
దేశవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుదల వైపు పయనించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (జూన్ 20) స్పల్పంగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగింది. ఇది ప్రస్తుతం రూ.66,400 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.220 పెరిగి రూ. 72,440 లను తాకింది.
ఇతర ప్రధాన నగరాల్లో ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.66,550 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.220 ఎగిసి రూ.72,590 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.200 పెరిగి రూ.66,400లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.220 పెరిగి రూ.72,440 లకు చేరుకుంది.
ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.66,400 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.72,440 లకు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40 పెరిగి రూ.67,000లకు చేరింది. 24 క్యారెట్ల పసిడి మాత్రం రూ.40 తగ్గి రూ.73,010 లకు దిగొచ్చింది.
భారీగా పెరిగిన వెండి
దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,100లుగా ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)