పసిడికి అక్షయ తృతీయ శోభ | Asia Gold Sky high prices take shine off Indian gold buying festival | Sakshi
Sakshi News home page

పసిడికి అక్షయ తృతీయ శోభ

May 11 2024 6:13 AM | Updated on May 11 2024 8:19 AM

Asia Gold Sky high prices take shine off Indian gold buying festival

ముంబై: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా డిమాండ్‌ పెరగడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ముంబైలో పసిడి రూ.1,506 పెరిగి రూ.73,008 చేరింది. కిలో వెండి ధర రూ. 1873 ఎగసి రూ.84,215 కి చేరింది.

పసిడి దిగుమతులు 30 శాతం అప్‌ 
కాగా భారత్‌ పసిడి దిగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో 30 శాతం పెరిగాయి. విలువలో 45.54 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ పటిష్ట డిమాండ్‌ దీనికి కారణం. భారత్‌కు దిగుమతుల విషయంలో స్విట్జర్లాండ్‌ (40%) మొదటి స్థానంలో నిలుస్తుండగా, తరువాతి స్థానాల్లో యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. దేశం మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా దాదాపు 5 శాతం. పసిడిపై ప్రస్తుతం 15శాతం దిగుమతుల సుంకం అమలవుతోంది. చైనా తర్వాత భారత్‌ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉంది. కాగా, 2023–24లో వెండి దిగుమతుల విలువ 2.72 శాతం పెరిగి 5.4 బిలియన్‌ డాల ర్లుగా నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement