోజువారి బంగారం ధరలతో పాటు.. దానికి తరుగు, జీఎస్టీ కలిపితే సగటున ఒక కిలో రూ.75 లక్షల వరకూ పలుకుతోంది. ఈ లెక్కన నెలకు రూ.2,407 కోట్ల చొప్పున.. ఏడాదికి రూ.28.89 వేల కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్నిబట్టే బంగారం వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. స్మగ్లింగ్ నివారణకే సుంకం తగ్గింపు.. బంగారు విక్రయాలు ‘భారత్’లో ఎక్కువ. దీంతో కేంద్రం దీనిపై మొన్నటి వరకూ జీఎస్టీతో కలిపి 18 శాతం సుంకం వసూలు చేసేది. దుబాయి, సౌదీ, కువైట్తో పాటు పలు గల్ఫ్ దేశాల్లో భారత్తో పోలి్చతే సుంకం సగాని కంటే తక్కువగా ఉంది. దీంతో గల్ఫ్కు, భారత్కు 10 గ్రాములపై రూ.7 వేల వరకూ ధరల్లో వ్యత్యాసం ఉంది. అందువల్లే గల్ఫ్ నుంచి వచ్చేవారు అక్రమంగా బంగారాన్ని తెచ్చేవారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, విజయవాడ విమానాశ్రయాల్లో నిత్యం ‘గోల్డ్ స్మగ్లింగ్’ వెలుగు చూసేది. పట్టుబడకుండా దేశంలోకి పోర్టులు, ఎయిర్పోర్ట్ల ద్వారా భారీగా చేరుతోందని కేంద్రం గ్రహించింది. స్మగ్లింగ్కు గల కారణాలపై ఆరా తీస్తే ధరల్లో వ్యత్యాసమేనని స్పష్టమైంది. అక్రమంగా వచ్చిన బంగారాన్ని కొనుగోలు చేసి నగలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో మన ఖజానాకు గండిపడుతోంది. ధరల్లో వ్యత్యాసాన్ని తగ్గించగలిగితే స్మగ్లింగ్ తగ్గుతుందని, అప్పుడు కొనుగోళ్లు దేశీయంగానే జరుగుతాయి కాబట్టి ఖజానాకు లాభం చేకూరుతుందని భావించిన కేంద్రం సుంకాన్ని తగ్గించింది. దీంతో పాటు బంగారాన్ని పెట్టుబడిగా భావించి కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువ. ధరలు తగ్గిస్తే నగదును దాచుకున్న వారు బంగారాన్ని కొనే అవకాశం ఉంది. దీంతో మార్కెట్లో నగదు చెలామణి పెరిగి.. దేశ ఆరి్థక వృద్ధికి దోహదపడుతుందని భావించి సుంకాన్ని తగ్గించారు. ధరలు తగ్గడం సంతోషకరం మొన్నటి దాకా బంగారం కొనాలంటే ధరలు షాక్ కొట్టేవి. 10గ్రాములు కొనాలంటే తరుగుతో కలిపి రూ.80 వేలు అయ్యేది. వారం కిందట ధరలు భారీగా తగ్గాయని తెలిసింది. మా అమ్మ నగలు కొందాం, మళ్లీ పెరుగుతాయంట అని చెప్పడంతో కొనుగోలు చేసేందుకు వచ్చాం. ధరలు తగ్గడంతో తులంపై రూ.5 వేల నుంచి 6 వేల దాకా ఆదా అవుతోంది. – అఖిల, కర్నూలు ధరలు తగ్గాయని కొనేందుకు వచ్చా.. బంగారం ధర తగ్గడమన్నది శుభావార్తే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్య, మధ్య తరగతి వారికి వెసులు బాటు లభించినట్టే. ధరలు తగ్గాయని తెలియగానే మళ్లీ పెరుగుతాయేమోనన్న ఆందోళనతోనే కొనేందుకు వచ్చాం. మా నాన్న గిఫ్ట్గా గోల్డ్ ఇప్పిస్తున్నారు. అయితే ధరలు ఇంకా తగ్గాలి. సామాన్యులకు మరింత అందుబాటులోకి రావాలి. – డాక్టర్ దివ్య, పీజీ విద్యార్థి, విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్ -
తక్షణం తగ్గినా.. భవిత ‘బంగారమే’!
పుత్తడిపై కస్టమ్స్ సుంకాలు 15% నుంచి 6%కి తగ్గిస్తున్నట్లు వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వెంటనే ఇటు స్పాట్లో అటు ఫ్యూచర్స్ మార్కెట్లలో రూ.4,000 వరకూ పడిపోయిన పసిడి ధరలు.. ఇదే రీతిలో ముందు ముందు ఆభరణ ప్రియులకు అంతే సంతోషాన్ని కలిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయంగా రూపాయి విలువ పతనం ఇందుకు కారణం.→ భౌగోళిక ఉద్రిక్తతలను మొదట ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, దీనికి పశ్చిమ దేశాల మద్దతు అలాగే చైనాతో అమెరికాకు ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితికి దారితీసే అంశాలు. ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొన్నా.. పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ బంగారం వైపే చూస్తాడనడంలో సందేహం లేదు. → ఇక రెండో అంశానికి వస్తే.. అమెరికాతో సహా పలు దేశాలు సరళతర వడ్డీరేట్ల విధానంలోకి మారినప్పటికీ ఆ విధానాన్ని ఎంతవరకూ కొనసాగిస్తాయో తెలియని పరిస్థితి. సరళతర వడ్డీరేట్ల విధానంతో బంగారంలో కొనుగోళ్లు పెరుగుతాయి. అయితే ఈ విధానం కొనసాగింపునకు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. → కీలక మూడవ అంశం.. రూపాయి విలువ. డాలరుతో రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ట స్థాయి రికార్డులను కొనసాగిస్తోంది. బుధవారం ఆల్టైమ్ కనిష్టం 83.71 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 83.72 కనిష్టాన్ని తాకింది. → భౌగోళిక ఆర్థిక అనిశ్చితి అంశాల నేపథ్యంలో... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చ ంజ్లో ఈ నెల 16వ తేదీన ఔన్స్ కు (31.1గ్రా) ఆల్టైమ్ హై 2,489 డాలర్లను తాకిన పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ధర అటు పై కొంత తగ్గినప్పటికీ... పటిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. అంతర్జాతీయ ఫ్యూ చర్స్లో 18 డాలర్లు అధికంగా 2,425 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్లో రూపాయి క్షీణిస్తూ... అంతర్జాతీయంగా ధర పెరుగుదల ధోరణే కొనసాగిస్తే దేశీయంగా సైతం బంగారం మున్ముందుకే సాగుతుందనడంలో సందేహం లేదు. పెట్టుబడులకు ప్లస్సే... దేశీయంగా శుభకార్యాల్లో భారతీయులు పసిడి కొనుగోళ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిన అంశమే. ఇది ఎలాగూ తప్పని అంశం. ఇక పసిడి పెట్టుబడులకు ఇది తగిన అవకాశమనడంలో సందేహం లేదు. వినియోగదారులకు ధరల తగ్గుదల ఇప్పుడు ప్రయోజనకరంగా ఎలానూ ఉంటుంది. తక్కువ ఖర్చులు అలాగే 2.5% వార్షిక వడ్డీని అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డిజిటల్ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమ యం అనడంలో సందేహం లేదు.దేశీయంగా రెండోరోజూ భారీ తగ్గుదల బడ్జెట్లో నిర్ణయంతో దేశీయంగా రెండవరోజూ బుధవారమూ దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధానిలో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు రూ.650 తగ్గి, రూ. 71,650కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇంతే స్థాయిలో దిగివచ్చి రూ. 71,300కు దిగివచి్చంది. ఇక మంగళవారం రూ.4 వేల వరకూ తగ్గిన వెండి ధర బుధవారం అక్కడక్కడే 87,500 వద్ద ముగిసింది. దేశ రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు వరుసగా రూ. 451, రూ.449 తగ్గి రూ.69,151, రూ.68,874కు దిగివచ్చాయి. వెండి ధర రూ.57 తగ్గి రూ.84,862 వద్ద ముగిసింది. -
పెరిగిన బంగారం, వెండి ధర.. ఎంతంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో గురువారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67,300 (22 క్యారెట్స్), రూ.73,420 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,850 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.74,020 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.67,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.73,570 వద్దకు చేరింది. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.1,000 పెరిగి రూ.1,00,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
తగ్గేదేలే అంటున్న బంగారం, వెండి.. నేటి కొత్త ధరలు ఇవే
జులై ప్రారంభం నుంచి పెరుగుతూ ఉన్న పసిడి ధరలు అస్సలు తగ్గేదెలా అన్నట్టు దూసుకెల్తూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ధరల్లో ఎటువంటి తగ్గుదల కనిపించలేదు. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు (జులై 7) కూడా కొనసాగుతాయి. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67650 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73800 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67800 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73950 వద్ద ఉంది.హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68200.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74400 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా ఈ రోజు స్థిరంగానే ఉన్నాయి. దీంతో నేడు (జులై 7) కేజీ వెండి ధర రూ. 94800 వద్ద ఉంది. అయితే వెండి ధర కూడా ఈ నెల ప్రారంభం నుంచి ఏ మాత్రం తగ్గలేదు. కాబట్టి వెండి దాదాపు ఒక లక్షలు చేరువవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
Gold Scam: క్యారెట్లలో కిరికిరి.. కొనేదంతా బంగారం కాదు!
హైదరాబాద్లోని శ్రీనగర్కాలనీకి చెందిన ఒక మహిళ తన బంగారు ఆభరణాన్ని కరిగించి మరో ఆభరణం తయారు చేయించుకునేందుకు స్వర్ణకారుడి వద్దకు వెళ్లింది. ఆభరణాన్ని పరిశీలించగా అందులో 70 శాతానికి మించి బంగారం లేదు. హాల్మార్క్ సెంటర్కు పంపి పరిశీలిస్తే ఆభరణంలో రాగి 16.47 శాతం, వెండి 15.23 శాతం ఉండగా బంగారం 68.12 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. గతంలో ఆ ఆభరణాన్ని విక్రయించిన వ్యాపారి ఇచ్చిన రసీదు అందుబాటులో లేకపోవడంతో ప్రశ్నించే అవకాశం లేకుండాపోయింది.బంగారంపై మహిళలకుండే మక్కువ అంతా ఇంతా కాదు. బంగారంతో చేసిన ఆభరణాలపై ఉండే క్రేజే వేరు. ధనం లేకున్నా, తులం బంగారం అయినా ఒంటి మీద ఉండాలని సగటు మధ్య తరగతి మహిళలు భావిస్తుంటారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు వీలైనప్పుడల్లా బంగారు ఆభరణాలు కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో కొత్త బంగారు ఆభరణాలు కొనేవారి సంఖ్య, అన్సీజన్లో పాత బంగారంతో కొత్త ఆభరణాలు చేయించేకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికంగా ఉంటోంది. గతంలో పెళ్లినాడు ఏ నగలైతే పెట్టుకునేవాళ్లో వాటినే భద్రంగా కాపాడుకుంటూ శుభకార్యాల్లో ధరించేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్ మారింది.పాత నగలను ఫ్యాషన్కు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొనేటప్పుడు ఆ ఆభరణాన్ని మొత్తం బంగారం కిందే లెక్కించి వ్యాపారి డబ్బులు వసూలు చేస్తాడు. అదే కొంత కాలం తర్వాత కొన్న బంగారాన్ని కరిగించి మరో ఆభరణం తయారీ కోసమో, ఆర్థిక అవసరాల కోసం అమ్మడానికో వెళితే అసలు రంగు బయటపడుతుంది. క్యారెట్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత తక్కువుందనో, వేస్టేజీ ఎక్కువుందనో పేర్కొంటూ వీలైనంత తక్కువ చెల్లించడం సర్వసాధారణం. ఇక వజ్రా భరణాల్లో మేలిమి బంగారం నేతి బీరలో నెయ్యి చందంగానే మారింది. కళ్ల ముందే బంగారం స్వచ్ఛతలో మాయ చేస్తున్నా నాణ్యత గుర్తించలేక వినియోగదారులు నష్టపోతున్నారు. సాక్షి హైదరాబాద్మోసం ఇలా..ప్రముఖ జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నుంచి చిన్నపాటి స్వర్ణకారుడి షాపు వరకు కూడా 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్నే విక్రయిస్తుంటాయి. ఆభరణంలో పటుత్వం కోసం రాగి కలుపుతారు. సాధారణంగా ఆభరణాలన్నీ 22 క్యారెట్లు లేదా కొంచెం తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్తోనే ఉంటుంది. అయితే వ్యాపారులు 18 క్యారెట్ల అభరణాన్ని చేతిలో పెట్టి 22 క్యారెట్ల బిల్లు వసూలు చేయడం సర్వసాధరణంగా మారిపోయింది. 22 క్యారెట్లు 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 వరకు వ్యత్యాసం ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ.10 వేల వరకు వినియోగదారులు మోసపోతున్నారన్నమాట.హాల్మార్క్ ముద్ర తప్పనిసరివంద శాతం స్వచ్ఛతతో కూడిన మేలిమి బంగారం బిస్కెట్ రూపంలో ఉంటుంది. కాగా బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను హాల్ మార్క్ ముద్ర తెలియజేస్తుంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) నిబంధన మేరకు బంగారం ఉంటేనే సదరు ఆభరణంపై హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 అని ముద్ర ఉంటుంది. ఈ నంబర్ తర్వాత హాల్ మార్క్ వేసిన సెంటర్ మార్క్ ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లిష్ అక్షరం కోడ్ రూపంలో ఉంటుంది. చివరిలో బీఐఎస్ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. ఈ హాల్మార్క్ ముద్ర లేని ఆభరణాల కొనుగోలులోనే మోసాలకు అవకాశం ఉంటుంది.స్వచ్ఛత...క్యారెట్లలోబంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. ఇది 0 నుంచి 24 వరకు ఉంటుంది. క్యారెట్ విలువ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛత లేదా నాణ్యత కలిగి ఉన్నట్టన్న మాట. ధర కూడా ఆ మేరకే ఉంటుంది. బంగారం ఎంతో సున్నితంగా పెళుసు స్వభావంతో కూడిన లోహం. కాబట్టే ఆభరణాల తయారీలో అది గట్టిగా ఉండేందుకు రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలుపుతారు. బంగారం, ఇతర లోహాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయనేది క్యారెట్ ద్వారా తెలుస్తోంది. అయితే వాస్తవ నిష్పత్తి, క్యారెట్ల మధ్య తేడాలు.. వ్యాపారులు, ఎప్పుడూ బంగారం కొనుగోళ్లలో మునిగి తేలేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది.ఆభరణంలో బంగారమెంత?కొనుగోలు చేసే బంగారు ఆభరణాలలో ఎంత బంగారం ఉందో క్యారెట్ లెక్క ద్వారా తెలుసు కోవచ్చు. ఉదాహరణకు 14 క్యారెట్ల ఉంగరాన్ని కొనుగోలు చేశారనుకోండి.. బంగారం స్వచ్ఛతను 0 నుండి 24 స్కేల్లో కొలుస్తారు కాబట్టి, 14ని 24తో భాగించాలి. అప్పుడు 0.583 వస్తుంది. అంటే మీ 14 క్యారెట్ల బంగారు ఉంగరంలో 58.3% బంగారం ఉందన్న మాట. అదేవిధంగా బంగారం స్వచ్ఛతను ఫైన్నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండి, 24 క్యారెట్లతో పోల్చుకుంటే కొంత ముదురు రంగులో ఉంటుంది. ఇలా ఇతర లోహాల పరిమాణం పెరిగేకొద్దీ రంగు తేలిపోతుంటుంది. బంగారం తెల్లగా ఉందంటే నికెల్ ఎక్కువగా ఉందన్నమాట. క్యారెట్లు..రకాలు24 క్యారెట్లు: పూర్తి స్థాయి స్వచ్ఛత/నాణ్యత కలిగిన బంగారం. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. అందుకే 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే ఖరీదు ఎక్కువ. ఖరీదెక్కువ, ఆభరణానికి పనికిరాదు.. మరెందుకు ఇది అంటే బంగారంలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎక్కువగా ఉపయోగ పడుతుంది. కొంతమంది 24 క్యారెట్ల బంగారం (బిస్కెట్) కొని ఆభరణాలు చేయించుకుంటుంటారు.22 క్యారెట్లు: ఇందులో 22 వంతులు బంగారం ఉంటే రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి లోహాలు ఉంటాయి అంటే 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయన్న మాట. ముందే చెప్పుకున్నట్లు 24 క్యారెట్ల బంగారం కంటే దీనికి మన్నిక ఎక్కువ. కాబట్టే ఆభరణాల తయారీకి ఇది అనువైనది. సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. దీనినే 916 కేడీఎం గోల్డ్ లేదా 91.6 కేడీయం గోల్డ్ అని కూడా అంటారు. 18 క్యారెట్లు: ఇందులో 18 భాగాలు పసిడి ఉంటే.. ఆరు భాగాలు ఇతర మెటల్స్ ఉంటాయి. మొత్తం మీద 75 శాతం బంగారం , 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత మన్నికగా ఉంటుంది. తక్కువ ఖర్చు అవుతుందని చాలామంది ఈ ఆభరణాలు కొంటుంటారు.14 క్యారెట్లు: ఇందులో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర చాలా తక్కువ. ఇక 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. టంచ్ మిషన్లతో ‘పంచ్’నగ నచ్చకనో, పాతబడిందనో, కొత్త మోడల్ మార్కెట్లోకి రావడంతో మార్చుకుందామనో జ్యువెలరీ దుకాణదారుని దగ్గరకు వెళతాం. అప్పుడు పాత నగను కరిగించడం ద్వారా దాంట్లో బంగారం శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి టంచ్ మిషన్లో పరిశీలిస్తారు. మిషన్లో ముందే సవరించిన రీడింగ్తో బంగారం శాతాన్ని నిర్ధారణ చేస్తారు. సాధారణంగా పాత నగలో ఉన్న బంగారం శాతం కంటే 5 నుంచి 10 శాతం తక్కువగా నిర్ధారణ చేస్తుంటారు. ఇది టంచ్ మిషన్లతో జరుగుతున్న మోసం. వాస్తవానికి బంగారం నాణ్యతను, పాత బంగారంలో బంగారం శాతాన్ని నిర్ణయించేందుకు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) సంస్థ ద్వారా అనుమతి పొందిన లైసెన్స్దారుడి దగ్గరే నిర్ధారణ చేయాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్స్–రే ఫ్లోరోసెన్స్ మిషన్ (కంప్యూటర్ అనుసంధాన యంత్రాల టంచ్ మిష¯Œన్)తో బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తున్నారు. అధికారిక కాగితంపై కాకుండా సాధారణ పేపర్పైనే ప్యూరిటీ పర్సంటేజీలను వేస్తున్నారు.బంగారు పూతనే వన్ గ్రామ్వన్ గ్రామ్ గోల్డ్ పేరుతో ఆభరణాల విక్రయం ఎక్కువ జరగడం అందరికీ తెలిసిందే. ఎంతో వ్యయం చేసి ఆభరణాలు కొనేకన్నా.. పెళ్ళిళ్లు ఇతర వేడుకల్లో ఒరిజినల్ బంగారాన్ని తలదన్నేలా కన్పించే ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు ఇటీవలి కాలంలో గిరాకీ పెరిగింది. వెండి, రాగితో చేసిన ఆభరణాలకు బంగారం పూత పూసి వీటిని తయారు చేస్తారు. అందుకే వీటిని వ¯Œన్ గ్రామ్ గోల్డ్గా వ్యవహరిస్తుంటారు. ఇమిటేషన్ (నకిలీ)జ్యువెలరీ కంటే వ¯Œన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఎక్కువ కాలం రంగు పోకుండా ఉంటాయి. అంతేకానీ ఈ ఆభరణాల్లో ఒక గ్రాము బంగారాన్ని వినియోగిస్తారని కాదు. బంగారం స్వచ్ఛత ఇలా..క్యారెట్ స్వచ్ఛత24 క్యారెట్ 99.923 క్యారెట్ 95.822 క్యారెట్ 91.621 క్యారెట్ 87.518 క్యారెట్ 75.014 క్యారెట్ 58.3బంగారం నాణ్యత పరిశీలన తప్పనిసరిబంగారం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతపై అవగాహన అవసరం. నాణ్యత పరిశీలన తప్పనిసరి. చాలవరకు జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నాణ్యతను తెలియజేసే క్యారెక్టరైజేష¯Œన్ మిషన్ వినియోగించడం లేదు. ప్రభుత్వ పరంగా తనిఖీలు నిర్వహించే సంబంధిత అధికారుల వద్ద కూడా నాణ్యతను పరిశీలించే మిషన్లు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్లు సరఫరా చేస్తే తనిఖీలతో వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు వినియోగదారులు చెల్లించే సొమ్ముకు తగిన నాణ్యతతో కూడిన బంగారం లభించే అవకాశం ఉంటుంది.వినియోదారుడు కూడ బంగారం నాణ్యతను అడిగాలి. అనుమానం ఉంటే నాణ్యతను పరీక్షించుకోవాలి. హాల్మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే ఆభరణం కొనుగోలు చేయాలి. హాల్మార్క్ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ. ఒక్కో ఆభరణాన్ని పరీక్షించి, హాల్ మార్క్ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.– భాస్కర్ కూచన, రిటైర్డ్ అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ, హైదరాబాద్ -
నేడు తులం బంగారం కొనాలంటే ఎంత కావాలంటే..
పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు రెండురోజులుగా పెరుగుతుండగా ఈరోజు (జూన్ 30) ధరల్లో ఎలాంటి మార్పులేదు.ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతోపాటు అంతర్జాతీయ బంగారం రేట్లపైనా దేశంలో బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి.ఇరు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.66,250, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద కొనసాగుతన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,400, 24 క్యారెట్ల బంగారం రూ.72,420 లుగా ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,250, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,850, 24 క్యారెట్ల బంగారం రూ.72,930 లుగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,250 లుగా, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం ఆగదా? మళ్లీ ఎంత పెరిగిందంటే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి. క్రితం రోజున ప్రారంభమైన పెరుగుదల కొనసాగింది. ఈరోజు (జూన్ 29) పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. పెరుగుతున్న ధరలు బంగారం కొనుగోలుదారులను నిరాశకు గురిచేస్తున్నాయి.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర స్వల్పంగా రూ.100 పెరిగి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి రూ.120 పెరిగి రూ. 72,280 వద్దకు చేరింది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.100 జంప్ అయి రూ.66,400 లను, 24 క్యారెట్ల బంగారం రూ.120 ఎగిసి రూ.72,420 లను తాకింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.100 పెరిగి రూ.66,250 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.120 పెరిగి రూ. 72,280 లకు చేరింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.190 పెరిగి రూ.66,850 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.210 ఎగిసి రూ.72,930 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.66,250 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.120 పెరిగి రూ. 72,280 లకు ఎగిసింది.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరలు మూడో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా మూడు రోజుల క్రితం వెండి ధర కేజీకి రూ.1000 తగ్గింది. కాగా ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఒక్కసారిగా ఎగిసిన బంగారం.. తులం ఎంతంటే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (జూన్ 28) ఒక్కసారిగా ఎగిశాయి. వారం రోజులుగా బంగారం కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగించింది. వరుస తగ్గింపులతో ఉత్సాహాన్ని నింపింది. శుక్రవారం ఉన్నంటుండి భారీగా పెరిగింది.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.400 ఎగిసిరూ.66,150 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా రూ.430 పెరిగి రూ. 72,160 లకు ఎగిసింది.ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.400 జంప్ అయి రూ.65,900 లను, 24 క్యారెట్ల బంగారం రూ.450 ఎగిసి రూ.72,330 లను తాకింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.400 పెరిగి రూ.66,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 పెరిగి రూ. 72,160 లకు చేరింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.410 పెరిగి రూ.66,250 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.440 ఎగిసి రూ.72,720 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.66,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 పెరిగి రూ. 72,160 లకు ఎగిసింది.స్థిరంగా వెండిదేశవ్యాప్తంగా వెండి ధరలు రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా రెండు రోజుల క్రితం వెండి ధర కేజీకి రూ.1000 తగ్గింది. కాగా ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారమే.. ఆనందమే!! వరుస తగ్గింపులతో ఉత్సాహం
దేశవ్యాప్తంగా వారం రోజులుగా బంగారం కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగిస్తోంది. వరుస తగ్గింపులతో ఉత్సాహాన్ని నింపుతోంది. నిన్నటి రోజున మోస్తరుగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు (జూన్ 27) కూడా దిగివచ్చాయి. ఈ వారం రోజుల్లో బంగారం సుమారు రూ.1500 మేర తగ్గింది.తెలుగు రాష్ట్రాల్లో ధరలుహైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.250 తగ్గి రూ.65,750 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా రూ.270 క్షీణించింది. దీంతో తులం మేలిమి బంగారం రూ. 71,730 లకు తగ్గింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.65,900 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 క్షీణించి రూ.71,880 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.250 తగ్గి రూ.65,750 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 క్షీణించి రూ. 71,730 లకు దిగొచ్చింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.350 తగ్గి రూ.66,250 లకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.380 దిగొచ్చి రూ.72,280 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.65,750 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.270 క్షీణించి రూ. 71,730 లకు తగ్గింది.వెండి కూడా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల్లో సుమారు రూ.4000 దాకా తగ్గింది. కాగా ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
దిగొచ్చిన బంగారం, వెండి!! ఎంత తగ్గాయంటే..
దేశవ్యాప్తంగా గత ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి రోజున స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు బుధవారం (జూన్ 26) కాస్త దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు ఉపశమనం లభించినట్లయింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.250 తగ్గి రూ.66,000 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా రూ.230 క్షీణించింది. దీంతో తులం మేలిమి బంగారం రూ. 72,000 లకు తగ్గింది.దేశంలోని ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.66,150 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.230 క్షీణించి రూ.72,150 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.250 తగ్గి రూ.66,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.230 క్షీణించి రూ. 72,000 లకు దిగొచ్చింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.200 తగ్గి రూ.66,600 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.220 దిగొచ్చి రూ.72,660 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.66,000 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.230 క్షీణించి రూ. 72,000 లకు తగ్గింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా బుధవారం తగ్గాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.94,500లకు క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడి కొనుగోలుదారులకు ఊరట..
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల క్రితం భారీగా తగ్గిన బంగారం ధరలు నిన్నటి రోజున స్థిరంగా కొనసాగాయి. ఈరోజు (జూన్ 24) పసిడి ధరలు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర ఈరోజు రూ.100 తగ్గి రూ.66,250 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు తగ్గింది.దేశంలోని ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,400 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.150 క్షీణించి రూ.73,380 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.100 తగ్గి రూ.66,250 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు దిగొచ్చింది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు తగ్గింది.చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.50 పెరిగి రూ.67,000 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.60 పెరిగి రూ.73,100 లకు చేరింది.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 చొప్పున తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,200లకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం, వెండి తగ్గిందా.. పెరిగిందా? నేటి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖంలో ఉన్నాయి. క్రితం రోజున రూ.800 మేర తగ్గిన పసిడి ధరలు ఈరోజు (జూన్ 23) స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో మళ్లీ పెరగక ముందే బంగారం కొనాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ధరలుహైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.66,350 లగా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 లుగా ఉంది.ఇతర నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,500, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.73,400 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,350, అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 లుగా కొనసాగుతోంది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,350 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 వద్ద కొనుసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.66,950 లుగా, 24 క్యారెట్ల బంగారం రూ.73,970 లుగా ఉంది.వెండి రేటు ఇలా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరల్లో కూడా ఈరోజు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.96,500 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
హమ్మయ్య.. బంగారం, వెండిపై భారీ శుభవార్త!
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నేడు హమ్మయ్య అనిపించాయి. రెండు రోజులుగా పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు శాంతించాయి. క్రితం రోజున రూ.800 మేర పెరిగిన పసిడి ధరలు ఈరోజు (జూన్ 22) అదే స్థాయిలో దిగివచ్చాయి.తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు తగ్గింది.ఇతర నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.800 తగ్గి రూ.66,500 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.870 క్షీణించి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు దిగొచ్చింది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.850 తగ్గి రూ.66,950 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.930 తగ్గి రూ.73,970 లకు క్షీణించింది.భారీగా దిగొచ్చిన వెండిదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా తగ్గాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి గణనీయంగా రూ.2000 చొప్పున పతనమైంది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500లకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
వామ్మో బంగారం, వెండి.. ఏకంగా నాలుగు రెట్లు!
బంగారం, వెండి ధరలు మళ్లీ మోత మోగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా క్రితం రోజున రూ.200 మేర పెరిగిన పసిడి ధరలు ఈరోజు (జూన్ 21) ఏకంగా దానికి నాలుగు రెట్లు పెరిగి కొనుగోలుదారులను భయపెడుతున్నాయి.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.750 పెరిగింది. దీంతో రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.810 ఎగిసి రూ. 73,250 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.750 పెరిగి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.810 ఎగిసి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.750 పెరగడంతో రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి కూడా రూ.810 ఎగిసి రూ. 73,250 లకు పెరిగింది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.750 పెరగడంతో రూ.67,150 లకు చేరింది. 24 క్యారెట్ల పసిడి రూ.810 ఎగిసి రూ. 73,250 లను తాకింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.67,800 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.960 పెరిగి రూ.73,970 లకు ఎగిసింది.భారీగా ఎగిసిన వెండిదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా ఎగిశాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1400 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.98,500లను చేరుకుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
కొనుగోలుదారులకు నిరాశ.. బంగారం, వెండి మళ్లీ..
దేశవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుదల వైపు పయనించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (జూన్ 20) స్పల్పంగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగింది. ఇది ప్రస్తుతం రూ.66,400 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.220 పెరిగి రూ. 72,440 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ధరలుదేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.66,550 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.220 ఎగిసి రూ.72,590 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.200 పెరిగి రూ.66,400లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.220 పెరిగి రూ.72,440 లకు చేరుకుంది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.66,400 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.72,440 లకు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40 పెరిగి రూ.67,000లకు చేరింది. 24 క్యారెట్ల పసిడి మాత్రం రూ.40 తగ్గి రూ.73,010 లకు దిగొచ్చింది.భారీగా పెరిగిన వెండిదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,100లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
వెండి గుడ్న్యూస్.. మరి బంగారం?
దేశవ్యాప్తంగా రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు (జూన్ 19) స్థిరంగా కొనసాగాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలపై బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,200 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది.ఇతర నగరాల్లో..» ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,350 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.72,370 వద్ద ఉన్నాయి.» ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,200 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది.» చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.66,960 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.10 ఎగిసి రూ.73,050 వద్దకు చేరింది. » బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,200 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది.వెండి తగ్గుముఖందేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు క్షీణించాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఈరోజు మోస్తరుగా రూ.400 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రేటు రూ.95,600 వద్దకు దిగొచ్చింది. క్రితం రోజున ఇది రూ.96,000 లుగా ఉండేది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పెరిగిన బంగారం, వెండి ధర.. ఎంతంటే..?
ఈక్విటీమార్కెట్లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,150 (22 క్యారెట్స్), రూ.72,160 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.300, రూ.320 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.66,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.72,870 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,300.. 24 క్యారెట్ల ధర రూ.72,310కు చేరాయి. మార్కెట్లో కేజీ వెండి ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.95,800కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పడిలేసిన పసిడి.. మళ్ళీ తగ్గిన వెండి - కొత్త ధరలు ఇవే..
జూన్ 8న భారీగా తగ్గిన పసిడి ధరలు ఈ రోజు (జూన్ 11) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..విజయవాడ, హైదరాబాద్లలో 10 గ్రాముల బంగారం ధరలు రూ.65850 (22 క్యారెట్స్), రూ.71840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 170 తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66000 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71990 వద్ద ఉంది. ఈ ధరలు నిన్నటి కంటే రూ. 150, రూ. 170 ఎక్కువ.ఇక చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 150, రూ. 170 తగ్గి.. రూ. 66450 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 72490 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద నిలిచాయి. ధరలు తగ్గినప్పటికీ.. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం తగ్గు ముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 11) ఒక కేజీ వెండి ధర రూ. 90500 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు ఏకంగా రూ. 1200 తగ్గింది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా?
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (జూన్ 9) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున ఏకంగా రూ.2000లకు పైగా దిగొచ్చిన తులం బంగారం ఈరోజు పెరగకుండా స్థిరంగా కొనసాగడంతో కొనుగోలుదారులకు ఊరట లభించినట్లయింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.65,700 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ. 71,670 వద్ద కొసాగుతున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.71,820 వద్ద ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,700లుగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.71,670 లుగా ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,500 వద్ద 24 క్యారెట్ల పసిడి రూ.72,550 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.65,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,670 వద్ద ఉంది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో క్రితం రోజున వెండి ధర కేజీకి అత్యంత భారీగా రూ.4500 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పెరిగిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..?
ఈక్విటీమార్కెట్లు మంగళవారం భారీగా పడిపోయాయి. దాంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. స్థిరప్రభుత్వం ఏర్పడదేమోననే భయాలు మార్కెట్లను కుంగదీశాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీమార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు బంగారం ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,800 (22 క్యారెట్స్), రూ.72,870 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.700, రూ.760 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.790, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.860 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,450 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,580 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,950.. 24 క్యారెట్ల ధర రూ.73,020కు చేరాయి. మార్కెట్లో కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగి రూ.98,500కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం, వెండి కొనచ్చా.. ధరలు ఎలా ఉన్నాయంటే..?
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు (జూన్ 2) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున తులం బంగారం రూ.210, వెండి కేజీకి ఏకంగా రూ.2000 తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగడంతో మరింత ఉపశమనం లభించినట్లయింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.66,500 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ. 72,550 వద్ద కొసాగుతున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,650, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.72,700 వద్ద ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,500లుగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.72,550 లుగా ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,100 వద్ద 24 క్యారెట్ల పసిడి రూ.73,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,550 వద్ద ఉంది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో క్రితం రోజున వెండి ధర కేజీకి రూ.2000 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.98,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
తగ్గిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..?
ఈక్విటీమార్కెట్లు ఇటీవల భారీగా పడిపోయాయి. దాంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. శుక్రవారం మార్కెట్లో స్టాక్సూచీలు తీవ్రఒడిదుడుకులతో చివరకు స్వల్పలాభాలతో ముగిశాయి. దాంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,500 (22 క్యారెట్స్), రూ.72,550 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.200, రూ.210 తగ్గింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,200 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,650.. 24 క్యారెట్ల ధర రూ.72,700కు చేరాయి. మార్కెట్లో శనివారం కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
దిగివచ్చిన బంగారం, వెండి!
బంగారం కొనుగోలుదారులకు దాదాపు రోజుల తర్వాత భారీ శుభవార్త ఇది. గత ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (మే 30) భారీగా తగ్గాయి. 10 గ్రాములు (తులం) బంగారం రూ.440 మేర తగ్గి పసిడి ప్రియులకు భారీ ఊరట కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో..రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు తగ్గింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,850 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.440 తగ్గి రూ.72,910 వద్దకు క్షీణించింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు దిగొచ్చింది.చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 తగ్గి రూ.67,300 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.490 దిగొచ్చి రూ.73,420 వద్దకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు దిగొచ్చింది.వెండి ధరదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఈరోజు భారీగా రూ.1200 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,01,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పడిలేసిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి: నేటి కొత్త ధరలు ఇలా..
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ రోజు (మే 28) పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో తులం గోల్డ్ రేటు మునుపటి కంటే రూ.200 పెరిగింది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66850 (22 క్యారెట్స్), రూ.72930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది.చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 200 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 220 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 67400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 73530 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 67000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 73080 రూపాయలకు చేరింది. నిన్న రూ. 250 నుంచి రూ. 270 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు రూ. 200 , రూ. 220 వరకు పెరిగాయి.వెండి ధరలుబంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి, కానీ వెండి ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఈ రోజు (మే 29) వెండి ధర రూ. 3500 పెరిగి రూ. 96500 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో వెండి ధరలు ఏకంగా ఒక లక్షకు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
తగ్గుముఖం పట్టిన బంగారం మళ్లీ ఇలా..
దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 27) స్వల్పంగా పెరిగాయి. వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు కాస్త ఎగిశాయి. తులం బంగారం (10 గ్రాములు) రూ.710 మేర పెరిగి పసిడి కొనుగోలుదారుల్లో మళ్లీ ఆందోళనలు పెంచుతోంది.తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,650 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.270 ఎగిసి రూ. 72,710 లను తాకింది.ఇతర నగరాల్లో.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,800 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 పెరిగి రూ.72,860 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,650లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ.72,710లకు ఎగిసింది.ఇక చెన్నైలో పసిడి ధరలు అత్యధికంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.650 పెరిగి రూ.67,200 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.710 పెరిగి రూ.73,310 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,650 వద్దకు తగ్గగా 24 క్యారెట్ల బంగారం రూ.270 ఎగిసి రూ.72,710 వద్దకు చేరింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు (మే 27) వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్లో ఈరోజు కేజీ వెండి ధర రూ.1,500 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,500లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
చాన్నాళ్లకు.. బంగారం కొనుగోలుదారులకు బిగ్ న్యూస్!
బంగారం కొనుగోలుదారులకు చాలా రోజుల తర్వాత భారీ శుభవార్త ఇది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (మే 23) భారీగా తగ్గాయి. తులం (10 గ్రాములు) బంగారం రూ.1200 మేర తగ్గి పసిడి ప్రియులకు భారీ ఉపశమనం కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.1000 తగ్గి రూ.67,300 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 క్షీణించి రూ. 73,420 వద్దకు తగ్గింది.ఇతర నగరాల్లో..» ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.67,450 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 తగ్గి రూ.73,570 వద్దకు క్షీణించింది. » ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.1090 క్షీణించి రూ. 73,420 వద్దకు దిగొచ్చింది.» చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1100 తగ్గి రూ.67,500 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.1200 దిగొచ్చి రూ.73,640 వద్దకు చేరింది. » బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.1090 క్షీణించి రూ. 73,420 వద్దకు దిగొచ్చింది.రూ.లక్ష దిగువకు వెండిదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. హైదరాబాద్లో రూ. లక్ష దాటిన కేజీ వెండి ధర ఈరోజు భారీ స్థాయిలో రూ.3300 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పట్టు చీరల ధరలు
కాంచీపురం పట్టు చీరలు పెళ్లిళ్లకు ప్రసిద్ధి. పెళ్లి కోసం కొనుగోలు చేసేవాటిలో బంగారం తర్వాత పట్టు చీరలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఆకాశమే హద్దుగా రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలు కాంచీపురం పట్టు చీరల ధరలపైనా ప్రభావం చూపిస్తున్నాయి.బంగారం, పట్టు చీరల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మొత్తంగా పెళ్లిళ్ల బడ్జెట్పై భారం పడుతోంది. గత ఎనిమిది నెలల్లో కాంచీపురం పట్టు చీరల ధరలు 50 శాతం పెరిగాయి. దీంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు తక్కువ స్థాయిలో ఉన్న లేదా పూర్తిగా లేని చీరలను చాలా మంది కస్టమర్లు ఎంచుకుంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.క్షీణించిన విక్రయాలుధరల పెరుగుదల కారణంగా ఈ పెళ్లిళ్ల సీజన్లో విక్రయాలు 20 శాతం క్షీణించినట్లు కాంచీపురం పట్టు చీరల అమ్మకానికి పేరుగాంచిన రీటైల్ టెక్స్టైల్ చైన్ ఆర్ఎంకేవీ పేర్కొంటోంది. తక్కువ సమయంలో 35 శాతం నుంచి 40 శాతం వరకు పట్టు చీరల ధరలు పెరగడం ఇదే మొదటిసారి అని ఆర్ఎంకేవీ మేనేజింగ్ డైరెక్టర్ శివకుమార్ చెబుతున్నారు.22 క్యారెట్ల బంగారం ధర 2023 అక్టోబర్ 1న గ్రాముకు రూ. 5,356 ఉండగా 2024 మే 21 నాటికి అది రూ. 6,900 లకు పెరిగింది. అదే సమయంలో వెండి ధరలు గ్రాముకు రూ. 75.5 నుంచి రూ.101 కి పెరిగాయి. రూ. 10,000 కోట్ల విలువైన కాంచీపురం పట్టు చీరల పరిశ్రమ దీని ద్వారా గణనీయంగా ప్రభావితమైంది.50 శాతం పెరిగిన ధరలుకాంచీపురం పట్టు చీరల తయారీదారుల సంఘానికి చెందిన దామోధరన్ ప్రకారం.. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే మధ్య ఈ చీరల ధరలు 40 నుంచి 50 శాతం పెరిగాయి. కాంచీపురం పట్టు చీర ధర ప్రధానంగా బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బంగారం, వెండితో తయారు చేసిన జరీని ఈ చీరల తయారీలో ఉపయోగిస్తారు. పురాతమైన కాంచీపురం చీరలకు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కూడా ఉంది. ఒక్కో చీర ధర రూ.20 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. -
ఇరాన్ అధ్యక్షుడి మృతి.. ఎగిసిన చమురు, బంగారం ధరలు!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్తలు వెలువడిన వెంటనే చమురు ఎక్కువ ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి మధ్య బంగారం ఆల్-టైమ్ హైని తాకింది. ముడి చమురు ధరలు పెరిగిపోయాయి.బంగారం ధరలపై ప్రభావంఇరాన్ అధ్యక్షుడి మరణ వార్తల తర్వాత సోమవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ అనిశ్చితుల మధ్య సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. 0811 జీఎంటీ అంటే భారతీయ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:41 గంటల సమయానికి స్పాట్ బంగారం ఔన్సు ధర 1 శాతం పెరిగి 2,438.44 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో రికార్డు గరిష్ట స్థాయి 2,449.89 డాలర్లను తాకింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి 2,442.60 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా 11 సంవత్సరాల కంటే ఎక్కువ గరిష్ట స్థాయికి చేరుకుంది.ముడి చమురు ధరలుఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ క్రాష్ నివేదికలు వచ్చిన వెంటనే ప్రధాన చమరు ఉత్పత్తి దేశాలలో రాజకీయ అనిశ్చితి మధ్య అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం లాభాలను పొడిగించాయి. ఆరోగ్యంతో సమస్యల కారణంగా సౌదీ అరేబియా యువరాజు జపాన్ పర్యటనను రద్దు చేసుకోవడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమైనట్లుగా తెలుస్తోంది.భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:02 గంటల సమయానికి బ్రెంట్ బ్యారెల్కు 41 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 84.39 డాలర్లకు చేరుకుంది, అంతకుముందు 84.43 డాలర్లకి పెరిగింది. మే 10వ తేదీ తర్వాత ఇదే అత్యధికం. -
హడలెత్తించిన బంగారం, వెండి ధరలు నేడు ఇలా..
దేశవ్యాప్తంగా హడలెత్తించిన బంగారం, వెండి ధరలు ఈరోజు (మే 19) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున తులం బంగారం రూ.880, వెండి కేజీకి ఏకంగా రూ.4000 పెరిగి కొనుగోలుదారులను హడలెత్తించాయి. ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగడంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.68,400 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ. 74,620 వద్ద కొసాగుతున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,550, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.74,770 వద్ద ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,400లుగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.74,620 లుగా ఉన్నాయి.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,500 వద్ద 24 క్యారెట్ల పసిడి రూ.74,730 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.68,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.74,620 వద్ద ఉంది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో క్రితం రోజున వెండి ధర కేజీకి రికార్డు స్థాయిలో రూ.4000 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారాన్ని మించి.. వెండి హడల్..
దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 18) ఆకాశాన్ని అంటాయి. నిన్నటి రోజున కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించిన బంగారం ధరలు ఈరోజు భారీగా ఎగిశాయి. తులం బంగారం రూ.880 మేర పెరిగింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.800 పెరిగి రూ.68,400 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.870 పెరిగి రూ. 74,620 లను తాకింది.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,550 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.870 ఎగిసి రూ.74,770 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,400లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.870 పెరిగి రూ.74,620 లకు చేరుకుంది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,500లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.880 ఎగిసి రూ.74,730 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,400 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.870 పెరిగి రూ.74,620 లకు ఎగిసింది.రికార్డ్ స్థాయిలో వెండి ధరలుబంగారాన్ని మించి వెండి ధరలు హడలెత్తించాయి. దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రికార్డు స్థాయిలో రూ.4000 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
బంగారం ధరల మోతకు బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 17) కాస్త దిగొచ్చాయి. రెండు రోజులుగా ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. తులం బంగారం రూ.280 మేర తగ్గి ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి కాస్త ఉపశమనం కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.250 తగ్గి రూ.67,600 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ. 73,750 లకు దిగొచ్చింది.ఇతర నగరాల్లో.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,750 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 దిగొచ్చి రూ.73,900 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,600లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,750 లకు క్షీణించింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,950 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.280 తగ్గి రూ.73,850 లకు దిగొచ్చింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 క్షీణించి రూ.67,600 వద్దకు తగ్గగా 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,750 లకు దిగొచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు (మే 17) స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,500లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
బంగారం ధరల మోత కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 16) ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. నాలుగు రోజుల తగ్గుదలకు బ్రేకిచ్చి క్రితం రోజున ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు మరింత ఎగిశాయి. తులం బంగారం రూ.700 పైగా పెరిగి రూ. 74,000 మార్కును దాటేసింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.700 పెరిగి ప్రస్తుతం రూ.67,850 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.770 పెరిగి రూ. 74,020 లను తాకింది.ఇతర నగరాల్లో ధరలుఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.68,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.770 ఎగిసి రూ.74,170 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,850లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.770 పెరిగి రూ.74,020 లకు చేరుకుంది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,950లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.770 ఎగిసి రూ.74,130 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,850 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.770 పెరిగి రూ.74,020 లకు ఎగిసింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి ఏకంగా రూ.1500 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.92,500 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
అక్షయ తృతీయ తర్వాత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ మోత మోగించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 15) గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.430 పెరిగి రూ. 73,250 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ధరలుదేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 ఎగిసి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.430 పెరిగి రూ.73,250 లకు చేరుకుంది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.430 పెరిగి రూ.73,250 లకు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.67,250లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 ఎగిసి రూ.73,360 లను తాకింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.91,000లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
అలా ముగిసిందో లేదో.. ఇలా తగ్గింది!
దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ సందడి ముగిసింది. పండుగ రోజున భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. పసిడి ధర ఈరోజు (మే 11) 10 గ్రాములకు రూ.330 మేర తగ్గింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గింది. ప్రస్తుతం రూ.67,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.330 తగ్గి రూ. 73,360 లకు దిగొచ్చింది.ఇతర ప్రధాన నగరాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.330 దిగొచ్చి రూ.73,510 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,250 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.330 క్షీణించి రూ.73,360 వద్దకు తగ్గింది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.330 తగ్గి రూ.73,360లకు దిగొచ్చింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గి రూ.67,500 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.210 తగ్గి రూ.73,640 లకు దిగొచ్చింది.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఈరోజు రూ.700 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.87,000లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడికి అక్షయ తృతీయ శోభ
ముంబై: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా డిమాండ్ పెరగడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ముంబైలో పసిడి రూ.1,506 పెరిగి రూ.73,008 చేరింది. కిలో వెండి ధర రూ. 1873 ఎగసి రూ.84,215 కి చేరింది.పసిడి దిగుమతులు 30 శాతం అప్ కాగా భారత్ పసిడి దిగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో 30 శాతం పెరిగాయి. విలువలో 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ పటిష్ట డిమాండ్ దీనికి కారణం. భారత్కు దిగుమతుల విషయంలో స్విట్జర్లాండ్ (40%) మొదటి స్థానంలో నిలుస్తుండగా, తరువాతి స్థానాల్లో యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. దేశం మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా దాదాపు 5 శాతం. పసిడిపై ప్రస్తుతం 15శాతం దిగుమతుల సుంకం అమలవుతోంది. చైనా తర్వాత భారత్ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉంది. కాగా, 2023–24లో వెండి దిగుమతుల విలువ 2.72 శాతం పెరిగి 5.4 బిలియన్ డాల ర్లుగా నమోదైంది. -
అక్షయ తృతీయ వేళ భారీ షాకిచ్చిన బంగారం!
నేడు అక్షయ తృతీయ. దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్ల కోలాహలం నెలకొంది. ఈ తరుణంలో బంగారం ధరలు ఈరోజు (మే 10) కొనుగోలుదారులకు భారీ షాకిచ్చాయి. రెండు తగ్గుముఖం పట్టి ఊరట కలిగించిన పసిడి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి.హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,000 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.930 పెరిగి రూ. 73,090 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.930 ఎగసి రూ.73,240 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,000 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.930 పెరిగి రూ.73,090 వద్దకు చేరింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.67,050 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.990 పెరిగి రూ.73,150 లకు చేరుకుంది. ➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 ఎగిసి రూ.67,000 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.930 పెరిగి రూ.73,090 లకు ఎగిసింది.వెండి కూడా భారీగా..అక్షయ తృతీయ వేళ దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఈరోజు ఏకంగా రూ.1300 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.86,500లుగా ఉంది. -
రేపే పసిడి కొనుగోలు జాతర.. దిగొచ్చిన బంగారం!
పసిడి ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అక్షయ తృతీయ వచ్చేస్తోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలు జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఈరోజు (మే 8) కూడా కాస్త దిగొచ్చాయి.క్రితం రోజున కాస్తంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో అక్షయ తృతీయ పర్వదినం వేళ బంగారం కొనాలనుకుంటున్నవారికి కాస్త ఉపశమనం కలిగించాయి. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లేదా ఇతర ఏదేనా విలువైన వస్తువులు కొంటే అక్షయం అవుతుందని భారతీయుల నమ్మకం.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110 తగ్గి రూ. 72,160 లకు దిగొచ్చింది.ఇతర ప్రధాన నగరాల్లో..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.110 దిగొచ్చి రూ.72,310 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.110 క్షీణించి రూ.72,160 వద్దకు తగ్గింది.➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ.72,160 లకు దిగొచ్చింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.66,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.170 తగ్గి రూ.72,160 లకు దిగొచ్చింది.వెండి రివర్స్!దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఈరోజు రూ.200 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.85,200లుగా ఉంది. -
బంగారం స్పీడ్కు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. మూడు రోజులుగా వరసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు (మే 8) బంగారం ధరలు స్వల్పంగా తగ్గి పసిడి ప్రియులకు కాస్త ఉపశమనం కలిగించాయి.హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 తగ్గి రూ. 72,270 లకు దిగొచ్చింది.ఇతర ప్రధాన నగరాల్లో..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.100 దిగొచ్చి రూ.72,420 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.100 క్షీణించి రూ.72,270 వద్దకు తగ్గింది.➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.72,270 లకు దిగొచ్చింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,300 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.72,330 లకు దిగొచ్చింది. -
దేశమంతా నిరాశ.. అక్కడ మాత్రం ఊరట!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను నిరాశకు గురి చేశాయి. క్రితం రోజున భారీగా తగ్గి ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 4) మళ్లీ స్వల్పంగా ఎగిశాయి.హైదరాబాద్, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 పెరిగి రూ. 71,830 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 ఎగిసి రూ.66,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.100 పెరిగి రూ.71,980 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ.100 పెరిగి రూ.71,830 వద్దకు ఎగిసింది.➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.100 ఎగిసి రూ.71,830 లకు చేరుకుంది.చెన్నైలో తగ్గింపుదేశమంతా ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరుగుదలను చూడగా చెన్నైలో మాత్రం కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.66,000 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.72,000 లకు దిగొచ్చింది. -
కరుణించిన కనకమహాలక్ష్మి! దిగొచ్చిన బంగారం
దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. క్రితం రోజున భారీ పెరుగుదలను చూసిన బంగారం నేడు (మే 3) గణనీయంగా తగ్గింది. ఏకంగా రూ.1090 మేర తగ్గడంతో ఈరోజు కొనుగోలు చేస్తున్నవారికి పెద్ద ఊరట కలిగింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.500 తగ్గి రూ.65,750 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా ధర రూ.540 తగ్గి రూ. 71,730 లకు దిగొచ్చింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 తగ్గి రూ.65,900 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 తగ్గి రూ.71,880 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.71,730 వద్దకు క్షీణించింది.చెన్నైలో భారీగా..చెన్నైలో ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1000 తగ్గి రూ.66,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1090 తగ్గి రూ.72,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.71,730 లకు తగ్గింది. -
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. క్రితం రోజున భారీగా తగ్గి పసిడి ప్రియులకు ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 2) భారీ స్థాయిలో పెరిగాయి. ఒక్క రోజులోనే రూ.870 మేర ఎగిశాయి.హైదరాబాద్, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ. 72,270 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లోి ఇలా..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 ఎగిసి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.760 పెరిగి రూ.72,420 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.72,270 వద్దకు ఎగిసింది.చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.67,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.870 పెరిగి రూ.73,250 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.760 ఎగిసి రూ.72,270 లకు చేరుకుంది. -
త్వరలో అక్షయ తృతీయ.. బంగారంపై భారీ శుభవార్త!
త్వరలో అక్షయ తృతీయ రాబోతోంది. ఈ క్రమంలో పసిడి ప్రియులకు ఆనందం కలిగించే వార్త ఇది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి ధరలు ఈరోజు (మే 1) ఏకంగా రూ.1260 మేర తగ్గాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.65,550 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ. 71,510 లకు తగ్గింది.ఇతర నగరాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.65,700 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 తగ్గి రూ.71,660 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1000 క్షీణించి రూ.65,550 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ.71,510 వద్దకు దిగొచ్చింది.చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1150 తగ్గి రూ.71,510 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1260 తగ్గి రూ.72,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 క్షీణించి రూ.65,550 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ.71,510 లకు తగ్గింది. -
ధర పెరిగినా బంగారమే
న్యూఢిల్లీ: భారత్ కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. దీనిని ప్రతిబింబిస్తూ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 2023 ఇదే కాలంతో పోలి్చతే భారత్ పసిడి డిమాండ్ 8 శాతం పెరిగి 136.6 టన్నులకు (ఆభరణాలు, పెట్టుబడులు) పెరిగింది. ధర తీవ్రంగా ఉన్నా ఈ స్థాయి డిమాండ్ నెలకొనడం గమనార్హం. సమీక్షా కాలంలో త్రైమాసిక సగటు ధర (దిగుమతి సుంకం, జీఎస్టీ మినహా) 10 గ్రాములకు రూ.49,943.80 నుంచి రూ.55,247.20కి ఎగసింది. ఇక భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇదే కాలంలో ఏకంగా 19 టన్నులు కొనుగోలు చేసింది. 2023 క్యాలెండర్ ఇయర్ మొత్తంలో ఆర్బీఐ కొనుగోళ్లు 16 టన్నులే కావడం గమనార్హం. తాజా ‘క్యూ1 2024, గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదికలో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఈ అంశాలను తెలిపింది.ప్రపంచ వ్యాప్తంగా 3 శాతం అప్ మార్చి త్రైమాసికంలో ప్రపంచ పసిడి డిమాండ్ 3% పెరిగి 1,238 టన్నులకు చేరింది. 2016 తర్వాత ఈ స్థాయి డిమాండ్ పటిష్టత ఇదే తొలిసారి. సగటు త్రైమాసిక ధర ఔన్స్కు (31.1 గ్రాములు) 2,070 డాలర్లు. వార్షికంగా ఈ రేటు 10% అధికమైతే, త్రైమాసికంగా 5 % ఎక్కువ. సెంట్రల్ బ్యాంకులు తమ హోల్డింగ్స్ను ఈ కాలంలో 290 టన్నులు పెంచుకున్నాయి. ∗ మార్చి త్రైమాసికంలో భారత్ పసిడి డిమాండ్ విలువ రూపాయల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది.∗సమీక్షా కాలం మొత్తం పసిడి డిమాండ్లో ఆభరణాల డిమాండ్ 4 శాతం పెరిగి 95.5 టన్నులకు చేరగా, పెట్టుబడుల (కడ్డీలు, నాణేల వంటివి) విలువ 19 శాతం పెరిగి 41.1 టన్నులుగా నమోదైంది.∗ విలువల్లో చూస్తే ఆభరణాలకు డిమాండ్ 15% పెరిగి రూ.52,750 కోట్లకు చేరింది. పెట్టుబడుల్లో విలువ 32% పెరిగి రూ.22,720కి ఎగసింది. ∗ మార్చి త్రైమాసికంలో పసిడి దిగుమతులు 25 % పెరిగి 179.4 టన్నులుగా నమోదయ్యాయి. ∗గోల్డ్ రీసైక్లింగ్ విలువ 10% పెరిగి 38.3 టన్నులుగా నమోదైంది.∗2024లో 700 నుంచి 800 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయన్నది అంచనా. -
హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగొచ్చాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 29) మోస్తరుగా తగ్గాయి. నిన్నటి రోజున స్థిరంగా బంగారం ధరలు ఈరోజు తగ్గి ఉపశమనం కలిగించాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.66,550 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ. 72,600 లకు తగ్గింది.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.66,700 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 తగ్గి రూ.72,750 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 క్షీణించి రూ.66,550 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.72,600 వద్దకు దిగొచ్చింది.అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,400 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.320 తగ్గి రూ.73,530గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 క్షీణించి రూ.66,550 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.72,600 లకు తగ్గింది.ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.87,500గా ఉంది. -
భారీగా తగ్గిన పసిడి ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, భారీగా పెరిగిన ధర వద్ద లాభాల స్వీకరణ పసిడి ధరపై తాజాగా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా దేశంలో బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.1,450 తగ్గి రూ.72,200కు దిగివచ్చింది. కేజీ వెండి ధర రూ.2,300 తగ్గి, రూ.83,500కు చేరింది. కాగా ఆర్థిక రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్చత ధరలు వరుసగా రూ.1,277, రూ.1,272 తగ్గి రూ.71,598, 71,311కు దిగివచ్చాయి. వెండి కేజీ రూ.1,547 మైనస్తో రూ.80,007కు తగ్గింది.కాగా పసిడి ఫ్యూచర్ మార్కెట్లలో సైతం క్రితం ముగింపుతో పోలిస్తే నష్టాల్లో ట్రేడవుతోంది. -
కొత్త మార్క్కు బంగారం.. నిన్ననే కొన్నవారు సేఫ్!
Gold Rate today: పసిడి కొనుగోలుదారులకు ఇది చేదువార్త. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 19) మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజులు బ్రేక్ ఇచ్చి ఈరోజు మళ్లీ పెరిగి కొత్త మార్క్ను చేరాయి. హైదరాబాద్ నగరంతోసహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.74,340 లకు ఎగిసింది. ఇతర నగరాల్లో బంగారం ధరలు ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.68,900 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.600 చొప్పున ఎగిసి రూ.75,160 లను తాకింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,300 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 పెరిగి రూ.74,490 లకు ఎగిసింది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. -
హమ్మయ్య.. మళ్లీ పెరగక ముందే కొనేయండి!
Gold Rate today: పసిడి ప్రియులకు శుభవార్త ఇది. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 18) తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు క్రితం రోజున పెరుగుదలకు బ్రేక్ ఇచ్చి స్థిరంగా కొనసాగగా ఈరోజు గణనీయంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. హైదరాబాద్తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున తగ్గి రూ.73,800 వద్దకు దిగొచ్చింది. ఇతర నగరాల్లో.. ♦ చెన్నైలో ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.68,350 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.390 చొప్పున క్షీణించి రూ.74,560 లకు తగ్గింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.73,800 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 తగ్గి రూ.73,950 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.73,800 వద్దకు చేరింది. -
మళ్లీ మెరిసిన పసిడి, వెండి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల భయాలతో పసిడి, వెండి పరుగు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ధోరణులకు తగ్గట్లు దేశీయంగా వెండి, బంగారం ధరలు మంగళవారం మరో రికార్డు స్థాయిని తాకాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రకారం దేశ రాజధానిలో ఉదయం పసిడి 10 గ్రాముల ధర రూ. 700 పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి అయిన రూ. 73,750ని తాకింది. అదే విధంగా వెండి ధర కూడా కేజీకి రూ. 800 పెరిగి రూ. 86,500 స్థాయిని తాకింది. ఎంసీఎక్స్లో జూన్ కాంట్రాక్టు ధర ఇంట్రా–డేలో రూ. 72,927 స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లు చూస్తే కామెక్స్లో ఔన్సు (31.1 గ్రాముల) పసిడి ధర 15 డాలర్లు పెరిగి 2,370 వద్ద ట్రేడయ్యింది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగినంత కాలం బంగారం బులిష్గానే ఉండనున్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు. -
బంగారం ధర పెరుగుదలకు కారణాలివే..
బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. బంగారం ధరలు సమీప భవిష్యత్తులో రూ.లక్షకు చేరుకోనుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఇందుకుగల కారణాలను మార్కెట్ నిపుణులు, అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో సెంట్రల్ బ్యాంకులు ఫారెక్స్ నిలువలు అమ్మేశాయి. దాంతో గ్లోబల్ మార్కెట్లో బంగారాన్ని అమ్మి డాలర్లతో దేశాలకు కావాల్సిన ముడిచమురు వంటి కీలక అవసరాలను తీర్చుకున్నాయి. దాంతో బంగారం నిలువలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులు తిరిగి గ్లోబల్ మార్కెట్లో బంగారం నిల్వలను కొనడం ప్రారంభించాయి. దాంతో గోల్డ్ ధర పెరగడానికి ఇది ఒక కారణంగా ఉంది. ఈ ఏడాది ప్రముఖ దేశాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అనిశ్చితి కూడా బంగారం పెరిగేందుకు ఒక కారణం. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు బంగారం సురక్షిత సాధనంగా ఆకర్షిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపైకి విస్తరించింది. ఇదీ బంగారం ధరల పెరుగుదలకు కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ‘తప్పు చేశాం.. మళ్లీ చేస్తాం..10వేల డాలర్లు ఇస్తాం..’ యూఎస్ ఫెడ్ జూన్ నుంచే కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తాయని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంతర్జాతీయ అనిశ్చితులు, కన్జూమర్ ప్రైజ్ ఇండెక్స్ పెరిగి 3.5 శాతంగా నమోదవడంతో దాన్ని వాయిదా వేస్తారని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతో ఈక్విటీల్లో నుంచి సేఫ్ అసెట్లలోకి పెట్టుబడులను మళ్లిస్తున్నారు. 10 ఏళ్ల కాలానికిగాను యూఎస్ బాండ్ ఈల్డ్లు పెరుగుతుండడంతో ఈక్విటీ మార్కెట్ సమీప భవిష్యత్తులో కుప్పకూలుతాయనే సంకేతాలు బలపడుతున్నాయి. దాంతో ఇన్వెస్టర్లు మార్కెట్లతో పోలిస్తే తక్కువ ఒడిదుడుకులుండే కమోడిటీ మార్కెట్లో ప్రధానంగా గోల్డ్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దాంతో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
దేశమంతా షాక్! అక్కడ బంగారం కొనేవారికి మాత్రం గుడ్న్యూస్
Gold Rate today: పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 15) షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజుల క్రితం కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. నిన్నటి రోజు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మళ్లీ ఈరోజు పరుగు అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.67,050 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 చొప్పున పెరిగి రూ.73,150 వద్దకు చేరింది. దేశమంతా బంగారం ధరలు దడ పుట్టిస్తుంటే చెన్నైలో మాత్రం ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.650 తగ్గి రూ.67,900 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.710 చొప్పున క్షీణించి రూ.74,070 లకు తగ్గింది. ఇతర ప్రధాన నగరాల్లో.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.67,050 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 ఎగిసి రూ.73,150 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 ఎగిసి రూ.67,200 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.73,300 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.67,050 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 ఎగిసి రూ.73,150 వద్దకు చేరింది. -
పసిడి పరుగు ఎందాక?
పసిడి అందకుండా పరుగెడుతోంది. జీవితకాల గరిష్ట ధరల్లో ట్రేడ్ అవుతూ, ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటికే మూడు నెలల్లో సుమారు 20 శాతం బంగారం విలువ ప్రియంగా మారింది. కరోనా సంక్షోభం నుంచి చూస్తే 70 శాతం ఎగసింది. 10 గ్రాముల బంగారం ధర రూ.74,500 దాటింది. భారతీయులకు బంగారం అంటే సహజంగానే ఎంతో మక్కువ. పేద వారి నుంచి, ధనికుల వరకు ఎవరి స్థాయిలో వారు బంగారం కలిగి ఉంటారు. ధర ఇలా పెరిగిపోతుంటే, ఇక తాము కొనలేని స్థాయికి బంగారం చేరుకుంటుందా? అన్న గుబులు కొందరిలో మొదలైంది. ఈ తరుణంలో అసలు పసిడెందుకు ఇలా పరుగులు తీస్తోంది? ఇది ఎంత వరకు? దీనిపై మార్కెట్ అనలిస్టుల విశ్లేషణ చూద్దాం. ఆర్బీఐ దూకుడు గత ఏడాది 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి నాటికి ఆర్బీఐ 13 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆర్బీఐ నిర్వహణలోని బంగారం నిల్వలు 817 టన్నులకు చేరాయి. విదేశీ మారక నిల్వల్లో వైవిధ్యానికి వీలుగా, రిస్క్ తగ్గించుకునేందుకు బంగారం నిల్వలను ఆర్బీఐ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ 6 టన్నుల బంగారం నిల్వలు పెంచుకుంది. అంతకుముందు జనవరిలో 8.7 టన్నులను కొనుగోలు చేసింది. 2022 జూలై తర్వాత ఒక నెలలో గరిష్ట కొనుగోళ్లు ఇవి. ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ప్రకారం సెంట్రల్ బ్యాంక్లు అన్నీ కలసి ఫిబ్రవరిలో 19 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. అత్యధికంగా చైనా 12 టన్నులు కొంది. జనవరిలో టర్కీ 11.8 టన్నులు, చైనా 10 టన్నులు, కజకిస్థాన్ 6.2 టన్నుల చొప్పున బంగారం కొన్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యాంక్లు 64 టన్నుల బంగారం కొన్నాయి. 2023 మొదటి 2 నెలలతో పోలిస్తే 43% తక్కువ కాగా, 2022 మొదటి 2 నెలలతో పోల్చితే 4 రెట్లు అధికం. ఇక ముందూ సెంట్రల్ బ్యాంక్ల నుంచి డిమాండ్ కొనసాగొచ్చన్నది అనలిస్టుల అంచనా. అదే సమయంలో మార్కెట్ అంచనా వేసినట్టు ఫెడ్ రేట్ల కోత జూన్ లేదా సమీప కాలంలో లేకపోతే, అది బంగారం ధరల ర్యాలీకి బ్రేక్ వేయవచ్చని టీడీ సెక్యూరిటీస్ కమోడిటీ స్ట్రాటజీస్ హెడ్ వార్ట్ మెలెక్ పేర్కొన్నారు. కాకపోతే మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పసిడిలో రాబడికే అవకాశాలు ఉంటాయన్నది అనలిస్టుల అభిప్రాయం. మన దగ్గర కొంచెం ఎక్కువే దేశీయ మార్కెట్ అనే కాదు, అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఔన్స్ బంగారం (31.10 గ్రాములకు సమానం) ధర 2,400 డాలర్లకు చేరింది. రూపాయల్లోకి మార్చి చూస్తే దేశీయ మార్కెట్లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.64,370గానే ఉండాలి. కానీ, ఇంతకంటే అధికంగా మన మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. బంగారం దిగుమతి చేసుకునే లోహం. కనుక డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. డాలర్తో రూపాయి మారకం విలువ దిగుమతి ధరలను నిర్ణయిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. రూపాయి విలువ క్షీణిస్తున్న కొద్దీ, అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధర మధ్య అంతరం పెరుగుతూ వెళుతుంది. దీనికి తోడు బంగారం దిగుమతులపై కేంద్ర సర్కారు కస్టమ్స్ సుంకాన్ని కూడా వసూలు చేస్తుంటుంది. బంగారం, వెండిపై ప్రస్తుతం ఈ సుంకం 15 శాతంగా ఉంది. ఇవన్నీ కలిసి దేశీయ మార్కెట్లో బంగారం ధర అధికంగా ఉండేలా చేస్తున్నాయి. ఎందుకంటే..? బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా ర్యాలీ చేస్తుండడం వెనుక పలు కారణాలను మార్కెట్ నిపుణులు, అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికా సహా అన్ని ప్రముఖ దేశాల్లోనూ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లోనే చలిస్తున్నాయి. ఇక్కడి నుంచి తగ్గడమే కానీ, పెరగడానికి అవకాశాల్లేవు. సమీప కాలంలోనే వడ్డీ రేట్ల తగ్గింపు మొదలవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యూఎస్ ఫెడ్ జూన్ నుంచే రేట్ల కోతను మొదలు పెడుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. ‘‘పసిడి ధర మరో రికార్డు స్థాయికి చేరింది. డాలర్ ఇండెక్స్ బలంగానే ఉన్నప్పటికీ బంగారం ర్యాలీ కొనసాగుతోంది. యూఎస్ ఫెడ్ మానిటరీ పాలసీని సులభతరం చేస్తుందన్న అంచనాలు పెరిగాయి. మధ్య ప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు మరింత క్షీణించడం కూడా కారణమే. బంగారం, వెండి ధరలు ఇటీవల ర్యాలీకి చైనా దూకుడైన కొనుగోళ్లు సైతం మద్దతునిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకులు స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. ఈ ఏడాది ప్రముఖ దేశాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అనిశ్చితి కూడా ఒక కారణమే. ఈ పరిస్థితుల్లో బంగారం సురక్షిత సాధనంగా ఆకర్షిస్తోంది’’అని ఎస్ఎస్ వెల్త్ స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్దేవ తెలిపారు. ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపైకి విస్తరించింది. ఇది కూడా బంగారం ధరల ఆజ్యానికి కారణమైనందన్నది కొందరు విశ్లేషుకుల అంచనాగా ఉంది. ఎంత వరకు..? మొత్తం మీద బంగారం ధరల ధోరణి బుల్లిష్గా ఉన్నట్టు, మధ్యలో ధరలు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా చూడొచ్చని సుగంధ సచ్దేవ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, భౌగోళిక రాజకీయ అంశాలు ఏ విధంగా మారుతున్నాయనే దానిపై దృష్టి సారించాలన్నారు. ‘‘బంగారం ధర సాంకేతికంగా రూ.69,600ను ఛేదించి అంతకుపైన ముగిసింది. ఇది పసిడి ర్యాలీకి మద్దతునిచ్చేది. ఇక్కడి నుంచి పసిడి ధర తగ్గితే మధ్య కాలం నుంచి దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు అవకాశంగా చూడొచ్చు’’అని ప్రభుదాస్ లీలాదర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ షిజు కూత్తుపలక్కల్ సూచించారు. సురక్షిత సాధనం ఆర్థిక అనిశి్చతుల్లో, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో బంగారానికి డిమాండ్ సాధారణ రోజులతో పోలిస్తే అధికమవుతుంది. ఈక్విటీలు, డాలర్ తదితర సాధనాల నుంచి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బంగారంలోకి పెట్టుబడులు మళ్లిస్తుంటారు. చారిత్రకంగా చూస్తే ఇతర సాధనాల కంటే బంగారంలో అస్థిరతలు తక్కువ. అందుకే ఆ సమయంలో ఇన్వెస్టర్లు పసిడిని నమ్ముకుంటారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడల్లా బంగారం ర్యాలీ చేస్తుండడం సహజంగానే కనిపిస్తుంది. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల అది ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుంది. పైగా ముడి చమురు ధరలు మరోసారి పెరగడం మొదలైంది. ఇది కూడా ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం సమయలో పెట్టుబడుల విలువ కాపాడుకునేందుకు హెడ్జింగ్గా బంగారం మించిన సాధనం లేదు. చారిత్రకంగా చూస్తే ఎక్కువ సందర్భాల్లో ఈక్విటీలు ర్యాలీ చేసినప్పుడు బంగారం ధరలు తగ్గేవి. కానీ, ఈ విడత ఈక్విటీలతో పాటు బంగారం కూడా ర్యాలీ చేయడానికి ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు, డాలర్ విలువ స్థిరత్వం విషయంలో సెంట్రల్ బ్యాంకుల్లో నమ్మకం సడలడమే ఒక కారణంగా కనిపిస్తోంది. యూఎస్ ద్రవ్యలోటు 6.2 శాతానికి, రుణం జీడీపీలో 120 శాతానికి చేరడం కూడా బంగారం ధరల ఆజ్యానికి కారణాల్లో ఒకటి. అమెరికా జీడీపీలో రుణ వడ్డీ వ్యయాలు 2015–2020 కాలంలో సగటున 1.4 శాతంగా ఉంటే, ఇప్పుడు 2.4 శాతానికి చేరాయి. ఈ వడ్డీ వ్యయాలు తగ్గించుకునేందుకు, గడువు తీరిన రుణాలను తక్కువ రేటుపై రీఫైనాన్స్ చేసుకునేందుకు వీలుగా ఫెడ్ నుంచి రేట్ల కోత రూపంలో సాయాన్ని అమెరికా ప్రభుత్వం ఆశిస్తున్న విషయాన్ని విస్మరించరాదు. రేట్ల కోత ఫిబ్రవరి మధ్య నుంచి ర్యాలీ ఫలితంగా బంగారం సాంకేతికంగా రూ.70,000 మార్క్ (10 గ్రాములు), ఔన్స్ 2,300 డాలర్లను దాటింది. రేట్ల కోతపై యూఎస్ ఫెడ్ మిశ్రమ సంకేతాలే ఇచి్చనప్పటికీ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ధరల ఒత్తిళ్లను తగ్గించేందుకు జూన్లోనే రేట్ల కోతను చేపట్టొచ్చన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయిఅని సుగంధ సచ్దేవ తెలిపారు. ముఖ్యంగా ఇటీవలే వెలువడిన అమెరికా నాన్ ఫార్మ్ పేరోల్ డేటా అంచనాలకు మించి ఉందని (తగ్గిన నిరుద్యోగం), ఇదే బంగారం, వెండి ధరల తాజా ట్రిగ్గర్కు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనుజ్ గుప్తా వెల్లడించారు. అవసరమా–పెట్టుబడా? పెరిగే ధరలు చూసి పసిడి వెంట పరుగులు తీయడం కాకుండా, ఎందుకు కొనుగోలు చేయాలన్న ప్రశ్న వేసుకోవాలి. రాబడి కోసం అయితే అది పెట్టుబడి అవుతుంది. తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి చేసే కేటాయింపులు 5–10% మించకూడదన్నది నిపుణుల సూచన. పైగా పెట్టుబడులు భౌతిక బంగారంపై ఉండకూడదు. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ)లో ఇన్వెస్ట్ చేసుకుంటే, పెరిగే విలువకు అదనంగా ఏటా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రెండు సాధనాల్లోనూ క్రమానుగత పెట్టుబడులు చేసుకోవచ్చు. ఎస్జీబీలను ఆర్బీఐ ఏటా పలు విడతలుగా జారీ చేస్తుంటుంది. ఈటీఎఫ్లను రోజువారీ స్టాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఆభరణాల కోసం అయితే తమకు కావాల్సినంత మేర బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. వెండి సంగతి? చారిత్రకంగా బంగారంతోపాటే వెండి పయనం కూడా సాగుతుంది. కానీ, ఇటీవలి కాలంలో బంగారం స్థాయిలో వెండి ధరల పెరుగుదల లేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఏప్రిల్ 8 నాటికి వెండి ధరలు 11 శాతం ర్యాలీ చేశాయి. పెట్టుబడుల కోణంలోనే కాకుండా, పారిశ్రామికంగానూ వెండి వినియోగం ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ తదితర పునరుత్పాదక ఇంధన ఎక్విప్మెంట్, ఎల్రక్టానిక్స్లో వెండి వినియోగిస్తుంటారు. చైనా మార్కెట్ కోలుకుంటుందన్న అంచనాలు వెండి ర్యాలీకి జోష్నిస్తున్నాయి. వెండి విషయంలో తాము బలమైన సానుకూలతతో ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ప్రకటించింది. కిలో వెండి తగ్గితే రూ.75,000 వరకూ కొనుగోలు చేసుకోవచ్చని, మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.92,000–1,00,000 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు ఇటీవలే నోట్ను విడుదల చేసింది. కొనేది ఎవరు? సెంట్రల్ బ్యాంక్లతోపాటు, వడ్డీ రేట్ల కోతపై అంచనాలతో ఇనిస్టిట్యూషన్లు (ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు, పెన్షన్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్) బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వ్యక్తులు, ప్రైవేటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కూడా డిమాండ్కు మద్దతుగా నిలుస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్లు అంతర్జాతీయంగా కరెన్సీని పెద్ద ఎత్తున ప్రింట్ చేస్తున్నాయి. ఇది వాటి కరెన్సీ విలువలకు ప్రతికూలం. పైగా భౌగోళిక ఉద్రిక్తతల ఫలితంగా నాన్ డాలర్ వాణిజ్య చెల్లింపుల వైపు కొన్ని దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఇది డాలర్కు ప్రతికూలం. ఈ పరిస్థితుల్లో విదేశీ మారకం నిల్వల్లో ఎక్కువ భాగం కరెన్సీ రూపంలోనే కలిగి ఉండడం అంత శ్రేయస్కరం కాదని ఆర్బీఐ సహా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంక్లు భావిస్తున్నాయి. కరెన్సీలతో పోలిస్తే బంగారమే స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుండడం గమనించాలి. మన దేశంలో ఇప్పటికీ అధిక శాతం మంది బంగారాన్ని విలువైన, పొదుపు సాధనంగా చూస్తున్నారు. బంగారం విలువ ఎప్పటికీ పెరిగేదే కానీ, తరిగేది కాదని, కష్టాల్లో ఆదుకుంటుందని ఎక్కువ మంది నమ్ముతుంటారు. ఫలితంగా దేశీయంగా బంగారానికి బలమైన డిమాండ్ కొనసాగుతూనే ఉంది. -
రికార్డులను తిరగరాస్తున్న బంగారం ధరలు
న్యూఢిల్లీ: బంగారం ధర గత వారం రోజులుగా ఏరోజుకారోజు కొత్త రికార్డులకు చేరుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం పూర్తి స్వచ్చత 10 గ్రాముల ధర రూ.350 పెరిగి 71,700కు చేరింది. అంతర్జాతీయంగా కూడా ధరలు సరికొత్త రికార్డులను తాకడం దీనికి నేపథ్యం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రాములు) ధర జూన్తో ముగిసే కాంట్రాక్ట్ ఒక దశలో భారీగా క్రితం ముగింపుతో పోల్చితే 27 డాలర్లు పెరిగి 2,372డాలర్లపైకి ఎగసింది. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, ఈజీ మనీ, ద్రవ్యోల్బణం భయాలు, సెంట్రల్ బ్యాంక్ల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి పరుగునకు కారణమవుతున్నాయి. 2024లో దేశంలో పసిడి 10 గ్రాములకు రూ.7,700 పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో పసిడి విలువ 10 గ్రాములకు ఏకంగా రూ.71,080కి ఎగసింది. సోమవారం ఈ వార్త రాసే సమయానికి క్రితం ముగింపుతో పోలి్చతే రూ.158 లాభంతో రూ.70,794 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా... ఇదిలావుండగా, వెండి కూడా న్యూఢిల్లీలో కొత్త గరిష్టాలను చూసింది. సోమవారం కేజీకి రూ.800 ఎగసి రూ.84,000 స్థాయిని చూసింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి కేజీ ధర (మే కాంట్రాక్ట్) ఒక దశలో 82,109ని తాకింది. ఈ వార్త రాసే రాత్రి 9 గంటల సమయానికి ధర రూ.942 ఎగసి రూ.81,805 వద్ద ట్రేడవుతోంది. -
ఉగాది వేళ బంగారం కొందామనుకుంటే.. ప్చ్!
Gold Rate today: ఉగాది వేళ బంగారం కొందామనుకున్న పసిడి ప్రియులకు బంగారం ధరలు నిరుత్సాహాన్ని కలిగించాయి. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 8) పెరిగాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధరలు 10 గ్రాములకు ఈరోజు రూ.490 మేర పెరిగాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.65,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున పెరిగి రూ.71,620 వద్దకు ఎగిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.450 పెరిగి రూ.66,600లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.490 చొప్పున పెరిగి రూ.72,650 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 ఎగిసి రూ.65,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 పెరిగి రూ.71,770 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా మళ్లీ పెరిగాయి. క్రితం రోజు స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.88,000 ఉంది. ఇది క్రితం రోజున రూ. 87,000 లుగా ఉండేది. -
బాబోయ్ బంగారం.. ఇలాగైతే గోల్డ్ కొనడం కష్టమే!
బంగారం ధరలు తారా జువ్వ లాగా పైపైకి చేరుతున్నాయి. 2024 ప్రారంభంలో కొంత తగ్గుముఖం పట్టిన బంగారం రేటు ఏప్రిల్ ప్రారంభంలో ఏకంగా రూ. 70వేలుకు చేరువయ్యింది. నేటి (ఏప్రిల్ 1) పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా నేడు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.63750 (22 క్యారెట్స్), రూ.69530 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ. 850, రూ. 930 పెరిగింది.చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 850 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 930 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 63750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 69530 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 63750 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 69530 రూపాయలకు చేరింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు రూ. 850, రూ. 930 పెరిగింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 1) వెండి ధర రూ. 600 పెరిగి రూ. 78600 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు: 2024లో ఇదే హయ్యెస్ట్..
రోజురోజుకి బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్చి 21న గరిష్టంగా 109 రూపాయలు పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు (మార్చి 29) ఏకంగా 142 రూపాయలు పెరిగింది. 2024లో ఇదే హయ్యెస్ట్ పెరుగుదల అని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడల, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.63150 (22 క్యారెట్స్), రూ.68880 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 1300, రూ. 1420 పెరిగింది. చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 1300 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1420 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 63150 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 68880 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 63150 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 68880 రూపాయలకు చేరింది. నిన్న రూ. 350 నుంచి రూ. 380 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 1300, రూ. 1420 వరకు పెరిగాయి. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (మార్చి 29) వెండి ధర రూ. 300 పెరిగి రూ. 77800 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధరెంతో తెలుసా..
దేశీయంగా పసిడి ప్రియులకు శుభవార్త. గత వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా బుధవారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలిసింది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే నేడు స్వల్పంగా రూ.30 తగ్గింది. బంగారం ధరల్లో స్థిరత్వం వస్తున్నట్లు కనిపిస్తుంది. బంగారం కొనాలనుకునే వారు దేశంలో ప్రముఖ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,350 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,840గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,350 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,840గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,350 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,840గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,350 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,840గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉంది దిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,990గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,350 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,840గా ఉంది. -
బంగారం ధర గరిష్ఠానికి చేరనుందా..?
బంగారం ధరలు సమీప భవిష్యత్తులో మరింత పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీని ధర రికార్డు స్థాయిల్లోకి చేరుకుంటుంది. ఈ ఏడాది ఆల్టైమ్హైకి చేరనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరంలోనే 10 గ్రాములు రూ.72వేలు పలుకుందని అంచనాలు వస్తున్నాయి. దేశీయ, విదేశీ స్టాక్మార్కెట్లు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకుల విధానాలు, యూఎస్ డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్తోపాటు భారత్సహా పలు ప్రధాన దేశాల్లో ఎన్నికలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,050 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,600గా ఉంది దిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,400 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,880గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. -
అసలే పెళ్లిళ్ల సీజన్.. బంగారం కొనడం కష్టమే.. ధర ఎంతో తెలుసా..
బంగారం ధర ఎప్పుడూ లేనంతగా రికార్డు గరిష్ఠాలకు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు/999 స్వచ్ఛత) ధర దేశీయ విపణిలో రూ.66,400 దాటింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేసిస్తున్నారు. కేంద్రీయ బ్యాంకుల నుంచి పసిడి నిల్వలు పెంచుకునేందుకు లభిస్తున్న ఆసక్తి, క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో హెడ్జింగ్ కోసం పసిడిపైనా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. ధరలు భగ్గుమంటుండటం, దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండడంతో అమ్మకాలు పుంజుకుంటున్నట్లు తెలిసింది. గురువారం నమోదైన వివరాల ప్రకారం దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,900 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,440గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,710గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. -
రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర.. ఎంతో తెలుసా..
బంగారం ధర రికార్డు గరిష్ఠాలకు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు/999 స్వచ్ఛత) ధర దేశీయ విపణిలో రూ.66,000 దాటింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేసిస్తున్నారు. కేంద్రీయ బ్యాంకుల నుంచి పసిడి నిల్వలు పెంచుకునేందుకు లభిస్తున్న ఆసక్తి, క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో హెడ్జింగ్ కోసం పసిడిపైనా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. ధరలు భగ్గుమంటుండటం, దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండడంతో అమ్మకాలు పుంజుకుంటున్నట్లు తెలిసింది. బుధవారం నమోదైన వివరాల ప్రకారం దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,130గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,130గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,130గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,130గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,400 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,890గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,850 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,280గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,130గా ఉంది. -
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. గడచిన వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.2వేలు పెరిగింది. రానుంది పెళ్లిళ్ల సీజన్ కావడంతోపాటు జూన్లో ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని ఊహాగానాల నేపథ్యంలో బంగారం ధర గరిష్ఠ స్థాయిలకు చేరుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,740 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,080గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,740 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,080గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,485గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,850గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,150 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,620గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,000గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,850గా ఉంది. -
ఐదు రోజుల తరువాత పెరిగిన పసిడి - నేటి కొత్త ధరలు ఇలా..
ఐదు రోజుల నుంచి అస్సలు పెరగని పసిడి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ) ఈ రోజు తులం బంగారం ధరలు వరుసగా రూ. 57800 (22 క్యారెట్స్), రూ. 63050 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు రూ.100 పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. చెన్నైలో కూడా ఈ రోజు తులం బంగారం ధరలు నిన్నటి కంటే రూ. 100 పెరిగింది. దీంతో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 58400 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 63710గా ఉంది. ఇదీ చదవండి: భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఢిల్లీలో కూడా ఈ రోజు పసిడి ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. నేడు తులం బంగారం ధరలు వరుసగా రూ. 57950 (22 క్యారెట్స్), రూ. 63200 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. ఈ రోజు వెండి ధరలు రూ. 500 పెరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ రోజు వెండి ధరలు నిన్నటి కంటే రూ. 500 ఎక్కువని స్పష్టమవుతోంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై ప్రాంతాల్లో కూడా ఈ రోజు వెండి ధరలు పెరిగాయి. -
వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీలలో కూడా ఈ రోజు తులం మీద రూ.300 నుంచి రూ.330 వరకు తగ్గింది. నేడు పసిడి ధరలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు హైదరాబాద్, విజయవాడలలో తులం బంగారం మీద రూ. 300 నుంచి రూ. 330 తగ్గింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 57400 (22 క్యారెట్స్), రూ. 62620 (24 క్యారెట్స్) వద్ద నిలిచింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరులలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22, 24 క్యారెట్స్ బంగారం ధరలు వరుసగా రూ. 57800, రూ. 63050గా ఉన్నాయి. నిన్నట్లి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఈ రోజు 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 57550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62770గా ఉంది. ఈ ధరలు నిన్నటి ధరల కంటే వరుసగా రూ.300, రూ.330 తగ్గింది. ఇదీ చదవండి: సమీపిస్తున్న గడువు.. ఫాస్ట్ట్యాగ్ కేవైసీ ఇలా అప్డేట్ చేసుకోండి వెండి ధరలు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా రూ. 400 తగ్గింది. కేవలం మూడు రోజుల్లో కేజీ వెండి మీద రూ. 1300 వరకు తగ్గింది. -
ఇంకా తగ్గిపోయిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
గత ఏడాది చివరలో భారీగా పెరిగి.. న్యూ ఇయర్ ప్రారంభంలో కూడా కొంత భయపెట్టిన బంగారం ధరలు.. ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. సంక్రాంతికి గోల్డ్ కొనాలనుకునే వారికి ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి. 2024 జనవరి 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు పసిడి ధరలు తులం మీద ఏకంగా రూ. 1000 కంటే ఎక్కువ తగ్గింది. ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఈ రోజు బంగారం ధరలు రూ.57,800 (10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్), రూ.63050 (10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్)గా ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ.200, రూ.220 తగ్గినట్లు తెలుస్తోంది. చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు 10 గ్రాముల మీద వరుసగా రూ. 200, రూ. 220 తగ్గింది. దీంతో నేటి గోల్డ్ ధరలు రూ. 58,300 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63,600 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉన్నాయి. ఢిల్లీలో నేడు బంగారం ధరలు గరిష్టంగా రూ. 220 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధరలు రూ. 57950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరలు రూ. 63200గా ఉంది. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం కోసం 30 సార్లు అప్లై.. ఎట్టకేలకు జాబ్ కొట్టేసింది, కానీ.. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా ఈ రోజు కేజీ మీద రూ. 200 తగ్గింది. దీంతో ఒక కేజీ గోల్డ్ రేటు రూ. 76400కి చేరింది. న్యూ ఇయర్ ప్రారంభమైనప్పటి నుంచి వెండి ధర ఇప్పటివరకు ఏకంగా రూ. 2500 తగ్గిందని తెలుస్తోంది. -
వామ్మో.. కొత్త ఏడాదిలో బంగారం కొనగలమా?
Gold Prices in 2024: హద్దుల్లేకుండా పెరిగిపోతున్న బంగారం ధరలు కొత్త ఏడాదిలోనైనా దిగొస్తాయని ఆశలు పెట్టుకున్న పసిడి ప్రియులను నిపుణుల అంచనాలు కలవరపెడుతున్నాయి. 2024లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.70,000 చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆదివారం (2023 డిసెంబర్ 31) నాడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,550,24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,870 వద్ద ఉంది. 2023 డిసెంబర్ నెల ప్రారంభంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకాయి. గత మే 4న, గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 61,845, ఔన్స్కి 2,083 డాలర్ల వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆరు నెలల తర్వాత అంటే నవంబర్ 16న ధర మళ్లీ రికార్డు స్థాయిలో రూ.61,914కి చేరుకుందని కా కామ్ట్రెండ్స్ రీసెర్చ్ (Commtrendz research) డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ పీటీఐకి తెలిపారు. రూ.70 వేలకు చేరే అవకాశం కొత్త సంవత్సరంలో బంగారం ఔన్స్ ధరలు 2,400 డాలర్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు త్యాగరాజన్ చెప్పారు. రూపాయి స్థిరంగా ఉంటే దేశంలో తులం బంగారం ధర రూ.70,000 స్థాయిలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలను తేలికపరుస్తారన్న అంచనాల నేపథ్యంలో రూపాయి బలహీనపడవచ్చు. ఇది బంగారం దేశీయ ధరలను పెంచే అవకాశం ఉంది. అమ్మకాలపై తీవ్ర ప్రభావం యూఎస్ ఫెడ్ రేటు తగ్గింపు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన రూపాయి బంగారం ధరలలో పెరుగుదలకు దారితీస్తుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ మెహ్రా పేర్కొన్నారు. 2024లో బంగారం ధర ఔన్స్కు 2,250 నుంచి 2,300 డాలర్లు, 10 గ్రాముల ధర 68,000 నుంచి 70,000కి చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పెరిగిన ధరలు 2024లో బంగారం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, వచ్చే ఏడాదిలో నగల వ్యాపారం 2023లో ఉన్న స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.భరణాల డిమాండ్ పెరిగింది. -
స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి - నేటి ధరలు ఇలా..
గత కొన్ని రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్న స్వల్ప తగ్గుదలను నమోదు చేసి.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి, చెన్నై & ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా పసిడి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 58550, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 63870గా ఉంది. చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం రేటు రూ. 5910, 24 క్యారెట్ల ఒక గ్రామ్ పసిడి విలువ రూ. 6447గా ఉంది. దీని ప్రకారం తులం బంగారం ధర వరుసగా రూ. 59100, రూ. 64470గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 5870 (22 క్యారెట్స్ ఒక గ్రామ్), రూ. 6397 (24 క్యారెట్ ఒక గ్రామ్)గా ఉంది. అంటే నిన్న ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ వెండి ధరలు నిన్న ఒకేసారి రూ. 1200 తగ్గిన వెండి ధర ఈ రోజు మళ్ళీ రూ. 300 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో ఒక కేజీ వెండి ధర మళ్ళీ రూ. 80000 దాటేసింది. రానున్న పండుగ సీజన్ల దృష్ట్యా ఈ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
న్యూ ఇయర్ సమీపిస్తోంది, పండుగలు కూడా రానున్నాయి. ఈ తరుణంలో బంగారం ధరలు ఏ మాత్రం తగ్గకుండా.. రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు బంగారం ధరలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం. ఈ రోజు విజయవాడ, హైదరాబాద్లలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల ఒక గ్రామ్ గోల్డ్ రేటు రూ. 5820 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 6319గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58200, రూ. 63190గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణం, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి. తెలుగు రాష్ట్రాల మాదిరిగానే ఢిల్లీలో కూడా బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నేడు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5835.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6364గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58350, రూ. 63640గా ఉంది. ఇదీ చదవండి: సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.. స్విగ్గీ ఖాతా ద్వారా రూ.38,000 మాయం! చెన్నైలో నేడు గోల్డ్ రేటు ఏ మాత్రం తగ్గలేదు. ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5875 కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6409గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58750, రూ. 64090గా ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. వెండి ధరలు ఈ రోజు కేవలం బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన వెండి, నేడు నిన్నటి ధరలతోనే సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. -
ఆభరణాల డిమాండ్ ఎలా ఉందంటే..
ముంబై: ధరలు పెరిగినప్పటికీ పసిడి ఆభరణాలకు డిమాండ్ తగ్గడం లేదని తాజా నివేదిక ఒకటి పేర్కొంది. బంగారం ఆభరణాల వినియోగం.. విలువ పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 10 నుంచి 12 శాతం పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా– నివేదిక పేర్కొంది. ఇంతక్రితం వేసిన 8 నుంచి 10 శాతం అంచనాలను ఈ మేరకు ఎగువముఖంగా సవరించింది. పసిడి ధరల పెరుగుదలే దీనికి కారణమని వివరించింది. 2023–24 మొదటి ఆరునెలల కాలాన్ని (ఏప్రిల్–సెప్టెంబర్) 2022–23 ఇదే కాలంతో పరిశీలిస్తే ఆభరణాల వినియోగం విలువ 15 శాతానికి పైగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. బంగారం కొనుగోళ్లకు శుభప్రదంగా భావించే ’అక్షయ తృతీయ’ సమయంలో స్థిరమైన డిమాండ్, అధిక బంగారం ధరలు దీనికి కారణంగా పేర్కొంది. అయితే ద్వితీయార్థంలో ఈ శాతం 6 నుంచి 8 శాతమే ఉంటుందని అభిప్రాయపడింది. గ్రామీణ డిమాండ్ మందగమనం, ద్రవ్యోల్బణం తీవ్రత తమ అంచనాలకు కారణమని పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► డిసెంబర్ 2022–ఏప్రిల్ 2023 మధ్య అస్థిరత కొనసాగిన బంగారం ధరలు, 2023–24 మొదటి అర్థభాగంలో (ఏప్రిల్–సెపె్టంబర్) స్థిరంగా ఉన్నాయి. అయితే క్రితం సంవత్సరం సగటు ధరలతో పోలిస్తే 14 శాతం పెరిగాయి. ► పెరిగిన ధరలు.. పలు ఆభరణాల రిటైలర్ల ఆదాయ పటిష్టతకు దోహదపడ్డాయి. ► మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ప్రపంచ స్థూల ఆర్థిక అనిశి్చత పరిస్థితులతో సమీప కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ► అక్టోబర్ 2023 ప్రారంభం నుండి బంగారం ధరల పెరుగుదల, స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం తీవ్రతవల్ల యల్లో మెటల్ ఆభరణాల డిమాండ్ కొంత తగ్గవచ్చు. -
పసిడి.. పరుగో పరుగు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం ధరల రికార్డు పరుగు ప్రభావం భారత్ బులియన్ మార్కెట్లో కనబడింది. దేశ రాజధానిలో పసిడి 10 గ్రాముల ధర సోమవారం అంతక్రితం ముగింపుతో పోలి్చతే రూ.450 పెరిగి రూ.64,300 రికార్డు స్థాయికి చేరినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇక ముంబైలో ధర సోమవారం క్రితం (శుక్రవారం ముగింపు)తో పోలి్చతే 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.553 పెరిగి రూ.63,281కి ఎగసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.551 ఎగసి రూ.63,028ని చూసింది. ఇక వెండి విషయానికి వస్తే, రెండు నగరాల్లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో వెండి కేజీ ధర రూ.80,200 పలికితే, ముంబైలో ఈ విలువ రూ.76,430గా ఉంది. విజయవాడ మార్కెట్లో తీరిది... గడిచిన రెండు రోజుల్లో విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి రూ.64,200కు చేరింది. డిసెంబర్1న రూ.62,950 గా ఉన్న బంగారం ధర ఒకేరోజు రూ.810 పెరిగి రూ.63,760కు చేరగా, తాజాగా సోమవారం మరో రూ.440 పెరిగి రూ.64,200కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారట్ల ఆభరణాల పది గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి రూ.57,700 నుంచి రూ.58,850కు పెరిగింది. అంతర్జాతీయ ప్రభావం... అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఫిబ్రవరికి సంబంధించి క్రియాశీలంగా ట్రేడ్ అవుతున్న పసిడి ఔన్స్ (31.1 గ్రాములు) ధర తాజాగా రికార్డు స్థాయిలో 2,151 డాలర్లను తాకింది. అయితే లాభాల స్వీకరణ నేపథ్యంలో ఈ వార్త రాసే రాత్రి 11 గంటల సమయానికి 2.3 శాతం క్షీణించి 2,040 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఆసియన్ ట్రేడింగ్లో కూడా ఇంట్రాడేలో ధర ఆల్టైమ్ కొత్త రికార్డు స్థాయి 2,135 డాలర్లను చూసింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు, డాలర్ బలహీనత, పశి్చమాసియా సంక్షోభ పరిస్థితులు పసిడి పరుగుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఇటీవలి సర్వే విడుదలచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా 24 శాతం సెంట్రల్ బ్యాంక్లు రాబోయే 12 నెలల్లో తమ బంగారం నిల్వలను పెంచుకోవాలని భావిస్తున్నాయని వెల్లడించింది. రిజర్వ్ అసెట్గా డాలర్ కంటే బంగారమే సరైనదన్న అభిప్రాయం దీనికి కారణమని పేర్కొంది. ఈ అంశం కూడా తాజా బంగారం ధర జోరుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ. 750 నుంచి రూ. 800 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. నేడు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5845, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6376గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 58450, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 63760గా ఉంది. గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధర రూ. 5915 (22 క్యారెట్స్), రూ. 6453 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 59150, రూ. 64530గా ఉంది. నిన్నటి ధరలే ఈ రోజు ఉండటం గమనార్హం. అంటే ఈ రోజు పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇదీ చదవండి: చిరంజీవితో స్టెప్పులేసిన బ్యూటీ.. ఇప్పడు కారు కొన్న ఆనందంలో - ఫోటోలు వైరల్ ఢిల్లీలో ఈ రోజు పసిడి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5860, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6391గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. కాబట్టి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 5860 (22 క్యారెట్స్), రూ. 63910 (24 క్యారెట్స్)గా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. -
పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
నిన్న రూ. 850 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 650 వరకు తగ్గింది. ఈ రోజు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5750, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6273గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 5750, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 62730గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 600, రూ. 650 తగ్గింది. గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధర రూ. 5865 (22 క్యారెట్స్), రూ. 6398 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 58650, రూ. 63980గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 50, రూ. 60 మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీలో ఈ రోజు పసిడి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5765, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6288గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ 600, రూ. 650 తగ్గింది. కాబట్టి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57650 (22 క్యారెట్స్), రూ. 62880కి (24 క్యారెట్స్) చేరింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. -
పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా ఐదవ రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు!
భారతీయ మార్కెట్లో విజయదశమి తరువాత భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు కూడా 10 గ్రాముల గోల్డ్ ధరలు రూ. 440 వరకు తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి? వాటి వివరాలు ఏంటి అనే సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5570, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6076గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 55700, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 60760గా ఉంది. నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధరలు రూ. 5615 (22 క్యారెట్స్), రూ. 6125 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 56150, రూ. 61250గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 450 (22 క్యారెట్స్), రూ. 550 (24 క్యారెట్స్) తగ్గింది. ఇదీ చదవండి: అమెరికా వదిలి ఇండియాకు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఇతడొక వారధి! దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు ఒక గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5585, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6091గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400 (22 క్యారెట్స్), రూ. 440 (24 క్యారెట్స్) తగ్గి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55850, రూ. 60910కి చేరింది. వెండి ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో కేజీ మీద ఏకంగా రూ. 300 తగ్గింది. -
Gold Prices: మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మొబైల్కే బంగారం ధరలు!
భారతీయులకు బంగారం అంటే ఎంతో మక్కువో తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతిరోజు అనేక మంది పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ఇందుకోసం ఏ రోజు బంగారం ధర తగ్గుతుందో అని ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏ రోజు బంగారం ధర ఎంతుందో తెలుసుకునేందుకు ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) సులువైన అవకాశం కల్పించింది. మిస్డ్ కాల్ ఇస్తే చాలు పసిడి కొనుగోలుదారులు ఏ రోజు బంగారం ధర ఎంత ఉందో తెలుసుకునేందుకు ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్కు సంబంధించిన 8955664433 మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. ఆ రోజు పసిడి ధరలు ఎస్సెమ్మెస్ రూపంలో వెంటనే మొబైల్కు వచ్చేస్తాయి. అలాగే ఐబీజేఏ అధికారిక వెబ్సైట్ కూడా సందర్శించవచ్చు. ఐబీజేఏ గురించి.. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA) అనేది దేశంలోని పసిడి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన సంస్థ. 1919లో దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని బులియన్, జ్యువెలరీ అసోసియేషన్లకు దీన్ని అపెక్స్ అసోసియేషన్గా పరిగణిస్తారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు అప్పటికి ఉన్న బంగారం ధరలను ప్రచురిస్తుంది. బంగారం ధరలు Gold Rates today: ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం.. దేశంలో ఈరోజు (అక్టోబర్ 25) సాయంత్రం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 60,560 ఉండగా 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.59,110 ఉంది. వీటికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. -
Gold prices: దీపావళికి మోతే! బంగారం, వెండి ధరలు ఆకాశానికి..
ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. నవంబర్ నెలలో రానున్న దీపావళి నాటికి ఇవి రికార్డ్ స్థాయికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. 10 గ్రాముల పసిడి రూ.61,000 లను తాకుతుందని, కేజీ వెండి రూ. 75,000 దాటుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా, దేశీయంగా బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనుకూల వాతావరణం కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయని అంచనాకు వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కారణాలివే.. ప్రపంచంలోని పలు దేశాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి సానుకూల ప్రకటన, సెంట్రల్ బ్యాంక్ల కొనుగోలు, ఫిజికల్ డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలు పెరగడానికి దారితీస్తాయని కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా అన్నారు. కెడియా ప్రకారం, ఈ దీపావళికి బంగారం ధరలు రూ. 61,000 నుంచి రూ. 61,500, వెండి ధరలు రూ. 75,000 నుంచి రూ. 76,000 స్థాయిలను తాకవచ్చు. గత సంవత్సరం దీపావళి నుంచి బంగారం ధరలు 17 శాతానికిపైగా పెరిగాయి. అలాగే వెండి ధరలు 23 శాతానికి మించి పెరిగాయి. -
గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!
Gold rates1947-2023 భారతీయులకు బంగారం అంటే లక్ష్మదేవి అంత ప్రీతి. చిన్నా పెద్దా తేడా లేకుండా భారతీయులు అందరూ పసిడి ప్రియులే. ఒక విధంగా చెప్పాలంటే పుత్తడి భారతీయ సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లు అయినా, పండగొచ్చినా, పబ్బమొచ్చినా, బంగారం ఒక భాగం కావాల్సిందే. అంతేకాదు భూమి, పొలంతోపాటు, భారతీయులు బంగారాన్ని 'సురక్షితమైన' పెట్టుబడిగా పరిగణిస్తారు. అందుకే గోల్డ్ వినియోగంలో చైనా తరువాత ఇండియా నిలుస్తోంది. బంగారం దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అయితే 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బంగారం ధరల ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం! 1964లో బంగారం అతిపెద్ద పతనం ఇండిపెండెన్స్ తరువాత మొదలైన బంగారం ధర పెరుగుదల అలా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. కేవలం 1942లో క్విట్ ఇండియా సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది. 1947లో రూ.రూ.88.62 రెట్టింపు అయింది. ఇక తరువాత తగ్గడం అన్న మాట లేకుండా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే. 1947లో బంగారం ధర రూ. 88.62 అంటే అప్పట్లో ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు 10 కిలోల బంగారం ధర కంటే ఎక్కువ ధర ఉండేది. కేవలం 5 సంవత్సరాల క్రితం అంటే 1942లో బంగారం ధర 10 గ్రాములకు రూ.44 ఉండేది. 1950 - 60 దశాబ్దంలో బంగారం దాదాపు 12 శాతం ఎగిసింది. 1970లో 10 గ్రాముల బంగారం సగటు ధర 184కి చేరింది. ఇది 1980లో రూ.1,330గా మారి 1990 నాటికి రూ.3,200 దాటింది. 2001 ఏడాదికి సుమారు 15శాతం చొప్పున పెరిగింది. 2008-2009లో ఆర్థిక సంక్షోభం మార్కెట్లను కుదిపేసినప్పటి 2000-2010 మధ్య బంగారం రేటు పరుగులు పెట్టింది. రూ 4,400 నుండి 18,500 వరకు పెరిగింది. ఆ తరువాతి దశాబ్దంలో కూడా ధరలు రెండింతలు పెరిగాయి. 2021లో సగటు బంగారం ధర 10 గ్రాములకు రూ.48,720. 2023లో రూ. 60వేల వద్ద రికార్డు స్థాయిని బ్రేక్ చేసింది. 2023లో పసిడి ధర హెచ్చుతగ్గులకు లోనైంది. అయితే 2022తో పోలిస్తే బంగారం ధరలు ఆల్టైం హైంకి చేరాయి.తొలి ఆరు నెలల్లో, ధరలు దాదాపు రూ.3,000 పెరిగాయి, దాదాపు 6.5శాతం లాభాన్ని చూసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్ ఫెడ్ రేటు పెరుగుదల, ద్రవ్యోల్బణం బంగారం ధరలు పెరగడంలో పాత్రను పోషించాయి. బంగారానికి డిమాండ్ పెరగడం వల్ల ఈక్విటీ మార్కెట్ సంవత్సరం ప్రారంభంలో నష్టపోయినా దలాల్ స్ట్రీట్లో గత రెండు నెలలుగా వరుసగా రికార్డు స్థాయిలు నమోదవుతున్నాయి. బంగారం ధరను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? పెట్టుబడి పరంగా బంగారం అత్యంత నమ్మదగిన ఎంపిక గోల్డ్. ప్రపంచ మార్కెట్లలో కదలిక కూడా బంగారం విలువను నిర్ణయిస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర పెరగడం, తగ్గడం దేశీయంగా ప్రభావం చూపుతుంది. భౌగోళిక, రాజకీయ అంశాలే కాకుండా, ఆర్థికమాంద్య పరిస్థితులు, ప్రభుత్వ విధానం కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. డాలరు, బంగారం , ద్రవ్యోల్బణం ఒకదానికొటి భిన్న దశలో కదులుతాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం తగ్గుతుంది. దిగుమతి ఎక్కడ నుంచి? స్విట్జర్లాండ్ నుంచి దాదాపు సగం బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. 2021-22లో మొత్తం బంగారం దిగుమతుల్లో స్విట్జర్లాండ్ వాటా 45.8శాతం. స్విట్జర్లాండ్ బంగారం కోసం అతిపెద్ద రవాణా కేంద్రం. అక్కడి అత్యుత్తమ శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసిన బంగారం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతోంది. బంగారంలో దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అస్థిరత సమయంలో నష్టాలను తగ్గించే డైవర్సిఫైయర్గా కూడా పనిచేస్తుంది. అలాగే చాలా కష్ట సమయాల్లో తక్షణం అక్కరకు వచ్చే ముఖ్యమైన ఎసెట్. స్టాక్ మార్కెట్లలో ఈక్విటీలలో నష్టాలొచ్చినా బంగరం మాత్రం మెరుస్తూనే ఉంటుంది. గోల్డ్ రేటు హిస్టరీ 1947 -రూ. 88.62 1964 -రూ. 63.25 1970 -రూ. 184 1975 -రూ.540 1980 -రూ.1,333 1985 - రూ.2,130 1990 - రూ.3,200 1995 - రూ.4,680 2000 - రూ.4,400 2005 - రూ.7,000 2010 - రూ.18,500 2015 - రూ.26,343 2016 - రూ.28,623 2017 - రూ.29,667 2018 - రూ.31,438 2019 - రూ.35,220 2020 - రూ.48,651 2021 - రూ.48,720 2022 - రూ.52,670 2023 - రూ.61,080 -
బంగారాన్ని కొనడమే మానేశారు.. అందుకు ఇదే కారణం!
న్యూఢిల్లీ: భారత్ పసిడి డిమాండ్పై ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రికార్డు స్థాయి ధరల ప్రతికూల ప్రభావం పడింది. సమీక్షా కాలంలో దేశ పసిడి డిమాండ్ 7 శాతంపైగా పతనమై(2022 ఇదే కాలంతో పోల్చి) 158.1 టన్నులకు తగ్గినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. పసిడికి సంబంధించి భారత్ రెండవ అతిపెద్ద వినియోగ దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. డిమాండ్ తగ్గినప్పటికీ, దిగుమతులు మాత్రం 16 శాతం పెరిగి 209 టన్నులుగా నమోదయినట్లు మండలి పేర్కొంది. 2023 మొదటి ఆరు నెలలూ చూస్తే, భారత్ పసిడి డిమాండ్ 271 టన్నులు. క్యాలెండర్ ఇయర్లో 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉంటుందని అంచనా. మండలి భారత్ ప్రాంతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సోమసుందరం పీఆర్ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే.. ► సమీక్షాకాలంలో 10 గ్రాముల పసిడి ధర భారీగా రూ.64,000కు చేరింది. పన్నుల ప్రభావం కూడా దీనికి తోడయ్యింది. వెరసి డిమాండ్ భారీగా పడిపోయింది. ► డిమాండ్ 7 శాతం పతనం ఎలా అంటే... 2022 ఏప్రిల్–జూన్ మధ్య దేశ పసిడి డిమాండ్ 170.7 టన్నులు. 2023 ఇదే కాలంలో ఈ పరిమాణం 158.1 టన్నులకు పడిపోయింది. ► ధరల పెరుగుదల వల్ల విలువల్లో చూస్తే మాత్రం క్యూ2లో పసిడి డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య పసిడి దిగుమతుల విలువ రూ.79,270 కోట్లయితే, 2023 ఇదే కాలంలో ఈ విలువ రూ.82,530 కోట్లకు చేరింది. ► ఒక్క ఆభరణాల విషయానికి వస్తే, పసిడి డిమాండ్ 8 శాతం పడిపోయి 140.3 టన్నుల నుంచి 128.6 టన్నులకు తగ్గింది. ► 18 క్యారెట్ల పసిడి ఆభరణాలకు మాత్రం డిమాండ్ పెరగడం గమనార్హం. ధరలు కొంత అందుబాటులో ఉండడం దీనికి కారణం. ► కడ్డీలు, నాణేల డిమాండ్ 3 శాతం పడిపోయి 30.4 టన్నుల నుంచి 29.5 టన్నులకు తగ్గింది. ► పసిడి డిమాండ్లో రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం కూడా కొంత కనబడింది. ► పసిడి డిమాండ్ భారీగా పెరగడంతో రీసైక్లింగ్ డిమాండ్ ఏకంగా 61 శాతం పెరిగి 37.6 టన్నులకు ఎగసింది. ► పసిడి ధర భారీ పెరుగుదల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి చరిత్రాత్మక ధర వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆశావహ ధోరణి! ఓవర్–ది–కౌంటర్ లావాదేవీలు (ఓటీసీ– ఎక్సే్చంజీల్లో లిస్టెడ్కు సంబంధించిన కొనుగోళ్లు కాకుండా) మినహా గ్లోబల్ గోల్డ్ డిమాండ్ జూన్ త్రైమాసికంలో 2 శాతం పడిపోయి 921 టన్నులకు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో సగటు కొనుగోళ్లతో పోలిస్తే సెంట్రల్ బ్యాంక్ల కొనుగోళ్లు సైతం తగ్గినట్లు మండలి పేర్కొంది. ఓటీసీ, స్టాక్ ఫ్లోలతో సహా, క్యూ2లో మొత్తం గ్లోబల్ డిమాండ్ మాత్రం 7 శాతం బలపడి 1,255 టన్నులకు చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పటిష్టమైన బంగారం మార్కెట్ను సూచిస్తోందని మండలి వివరించింది. సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ 103 టన్నులు తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. టర్కీలో కొన్ని కీలక ఆర్థిక, రాజకీయ పరిమాణల నేపథ్యంలో జరిగిన అమ్మకాలు దీనికి ప్రధాన కారణం. అయితే మొదటి ఆరు నెలల కాలాన్నీ చూస్తే మాత్రం సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో 387 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. దీర్ఘకాల సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని మండలి సీనియర్ మార్కెట్స్ విశ్లేషకులు లూయీస్ స్ట్రీట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా, టక్కీలుసహా కీలక మార్కెట్లలో వృద్ధి కారణంగా కడ్డీలు, నాణేల డిమాండ్ క్యూ2లో 6 శాతం పెరిగి 277 టన్నులుగా ఉంటే, మొదటి ఆరు నెలలోల 582 టన్నులుగా ఉంది. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) అవుట్ఫ్లోస్ క్యూ2లో 21 టన్నులయితే, మొదటి ఆరు నెలల్లో 50 టన్నులు. ఆభరణాల వినియోగ డిమాండ్ క్యూ2లో 3 శాతం పెరిగింది. ఆరు నెలల్లో ఈ పరిమాణం 951 టన్నులు. పసిడి సరఫరా క్యూ2లో 7 శాతం పెరిగి 1,255 టన్నులుగా ఉంది. గోల్డ్ మైన్స్ ఉత్పత్తి మొదటి ఆరు నెలల్లో 1,781 టన్నుల రికార్డు స్థాయికి చేరింది. అటు–ఇటు అంచనాలు... పెరిగిన స్థానిక ధరలు, విచక్షణతో కూడిన వ్యయంలో మందగమనం కారణంగా బంగారం అనిశి్చతిని ఎదుర్కొంటున్నందున, మేము బంగారం 2023 డిమాండ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి కొంత నిరాశగా ఉన్నప్పటికీ తగిన వర్షపాతంతో పంటలు, గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. దీపావళి సీజన్లో సెంటిమెంట్ మెరుగుపడుతుందని, సానుకూల ఆశ్చర్య ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నాం. ప్రస్తుత స్థాయిలోనే ధరలు కొనసాగితే 2023లో భారత్లో మొత్తం బంగారం డిమాండ్ 650–750 టన్నుల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ సీఈఓ -
బంగారం డిమాండ్కు ధర సెగ
ముంబై: దేశంలో బంగారం ధరలు తీవ్ర స్థాయికి చేరడంతో, జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది. ‘మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ పసిడి డిమండ్ 112.5 టన్నులు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 135.5 టన్నులు. ► పసిడి ఆభరణాల డిమాండ్ ఇదే కాలంలో 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. 2010 నుంచి ఒక్క మహమ్మారి కరోనా కాలాన్ని మినహాయిస్తే పసిడి ఆభరణాల డిమాండ్ మొదటి త్రైమాసికంలో 100 టన్నుల దిగువకు పడిపోవడం ఇది నాల్గవసారి. ► విలువల రూపంలో చూస్తే, మొత్తంగా పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించి రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయాయి. ► ఒక్క ఆభరణాల డిమాండ్ విలువల్లో చూస్తే, 9 శాతం పడిపోయి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పడిపోయాయి. ► పెట్టుబడుల పరిమాణం పరంగా డిమాండ్ (కడ్డీలు, నాణేలు) 17 శాతం తగ్గి 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు క్షీణించింది. ప్రపంచ పసిడి డిమాండ్ కూడా మైనస్సే.. ఇదిలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా పసిడి డిమాండ్ మొదటి త్రైమాసికంలో బలహీనంగానే నమోదయ్యింది. 13 శాతం క్షీణతతో ఈ పరిమాణం 1,080.8 టన్నులుగా ఉంది. రూపాయి ఎఫెక్ట్... పసిడి ధరలు పెరడానికి అంతర్జాతీయ అంశాలు ప్రధాన కారణంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెరుగుదలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. డాలర్ బలోపేతం, రూపాయి బలహీనత వంటి కారణాలతో గత ఏడాదితో పోల్చితే పసిడి ధర 19 శాతం పెరిగింది. పసిడి 10 గ్రాముల (స్వచ్ఛత) ధర రూ.60,000 పైన నిలకడగా కొనసాగుతోంది. ధర తీవ్రతతో తప్పనిసరి పసిడి అవసరాలకు వినియోగదారులు తమ పాత ఆభరణాల రీసైక్లింగ్, తద్వారా కొత్త కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ను ఆశ్రయిస్తున్నారు. ఈ విభాగంలో కొనుగోళ్ల పరిమాణాలు కొంత మెరుగుపడుతున్నాయి. డిమాండ్ వార్షికంగా 750 నుంచి 800 టన్నలు శ్రేణిలో నమోదుకావచ్చు. – సోమసుందరం, డబ్ల్యూజీసీ భారత్ రీజినల్ సీఈఓ -
అక్షయ తృతీయ వేళ కరుణించిన బంగారం!
అక్షయ తృతీయ పండుగ వేళ బంగారం కాస్త కరుణించింది. ఆదివారం (ఏప్రిల్ 23) 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం రెండు ధరలూ మునపటి రోజు కంటే ధర కొంతమేర తగ్గి పండుగ వేళ కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. గుడ్రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఆదివారం (ఏప్రిల్ 23) రూ.30 తగ్గి రూ.5,575 వద్ద ఉంది. శనివారం (ఏప్రిల్ 23) ఇది రూ. 5,605 ఉండేది. అదేవిధంగా 8 గ్రాముల ధర రూ.44,600, తులం (10 గ్రాములు) ధర రూ.55,750లుగా ఉంది. అంటే తులానికి రూ.300 చొప్పున ధర తగ్గింది. ఇదీ చదవండి: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి... ఇక 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.33 చొప్పున తగ్గింది. ప్రస్తుతం రూ. 6,082 వద్ద ఉంది. అంతకుముందు రోజు దీని ధర రూ.6,115 ఉండేది. 8 గ్రాముల ధర రూ. 48,656లు ఉండగా 10 గ్రాములు (తులం) ధర రూ.60,820. మొత్తంగా తులంపై రూ.330 తగ్గింది. వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా.. ఢిల్లీ, జైపూర్, లక్నో, నోయిడా నగరాల్లో ఒక తులం(10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,900, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,970. అహ్మదాబాద్, బెంగళూరు, సూరత్, వడోదరలలో 22 క్యారెట్ల స్వర్ణం రూ. 55,800 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870లుగా ఉంది. ఇక చెన్నై, కోయంబత్తూరు, మధురై నగరాల్లో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 56,050 ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,150 ఉంది. అలాగే హైదరాబాద్, పుణే నగరాల్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.55,750లుగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,820లుగా ఉంది. ఇదీ చదవండి: అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు! మరోవైపు బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా ఆదివారం (ఏప్రిల్ 23) తగ్గాయి. గుడ్రిటర్న్స్ ప్రకారం.. గ్రాము వెండి ధర రూ.0.70 తగ్గి రూ. 76.90లకు చేరింది. అంటే 8 గ్రాములకు రూ. 5.60, 10 గ్రాములకు రూ. 7 తగ్గింది. ప్రస్తుతం తులం వెండి ధర రూ.769. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో గ్రాము వెండి రూ.760, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో రూ. 804 వద్ద ఉంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధరలు.. కారణం ఇదే!
సాక్షి, నిజామాబాద్: బంగారం.. ఆల్ టైం రికార్డు దిశగా పరుగులు పెడుతోంది.. తులం ధర 61 వేలు దాటి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.. అక్షయ తృతీయ వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ఆరంభం అవుతుండటంతో నిజామాబాద్ మార్కెట్ కు కళ వచ్చింది.. పెళ్లిళ్ల కోసం పుత్తడి వారు పుట్టెడు కష్టాలు పడాల్సి వస్తోంది.. కేంద్రం పన్నులు కూడా పెంచడం కూడా ఓ కారణమనే వాదనలు కొందరు వ్యాపారులు వినిపిస్తున్నారు. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్స్ను తిరగ రాస్తున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఈ పరిస్తితి ఏర్పడుతోంది.. 22 కేరట్ల ధర ఇప్పుడు 61 వేలు దాటింది.. పదేళ్లలో లక్ష దాటుతుందని కూడా అంచనా వేస్తున్నారు వ్యాపారులు.. ఆర్ణమెంట్ గోల్డ్కు మన దేశంలో డిమాండ్ పెరగడం బంగారాన్ని పెట్టుబడులుగా చూడటం బ్యాంకులు సైతం ప్రోత్సాహం ఇవ్వడం మంచి వడ్డీ కూడా ఇస్తుండటం లాంటి కారణాలతో మన బంగారం అమ్మకాలు తగ్గడం లేదని అంటున్నారు. నిజామాబాద్ లాంటి మార్కెట్ లో గరిష్ట ధరలు నమోదవుతున్నాయి దీంతో పేద మధ్య తరగతి జనాలకు భారంగా మారుతోంది పుత్తడి.. ఈ నెల 22న అక్షయ తృతీయ ఉంది.. ఆరోజు ఒక్క గ్రాము బంగారం తీసుకున్న మంచి జరుగుతుందని భావిస్తారు.. కానీ అంతకుముందే ముందే బంగారం ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణంగా పండుగల సమయంలో అలాగే పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతోంది. అక్షయ తృతీయ తర్వాతా నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి.. దీంతో నిజామాబాద్ మార్కెట్ లో వినియోగదారుల కళ కనిపిస్తోంది.. జువెలరీ షాపులు షో రూం లు కళకళ లాడుతున్నాయి.. పెళ్లిళ్ల కోసం జనాలు వచ్చి బంగారం కొనుగోలు చేస్తున్నారు.. అయితే ఏటికేడు పెరుగుతున్న బంగారం ధరల ఎఫెక్ట్ పడుతోంది. గతంలో ఎక్కువ తులాల బంగారం కొనుగోలు చేసే వారు.. ఇప్పుడు ఆ పరిస్తితి లేదంటున్నారు జనాలు.. సగానికి పైగా తగ్గించేశామంటున్నారు.. 20 టీకాలు తీసుకునే వారు 10కి వచ్చారు.. 10 కొనేవారు ఐదు తులాలకు వచ్చారు.. బులియన్ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నటి వరకూ నమోదైన ధరల ప్రకారం.. నిజామాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61, 200 గా ఉంది. కాగా కిలో వెండి ధర రూ.750 మేర పెరిగి రూ.77,350 గా కొనసాగుతోంది. చదవండి: పాన్ - ఆధార్ లింక్లో కొత్త అప్డేట్ బంగారం ధరలు ఎంత తగ్గినా.. మరుసటి రోజు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.61వేలు దాటడంతో జనాలకు షాక్కు గురి తప్పడం లేదు.. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. రానున్న కాలంలో తులం బంగారం ధర లక్ష కూడా చూస్తాం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు -
కొత్త ‘బంగారు’ లోకం
న్యూఢిల్లీ: బంగారం ధర నూతన గరిష్ట స్థాయిలకు రానున్న వారాల్లో చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఔన్స్ ధర పూర్వపు గరిష్ట స్థాయి అయిన 2,075 డాలర్లను దాటిపోవచ్చని భావిస్తున్నారు. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తడంతో, ఇది అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లో అనిశ్చితికి దారితీయడం చూస్తున్నాం. దీంతో అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా భావించే బంగారంలోకి మరిన్ని పెట్టుబడులు వెళ్లొచ్చని, ఫలితంగా ధరలకు రెక్కలు వస్తాయన్న విశ్లేషణ వినిపిస్తోంది. నెలలో 7.5 శాతం రాబడి ఇటీవల బంగారం ధర ఔన్స్కి (28.35 గ్రాములు) 2,000 డాలర్లను తాకింది. 2022 మార్చి తర్వాత ఇది గరిష్ట స్థాయి. తాజాగా లండన్ మార్కెట్లో ఔన్స్కి 1,952 డాలర్లకు పరిమితం అయింది. అంతర్జాతీయంగా చూస్తే గడిచిన నెల రోజుల్లో బంగారం ధరలు 7.75 శాతం మేర లాభపడ్డాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ కాంట్రాక్టు గోల్డ్ 10 గ్రాములకు రూ.60,000ను తాకింది. ‘‘అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఆర్థిక అనిశ్చితులు బంగారం ధరని ఔన్స్కి 2,075 డాలర్ల గరిష్ట స్థాయికి మళ్లీ తీసుకెళతాయని భావిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. ఈ స్థాయిలో బలమైన నిరోధం ఉన్నట్టు పేర్కొంది. యూఎస్ డాలర్ బలంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. సిగ్నేచర్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వైఫల్యాలు ఇతర బ్యాంకులకు విస్తరించేది చాలా తక్కువేనని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. ఫెడ్ పెంపు ప్రభావం.. ఇవే ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగితే బంగారం ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని.. అతి త్వరలోనే ఔన్స్కి 2,075 డాలర్లను చూస్తామని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఐజీ బ్యాంక్ పేర్కొంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుకు విరామం ఇస్తే కనుక అది బంగారం ధరలకు బూస్ట్నిస్తుందని ఐఎంజీ థింక్ అంచనా వేస్తోంది. 2023 సంవత్సరానికి ఫిచ్ సొల్యూషన్స్ తన అంచనాలను సవరించింది. ఔన్స్కి గతంలో వేసిన 1,850 డాలర్లను రూ.1,950 డాలర్లకు పెంచింది. బ్యాంకింగ్ సంక్షోభం మాంద్యానికి దారితీయవచ్చనే అభద్రతా భావం ఇన్వెస్టర్లలో ఏర్పడినట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. ‘‘ఫెడ్ వడ్డీ రేట్లు అంచనాలకు తగ్గట్టు 0.25 శాతం లేదా అంతకంటే తక్కువ పెంచితే, హాకిష్ ప్రసంగం లేకపోతే అది బంగారానికి చాలా సానుకూలం అవుతుంది. 2,040–2,050 డాలర్లను చూడొచ్చు. కామెక్స్లో అయితే 10 గ్రాముల ధర రూ.61,500కు చేరొచ్చు’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెచ్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నప్పుడు బంగారం ధర సహజంగానే పెరుగుతుందని ఏజెంల్ వన్ నాన్ అగ్రి కమోడిటీస్ ఏవీపీ ప్రథమేష్ మాల్యా అన్నారు. బ్యాంకింగ్ సంక్షోభం శాంతిస్తే, ఫెడ్ అధిక పెంపు చేపట్టొచ్చని, అది బంగారం ధరల క్షీణతకు దారితీయవచ్చన్నారు. యూఎస్ ఫెడ్ దూకుడుగా రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఇప్పుడు లేవని.. తాము అయితే బంగారంపై తటస్థం నుంచి బుల్లిష్గా ఉన్నామని, 2022 క్యూ4 నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. రానున్న వారాల్లో బంగారం ధరలో ఎన్నో ఆటుపోట్లు చూడొచ్చని.. రానున్న సంవత్సరాల్లోనూ బంగారం ధర గరిష్ట స్థాయిల్లోనే కదలాడవొచ్చని, కరోనా ముందు నాటి స్థాయిలకు చేరుకోకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. -
మళ్లి పెరిగిన బంగారం ధర: వెయిట్ చెయ్యాలా? కొనుక్కోవాలా?
సాక్షి, ముంబై: వెండి , బంగారం ధరలు మళ్లీ నింగివైపు చూస్తున్నాయి. రెండు రోజులు కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు గురు, శుక్రవారాల్లో మళ్లీ ఊపందుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగింది. గురువారం నాటి రూ. 54,200తో పోలిస్తే రూ 54,800 పలుకుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 650 ఎగిసి రూ.59,780గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. గురువారంతో పోలిస్తే వెయ్యి రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ. 72,600గా ఉంది. అయితే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో, బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 225 లేదా 0.38శాతం తగ్గి రూ.59,340 వద్ద ఉంది. ఎంసీఎక్స్లో సిల్వర్ మే ఫ్యూచర్స్ కిలో రూ.7 తగ్గి రూ.70,205 వద్దకు చేరింది. (ఇది చదవండి: జియో కస్టమర్లకు ట్విస్ట్: ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్ ఇక రూ. 299లు) మరోవైపు ప్రతికూల ప్రపంచ సంకేతాలతో గ్లోబల్గా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫెడ్ రేటు పెంపు అంచనాలతో డాలర్ స్థిరంగా ఉండటంతో స్పాట్ బంగారం 0.1శాతం తగ్గి ఔన్సుకు 1,991 డాలర్లుగాఉంది. వెండి రేటు 0.01శాతం తగ్గింది. ఈ ప్రభావం దేశీయంగా ఉండే అవకాశం ఉందని అంచనా. IPL 2023: జియో అదిరిపోయే ఆరు ప్రీపెయిడ్ ప్లాన్స్ -
బంగారం డిమాండ్కు ధరల మంట
న్యూఢిల్లీ: బంగారానికి డిమాండ్ గడిచిన 10 రోజుల్లో పడిపోయింది. ఏకంగా 40 శాతం క్షీణించినట్టు ఉత్తరాది ఆభరణాల వర్తకులు చెబుతుంటే, దేశంలో బంగారం అత్యధికంగా అమ్ముడుపోయే దక్షిణాదిన గడిచిన రెండు వారాల్లో డిమాండ్ 60 శాతం తగ్గిపోయినట్టు ఈ ప్రాంత వర్తకులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం జీఎస్టీతో కలిపి రూ.60,000కు చేరుకోవడమే డిమాండ్ పడిపోవడానికి కారణంగా పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి బంగారం కొనుగోళ్ల సీజన్ మొదలవుతుందని, ఇలాంటి తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక గత రెండు వారాల్లో బంగారం ధరలు 7 శాతం పెరిగాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సూసే బ్యాంకు సంక్షోభాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు విస్తరించొచ్చన్న భయాలు బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకు సంక్షోభాలతో పాశ్చాత్య దేశాల వృద్ధిపై ప్రభావం పడుతుందని, ఆర్బీఐ రేట్ల పెంపును తగ్గించొచ్చని, లేదంటే విరామం ఇవ్వొచ్చని, ఇది మార్కెట్లో నగదు లభ్యతను పెంచుతుందన్న అంచనాలు బంగారం ధరలకు మద్దతునిచ్చినట్టు తెలిపారు. అస్థిరతలకు అవకాశం.. ‘‘బంగారం ధరల్లో సమీప కాలంలో అస్థిరతలు కొనసాగొచ్చు. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలకు మద్దతుగా విధానాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ (28.34 గ్రాములు)కు 2,020 డాలర్లకు, దేశీయంగా రూ.60,500కు చేరుకోవచ్చు’’అని కామా జ్యుయలరీ ఎండీ కొలిన్షా తెలిపారు. ఇండియన్ బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా స్పందిస్తూ.. ‘‘బంగారానికి డిమాండ్ స్తబ్దుగా ఉంది. కొనుగోళ్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గింది. ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ వేచి చూస్తోంది’’అని చెప్పారు. గడిచిన వారంలో బంగారం ధరలు ఔన్స్కు 100 డాలర్ల వరకు పెరిగినట్టు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సియమ్ మెహ్రా తెలిపారు. ఇది దేశీయ మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసినట్టు చెప్పారు. ‘‘గత 10–15 రోజుల్లో డిమాండ్ 40 శాతం తగ్గింది. మరో 15 రోజుల్లో వివాహాల సీజన్ మొదలవుతున్నప్పటికీ, వేచి చూసే ధోరణితో ప్రజలు ఉన్నారు’’అని మెహ్రా వివరించారు. సీజ్ చేసిన స్మగుల్డ్ బంగారం @ 3,502 కేజీలు 2022లో 47 శాతం అప్ స్మగ్లింగ్లో పట్టుబడి, ప్రభుత్వ ఏజెన్సీలు సీజ్ చేసిన బంగారం పరిమాణం గతేడాది 3,502 కేజీలుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 47 శాతం అధికం. కేరళలో అత్యధికంగా 755.81 కేజీల బంగారం పట్టుబడింది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (535.65 కేజీలు), తమిళనాడు (519 కేజీలు) ఉన్నాయి. రాజ్యసభకు ఆర్థిక శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం .. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు 2021లో 2,383.38 కేజీలు, అంతక్రితం ఏడాది 2,154.58 కేజీల పసిడిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఏడాది (2023) తొలి మూడు నెలల్లో 916.37 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని సీజ్ చేశాయి. 2021లో 2,445 పసిడి స్మగ్లింగ్ కేసులు, 2022లో 3,982 కేసులు నమోదయ్యాయి. బంగారం వినియోగంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. దేశీయంగా ఉత్పత్తి లేకపోవడంతో పసిడి కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే, కస్టమ్స్ సుంకం రేటు 12.5 శాతం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్సు (ఏఐడీసీ) 2.5 శాతం, ఐజీఎస్టీ రేటు 3 శాతం మొదలైనవన్నీ కలిపితే దిగుమతులపై పన్నుల భారం అధికంగా ఉంటోంది. దీనితో అక్రమ మార్గాల్లో కూడా దేశంలోకి పసిడి వస్తోంది. దీన్ని అరికట్టడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇతరత్రా ఏజెన్సీలతో కలిసి నిరంతరం నిఘాను పటిష్టం చేస్తోంది. ఎప్పటికప్పుడు స్మగ్లర్లు అనుసరించే కొత్త విధానాలను పసిగట్టి ఏజెన్సీలను అప్రమత్తం చేస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది. -
March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!
సాక్షి,ముంబై: పసిడి ధర రికార్డు స్థాయికి చేరుకుని వినియోగదారులకు షాకిస్తోంది. బులియన్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఆల్ టైం రికార్డులను బ్రేక్ చేసింది. దేశీయంగా గతం వారం రోజుల వ్యవధిలో ధర రూ.3,520కు పైగా పెరిగింది. బంగారం ధర ఈ మధ్యకాలంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ నమోదు కాలేదు. అమెరికా బ్యాంక్ సంక్షోభం పసిడి ధరలకు ఊతమిస్తోంది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 55,300గా వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,320 రూపాయలను దాటేసింది. శుక్రవారం నాటి ధరతో పోలిస్తే ఏకంగా 10 గ్రాములకు రూ. 1500 పెరిగింది. అటు వెండి ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగార ధర 10 గ్రాములు రూ. 60,320 వద్ద ఉంది. సుమారు రూ. 1,630 మేర పెరిగింది. కిలో వెండి ధర రూ. 1300 పెరిగి రూ. 74,400 వద్దకు చేరింది. గ్లోబల్గా కూడా అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే శనివారం రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. 1,988 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు వారం ముగింపుతో పోలిస్తే ఔన్స్కు 6.48 శాతం పెరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో ధర 2వేల డాలర్లను కూడా దాటేసి 2,500 డాలర్లకు చేరుకుంటుందని అంచనా. వెండి కూడా బంగారంతోసమానంగా వారానికి దాదాపు 9.22 శాతం భారీ లాభాలను ఆర్జించింది. ఇదే రేంజ్లో దేశీయంగా కూడా ధరలు ప్రభావితం కానున్నాయని మార్కెట్ నిపుణుల అంచనా. మార్చి 21న జరిగే ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ ముఖ్యంగా అమెరికా బ్యాంకింక్ సంక్షోభం నేపథ్యంలో బ్యాంకింగ్ రంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోకపోతే పసిడి ధరలు మరింత పెరుగుతాయనేది విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా అమెరికా చరిత్రలో రెండవ అతిపెద్ద బ్యాంక్ క్రాష్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) పతనంతో వడ్డీ రేట్ల పెంపు ఆందోళనకు దారి తీసింది. అటు క్రెడిట్ సూయిస్ షేర్లలో పతనం ప్రపంచ మార్కెట్ గందరగోళానికి దారితీసింది. దీంతో అంతర్జాతీయంగా శుక్రవారం బంగారం ధరలు 2 శాతానికి పైగా పెరిగిన సంగతి తెలిసిందే. -
కొత్త బంగారు లోకం
సాక్షి, అమరావతి: నిన్నా మొన్నటి వరకు 22 క్యారెట్ల బంగారు ఆభరణాల కొనుగోలుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రజల అభిరుచిలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రస్తుతం 14 –18 క్యారెట్ల బంగారంతో చేసిన ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్లే ప్రజలు ఇలా నిర్ణయం మార్చుకున్నారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వారి బడ్జెట్కు తగినట్టుగా తక్కువ క్యారెట్లతోనే ఆభరణాలు తయారు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 2021లో దేశ వ్యాప్తంగా 611 టన్నుల బంగారు ఆభరణాలు అమ్ముడైనట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా అమ్ముడవుతున్న బంగారు ఆభరణాల్లో 25 శాతం భారతీయ పెళ్లి కూతుళ్ల కోసమే కొంటున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు యువత మోడ్రన్ దుస్తులు ఎక్కువగా ధరిస్తుండటంతో వాటికి అనుగుణంగా ఆభరణాలను తయారు చేస్తున్నట్టు దేశీయ బంగారం వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికీ బంగారం అమ్మకాల్లో 80 శాతం 22 క్యారెట్ల ఆభరణాలే ఉన్నప్పటికీ.. తక్కువ క్యారెట్ల ఆభరణాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నట్టు పేర్కొంటున్నారు. గాజులు హారాలదే హవా దేశంలో అమ్ముడవుతున్న బంగారు ఆభరణాల్లో గాజులు, హారాల వాటాయే అత్యధికం. మొత్తం అమ్మకాల్లో 30–40 శాతం వాటా గాజులు ఆక్రమించగా.. హారాల వాటా 30–40 శాతం ఉంటోంది. ఆ తర్వాత స్థానంలో నెక్లెస్లు 15–20 శాతం వాటా ఉంటే.. చెవిదిద్దులు, చేతి ఉంగరాల అమ్మకాలు 5–15 శాతం చొప్పున ఉంటున్నాయి. ఒక్కొక్క నెక్లెస్ కోసం సగటున 30 నుంచి 60 గ్రాములను వినియోగిస్తుంటే.. గాజుల కోసం 10 నుంచి 15 గ్రాములు, చెయిన్ల కోసం 10 నుంచి 20 గ్రాములు, ఉంగరాలు, చెవిదిద్దుల కోసం 3నుంచి 8 గ్రాముల వరకు బంగారాన్ని వినియోగిస్తున్నారు. పెళ్లి ఆభరణాల వాటా 55 శాతం దేశీయ ఆభరణాల అమ్మకాల్లో వివాహాల సందర్భంగా వినియోగించే ఆభరణాల వాటా 55 శాతం వరకు ఉంది. దేశంలో ఏటా సగటున 1.10 కోట్ల నుంచి 1.30 కోట్ల పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అంచనా. ఆ తర్వాత పంటలు చేతికి వచ్చినప్పుడు, అక్షయ తృతీయ, ధన్తేరాస్ వంటి పర్వదినాల్లో బంగారం అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి. ఆ రోజుల్లో 60 టన్నుల బంగారం అమ్ముడవుతోంది. కాగా.. పట్టణ ప్రజలతో పోలిస్తే.. గ్రామీణులే అత్యధికంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారని వెల్లడైంది. మొత్తం బంగారం అమ్మకాల్లో 58 శాతం గ్రామీణ మధ్యతరగతి ప్రజలే కొంటున్నారు. రోజువారీ ధరించే నగల కొనుగోళ్ల వాటా 35 నుంచి 40 శాతం ఉండగా.. ఫ్యాషన్ జ్యూవెలరీ వాటా 5–10 శాతం వరకు ఉంది. దక్షిణాది ప్రజలు అత్యధికంగా ఇష్టపడే టెంపుల్ జ్యూవెలరీ, కుందన్ వంటి భారీ మోడల్స్ను ఇప్పుడు ఉత్తరాది వారు కూడా ధరించడానికి ఇష్టపడుతున్నట్టు సర్వే వెల్లడించింది. పెళ్లిలకు సగటున 35 నుంచి 250 గ్రాముల బరువుండే ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే.. రోజువారీ ధరించేందుకు 5 నుంచి 30 గ్రాముల బరువుండే ఆభరణాలను కొంటున్నారు. ఫ్యాషన్ జ్యూవెలరీ అయితే.. 5 నుంచి 20 గ్రాములలోపు వినియోగిస్తున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. -
రికార్డు దిశగా బంగారం ధర.. ఇవీ కారణాలు..
సాక్షి, విశాఖపట్నం: పసిడి ధర పరుగులు తీస్తోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. కొన్నాళ్లుగా ధర పెరగడమే తప్ప తగ్గడంలేదు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో నెలన్నర క్రితం డిసెంబర్ 5న 24 కేరెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉంది. ప్రస్తుతం రూ.58,770కు చేరింది. అంటే 45 రోజుల్లో రూ.మూడున్నర వేలు పెరిగింది. ఇక 22 కేరెట్ల పుత్తడి రూ.54,040కి చేరుకుంది. నగల దుకాణాల్లో ఆభరణాలపై తరుగు, మజూరీ పేరిట 10 నుంచి 23 శాతం వరకు కొనుగోలుదారుడి నుంచి అదనంగా వసూలు చేస్తారు. ఈ లెక్కన సగటున 15 శాతం వీటికి చెల్లిస్తే పది గ్రాముల బంగారు నగకు రూ.68 వేలు అవుతోంది. దీనికి జీఎస్టీ అదనం. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బంగారాన్ని తులం (11.66 గ్రాములు) లెక్కల్లో కొనుగోలు చేస్తారు. ఆ లెక్కన చూస్తే తులం ముడి బంగారం ధర రూ.68,625 అవుతుంది. అదే తులం ఆభరణాల ధర రూ.79 వేల వరకు ఉంటుంది. బంగారాన్ని ఆభరణాలకే కాకుండా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలోనూ వినియోగిస్తారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కూడా ఊపందుకుంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఆరి్థక మాంద్యం కూడా తోడైంది. అంతర్జాతీయంగా డాలర్తో రూపాయి మారకం విలువ తగ్గడం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావం, షేర్ మార్కెట్లో అనిశ్చితి వంటివి పసిడి ధర ఎగబాకడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆల్టైం హై దిశగా.. 2020 ఆగస్టులో 24 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,300కు చేరుకుంది. పుత్తడి చరిత్రలో అదే ఆల్టైం రికార్డు. ఇప్పుడు మళ్లీ ఆ రికార్డును దాటుకొని సరికొత్త రికార్డు దిశగా బంగారం పరుగులు తీస్తోంది. ప్రస్తుతం ధర పెరుగుతున్న వేగం, అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వర్తకులు అంచనా వేస్తున్నారు. తగ్గుతున్న కొనుగోళ్లు బంగారం ధర పెరుగుదల ఆభరణాల కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. కొన్నాళ్లుగా పసిడి ధర పెరుగుతుండడం వల్ల అమ్మకాలు పడిపోయాయని ది బెజవాడ జ్యూయలరీ అండ్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.శ్రీహరి సత్యనారాయణ ‘సాక్షి’తో చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (30 గ్రాములు) ధర 1910 నుంచి 1931 డాలర్లకు పెరిగిందన్నారు. చదవండి: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్లో సగం సీట్లు ఖాళీ ఇది 1870 డాలర్లకు దిగివస్తే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆర్థిక మాంద్యం, డాలరుతో రూపాయి మారకం విలువ తగ్గడం వంటివి బంగారం ధర పెరగడానికి దోహదపడుతున్నాయని విశాఖ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మారోజు శ్రీనివాసరావు చెప్పారు. పెళ్లిళ్ల సీజను వేళ పెను భారం.. ఈనెల 25 తర్వాత నుంచి పెళ్లిళ్ల సీజను ప్రారంభమవుతుంది. పెళ్లింట బంగారం కొనుగోలు తప్పనిసరి. పేద, మధ్య తరగతి వారు కనీసం 40 – 50 గ్రాములైనా కొనాలి. ఈ స్వల్ప మొత్తానికే రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాలి. ఇలా ఆకాశాన్నంటుతున్న పసిడి ధర తమకు పెనుభారం అవుతుందని మధ్య తరగతి వారు చెబుతున్నారు. -
బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు?
నరసాపురం(పశ్చిమగోదావరి): 20 రోజుల క్రితం తగ్గిన బంగారం ధరలు మళ్లీ 10 రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ధరలు ఇంకా తగ్గుతాయని కొన్ని నెలలుగా బులియన్ వర్గాలు విశ్లేషిస్తూ వస్తున్నాయి. అయితే సీన్ రివర్స్ అయ్యింది. వారం రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతున్నాయి మరో వైపు వెండిదీ అదే దారి. ప్రస్తుతం నరసాపురం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 53,400, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,200 వద్ద ట్రేడవుతోంది. 916 కేడీఎం ఆభరణాల బంగారం కాసు ప్రస్తుతం రూ 38,550కు చేరింది. నెలరోజుల క్రితం కాసుధర రూ.37,024గా ఉంది. నెలరోజుల్లో రూ.1536లు పెరిగింది. కిలో వెండి ధర 62,000గా ట్రేడవుతోంది. చదవండి: లోన్ యాప్స్ వేధింపులకు ఇక చెక్.. ట్రోల్ ఫ్రీ నంబర్ రిలీజ్ చేసిన హోంశాఖ నెలరోజుల క్రితం వరకూ బంగారం ధరలు తగ్గుతూ వస్తుండటంతో ఇంకా తగ్గుతాయని బులియన్ వర్గాలు అంచనా వేశాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. చైనా, ఆ్రస్టేలియా, లాటిన్ అమెరికా దేశాలు భారీగా బంగారం నిల్వలను పెంచుకునే ప్రయత్నం చేయడం, రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం చల్లారకపోవడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని అంటున్నాయి. రూపాయి మారకం విలువ రికార్డుస్థాయిలో పడిపోవడం మరో కారణం. షేర్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్లు బంగారం వైపు మళ్లడం ధరల పెరుగుదలకు కారణాలుగా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా పెరగొచ్చని భావిస్తున్నారు. రూ.4 కోట్ల వరకూ తగ్గిన అమ్మకాలు బంగారం ధరల పెరుగుదల అమ్మకాలపై పడింది. మొన్నటి వరకూ కళకళలాడిన జ్యుయెలరీ షాపులు వెలవెల బోతున్నాయి. ఒక్క నరసాపురం మార్కెట్లోనే హోల్సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.5 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతాయి. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయి. పెరిగిన ధరలతో ఉమ్మడి పశ్చిమలో రోజుకు రూ 4 కోట్లు వరకూ అమ్మకాలు తగ్గినట్లు అంచనా. దీపావళికి బంగారం అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. ధరల పెరుగుదల దీపావళి అమ్మకాలపై కూడా ప్రభావం చూపుతుందని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వేచి చూసే ధోరణిలో కొనుగోలుదారుడు ప్రస్తుతం బంగారం కొనాలా? కొన్ని రోజులు ఆగాలా? అనే సందిగ్ధంలో కొనుగోలుదారుడు ఉన్నాడు. ధరలు ఇంకా తగ్గుతాయనే విశ్లేషణతో, బంగారం కొనుగోళ్ళను చాలామంది వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా పెరుగుతున్న ధరలు వారిని షాక్కు గురిచేసాయి. ఇప్పుడేమో ధరలు ఇంకా పెరుగుతాయని చెప్పడంతో కొనాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ నష్టాల్లో ఉంది. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరగడంతో నరసాపురం మార్కెట్లోనే దాదాపు 40 శాతం అమ్మకాలు తగ్గాయి. దీపావళి పండుగ అమ్మకాలపై కూడా ప్రభావం పడింది. పండుగకు ముందస్తు ఆర్డర్లు పెద్దగా రావడంలేదు. పెట్టుబడుల రూపంలో కొనుగోలు చేసే బిస్కెట్ అమ్మకాలు మాత్రం నిలకడగా సాగుతున్నాయి. – వినోద్కుమార్జైన్, నరసాపురం చాంబర్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
అంతర్జాతీయంగా పసిడి పరుగు
వాషింగ్టన్: ఆర్థిక అనిశ్చితి ధోరణుల్లో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గురువారం 35 డాలర్లకుపైగా పెరిగి 1,752 డాలర్లపైన ట్రేడవుతోంది (రాత్రి 11 గంటల సమయంలో). అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, మాంద్యం పరిస్థితుల్లో ఇకముందు ఫెడ్ ఫండ్ రేటు మరింత దూకుడుగా ఉండబోదన్న అంచనాలు, 20 సంవత్సరాల గరిష్టం 109 నుంచి వెనక్కు తగ్గిన డాలర్ ఇండెక్స్ (ఈ వార్త రాస్తున్న సమయంలో 106.4 వద్ద ట్రేడింగ్) వంటి కీలక అంశాలు దీనికి నేపథ్యం. ఇక అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా ముంబై ప్రధాన బులియన్ మార్కెట్లో ధర రూ.500 వరకూ లాభపడింది. -
పసిడి డిమాండ్కు ధర దడ
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) 18 శాతం పడిపోయింది. 135.5 టన్నులుగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ డిమాండ్ 165.8 టన్నులు. బంగారం ధరలు భారీగా పెరగడమే డిమాండ్ తగ్గడానికి కారణం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది. ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2022 క్యూ1’ పేరుతో విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► విలువ పరంగా జనవరి–మార్చి కాలంలో బంగారం డిమాండ్ 12 శాతం తగ్గి రూ.61,550 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది కాలంలో ఈ విలువ రూ.69,720 కోట్లు. ► జనవరిలో బంగారం ధరలు పెరగడం ప్రారంభమైంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10 గ్రాముల ధర (పన్నులు లేకుండా) 8 శాతం పెరిగి రూ. 45,434కు చేరుకుంది. ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణం. 2021 జనవరి– మార్చి మధ్య ధర రూ.42,045గా ఉంది. ► మార్చి త్రైమాసికంలో దేశంలో మొత్తం ఆభరణాల డిమాండ్ 26 శాతం తగ్గి 94.2 టన్నులకు పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో ఇది 126.5 టన్నులు. ► ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విలువ పరంగా ఆభరణాల డిమాండ్ 20 శాతం క్షీణించి రూ.42,800 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.53,200 కోట్లు. ► 2021 నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్–నవంబర్–డిసెంబర్) ధర రికార్డు స్థాయికి పెరిగిన తర్వాత, భారత్ బంగారు ఆభరణాల డిమాండ్ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 26 శాతం తగ్గి 94 టన్నులకు పడిపోయింది. 2010 నుండి (మహమ్మారి కాలాలను మినహాయించి) భారత్ బంగారు ఆభరణాల డిమాండ్ 100 ట న్నుల దిగువకు పడిపోవడం ఇది మూడవసారి. ► శుభ దినాల సందర్భాల్లో నెలకొన్న మహమ్మారి భయాలు, బంగారం ధరలు గణనీయంగా పెరగడం వంటి అంశాలు రిటైల్ డిమాండ్ తగ్గడానికి కారణం. ఆయా కారణాలతో కుటుంబాలు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకున్నాయి. ► ఈ ఏడాది మొత్తంగా బంగారానికి డిమాండ్ 800–850 టన్నులు ఉండవచ్చు. ► కాగా, మార్చి త్రైమాసికంలో బంగారం విషయంలో పెట్టుబడి డిమాండ్ 5 శాతం పెరిగి 41.3 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 39.3 టన్నులు. ► విలువ పరంగా బంగారం పెట్టుబడి డిమాండ్ 13 శాతం పెరిగి రూ.18,750 కోట్లకు చేరుకుంది. ఇది 2021 అదే త్రైమాసికంలో రూ.16,520 కోట్లు. ► పెట్టుబడుల్లో ప్రధానంగా బంగారు కడ్డీలు, నాణేలు ఉన్నాయి. వీటి డిమాండ్ 5 శాతం పెరిగి 41 టన్నులకు చేరింది. ధరలు పెరగడం, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా బంగారాన్ని ఎంచుకోవడం, ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలు పసిడి పెట్టుబడుల డిమాండ్కు మద్దతునిచ్చాయి. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. ఈ కాలంలో సెంట్రల్ బ్యాంక్ 8 టన్నులను కొనుగోలు చేసింది. సెంట్రల్ బ్యాంక్ 2017 చివరి నుండి బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుండి 200 టన్నులను కొనుగోలు చేసింది. ► 2022 మొదటి త్రైమాసికంలో దేశంలో రీసైకిల్ అయిన మొత్తం బంగారం 88 శాతం పెరిగి 27.8 టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 14.8 టన్నులు. ► మార్చి త్రైమాసికంలో మొత్తం నికర బులియన్ దిగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 313.9 టన్నుల నుంచి 58 శాతం తగ్గి 132.2 టన్నులకు పడిపోయాయి. అంతర్జాతీయంగా మెరుపులు... కాగా, మార్చి త్రైమాసికంలో అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 34 శాతం పెరిగి 1,234 టన్నులకు చేరింది. అంతర్జాతీయ ఉద్రిక్తలు, ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు పసిడివైపు చూడ్డం, వంటి అంశాలు దీనికి కారణం. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి డిమాండ్ భారీగా వచ్చిందని నివేదిక గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1, 2022 నివేదిక పేర్కొంది. 2021 మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ 919.1 టన్నులు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా, అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులలో బంగారం కోసం డిమాండ్ వంటి అంశాలు యరో మెటల్కు ఆకర్షణ తీసుకుని వస్తాయిన డబ్ల్యూజీసీ సీనియర్ విశ్లేషకులు లూయిస్ స్ట్రీట్ పేర్కొన్నారు. పలు అంశాల ప్రభావం ధరలపై మార్కెట్లో మిశ్రమ ధోరణి, చైనా నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో కోవిడ్పై అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు, భౌగోళిక సంఘర్షణలు వంటి అంశాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వీటితోపాటు గ్రామీణ మార్కెట్లలో డిమండ్ పునరుద్ధరణ, సాధారణ రుతుపవన అంశాలు కూడా యల్లో మెటల్ డిమాండ్పై ప్రభావం చూపుతాయి. – పీఆర్ సోమసుందరం, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ -
బంగారం కొనేవారికి షాకింగ్ న్యూస్..! రెండు రోజుల్లో ఏకంగా...
మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా వున్నాయి. కాగా రెండు రోజుల వ్యవధిలో నే బంగారం ధరలు సుమారు రూ. 500 వరకు పెరిగాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఉక్రెయిన్ రష్యా వార్ నేపథ్యంలో అంతర్జాతియంగా గోల్డ్ ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్సీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ .52,860 వద్ద ట్రేడవుతోంది. కాగా నేడు 10 గ్రాముల బంగారం ధర రూ. 18 తగ్గడం విశేషం. ఇక సీల్వర్ ఫ్యూచర్స్ ధర ఎమ్సీఎక్స్లో కిలోకు రూ.147 పెరిగి రూ.68,937 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర గత రెండు రోజుల్లో రూ.440కి పైగా పెరిగి ₹53,460కి చేరుకుంది. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010కి పెరిగింది. అలాగే, మన హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010 గా వుంది.. అలాగే, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో రూ.53,020 నుంచి రూ.53,460కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. -
పెరుగుతున్న ద్రవ్యోల్భణం..! బంగారం ధరలు ఎలా ఉండొచ్చు అంటే...?
ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున షార్ట్ డ్యురేషన్ ఫండ్ కంటే బంగారం మెరుగైనదా? బంగారం ధరలు ఎలా ఉండొచ్చు? – రాజేంద్రన్ వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో బంగారం స్థిరంగా ఉండడమే కాకుండా, రాబడినిస్తుంది. అని శ్చిత పరిస్థితుల్లో ఇది సురక్షిత సాధనం. అయితే, ఇది సిద్ధాంతం మాత్రమే. వాస్తవం ఏమిటంటే బంగారం ఎంతో అస్థిరతలతో కూడుకున్నదని నిరూపితమైంది. ఎన్నో కారణాలు ఈ అస్థిరతలకు దోహదం చేస్తుంటాయి. ఇందులో ఒకటి డిమాండ్–సరఫరా. ఇది ధరలను నిర్ణయిస్తుంటుంది. పైగా బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ ఒక టి. గతేడాది గణనీయంగా బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. భారత్లో బంగారం అతిపెద్ద దిగు మతి ఉత్పత్తిగా మారిపోయింది. ఇది ప్రభుత్వానికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అనుత్పా దక సాధనం కనుక బంగారాన్ని పెట్టుబడి సాధనంగా ప్రభుత్వం నిరుత్సాహపరచొచ్చు. మనం షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తే ఫ్యాక్టరీలు, పరిశ్రమ, సేవల కంపెనీల యాజమాన్యంలో వాటా లభిస్తుంది. కానీ, బంగారాన్ని కొనుగోలు చేస్తే తీసుకెళ్లి లాకర్లో పెట్టేస్తాం. దాంతో అది ఉత్పాదకతలోకి రాదు. కనుక ప్రభుత్వం దీన్ని పెట్టుబడి కోణంలో నిరుత్సాహపరచొచ్చు. ఈ పరిస్థితులు బంగారంలో అస్థిరతలకు దారితీస్తాయి. అందుకనే స్వల్ప కాలం కోసం అల్ట్రా షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. పెరుగుతున్న వడ్డీ రేట్ల సైకిల్ను అధిమించడానికి ఇదే మెరుగైన మార్గం అవుతుంది. అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్ను గుర్తించడం ఎలా? – కపిల్ వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్ను గుర్తించడం అన్నది ఆర్ట్, సైన్స్తో కూడుకున్నది. డిస్కౌంటింగ్ సూత్రా న్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో గుర్తించి, ఆ మేరకు చెల్లించేందుకు ముందుకు రావడం. ఇక్కడ ఎన్నో అంశాలు లెక్కించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అనేది కూడా చూడాలి. కంపెనీ నుంచి నిధులను మింగేస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని కొనసాగే బలం కూడా కావాలి. నా వద్ద రూ.12 లక్షలు ఉన్నాయి. ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మా కార్యాలయం నుంచి ఉన్న ఆంక్షల కారణంగా స్టాక్స్లో నేరుగా ఇన్వెస్ట్ చేయలేను. కనుక ఈ మొత్తాన్ని ఎక్కడ, ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? – బర్జిత్ సింగ్ ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఒకటి కాల వ్యవధి, రెండు పెట్టుబడుల పరంగా ఉన్న అనుభవం కీలకమవుతాయి. ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోతే (ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో సైతం) మీరు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి సాధారణంగా 65 శాతం వరకు ఈక్విట్లీలో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మూడింట ఒక వంతు డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల వృద్ధిలో స్థిరత్వం ఉంటుంది. మార్కెట్ల పతనాల్లో అచ్చమైన ఈక్విటీ పథకాల మాదిరి, ఈ ఫండ్స్ మరీ అంత నష్టాలను నమోదు చేయవు. అలాగే, ఈ ఫండ్స్లో మొత్తం పెట్టుబడిని ఒకే విడతలో పెట్టేయకూడదు. 12 నెలల్లో సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడి వ్యయం సగటుగా మారుతుంది. కుదుపులను తట్టుకునేందుకు సాయపడుతుంది. ఒకే విడత రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి.. ఆ తర్వాత 20% పడిపోయినా నష్టం ఎక్కువగా ఉంటుంది. దాంతో పెట్టు బడులను వెనక్కి తీసేసుకుందామన్న ఆందో ళన ఏర్పడొచ్చు. ఏడాది కాలం పాటు సిప్ రూపం లో రూ.12 లక్షలను ఇన్వెస్ట్ చేయడం వల్ల విశ్వాసం కూడా పెరుగుతుంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ ట్రేడింగ్పై బీఎస్ఈ కసరత్తు
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) ట్రేడింగ్ను తమ ప్లాట్ఫాంపై ఆవిష్కరించేందుకు అవసరమైన టెక్నాలజీతో సిద్ధంగా ఉన్నట్లు బాంబే స్టాక్ ఎక్సే్చంజీ (బీఎస్ఈ)చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ పాటిల్ తెలిపారు. త్వరలో దీనికి అనుమతులు పొందేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పసిడి ధరలు దాదాపు ఒకే రకంగా ఉండేలా చూసేందుకు ఈజీఆర్లు తోడ్పడగలవని పాటిల్ చెప్పారు. ఇతర షేర్ల లావాదేవీల తరహాలోనే ఈజీఆర్ల ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ విధానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈజీఆర్లను డీమ్యాట్ తరహాలోనే ఉంచుకోవచ్చని, అవసరమైనప్పుడు భౌతిక బంగారం రూపంలోకి మార్చుకోవచ్చని పాటిల్ చెప్పారు. ఇదంతా మూడు అంచెల్లో జరుగుతుందన్నారు. ముందుగా భౌతిక బంగారాన్ని ఈజీఆర్ల్లోకి మార్చడం, ఈజీఆర్ రూపంలో ట్రేడింగ్ నిర్వహించడం, తర్వాత ఈజీఆర్ను తిరిగి భౌతతిక రూపంలోకి మార్చడం ఉంటుందని పాటిల్ చెప్పారు. ముందుగా 1 కేజీ, 100 గ్రాముల డినామినేషన్లో ఈజీఆర్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు దశలవారీగా 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాముల పరిమాణంలో కూడా ఈజీఆర్లను అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. క్లయింట్లు కావాలనుకుంటే భౌతిక బంగారాన్ని నిర్దిష్ట డెలివరీ సెంటర్లో జమ చేసి ఈజీఆర్ను కూడా పొందవచ్చని పాటిల్ వివరించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ప్రస్తుతం భౌతిక రూపంలో బంగారం ట్రేడింగ్కు కూడా స్పాట్ ఎక్సే్చంజీలు ఉన్నప్పటికీ, భారత్లో మాత్రం గోల్డ్ డెరివేటివ్స్, గోల్డ్ ఈటీఎఫ్ల్లో మాత్రమే ట్రేడింగ్కు అనుమతి ఉంటోంది. -
ఎగుమతుల రంగానికి కేంద్రం ఊతం
-
పెరుగుతున్న బంగారం ధర
ముంబై: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం కొంతమేరకు ధరలు తగ్గగా.. ఈ సోమవారం (జూలై 26, సోమవారం) స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు దిగువనే ఉన్నాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్కి సంబంధించి ప్రారంభ సెషన్లో రూ.94.00 పెరిగి రూ.47628.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.118.00 పెరిగి రూ.47902.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం రూ.48,000 పైకి చేరుకున్న పుత్తడి చివరి సెషన్లలో కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక వెండికి సంబంధించి సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.189.00 పెరిగి రూ.67213.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.205.00 పెరిగి రూ.68380.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000 స్థాయిలో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత క్షీణించాయి. డెల్టా వేరియంట్ భయాలతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లు సేఫ్గా భావించడంతో ఆ ప్రభావం ధరలపై కనిపించింది. -
New York Mercantile Exchange: మళ్లీ పసిడి జిగేల్!
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్.. న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్స్చేంజ్ (నైమెక్స్)లో మళ్లీ పసిడి మెరుస్తోంది. ఔన్స్ (31.1గ్రా) ధర బుధవారం కీలకమైన 1,900 డాలర్లు దాటింది. ఒకదశలో 1,913 డాలర్లకుపైగా ఎగసింది. గడచిన 20 వారాల్లో పసిడి కీలక నిరోధం 1,900 డాలర్లను అధిగమించడం ఇదే తొలిసారి. 1,913 డాలర్ల నిరోధాన్ని అధిగమించి, స్థిరపడితే తిరిగి గరిష్టాల దిశగా బంగారం దూసుకుపోయే అవకాశం ఉందన్నది విశ్లేషణ. కారణం ఏంటి..: అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు తలెత్తాయి. అయినప్పటికీ సరళతర ఆర్థిక విధానాలకే (ప్రస్తుత ఫెడ్ ఫండ్రేటు 0.00 శాతం–0.25 శాతం) కట్టుబడి ఉన్నట్లు ఫెడరల్ రిజర్వ్ అధికారులు స్పష్టం చేశారు. దీనితో ఆరు దేశాల కరెన్సీల ప్రాతిపదికన లెక్కించే డాలర్ ఇండెక్స్ 93 గరిష్ట స్థాయిల నుంచి తాజాగా 89.80 కనిష్టానికి (4 నెలల కనిష్టం) పడిపోయింది. ఇది పసిడి ధర పెరుగుదలకు దారితీసింది. సరళతర ఆర్థిక పరిస్థితులు ఒకవైపు, ఆర్థిక పరిస్థితిపై అనిశ్చితి మరోవైపు నేపథ్యంలో తిరిగి ఇన్వెస్టర్ పసిడిని తన పెట్టుబడులకు తక్షణ రక్షణ కవచంగా ఎంచుకున్నట్లు విశ్లేషణ. పసిడి 52 వారాల కనిష్ట ధర 1,673 డాలర్లు కాగా, గరిష్ట ధర రూ.2,107 డాలర్లు. దేశీయంగా చూస్తే...: అంతర్జాతీయంగా పసిడి చరిత్రాత్మక గరిష్టం వద్ద ఉన్నప్పుడు దేశీయంగా ధర 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.56,000 పలికింది. 1,640 డాలర్ల స్థాయికి పడిపోయినప్పుడు కొంచెం అటుఇటుగా రూ.45,000 వద్దకు చేరింది. బుధవారం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర దాదాపు రూ.200 లాభంతో రూ.49,000 పైకి ఎగసింది. దేశీయ ధరపై అంతర్జాతీయ ఎఫెక్ట్ అంతర్జాతీయంగా ధరల పెరుగుదల దేశీయ యల్లో మెటల్పై ప్రభావం చూపుతోంది. దీనితో దేశంలో ధర 4 నెలల కనిష్టానికి చేరింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పడిపోవడం, డాలర్ ఇండెక్స్ బలహీన ధోరణి, ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఫెడ్ భయాలు, దీనికితోడు భారత్సహా పలు దేశాల్లో కరోనా సెకండ్వేవ్ సవాళ్లు పసిడి ధర పెరుగుదలకు దారితీశాయి. –నిష్ భట్, సీఈఓ, మిల్ఉడ్ కేన్ ఇంటర్నేషనల్ చదవండి: స్విగ్గీ.. జొమాటోకు షాక్.! -
మెరుపు తగ్గిన బంగారం..బ్యాంకింగ్కు ఇబ్బందే!
సాక్షి, ముంబై: బంగారం ధర తగ్గడం వల్ల బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రుణ నాణ్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. బంగారం హామీగా రుణాలు ఎన్బీఎఫ్సీల ప్రధాన వ్యాపార కార్యకలాపాల్లో ఒకటన్న సంగతి తెలిసిందే. కాగా, బంగారాన్ని తాకట్టుగా ఉంచుకుని గత ఆర్థిక సంవత్సరం (2020–21) భారీగా రుణాలు ఇచ్చిన బ్యాంకుల రుణ నాణ్యతకు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చని అంచనావేసింది. ఈ నేపథ్యంలో క్రిసిల్ విడుదల చేసిన నివేదిక ముఖ్యాంశాలు చూస్తే... ♦ గత కొన్ని ఆర్థిక సంవత్సరాలగా బంగారం హామీగా ఎన్బీఎఫ్సీలు ఇస్తున్న రుణ తీరును పరిశీలిస్తే, పసిడి ధరపై రుణ విలువ (లోన్-టూ-వ్యాల్యూ-ఎల్టీవీ) 75 శాతం దిగువనే ఉంది. దీనికితోడు క్రమానుగతంగా వడ్డీని సంస్థలు సక్రమంగా వసూలు చేస్తున్నాయి. ♦ 2020 డిసెంబర్ 31వరకూ పరిశీలిస్తే, ఎన్బీఎఫ్సీల సగటు ఎల్టీవీ 63 నుంచి 67 శాతం వరకూ ఉంది. అయితే కేవలం 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికాన్ని చూస్తే, ఇది 70 శాతంగా ఉంది. ♦ ఎల్టీవీ విషయంలో ఎన్బీఎఫ్సీలు చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వాటి లోన్ బుక్స్ను పరిశీలిస్తే, బంగారంపై వడ్డీ ఆదాయాలు స్థిర రీతిన 2 నుంచి 4 శాతంగా ఉంటున్నాయి. ♦ మరోవైపు గడచిన ఆర్థిక సంవత్సరం ఎన్బీఎఫ్సీలతో పోల్చితే బంగారం హామీగా బ్యాంకులు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేశాయి. వీటి ఎల్టీవీ ఏకంగా 78 నుంచి 82 శాతం వరకూ ఉంది. ♦ ఫిబ్రవరి 2021 వరకూ గడచిన 11 నెలల్లో బంగారం హామీగా బ్యాంకుల రుణ మంజూరీ దాదాపు 70 శాతం పెరిగి రూ.56,000 కోట్లకు చేరాయి. బ్యాంకులకు 90శాతం వరకూ ఎల్టీవీ వెసులుబాటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కల్పించడం ఈ భారీ మంజూరీలకు ఒక కారణం. 2021 మార్చి 31 వరకూ బ్యాంకులకు ఈ వెసులుబాటు లభించింది. ♦ 2020 ఆగస్టు నుంచీ బంగారం ధరల 18 నుంచి 20 శాతం వరకూ పడిపోయాయి. దీనికితోడు బంగారంపై ఇచ్చిన రుణాలకు వడ్డీలు కూడా సరిగా వసూలు కాకపోతే, రుణ నాణ్యతపై కొంతమేర ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ పేర్కొన్నారు. ♦ ఆయా అంశాలను పరిశీలిస్తే, బంగారం ధరల్లో అస్థిరతల సమస్య నుంచి బయటపడ్డానికి రెండు కీలక మార్గాలు కనబడుతున్నాయి. పటిష్టమైన ‘ఇబ్బందుల నిర్వహణా వ్యవస్థ ఏర్పాటు’ ఇందులో ఒకటి. సకాలంలో కుదువ పెట్టిన బంగారాన్ని వేలం వేసేలా చర్యలు తీసుకోవడం రెండవ కీలక చర్య. పసిడి ధరల్లో ఒడిదుడుకులు ఇలా... కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లను ‘సురక్షిత పెట్టుబడుల సాధనంగా’ పసిడి ఆకర్షించింది. గత సంవత్సరం ఆగస్టులో అంతర్జాతీయ కమోడిటీస్ ఫ్యూచర్స్ మార్కెట్-న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజ్ (నైమెక్స్)లో ఔన్స్ (31.1గ్రాము) చరిత్రాత్మక గరిష్ట స్థాయి రూ.2,089 డాలర్లను తాకింది. అయితే అమెరికా ఆర్థిక ఉద్దీపన, తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయన్న విశ్వాసం బలపడ్డం, ఈక్విటీ మార్కెట్ల బలోపేత ధోరణి, డాలర్ ఇండెక్స్ (89 నుంచి 92 పైకి అప్) బలోపేతం వంటి అంశాల నేపథ్యంలో పసిడి ధర క్రమంగా భారీగా తగ్గింది. ఈ వార్తరాసే సోమవారం (12 ఏప్రిల్) రాత్రి 8 గంటల సమయంలో నైమెక్స్లో ధర 1,733 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గడచిన నెలరోజుల్లో పసిడికి 1,640 డాలర్ల వద్ద రెండుసార్లు పటిష్ట మద్దతు లభించింది. ఈ స్థాయి కిందకు పడితే పసిడి మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా పసిడి చరిత్రాత్మక గరిష్టం వద్ద ఉన్నప్పుడు దేశీయంగా ధర 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.56,000 పలికింది. ప్రస్తుతం కొంచెం అటుఇటుగా రూ.46,500 వద్ద ధర ఉంటోంది. ఈ వార్త రాస్తున్న సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్-మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ధర రూ.46,578 వద్ద ట్రేడవుతోంది. ఎన్బీఎఫ్సీలు పటిష్టం: ఇండియా రేటింగ్స్ ఇదిలాఉండగా, కరోనా సెకండ్వేవ్ను తట్టుకోగలిగిన సామర్థ్యంలో ఎన్బీఎఫ్సీలు ఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇందుకు తగిన పటిష్ట మూలధనం, ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎన్బీఎఫ్సీలు కలిగి ఉన్నట్లు వివరించింది. సెకండ్ వేవ్తో వ్యాపార కార్యకాలాపాలకు తిరిగి కఠిన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషించింది. ఎన్బీఎఫ్సీలు తమ కస్టమర్లకు చక్కటి సేవలు అందించగలుతున్నట్లు వివరించింది. రిటైల్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్బీఎఫ్సీలకు ప్రస్తుతం తాను ఇస్తున్న ‘స్టేబుల్ అవుట్లుక్’ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అలాగే 2021-22కు హోల్సేల్ ఎన్బీఎఫ్సీలకు నెగటివ్ అవుట్లుక్ను కొనసాగుతుందని వివరించింది. సెకండ్వేవ్ విసిరే కొత్త సవాళ్లు వృద్ధి రికవరీపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయాన్ని వేచి చూడాల్సి ఉందని పేర్కొంది. -
బంగారం ధర మరింత దిగొస్తుందా? లేదా?
ముంబై/న్యూయార్క్: పసిడి ధరల కదలికలపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న ఆగస్టు 2020లో పసిడి ధరలు 10 గ్రాముల పూర్తి స్వచ్ఛత ధరలు దేశంలోని ప్రధాన మార్కెట్ ముంబైలో రూ.56 వేల గరిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతం దాదాపు రూ.45 వేల వద్ద ట్రేడవుతోంది. అంటే గరిష్టం నుంచి చూస్తే, దాదాపు 20 శాతం పడ్డాయి. ఆగస్టు 2020లో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1 గ్రా) దాదాపు 2,072 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. 2021 ఏప్రిల్ 1వ తేదీ గురువారంతో ముగిసిన వారంలో 1,730 డాలర్లకు చేరింది. గడచిన నెలరోజుల్లో పసిడికి 1,640 డాలర్ల వద్ద రెండుసార్లు పటిష్ట మద్దతు లభించింది. అలాగే 1,750 డాలర్ల వద్ద నిరోధం ఎదురయ్యింది. 1,750 డాలర్ల స్థాయిని అధిగమిస్తే, తిరిగి పసిడి 1,850 డాలర్ల స్థాయికి ఎగసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత అంశాల ప్రాతిపదికన, ప్రపంచవ్యాప్తంగా పసిడి వినియోగంలో రెండవ అతిపెద్ద దేశమైన భారత్లో– 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర సమీప భవిష్యత్తులో రూ.40వేల కిందకి దిగిరాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశ్లేషణలు ఇవీ... అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, వ్యాక్సినేషన్ విస్తృతి, సెకండ్ వేవ్ వంటి అంశాలపై పసిడి భవిష్యత్ ధర ఆధారపడి ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. అయితే పసిడి ఇప్పట్లో తిరిగి గరిష్టాల దిశగా వెళ్లే అవకాశం లేదన్నది నిపుణుల వాదన. అలాగే దేశీయంగా సమీప భవిష్యత్తులో పసిడి పూర్తి స్వచ్ఛత రూ.40,000 కిందకి పడకపోవచ్చనీ భావిస్తున్నారు. దేశంలో పసిడి ధర అంతర్జాతీయ ఆర్థిక అంశాలతోపాటు డాలర్ మారకంలో రూపాయి విలువపై ఆధారపడి ఉంటుంది. రూపాయి బలహీనపడితే పసిడి ధర పెరిగే వీలుంది. అయితే రూపాయి ప్రస్తుతం మరీ అంతగా బలహీనపడే అవకాశం లేదన్నది విశ్లేషణ. ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువ 73కు 50 పైసలు అటు ఇటుగా కదలాడుతోంది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం, ఈక్విటీ మార్కెట్ల బలోపేత ధోరణి రూపాయికి పటిష్టతను ఇస్తాయన్న అంచనాలు ఉన్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). రూపాయి పటిష్టానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ తన ‘ఫారెక్స్ ఇంటర్వెన్షన్’ ద్వారా రూపాయి బలోపేతానికి దాదాపు 80 బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. వెరసి ‘అంతర్జాతీయంగా ధర భారీగా పెరిగిపోతే తప్ప’ దేశంలో పసిడి ధర తగ్గడానికే అధిక అవకాశాలు ఉన్నాయని అంచనా. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్స్ రేటు (ప్రస్తుతం 0.25 శాతం), అమెరికా డాలర్ కదలికల (ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన వారంలో డాలర్ ఇండెక్స్ ముగింపు 93), కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం, అమెరికా సహా ప్రపంచ ఎకానమీ రికవరీ ధోరణి వంటి కీలక అంశాలు అంతర్జాతీయంగా పసిడి ధరను ప్రభావితం చేసే అవకాశం ఉంది. పసిడి 52 వారాల కనిష్ట ధర 1,458 డాలర్లు కాగా, గరిష్ట ధర రూ.2,089 డాలర్లు. ఇక డాలర్ ఇండెక్స్ 52 వారాల కనిష్ట, గరిష్టాలు 89.16 – 104 శ్రేణిలో ఉంది. లాక్డౌన్ భయాలు... 2020 మార్చితో పోల్చితే 2021 మార్చిలో పసిడి దిగుమతులు 471 శాతం పెరిగి, దాదాపు 160 టన్నులుగా నమోదయ్యాయి. దిగుమతి సుంకాల తగ్గింపు, గరిష్ట స్థాయిల నుంచి ఎల్లో మెటల్ దిగిరావడం వంటి అంశాలు రిటైల్ కొనుగోలుదారులను పసిడి పట్ల ఆకర్షణకు గురిచేసినట్లు విశ్లేషణలు ఉన్నాయి. మార్చిలో గోల్డ్ ఫ్యూచర్ ఏడాది కనిష్టం రూ.43,320 కనిష్టానికి పడింది. రిటైల్ డిమాండ్ భారీగా ఉండడంతో వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపారని ముంబైకి చెందిన ఒక బులియన్ డీలర్ పేర్కొన్నారు. ఆభరణాలకు డిమాండ్ నెలకొనడంతో పసిడి ధర మరీ పడిపోకుండా కొంత మద్దతు పొందినట్లు ఆయన వివరించారు. ఇక ఏప్రిల్ నెలలో పసిడి దిగుమతులు 100 టన్నుల లోపునకు పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్డౌన్ భయాలు నెలకొనడం దీనికి కారణం. ఆయా అంశాలు కూడా పసిడి ధరలను సమీప కాలంలో రూ.40,000పైన నిలబెడతాయన్న అంచనాలు ఉన్నాయి. -
దిగి వస్తున్న బంగారం ధరలు
సాక్షి, ముంబై: బంగారం ధరలు మరింత దిగి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆల్టైం గరిష్టంనుంచి క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్ప క్షీణతను నమోదు చేయగా వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. నేడు (మార్చి 31న) మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో, జూన్ ఫ్యూచర్స్ 0.9 శాతం తగ్గి 10 గ్రాములకు 44,304 రూపాయల ట్రేడవుతున్నాయి. మే వెండి ఫ్యూచర్స్ 0.84 శాతం తగ్గి కిలోగ్రాము 62,595 వద్ద ట్రేడవుతున్నాయి. (నయా ట్రెండ్: కారు అలా కొనేస్తున్నారట!) తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలోకూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు 24 క్యారెట్ల పసిడి ధర రూ.380 తగ్గి,10 గ్రాములు రూ.45,110 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,350కి పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి కిలో ధర రూ.68,700 వద్ద మార్కెట్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,4400 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,490 వద్ద మార్కెట్ అవుతోంది. రూ .44,300- 44,100 స్థాయిల వద్ద బంగారానికి మద్దతు ఉంటుందని రూ .44,660-44,800 స్థాయిల వద్ద రెసిస్టెన్స్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వెండికి 62,800-62,500 రూపాయల మద్దతు, 63,600-64,000 స్థాయిలలో ప్రతిఘటన ఉందని నిపుణులు అంటున్నారు. రూపాయిలో బలహీనత ఉన్నప్పటికీ, వెండి బంగారం ధరలు బలహీనంగా ఉన్నాయి. అటు డాలర్ బలం పుంజుకుని నాలుగున్నర నెలల గరిష్ట స్థాయికి చేరుకుని 93 మార్కును దాటింది. అమెరికా బాండ్ దిగుబడి పుంజుకున్న నేపథ్యంలో రూపాయ నెల కనిష్టానికి చేరింది. భవిష్యత్తులో మరింత పడిపోవచ్చని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా డాలర్లకు డిమాండ్ బావుందని వ్యాపారులు భావిస్తున్నారు. (హోండా ప్రీమియం బైక్స్ : ధర ఎంతంటే) అంతర్జాతీయ మార్కెట్లలోనూ బులియన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ బంగారం ధరల 0.1 శాతం తగ్గి ఔన్సుకు 1,683.56 డాలర్లకు చేరుకుంది. వెండి 24.01 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, ప్లాటినం 0.5 శాతం పెరిగి 1,160.05 డాలర్లకు, పల్లాడియం 0.7 శాతం పెరిగి 2,607.04 డాలర్లకు చేరుకుంది. చైనాలో ఫ్యాక్టరీ కార్యకలాపాల డేటా కారణంగా బంగారం రేట్లు మరింత పడిపోయాయని రాయిటర్స్ తెలిపింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు బైడెన్ ప్రకటించిన మల్టీ ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
2 నెలల్లో పసిడి ధర ఎంత తగ్గిందంటే..
ఈ ఏడాది బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కిందకు దిగొస్తున్నాయి. 2021 జనవరి 5న గరిష్టంగా రూ.52,360 ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర నేడు హైదరాబాద్ మార్కెట్లో రూ.45,600కు చేరుకుంది. అంటే కేవలం రెండు నెలల్లోనే రూ.6,760 పడిపోయింది. బంగారం కొనేందుకు ఇదే మంచి అవకాశం అని, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైతే ధరలు మళ్లీ పెరగొచ్చని మార్కెట్ వర్గాల నిపుణులు పేర్కొంటున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టేవాళ్లు కూడా ఇతర మార్కెట్ వైపు వెళుతుండడంతో వీటి ధరలు పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 మేర తగ్గి రూ.41,800కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,400 మేర తగ్గి రూ.70,400 చేరుకుంది. చదవండి: అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్! భారత టెలికామ్ రంగంలో మరో విప్లవం -
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు ఇప్పుడు కిందకు చూస్తున్నాయి. ఫిబ్రవరి 20 నుంచి పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.45,900కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలకు డిమాండ్ తగ్గడమే దేశంలో ఇవాళ బంగారం ధరలు తగ్గడానికి కారణమని నిపుణులు తెలిపారు. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,730కు చేరుకుంది. అలాగే ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గి రూ.43,750కు చేరుకుంది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. హైదరాబాద్ కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.74,400కు చేరుకుంది. చదవండి: 5జీ కోసం క్వాల్కామ్తో ఎయిర్టెల్ జట్టు భారత్ లో విడుదలైన లగ్జరీ బీఎండబ్ల్యూ బైక్ -
బంగారం కొండ దిగుతోంది..!
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మరోసారి డీలా పడ్డాయి. అటు స్పాట్, ఇటు ఫ్యూచర్స్ మార్కెట్లో వరుసగా ఆరో రోజు క్షీణించాయి. ఈ బాటలో విదేశీ మార్కెట్లోనూ వెనకడుగులో కదులుతున్నాయి. న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో బంగారం(24 క్యారట్స్) 10 గ్రాములు తాజాగా రూ. 239 నష్టపోయి రూ. 45,568కు చేరింది. ఎంసీఎక్స్లోనూ రాత్రి 8 గంటల ప్రాంతంలో రూ. 98 నీరసించి రూ. 46,028 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 45,861 వరకూ క్షీణించింది. ఇది 8 నెలల కనిష్టంకావడం గమనార్హం! ఇక న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) 0.2 శాతం తక్కువగా 1,772 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి ఏప్రిల్ ఫ్యూచర్స్కాగా.. స్పాట్ మార్కెట్లో 1,773 డాలర్ల వద్ద కదులుతోంది. ఇవి మూడు నెలల కనిష్టం! దశాబ్ద కాలంలోనే అత్యధిక రాబడి... కొత్త ఏడాది(2021)లో బంగారం ధరలు వెనకడుగు వేస్తున్నప్పటికీ గత కేలండర్ ఏడాది(2020)లో 25 శాతంపైగా జంప్చేశాయి. ప్రపంచదేశాలను వణికించిన కోవిడ్–19 నేపథ్యంలో గతేడాది పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడంతో లిక్విడిటీ పెరిగి పసిడిలోకి పెట్టుబడులు మళ్లినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో ఆర్థిక వ్యవస్థలు మాంద్యం బారినపడటం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెప్పారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితుల్లో బంగారాన్ని రక్షణాత్మక పెట్టుబడిగా భావించే సంగతి తెలిసిందే. దీంతో పసిడిలో పెట్టుబడులకు వివిధ దేశాల కేంద్ర బ్యాం కులతోపాటు.. ఈటీఎఫ్ సంస్థలు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం జోరుకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా 2020లో దశాబ్ద కాలంలోనే అత్యధికంగా రాబడి ఇచ్చినట్లు తెలిపారు. గరిష్టం నుంచి రూ. 10,000 పతనం గత ఆగస్ట్లో 10 గ్రాముల పసిడి ఎంసీఎక్స్లో రూ. 56,200ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. తదుపరి ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగింది. అయితే ఇటీవల అమ్మకాలు పెరగడంతో డీలా పడుతూ వచ్చింది. దీంతో 2021లో ఇప్పటివరకూ 8 శాతం లేదా రూ. 4,000 క్షీణించింది. వెరసి రికార్డ్ గరిష్టం నుంచి చూస్తే ఆరు నెలల్లో 18 శాతం(రూ. 10,000) కోల్పోయింది. ఇక విదేశీ మార్కెట్లోనూ ఆగస్ట్ 7న ఔన్స్ 2072 డాలర్లను అధిగమించింది. ఆర్థిక వ్యవస్థకు దన్నునిచ్చే బాటలో యూఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లకుపైగా ప్యాకేజీకి సన్నాహాలు చేస్తుండటం పసిడి ధరలపై ఒత్తిడిని పెంచుతున్నట్లు మిల్వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక సీఈవో నిష్ భట్ అభిప్రాయపడ్డారు. ఈల్డ్స్ పుంజుకుంటే పసిడిని హోల్డ్ చేసే వ్యయాలు పెరుగుతాయని, దీంతో ట్రేడర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. ఆర్థిక రికవరీ సంకేతాలు... ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం అంటే యూఎస్ ఆర్థిక రికవరీకి సంకేతంగా భావిస్తామని భట్ పేర్కొన్నారు. సాంకేతికంగా చూస్తే రూ. 46,000 ధర.. ఫిబోనకీ రీట్రేస్మెంట్ ప్రకారం 50 శాతానికి దగ్గరగా ఉన్నట్లు క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ నిపుణులు క్షితిజి పురోహిత్ పేర్కొన్నారు. రోజువారీ చార్టుల ప్రకారం చూస్తే 200 రోజుల చలన సగటు(డీఎంఏ) కంటే దిగువన కదులుతున్నట్లు వివరించారు. రూ. 46,000 స్థాయిలో పసిడిలో కొనుగోళ్లకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే వీలున్నట్లు అంచనా వేశారు. స్వల్పకాలిక ట్రెండ్ బలహీనంగా ఉన్నప్పటికీ రూ. 44,500 వద్ద పటిష్ట మద్దతు లభించగలదని అంచనా వేశారు. సహాయక ప్యాకేజీ కారణంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టవచ్చన్న అంచనాలు పెరిగినట్లు కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. అయితే ఇటీవల పసిడి క్షీణత నేపథ్యంలో మరింత పతనంకావచ్చన్న అంచనాలు సరికాదని అభిప్రాయపడింది. వెరసి ఫ్రెష్ షార్ట్సెల్లింగ్ను చేపట్టకపోవడం మేలని ట్రేడర్లకు సూచించింది. ఇవీ కారణాలు.. ► పసిడి వెనకడుగుకు పలు కారణాలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ధరలు బలహీనపడటంతో ఈల్డ్స్ పుంజుకుంటున్నాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతుండటం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలియజేశారు. ► యూఎస్ కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ భారీ ఉపశమన ప్యాకేజీకి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్న అంచనాలు పెరుగుతున్నాయి. జీడీపీ రికవరీ సాధిస్తే అధిక రిస్క్– అధిక రిటర్నుల సాధనాలకు పెట్టుబడులు మళ్లుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో బంగారంకంటే ఈక్విటీలు తదితరాలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలియజేశారు. ► ఇటీవల కోవిడ్–19 కట్టడికి గ్లోబల్ ఫార్మా కంపెనీలు పలు దేశాలలో వ్యాక్సిన్లను విడుదల చేయడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో పసిడిలో సెంటిమెంటు బలహీనపడిందని విశ్లేషకులు తెలియజేశారు. ► దేశీయంగా చూస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పసిడిపై కస్టమ్స్ డ్యూటీని 2.5% తగ్గించడం కూడా దీనికి జత కలసింది. వెరసి తాజాగా పసిడి ధరలు సాంకేతికంగా కీలకమైన రూ. 46,000 మార్క్ దిగువకు చేరినట్లు పేర్కొన్నారు. -
బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే!
బంగారం విషయంలో భారత ప్రజలకు ఎక్కువగా భావోద్వేగపరమైన సంబంధం ఉంటుంది. అందుకే ప్రజలు ఎక్కువగా బంగారం అమ్మటానికి ఇష్టపడరు. ఒకవేల ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తారు. మన దేశంలో ప్రజలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బంగారాన్ని ఒక ఆస్తిగా వాడుకోవటానికే ఇష్ట పడుతారు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా బంగారాన్ని మంచి తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు. అందుకే కరోనా సమయంలో మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత ఎక్కువగా రుణాలు ఇస్తూ వాటిపై వడ్డీలు ఆర్జిస్తున్నాయి. సాధారణంగా వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్లను తాకట్టు పెడతారు కాబట్టి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తుంటాయి. భవిష్యత్ లో వీటి ధరలు పెరుగుతుంటాయి కాబట్టి బ్యాంకులు కూడా త్వరగా రుణాలు ఇవ్వడానికి చూస్తాయి. వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థల కన్నా బ్యాంకుల్లోనే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. తక్కువ వడ్డీకే బంగారం రుణాలు ఇస్తున్న ఎన్బీఎఫ్సీలు, బ్యాంకుల గురుంచి ఈ క్రింద తెలుసుకోండి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - 7 శాతం. బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.35 శాతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.50 శాతం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 7.50 శాతం. కెనెరా బ్యాంక్- 7.65 శాతం. కర్నాటక బ్యాంక్- 8.38 శాతం. ఇండియన్ బ్యాంక్- 8.50 శాతం. యూకో బ్యాంక్- 8.50 శాతం. ఫెడరల్ బ్యంక్- 8.50 శాతం. పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.75 శాతం. యూనియన్ బ్యాంక్- 8.85 శాతం. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్- 8.90 శాతం. సెంట్రల్ బ్యాంక్- 9.05 శాతం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 9.25 శాతం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్- 9.50 శాతం. బ్యాంక్ ఆఫ్ బరోడా- 9.60 శాతం. యెస్ బ్యాంక్- 9.99 శాతం. ఐసీఐసీఐ బ్యాంక్- 10 శాతం. ఇండస్ ఇండ్ బ్యాంక్- 10 శాతం. కొటక్ మహీంద్రా బ్యాంక్- 10.50 శాతం. ముత్తూట్ ఫైనాన్స్- 11.99 శాతం. మణప్పురం ఫైనాన్స్- 12 శాతం. యాక్సిస్ బ్యాంక్- 13 శాతం.చదవండి చదవండి: బంగారం కొనుగోలుదారులకు తీపికబురు -
బంగారం కొనుగోలుదారులకు తీపికబురు
న్యూఢిల్లీ: బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికీ తీపికబురు. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. ఫిబ్రవరి 17 నుంచి ఇప్పటి వరకు బంగారం ధర రూ.1390 వరకు తగ్గింది. నేడు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.45,540కు చేరుకుంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 క్షీణించింది. దీంతో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రేటు రూ.46,900కు దిగొచ్చింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పైగా క్షిణించి రూ.43,000కు పడిపోయింది. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్ కేజీ వెండి ధర రూ.2000 పడిపోయి రూ.72,300కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్ బంగారం ధరలకు అనుగుణంగా దేశీ మార్కెట్లోనూ బంగారం ధరలు హెచ్చు తగ్గులకు గురి అవుతాయి. (చదవండి: కారు కొనాలనుకునే వారికి తీపికబురు) -
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ: కొద్దీ రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నేడు(ఫిబ్రవరి 11) దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 తగ్గి రూ.50,960 చేరుకుంది. కొద్దీ రోజుల క్రితం బడ్జెట్ ప్రకటన అనంతరం పసిడి ధరలు తగ్గగా తర్వాత ఫిబ్రవరి 6 నుంచి మళ్లీ రూ.1000 పైగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 తగ్గి రూ.48,600కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.44,550కు చేరుకుంది. ఆగస్టు 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోల్చి చూస్తే రూ.7,600 తక్కువగా ఉంది. ఇంతకు ముందు ఓ సమయంలో రూ.9000 వరకు తక్కువకు వెళ్లింది. దీంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చి చూస్తే ఒక్కరోజే 1కేజీ వెండిపై రూ.1,500 తగ్గి రూ.72900కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా పెరుగుతున్న కారణంగా మన దేశంలో కూడా ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: బంగారంపై పెట్టుబడికి ఇన్వెస్టర్ల ఆసక్తి లాభాల రింగింగ్: రికార్డు క్లోజింగ్