Deepika padukone
-
దేశంలోనే ఖరీదైన సినిమా.. అట్లీ ఎలివేషన్స్
అల్లు అర్జున్.. 'పుష్ప 2' తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇదివరకే రెండు వీడియోలు రిలీజ్ చేశారు. వీటి ద్వారా మూవీ ఏ రేంజులో ఉండబోతుంది? ఎంత భారీ ఎత్తున నిర్మించబోతున్నారనేది హింట్ ఇచ్చేశారు. కానీ ఇటు బన్నీ గానీ అటు అట్లీ గానీ రీసెంట్ టైంలో మీడియాకు దొరకలేదు. కాబట్టి వీడియోలతో అభిమానులు సరిపెట్టుకున్నారు. కానీ తాజాగా సత్యభామ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్న అట్లీ.. అల్లు అర్జున్తో చేయబోయే చిత్రం గురించి అదిరిపోయే విషయాలు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?)'దేశంలోనే ఇదే ఖరీదైన సినిమా. చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం. సరికొత్త టెక్నాలజీ కూడా పరిచయం చేయబోతున్నాం. బడ్జెట్ ఎంతనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సినిమా తీయడం వరకే నా బాధ్యత. విడుదల ఎప్పుడనేది నిర్మాత తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది' అని అట్లీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అట్లీ చెప్పిన దాని బట్టి చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకు కాస్ట్ లీ మూవీస్ అంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల గురించి మాట్లాడుకునేవాళ్లు. త్వరలో అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారేమో. ఇందులో బన్నీ.. మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం. అందుకు తగ్గట్లే దీపికా పదుకొణెని ఇదివరకే హీరోయిన్గా ప్రకటించారు. వీళ్లతో పాటు మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్ కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ముంబైలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయిందని టాక్. ప్రస్తుతానికైతే అట్లీ చెప్పినవే అప్డేట్స్. మిగిలినవి త్వరలో బయటపెడతారేమో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) "#AA22xA6 is the most expensive film of our country🫡📈. We are bringing many new technologies into the film🔥. It will make us all proud💯. I'm dreaming big, budget of the film is not yet locked🤞. Release date will be decided by the producer🤝"#Atlee | #AlluArjun pic.twitter.com/qwZx9LdMwp— AmuthaBharathi (@CinemaWithAB) June 14, 2025 -
తండ్రి బర్త్ డే.. ఆయన ఆశయం దిశగా దీపికా పదుకొణె!
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె తన తండ్రికి సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన తన తండ్రి బర్త్ డే సందర్భంగా గొప్ప కార్యక్రమం చేపట్టింది. ప్రకాశ్ పదుకొణె 70వ పుట్టినరోజు సందర్భంగా పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ను ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన తండ్రి, బ్యాడ్మింటన్ దిగ్గజ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనేకు అంకితమిస్తున్నట్లు వెల్లడించింది.దీపికా తన ఇన్స్టాలో రాస్తూ.. "బ్యాడ్మింటన్ ఆడుతూ పెరిగిన వ్యక్తిగా.. ఈ క్రీడ ఒకరి జీవితాన్ని శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఎంతగా మారుస్తుందో నేను ప్రత్యక్షంగా అనుభవించా. పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ (PSB) ద్వారా అన్ని వర్గాల ప్రజలకు బ్యాడ్మింటన్ ఆడితే కలిగే ఆనందం, క్రమశిక్షణ అందించాలని అనుకుంటున్నా. ఆరోగ్యకరమైన క్రీడ ద్వారా ప్రేరణ పొందిన తరాన్ని నిర్మించాలని మేము ఆశిస్తున్నాం. డాడీ, మీ గురించి బాగా తెలిసిన వారికి.. ఈ క్రీడ పట్ల మీకెంత మక్కువో తెలుసు. 70 ఏళ్ల వయసులో కూడా తినడం, నిద్రపోవడం, బ్యాడ్మింటన్ ఆడడమే మీ ప్రపచం. అందుకే మీ ఇష్టాన్ని నిజం చేయడానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. బ్యాడ్మింటన్ ఫర్ ఆల్! మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు పప్పా" అంటూ పోస్ట్ చేసింది. కాగా.. పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఇప్పటికే పలు నగరాల్లో స్థాపించారు. దాదాపు ఇప్పటికే 75 కేంద్రాల్లో నెలకొల్పారు. కాగా.. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణె మాజీ ప్రపంచ నంబర్ వన్ మాత్రమే కాదు.. బ్యాడ్మింటన్లో ఆల్-ఇంగ్లాండ్ ఛాంపియన్గా నిలిచారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది కల్కి మూవీలో మెప్పించిన దీపికా.. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రానున్న చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
అల్లు అర్జున్ సినిమా లో దీపికా.. కారణం ఏమిటో తెలుసా..?
-
ప్రభాస్కి నో-బన్నీతో ఫిక్స్.. దీపిక ప్లాన్ ఏంటి?
అల్లు అర్జున్ కొత్త సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెని ఎంపిక చేశారు. గ్రాండ్ ఇంట్రడక్షన్ వీడియోతో అధికారికంగా ప్రకటించారు. ఇందులో సూపర్ ఉమన్ వారియర్ తరహా పాత్రలో దీపిక కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం ప్రభాస్ చిత్రానికి నో చెప్పిన ఈమె.. ఇప్పుడు బన్నీ సినిమాకు ఓకే చెప్పింది. ఈ మధ్యలో ఏం జరిగింది? సోషల్ మీడియాలో అసలేం వినిపిస్తోంది.'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్తో 'స్పిరిట్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి కాగా హీరోయిన్ పాత్ర కోసం దీపికని సంప్రదించాడు. దాదాపు ఓకే అనుకున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే దీపిక పీఆర్ టీమ్.. ఈ విషయాన్ని పలు వెబ్సైట్లకు లీక్ చేసింది. దీపిక పాత్ర ఆహా ఓహో అనే రేంజులో ఉండబోతుందని హైప్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత దీపిక తన కండీషన్స్ గురించి సందీప్తో చెప్పిందని వార్తలొచ్చాయి. రోజుకి 8 గంటల మాత్రమే పనిచేస్తానని, రూ.40 కోట్ల రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో వాటా కావాలని దీపిక డిమాండ్ చేసినట్లు టాక్ వినిపించింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)అలా దీపిక పెట్టిన కండీషన్స్తో పాటు ఆమె పీఆర్ టీమ్ చేసే హడావుడి వల్ల సందీప్కి చిరాకొచ్చింది. దీంతో దీపికకు నో చెప్పేశాడు. ఇది జరిగిన వెంటనే బాలీవుడ్లో 'స్పిరిట్' గురించి నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చాయి. స్టోరీని కూడా లీక్ చేశారు. ఇదో 'ఏ' రేటెడ్ సినిమా అని, హీరోహీరోయిన్ మధ్య రొమాన్స్ గట్టిగానే ఉందని పలు సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో సందీప్ రెడ్డి వంగాకు మండింది. వెంటనే తృప్తి దిమ్రిని హీరోయిన్గా ప్రకటించాడు. దీపిక పేరు ప్రస్తావించకుండా పెద్ద ట్వీట్ పెట్టాడు. ఆమెకు ఇచ్చిపడేశాడు. ఏం చేసుకుంటావో చేస్కో అని అనేశాడు.ఇది జరిగి కొన్నిరోజుల కూడా కాలేదు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో దీపికని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. దీనిపై కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. లెక్క ప్రకారం మృణాల్ ఠాకుర్ని హీరోయిన్గా తొలుత అనౌన్స్ చేయాలనుకున్నారట. కానీ దీపిక నుంచి ఒత్తిడి రావడంతో ఈమెని హీరోయిన్గా అనౌన్స్ చేశారని వినిపిస్తోంది. మరి దీపిక చెప్పిన కండీషన్స్కి దర్శకుడు అట్లీ ఒప్పేసుకున్నట్లే కనిపిస్తుంది. ఈ సినిమాలో బన్నీ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ప్రతి పాత్రకు ఓ హీరోయిన్ ఉంటుంది. దీపిక కాకుండా మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్ని హీరోయిన్లుగా తీసుకోవాలని ఫిక్సయ్యారట.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?) -
బన్నీ సరసన దీపికా పదుకొణె.. వారియర్ తరహా పాత్రలో (ఫొటోలు)
-
బన్నీ-అట్లీ.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది
'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడా అని ఎదురుచూసిన అభిమానులకు.. కొన్నిరోజుల క్రితం సమాధానమిచ్చేశాడు. తమిళ దర్శకుడు అట్లీతో భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్న నేపథ్యంలో పలు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ఓ అప్డేట్ వచ్చేసింది. హీరోయిన్ ఎవరనేది ప్రకటించారు.ప్రభాల్ 'కల్కి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీపికా పదుకొణెని అల్లు అర్జున్కి జోడీగా ఎంపిక చేశారు. బన్నీకి ఈమెతో పనిచేయడం తొలిసారే. కానీ దర్శకుడు అట్లీ మాత్రం తన గత చిత్రం 'జవాన్'లో దీపికతో కలిసి పనిచేశాడు. ఇప్పుడు బన్నీతో చేయబోయే మూవీలోనూ ఈమెని హీరోయిన్గా ఎంపిక చేశాడు. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేశారు.గత కొన్నిరోజుల నుంచి దీపికా పదుకొణె వార్తల్లో నిలుస్తోంది. 'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి వంగా ఈమెని అప్రోచ్ అయ్యాడు. దాదాపు సెట్ అనుకునే టైంలో ప్రాజెక్ట్ నుంచి దీపిక బయటకొచ్చింది. ఈ క్రమంలోనే స్టోరీని లీక్ చేయడం లాంటివి జరిగేసరికి సందీప్ వంగా.. ఈమె పేరు చెప్పకుండా పరోక్షంగా ట్వీట్ పెట్టాడు. మరోవైపు 8 గంటల షిఫ్ట్ కారణంగా 'కల్కి 2' నుంచి కూడా ఈమె తప్పుకోనుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇలా కాంట్రవర్సీ పుకార్లకు కేరాఫ్ అయిన దీపిక.. బన్నీ-అట్లీ మూవీ విషయంలో ఏం చేస్తుందో చూడాలి?దీపిక స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ.. కెరీర్ ప్రారంభం నుంచి హిందీలోనే సినిమాలు చేస్తూ వచ్చింది. పద్మావత్, రామ్ లీలా తదితర చిత్రాలు ఈమె చాలా గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక తనతో పాటు కలిసి సినిమాలు చేసిన రణ్వీర్ సింగ్ ని ఈమె పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు వీళ్లకు ఓ కూతురు కూడా పుట్టింది. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుంది కానీ ఇప్పుడు మళ్లీ బిజీ కానుంది. -
'దీపికా పడుకోణె'కు గోల్డెన్ ఛాన్స్!
అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ సినిమా (AA22) నుంచి జూన్ 7న ఒక అప్డేట్ రానుందని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్ట్ పంచుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి కూడా.. త్వరలో షూటింగ్కు సిద్ధం అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకుని, అల్లు అర్జున్తో సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు చేశారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 700 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తోంది. అయితే, శనివారం ఉదయం 11గంటలకు ఒక ఆప్డేట్ ఇస్తామని పోస్టర్ను రిలీజ్ చేసింది. బహుశా హీరోయిన్ గురించి ప్రకటన చేస్తారని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.అల్లు అర్జున్- అట్లీ (AA22) సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ 'దీపికా పడుకోణె'( Deepika Padukone) నటిస్తున్నట్లు టాక్ ఉంది. తనకు సంబంధించిన అప్డేట్ శనివారం అఫీషియల్గా ప్రకటిస్తారని సమాచారం. ఇదే ప్రాజెక్ట్లో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, వారిద్దరి గురించి అధికారిక ప్రకటన కోసం కొద్దిరోజులు వేచి ఉండాల్సిందే. దాదాపు జూన్ 7న మాత్రం దీపిక ప్రకటన ఉంటుందని బలంగా వార్తలు వస్తున్నాయి. (AA22) పేరుతో ప్రారంభమైన ఈ మూవీకి ఐకాన్, సూపర్హీరో అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని సమాచారం.ఈ సినిమాలో అల్లు అర్జున్ భిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. కథకు తగ్గట్లుగానే అల్లు అర్జున్ పలు లుక్స్ను ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉండే సైన్స్ఫిక్షన్ సినిమాగా ఇది రానున్నట్లు ప్రచారంలో ఉంది. అందుకోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. హాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగింది.When Elegance meets Magic! ✨ Revealing Tomorrow 11 AM❤️🔥#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥@alluarjun @Atlee_dir#SunPictures #AA22 #A6 pic.twitter.com/AlG9DwRQSR— Sun Pictures (@sunpictures) June 6, 2025 -
మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా?
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు కొన్నాళ్లుగా మార్మోగిపోతోంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో అడ్డంగా వాదించడంతో ఆమెను ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తీసేశారు. అత్యధిక రెమ్యునరేషన్ వంటి డిమాండ్లకు తలొగ్గినప్పటికీ వరుస డిమాండ్లు చేస్తుండటంతో సందీప్రెడ్డికి విసుగొచ్చింది. పైగా ఈ మధ్యే తల్లయ్యాను కాబట్టి.. రోజులో ఎనిమిది గంటలే షూటింగ్లో పాల్గొంటానని, సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని అనడంతో డైరెక్టర్కు కోపమొచ్చి ఆమెను తీసేశాడు. డిమాండ్లపై వెనక్కు తగ్గని దీపిక?దీపికా స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని తీసుకున్నాడు. ఆ సమయంలో దీపిక కథ లీక్ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగా. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కూడా పని గంటల గురించి, పారితోషికం గురించి డిమాండ్ చేసిందట! దీంతో ఆమె పాత్ర నిడివి తగ్గించాలని లేదా తనను తీసేసి ఆమె స్థానంలో త్రిప్తిని తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.బ్లాక్బస్టర్ కల్కిస్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్.. ఇవి రెండూ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలే! ఈ రెండిట్లోనూ త్రిప్తికి నటించే ఛాన్స్ వచ్చిందంటే మాత్రం తన క్రేజ్ రెట్టింపు కావడం ఖాయం. కాగా కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినిదత్ నిర్మించాడు. గతేడాది జూన్లో విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు -
'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే చాలనుకున్నా!
కెరీర్ ప్రారంభంలో అవమానాలు, చీవాట్లు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎందరో! తొలి సినిమాకు తను కూడా అలాంటి బాధే అనుభవించానంటున్నాడు నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం (Muzammil Ibrahim). ఈ సూపర్ మోడల్ ఢోకా సినిమాతో హీరోగా మారాడు. ఆ సమయంలో డైరెక్టర్ పూజా భట్ తనను చులకనగా చూసేదని, తల కొట్టేసినట్లుగా ఉండేదని చెప్తున్నాడు.తొలి సినిమా.. దారుణ అనుభవాలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ముజమ్మిల్ ఇబ్రహీం మాట్లాడుతూ.. పూజా భట్ (Pooja Bhatt) నన్ను అన్ప్రొఫెషనల్ అని పిలిచేది. తనకు కోపమెక్కువ. అందుకుతోడు యాటిట్యూడ్.. నటులను చులకనగా చూసేది. నిర్మాత మహేశ్ భట్కు మాత్రం నేనంటే చాలా ఇష్టం. మంచి నటుడినని అంటుండేవారు. ఢోకా సినిమా సమయానికి నా వయసు దాదాపు 20 ఉంటుందనుకుంటా.. అంతే! సెట్లో నన్ను దారుణంగా చూసేవారు. నేను అందరితోనూ గౌరవంగా నడుచుకునేవాడిని.. నాకంటూ కొన్ని అంచనాలుండేవి. కానీ అవన్నీ తలకిందులు చేశారు. నటులంటే శునకాలు!నాతో దుర్భాషలాడిన తీరు చూశాక మరెలాంటి అంచనాలు పెట్టుకోలేదు. ఆ రేంజ్లో ఆమె నన్ను తిట్టేది. ఈ వాతావరణం చూశాక నాకు చాలా భయమేసింది. సూపర్ మోడల్గా ఇండియాలో నాకంటూ గుర్తింపు, గౌరవం ఉండేది. నేను పడుతున్న అవమానాలు చూసి మహేశ్ భట్ సర్.. నాతో అలా ప్రవర్తించవద్దని పూజా భట్ను కోరేవాడు. కానీ ఆయన సెట్లో లేనప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేది. అంతేకాదు.. నటులు కుక్కల్లాంటివారని.. తాము కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలని ఆమె అంటూ ఉండేదట. (చదవండి: ‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ)పీడకలలు వెంటాడేవిచిన్న కుటుంబం నుంచి వచ్చిన నేను ఇవన్నీ విని భరించలేకపోయాను. నాపై వచ్చిన వార్తలు చూసి మరింత కలత చెందాను. నిద్రలో కూడా పీడకలలు వచ్చేవి. ఎలాగోలా ఆ రోజు బతికితే చాలని ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తుండేవాడిని. అలా కష్టాలు అనుభవించాను. అందుకే తర్వాత రాజ్ 2 ఆఫర్ వచ్చినా చేయలేదు అని చెప్పుకొచ్చాడు. దీపికాతో రిలేషన్దీపికా పదుకొణె (Deepika Padukone)తో రిలేషన్ గురించి మాట్లాడుతూ.. ముంబైకి వచ్చిన కొత్తలో దీపిక పదుకొణె మోడల్గా పని చేసింది. అప్పుడు మా పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లపాటు ప్రేమించుకున్నాం. మా దగ్గర డబ్బు లేక రిక్షాలోనే తిరిగేవాళ్లం. తర్వాత కొన్ని కారణాలతో బ్రేకప్ చెప్పుకున్నాం. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఆమెకు పెళ్లయ్యాక మాట్లాడుకోవడమే మానేశాం అని తెలిపాడు. దీపికా.. హీరో రణ్వీర్ సింగ్ను 2019లో పెళ్లాడింది. వీరికి గతేడాది దువా అనే కూతురు జన్మించింది.సినిమాఢోకా మూవీ (Dhokha Movie) విషయానికి వస్తే.. 2007లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ముజమ్మిల్ నటనకు ప్రశంసలు దక్కాయి. తులిప్ జోషి హీరోయిన్గా నటించగా అనుపమ్ ఖేర్, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు.చదవండి: అమితాబ్ వల్లే చిరంజీవి, రజనీకాంత్లకు స్టార్డమ్: ఆర్జీవీ -
దీపికా పదుకొణె కండీషన్స్ వైరల్ వేళ మద్ధతుగా మణిరత్నం వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె(Deepika padukone ) వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉన్న కారణంగా ఒక భారీ ప్రాజెక్ట్ను వదులుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, పనిగంటలతో పాటు రెమ్యునరేషన్ వంటి అంశాలు కూడా కారణం అని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే టాపిక్ హిందీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయిపోయింది. రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలి..? అనే అంశంలో సినిమా నటీనటులైనా ఇందుకు మినహాయింపు కాదని చర్చకు దారితీస్తుంది. ఈ విషయం గురించి ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు ప్రత్యక్షంగా పరోక్షంగా పలు వేదికలపై మాట్లాడుతున్నారు. తాజాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) కూడా ఇదే అంశంపై పలు వ్యాఖ్యలు చేశారు.ఇండస్ట్రీలోని నటీనటులు ఎవరైనా సరే 8 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొంటామని డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని మణిరత్నం అన్నారు. అలాంటి నిర్ణయం సరైనదేనని తాను భావిస్తన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. పనిగంటల విషయంలో అలా అడిగే నటీనటులు చిత్రపరిశ్రమలో ఉన్నందుకు తాను సంతోషిస్తున్నట్లు అన్నారు. అలా అడగడంలో తప్పు లేదని ఒక దర్శకుడిగా చెబుతానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మణిరత్నం వ్యాఖ్యలు నటి దీపికా పదుకొణెకు మద్థతుగా ఉన్నాయిని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.బాలీవుడ్ నటి కాజోల్ తన భర్త అజయ్ దేవ్గణ్ కూడా పనిగంటల విషయంపై మాట్లాడారు. ‘మా’ సినిమా ట్రైలర్ లాంచ్లో మొదట కాజోల్ మాట్లాడుతూ కొత్తగా తల్లి అయిన నటీమణుల వర్కింగ్ అవర్స్ గురించి చెప్పుకొచ్చారు. 8గంటలకు మించి వారు పనిచేయలేరని ఆమె అన్నారు. ఇంతలో అజయ్ దేవ్గణ్ కలుగచేసుకుని ఇలా రియాక్ట్ అయ్యారు. నిజాయతీ ఉన్న దర్శకనిర్మాతలు ఎవరూ కూడా వర్కింగ్ అవర్స్ విషయంలో వ్యతిరేకంగా ఉండరని పేర్కొన్నారు. 8 గంటల పాటు నటీనటులు షూటింగ్లో పాల్గొంటే చాలని వారు అనుకుంటారని ఆయన అభిప్రాయ పడ్డారు. దీంతో వారందరూ కూడా దీపికా పదుకొణెను ఉద్దేశించి ఆమెకు సపోర్ట్గా మాట్లాడారని నెటిజన్లు అనుకున్నారు.దీపికా పదుకొణె కండీషన్స్దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు దీపికా పదుకొణె పెట్టిన కండీషన్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అయ్యాయి. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నట్లు సమాచారం. స్పిరిట్ సినిమా కోసం దీపికా పదుకునే మొదట రూ.20కోట్ల రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో షేర్ అడిగినట్లు సమాచారం. రెండోది కేవలం రోజుకు 8గంటలు మాత్రమే కేటాయిస్తానని దీపిక డిమాండ్. అయితే, ఉన్న 8 గంటల్లో అందులో 2 గంటలు జర్నీకే పోతుందని చర్చ. తెలుగు డైలాగ్స్ చెప్పలేనని పేర్కొన్న దీపిక. ఇలా పలు కండీషన్స్ ఉండటం వల్ల దీపికా పదుకొణెను సందీప్ వద్దనుకున్నట్లు తెలుస్తోంది. -
సందీప్ రెడ్డి వంగా, దీపికా వివాదం! విరుచుకుపడ్డ తమన్నా..
-
దీపిక తొలగింపు.. పరేష్ రావల్ కంపు... ఈ బాలీవుడ్కేమైంది?
బాలీవుడ్ అంటే దేశంలోని అన్ని వుడ్లకూ గాడ్ లాంటిది అనలేకపోయినా కనీసం పెద్దన్న లాంటిది అనొచ్చేమో... దేశవ్యాప్తంగా నటీనటులందరిపైనా, అన్ని భాషా చిత్ర పరిశ్రమలపైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బాలీవుడ్ ప్రభావం ఉంటుంది. అలాంటి బాలీవుడ్కి అకస్మాత్తుగా ఏమైంది? గత కొంత కాలంగా హిందీ చిత్ర పరిశ్రమ విజయాలు తక్కువ వివాదాలెక్కువ అన్నట్టుగా తయారైంది. ఒకప్పుడు నటీనటుల వివాహేతర సంబంధాలు, తెరవెనుక అలవాట్లు...వంటివి మాత్రమే ఎక్కువగా చర్చనీయాంశమయ్యేవి. అవన్నీ వ్యక్తిగతం అంటూ బాలీవుడ్ పెద్దలు సమర్ధించుకునేవారు. కానీ ఇప్పుడు వస్తున్న వివాదాలు వ్యక్తిగతమైనవి కావు...వ్యవస్థాగతమైనవే. అవి కూడా చిన్నా చితకా స్టార్స్కు సంబంధించినవి కావు.. బాలీవుడ్ని ఓ రకంగా ఏలుతున్న నటీనటులకు సంబంధించినవి కావడం గమనార్హం. బాలీవుడ్లో వినోదాత్మక చిత్రాభిమానులను అలరిస్తుందనే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్ర ‘హేరా ఫేరి 3‘(Hera Pheri 3) . ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కధానాయకుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. అలాంటి సినిమా నుంచి అనూహ్యంగా మరో ప్రముఖ నటుడు పరేష్ రావల్ (శంకర్ దాదా ఎంబిబిఎస్ ఫేం) తప్పుకోవడం బాలీవుడ్ పరిశ్రమను, ప్రేక్షకుల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. పరేష్ రావల్(Paresh Rawal) ఆకస్మిక నిర్ణయం తర్వాత, సహనటుడు అక్షయ్ కుమార్ తో పాటు ఆ సినిమా నిర్మాతలు పరేష్ రావల్పై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. దాంతో పరేష్ రావల్ తన సంతకం చేసి ముందస్తుగా స్వీకరించిన రూ.11 లక్షలను 15% వడ్డీతో తిరిగి చెల్లించాల్సి వచ్చింది. అతని మొత్తం పారితోషికం రూ.15 కోట్లు అని సమాచారం.మరోవైపు బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone ), ప్రభాస్తో కలిసి నటించాల్సిన ‘స్పిరిట్‘(Spirit) చిత్రం నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు. అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ కి తలొగ్గినా కూడా దీపిక ఒకదాని తర్వాత ఒకటిగా రకరకాల డిమాండ్లు పెడుతుండడంతో విసుగు చెందిన స్పిరిట్ దర్శకుడు సందీప్రెడ్డి వంగా ఆమెను తన ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. అయితే ఈ నిర్ణయం తర్వాత కూడా వీరిద్దరి మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ దీపికాపై పరోక్ష విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా తనకు అనుకూలమైన వాతావరణం ఉన్నచోట మాత్రమే తాను పనిచేయాలనుకుంటున్నట్లు దీపిక వ్యాఖ్యానించారు. మొత్తం మీద బాలీవుడ్లో వరుసగా చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలూ...బాలీవుడ్ ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే సినిమాల నుంచి నటీనటులు మధ్యలో తప్పుకోవడం ఇదే మొదటి సారి కాదని గతంలోనూ పలు మార్లు ఇలాంటివి జరిగాయని పలువురు గుర్తు చేస్తున్నారు.గత 2013లో’రేస్ 2’ చిత్రం షూటింగ్ ప్రారంభమైన తర్వాత, దీపికా పదుకునే అకస్మాత్తుగా ప్రాజెక్ట్ను వదిలివేశారు. దీంతో నిర్మాత రమేష్ తౌరానీ దీపిక అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ వివాదం బాలీవుడ్లో పెద్ద చర్చకు దారి తీసింది. అలాగే గత 2018లో సల్మాన్ ఖాన్ తో కలిసి ’భారత్’ చిత్రంలో నటించాల్సి ఉన్న ప్రియాంక చోప్రా షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ప్రాజెక్ట్ను వదిలివేశారు. దీంతో సల్మాన్ ఖాన్, ఆమెపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత, కత్రినా కైఫ్ ఈ పాత్రను స్వీకరించారు. అలాగే ఇంకా ముందుకు వెళితే..2000లో కహో నా ప్యార్ హై సినిమా నుంచి కరీనాకపూర్ , 2003లో చల్తే చల్తే చిత్రం నుంచి సల్మాన్ఖాన్ గందరగోళం కారణంగా ఐశ్వర్యరాయ్ లు తప్పుకున్నారు. గత 2015లో ఊపిరి సినిమాలో నటించాల్సి ఉన్న శృతిహాసన్ మధ్యలో వదిలేయడంతో చిత్ర నిర్మాతలు ఆమెపై కోర్టుకెక్కారు. అయితే ఈ ఘటనలన్నీ కూడా సంవత్సరాల వ్యవధిలో జరుగగా... ఇప్పుడు వరుసగా బాలీవుడ్లో జరుగుతుండడమే చర్చనీయాంశంగా మారింది. -
దీపికా పదుకొణెకు సపోర్టుగా తమన్నా.. నెటిజన్ల రచ్చ
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా చేసిన ట్వీట్తో రెండు రోజులుగా దీపికా పదుకొణె( Deepika Padukone) పేరు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తను తీయబోతున్న సినిమా కథను ఒక స్టార్ హీరోయిన్ లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సోషల్మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. సందీప్ చేసిన కామెంట్స్ దీపికను ఉద్దేశించే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సందీప్ కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే దీపిక కూడా పరోక్షంగా స్పందించింది. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను' అని చెప్పుకొచ్చింది. ఆ వీడియోతో పాటు దీపికకు చెందిన ఒక పాత వీడియోను ఆమె అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అగౌరవం, పురుషులు, లింగ వివక్షత, లింగ వేతన వ్యత్యాసం, ఓవర్ టైం పని, వృత్తి నైపుణ్యం లేకపోవడం, స్త్రీ ద్వేషం, ద్వంద్వ ప్రమాణాలు అంటూ చెప్పిన ఆమె మాటలను ఇప్పుడు మళ్లీ వైరల్ చేశాడు. దానిని తమన్నా లైక్ చేశారని కొందరు నెటిజన్లు చెప్పుకొచ్చారు. అది కాస్త నెట్టింట వైరల్ అయిపోయింది. దీపికాకు తమన్నా సపోర్ట్ చేస్తుందంటూ పేర్కొన్నారు. అయితే, తాజాగా తమన్నా వివరణ ఇచ్చింది. తాను ఎవరి పోస్ట్కు లైక్ కొట్టలేదని తెలిపింది. కొందరు కావాలనే ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. లైక్ కొట్టలేదని ఇన్స్టాగ్రామ్ చెప్పినా నమ్మలేని స్థితిలో కొందరు ఉన్నారని పేర్కొంది. తనకు తానుగా పోస్ట్లను ఇన్స్టాగ్రామ్ ఎలా లైక్ చేస్తుందో చెబితే బాగుంటుందని ఆమె తెలిపింది. దయచేసి దీనిని ఇంతటితో వదిలేయండి చాలా పనులు ఉన్నాయంటూ ఆమె వెళ్లిపోయింది. -
‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్ లుక్ : స్పిరిట్పై ఫ్యాన్ కామెంట్ వైరల్
ప్రముఖ దర్శకుడు సందీప్రెడ్డి, ‘స్పిరిట్’ మూవీ, బాలీవుడ్ స్టార్హీరోయిన్ దీపికా పదుకొణే మధ్య నడుస్తున్న వివాదం నేపథ్యంలో దీపికా పదుకొనే ఇన్స్టా లుక్ వైరల్గా మారింది. బ్రైట్ రెడ్ డ్రెస్లో దీపికా ఆశ్చర్యపరిచింది. డైమండ్ ఆభరణాలతో స్పెషల్ లుక్లో అదరగొట్టేసింది. దీంతో అభిమానులు కామెంట్స్ వైరల్గా మారాయి.ప్రపంచ లగ్జరీ బ్రాండ్ ‘కార్టియర్ ’ ఈవెంట్లో స్టాక్హోమ్లో దీపికా పదుకొణే ఎరుపు రంగు అవతారంలో అబ్బురపరిచింది. ఈ బ్రాండ్ అంబాసిడర్ అయిన స్వీడన్లోని స్టాక్హోమ్లో అందంగా మెరిసింది. ఆషి స్టూడియో రూపొందించిన ఆఫ్-షోల్డర్ రెడ్ మొహైర్ గౌను, కార్టియర్ ఆభరణాలతో ధరించింది. మదర్-ఆఫ్-ఆల్ ఫ్యాషన్ లుక్స్తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. తన లుక్కు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనిపించేలా ధరించిన ప్రిన్సెస్ కోడెడ్ డైమండ్స్ , నీలమణి పొదిగిన నెక్లెస్ , సాలిటైర్ స్టడ్ చెవిపోగులు మరింత ఎట్రాక్షన్గా నిలిచాయి. అంతేనా షోల్డర్ లెంత్ జుట్టును సొగసైన సైడ్ పార్టెడ్ హెయిర్ జెల్ లాడెన్ వెల్ కెంప్ట్ లుక్ లో స్టైల్ చేసింది. తన రూపానికి తగినట్టు మస్కారా, న్యూడ్ బ్రౌన్ లిప్ ఆయిల్మేకప్తో గ్లామర్ లుక్ను సంపూర్ణం చేసుకుంది. దీంతో నెటిజన్లు ఆమె లుక్కి ఫిదా అవడం మాత్రమే కాదు.. ‘‘డోంట్ వర్రీ..దీపికా మా మద్దతు నీకే.. చాలా అందంగా ఉన్నావ్’’ అంటూ కమెంట్ చేశారు. అంతేకాదు.. స్పిరిట్ ఫ్లాప్.. పక్కా అంటూ మరో యూజర్ కమెంట్ చేయడం గమనార్హం.ఇదీ చదవండి: ట్విటర్ గాలం : ఇండో-అమెరికన్ , యూట్యూబ్ సీఈవోకి గూగుల్ భారీ ఆఫర్కాగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్రెడ్డి వంగా కాంబినేషన్లో 'స్పిరిట్' అనే మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో తొలుత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేనును ఎంపిక చేశారు. కానీ వివాదాల నేపథ్యంలో ఆమెను ఈ ప్రాజెక్ట్నుంచి తొలగించారు. దీపిక స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కనిపించనుంది. -
సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?
గత రెండు మూడు రోజుల నుంచి దీపిక పదుకొణె తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగా. ఈ దర్శకుడు.. ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' అనే సినిమా తీస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా తొలుత దీపికనే అనుకోని, చివరి నిమిషంలో తృప్తి దిమ్రిని తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. అయితే తన సినిమా స్టోరీని లీక్ చేస్తుందని సందీప్ ఓ ట్వీట్ చేశాడు. డర్టీ పీఆర్ గేమ్స్ అని రెచ్చిపోయాడు. ఇదంతా కూడా దీపికని ఉద్దేశించే అనే కామెంట్స్ వినిపించాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)తాజాగా ఓ ఫ్యాషన్ షోలోపాల్గొన్న దీపిక పదుకొణె, మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను' అని చెప్పుకొచ్చింది.అయితే దీపిక పరోక్షంగా సందీప్ వంగాకు కౌంటర్ ఇచ్చేలా మాట్లాడిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే సందీప్ వంగా 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు దీపిక.. 'కల్కి 2' కోసం సిద్ధమవుతోంది. కొన్నాళ్ల క్రితం ఈమెకు కూతురు పుట్టింది. చివరగా 'సింగం ఎగైన్'లో దీపిక కనిపించింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. (ఇదీ చదవండి: నాగార్జున ఫ్లాప్ సినిమా నచ్చిందంటున్న ధనుష్) -
దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్
-
సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్
-
Spirit: రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన దీపికా.. త్రిప్తికి ఎంత ఇస్తున్నారంటే?
త్రిప్తి డిమ్రీ(Tripti Dimri ).. ‘యానిమల్’సినిమాకు ముందు ఈ బ్యూటీ ఎవరనేది పెద్దగా తెలియదు. కానీ ఆ ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా..అవేవి త్రిప్తికి గుర్తింపుని తెచ్చిపెట్టలేదు. కానీ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్లో అందాల ఆరబోసి ఓవర్నైట్ స్టార్గా మారింది. ఆ తర్వాత త్రిప్తికి వరుస చాన్స్లు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ త్రిప్తి పేరు నెట్టింట్లో వైరల్ అవుతుంది. దానికి కారణం మళ్లీ సందీప్ రెడ్డినే. ప్రభాస్తో ఆయన తెరకెక్కించబోతున్న ‘స్పిరిట్’ చిత్రంలో త్రిప్తిని హీరోయిన్గా తీసుకున్నాడు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించడంతో త్రిప్తి పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.దీపికా ప్లేస్లో..ప్రభాస్తో సందీప్ తెరకెక్కించే ‘స్పిరిట్’(Spirit)లో దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్గా నటించాల్సింది. ఈ మేరకు సందీప్ కూడా ఆమెకు కథ చెప్పి ఒప్పించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆమెను పక్కకు పెట్టి త్రిప్తికి చాన్స్ ఇచ్చాడు. దీపికా పదుకొణె పెట్టిన కండీషన్స్ నచ్చకపోవడంతోనే సందీప్ ఆమెను తప్పించాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రంలో ఎక్స్ఫోజింగ్ ఎక్కువగా ఉందని, అది నచ్చకనే దీపికానే తప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. అంతేకాదు ‘స్పిరిట్’ కథను లీక్ చేస్తూ.. సందీప్ని కించపరిచేలా బాలీవుడ్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది.రూ.20 కోట్లు డిమాండ్ చేసిన దీపికా..స్పిరిట్ చిత్రంలో ప్రభాస్కి జోడీగా దీపికా అయితేనే బాగుంటుందని భావించాడు సందీప్. తొలుత ఆమెకే ఈ కథను వినిపించాడట. ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ‘తగ్గేదే లే’ అన్నట్లుగా వ్యవహరించారట. రూ. 20 కోట్ల పారితోషికం ఇస్తేనే నటిస్తానని చెప్పిందట. అంతేకాదు టైమింగ్స్ విషయంలోనూ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంట్లో చిన్న పాప ఉండడం కారణంగా ఎక్కువ గంటలు పని చేయలేనని చెప్పిందట. దీపికా పెట్టిన కండీషన్స్..ఆమె అడిగిన రెమ్యునరేషన్ నచ్చకపోవడంతో సందీప్ ఆమెను పక్కకు పెట్టి త్రిప్తి డిమ్రీని హీరోయిన్గా తీసుకున్నాడు.ఐదింతలు తక్కువే..స్పిరిట్ కోసం దీపికా రూ. 20 కోట్ల డిమాండ్ చేస్తే.. దానికి ఐదింతలు తక్కువకు త్రిప్తి ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంటే ఈ సినిమా సినిమాకు గాను త్రిప్తి రూ. 4 కోట్లను పారితోషికంగా అందుకుంటుంది. గత సినిమాలతో పోలిస్తే ఆమెకు ఇది చాలా ఎక్కువ. యానిమల్ కంటే ముందే ఒక్కో సినిమాకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే తీసుకునే త్రిప్తి.. ఆ సినిమా తర్వాత రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. ఇక స్పిరిట్కు తన కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటుంది. అయితే దీపికా డిమాండ్ చేసిన పారితోషికంతో పోలిస్తే..త్రిప్తి అడిగింది చాలా తక్కువని..నిర్మాతలు కూడా వెంటనే ఓకే చెప్పేశారట.ఇక స్పిరిట్ విషయానికొస్తే..ఈ చిత్రంలో ప్రభాస్ పవఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నట్లు సమాచారం. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. -
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
'యానిమల్' సినిమా తర్వాత బాలీవుడ్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్థాయి పెరిగిపోయింది. త్వరలో స్పిరిట్ సినిమాతో రానున్నాడు. రీసెంట్గా ప్రభాస్ సరసన అందులో నటించబోయే హీరోయిన్ను కూడా పరిచయం చేశాడు. అయితే, తాజాగా బాలీవుడ్ పీఆర్ టీమ్ను ఉద్దేశించి ఆయనొక సంచలన ట్వీట్ చేశారు. ఆయన పేరు చెబితే చాలు కొంతమంది బాలీవుడ్ జనాలు షేకైపోతారు. ఒక్కోసారి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినా సరే అక్కడి వారికి సరైన నిద్ర కూడా పట్టదు. టాలెంట్ ఉంటే ఎవరికీ తల వంచాల్సిన పనిలేదని బాలీవుడ్కు రుచి చూపించిన దర్శకుడు. ఆయన తెరకెక్కించిన కబీర్ సింగ్, యానిమల్ సినిమాలపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఎలాంటి బెరుకు లేకుండా సింగిల్గానే ఎదుర్కొని తానేంటో బాలీవుడ్కు చూపించాడు. ఇప్పుడు తాజాగా మరోసారి తనదైన స్టైల్లో పంచ్ ఇచ్చాడు.సందీప్ రెడ్డి కొత్త సినిమా ‘స్పిరిట్’ త్వరలో ప్రారంభం కానుంది. అయితే, బాలీవుడ్ పీఆర్ టీమ్స్ ఆయన్ను అప్పుడే టార్గెట్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్గా దీపికా పదుకునే( Deepika Padukone) ఎంపిక అయిందని వార్తలు వచ్చాయి. కానీ, ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వైరల్ అయిన వెంటనే బాలీవుడ్ మీడియా రంగంలోకి దిగింది. సందీప్ను టార్గెట్ చేస్తూ.. బాలీవుడ్ మీడియాలో వరుసగా కథనాలు మొదలయ్యాయి. సందీప్ పెట్టిన కండిషన్లకు దీపికా ఒప్పుకోలేదని, మితి మీరిని గ్లామర్ సీన్లు ఉండటం వల్లే ఆమె తప్పుకున్నట్లు అక్కడి మీడియా ప్రచురించింది. కథలో ఎక్కువగా 'ఎ' రేటెడ్ సీన్లు ఉన్నాయని, అవి నచ్చకనే స్పిరిట్ సినిమా నుంచి ఆమె తప్పుకుందని కథనాలు రాశారు. సందీప్కు సినిమాలు తీయడం చేతకాదంటూ.. అతనొక అన్ ప్రొఫెషనల్ డైరెక్టర్ వంటి స్టోరీస్ ప్రచురించారు. వాళ్ల పీఆర్ స్టంట్స్కు సందీప్ బెదిరిపోయే రకం కాదు. పరోక్షంగా దీపికా పదుకొనేకు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.ఇదే మీ ఫెమినిజమా..?దర్శకుడిగా కొద్దిరోజుల క్రితం ప్రముఖ హీరోయిన్కు నేను కథ చెప్పాను. అలా చేశానంటే అది పూర్తి నమ్మకంతోనే అని గుర్తించాలి. కానీ, వాళ్లు మాత్రం నా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కథను బయటకు చెప్పిన ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. నటీనటులకు మేము స్టోరీని చెప్పామంటే వారు ఎవరితోనూ చెప్పకూడదనే అనధికారిక అగ్రిమెంట్ ఉన్నట్లు లెక్క. దానిని కూడా ఆ నటి ఉల్లంఘించారు. చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా..? మీ స్త్రీ వాదం దీనినే సూచిస్తుందా..? ఒక యంగ్ యాక్టర్ను తక్కువ చేసి మీ పీఆర్ టీమ్ ప్రస్తావిస్తుంది. ఫెమినిజం అంటే ఇదేనా..? ఒక సినిమా దర్శకుడిగా కథ రాసుకునేందుకు నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. నాకు, సినిమానే ప్రతిదీ. మీరు ఎప్పిటికీ దానిని పొందలేరు. నా సినిమా మొత్తం కథను మీరు లీక్ చేసినా నాకు పోయేదేమీ లేదు.' అని డర్టీ పీఆర్ గేమ్స్ #dirtyPRgames అనే హ్యాష్ ట్యాగ్ను సందీప్ జోడించాడు. దీపికా పదుకొనే గురించే సందీప్ ఈ ట్వీట్ చేశాడని నెటిజన్లు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. అందుకే ఆమె ఫోటోను సందీప్ కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నారు.When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA(Non Disclosure Agreement) between us. But by doing this, You've 'DISCLOSED' the person that you are....Putting down a Younger actor and ousting my story? Is this what your feminism stands for ? As a…— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 26, 2025 -
స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?
-
స్పిరిట్ లో కల్కి జోడి..
-
ప్రభాస్ స్పిరిట్.. ఆ హీరోయిన్కు ఏకంగా రూ.20 కోట్లా!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం స్పిరిట్. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా సహా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఫైనలేజ్ కాలేదు.అయితే తాజాగా వీరు కాకుండా మరో హీరోయిన్ పేరు నెట్టింట వైరలవుతోంది. బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే స్పిరిట్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకోనుందని టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ధృవీకరించనప్పటికీ ఈ మూవీకి దాదాపు రూ.20 కోట్ల పారితోషికం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే నిజమైతే దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా దీపికా రికార్డ్ క్రియేట్ చేయనుంది. కాగా..ఇప్పటికే దీపికా కల్కి 2898 ఏడీ మూవీలో కనిపించారు. గతంలో ప్రియాంక చోప్రా, అలియా భట్ కూడా భారీ పారితోషికం తీసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి.ఈ మూవీ ఫుల్ యాక్షన్-ప్యాక్డ్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ఏడాదిలోనే 'స్పిరిట్' షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్రెడ్డి వంగా (సందీప్రెడ్డి వంగా సోదరుడు) భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు . వచ్చే ఏడాది చివర్లో స్పిరిట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
మెగాస్టార్ తో హీరోయిన్ దీపికా పడుకోణె మూవీ..!
-
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్లో జంట రణ్వీర్ సింగ్- దీపికా పదుకొణె ఒకటి. 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. దాదాపు ఆరేళ్ల తర్వాత 2024లో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లలను కనడానికి ఇంత గ్యాప్ తీసుకోవడం తన నిర్ణయమే అంటోంది దీపికా. ఈ విషయంలో రణ్వీర్ సింగ్ తనకు ఎంతో సపోర్ట్గా నిలిచాడని చెప్పింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ప్రెగ్నెన్సీ విషయంలో రణ్వీర్ ఎంత క్లారిటీగా ఉన్నారనే విషయాన్ని చెబుతూ భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘పెళ్లయిన కొత్తలో ఓ సారి పిల్లలను కనడం గురించి రణ్వీర్తో మాట్లాడుతూ..ఎప్పుడు ప్లాన్ చేద్దాం అని అడిగాను. దానికి ఆయన సమాధానం ఇస్తూ..‘పిల్లలను కనడం ఇద్దరి నిర్ణయం అయినప్పటికీ.. మోయాల్సింది నువ్వు మాత్రమే. నీ శరీరంలోనే బేబీ పెరుగుతుంది. కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకోవాలి. పిల్లలను కనగలను అని నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్లాన్ చేద్దాం’ అన్నారు. ఆయన మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి’ అని దీపికా చెప్పుకొచ్చిది. ఇక తన కూతురుకి దువా అనే ఎందుకు పెట్టారో వివరిస్తూ.. ‘బేబీకి పెరు పెట్టే విషయంలో మేం తొందరపడలేదు. బిడ్డ పుట్టిన రెండు నెలల తర్వాత పేరు పెట్టాం. ముందుగా బేబీ క్షేమంగా మా చేతుల్లోకి రావాలనే కోరుకున్నాం.దువా అనే పేరు కూడా అనుకోకుండా పెట్టేశాం. ఓ రోజు రాత్రి సెట్లో ఉన్న రణ్వీర్కి మెసేజ్ చేశాను. బేబీ పేరు గురించి చర్చిస్తూ ‘దువా’ అన్నాను. వెంటనే ఓకే చెప్పేశాడు. అదే పేరును మేం ప్రకటించాం. అరబిక్ భాషలో దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానమే ఈ పాప అని అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టేశాం’అని దీపికా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు బ్రేక్ తీసుకొని పూర్తి సమయం బేబీకి కేటాయించింది. కల్కి 2లో నటించబోతుంది. అలాగే షారుఖ్ ఖాన్ కొత్త సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
రూ.4.5 కోట్లు, రూ.75లక్షలు.. బాలీవుడ్ తారల వస్త్రధారణ ఖరీదు
బాలీవుడ్ సినిమాలు అంటేనే రిచ్నెస్కి కేరాఫ్ అన్నట్టుగా ఉంటాయి. ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఎన్ని వ్యయ ప్రయాసలకైనా సరే రెడీ అన్నట్టుగా ఉండే బాలీవుడ్ నిర్మాతలు, కేవలం హీరో, హీరోయిన్ల దుస్తుల కోసం రూ.లక్షల నుంచి రూ.కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. గత కొంత కాలంగా పలు బాలీవుడ్ చిత్రాల్లో తారలు ధరించిన అత్యంత ఖరీదైన దుస్తుల వివరాలివే...–షారూఖ్ ఖాన్ నటించిన వన్ సినిమాలో ఆయన ధరించిన రోబో పాత్రకు తగినట్టుగా రోబోటిక్ వస్త్రధారణలో కనిపిస్తారు. సినిమాలో ఈ గెటప్ చాలా కీలకం కావడంతో దీని కోసం రూ.4.5 కోట్లను నిర్మాతలు ఖర్చు పెట్టారట. ఇప్పటి దాకా అత్యధిక వ్యయం చేసిన కాస్ట్యూమ్ ఇదేనని చెప్పొచ్చు. ఈ కాస్ట్యూమ్ డిజైనింగ్లో టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో పాటు విదేశీ డిజైనర్లు రాబర్ట్ లీవర్ వంటివాళ్లు కూడా పాలు పంచుకున్నారు.–రాధా నాచేగీ అనే పాట కోసం నటి సోనాక్షి సిన్హా అత్యంత ఖరీదైన దుస్తులు ధరించిన ఘనత దక్కించుకుంది. తేవార్ సినిమాలోని ఓ పాట కోసం రూపొందించిన డ్రెస్ విలువ ఏకంగా రూ.75లక్షలని సమాచారం.–సింగ్ ఈజ్ బ్లింగ్లో హీరో అక్షయ్ కుమార్ ధరించిన టర్బాన్ పూర్తిగా స్వఛ్చమైన ప్లెయిన్ గోల్డ్తో తయారు చేశారు. దీని ఖరీదు రూ.65లక్షలు పైనే ఉంటుందట. టర్బాన్ ధరించడాన్ని బాలీవుడ్లో ట్రెండ్గా మార్చింది ఈ సినిమా.–బాజీరావ్ మస్తానీ సినిమాలో చారిత్రక వస్త్ర వైభవాన్ని తెరపై ఆవిష్కరించడానికి డిజైనర్ అంజుమోన్ స్వయంగా చేతితో డిజైన్ చేయగా, దీపిక పదుకునే ధరించిన దుస్తులకు రూ.50లక్షలకు పైనే ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఈ డ్రెస్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం అచ్చంగా బంగారంతో చేయడం విశేషం.–కంబక్త్ ఇష్క్ సినిమాలో కరీనా కపూర్ ధరించిన సెక్విన్ మినీ డ్రెస్ ను పారిస్ నుంచి తెప్పించారట. అందుకోసం రూ.8లక్షలు ఖర్చు పెట్టారు. టైటిల్ సాంగ్లో ఈ డ్రెస్ ధరించి మెరిసిన కరీనా..కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ను సృష్టించింది.–జోథా అక్బర్లో మొఘల్ దర్పాన్ని ఒలికించేలా హృతిక్ రోషన్ దుస్తుల్ని డిజైన్ చేయడం కోసం దాదాపుగా 18నెలల పాటు డిజైనర్ నీతాలుల్లా శ్రమించారు. అందులో ఒక కాస్ట్యూమ్ కోసం అత్యధికంగా రూ.12లక్షలు ఖర్చు పెట్టారు. ఇదే సినిమాలో ఐశ్వర్యారాయ్ అందంతో పాటు ఆమె వస్త్ర సోయగం కూడా ఇమిడిపోయేలా రూపొందిన ఐశ్వర్య దుస్తుల కోసం రూ.2లక్షలపైనే ఖర్చు చేశారు.–మార్ డాలా అనే పాట దేవదాస్ సినిమాలో సూపర్హిట్. ఆ పాట లో జీవించిన బాలీవుడ్ స్టార్ మాధురీదీక్షిత్ ధరించిన రెడ్ కలర్ దుస్తులు కూడా అంతే హిట్. వీటి ఖరీదు రూ.15లక్షల పైమాటే.–పద్మావతి సినిమా కోసం దీపిక పదుకునే ధరించిన లెహంగా ఏకంగా 30 కిలోల బరువు ఉంటుందట. పూర్తిగా కళాకృతులను ఇముడ్చుకున్న ఈ డ్రెస్... తయారీలో 200 మంది కళాకారులు పాలుపంచుకున్నారట. కిలోల కొద్దీ బంగారాన్ని వినియోగించిన ఈ దుస్తుల కోసం రూ.30లక్షలు ఖర్చు పెట్టారట.–క్రిష్ 3 సినిమా లో కంగనా రనౌత్ ధరించిన దుస్తుల ఖరీదు రూ. కోటి రూపాయలట.. పారిస్ నుంచి ఒక్కోటి రూ.10లక్షల ఖరీదు లాటెక్స్ సూట్స్ ను తెప్పించారు. అలాంటివి 10 సూట్స్ ఈ సినిమాలో ఆమె ధరించింది.–చారిత్రక యుద్ధాల నేపధ్యంలో తీసిన వీర్ సినిమాలో సల్మాన్ ఖాన్ వారియర్గా చూపించే డ్రెస్ ఖరీదు రూ.20లక్షలు. ఈ సినిమాలో యుద్ధవీరునిగా కనిపించే సమయంలో సల్మాన్ ధరించిన దుస్తుల్ని రాజస్థాన్కు చెందిన లెదర్ వర్క్ నిపుణులు తయారు చేశారు. ఒక్కోటి రూ.20లక్షల విలువైన అలాంటి 6 వారియర్ కాస్ట్యూమ్స్ను ఈ సినిమాలో సల్మాన్ ధరించాడు. -
నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా
మాతృత్వం ఒక వరమే.కానీ అంతకుమించిన బాధ్యతల భారం కూడా. కుటుంబ సభ్యులు, భర్త సహకారం ఉన్నపుడు నిజంగా ఏ మహిళకైనా గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం, పాలిచ్చి పోషించడం లాంటి వన్నీ జీవితాంతం పదిలపర్చుకునే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇంత ముఖ్యమైన విషయాన్ని అటు కుటుంబ సభ్యులు, ఇటు సమాజమూ గుర్తించాలన్న స్పృహ ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. దీనికి తోడు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ అంశంపై బహిరంగంగా చర్చిస్తుండటం మంచి పరిణామం. ఈ కోవలోకి తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే చేరింది.హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరు దీపికా పదుకొణే (Deepika Padukone). అందానికి తగ్గ అభినయం, అభిమానుల హృదయాలను దోచుకుంది. బాలీవుడ్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలను తన సొంతం చేసుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల ఫ్యావరేట్గా మారింది. హీరోయిన్గా కరియర్ కొనసాగిస్తూనే, బాలీవుడ్ హీరో,ప్రేమికుడు రణవీర్ సింగ్ను 2018లో వివాహం చేసుకుంది. 2024లో తొలి బిడ్డ దువాకు జన్మనిచ్చింది. వేవ్స్ సమ్మిట్ 2025లో దీపిక తన కూతురు దువాకుతో తనకున్న అనుబంధం, చిన్నారి వచ్చిన తరువాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడింది.ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన WAVES 2025 సమ్మిట్లో మాతృత్వం, బిడ్డ పెంపకం గురించి మాట్లాడినపుడు. దీపికా పదుకొనే మాతృత్వాన్ని స్వీకరించడం గురించి, దువా రాక తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది స్పష్టంగా,చాలా ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. పాపాయి రక్షణ కోసం ఎలాంటి ఆయాను (నానీ)ని నియమించుకోలేదు దీపిక. స్వయంగా తానే ఆ బాధ్యతను తానే తీసుకుంది. తల్లినయ్యాక కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నానని చెప్పింది. తల్లికాక ముందు, తన కలలు తన ఆశయాలు మాత్రమే ఉండేవి, కానీ ఇపుడంతా ఆమె గురించే. ఇదీ చదవండి: నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?"అమ్మ అయిన తర్వాత కొత్త జీవితాన్ని చూస్తున్నాను. బిడ్డను కన్న క్షణంనుంచి మరో ప్రాణిని పోషించే బాధ్యత వహించాలి. ముఖ్యంగా నాలాంటి జీవనశైలి ఉన్నవారికి, ముఖ్యంగా ఇల్లు వదిలి వెళ్ళడం, నా ఆశయం, నా కెరీర్ ఇలా ప్రతిదీ నా జీవితం, ఇలా ప్రతిదాని గురించి ఆలోచించాను. ఇప్పుడు, అకస్మాత్తుగా, పాపాయి మీద శ్రద్ద వహించాలి. తల్లి కావాలని కోరుకున్నాను కనుక, ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నాను, " అని దీపికా పేర్కొన్నారు.మరోవైపు షారుఖ్ ఖాన్ దీపికా పదుకొణేను ప్రశంసల్లో ముంచెత్తారు. దువాకు తల్లి అయినందుకు షారుఖ్ దీపికను అభినందించారు. నటి పోషించగల ఉత్తమ పాత్ర నిజ జీవితంలోనే అని, ఇప్పుడు ఆమె తన పాప దువాకు తల్లి అని అన్నారు.చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! -
స్టార్ హీరో కూతురికి తల్లిగా నటించనున్న దీపికా పదుకోన్
స్క్రీన్పై షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్కు తల్లిగా నటించనున్నారట దీపికా పదుకోన్. షారుక్ ఖాన్ హీరోగా ఆయన కుమార్తె సుహానా మరో లీడ్ రోల్లో నటించనున్న చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారని బాలీవుడ్ టాక్. అభిషేక్ బచ్చన్ విలన్గా నటించనున్నారు. తాజాగా ఈ మూవీలో దీపికా పదుకోన్ ఓ లీడ్ చేయనున్నారనే టాక్ తెర పైకి వచ్చింది. సుహానా ఖాన్కు తల్లిగా కనిపిస్తారట దీపికా పదుకోన్. ఈ పాత్ర కథకు చాలా కీలకంగా ఉంటుందట. మే లేదా జూన్లో ‘కింగ్’ సినిమా చిత్రీకరణనుప్రారంభించాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రదర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘ఎక్స్’ వేదికగా ‘ఫాల్స్’ అని పేర్కొన్నారు. మరి... ‘అవాస్తవం’ అని ఆయన పేర్కొన్నది దీపికా పదుకోన్ తల్లి పాత్ర గురించా? లేదా వేరే ఏదైనా సినిమా గురించా లేక వేరే ఏ విషయం గురించా అనేది తెలియాల్సి ఉంది. -
ఉషా వాన్స్ నటి దీపికా పదుకొణె స్టైల్ని రీక్రియేట్ చేశారా..?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నోసార్లు జేడీ వాన్స్ బహిరంగంగా తన భార్య ఉషను ప్రశంసిస్తూ పొగడ్తలతో మంచెత్తుతుంటారు. అంతేగాదు తన కెరీర్లోని ప్రతి విషయంలోనూ ఆమె అండగా ఉంటుందని చెబుతుంటారు కూడా. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి ఉషా కూడా ప్రతి వేడుకలో వాన్స్తో జతగా కనిపిస్తూ..వార్తల్లో హైలెట్ అవుతున్నారు. ఈ సారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఇక్కడ ఇవాంక ఉషా వాన్స్ గురించి చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపి గందరగోళానికి గురిచేసింది. అయినా ఇలా ఉషా వాన్స్ని ప్రశంసిస్తూనే అవమాన పరిచేలా ఫోటోలు షేర్ చేశారేంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఇవాంక పోస్ట్లో జరిగిన తప్పిదం ఏంటంటే..డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఉషా వాన్స్ని ప్రశంసిస్తూనే పోస్ట్ పెట్టినా.. అది వివాదాస్పదమైంది. ఇవాంక ఆ పోస్ట్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్యని ప్రశంసిస్తూ.. ఆమెలోని అపారమైన దయ, గొప్ప తెలివితేటలు ఎవ్వరినైనా కట్టిపడేస్తాయి. ఆమె నిష్ణాతురాలైన న్యాయవాది కూడా అంటూ ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తూ..మార్ఫింగ్ చేసి ఉన్న జేడీ వాన్స్ ఫోటోని షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా నెట్టింట ఇదేం పని ఇవాంకా అంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణేకి సంబంధించిన ఫోటోని ఉషా వ్యాన్స్గా మార్ఫింగ్ చేసిన ఫోటోని ఎలా పోస్ట్ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. అంతలా ఇవాంక పోస్ట్ వివాదాస్పదమై నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడానికి ప్రధాన కారణం మార్ఫింగ్ ఫోటో అనే కాదు. Usha Vance is a brilliant and accomplished attorney known for her intelligence, grace, and support for her husband, J.D. Vance. Her beauty is matched by her poise and dedication, making her an inspiring figure. pic.twitter.com/Wm56FK0uCq— Ivanka Trump 🇺🇲 🦅 News (@IvankaNews_) March 23, 2025ఆ మార్ఫింగ్ చేసిన ఫోటో 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందర్నీ ఆకర్షించిన దీపకా పదుకొణే ఎవర్గ్రీన్ స్టైల్ అది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అబూ జని సందీప్ ఖోస్లా చేతి నుంచి జాలువారిని అద్భుత కళా రూపమే ఈ స్టైలిష్ చీర. ఇది అక్కడున్న వారందర్నీ ఆహా భారతీయుల చీరకట్టుకి మించిన ఫ్యాషన్ మరొకటి లేదనిపించేలా చేసింది. అంతలా ఆకర్షించినా ఆ ఫ్యాషన్ వేర్ని మార్ఫింగ్ చేసినట్లు ఉన్న ఉషా వాన్స్ ఫోటో అని క్లియర్గా స్పష్టమవుతండగా ఇవాంకాకు ఎలా తెలియకుండా పోయిందన్నది నెటిజన్ల వాదన. View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) అది కూడా ఒకరిని వ్యక్తిగతంగా ప్రశంసించేటప్పడూ.. ఎంత గౌరవప్రదంగా ఉండే ఫోటోని జత చేస్తూ పోస్ట్ పెట్టాలి అని కామెంట్ చేస్తున్నారు. అయినా ఇలాంటి విషయాల్లో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఫోటో జత చేయాలి లేదంటే అది ప్రశంసలా అస్సలు ఉండదని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఒక్కోసారి కొద్దిపాటి నిర్లక్ష్యం.. మంచిని కూడా చెడుగా చిత్రీకరించేస్తుంది అంటే ఇదే కదా..!.(చదవండి: భారతదేశ సంప్రదాయ పానీయం గోలిసోడా..అమెరికా, బ్రిటన్లో పెరుగుతున్న క్రేజ్) -
మన ఆస్కార్ అవార్డ్స్ను లాక్కున్నారు.. దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) అస్కార్ అవార్డ్స్-2025 గురించి మాట్లాడారా. ఈ ఏడాదిలో భారత్కు అవార్డ్స్ రాకపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేశారు. పారిస్లో జరుగుతున్న లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ లూయిస్ విట్టన్ (Louis Vuitton) షోలో ఆమె పాల్గొంటుండగా ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.ఆస్కార్ అవార్డులు గెలుపొందే అన్ని అర్హతలు ఉన్న అనేక భారతీయ చిత్రాలు ఉన్నాయని దీపికా పదుకొణె చెప్పారు. భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకున్న 'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్, మిస్సింగ్ లేడీస్' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల మీద ప్రశంసలు అందుకున్నాయి. అయినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఆస్కార్- 2025 తుది జాబితాలో చోటు దక్కలేదు. ఇలా చాలాసార్లు మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకుంటూనే ఉన్నారు. భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి. కానీ, ఆ సినిమాలకు, ఆ కథలకు, నటీనటుల ప్రతిభకు గుర్తింపు ఇవ్వడం లేదు. కారణం ఏంటో తెలియదు. కానీ, ఆస్కార్ మాత్రం మన సినిమాలను తిరస్కరిస్తుంది. అయితే, ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులలో ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను నటుడు అడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు రావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది.RRR అవార్డ్.. ఎంతో భావోద్వేగం చెందాను:దీపికాభారత్ నుంచి ఎన్నో విలువైన చిత్రాలు వచ్చినప్పటికీ అస్కార్ అవార్డ్ దక్కకపోవడం చాలా బాధాకరం అని చెప్పిన దీపికా పదుకొణె.. ఆర్ఆర్ఆర్ గురించి కూడా మాట్లాడారు. '2023 ఆస్కార్ అవార్డ్స్ నేను వ్యాఖ్యతగా ఉన్నాను. కానీ, ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ ప్రకటించిన సమయంలో నేను ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను. అవి నాకు ఎంతగానో ప్రత్యేకమైన క్షణాలు. ఆ సినిమాలో నేను భాగం కాకపోయినప్పటికీ ఒక భారతీయురాలిగా ఆ విజయం నా సొంతం అనిపించింది. ఆ గొప్ప క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను.'అని చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్చరణ్,ఎన్టీఆర్ నటించారు. ఇందులో నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
LVFW25 అటు ఐఫిల్ టవర్, ఇటు దీపికా : భర్త కామెంట్ వైరల్
ప్యారిస్ ఫ్యాషన్ వీక్ 2025లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తన మెస్మరైజింగ్ లుక్తో అందర్నీ ఆశ్చర్యపర్చింది. మార్చి 3-11వరకు ఫ్రాన్స్లో జరుగుతున్న ప్యారిస్ 2025-2026 (ఫాల్/వింటర్ విమెన్స్వేర్)లో క్లాసిక్ వింటేజ్ లుక్లో అదరగొట్టింది. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన మార్క్ను చాటుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆమె లుక్ను 'ఐకానిక్' అంటూ తెగ పొగిడేశారు. ఐఫిల్ టవర్కు సమాంతరంగా దీపిక ఫోజులు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.'లూయిస్ విట్టన్ ఫాల్/వింటర్ 2025-2026 కలెక్షన్ ఆవిష్కరణ కోసం పారిస్కు వెళ్లిన ఈ కల్కి నటి మరోసారి హై ఫ్యాషన్ పట్ల తనకున్న అనుబంధాన్ని నిరూపించుకుంది. లూయిస్ విట్టన్లో క్లాసిక్ మోనోక్రోమ్ లుక్లో లగ్జరీ బ్రాండ్ అంబాసిడర్గా ఈ గ్లోబల్ స్టార్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీపికా పదుకొణే దీనికి సంబంధించి ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఐకానిక్ లుక్, ఫ్యాషన్ స్టైల్కి ఫిదా అయిపోయారు. ఓర్రీ, సోఫీ చౌదరి "లవ్" ఎమోజీలతో తమ సంతోషాన్ని ప్రకటించారు. మరోవైపు దీపికా భర్త రణవీర్ సింగ్ ("Lord have mercy on me") చక్కటి మెసేజ్ను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) దీపికా ఐకానిక్ ఐఫిల్ టవర్కు ఎదురుగా ఫోజులిచ్చింది. తెల్లటి భారీ కోటు, స్టైలిష్ టోపీ, స్కార్ఫ్, డీప్ రెడ్ లిప్స్టిక్, బ్లాక్ హీల్స్, గ్లోవ్లతో పారిసియన్ గాంభీర్యానికి పరాకాష్టగా నిలిచింది. ఈ ఫోటోలు అటు ఫ్యాషన్ ఔత్సాహికులు, విమర్శకులు ప్రశంసలందుకున్నాయి. ఐకానిక్ భవనం ది కోర్ కారీ డు లౌవ్రేలో దీపిక ఎంట్రీ అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. దీపికా పదుకొనేతో పాటు, ఎమ్మా స్టోన్, జాడెన్ స్మిత్, జౌ డోంగ్యు, జెన్నిఫర్ కోన్నెల్లీ, అనా డి అర్మాస్ లాంటి అనేక గ్లోబల్ స్లార్లు ఈ షోలో కనిపించారు. కె-పాప్ స్టార్ లిసా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?కాగా రణవీర్తో పెళ్లి, కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత ఈ సంవత్సరం ప్రారంభంలో, ప్రముఖ డిజైనర్ సబ్యసాచి షోలో అద్భుతమైన ప్రదర్శనతో రీఎంట్రీ ఇచ్చింది. దుబాయ్లో జరిగిన కార్టియర్ 25వ వార్షికోత్సవ వేడుకలకు అద్భుతమైన నల్లటి దుస్తులలో మెరిసిపోవడం దగ్గర్నుంచి గ్లోబల్ ప్లాట్ఫారమ్, అబుదాబిలో జరిగిన ఫోర్బ్స్ సమ్మిట్లో గోల్డెన్ గర్ల్గా గుర్తింపు పొందడం వరకు ఆమె ఫ్యాషన్ ఎంపికలు వార్తల్లో నిలుస్తూ వచ్చాయి. ప్రపంచ ఫ్యాషన్లో భారతీయ ప్రాతినిధ్యానికి, ఆమె సిగ్నేచర్ స్టైల్కు ఇది గొప్ప మైలురాళ్లు. లూయిస్ విట్టన్, కార్టియర్ రెండింటికీ గ్లోబల్ అంబాసిడర్గా సంతకం చేసిన తొలి భారతీయురాలు దీపికా. -
విపరీతంగా ఏడ్చేదాన్ని.. అందుకే నిజం దాచిపెట్టా: దీపిక
కొన్నేళ్ల ముందు వరకు సినీ తారలు తమ అనారోగ్య సమస్యల గురించి పెద్దగా బయటపెట్టేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది. మానసిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు. తమ అనుభవాల్ని కూడా చెబుతున్నారు. 'కల్కి' ఫేమ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా తన మానసిక కుంగుబాటు గురించి మరోసారి ఓపెన్ అయింది.'2014లో కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నా. సినిమాలు చేస్తూ నచ్చినట్లు బతుకున్నా. ఓరోజు ఎందుకో బాగా అలసట అనిపించింది. పనివల్ల ఇలా జరుగుంటుంది అనుకున్నా కానీ ఓ రోజు కళ్లుతిరిగి పడిపోయాను. అనవసరమైన వాటికి విపరీతంగా ఏడ్చేదాన్ని. నేను నాలా ఉండలేకపోయాను. అమ్మతో కలిసి థెరపిస్ట్ దగ్గరికే వెళ్తే నాకు డిప్రెషన్ ఉన్నట్లు అర్థమైంది'(ఇదీ చదవండి: కూతురి ఫోటోల్ని డిలీట్ చేసిన ఆలియా భట్! ఆ కారణం వల్లే!)'అయితే థెరపిస్ట్ దగ్గరకు వెళ్లినా దాని గురించి ఎవరికీ చెప్పాలనుకోలేదు. అందుకే సీక్రెట్ గా థెరపీ చేయించుకున్నా. కోలుకుంటున్నప్పుడు మాత్రం మానసిక ఆరోగ్యం గురించి అందరికీ చెప్పాలనుకున్నాను. అలా నా సమస్య గురించి బయటపెట్టాను' అని దీపిక పదుకొణె చెప్పింది.రీసెంట్ గా ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో పాల్గొన్న దీపికా.. మానసిక ఆరోగ్యం గురించి విద్యార్థులకు చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది కల్కి, సింగం ఎగైన్ మూవీస్ చేసింది. కూతురు పుట్టడంతో ఆమె ఆలనాపాలనా చూసుకుంటోంది.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు') -
దీపికా పదుకోన్ (బాలీవుడ్ నటి) రాయని డైరీ
ఇప్పటికీ నాకు ఒక కల వస్తూ ఉంటుంది. ఇప్పటికీ అంటే, పాతికేళ్లు దాటిపోయినప్పటిMీ ! బహుశా ఇంకో పాతికేళ్లు దాటి పోయినా ఆ కల నాకు వస్తూనే ఉంటుందనుకుంటాను. అది ఎప్పుడూ వచ్చిపోతుండే కలే అయినా, అప్పుడే మొదటిసారిగా ఆ కలను కన్నట్లుగా ప్రతిసారీ నేను దిగ్గున మేల్కొంటాను! గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. నుదురు చెమట పట్టి ఉంటుంది. గొంతు ఆర్చుకునిపోయి ఉంటుంది. ‘‘సిద్ధివినాయకా! నాపై నీకెంత అనుగ్రహం! ఇది వట్టి కలేనా...’’ అని మనసులోనే ఆయనకు ప్రణమిల్లి పైకి లేస్తాను. ఒక గ్లాసు నీళ్లు తాగుతాను. అమ్మతో మాట్లాడతాను. నాన్నను పలకరిస్తాను. రణ్వీర్ను లేపుతాను. నా ఐదు నెలల కూతురు దువాను ముద్దాడతాను. నా స్ట్రెస్ అంతా పోతుంది. ‘పరీక్షా పే చర్చ’ కోసం ఢిల్లీ నుండి ఆహ్వానం రాగానే మొదట నాకు నా కలే గుర్తొచ్చింది! పిల్లల్లో పరీక్షల భయం పోగొట్టటం కోసం ‘మోదీజీ మోటివేషన్ టీమ్’ నన్నక్కడికి పిలిపించింది.నా ఎదురుగా స్కూలు ఫైనల్ పరీక్షలకు సిద్ధమౌతున్న చిన్నారులు కూర్చొని ఉన్నారు. అంతా పద్నాలుగూ పదిహేనేళ్ల వాళ్లు. ‘‘దీపికాజీ! చదువుతుంటే స్ట్రెస్గా ఉంటోంది. చదివింది ఒక్కటీ గుర్తుండటం లేదు. ఏం చేయమంటారు?’’ అని ఒక స్టూడెంట్!25 ఏళ్ల క్రితం మోదీజీ ప్రధానిగా ఉండి, ఇరవై ఐదేళ్ల క్రితమే ‘పరీక్షా పే చర్చ’ ఉండి ఉంటే... అలా ఆ ప్రశ్నను అడిగిన అమ్మాయి కచ్చితంగా దీపికా పదుకోన్ అయి వుండేది! అప్పుడు నేను టెన్త్కి ప్రిపేర్ అవుతున్నాను. సోఫియా హైస్కూల్లో చదివే అమ్మాయిలకు పరీక్షలంటే భయం ఉండదని టీచర్లు గొప్పగా చెబుతుండేవారు! పేరెంట్స్ ఆ మాటను ఇంకా గొప్పగా వింటుండేవారు. కానీ నాకు భయంగా ఉండేది. ‘మిస్’తో నా భయం గురించి చెబితే, ‘‘ఏ సబ్జెక్ట్ అంటే భయపడుతు న్నావో, ఆ సబ్జెక్ట్తో ఫ్రెండ్షిప్ చెయ్యి’’ అనేశారు! ఇదెక్కడి గొడవ!నేను ఫ్రెండ్షిప్ చేస్తాను సరే, నాతో ఫ్రెండ్షిప్ ఆ సబ్జెక్ట్కి ఇష్టమవ్వాలి కదా! అది ఆలోచించినట్లు లేరు మా మిస్. టీచర్లు ఇచ్చే టిప్స్ ఇలాగే అసాధ్యమైన ఫ్రెండ్షిప్లతో నిండి ఉండేవి! ఇప్పుడు మోదీజీ చెబుతున్నట్లుగా... ‘‘కంటి నిండా నిద్రపోండి. కలత లేకుండా చదవండి...’’ అని మేడ్ ఈజీగా ఒక్కమాటైనా అనేవాళ్లు కాదు.కొరివి దెయ్యాల్లాంటి పరీక్షల్ని వాకిట్లో పెట్టుకుని నిద్ర పోవటం, నిద్ర పట్టటం అయ్యే పని కాకపోయినా... మోదీజీ అంత బిజీలోనూ పిల్లలతో ఇంటరాక్ట్ అవటం; సద్గురువులను, న్యూట్రిషనిస్ట్లను ఇంటరాక్ట్ చేయించటం... ఇలా కదా పరీక్షల భయాన్ని పోగొట్టటం!నిజానికి – బోర్డ్ ఎగ్జామ్స్ కంటే కఠినమైనవి జీవితం పెట్టే పరీక్షలు! జీవితం పెట్టే పరీక్షలకు సిలబస్ ఉండదు. స్కూళ్లు, ట్యూషన్లు ఉండవు. టిప్స్ ఇచ్చేవాళ్లున్నా అవి మనకు పనికొచ్చేవై ఉండవు. జీవితంలో ప్రతిదీ ఫైనల్ ఎగ్జామే. పాసైన సంతోషమైనా, ఫెయిల్ అయిన విచారమైనా జీవితం మళ్లీ ఇంకో పరీక్ష పెట్టేవరకే! టెన్త్ ఎగ్జామ్స్ జన్మకోసారి. కానీ జన్మ మొత్తం కలలోకి వచ్చి జడిపిస్తూనే ఉంటాయి. పెళ్లయి, పేరెంట్స్మి అయి, పిల్లలు టెన్త్కి వచ్చినా కూడా... మన టెన్త్ మన కలలోకి వస్తూనే ఉంటుంది. రేపే పరీక్ష ఉన్నట్లు, అసలేమీ చదవనట్లు, ‘హే... గణేశా! ఎలా రాయాలి తండ్రీ...’ అని కలలో మొరపెట్టుకుంటూ ఉంటాం!‘పరీక్షా పే చర్చ’లో పిల్లలకు నేను నాలుగు టిప్స్ ఇచ్చాను. స్లీప్, ఎక్స్ప్రెస్, హైడ్రేట్, మెడిటేట్! నాన్న నాకు చిన్నప్పుడు చెప్పిన టిప్స్ అవి. పెద్దయ్యాక, చిన్నప్పటి ‘పరీక్ష కల’ వెంటాడకుండా ఉండేందుకు కూడా ఏవైనా టిప్స్ ఉండి ఉంటాయా?! ఉన్నా అవసరం లేదు. కొన్ని కలలు వెంటాడుతుంటేనే జీవితం పాస్ అవుతున్న ఫీల్ ఉంటుంది. -
పరీక్షా పే చర్చ: మెంటల్ హెల్త్పై దీపికా పదుకొణె కామెంట్స్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone)తాను మానసిక ఆందోళనకు గురైన ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) ప్రతి ఏడాది నిర్వహించే పరీక్షా పే చర్చ(Pariksha Pe Charcha) తాజా ఎపిసోడ్ (రెండో)లో పాల్గొన్నదీపికా బాల్యంలో, చదువుకునే సమయంలో తానెదుర్కొన్న ఆలోచనలు, సమస్యల గురించి వివరించింది. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషించే కార్యక్రమం 'పరీక్ష పే చర్చ' ఎపిసోడ్కి తనను ఆహ్వానించినందుకు ప్రేక్షకులకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీపికా కృతజ్ఞతలు తెలిపింది. పరీక్షా పే చర్చ 2025 రెండో ఎపిసోడ్ దీపికా పదుకొణెతో విజయవంతంగా ముగిసింది. ఈ ఎపిసోడ్లో, దీపికా పదుకొనే తన బాల్య ప్రయాణాన్ని పంచుకుంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాను అల్లరి పిల్లనని తెలిపింది. లెక్కలు నేర్చుకోవడంలో ఇబ్బంది ఉండేదని గుర్తు చేసుకుంది. అంతేకాదు ఇప్పటికీ లెక్కలంటేనే భయమేనని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పుస్తకాన్ని కూడా ప్రస్తావించింది. అందరూ తమ మనసులోని భావాలను బయటపెట్టాల్సిన అవసరాన్నిగురించి వివరించింది. మానసిక ఆరోగ్యం, ఒత్తిడి ఎదుర్కోవడం లాంటి అంశాలపై విద్యార్థులకు ఆమె కీలక సలహాలిచ్చింది.Deepkia Padukone thanks PM Modi for giving her the platform to speak on Depression, anxiety and other mental health issues! pic.twitter.com/BlqGy8fGrN— Janta Journal (@JantaJournal) February 12, 2025తన అనుభవాలను పంచుకుంటూ..స్కూల్ విద్యార్థిగా ఉన్నపుడే క్రీడల వైపు ఆసక్తి ఉండేదని, ఆ తరువాత మోడలింగ్, నటన వైపు తన దృష్టి మళ్లిందని తెలిపింది. అయితే ఒకానొక దశలో మానసికంగా చాలా కుంగుబాటుకు లోనయ్యానని, ఆత్మహత్య చేసు కోవాలనే ఆలోచనలు కూడా వచ్చేవని దీపికి తెలిపింది. అవిశ్రాంతంగా పనిచేస్తూ,తన మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోలేదనీ, చివరికి ఒక రోజు స్పృహ కోల్పోయాను. రెండు రోజుల తర్వాత, నిరాశతో బాధపడుతున్నానని గ్రహించి చికిత్స తీసుకున్నట్టు వెల్లడించింది. తన జీవితంలో వచ్చిన ఎన్నో మార్పులను అవగాహన చేసుకుంటూ, తనను తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగినట్టు చెప్పింది. ఈ ఒత్తిడి అనేది కంటికి కన్పించదు, కానీ అనుక్షణం దెబ్బతీస్తుంది. మన జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. నిజానికి మన చుట్టూ ఈ సమస్యతో బాధపడేవారు చాలామందే ఉంటారు. అందుకే రాయడం అలవర్చుకోవాలని పిల్లలకు సలహా ఇచ్చింది. జర్నలింగ్ అనేది మనమనసులోని భావాలను ప్రాసెస్ చేయడానికి, వ్యక్తీకరించడానికి ఒక మంచి మార్గమని ఆమె విద్యార్థులకు సూచించారు. ఒకరితో ఒకరు పోటీ పటడం, పోల్చుకోవడం సహజం. మన బలాలు ,బలహీనతలను గుర్తించడం, మన బలాలపై దృష్టి పెట్టడం, మన బలహీనతలను మెరుగుపరచుకోవడం చాలా అవసరమని పేర్కొంది. అలాగే మన బలాన్ని మనం తెలుగుకో గలిగిన రోజు మీలోని మరో వ్యక్తి బయటికి వస్తారని ధైర్యం చెప్పింది.కాగా పరీక్షా పే చర్చ ఎపిసోడ్స్ విద్యా మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్, మైగవ్ ఇండియా, ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్, దూరదర్శన్ ఛానల్స్ వంటి అన్ని ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.2014లో క్లినికల్ డిప్రెషన్తో బాధపడిన దీపికా పదుకొణె ఈ ఎడిసెడ్లో పాల్గొంది. హీరో రణవీర్ను పెళ్లాడిన దీపిక ప్రస్తుతం పాపకు తల్లిగా మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. -
PPC: మోదీతో సందడి చేయనున్న సెలబ్రిటీలు
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’.. ఈ ఏడాది కొత్త ఫార్మాట్లో జరగనుంది. మోదీతో పాటు ఈసారి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనే పరీక్షా పే చర్చ ఇప్పటికే ఏడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పిబ్రవరి 10వ తేదీన న్యూఢిల్లీలోని భారత మండపంలో 8వ ఎడిషన్ జరగనుంది. అయితే ఈ చర్చకు ప్రత్యేకత తీసుకురావాలని అధికారులకు మోదీ సూచించారు. ఈ క్రమంలోనే ప్రముఖులను చర్చలో భాగం చేయనున్నారు. ఆధ్యాత్మికవేత్త సద్గురు, నటి దీపికా పదుకొనే, మేరీ కోమ్, విక్రాంత్ మెస్సీ, భూమి ఫడ్నేకర్, అవనీ లేఖరా, రుజుతా దివేకర్, సోనాలి సభార్వల్, ఫుడ్ఫార్మర్, టెక్నికల్ గురూజీ, రాధికా గుప్తా.. ఇందులో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 6 నుంచి 12 తరగతుల చదివే సుమారు 2,500 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మరోవైపు.. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే విద్యార్థులందరినీ పీపీసీ కిట్స్ను కేంద్ర విద్యా శాఖ అందించనుందని సమాచారం. అలాగే.. లెజెండరీ ఎగ్జామ్ వారియర్స్గా ఎంపిక చేసిన 10 మందికి ప్రధాని నివాసం సందర్శించే అవకాశం కల్పించనున్నారు. -
కంగనా రనౌత్ రెస్టారెంట్.. తొలి కస్టమర్గా స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాపారం రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో తన బిజినెస్ను ప్రారంభించనుంది. అందమైన పర్వతాల మధ్యలో సరికొత్త రెస్టారెంట్ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మనాలిలో ఏర్పాటు చేయనున్న ఈ రెస్టారెంట్కు ది మౌంటైన్ స్టోరీ అనే పేరును కూడా ఖరారు చేసింది. తన కొత్త రెస్టారెంట్కు మొదటి కస్టమర్గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఆహ్వానించింది కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఏర్పాటు చేసిన ది మౌంటైన్ స్టోరీ రెస్టారెంట్ను ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగనా ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఈ సందర్భంగా రెస్టారెంట్ను తెరవాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ తాను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. ప్రపంచస్థాయి మెనూను కలిగి ఉండాలనుకునే రెస్టారెంట్ను తెరవాలనుకుంటున్నా అని కంగనా అన్నారు. అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక పదుకొణె నీ రెస్టారెంట్కు నేనే మీ మొదటి క్లయింట్ అవుతానని చెప్పింది. మరోసారి ఆ వీడియోను షేర్ చేస్తూ దీపికా పదుకొణె నా నా మొదటి కస్టమర్గా వస్తానని ప్రామిస్ చేశావ్ అంటూ కంగనా పోస్ట్ చేసింది. అంతేకాకుండా రెస్టారెంట్ ప్రారంభించడం చిన్ననాటి కల అని వెల్లడించింది. కాగా.. సినిమాల విషయానికొస్తే కంగనా రనౌత్ చివరిగా ఎమర్జెన్సీలో కనిపించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి కంగనానే దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Mountain Story ( Restaurant ) (@themountainstorytms) -
దీపిక రికార్డ్ బద్దలు కొట్టిన ప్రియాంక?
-
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ పాతికేళ్ల పండగలో మెరిసిన తారలు
-
డెలివరీ తర్వాత తొలి ర్యాంప్ వాక్.. గుర్తుపట్టలేనట్లుగా స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) డెలివరీ తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించింది. తాజాగా తొలిసారి ఆమె ర్యాంప్ వాక్ చేసింది. సబ్యసాచి 25వ ఫ్యాషన్ షోలో తళుక్కుమని మెరిసింది. తెల్లటి దుస్తుల్లో ఆమె స్టైల్గా ర్యాంప్ వాక్ చేసింది. చోకర్, క్రాస్ నెక్లెస్, చేతికి బ్రాస్లెట్, కళ్లజోడుతో ఆమె దర్శనమిచ్చింది. అయితే తన లుక్ చూసిన జనాలు దీపికను గుర్తుపట్టలేకుండా ఉన్నారు.దీపికా పదుకొణె, రేఖమొదట చూడగానే..కాస్త బొద్దుగా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. సీనియర్ నటి రేఖలా ఉందని పోలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రేఖ కూడా ఇలాంటి అవుట్ఫిట్లోనే కనిపించింది. వెరైటీ హెయిర్స్టైల్, కళ్లజోడుతో అచ్చం ఇలాంటి లుక్లోనే ఉంది. అందుకే చాలామంది.. మొదట చూడగానే తనను రేఖ అని పొరబడుతున్నారు.సినిమాఇకపోతే దీపిక చివరగా కల్కి 2989 ఏడీ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో కల్కి 2898 ఏడీ సీక్వెల్, పఠాన్ 2 చిత్రాలున్నాయి. పర్సనల్ విషయానికి వస్తే.. 2018లో రణ్వీర్ సింగ్, దీపికా పెళ్లి చేసుకున్నారు. వీరికి 2024 సెప్టెంబర్లో పాప పుట్టింది. తమ కూతురికి దువా అని నామకరణం చేశారు. దువా అంటే ప్రార్థనలు అని అర్థం. International 🔥 Deepika walking the ramp after a gap but still the supermodel uff yaasss!! #DeepikaPadukone pic.twitter.com/zZngQFWcnF— Banno 🇮🇳 (@BannoReBanno) January 25, 2025 చదవండి: నా కూతురు పోయాకే చేదు నిజం తెలుసుకున్నా.. ఇళయరాజా ఎమోషనల్ -
‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’
పని గంటలపై ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వారానికి 90 గంటలు పని చేయడంతోపాటు, ఆదివారం సెలవునూ వదిలేయాలని సుబ్రహ్మణ్యన్ ఇటీవల ఓ వీడియో ఇంటెరాక్షన్లో తన ఉద్యోగులతో అన్నారు. దీనినై ప్రముఖులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా, సినీ నటి దీపికా పదుకొణె సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై కామెంట్ చేశారు.అసలేం జరిగిందంటే..ఎల్ అండ్ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్తో వీడియో ఇంటెరాక్షన్లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్(l and t chairman comments) స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.వినాశనానికి దారితీస్తుంది..సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka) స్పందిస్తూ..‘వారానికి 90 రోజుల పనా? సండేను సన్-డ్యూటీ అని.. ‘డే ఆఫ్’ను ఓ పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు. తెలివిగా కష్టపడి పని చేయడాన్ని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని మొత్తం ఆఫీసుకే అంకితంగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయం చేకూరదు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు. అవసరం అని నా భావన’ అని తన ఎక్స్ ఖాతాలో పోర్కొన్నారు. ‘వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్’ అంటూ హ్యాష్ట్యాగ్ను జత చేశారు.90 hours a week? Why not rename Sunday to ‘Sun-duty’ and make ‘day off’ a mythical concept! Working hard and smart is what I believe in, but turning life into a perpetual office shift? That’s a recipe for burnout, not success. Work-life balance isn’t optional, it’s essential.… pic.twitter.com/P5MwlWjfrk— Harsh Goenka (@hvgoenka) January 9, 2025ఇదీ చదవండి: నిబంధనలు పాటిస్తే బ్యాంకులదే బాధ్యతమెంటల్ హెల్త్ ముఖ్యం..వారానికి 90 గంటలు పని చేయాలని సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి దీపికా పదుకొణె(deepika padukone) స్పందించారు. సుబ్రహ్మణ్యన్ను ఉద్దేశించి ‘అతను చాలా గౌరవం, అధికారంలో ఉన్న వ్యక్తి. అంత ఉన్నత స్థానంలో వ్యక్తులు ఇలాంటి కామెంట్లు చేయడంతో షాకింగ్గా అనిపించింది’ అని కామెంట్ చేశారు. తన కామెంట్ చివర ‘మెంటల్ హెల్త్ మేటర్స్’ అనే హ్యాష్ట్యాగ్ను ఉంచారు. ఈ వ్యవహారంపై కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ చైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి’ అని తెలిపింది. ఇలా కంపెనీ స్పష్టత ఇచ్చిన దానిపై దీపిక పదుకొణె స్పందిస్తూ ‘ఇలా ఈ అంశంపై రిప్లై ఇచ్చి మరింత దిగజారారు’ అని అన్నారు. -
దీపికా స్టైలిష్ డ్రెస్, చూడ్డానికి చాలా సింపుల్ : కానీ ధర తెలిస్తే షాక్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా భర్తతో రణ్వీర్తో కలిసి విమానాశ్రయంలో తళుక్కున మెరిసింది. ఈ సందర్బంగా లవబుల్ కపుల్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్లో ఫ్యాన్స్ను మురిపించారు. ఎప్పటిలాగానే నవ్వుతూ మీడియాకు ఫోజులిచ్చారు.కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత తల్లిదండ్రులుగా జంటగా కనిపించారు. ట్రెండింగ్ వైడ్ లెగ్ జీన్స్, పాప్లిన్ స్లిట్ షర్ట్లో చాలా సింపుల్గా కనిపించింది. కానీ ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?ఎయిర్పోర్ట్లో నల్ల చారల చొక్కా, ప్యాంట్ చాలా సింపుల్గా కంఫర్టబుల్గా చిక్ స్టైల్తో మెప్పించింది గ్లోబల్ ఐకాన్. లీ మిల్ కలెక్షన్కు చెందిన ఈ డ్రెస్ ధర 79,100. దీనికి జతగా సిటిజన్స్ ఆఫ్ హ్యుమానిటీ హై రైజ్ వైడ్ లెగ్ జీన్స్ను ధరించింది. దీని ధర సుమారు రూ. 39వేలే. (యాపిల్లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్బీఐ కన్ను?!)అంతేనా లగ్జరీ ఎలిమెంట్ను జోడిస్తూ లూయిస్ విట్టన్ సన్ గ్లాసెస్తో తన లుక్కి మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఇంకా అద్భుతమైన కార్టియర్ శాంటాస్ డి కార్టియర్ వాచ్తో రూపాన్ని పూర్తి చేసింది, దీని ధర రూ.3,080,000. ఇదీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం Power couple Ranveer Singh and Deepika Padukone turn heads at the Mumbai airport with their effortless style and charm 💕#RanveerSingh #DeepikaPadukone #deepveer #Bollywood #iwmbuzz @RanveerOfficial @deepikapadukone pic.twitter.com/TE2Al4PK7J— IWMBuzz (@iwmbuzz) January 7, 2025 ఇక రణవీర్ సింగ్ తన జుట్టును పోనీ టైల్లో కట్టి, తన క్యాజువల్ బెస్ట్ డ్రెస్లో అందరికీ హాయ్ చెప్పాడు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూతురు దువాతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఇటీవల దీపిక 39వ పుట్టినరోజు (జనవరి,5)కు ఈ జంట మాల్దీవుల్లో సెల్రబేషన్స్ ముగించుకొని తిరిగి ముంబై చేరుకున్నారు. కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)తో కలిసి దీపికా కల్కి( Kalki ) సినిమాలో నటించింది. గర్భంతో ఉన్న మహిళగా నటనతో విమర్శకులను సైతం మెప్పించింది. ప్రెగ్నెంట్గా ఉన్నపుడే ఈ సినిమాలో నటించడం మాత్రమే కాదు, నిండు గర్భంతో ప్రమోషన్స్లో పాల్గొని అందర్నీ మెస్మరైజ్ చేసింది.ఈ ప్రమోషన్స్లో రూ.1.14 లక్షల విలువైన బ్లాక్ డ్రెస్తో ఆకట్టుకుంది. Magda రూ.41.500 విలువైన Butrym బ్రాండ్ స్టైలీష్ చెప్పులు ధరించింది. కోటి రూపాయల విలువచేసే బ్రేస్ లేట్ కూడా ధరించిన విషయం తెలిసిందే. -
సౌత్ సినిమాతో హీరోయిన్గా పరిచయం.. ఇప్పుడు దేశంలోనే టాప్!
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మొదట్లో బ్యాడ్మింటన్ ప్లేయర్. జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంది. కానీ సడన్గా బ్యాడ్మింటన్ వదిలేసి మోడల్గా మారిపోయింది. వెంటనే సినీ అవకాశాలూ తలుపుతట్టాయి. అలా 2006లో వెండితెరపై రంగప్రవేశం చేసింది. ఇప్పుడు ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా చెలామణీ అవుతోంది. ఇంతకీ ఇప్పుడైనా ఆ పాపాయిని గుర్తుపట్టారా? తనే దీపికా పదుకొణె.అప్పట్లో బ్మాడ్మింటన్ ప్లేయర్1986 జనవరి 5న డెన్మార్క్లో భారత సంతతికి చెందిన ప్రకాశ్ పదుకొణె దంపతులకు దీపిక (Deepika Padukone) జన్మించింది. ప్రకాశ్ ఒకప్పుడు పేరు మోసిన బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆమె తాతయ్య రమేశ్ మైసూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కు సెక్రటరీగా సేవలందించాడు. దీపికకు ఏడాది వయసున్నప్పుడే ఫ్యామిలీ అంతా బెంగళూరులో సెటిలైంది. బ్యాడ్మింటన్ ఆటకే ఎక్కువ సమయం కేటాయించే దీపిక చిన్న వయసులోనే మోడల్గా పలు యాడ్స్ చేసింది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకినెమ్మదిగా తనకు గుర్తింపు, అవకాశాలు పెరుగుతూ ఉండటంతో బ్యాడ్మింటన్ మానేసి మోడలింగ్పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. తర్వాత సినీ ఛాన్సులూ రావడం మొదలైంది. దీంతో ఆమె ముంబైకి షిఫ్ట్ అయింది. 2006లో ఐశ్వర్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది. ఇది తెలుగులో వచ్చిన మన్మథుడు మూవీకి రీమేక్! ఆ మరుసటి ఏడాది ఓం శాంతి ఓం చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్టయింది. ఉత్తమ నటిగా మొదటి ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.(చదవండి: క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్చరణ్)గతేడాది తల్లిగా ప్రమోషన్ఓం శాంతి ఓం చిత్రంతో దీపికా దశ తిరిగిపోయింది. బచ్నా ఏ హసీనో, లవ్ ఆజ్ కల్, హౌస్ఫుల్, కాక్టైల్, రేస్ 2, యే జవానీ హై దీవాని, చెన్నై ఎక్స్ప్రెస్, రామ్ లీలా, హ్యాపీ న్యూ ఇయర్, పీకు, బాజీరావు మస్తానీ, పద్మావత్, పఠాన్ ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. కల్కి 2898 ఏడీ మూవీతో తెలుగువారికీ పరిచయమైంది. ఈ బ్యూటీ ఒక్క సినిమాకు రూ.20 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ను 2018లో పెళ్లి చేసుకున్న ఈమె గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.అది కూడా ముఖ్యమేనంటూ..మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే అంటూ ద లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ను స్థాపించింది. దీని ద్వారా భారత్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఫౌండేషన్ అందించిన సేవలకుగానూ వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ 2018లో క్రిస్టల్ అవార్డు ప్రకటించింది. 82°E అనే బ్యూటీ బ్రాండ్ కూడా స్థాపించింది.చదవండి: సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్ ధరలు పెంపు -
మా అమ్మలా పెంచాలనుకుంటున్నాను: దీపికా పదుకోన్
‘‘మా అమ్మగారు నన్ను ఎలా పెంచారో నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలనుకుంటున్నాను’’ అంటున్నారు హీరోయిన్ దీపికా పదుకోన్. ప్రభాస్ హీరోగా నటించినపాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతరపాత్రలుపోషించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్గా ‘కల్కి 2’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.తొలి భాగం బ్లాక్బస్టర్ కావడంతో ద్వితీయ భాగంపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ‘కల్కి 2’ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్. 2025లో ఈ మూవీ సెట్స్పైకి వెళుతుందని టాక్. ‘కల్కి 2898 ఏడీ’తో టాలీవుడ్లో అడుగుపెట్టారు దీపికా పదుకొనే. ఈ మూవీలో ఆమె చేసిన సుమతిపాత్ర నిడివి తక్కువగా ఉందనే మాటలు వినిపించాయి. అయితే ‘కల్కి 2’లో ఆమెపాత్ర చాలా కీలకమని, ఆమె కూడా త్వరలోనే షూటింగ్లోపాల్గొంటారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఏర్పాటు చేసిన ఓ గెట్ టు గెదర్పార్టీలోపాల్గొన్న దీపికకి ‘కల్కి 2’ సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆమె బదులిస్తూ..‘‘నేను కూడా ‘కల్కి 2’ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పుడు నా తొలి ప్రాధాన్యం నా కుమార్తె దువా. నా కూతురు పెంపకం కోసం కేర్ టేకర్ని నియమించుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మా అమ్మగారు ఎలా అయితే పెంచారో.. నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలని, తన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే... హీరో రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్లకు 2018 నవంబరు 14న వివాహం కాగా ఈ ఏడాది సెప్టెంబరులో వారికి కుమార్తె (దువా) జన్మించిన సంగతి తెలిసిందే. -
2024లో ప్రముఖ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన సినిమా స్టార్స్
-
ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా...
ఒకరు కాదు... ఇద్దరు కాదు... ముగ్గురు కాదు... నలుగురు కాదు... ఏకంగా పదిహేను మందికి పైగా కొత్త కథానాయికలు ఈ ఏడాది తెలుగు తెరపై మెరిశారు. ‘ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా..’ అన్నట్లు గత ఏడాదితో పోల్చితే 2024లో ఎక్కువమంది తారలు పరిచయం అయ్యారు. ఇక ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన ఆ నూతన తారల గురించి తెలుసుకుందాం.ఒకే సినిమాతో దీపిక... అన్నా బెన్ బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు దీపికా పదుకోన్. గర్భవతిగా ఓ డిఫరెంట్ రోల్తో తెలుగు ఎంట్రీ ఇచ్చారామె. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇక ఇదే సినిమాతో మలయాళ నటి అన్నా బెన్ కూడా పరిచయమయ్యారు. ఈ సినిమాలో కైరాగా కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకున్నారు అన్నా బెన్. డాటర్ ఆఫ్ శ్రీదేవి దివంగత ప్రముఖ తార శ్రీదేవి తెలుగు వెండితెర, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ సినిమాతో హిందీలో నటిగా కెరీర్ను ప్రారంభించారు. అప్పట్నుంచి జాన్వీ తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు అభిలషించారు. వీరి నీరిక్షణ ‘దేవర’ సినిమాతో ఫలించింది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో తంగమ్ పాత్రలో నటించారామె. కల్యాణ్రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న విడుదలైంది. అలాగే ఇదే సినిమాతో నటి శ్రుతీ మరాఠే కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ‘దేవర’ సినిమాలో దేవర పాత్రకు జోడీగా శ్రుతి, వర పాత్రకు జోడీగా జాన్వీ కపూర్ నటించారు. భాగ్యశ్రీ బిజీ బిజీ పరభాష హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు, తొలి సినిమాకే వారి పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదు. కానీ తన తొలి తెలుగు సినిమా ‘మిస్టర్ బచ్చన్’లోని తన పాత్ర జిక్కీకి భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ చెప్పారు. హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమాలో ఓ కమర్షియల్ హీరోయిన్ రోల్ భాగ్యశ్రీకి దక్కింది. తెరపై మంచి గ్లామరస్గా కనిపించారు. భాగ్యశ్రీ నటన, అందానికి మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆమె దుల్కర్ సల్మాన్, రామ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో భాగ్యశ్రీ బిజీ. తెలుగు తెరపై మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ (2017) మానుషీ చిల్లర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, శక్తి ప్రతాప్సింగ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఓ కమాండర్ రోల్లో నటించారు మానుషి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా హీరో వరుణ్ తేజ్కు హిందీలో తొలి సినిమా కాగా, మానుషీకి తెలుగులో తొలి సినిమా. సోనీ పిక్చర్స్, సిద్ధు ముద్దా నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలైంది. ఎప్పుడో కాదు... ఇప్పుడే! గత ఏడాది తెలుగులో అనువాదమైన కన్నడ చిత్రాలు ‘సప్తసాగరాలు దాటి’ ఫ్రాంచైజీలో మంచి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్. అప్పట్నుంచి రుక్ష్మిణి వసంత్ ఫలానా తెలుగు సినిమా సైన్ చేశారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అగ్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ సడన్గా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో రుక్మిణీ వసంత్ టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాదే జరిగిపోయింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 8న విడుదలైంది. కాగా హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలోని హీరోయిన్ పాత్ర రుక్మిణీ వసంత్కు దక్కిందని తెలిసింది. ఒకేసారి మూడు సినిమాలు ఓ హీరోయిన్ కెరీర్లోని తొలి మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల్వడం అనేది చిన్న విషయం కాదు. హీరోయిన్ నయన్ సారికకు ఇది సాధ్యమైంది. అనంద్ దేవరకొండ నటించిన ‘గంగం గణేషా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాల్లో నయన్ సారిక హీరోయిన్గా నటించగా, ఈ మూడు సినిమాలు 2024లోనే విడుదలయ్యాయి. ఇందులో ‘ఆయ్, ‘క’ సినిమాలు సూపర్హిట్స్గా నిలవగా, ‘గం గం గణేషా’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాలో నటించారు కన్నడ బ్యూటీ తన్వీ రామ్. తన్వీ ఓ లీడ్ రోల్లో నటించిన తొలి తెలుగు సినిమా ‘క’. ఈ చిత్రం అక్టోబరులో విడుదలైంది. ఇటు తెలుగు... అటు తమిళం తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాదే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రీతీ ముకుందన్. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. హర్ష దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై, ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక కెవిన్ హీరోగా చేసిన ‘స్టార్’తో ఇదే ఏడాది తమిళ పరిశ్రమకు పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. అలాగే మంచు విష్ణు ‘కన్నప్ప’లోనూ ఆమె హీరోయిన్గా చేస్తున్నారు. ఇంకా నారా రోహిత్ ‘ప్రతినిధి 2’తో సిరీ లెల్లా, సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ చిత్రంతో అతిరా రాజీ, నవదీప్ ‘లవ్ మౌళి’తో పంఖురి గిద్వానీ, ‘వెన్నెల’ కిశోర్ ‘చారి 111’తో సంయుక్తా విశ్వనాథన్, సాయిరామ్ శంకర్ ‘వెయ్ దరువెయ్’తో యషా శివకుమార్, చైతన్యా రావు ‘షరతులు వర్తిస్తాయి’తో భూమి శెట్టి, అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటి అడక్కు’తో ప్రముఖ నటుడు జానీ లివర్ వారసురాలు జేమీ లివర్ (ఓ కీలక పాత్రతో..) తదితరులు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు -
దీపికా పదుకొణె లైఫ్ రీస్టార్ట్.. సింగర్కి కన్నడ నేర్పిస్తూ (ఫొటోలు)
-
సమంతను దాటేసిన శోభిత ధూళిపాళ్ల.. టాప్ ర్యాంక్లో ఎవరంటే?
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఈ ఏడాది సినీతారల ర్యాంకింగ్స్ను ప్రకటించింది. 2024లో మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్లో ఊహించని విధంగా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. సందీప్ రెడ్డి వంగా తర్వాత వరుసగా బాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలయ్యా -3 సినిమాల్లో నటించింది. దీంతో దీపికా పదుకొణె, షారూఖ్ ఖాన్ లాంటి స్టార్స్ను అధిగమించింది.ఈ లిస్ట్లో టాలీవుడ్ నుంచి ప్రభాస్, సమంత, శోభిత ధూళిపాళ్ల మాత్రమే చోటు దక్కించుకున్నారు. శోభిత టాప్-5లో నిలవగా.. సమంత 8, ప్రభాస్ పదోస్థానంలో నిలిచారు. ఈ ఏడాది కల్కి మూవీతో అలరించిన దీపికా పదుకొణె రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టాప్ ప్లేస్ దక్కడం పట్ల త్రిప్తిడ డిమ్రీ ఆనందం వ్యక్తం చేసింది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవమని.. నా అభిమానుల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.కాగా.. ఏడాది నెట్ఫ్లిక్స్ సిరీస్ ది పర్ఫెక్ట్ కపుల్లో నటించిన ఇషాన్ ఖట్టర్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాళ్ల ఐదోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మంకీ మ్యాన్ మూవీతో శోభిత అలరించారు. ఆ తర్వాత వరుసగా శార్వరి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సమంత, అలియా భట్, ప్రభాస్ నిలిచారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ స్టార్స్- ఐఎండీబీ -2024ట్రిప్తి డిమ్రీదీపికా పదుకొణెఇషాన్ ఖట్టర్షారుఖ్ ఖాన్శోభితా ధూళిపాళ్లశార్వరిఐశ్వర్యరాయ్ బచ్చన్సమంతఅలియా భట్ప్రభాస్ -
భార్యకు స్టార్ హీరో స్పెషల్ విషెస్.. ఏకంగా ఐ లవ్ యూ చెబుతూ!
-
'రణ్వీర్లో ఆ లక్షణాలే నచ్చాయి'.. దీపికా పెళ్లి వీడియో వైరల్!
బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ కపుల్స్లో దీపికా పదుకొణె- రణ్వీర్ సింగ్ ఒకరు. ఈ జంటకు ఇటీవలే కూతురు జన్మించింది. వీరి పెళ్లయిన ఆరేళ్లకు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. సెప్టెంబర్ 8న ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో దీపికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అయితే ఈ జంట ఇవాళ తమ ఆరో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2018లో ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో ఈ జంట ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకల్లో బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. కొంకణి, సింధీ సంప్రదాయాల్లో నవంబర్ 14న వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరికి పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోలో తన భర్త రణ్వీర్ సింగ్ గురించి దీపికా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోని చాలా మంది చూడని వ్యక్తికి నేను ఆకర్షితురాలినయ్యా. అతనినొక నిశ్శబ్దం. అంతేకాదు తెలివైన, సున్నితమైన వ్యక్తి. అతను ఏడిస్తే నాకు చాలా ఇష్టం. అంతకుమించి మంచి మనసున్న వ్యక్తి. అందుకే నేను ఇష్టపడ్డా' అని పెళ్లి వీడియోలో మాట్లాడింది.కాగా.. గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా (2013) సెట్లో వీరిద్దరు తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ జంట దాదాపు ఆరేళ్ల డేటింగ్ తర్వాత వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ రోజు మ్యారేజ్ డే సందర్భంగా దీపికా పదుకొణెకు స్పెషల్గా విషెస్ తెలిపారు. -
దీపికా పదుకొణె బ్యూటీ రహస్యం..! ఇలా చేస్తే జస్ట్ మూడు నెలల్లో..
బాలీవుడ్ ప్రసిద్ధ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో వేలాది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇటీవలే పండటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక గ్లామర్ పరంగా దీపికాకి సాటిలేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె మేని ఛాయ, కురులు కాంతిలీనుతూ ఉంటాయి. చూడగానే ముచ్చటగొలిపే తీరైన శరీరాకృతి చూస్తే..ఇంతలా ఎలా మెయింటెయిన్ చేస్తుందా? అనిపిస్తుంది కదూ. ఇంతకీ ఆమె బ్యూటీ రహస్యం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు దీన్ని రెగ్యులర్గా పాటిస్తే జస్ట్ మూడునెలల్లో దీపికాలాంటి మెరిసే చర్మం, జుట్టుని సొంతం చేసుకోవచ్చట. అదేంటో చూద్దామా..!.మనం తీసుకునే ఆహరమే చర్మం, జుట్టు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే తాజా పండ్లు, కూరగాయాలకు ప్రాధాన్యత ఇవ్వండని పదేపదే సూచిస్తుంటారు. అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పూజ అనే మహిళ జ్యూస్ రెసిపీతో కూడిన వీడియో పోస్ట్ చేసింది. అందులో ఇది బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు మూడు నెలల్లో మెరిసే చర్మం, మెరిసే జుట్టుని పొందడంలో సహయపడిందని పేర్కొనడంతో ఈ విషయం నెట్టింట తెగ వైరల్గా మారింది. నిజానికి ఆ జ్యూస్ రెసిపీలో ఉపయోగించిన పదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవే. పైగా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. ఆ జ్యూస్ ఏంటంటే..వేప, కరివేపాకు, బీట్రూట్, పుదీనాలతో చేసిన జ్యూస్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బయోస్కావెంజర్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉపయోగించినవన్నీ మంచి చర్మాన్ని, బలమైన జుట్టుని పొందడంలో ఉపయోగపడేవే. ప్రయోజనాలు..వేప ఆకులు: ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి వేప ఆకులు శరీర నిర్విషీకరణకు దోహదం చేస్తాయి. ఇది మొటిమలను నియంత్రించి చర్మ కాంతివంతంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. బీట్రూట్: ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ సీలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణకు, శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి ముఖ్యమైనవి. ఇది చర్మాన్ని మృదువుగానూ, ఆర్యోకరమైన రంగుని అందిస్తుంది. అలాగే జుట్టు స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులు: దీనిలో విటమిన్ ఏ, సీ కేలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్దీ చేసి మేని ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచడమే గాక హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుంది.పుదీనా ఆకులు: పుదీనా యాంటీఆక్సిడెంట్ లక్షణాల తోపాటు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వేడిని తగ్గించి శరీరాన్ని లోపలి నుంచి పునరుజ్జీవింపజేపసి మొటిమలను నివారిస్తుంది. తయారీ విధానం..కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, కరివేపాకు, వేపాకులు, కొత్తిమీర, పుదీనా వంటి పదార్థాలన్ని మిక్కీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పిప్పితో సహా తాగడం కష్టంగా ఉంటే..వడకట్టుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఉదయాన్నే తాజాగా తీసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా కనీసం మూడు నెలలు ఈ జ్యూస్ని తీసుకుంటే కాంతివంతమైన మేని ఛాయ, ఒత్తైన జుట్టు మీ సొంతం.(చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
మా ప్రార్థనలకు సమాధానం దువా
బాలీవుడ్లోని వన్నాఫ్ ది క్రేజీ కపుల్స్ రణ్వీర్ సింగ్ – దీపికా పదుకోన్ తమ కుమార్తెకు దువా పదుకోన్ సింగ్ అని నామకరణం చేశారు. ఆ పేరును ఖరారు చేసినట్లుగా వెల్లడించి, దువా కాళ్లు మాత్రమే కనిపించేలా రణ్వీర్–దీపికలు ఓ ఫొటోను షేర్ చేశారు.‘‘మా కుమార్తెకు దువా పదుకోన్ సింగ్ అనే పేరు పెట్టాం. దువా అంటే ప్రార్థన. మా ప్రార్థనలకు దువా సమాధానం. అందుకే మా కుమార్తెకు ఆ పేరు పెట్టాం’’ అని పేర్కొన్నారు రణ్వీర్–దీపిక. 2018లో రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వివాహం చేసుకున్నారు. 2023 సెప్టెంబరులో దీపిక ఓ పాపకు జన్మనిచ్చారు. -
కూతురికి క్యూట్ నేమ్ పెట్టిన దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్- దీపికా పదుకొణె తమ ముద్దుల కుమార్తె పేరును ప్రకటించారు. దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈమేరకు చిన్నారి పాదాల ఫోటోను షేర్ చేశారు. 'దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానమే తను. మా మనసు సంతోషంతో, ప్రేమతో ఉప్పొంగిపోతోంది' అని రాసుకొచ్చారు.గుడ్ న్యూస్కాగా రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె.. రామ్ లీలా, బాజీరావు మస్తానీ, 83 వంటి సినిమాల్లో కలిసి నటించారు. 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపిక తాను గర్భవతిని అని గుడ్న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 8న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇకపోతే దీపిక, రణ్వీర్.. సింగం అగైన్ సినిమాలో గెస్ట్ రోల్లో మెరవనున్నారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
భారీ యాక్షన్ సీన్స్తో 'సింగం ఎగైన్' ట్రైలర్
బాలీవుడ్లో అజయ్ దేవగణ్, దీపిక పదుకొణె నటించిన 'సింగం అగైన్' విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో ఉన్న ట్రైలర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్కు చెందిన భారీ తారాగణమే ఉంది. ఇప్పటికే విడుదలైన 'సింగం' ఫ్రాంఛైజీలోని చిత్రాలను ప్రేక్షకులు భారీగానే ఆదరించారు.కాప్ యూనివర్స్ సినిమాగా రోహిత్ శెట్టి తెరకెక్కించారు. ఇందులో రణ్వీర్ సింగ్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 4.58 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ మెప్పించేలా ఉంది. దీపావళి సందర్భంగా నవంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది -
ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న దీపికా పదుకొణె కంపెనీ
బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు చెందిన సంస్థ కేఏ ఎంటర్ప్రైజెస్ లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో రూ.17.8 కోట్లకు 1845 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను కొనుగోలు చేసినట్లు తెలిసింది.ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమాచారాన్ని సేకరించే జాప్కీ సంస్థకు లభించిన పత్రాలు ఈ కొనుగోలు వివరాలను వెల్లడించాయి. ఈ సేల్ డీల్ సెప్టెంబర్ 12న నమోదైంది. ఎనార్మ్ నాగ్పాల్ రియాల్టీ సంస్థ విక్రేత కాగా దీపికా పదుకొణె కంపెనీ కేఏ ఎంటర్ప్రైజెస్ కొనుగోలుదారుగా పత్రాలు చూపించాయి.పికా పదుకొణె కంపెనీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సాగర్ రేషమ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఎనార్మ్ నాగ్పాల్ రియాల్టీ సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో 4బీహెచ్కే, 5 బీహెచ్కే అపార్ట్మెంట్లు ఉన్నాయి. కంపెనీ కొనుగోలు చేసిన ఫ్లాట్ 15వ అంతస్తులో ఉంది. బిల్ట్-అప్ ఏరియా రేటు చదరపు అడుగుకు రూ. 96,400. ఈ డీల్కు స్టాంప్ డ్యూటీ దాదాపు రూ. 1.07 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 30,000 చెల్లించినట్లు తెలుస్తోంది.బాలివుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. కాగా ఈ దంపతులు కొనుగోలు చేసిన మరొక ప్రాపర్టీ షారూఖ్ ఖాన్ రాజభవనం మన్నత్కు సమీపంలోని బాంద్రా బ్యాండ్స్టాండ్లో సముద్రానికి ఎదురుగా ఉన్న క్వాడ్రప్లెక్స్. దీని విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ జంట 2021లో అలీబాగ్లో రూ. 22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు. -
ఇంతవరకు దీపికా పదుకొణె సినిమాలు చూడలేదు: ప్రముఖ నటుడు
నవాజుద్దీన్ సిద్ధిఖి బాలీవుడ్లో బడా నటుడు. రెండున్నర దశాబ్దాలుగా తన నటనతో హిందీ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యే సైంధవ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు. ప్రస్తుతం అతడు యాక్ట్ చేసిన 'సైయాన్ కీ బందూక్' సాంగ్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.దీపిక సినిమాలు చూడలేదుబాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అలా హీరోయిన్ దీపికా పదుకొణె గురించి అడగ్గా ఆమె గురించి నాకు పెద్దగా తెలియదు, తన సినిమాలేవీ చూడలేదు అని బదులిచ్చాడు. అలాగే సెన్సేషనల్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి కూడా తనకు తెలియదన్నాడు. టికు వెడ్స్ షెరు మూవీలో అవనీత్ కౌర్తో నవాజుద్దీన్ సిద్ధిఖిత్వరలో చూస్తాపోనీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విధ్వంసం సృష్టించిన స్త్రీ 2 సినిమా గురించి తెలుసా? అని యాంకర్ ప్రశ్నించాడు. ఇప్పటివరకు సినిమా చూడలేదని, కానీ తప్పకుండా చూస్తానని నవాజుద్దీన్ చెప్పాడు. టికు వెడ్స్ షెరు మూవీలో తనతో కలిసి నటించిన యంగ్ హీరోయిన్ అవనీత్ కౌర్ గురించి మాట్లాడుతూ.. ఆమె సొంతకాళ్లపై నిలబడే వ్యక్తి. అద్భుతమైన నటి కూడా అని ప్రశంసించాడు.ఓటీటీ..కాగా నవాజుద్దీన్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ అద్భుత్ ఆదివారం (సెప్టెంబర్ 15న) ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్లో రిలీజైంది. ఈ మూవీలో డయానా పెంటీ, శ్రేయ ధన్వంతరి, రోహన్ మెహ్రా కీలక పాత్రలు పోషించారు.చదవండి: సోనియాని ఏకిపారేసిన యష్మి.. నామినేషన్లో ఎవరున్నారంటే? -
బాజీరావు ఇల్లు
రణవీర్ సింగ్, దీపికా పడుకోన్ నటించిన బాజీరావ్ మస్తానీ సినిమా గుర్తందా? ఆ సినిమాలో బాజీరావు ఇల్లు శనివార్వాడా కళ్ల ముందు మెదులుతోందా? ఆ శనివార్ వాడా ఉన్నది పూణేకి సమీపంలోనే. ఆ సినిమాలో అనేక ప్రధానమైన సన్నివేశాల చిత్రీకరణ ఈ కోటలోనే జరిగింది. పూణేకి వెళ్లాల్సిన పని పడితే తప్పకుండా చూడండి. కోట ప్రధానద్వారం భారీ రాతి నిర్మాణం. ఏడంతస్థుల నిర్మాణంలో ఒక అంతస్థు మాత్రమే రాతి కట్టడం, ఆ తర్వాత ఇటుకలతో నిర్మించారు. కోటలోపల ప్రతి అంగుళమూ మరాఠాల విశ్వాసాలను, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంటుంది. 18వ శతాబ్దం నాటి ఈ నిర్మాణం భారత జాతీయ రాజకీయ క్లిష్టతలను కూడా ఎదుర్కొంది. 19వ శతాబ్దంలో కొంత భాగం అగ్నికి ఆహుతైపోయింది. నిర్మాణపరంగా, చరిత్ర పరంగా గొప్ప నేపథ్యం కలిగిన ఈ కోట పర్యాటకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. బాజీరావు మస్తానీ సినిమా తర్వాత పలువురి దృష్టి దీని మీదకు మళ్లింది. మహారాష్ట్ర టూరిజమ్ గార్డెన్లను మెయింటెయిన్ చేస్తోంది.కానీ పెరుగుతున్న పర్యాటకులకు తగినట్లు పార్కింగ్, రెస్టారెంట్ సౌకర్యం లేదు. ఈ కోటలో కాశీబాయ్ ప్యాలెస్, అద్దాల మహల్ పిల్లలను ఆకట్టుకుంటాయి. ఈ కోట లోపల తిరుగుతూ ఉంటే సినిమా దృశ్యాలు కళ్ల ముందు మెదులుతూ మనమూ అందులో భాగమైన భావన కలుగుతుంది. టీనేజ్ పిల్లలకు ఈ నిర్మాణాన్ని చూపించి తీరాలి. -
ఐశ్వర్యనే ఆదర్శం అంటున్న మామ్ దీపికా!
బాలీవుడ్ స్వీట్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ పండంటి పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆడబిడ్డకు తండ్రి కావాలనే రణవీర్ కోరిక నెరవేరింది. అయితే దీపికా తన ముద్దుల తనయ పెంపకం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ను ఫాలో కానుందని సమాచారం. విషయం ఏమిటంటే...సాధారణంగా చంటిపాపాయి పుట్టినపుడు ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు, ఇతర పెద్దవాళ్లు తల్లీ బిడ్డల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంటారు. చంటిబిడ్డకు నలుగు పెట్టి నీళ్లు పోయడం, పాపాయికి పాలు పట్టించడం, బాలింతకు ఎలాంటి ఆహారం పెట్టాలి లాంటి జాగ్రత్తలు, బాధ్యతలు వాళ్లవే. మకొంతమంది తమ పాపాయిని జాగ్రత్తగా చూసేందుకు ఒక ఆయమ్మను, నానీనో పెట్టుకుంటారు. చాలామంది సెలబ్రిటీలు లక్షలు ఖర్చుపెట్టి మరీ నానీలను నియమించకుంటారు. కానీ దీపికా మాత్రం ఐశ్వర్య, అలియా భట్, అనుష్క శర్మ పేరెంటింగ్ స్టైల్ను ఫాలో అవుతోందట. బాలీవుడ్ లైఫ్ కథనం ప్రకారం దీపిక నానీని ఏర్పాటు చేసుకోకూడదని నిర్ణయించింది. స్వయంగా తానే చిన్ని దీపిక బాధ్యతలను చూసుకోనుందిట.ఆలియానే ఆదర్శంమరో విషయం ఏమిటంటే పాప ఫోటోను మరికొన్ని పాటు రివీల్ చేయకుండా గోప్యంగా ఉంచాలని భావిస్తోందట. కొంచెం పెద్దయ్యాక మాత్రమే తన బేబీని ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో ఆలియాను ఫాలో కానుందట. ఐశ్వర్య తన కుమార్తె పుట్టినపుడు నానీనీ పెట్టుకోలేదట. ఇందుకు ఆమె అత్తగారు జయా బచ్చన్ కూడా 'హ్యాండ్-ఆన్-మామ్' అంటూ పొగిడింది కూడా. ఆ తరువాత అనుష్క శర్మ , అలియా భట్ ఇదే బాటలో నడిచిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో -
దీప్వీర్ బిడ్డను చూసేందుకు తరలివెళ్లిన అంబానీ
బాలీవుడ్ నటులు రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతులకు ఇటీవల (సెప్టెంబర్ 8)న ఆడబిడ్డ పుట్టింది. ఈ నేపథ్యంలో పలువురుబాలీవుడ్ పెద్దలు, ఇతర సెలబ్రిటీలకు ఈజంటకు అభినందనలు అందించారు. మరికొంతమంది స్వయంగా హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి వెళ్లి రణ్వీర్, దీపిక తొలి సంతానాన్ని ఆశీర్వదించారు. అలాగే దీపికా, రణ్వీర్ దంపతులతో సన్నిహిత సంబంధాలున్న, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భారీ భద్రత మధ్య దక్షిణ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్కు వెళ్లారు. రణ్వీర్, దీపికకు అభినందనలు తెలిపారు. వారి ముద్దుల తనయను ఆశీర్వదించారు.Mukesh Ambani made a late night visit to H.N. Reliance Hospital to meet Deepika, Ranveer and their baby.#DeepikaPadukone #RanveerSingh pic.twitter.com/4oLdspp7PN— Deepika Padukone Fanpage (@DeepikaAccess) September 10, 2024 కాగా బిలియనీర్ ముఖేష్ అంబానీ బాలీవుడ్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. అంబానీ ఇంట ఏ పండుగ, ఏ వేడుక జరిగిన బాలీవుడ్ పెద్దలంతా అక్కడ హాజరు కావాల్సిందే. అనంత్, రాధిక ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు, మొన్న అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ అతిరథ మహారథులంతా తరలి వచ్చారు. అయితే గర్భంతో ఉన్న నేపథ్యంలో దీపికా రాలేకపోయినప్పటికీ, రణ్వీర్ అనంత్ , రాధిక వివాహ వేడుకల్లో ప్రత్యేక డ్యాన్స్తో అలరించారు. -
మెడలో తాళిబొట్టు ఏది? హీరోయిన్పై ట్రోలింగ్
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తను తల్లవడానికి ముందు శుక్రవారం నాడు ముంబైలో సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించి ఆశీర్వాదాలు తీసుకుంది. భర్తతో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లిన దీపిక మెడలో తాళిబొట్టు లేకపోవడంతో సోషల్ మీడియాలో హీరోయిన్పై విమర్శలు వెల్లువెత్తాయి.. కనీసం ముఖానికి బొట్టు కూడా పెట్టుకోదా? అని తిట్టిపోస్తున్నారు.స్థోమత లేదా?ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో నెటిజన్ల రియాక్షన్స్ ఇలా ఉన్నాయి.. 'ఇంత డబ్బు సంపాదిస్తున్న నీకు మంగళసూత్రం కొనుక్కునే స్థోమత లేకపోవడం బాధాకరం. పైగా నువ్వు తనిష్క్ నగల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్!', 'కొన్నిచోట్ల మంగళసూత్రం తప్పనిసరి కాదు, ఓకే, కానీ ముఖానికి కుంకుమ అయినా పెట్టుకుంటే బాగుండేది కదా.. ముందు నువ్వు భగవద్గీతను అర్థం చేసుకో.. తర్వాత పక్కవారికి నీతులు చెప్పు' అని సెటైర్లు వేస్తున్నారు. ఆనందంగా ఉండనివ్వరా?తన అభిమానులు మాత్రం.. 'ఆమె ఎలా ఉండాలి? ఎలా కనిపించాలన్నది తనిష్టం.. ఇప్పుడామె ఒక బిడ్డకు తల్లి.. ఎందుకని ఇలాంటి కామెంట్లతో తనను బాధిస్తున్నారు?', 'దర్శనం తర్వాత బొట్టుతోనే బయటకు వచ్చిందిగా, అది కనిపించట్లేదా?' అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా దీపిక పదుకొణె చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో కనిపించింది. నెక్స్ట్ సింగం అగైన్ సినిమా చేయనుంది. ఇందులో రణ్వీర్ కూడా యాక్ట్ చేయనున్నాడు. అలాగే రణ్వీర్ డాన్ 3 మూవీ చేస్తున్నాడు. Deepika Padukone and Ranveer Singh at Siddhivinayak Temple in Mumbai today#DeepikaPadukone #RanveerSingh pic.twitter.com/uQKTJlHD1G— Deepika Padukone Fanpage (@DeepikaAccess) September 6, 2024 బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. అభినందనల వెల్లువ!
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె బిడ్డకు జన్మనిచ్చారు. శనివారం సాయంత్రం ముంబయిలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికెళ్లిన దీపికా పదుకొణెకు ఇవాళ పండంటి ఆడబిడ్డ పుట్టింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న దీపికా, రణ్వీర్సింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. కాగా.. ఇటీవలే కల్కి మూవీతో అభిమానులను అలరించింది దీపికా పదుకొణె. 2018లో పెళ్లి చేసుకున్న దీపిక-,రణ్వీర్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. దీపికా గర్భంతో ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సెప్టెంబర్లో మొదటి బిడ్డను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఇవాళ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కాగా.. మొదటిసారి రామ్ లీలా చిత్రంలో దీపికా - రణ్వీర్ జంటగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ అనంతరం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. -
ఆస్పత్రికి వెళ్లిన కల్కి భామ.. త్వరలోనే గుడ్న్యూస్!
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించిన ముద్దుగుమ్మ.. ఈ నెలలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలాఖరులోహా అభిమానులకు గుడ్న్యూస్ చెప్పనుంది. తాజాగా తన తల్లి ఉజ్జల పదుకొణెతో కలిసి ముంబయిలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే దీపికా పదుకొణె రెగ్యులర్ చెకప్లో భాగంగానే ఆస్పత్రి వెళ్లనట్లు తెలుస్తోంది. ఇటీవలే తన భర్తతో కలిసి సిద్ధివినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితమే తన భర్తతో కలిసి మెటర్నిటీ ఫోటో షూట్ పిక్స్ పంచుకున్నారు. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఫోటోలు వైరలయ్యాయి.ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా పదుకొణె సినిమాలకు విరామం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్స్లో పాల్గొనదని తెలుస్తోంది. ఇటీవలే ప్రభాస్, అమితాబ్ బచ్చన్లతో కలిసి కల్కి 2898 ఏడీ సినిమాతో అభిమానులను అలరించింది. కల్కి పార్ట్-2 లోనూ దీపికా కనిపించనుంది. అంతే కాకుండా బాలీవుడ్ మూవీ సింగం ఎగైన్లోనూ నటించనుంది. -
నిండు గర్భిణి దీపిక వినాయకుని ఆశీస్సులు, ఆ చీర రహస్యం!
గణేష్ చతుర్థి 2024 కోసం బాలీవుడ్ హీరోయిన్, త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొణె ఆమె భర్త రణవీర్ సింగ్తో కలిసి ధరించిన ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. రణవీర్ , దీపిక జంట మొత్తం కుటుంబంతో కలిసి రావడం విశేషం. పుట్టబోయే బిడ్డ కోసం గణనాథుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నిండు గర్భిణీ దీపిక బనారసీ చీరలో హుందాగా కనిపించింది. దీపికా ఫ్యాషన్ బీట్ను మిస్ చేయదు అంటూ అభిమానులు కమెంట్ చేశారు. అయితే ఈ చేనేత చీర వెనుక పెద్ద కథే ఉందట.సెలబ్రిటీ స్ట్టౖౖెలిస్ట్ అనితా ష్రాఫ్ అదాజానియా 9 గజాల ఈ చీరను దీపికాకు బహూకరించారట. ఈ బనారసి చీరను ఎత్నిక్ వేర్ బ్రాండ్ బనారసి బైఠక్ కోసం రూపొందించారు. వంద సంవత్సరాల నాటి డిజైన్ ప్రేరణతో బనారసి థ్రెడ్వర్క్తో, మ్యూజ్, ఒరిజినల్ డిజైన్, కలర్ ప్యాటర్న్ను తీసుకున్నారు. అయితే చీర మరీ బరువు కాకుండా చీర, కాస్త తేలిగ్గా ఉండేలా బూటాల మధ్య ఉన్న దాన్ని మాత్రమే తొలగించారు. దీని తయారీ కోసం ఆరు నెలలు పట్టింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) కాగా దీపికా,రణవీర్ , 2018, నవంబరు 14న వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా సెప్టెంబర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ పిల్లల బట్టలు, బూట్లు . బెలూన్లతో శుభవార్తను ఫ్యాన్స్తో పంచుకున్న సంగతి తెలిసిందే. -
ముంబై సిద్ధి వినాయకుడి ఆశీస్సులు తీసుకున్న దీపికా పదుకొణె దంపతులు
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణే, రణ్వీర్ సింగ్ దంపతులు ముంబైలో ప్రసిద్ధమైన సిద్ధి వినాయక మందిరాన్ని తాజాగా దర్శించుకున్నారు. కొద్దిరోజుల్లో తల్లిదండ్రులు కాబోతున్న ఈ దంపతులు వినాయకుడి ఆశీస్సులు తీసుకునేందుకు ఆలయానికి వచ్చారు. స్వామిని దర్శించుకున్న అనంతరం వారిద్దరూ ఎరుపు రంగు దారాన్ని తమ చేతికి కట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.2018లో దీపికా పదుకొణే, రణ్వీర్ సింగ్ వివాహంతో ఒక్కటయ్యారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భంతో ఉందని అభిమానులతో తొలిసారి అధికారికంగా పంచుకున్నారు. సెప్టెంబర్లో తమ జీవితంలో బిడ్డను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పటికే ముంబయిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలతో లగ్జరీ విల్లాను నిర్మిస్తున్నారు. బిడ్డ పుట్టాకే ఆ ఇంట్లోకి వెళ్లనున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది.దీపికా పదుకొణె సెప్టెంబర్ 28న ముంబయిలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ, మొదట ప్రసవం కోసం లండన్కు వెళ్లనున్నారని కూడా వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దక్షిణ ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే ఆమె డెలివరీకి కానున్నట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కల్కితో అభిమానులను అలరించిన దీపికా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్షణాలను ఆస్వాదిస్తోంది. దీంతో ఆమె వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఆ తర్వాతే కల్కి పార్ట్-2లో సెట్స్లో కనిపించే అవకాశముంది. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
Maternity Photoshoot: నిండు నెలల జ్ఞాపకం
ప్రీ వెడ్డింగ్ షూట్ వెడ్డింగ్ షూట్ తెలిసిందే. కాని ఇప్పుడు మెటర్నిటీ షూట్ ట్రెండ్లో ఉంది. స్త్రీలు తమ నిండు గర్భం సమయంలో భర్తతో కలిసి ఫొటో షూట్లో పాల్గొనడం ఒక ముఖ్య ఉత్సవంగా మారింది. తాజాగా దీపికా పడుకోన్ విడుదల చేసిన మెటర్నిటీ షూట్ ఫొటోలు ఈ ట్రెండ్ గురించి ప్రొత్సాహంగా మాట్లాడుతున్నాయి.తొలి చూలుతో పుట్టింటికి వచ్చిన కూతురు రేపో మాపో కాన్పు అవుతుందనగా ‘నొప్పులొస్తే నన్ను లేపమ్మా’ అందట నిద్రపోతూ. అప్పుడు తల్లి నవ్వుతూ ‘పిచ్చిపిల్లా... నొప్పులొస్తుంటే నేను నిన్ను లేపడం కాదే. నువ్వే గోల చేసి ఊరంతా లేపుతావు’ అందట. మాతృత్వపు మధురిమ స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. గర్భం దాల్చడంతో మొదలు నెలలు నిండుతూ వెళ్లడం, శరీరంలో మార్పు ఉదర భాగం బిడ్డకు గూడుగా మారుతూ ఎదుగుతూ ఉండటం, ఆ మార్పులన్నీ చూసుకోవడం, చివరకు కాన్పు జరిగి అంతవరకూ గర్భంలో ఉన్న బిడ్డ ఒడికి చేరడం... స్త్రీకి ఇదంతా అద్భుత ఘట్టం. మానసిక శాస్త్ర అధ్యయనం ప్రకారం చాలామంది స్త్రీలకు గర్భం దాల్చినప్పుడు ఆ నిండుదనాన్ని నలుగురికీ చెప్పుకోవాలని ఉంటుందట. నిండు గర్భంతో అప్పుడప్పుడు నలుగురిలోకి రావడాన్ని ఇష్టపడతారట. కాలక్రమంలో ఈ ఇష్టం ఆ క్షణాలను ఫొటోలుగా దాచుకునే వరకూ వచ్చింది.1991లో మొదలైన ట్రెండ్హాలీవుడ్ ప్రసిద్ధ నటి డెమి మూర్ 1991లో తన ఏడు నెలల గర్భాన్ని ప్రదర్శిస్తూ ఒక మేగజీన్ కవర్ పేజీ మీద కనపడినప్పుడు అది ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం అయ్యింది. ప్రఖ్యాత మహిళా ఫొటోగ్రాఫర్ ఆనీ లీబోవిజ్ ఈ ఫొటో తీసింది. చాలామంది దీనిని స్త్రీ శరీర ధర్మానికి సంబంధించిన ఒక గౌరవ ప్రకటనగా భావిస్తే మరికొందరు ఇందులో అశ్లీలత ఉందని విమర్శలు చేశారు. అయితే కాలక్రమంలో సెలబ్రిటీలు చాలా మంది మెటర్నిటీ ఫొటోస్ను జనం ముందుకు తీసుకురాసాగారు.2012 నుంచి ఇండియాలోమన దేశంలో బాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు మెటర్నిటీ షూట్ను 2010 నుంచి పరిచయం చేయసాగారు. కొంకణా సేన్, సోహా అలీ ఖాన్, నేహా ధూపియా, బిపాషా బసు, అనుష్కా శర్మ, కరీనా కపూర్, సోనమ్ కపూర్, ఇటీవల ఆలియా భట్... వీళ్ల ఫొటోషూట్లు సామాన్యజనానికి కుతూహలం రేకెత్తించాయి. మనం కూడా ఎందుకు ఇలాంటి జ్ఞాపకాలు నిక్షిప్తం చేసుకోకూడదు అనిపించేలా చేశాయి. ఇప్పుడు దీపికా పడుకోన్ తన భర్త రణ్వీర్ సింగ్తో కలిసి బ్లాక్ అండ్ వైట్లో చేసిన మెటర్నిటీ షూట్ అందరి చేత ప్రశంసలు పొందుతోంది. రెండు ఫ్యాషన్ బ్రాండ్ల నుంచి ప్రత్యేకంగా ఎంచుకున్న దుస్తులతో దీపిక ఈ షూట్ చేసింది. రణ్వీర్ సింగ్ ఈ షూట్లో సంబరంగా పాల్గొన్నాడు.మధ్యతరగతికి దూరం కాదుమెటర్నిటీ షూట్లకు సెలబ్రిటీలు లక్షలు ఖర్చు పెడుతుంటే మధ్యతరగతి స్త్రీలకు అదేమీ అందని కల కాదు. ్ర΄÷ఫెషనల్ ఫొటోగ్రాఫర్లతో మొదలు హాబీగా ఫొటోలు తీసేవారి వరకూ ఇలాంటి ఫొటోలు తీసి పెట్టేవారు ఉన్నారు. నాలుగు గంటల వ్యవధిలో మూడు రకాల డ్రస్సులతో ఫొటోలు తీసి పెట్టే ΄్యాకేజీలు కూడా ఉన్నాయి. ‘ఒకప్పుడు గర్భిణులు కెమెరా ముందుకు రావడానికి సిగ్గు పడేవారు. కాని తమ మాతృత్వ దశలను పదిలం చేసుకునేందుకు ఇప్పుడు సంతోషంగా ముందుకొస్తున్నారు’ అని ఇలాంటి ఫొటోలు తీసే ఒక ఫొటోగ్రాఫర్ అన్నారు.థీమ్ ఫొటోలుప్రెగ్నెన్సీ షూట్లో కూడా థీమ్స్ ఉన్నాయి. పల్లెటూరి జంటలుగా, నగర శ్రీమంతులుగా, గుడి ్రపాంగణంలో, తెలుగుదనంతో ఇలా చాలా రకాలున్నాయి. ఎనిమిదవ నెలలో ఈ ఫొటోషూట్ చేయించుకుంటే ఫొటోలు బాగావస్తాయంటున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం. మీ మనసులో ఈ ముచ్చట ఉంటే వెంటనే అందుకు సిద్ధం కండి. -
బేబీ బంప్ 'ఫోటోలు' షేర్ చేసిన దీపికా పదుకోనె (ఫొటోలు)
-
దీపికా పదుకొణెకు ప్రెగ్నెన్సీ.. అందుకోసం లండన్ వెళ్తున్నారా?
బాలీవుడ్ మోస్ట్ పాపులర్ జంటల్లో దీపికా పదుకొణె - రణ్వీర్ సింగ్ జంట ఒకరు. ఇప్పటికే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించిన ఈ కపుల్ త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భంతో ఉందని అభిమానులతో తొలిసారి అధికారికంగా పంచుకున్నారు. సెప్టెంబర్లో తమ జీవితంలో బిడ్డను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పటికే ముంబయిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలతో లగ్జరీ విల్లాను నిర్మిస్తున్నారు. బిడ్డ పుట్టాకే ఆ ఇంట్లోకి వెళ్లనున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది.అయితే దీపికా పదుకొణె సెప్టెంబర్ 28న ముంబయిలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట ప్రసవం కోసం లండన్కు వెళ్లనున్నారని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దక్షిణ ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే డెలివరీకి కానున్నట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కల్కితో అభిమానులను అలరించిన దీపికా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్షణాలను ఆస్వాదిస్తోంది. దీంతో ఆమె వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఆ తర్వాతే కల్కి పార్ట్-2లో సెట్స్లో కనిపించే అవకాశముంది. కాగా.. దీపికా చివరిసారిగా కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న సింగం ఎగైన్లో రణ్వీర్ సింగ్తో కలిసి నటించనుంది. -
రూ.100 కోట్లతో దీపికా పదుకొణె లగ్జరీ విల్లా.. చేరేది ఎప్పుడంటే !
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ మూవీతో తెలుగు ఆడియన్స్ను మెప్పించింది. అయితే ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా సినిమాలకు దూరంగా ఉంటోంది. రణ్వీర్ సింగ్ను పెళ్లాడిన ముద్దుగుమ్మ ఈ ఏడాదిలోనే అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. బేబీ బంప్తోనే కల్కి మూవీ ప్రమోషన్లలో పాల్గొంది. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు.రూ.100 కోట్లతో భవనం..అయితే బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఒకరైన దీపికా పదుకొణె, రణ్వీర్సింగ్ తమ కలల సౌధాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మన్నత్కు సమీపంలోనే వీరి లగ్జరీ భవనాన్ని నిర్మిస్తున్నారు. సముద్రానికి ఎదురుగా ఉన్న బాంద్రాలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బంగ్లా దాదాపు చివరిదశకు చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దీపికా పదుకొణె కొత్త ఇంటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే సకల సౌకర్యాలతో తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నారు. వచ్చే నెలలో బిడ్డ పుట్టాక బాంద్రాలో ఉన్న తమ కొత్త ఇంట్లో అడుగుపెట్టనుంది దీపికా- రణ్వీర్ జంట. గతంలో ఈ జంట 2021లో అలీబాగ్లో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు.దీపికా- రణ్వీర్ ప్రేమకథ..2013లో వీరిద్దరు కలసి నటించిన హిట్ మూవీ గోలియోన్ కి రాస్లీలా: రామ్-లీలా సెట్స్లో కలుసుకున్నారు. ఆ తర్వాతే డేటింగ్ ప్రారంభించారు. మరో బ్లాక్బస్టర్ చిత్రం బాజీరావ్ మస్తానీలో కూడా కలిసి నటించారు. 2018లో ఇటలీలో ఒక సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా.. మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్పై మెరవనుంది. సింగం ఎగైన్లో వీరిద్దరు కనిపించనున్నారు. ఆ తర్వాత రణ్వీర్సింగ్ డాన్ 3లో కూడా నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Deepika Padukone: పూల కుర్తాలో మెస్మరైజ్ చేస్తున్న దీపికా..
బాలీవుడ్ నటి, కాబోయే తల్లి దీపికా పదుకొణె తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల కల్కి మూవీ ప్రమోషన్లో హైహిల్స్తో వచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచింది. కాబోయే తల్లి దీపికా తన బేబి బంప్తోనే కల్కి మూవీలో నటించటం విశేషం. ఇటీవల తన భర్త రణ్వీర్ తో పాటూ ముంబాయి డిన్నర్ డేట్కు వెళ్లింది. అక్కడ ఓ రెస్టారెంట్లో దీపికా తన బాడీగార్డుతో.. కెమెరాకు చిక్కింది. కాబోయే తల్లి అయిన దీపికా వైట్ ప్యాంట్, సింపుల్ మేకప్ లుక్ తో సబ్యసాచి పూల కుర్తా ధరించింది. ఆమె ప్రెగ్నెన్సీ డ్రెస్ కాబోయే తల్లులకు సౌకర్యాంగా ఉండే డ్రెస్ ఇది. ఈ బ్యూటీ తన ప్రెగ్నెన్సీ లుక్ కోసం చక్కటి పూల కుర్తాలో మెరిసింది. స్వీకరించింది. ఈ పూల కుర్తీని సవ్యసాచి డిజైన్ చేశారు. అక్కడ పలువురి అభిమానులతో మాట్లాడటమే గాక ఫోటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసే అందంతో అలరించింది. ఇక్కడ దీపికా తన రేంజ్కి తగ్గట్టు లూయిస్ విట్టన్ హ్యాండ్ బ్యాగ్ను ధరించింది. చెప్పాలంటే ఈ పూలకుర్తీలో బేబీ బంప్ని దాచేస్తూ సరికొత్త రూపంతో అందంగా కనిపించింది. కాగా, ఆమె ధరించిన బ్రాండెడ్ బ్యాగ్ ధర ఏకంగా 3.25 లక్షలు పలుకుతుందట. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: స్పేస్లో ఎక్కువ కాలం ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..? బెస్ట్ స్పేస్ ఫుడ్స్ ఇవే..!) -
అవార్డుతో సీతారామం బ్యూటీ.. సెల్ఫ్ కేర్ అంటోన్న కల్కి భామ!
ఫిలింఫేర్ అవార్డుతో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. సెల్ఫ్ కేర్ మంత్ అంటోన్న కల్కి భామ దీపికా పదుకొణె.. పాత రోజులను గుర్తు చేస్తున్న రానా భార్య మిహికా బజాజ్.. రెడ్ శారీలో ఉప్పెన భామ కృతి శెట్టి పోజులు.. తొమ్మిదేళ్ల కల అంటోన్న భూమి పెడ్నేకర్... View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
Deepika Padukone: డైట్ అంటే కడుపు మాడ్చుకోవడం కాదు
‘‘డైట్’ అనే పదం చుట్టూ చాలా అ΄ోహలు ఉన్నాయని నాకనిపిస్తోంది. డైట్ అంటే కడుపు మాడ్చుకోవడం, తక్కువ తినడం, కష్టంగా నచ్చనవి తినడం అని మనందరం అనుకుంటాం. కానీ డైట్ అంటే మనం తీసుకునే ఆహారం, తీసుకునే ΄ానీయాలు. నిజానికి డైట్ అనే పదం గ్రీకు పదం ‘డైటా’ నుంచి వచ్చింది. డైటా అంటే జీవన విధానం అని అర్థం’’ అన్నారు దీపికా పదుకోన్. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికా ఫలానా డైట్ని ఫాలో అవుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ప్రచారంలో ఉన్నవి నమ్మవద్దంటూ దీపికా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘నేను బాగా తింటాను. కాబట్టి సరిగ్గా తిననని వస్తున్న వార్తలను నమ్మొద్దు. డైట్ అంటే క్రమం తప్పకుండా తినడం, మన శరీరాన్ని అర్థం చేసుకోవడం.. ఫాడ్ డైట్ (త్వరగా బరువు తగ్గే ఆహార ప్రణాళిక)ని ఫాలో కాను. శుభ్రంగా తినడానికే ఇష్టపడతాను. నా డైట్లో ఇవి ఉన్నాయని ఆశ్చర్య΄ోతున్నారా?’’ అంటూ కేక్స్, సమోసా వంటి వాటి ఫొటోలను కూడా షేర్ చేశారు దీపికా పదుకోన్. ఇక సెప్టెంబరులో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఆ మధ్య దీపికా, ఆమె భర్త–హీరో రణ్వీర్ సింగ్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
డైట్ అంటే ఏంటి? నిండు గర్భిణి దీపికా పదుకొణే డైట్ సీక్రెట్స్
తన తొలి బిడ్డకు త్వరలోనే జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తన డైట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను బాగా తింటానని, ఫ్యాడ్ డైట్పై తనకస్సలు నమ్మకం లేదంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీపికా పదుకొణె తన ప్రెగ్నెన్సీ డైట్లో భాగమైన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఫ్యాడ్ డైట్ని ఫాలో అయ్యే కంటే బాగా తినడానికేతాను ఇష్టపడతానని వెల్లడించింది. (ఫాడ్ డైట్: తొందరగా,సులువుగా, అనూహ్యంగా బరువు తగ్గే ఆహార ప్రణాళిక).నిండు గర్భిణి దీపికా పదుకొణె మాతృత్వ అనుభవం కోసం రోజులు లెక్కిస్తోంది. తన ప్రెగ్నెన్సీ జర్నీ, అనుభవాలు, ఫిట్నెస్ సీక్రెట్స్పై తన ఫ్యాన్స్తో అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన డైట్కు సంబంధించి పిక్స్ షేర్ చేసింది. తన బాలెన్స్డ్ డైట్ వెనుక రహస్యాన్ని దీపిక బుధవారం వెల్లడించింది. రుచికరమైన ఆహార పదార్థాలతో కూడిన మూడు చిత్రాలను షేర్ చేసింది. దీంతో పాటు ఒక సుదీర్ఘ నోట్ కూడా పెట్టింది. ఇందులో డైట్ అంటే ఏంటో ఇలా వివరించింది."నా ఫీడ్లో దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? నేను బాగా తింటాను! నాకు తెలిసిన ఎవరినైనా అడగండి. బాగా తింటా. కాబట్టి మీరు విన్న లేదా చదివిన దాన్ని నమ్మవద్దు. 'డైట్' అనే పదం చుట్టూ చాలా అపార్థాలున్నట్లు అనిపిస్తుంది, 'డైట్' అంటే ఆకలితో అలమటించడం, తక్కువ తినడం లేదా మనకు నచ్చని వస్తువులన్నింటినీ తినడం అని అనుకుంటాం. బాలెన్స్, క్రమం తప్పకుండా తింటూ, మన బాడీ మాట వినడమే ఇదే అసలైన ట్రిక్.’’ View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) డైట్ నిజమైన అర్థం ఒక వ్యక్తి పూర్తిగా తినే ఆహారం, లేదా పానీయం అని దీపిక పేర్కొంది.. 'డైట్' అనే పదం గ్రీకు పదం 'డైటా' నుండి వచ్చింది. అంటే జీవిన విధానం అని అర్థంని, తానెపుడు విపరీతమైన ఆహారపు అలవాట్లకు బదులు సమతుల్యమైన ఆహారాన్ని పాటిస్తానని వెల్లడించింది.కాగా రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిలో దీపికా తన బేబీ బంప్తో అందంగా కనిపించింది. సందర్భానికి తగ్గట్టుగా చక్కటి అనార్కలీ, దుప్పట్టాతో స్టయిలిష్గా కనిపించింది. సెప్టెంబర్లో బిడ్డకు జన్మ నివ్వబోతున్నా మని దీపికా, ఆమె భర్త నటుడు రణవీర్ సింగ్ గతంలో ప్రకటించారు. -
ప్రెగ్నెన్సీ గ్లో : పుట్టబోయే బిడ్డకోసం రోజులు లెక్కపెడుతున్న దీపికా (ఫొటోలు)
-
దీపికా పదుకొణె మెడలో సిక్కు మహారాజుల నాటి నెక్లెస్..!
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రెగ్నెంట్తో ఉండి కూడా వరుస సినిమాల ప్రమోషన్లు, షూటింగ్లతో బిజీగా ఉండే నటి. బిలియన్ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ లగ్జరీయస్ వివాహానికి హజరైన నటి దీపికా పదుకొణె డిఫెరెంట్ లుక్తో మెస్మరైజ్ చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా రాజుల కాలం నాటి దుస్తులు, నగలతో దేవకన్యలా మెరిసింది. దీపీకా ఈ వివాహ వేడుకలో 20వ శతాబ్దం నాటి టోరానీ సింధీ చోగా సల్వార్ ధరించింది. ముఖ్యంగా ఆమె కంఠానికి ధరించిన చోకర్ నెక్లెస్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దీపికా ధరించిన నగ సిక్కు సామ్రాజ్యం మొదటి పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ నాటి కాలంలోని నగ. చెప్పాలంటే ఆయన దీన్ని చేతి పట్టి లేదా మోచేతి ఆభరణంగా ధరించేవారు. సిక్కు కళాత్మకతకు ఈ నగ అద్భుతమైన ఉదాహరణ. ఆ నగలో ఆకట్టుకునే రీతీలో జెమ్సెట్తో ఉంది. మధ్యలో ఓవల్ షేప్లో 150 క్యారెట్ల బరువుతో ఒక జెమ్. దాని చుట్టూ రెండు వరుసల నీలమణి రాళ్లు ఉంటాయి.ఆ నగ బాజుబ్యాండ్ సిక్కు హస్తకళకు నిదర్శనం. మహారాజు రంజిత్ సింగ్కు ఆభరణాలు, విలువైన రాళ్ల అన్న మక్కువ. ఆయన ఖజానా(లాహోర్ తోషఖానా) కోహ్ ఇ నూర్ వజ్రాలకు నిలయంగా ఉంది. అయితే ఇప్పుడది బ్రిటిష్ కిరీటం అధీనంలో ఉంది. మహారాజా రంజిత్ సింగ్ ఆభరణాల సేకరణల ఎలా ఉండేదనేందుకు ఈ నగను రూపొందించిన విధానమే నిదర్శనం. కాగా, ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత అతని లాహోర్ తోషఖానా బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వచ్చింది. 19వ శతాబ్దంలో, రంజిత్ సింగ్, అతని వారసుడు షేర్ సింగ్ మరణానంతరం, అతని చిన్న కుమారుడు పదేళ్ల వయసులో దులీప్ సింగ్ వారసుడిగా ఎంపికయ్యాడు.పంజాబ్ విలీనమైన తర్వాత, అతని తల్లి మహారాణి జిందన్ కౌర్ అరెస్టయ్యి, నేపాల్కు బహిష్కరించబడింది. దీంతో అతను పంజాబ్పై ఈస్ట్ ఇండియా కంపెనీకి సంతకం చేయవలసి వచ్చింది. కోహ్-ఇ-నూర్ వజ్రాలే కాకుండా, సిక్కు రాజ్యం నుంచి కొల్లగొట్టబడిన ఇతర ఆభరణాలలో తైమూర్ రూబీ అని పిలువబడే 224 పెద్ద ముత్యాలతో కూడిన మరొక ప్రసిద్ధ హారము కూడా ఉంది. 1820 నుంచి 1830 మధ్య కాలంలో స్వర్ణకారుడు హఫీజ్ ముహమ్మద్ ముల్తానీ చేసిన మహారాజా రంజిత్ సింగ్ సింహాసనం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది.(చదవండి: అన్నం లేదా రోటీ: బరువు తగ్గేందుకు ఏది మంచిది? నిపుణులు ఏమంటున్నారంటే..) -
ఆ యోగాసనంలో కాబోయే తల్లి దీపికా పదుకొణె..ఆ టైంలో మంచిదేనా..!
బాలీవుడ్ నటి, కాబోయే తల్లి దీపికా పదుకొణె యోగాసనాలు వేస్తూ కనిపించింది. దీపికా బేబీ బంప్తో విపరీత కరణి యోగాసనం వేసింది. ఎప్పటికప్పుడూ తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్గా ఉంటుంది. తాను ఫిట్గా ఉండటానికే ఇలా యోగాసనాలు వేస్తున్నట్లు చెబుతుండే దీపికా ఈ టైంలో కూడా యోగాసనాలు వేస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. మరీ ఇలా ఇలా ఆసనాలు వేయడం కాబోయే తల్లులకు మంచిదేనా? ఆ టైంలో వేయడం ఎంత వరకు మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!38 ఏళ్ల దీపికా పదుకొణే వేసిన విపరీత కరణి యోగాసనం కాబోయే తల్లులకు ఎంతో ఉపయోగకరం. ఇలా ఐదు నిమిషాల పాటు వేస్తే ఎంతో మంచిది. సంస్కృతంలో దీన్ని తలకిందులుగా వేసే యోగాసనంగా చెప్పుకుంటారు. ఈ యోగా భంగిమలో మీ కాళ్ళను పైకెత్తి గోడకు ఆనించి పడుకోవడం జరుగుతుంది. ఈ పునరుజ్జీవన యోగసనం నాడీ వ్యవస్థను శాంతపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.దీపికా పడుకుణే లాంటి కాబోయే తల్లులు ఈ యోగాను వేయాలనుకుంటే.. కుషన్ లేదా దిండు వంటివి వేసుకుని చేయడం మంచిది. ఈ వ్యాయామం కండరాలు, కీళ్ళలో నొప్పిని తగ్గిస్తుంది. గర్భం ధరించిన వారిలో కండరాలు, కీళ్ల నొప్పులు కనిపిస్తూ ఉంటాయి. వీపు కింద తలగడ పెట్టుకోవడంవల్ల తక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ వ్యాయామం కాబోయే తల్లులకు సురక్షితంగా ఉంటుంది. ఈ వ్యాయామం కోసం కాళ్ళను ఎత్తినప్పుడు, ఇది వారి చీలమండలో వాపును తగ్గిస్తుంది. అయితే గ్లాకోమా, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్న వారు ఈ యోగా భంగిమను ప్రయత్నించకూడదు.ప్రయోజనాలుఈ ఆసనం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గర్భం ధరించిన వారే కాదు, సాధారణ వ్యక్తులు కూడా ఈ యోగా చేయడం ఎంతో మంచిది.మేల్కొన్న వెంటనేవిపరీత కరణి వ్యాయామంతో రోజును ప్రారంభిస్తే ఎంతో మంచిది. ఇది శోషరస, గ్లింఫాటిక్ వ్యవస్థలను ఉత్తేజపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది ఎగువ అవయవాల వైపు ఆక్సిజన్ రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది శరీరంలో డిటాక్సిఫికేషన్కు సహాయపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను, విషాలను బయటకు పంపిస్తుంది. ఈ వ్యాయామం తుంటి, తొడ కండరాలను సాగదీయడానికి సహాయపడుతుంది.ఈ యోగాను నిద్రపోయే ముందు చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ వ్యాయామం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఎందుకంటే ఇది శరీరాన్ని శాంతపరుస్తుంది. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. విపరీత కరణి యోగాసనం చేయడం వల్ల కాళ్లలోని బిగువును తగ్గించడానికి సహాయపడుతుంది.దీన్ని లెగ్-అప్-ది-వాల్ భంగిమ అని కూడా అంటారు. ఇది ఒక ఆల్ రౌండర్ యోగాసనం. ఇది మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని శాంతపరిచే యోగాసనం. మెరుగైన నిద్ర నాణ్యత, మంచి ఉదర ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంచడం, ఒత్తిడి తగ్గించడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) (చదవండి: బేబీ క్యారెట్స్ సీక్రెట్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!) -
కల్కి సినిమాలో ఓల్డ్ టెంపుల్.. ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా? (ఫొటోలు)
-
ప్రభాస్కు అవసరమే లేదు, అయినా..: కల్కి నటుడు
కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉన్న ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణెల విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్లో జరిగిన విశేషాలను నటుడు హుంహు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.ఆయనతో సీన్స్ లేవుహుంహు మాట్లాడుతూ.. 'అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో నాకు ఎటువంటి సన్నివేశాలు లేవు. సీక్వెల్లో అయినా ఆయనతో కలిసి నటిస్తే బాగుండని భావిస్తున్నాను. ప్రభాస్, దీపికతో కొన్ని సన్నివేశాల్లో నటించాను. అసలే నాకు సినిమాలు కొత్త, అందులోనూ ప్రభాస్కు అభిమానిని.సొంత అన్నలా దగ్గరుండి..తనెప్పుడూ నన్ను డార్లింగ్ అని పిలిచేవాడు. ఒక యాక్షన్ సీన్లో నన్ను పక్కకు తీసుకెళ్లి టిప్స్ చెప్పాడు. ఎక్కడ? ఎలా? యాక్ట్ చేయాలో నేర్పించాడు. నిజానికి నాకు దగ్గరుండి చెప్పాల్సిన అవసరం ప్రభాస్కు లేనే లేదు. అయినా సొంత అన్నలా నాకు సలహాలు ఇచ్చాడు.విశాల హృదయం..దీపికతో నటించాల్సి వచ్చినప్పుడు కొంత భయపడ్డాను. అది గమనించిన ఆమె జోక్ చెప్పి నవ్వించింది. వీళ్లు పెద్ద సెలబ్రిటీలు మాత్రమే కాదు పెద్ద మనసున్నవాళ్లు కూడా! వీరితో కలిసి పని చేయడం నా అదృష్టం' అని చెప్పుకొచ్చాడు. అలాగే కల్కి షూటింగ్లో తాను గాయపడినట్లు తెలిపాడు.చదవండి: Kalki 2898 AD: అర్జునుడిగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే? -
అమితాబ్ అలా చేస్తారని ఊహించలేదు: నిర్మాత సి. అశ్వినీదత్
‘‘అమితాబ్ బచ్చన్గారు లెజెండ్. మేము సెట్స్లో కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. కానీ ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకలో నా కాళ్లకి అమితాబ్గారు నమస్కరించడంతో నాకు తల కొట్టేసినంత పని అయింది. ఆయన అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సి. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాగ్ అశ్విన్ ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది. ఈ శతాబ్దంలో ఒక మంచి దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు (నవ్వుతూ). ‘కల్కి’ విషయంలో టెన్షన్ పడలేదు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే తీశాం... అది నెరవేరింది. ప్రభాస్ సహకారం లేకపోతే అసలు ఈ సినిమా బయటికి రాదు. రాజమౌళి–ప్రభాస్ల ఎపిసోడ్ ఫన్నీగా పెట్టిందే. అలాగే బ్రహ్మానందం, రామ్గోపాల్ వర్మ పాత్రలని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.ఈ కథ అనుకున్నప్పుడే రెండో భాగం ఆలోచన వచ్చింది. కమల్గారు ఎంటరైన తర్వాత పార్ట్ 2 డిసైడ్ అయిపోయాం. ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2 వచ్చే ఏడాది జూన్లోనే విడుదల కావొచ్చు. 50 ఏళ్ల వైజయంతీ మూవీస్ ప్రయాణం అద్భుతం. ప్రస్తుతం శ్రీకాంత్గారి అబ్బాయి రోషన్తో ఓ సినిమా, దుల్కర్ సల్మాన్తో ఒక చిత్రం నిర్మిస్తున్నాం’’ అన్నారు. -
ప్రభాస్ ‘కల్కి’ మూవీ HD స్టిల్స్ (ఫొటోలు)
-
Kalki 2898 AD: అశ్వత్థామగా బిగ్బీ, అర్జునుడిగా దేవరకొండ.. ఇంకా.. (ఫోటోలు)
-
ప్రమోషన్స్ లేవు.. సూపర్ హిట్ సాంగ్స్ లేవు.. అయినా క్రేజ్ పీక్స్..
-
‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ
టైటిల్: కల్కి 2898 ఏడీనటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పఠాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నాబెన్ తదితరులునిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్నిర్మాత: అశ్వనీదత్దర్శకత్వం: నాగ్ అశ్విన్సంగీతం: సంతోష్ నారాయణన్సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావువిడుదల తేది: జూన్ 27, 2024ఈ ఏడాది యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన సినిమాల్లో కల్కి ‘2898 ఏడీ’ ఒకటి. ప్రభాస్ హీరోగా నటించడం.. కమల్హాసన్, అమితాబ్బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాపై ఎంతో హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘కల్కి 2898 ఏడీ’ కథేంటంటే..కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. మొదటి నగరంగా చెపుకునే కాశీలో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ప్రకృతి మొత్తం నాశనం అవుతుండటంతో సుప్రీం యాష్కిన్(కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్లో ఉంటాయి. ఆ ప్రపంచంలోకి వెళ్లాలంటే కనీసం ఒక మిలియన్ యూనిట్స్(డబ్బులు) ఉండాలి. ఆ యూనిట్స్ కోసం కాశీ ప్రజలు చాలా కష్టపడుతుంటారు. అందులో ఫైటర్ భైరవ(ప్రభాస్) కూడా ఒకడు. ఎప్పటికైనా కాంప్లెక్స్లోకి వెళ్లి సుఖపడాలనేది అతడి కోరిక. యూనిట్స్ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడుతుంటాడు. అతనికి బుజ్జి((ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్)తోడుగా ఉంటుంది. మరోవైపు యాష్కిన్ చేస్తున్న అన్యాయాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. సుప్రీం యాష్కిన్ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులను అందరికి అందేలా చేయాలనేది వారి లక్ష్యం. దాని కోసం ‘శంబాల’ అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచే పోరాటం చేస్తుంటారు. ‘కాంప్లెక్స్’లో ‘ప్రాజెక్ట్ కే’పేరుతో సుప్రీం యాష్కిన్ ఓ ప్రయోగం చేస్తుంటాడు. గర్భంతో ఉన్న సమ్-80 అలియాస్ సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని శంబాల వెళ్తుంది.. సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్లోకి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు.వీరిద్దరి బారి నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) ప్రయత్నిస్తాడు. అసలు అశ్వత్థామ ఎవరు? వేల సంవత్సరాలు అయినా అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? సుమతిని ఎందుకు కాపాడుతున్నాడు? ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు? సుప్రీం యాష్కి చేపట్టిన ‘ప్రాజెక్ట్ కే’ ప్రయోగం ఏంటి? కాంప్లెక్స్లోకి వెళ్లాలనుకున్న భైరవ కోరిక నెరవేరిందా? అసలు భైరవ నేపథ్యం ఏంటి? అశ్వత్థామతో పోరాడే శక్తి అతనికి ఎలా వచ్చింది? భైరవ, అశ్వత్థామ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..వెండితెరపై ప్రయోగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొద్ది మంది దర్శకులు మాత్రమే వైవిధ్యభరిత కథలను తెరకెక్కిస్తుంటారు. అది విజయం సాధించిందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ‘కల్కి 2898’తో అలాంటి ప్రయోగమే చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇప్పటివరకు చూడనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా అద్భుతమనే చెప్పాలి. కాంప్లెక్స్, శంబాల ప్రపంచాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. అయితే కథ పరంగా చూస్తే మాత్రం ఇందులో పెద్దగా ఏమీ ఉండడు. అసలు కథంతా పార్ట్ 2లో ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. వాస్తవానికి నాగ్ అశ్విన్ రాసుకున్న కథ చాలా పెద్దది. అనేక పాత్రలు ఉంటాయి. ఒక్క పార్ట్లో ఇది పూర్తి చేయడం సాధ్యం కాని పని. అది నాగికి కూడా తెలుసు. అందుకే పార్ట్ 1ని ఎక్కువగా పాత్రల పరిచయాలకే ఉపయోగించాడు. కురుక్షేత్ర సంగ్రామంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఆరువేల సంవత్సరాల తర్వాత కాలంలోకి వెళ్తుంది. కాశీ, కాంప్లెక్స్, శంబాల ప్రపంచాల పరిచయం తర్వాత ప్రేక్షకుడు కథలో లీనం అవుతాడు. భారీ యాక్షన్ సీన్తో ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. బుజ్జి, భైరవల కామెడీ సంభాషణలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్లో ఎక్కువగా పాత్రల పరిచయమే జరుగుతుంది. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఇంటెర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో కథనంలో వేగం పుంజుకుంటుంది. ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే యాక్షన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మధ్య మధ్యలో అమితాబ్ పాత్రతో మహాభారతం కథను చెప్పించడం.. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించడంతో ప్రేక్షకుడికి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు పార్ట్ 2పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. దీంతో ప్రభాస్ కూడా తెరపై తక్కువ సమయమే కనిపిస్తాడు. భైరవగా ఆయన చేసే యాక్షన్, కామెడీ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ మరో పాత్ర కూడా పోషించాడు అదేంటనేది వెండితెరపైనే చూడాలి. ప్రభాస్ తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అమితాబ్ది. అశ్వత్థామ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ వయసులోనూ యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ప్రభాస్-అమితాబ్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్. సుప్రీం యాష్కిన్గా కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్లో కనిపించాడు. అయితే ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే. పార్ట్ 2లో ఆయన రోల్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీ సుమతిగా దీపికా పదుకొణె తనదైన నటనతో ఆకట్టుకుంది. శంబాల ప్రంచానికి చెందిన రెబల్ ఖైరాగా అన్నాబెన్, రూమిగా రాజేంద్ర ప్రసాద్, వీరణ్గా పశుపతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్వర్క్ చాలా బాగుంది. నాగ్ అశ్విన్ ఊహా ప్రపంచానికి టెక్నికల్ టీమ్ ప్రాణం పోసింది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు అయితే తెరపై మరీ దారుణంగా అనిపించాయి. నేపథ్య సంగీతం కూడా యావరేజ్గానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘కల్కి 2898 ఏడీ’ టాక్ ఎలా ఉందంటే..?
ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి 2898 మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి సినిమాటిక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటించడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లు, రెండు ట్రైలర్లు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల గురువారం తెల్లవారుజాము నుంచే స్పెషల్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కల్కి’ కథేంటి? నాగ్ అశ్విన్ కలల ప్రాజెక్టు ఎలా ఉంది? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.. అవేంటో చదివేయండి. అయితే ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. భైరవగా ప్రభాస్ను అద్భుతంగా చూపించడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడంటూ నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా కల్కి కథ చెప్పిన విధానం బాగుందని తెలుపుతున్నారు. అయితే, 20 నిమిషాల తర్వాత నుంచి అసలు కథ ప్రారంభం అవుతుందని వారు చెబుతున్నారు. ఇందులో యానిమేషన్ విజువల్స్ కూడా భారీగానే మెప్పించాయి. ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చెప్పినట్లుగా బుజ్జి పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉన్నట్లు వారు తెలుపుతున్నారు. Last 30mins🥵🔥 Mahabharatam🙌 #KALKI #Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DeepikaPadukone #KamalHaasan #kalki2898ad #BlockBusterKALKI pic.twitter.com/blithytX2g— Crick...Shyam!! (@ShyamCrick) June 27, 2024 అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలెట్గా నిలుస్తాయంటున్నారు. కమల్ హాసన్ గెటప్ మాత్రం పీక్స్లో ఉంటుందని ఆయన పాత్రకు మంచి మార్కులే పడుతాయని అంటున్నారను. ఫైనల్గా కల్కితో ప్రభాస్ హాలీవుడ్లో కూడా తన మార్క్ చూపించబోతున్నట్లు ప్రేక్షకులు చెబుతున్నారు.మరికొందరు మాత్రం కల్కి 2898 ఏడీ సినిమా యావరేజ్గా ఉందంటూ తెలుపుతున్నారు. కథ చెప్పడంలో కాస్త నెమ్మది ఉందని తెలుపుతున్నారు. కానీ, ఎక్కువ ప్రాంతాల్లో సినిమాకు అదిరిపోయే టాక్ వస్తోంది. అక్కడక్కడా కాస్త బోరింగ్ ఫీల్ అవుతారని అంటున్నారు. సినిమా యావరేజ్ అని కూడా కొందరు నెగెటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్, విజువల్స్ అన్నీ ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని కూడా వారు చెబుతున్నారు. ఇందులో ఊహించని కెమియో రోల్స్ ఉన్నాయని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఇండియన్ సినిమా ఉందంటూ కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.It's Time For #Kalki2898AD, claimed to be Biggest Indian Film, with 600+ Cr Budget and PAN India Mass Appeal 💡All said an done, I wanted to see what #NagAshwin invisioned & created.I belive, this could be the game changer and taking that feeling in to the theater.Without… pic.twitter.com/a8KvWrJQXU— Ashwani kumar (@BorntobeAshwani) June 27, 2024 #KALKI2898AD gets unanimous positive talk in tamil#Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DeepikaPadukone #KamalHaasan pic.twitter.com/3U4un4OPrF— Tolly hub (@tolly_hub) June 27, 2024#Kalki2898AD - 3.75 ⭐ /5 ⭐ • #Prabhas 's Performance & Comedy Timings 🔥• Storyline & #NagAshwin 's Direction 🏆• SANA 's Background Scores 💣💥 Literally ge is The Second Hero.• Pre - Interval 🧨• VFX Standard & Visuals .. Literally a Never Seen Stuffs - in… pic.twitter.com/ghh0WFA8Ph— Let's X OTT GLOBAL (@LetsXOtt) June 26, 2024Epude #Kalki movie premier chusa... Just Superb.... anthe Never before visuals...Prabhas, Amitabh and Kamal Haasan rocked the show.Nag ashwin Rating: 4.5/5 #Kalki28989AD#kalki #Kalki2898ADonJune27 #kalki2898 #Prabhas #DeepikaPadukone #Amitabh #KalkiUK pic.twitter.com/ZI8LgSbrBS— OTTRelease (@ott_release) June 27, 2024 #Kalki2898AD 2nd Half Arachakam 🔥🌋Block Buster Bomma 🔥🔥🤩@nagashwin7 - The Pride Of Indian Cinema #Prabhas Fans Collars Yegareyochu 🤘Waiting For Kalki Cinematic Universe pic.twitter.com/yAyou7Jl2K— 𝘿𝙖𝙧𝙡𝙞𝙣𝙜𝙨...🖤 (@ajayrock1211) June 26, 2024#KALKI2898AD #kalki2898ADreviewGood: Grand scale, good story, Ashwathama, Climax.Bad: BGM, loose screenplay, many unwanted scenes, Prabhas characterization in first half was silly, wasted opportunities to connect emotionally. Overall ok ok.— goutham (@Goutham_se) June 26, 2024Finished watching #Kalki2898AD Kalki Cinematic Universe 🔥🔥🔥Review :- No words 🤐, Especially Last 30mins🔥🔥🔥, Goosebumps guarantee, KCPD Worth Watching. Nagi Mawa - unexpected from you.Prabhas character - Surya puthraa *****#Kalki2898AD #PRABHAS @VyjayanthiFilms pic.twitter.com/i2NoumQPxP— Jagadish (@kvj2208) June 26, 2024Deepika Padukone as Danerys Targeryan for Interval, is the best non heroic goosebumps moment for me@Music_Santhosh BGM is fucking lit 🔥🔥#kalki2898ad #Prabhas pic.twitter.com/yTPffkrLO6— sampathkumar (@Imsampathkumar) June 26, 2024Indian film directors need super mega stars like #prabhas to pull off visual grandeurs like #kalki2898ad Film may have few flaws but what @nagashwin7 envisioned is second to none and is filled with huge brilliance.DO NOT MISS this movie! Visual extravaganza!@HailPrabhas007— Nikhil (Srikrishna) Challa (@Srikrishna6488) June 26, 2024Finished watching #kalki2898ad @nagashwin7 took his time and research to get this epic on screen Visuals are Out the world ,Screen play was on point ,Comedy personally did not work for me at some point Mahabharatham shots are crisp 🤌🏻Last 20 mins 🔥🔥🔥🔥 Casting is 👍 pic.twitter.com/h7QnfR7cYJ— TIG🐯R (@GopiSai251) June 26, 2024#Kalki2898AD A breath of fresh air to Indian cinema. Theme : Dystopian future entangled in mythology. Rating : ⭐️⭐️⭐️Long read🧵— 🪬Absurdism 🪢 (@absurdtips) June 26, 2024World’s first premier show completed in Finland @PrabhasRaju Mind blowing visualsVery good first half 👌👌Awestruck second half 🔥🔥🔥 Fight between @SrBachchan and @PrabhasRaju is next level. Repeat watches for sure Thanks @nagashwin7 #Kalki2898AD #kalki2898 #Prabhas pic.twitter.com/VrL9PNqb49— Jyothi Swaroop (@subbuswaroop) June 26, 2024Em Tesav Bhayya Next Part Kosam Em Hype Ekkinchinav Pakka Indian Star Wars Type Film This Is Repeating Like Baahubali 1 and The Next One Will Be Like Baahubali 2 Kalki Cinematic Universe #kalki2898 #Kalki2898AD #KALKI2898ADBookings #ProjectK#Prabhas#RebelStarOochaKotha— RTC X ROADS DEVARA 🌊⚓ (@MGRajKumar9999) June 26, 2024#Kalki2898ADFirst 30 Min#Kalki Review #KALKI2898ADO >>> #Salaar 💥🔥Nagashwin 💥Super hero entry #Prabhas performance 💥💥💥 comedy timing 🔥Songs 👍💥Bgm 🔥🔥🥁overall ga movie lover ki biggest festival 🤙My rating : 4.5 / 5 #Kalki#KALKI2898ADO #Kalki28989AD pic.twitter.com/lXu69nullD— Daemon (@sammyTFI) June 27, 2024 -
ప్రభాస్ 'కల్కి' మూవీ స్టిల్స్
-
హబ్బీతో బేబీమూన్కు : భార్య అంటే ఎంత ప్రేమో! వైరల్ వీడియో
త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే బేబీమూన్కోసం లండన్కు పయనమయ్యారు. ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో అందంగా మెరిసారు. విమానాశ్రయంలో దర్శన మిచ్చిన ఈ జంట వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ లవ్బర్డ్స్ ఇద్దరూ చేతిలో చేయివేసుకుని మరీ కనిపించడం ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. అలాగే కారు దిగిన వెంటనే దీపికా వైపు పరుగెత్తుతూ వాహనం నుండి బయటకు వచ్చేందుకు సాయం చేస్తూ, తన భార్యను అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటున్న తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ మురిసి పోతున్నారు. View this post on Instagram A post shared by Voompla (@voompla)కాగా తన అప్కమింగ్ మూవీ ‘కల్కి 2898 AD’కి సంబంధించిన ముంబైలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో దీపికా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీపికా పదుకొనే ఫోటోలు కూడా వైరల్గా మారాయి. ప్రభాస్ సరసన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. రానా హోస్ట్ చేసిన ఈ ఈవెంట్లో ప్రభాస్తోపాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. -
బేబీ బంప్తో దీపికా పదుకొణె.. ఆ బ్రేస్లెట్ ధరెంతో తెలుసా?
కల్కి సినిమాకు కౌంట్డౌన్ మొదలైంది. కేవలం వారం రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ముంబైలో బుధవారం గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా దీపికా పదుకొణె కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. బేబీ బంప్తో కనిపించిన దీపికను చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. తను స్టేజీపైకి వస్తుంటే బిగ్బీ చేయి పట్టుకుని తీసుకొచ్చారు. ప్రభాస్ ఆమెను కూర్చోమని చెప్పి కుర్చీ వేయించాడు. ఈ ఈవెంట్లో దాదాపు అందరూ బ్లాక్ కలర్ డ్రెస్లోనే మెరిశారు. దీపికా సైతం టైట్ బ్లాక్ డ్రెస్లో కనిపించింది. సింపుల్గా ఉండేందుకే మొగ్గు చూపిన ఈ బ్యూటీ తన ఎడమ చేతికి వజ్రాల బ్రేస్లెట్ ధరించింది. దీని ధర 1 కోటి 16 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఈ ఆభరణం తన లుక్కే మరింత అందాన్ని తీసుకొచ్చింది.ఇకపోతే కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, బిగ్బీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, పశుపతి సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా కోటగిర వెంకటేశ్వరరావు ఎడిటర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 27న విడుదల కానుంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా -
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు వీరే (ఫొటోలు)
-
బేబీ బంప్తో దిష్టి తగిలేలా దీపికా! బేబీమూన్ కోసం లండన్కు (ఫోటోలు)
-
ప్రభాస్ 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రభాస్ వల్లే ఇలా మారిపోయాను: దీపికా పదుకొణె
ప్రభాస్ 'కల్కి' మరో వారంలో అంటే జూన్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ప్రభాస్తో పాటు దీపిక, అమితాబ్, కమల్ హాసన్ పాల్గొన్నారు. తక్కువ సమయమే ఈవెంట్ జరిగినప్పటికీ.. యాక్టర్స్ మధ్య బాండింగ్, వాళ్ల చెప్పిన విషయాలు ఆసక్తిగా అనిపించాయి. మరీ ముఖ్యంగా దీపిక, ప్రభాస్ ఫుడ్ గురించి చెప్పడమైతే హైలెట్.(ఇదీ చదవండి: లెజెండ్స్తో కలిసి పనిచేయడం అన్నింటి కంటే గొప్పది: ప్రభాస్)దీపికా పదుకొణె ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. బేబి బంప్తోనే ముంబైలో జరిగిన ఈవెంట్కి వచ్చింది. అయితే ప్రభాస్ ఫుడ్ వల్లే తనకు ఇది (బంప్) వచ్చిందని సరాదా కామెంట్స్ చేసింది. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం ఏకంగా క్యాటరింగ్లా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'నేను ఇలా అవ్వడానికి కారణం ప్రభాస్. అతడి ఇంటి భోజనమే నా బేబి బంప్కి కారణం (సరదాగా నవ్వుతూ). ప్రతిరోజు షూటింగ్కి ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వచ్చేది. ఎంతో ఇష్టంగా మూవీ టీమ్ కోసం భోజనం తెప్పించేవాడు. అది భోజనంలా కాకుండా క్యాటరింగ్లా ఉండేది. అలానే ప్రభాస్ ఇంటి నుంచి ఎలాంటి స్పెషల్ ఫుడ్ వస్తుందా అని ప్రతిరోజు ఎగ్జైట్మెంట్గా ఉండేది' అని దీపికా పదుకొణె చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: మోసపోయిన టాలీవుడ్ హీరోయిన్.. రూ.4 కోట్లు కాదు రూ.14 కోట్లు!)Made a #DeepikaPadukone - #Prabhas edit from today’s event! Need more of them together. They are so cute! Can’t wait for #Kalki2898AD pic.twitter.com/6tqqe2bTuZ— MOTHER IS MOTHERING IRL NOW ✨🥹❤️ (@deepika_era) June 19, 2024 -
Amitabh Bachchan: కల్కిలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు
‘‘కల్కి 2898 ఏడీ’ సెట్స్లో తొలిసారి అమితాబ్ బచ్చన్గారిని కలిసినప్పుడు ఆయన కాళ్లను తాకాలనుకున్నాను. అమితాబ్గారు వద్దన్నారు. నువ్వు చేస్తే నేనూ చేయాల్సి ఉంటుందన్నారు. సార్... ప్లీజ్ అన్నాను. అప్పట్లో ఎవరైనా టాల్గా ఉంటే అమితాబ్ అనేవారు. అమితాబ్ బచ్చన్గారి హెయిర్ స్టయిల్ బాగా ఫేమస్. ఇక ‘సాగర సంగమం’ చూసి ఆ సినిమాలో కమల్గారిలా డ్రెస్ కావాలని మా అమ్మతో అన్నాను. ‘ఇంద్రుడు చంద్రుడు’లో ఆయన నటన చూసి ఎగ్జైట్ అయ్యాను. ఈ స్టార్స్, దీపికా పదుకోన్తో కలిసి యాక్ట్ చేయడం నాకో మంచి ఎక్స్పీరియన్స్’’ అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకకు హీరో రానా హోస్ట్గా వ్యవహరించారు. ఈ సినిమా తొలి టికెట్ను అమితాబ్ బచ్చన్కు అశ్వినీదత్ అందించగా, ఆయన నగదు చెల్లించి తీసుకున్నారు. ఈ టికెట్ను ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? అని అమితాబ్ను రానా అడగ్గా, మై బద్రర్ కమల్హాసన్కి అని చె΄్పారు. ఆ తర్వాత ఈ టికెట్ను అమితాబ్ నుంచి కమల్ అందుకుని, ‘షోలే’ సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టికెట్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంకా ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’లో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నేనిప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు అతను ఏం తాగితే ఇలాంటి ఐడియా వచ్చిందా అనిపించింది. తన విజన్ అద్భుతం. అశ్వినీదత్గారు సింపుల్గా ఉంటారు. సెట్స్లో నాకు కోపరేటివ్గా ఉన్నారు’’ అన్నారు. కమల్హాసన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’ సినిమా స్టార్ట్ చేసేప్పుడు ఆసక్తిగా అనిపించింది. సెట్స్లో పాల్గొన్న తర్వాత సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇప్పుడు అద్భుతంగా అనిపిస్తోంది. సాధారణంగా కనిపించేవారు అసాధారణ పనులు చేస్తుంటారు. నాగ్ అశ్విన్ విషయంలో నాకు అదే అనిపించింది. బ్యాట్మేన్లాంటి కథలు చేయాలని నాకు ఉండేది. ఈ సినిమాలో చేశాను. ఈ సినిమాలో నేనొక పాత్ర చేయాలనుకున్నా.. ఈ పాత్రను అమిత్జీ చేస్తున్నారన్నారు. మరో పాత్ర ఎంచుకున్నా.. అది ప్రభాస్ చేస్తున్నారన్నారు. ఫైనల్గా సుప్రీమ్ యాస్కిన్ అనే పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘కరోనా టైమ్లో జూమ్లో నాగ్ అశ్విన్ కథ చె΄్పారు. తన విజన్ క్లియర్గా ఉంటుంది. ఇందులో తల్లి పాత్ర చేశాను. ఈ సినిమా సెట్స్లో ప్రభాస్ ఈ రోజు ఎవరికి ఏం ఫుడ్ పెట్టారు అన్నదే హైలైట్ డిస్కషన్గా ఉండేది (సరదాగా)’’ అన్నారు దీపికా పదుకోన్. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ వేడుకకు హాజరు కాలేదు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడిన వీడియో బైట్ను ప్లే చేశారు. కాశీ, కాంప్లెక్స్, షంబాల అనే మూడు ప్రపంచాల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని చెప్పి, ఈ ప్రపంచాల నేపథ్యాలను వివరించారు నాగ్ అశ్విన్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్వ΄్నాదత్, ప్రియాంకా దత్, అనిల్ తడానీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న దీపికా పదుకోన్ స్టేజ్ నుంచి దిగేటప్పుడు ప్రభాస్, స్టేజ్ ఎక్కేటప్పుడు అమితాబ్ హెల్ప్ చేయడం ఈవెంట్లో హైలైట్గా నిలిచింది. -
కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్.. బేబీ బంప్తో కనిపించిన దీపికా!
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.కల్కి రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా ముంబయిలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేదికపై కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్, రానా, దీపికా సందడి చేశారు. అయితే ఈవెంట్లో పాల్గొన్న దీపికా బేబీ బంప్తో కనిపించింది. బ్లాక్ అవుట్ఫిట్లో వచ్చిన బాలీవుడ్ భామ.. అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఈ చిత్రంలో దీపికా పదుకొణె సుమతి అనే గర్భిణిగా నటిస్తోంది. ఈ సందర్భంగా దీపికా పదుకొణె షూటింగ్లో తన అనుభవాలు పంచుకున్నారు.దీపికా మాట్లాడుతూ..'నాకిది ఇది ఒక అద్భుతమైన అనుభవం. చాలా నేర్చుకున్నా. ఇది పూర్తిగా నన్ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా,వృత్తిపరంగా ఒక అద్భుతమైన అనుభవం." అని అన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.Deepika.......🩶Prabhas lends a helping hand to #DeepikaPadukone to step down and Big B makes fun of it 💥💥Season 4 Brahmins #KALKI2898AD pic.twitter.com/FKi5OCWyyd— Lalita Rawat (@LalitaRawat_07) June 19, 2024 -
'సింగం అగైన్' విడుదల తేదీలో మార్పు
బాలీవుడ్లో 'సింగం' ఫ్రాంఛైజీ చిత్రాలకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరిస్లో మూడో చిత్రంగా 'సింగం అగైన్' తెరకెక్కుతుంది. అజయ్ దేవగణ్, దీపిక పదుకొణె జంటగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇదొక కాప్ యూనివర్స్ చిత్రం. ఇందులో రణ్వీర్ సింగ్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ కూడా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దీన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ చిత్ర విడుదల విషయంలో మార్పులు చేశారు. దీపావళి కానుకగా 2024 నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా 'సింగం అగైన్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. వీఎఫ్ఎక్స్ తదితర కారణాలతో విడుదల విషయంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్గా బాలీవుడ్లో ఈ ఫ్రాంఛైజీ మొదలైంది. సౌత్లో సూర్య సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే.. బాలీవుడ్లో కూడా సింగం చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆధరణ లభించింది. -
ప్రభాస్ 'కల్కి' ట్రైలర్.. ఆ విషయంపై ట్రోల్స్
ప్రభాస్ 'కల్కి' ట్రైలర్ దుమ్మరేపుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్తో సినిమా తీసినట్లు క్లారిటీ వచ్చేసింది. జూన్ 27 నుంచి థియేటర్లలో దద్దరిల్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ప్రభాస్ లుక్ దగ్గర నుంచి యాక్టింగ్ వరకు అన్ని టాప్ నాచ్ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఆ విషయమై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్)గతేడాది 'సలార్' మూవీతో హిట్ కొట్టిన ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టారు. థియేటర్లలో విడుదలకు మరో 15 రోజులే ఉన్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్టింగ్ అన్ని బాగున్నాయి. కానీ హీరోయిన్ దీపికా పదుకొణె డబ్బింగ్ మాత్రం ఎందుకో అంతగా అతకలేదు.'కల్కి' దీపిక పదుకొణె పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పించారేమో? అందుకే తెలుగు కృతకంగా అనిపించింది. ఇలా ఉందేంటి అని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ట్రైలర్ వరకు ఈ డబ్బింగ్ ఉంటే పర్లేదు. అదే సినిమాలో ఇలానే వాయిస్ ఉంటే మాత్రం ప్రేక్షకులు ఇబ్బందిగా ఫీలయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ విషయంలో మూవీ టీమ్ ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్) -
ఆమెతో నమ్మకం మొదలవుతుంది
ప్రభాస్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. కాగా ఈ మూవీ ట్రైలర్ని నేడు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, దీపికా పదుకోన్ లుక్ను విడుదల చేసింది.‘ది హోప్ బిగిన్స్ విత్ హర్’ (ఆమెతో నమ్మకం మొదలవుతుంది) అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన దీపిక లుక్ నెట్టింట వైరల్గా మారింది. ‘‘సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ‘కల్కి 2898 ఏడీ’ రూపొందింది. మహాభారత పురాణ ఘటనల నుండి మొదలై క్రీస్తు శకం 2898లో పూర్తయ్యే కథ ఇది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన ఆరువేల ఏళ్ల వ్యవధిలో ఈ చిత్రకథ నడుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్. -
దీపికా పదుకొణె, అలియా భట్ల బ్యూటీ సీక్రెట్ ఇదే..!
సినీ తారలు ఎంతలా గ్లామర్ మెయింటెయిన్ చేస్తారో మనకు తెలిసిందే. మూడు పదుల వయసులో వన్నె తరగని అందం, గ్లామర్ వారి సొంత. ముఖ్యంగా వయసు పైనబడినట్లు కనిపించకుండా యవ్వనపు మేని ఛాయాలా కనిపించేందుకు ఏం చేస్తారో తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటారు అభిమానులు. వారిలా ఉండేలా రకరకలుగా అందానికి సంబంధించిన ప్రయోగాలు చేస్తుంటారు. ఇంతకీ అందాల భామలు బ్యూటీ రహస్యం ఏంటంటే..బాలీవుడ్ అగ్ర తారలు దీపకా పదుకొణె దగ్గర నుంచి అలియా భట్ వరకు అంతా ఐస్ ఫేషియల్కి ప్రాధాన్య ఇస్తారు. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందట. ముఖం తాజాగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ముడతలను మాయం చేస్తుందట. ఉబ్బిన కళ్లకు మంచి ఫలితం ఉటుందట. కళ్లు చుట్టూతా ఉన్న ఉబ్బిన భాగ్నాన్ని నార్మల్గా మారుస్తుందట. ఇదెలాగంటే..ఏం లేదు ఉదయాన్నే చక్కగా ముఖాన్ని ఫేస్వాష్ లేదా సబ్బుతో క్లీన్ చేసుకుని చక్కగా ఫ్రీజ్లోని ఐస్ క్యూబ్లతో థెరఫీ చేయించుకుంటారు. ఇది కళ్ల చుట్టు ఉన్న వలయాన్ని, ఉబ్బిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది. క్యూబ్ చేతితో పట్టుకుని ముఖంపై అప్లై చేసుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఐస్నిఒక పల్చటి క్లాత్లో చుట్టి ముఖంపై అప్లై చెయ్యొచ్చు. ఈ థెరపీ ముఖంపై రంధ్రాలను దగ్గర చేసి, మృదువుగా మారుస్తుంది. అలాగే ముఖంపై ఉండే మంట, ఇరిటేషన్ల నుంచి కూడా మంచి ఉపశమనం ఇస్తుంది.అలాగే ముఖమంతా రక్తప్రసరణ జరిగి..చర్మానికి సహజమైన మెరుపుని ఇస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్యను నివారిస్తుందిగ్రీన్ టీ, దోసకాయ రసం వంటి వాటిని ఐస్ క్యూబ్లకు జోడించి అప్లై చేస్తే చర్మానికి అవసరమయ్యే యాంటిఆక్సిడెంట్లు అందుతాయి. అబ్బా చలి..చలిగా.. ఉండి ముఖంపై పెట్టేకునేందుకు వామ్మో..! అనిపించేలా ఉన్నా..ఈ కోల్డ్ థెరపీ చర్మ సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. (చదవండి: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్: నీతా అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా..!) -
సినీతారలకు ర్యాంకులు.. టాప్ టెన్లో అంతా వాళ్లే.. టాలీవుడ్ నుంచి ఎవరంటే!
సినీ ఇండస్ట్రీలో ఎక్కువ క్రేజ్ ఉన్న సెలబ్రిటీల జాబితాను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ వెల్లడించింది. గత పదేళ్లుగా వారికి లభించిన క్రేజ్ ఆధారంగా ఈ లిస్ట్ను రూపొందించారు. అయితే ఈ లిస్ట్లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ నిలిచారు. టాప్ టెన్లో ఆందరూ బాలీవుడ్ తారలే నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న మొదటి 100 మంది సినీతారల జాబితాను ఐఎండీబీ ప్రకటించింది.దక్షిణాది తారల విషయానికొస్తే ఈ జాబితాలో సమంత 13వ స్థానం దక్కించుకుంది. సౌత్ నుంచి టాప్ 15లోపు నిలిచిన స్టార్ సమంత కావడం విశేషం. ఆ తర్వాత తమన్నా 16, నయనతార 18 స్థానాల్లో నిలిచారు. టాలీవుడ్ హీరోల విషయానికొస్తే ప్రభాస్ 29, రామ్ చరణ్ 31, అల్లు అర్జున్ 47, జూనియర్ ఎన్టీఆర్ 67 స్థానాల్లో ఉన్నారు. టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ పేరుతో 2014 నుంచి 2024 వరకు ఎక్కువ ప్రజాదరణ పొందిన తారల జాబితాను ఐఎండీబీ ఇవాళ విడుదల చేసింది. టాప్-100 సినీ తారల జాబితాలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఉన్నారు.Presenting the Top 100 Most Viewed Indian Stars of the Last Decade on IMDb, globally! 📣✨Do you spot your favourites?The Top 100 Most Viewed Indian Stars of the Last Decade on IMDb list is based on the IMDb weekly rankings from January 2014 through April 2024. These… pic.twitter.com/4h8IEEwMAZ— IMDb India (@IMDb_in) May 29, 2024 -
Kalki 2898 AD : ప్రమోషన్స్కి భారీ ప్లాన్..నెల రోజుల్లో ఎన్నో సర్ప్రైజెస్!
బుజ్జి(కారు) పరిచయంతో ‘కల్కి 2898’ సినిమా ప్రమోషన్స్ని స్టార్ట్ చేశారు మేకర్స్. బుజ్జి కోసం ప్రత్యేక ఈవెంట్ని ఏర్పాటు చేయడం.. లైవ్లో ప్రభాస్తో డ్రెవింగ్ చేయించి హడావుడి చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల(జూన్ 27) సమయం మాత్రమే ఉంది. పాన్ వరల్డ్ సినిమాకు ఇది చాలా తక్కువ సమయమే. ఉన్న ఈ కొద్ది సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఎన్నికల ఫలితాల(జూన్ 4) తర్వాత వరుస అప్డేట్స్, ఈవెంట్స్తో దేశ మొత్తం ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ నెల రోజుల ప్రమోషన్స్కి కావాల్సిన కంటెంట్ అంతా రెడీ చేసి పెట్టారట. ఎలెక్షన్స్ రిజల్ట్ తర్వాత వరుసగా ఈవెంట్స్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బుజ్జికి మించిన సర్ప్రైజెస్ ఈ చిత్రంలో చాలానే ఉన్నాయట. హీరోయిన్లు దీపికా పదుకొణె, దిశా పటానిల పరిచయం కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్తో పాటు నాని కూడా కీలక క్యామియోలు చేసినట్లు తెలుస్తోంది. తొలుత వీరిద్దరి పాత్రలను సస్పెన్స్గా ఉంచుదాం అనుకున్నారట. కానీ మీడియాకు లీకవ్వడంతో ప్రమోషన్స్లోనే వీరి పాత్రలను పరిచయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వారి పాత్రలను రివీల్ చేస్తే మాత్రం.. ‘బుజ్జి’కి మించేలా ఈవెంట్ జరపాలని కూడా ఆలోచనలు చేస్తున్నారట. కమల్ హాసన్ని కూడా ప్రమోషన్స్కి తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నారట. మొత్తానికి వచ్చే నెలలో ‘కల్కి 2898’ నుంచి వరస అప్డేట్స్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్, అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటీనటుల రెమ్యునరేషన్తో కలిసి ఈ చిత్రానికి దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. -
Deepika Padukone : దీపికా పడుకోణె అమేజింగ్ లగ్జరీ కార్లు, విలువ ఎంతో తెలుసా?
బాలీవుడ్లో స్టార్ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న అద్భుతమైన నటి దీపికా పదుకొణె. రెమ్యూనరేషన్ విషయంలో హీరోలతో పోటీ పడుతూ టాప్ నటుల్లో ఒకరిగా నిలిచింది. అందానికి తోడు నటనా నైపుణ్యంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో చోటు సంపాదించింది. అంతేనా మూడు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ టైమ్ మ్యాగజీన్ 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచింది. 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు సొంతం చేసుకుంది.అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ను పెళ్లాడి పవర్ కపుల్ స్టేటస్ను దక్కించుకుంది. త్వరలో దీపికా, రణ్వీర్ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లగ్జరీ కార్లు, బంగ్లా లాంటి విలాసవంతమైన జీవనశైలి వారి సొంతం. ఈ నేపథ్యంలో దీపికా గ్యారేజ్ కొలువుదీరిని లగ్జరీ వాహనాలకు గురించి తెలుస్తే షాక్ అవ్వాల్సిందే,. ఎందుకంటే దీపికా మొత్తం కార్ కలెక్షన్ విలువ రూ. 10 కోట్లు. దీపికా పదుకొణె కార్ కలెక్షన్..ఆడి క్యూ7 – ధర రూ. 80 లక్షలుమెర్సిడెస్ మేబ్యాక్ S500 – రూ. 2.40 కోట్లురేంజ్ రోవర్ వోక్ – రూ. 1.40 కోట్లుమినీ కూపర్ కన్వర్టిబుల్ – రూ. 45 లక్షలుమెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్- రూ. 1.60 కోట్లుఆడి A8 L- రూ. 1.20 కోట్లుఆడి A6- రూ. 55 లక్షలుBMW 5 సిరీస్- రూ. 60 లక్షలుపోర్షే కయెన్- రూ. 1 కోటిప్రస్తుతం దీపికా పదుకొణె కల్కి 2898 ఏడీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అలాగే "సింగం ఎగైన్"లో అనే మూవీలోనూ నటిస్తోంది. ఇందులో పోలీసు యూనిఫాంలో యాక్షన్ సన్నివేశాల్లో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. -
సన్ ఫ్లవర్లా స్టార్ హీరోయిన్.. ఆ డ్రెస్సు ఎంతకు అమ్మిందంటే?
సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ కొందరు మాత్రం వివాహం తర్వాత కూడా స్టార్ యాక్టర్ స్టేటస్ అందుకుంటారు. ఇండస్ట్రీలో మహారాణిగా వెలుగొందుతారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇందుకు ఉదాహరణ. రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకున్న దీపిక ఇటీవలే ప్రెగ్నెన్సీ ప్రకటించింది.బేబీ బంప్తో బ్యూటీఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్లి బేబీ బంప్తో ప్రత్యక్షమైంది. అయితే కొందరు జనాలు అది నిజమైన బేబీ బంప్ కాదని, తను సరోగసి విధానాన్ని ఎంచుకుందని అనుమానించారు. అందులో ఏమాత్రం నిజం లేదంటూ దీపిక ఇటీవలే తన సొంత ఫ్యాషన్ బిజినెస్ 82 ఈస్ట్ ఆఫ్లైన్ స్టోర్లో మరోసారి బేబీ బంప్తో దర్శనమిచ్చింది. ఆ సమయంలో తను పసుపు రంగు గౌనులో మెరిసిపోయింది.నిమిషాల్లో అమ్ముడుపోయిన గౌన్సోమవారం ఈ గౌనును ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. ధర రూ.34,000! కేవలం 20 నిమిషాల్లోనే ఆ డ్రెస్ అమ్ముడుపోయింది. దీంతో దీపిక ఆ డ్రెస్ సోల్డ్ అవుట్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫోటో షేర్ చేసింది. ఈ డ్రెస్సును అమ్మగా వచ్చిన రూ.34,000 చారిటీకి ఇవ్వనున్నారు. ద లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్కు ఈ డబ్బు అందజేయనున్నారు. దీపికలాగే ఆమె ఆలోచనలు కూడా ఎంతో అందంగా ఉంటాయంటున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) చదవండి: 'పుష్ప' విలన్కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే? -
Deepika Padukone: ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
-
ఫేక్ బేబీ బంప్ అంటూ ట్రోల్స్.. గట్టిగా బుద్ధి చెప్పనున్న హీరోయిన్!
బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కాబోతోంది. ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో భర్తతో కలిసి ఓటేయడానికి పోలింగ్ బూత్కు వెళ్లింది. ఆ సమయంలో బేబీ బంప్తో కనిపించింది. దీంతో తను సరోగసి ఆప్షన్ను ఎంచుకుందన్న వార్తలకు చెక్ పడినట్లయింది.అది నిజం కాదుఅయినప్పటికీ కొందరు మూర్ఖులు ఆమెను అనుమానిస్తూనే ఉన్నారు. తనది నిజమైన బేబీ బంప్ కాదని, అదంతా నాటకమని అవమానిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఆలియా భట్ సహా పలువురు సెలబ్రిటీలు ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నారు. తాజాగా దీపికా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఫ్యాన్స్ను అలర్ట్ చేసింది. అప్పటివరకు వెయిట్..మరికాసేపట్లో నేను లైవ్లోకి రాబోతున్నాను. అప్పటివరకు వెయిట్ చేయండి. ఓకే, బై అని రాసుకొచ్చింది. తన ప్రెగ్నెన్సీ గురించే మాట్లాడబోతుందని అభిమానులు భావిస్తున్నారు. తనను ట్రోల్ చేసేవారికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. మరి దీపికా ఏ విషయం గురించి మాట్లాడనుందో చూడాలి! కాగా హీరో రణ్వీర్ సింగ్–దీపికా పదుకొణెలకు 2018 నవంబర్ 14న వివాహం అయింది. వివాహమైన ఆరేళ్లకు ఈ దంపతులు పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నారు.చదవండి:ఐదోసారి ఆ స్టార్ హీరో సినిమాలో నయనతార.. భారీ రెమ్యునరేషన్ -
Kalki 2898 AD Bujji Event Photos: అట్టహాసంగా ‘కల్కి 2898 ఏడీ’ ఈవెంట్ (ఫొటోలు)
-
Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
సినిమాను తీయడం ఒకెత్తు అయితే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రేక్షకులను రీచ్ అయ్యేందుకు అదెంచ్చె ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి తర్వాతే మరెవరు అయినా. ఆయన సినిమాను తెరకెక్కించేందుకు ఎలా కష్టపడతాడు.. అంతే స్థాయిలో సినిమా ప్రమోషన్స్కి కష్టపడతాడు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఆయన చేసిన ప్రమోషన్స్ బాగా కలిసొచ్చింది. ఇద్దరు హీరోలతో దేశం మొత్తం తిరిగి సినిమాను అన్ని భాషల వారికి దగ్గరయ్యేలా చేశాడు. కేవలం ప్రమోషన్స్ కోసమే దాదాపు రూ.20 కోట్ల ఖర్చు చేసినట్లు తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతుంది ‘కల్కి’ టీమ్. (చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)సినిమా ప్రమోషన్స్కి భారీగా ఖర్చు చేయబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని కోసం దాదాపు రూ. 50 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. రీసెంట్గా ఐపీఎల్లో కూడా ‘కల్కి 2898 ఏడీ’ యాడ్ని రన్ చేశారు. ప్రభాస్ కల్కి అవతార్లో కనిపించి సినిమాను ప్రమోట్ చేశాడు. ఇది కేవలం 12 సెకన్ల యాడ్ మాత్రమే. దీని కోసం మేకర్స్ రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కల్కి సినిమా ప్రమోషన్స్కి ఖర్చు చేసే డబ్బుతో టాలీవుడ్లో ఓ బడా సినిమానే తీయొచ్చు. (చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడుతాడు)నేడు(మే 22)రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ని నిర్వహించబోతున్నాడు మేకర్స్. ఈ ఈవెంట్లో బుజ్జిని పరిచయం చేయనున్నారు. ప్రభాస్తో పాటు చిత్రబృందం అంతా ఈ ఈవెంట్కి హాజరవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో..అందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేశారట. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ఇతర కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. -
బ్రెయిన్ ఉంటే సరిపోతుందా...
భైరవ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి... కానీ బుజ్జి అంటే మనిషి కాదు. మరి.. బుజ్జి అనేది వాహనమా? లేక ఓ టైమ్ మిషన్లాంటి పరికరమా? అనేది ఈ నెల 22న తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భైరవ ΄ాత్రధారిగా ప్రభాస్, అశ్వత్థామ ΄ాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సూపర్ హీరోలాంటి బుజ్జి ΄ాత్ర కూడా ఉంది. ఈ ΄ాత్రను పూర్తిగా చూపించకుండా ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ పాత్రకు హీరోయిన్ కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘మనుషుల శరీరాన్ని బ్రెయిన్ కంట్రోల్ చేసినట్లే.. బుజ్జి బాడీని కూడా బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంటుంది’ (నాగ్ అశ్విన్), ‘హాయ్.. నేను బుజ్జి బ్రెయిన్... బ్రెయిన్ ఉంటే సరిబ్రెయిన్ ఉంటే సరిపోతుందా...తుందా... బాడీ కూడా కావాలి కదా.. భైరవ ఎక్కడికీ.. నా బాడీ బిల్డ్ చేయడానికేనా..’ (కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్), ‘నీ టైమ్ స్టార్టైంది బుజ్జి.. పదా!’ (ప్రభాస్) అనే డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ బుజ్జి గురించిన పూర్తి వివరాలను ఈ నెల 22న వెల్లడిస్తామని మేకర్స్ తెలి΄ారు. ఇక ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదల కానుంది. -
డబ్బింగ్ డన్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ద్వారా హీరోయిన్ దీపికా పదుకోన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ‘కల్కి 2898 ఏడీ’లో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ని పూర్తి చేశారట దీపికా పదుకోన్. హిందీ, కన్నడ భాషల్లో ఆమె డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. హీరో రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్లకు 2018 నవంబర్ 14న వివాహం అయింది.ప్రస్తుతం దీపిక గర్భవతి. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి జూన్ నెల నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమై ఆమె విశ్రాంతి తీసుకోనున్నారని టాక్. ఈ కారణంగానే ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో తన పాత్ర డబ్బింగ్ని పూర్తి చేశారట ఆమె. అదే విధంగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దీపిక స్పెషల్ ఇంటర్వ్యూలని కూడా ముందుగానే ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్... ఇలా పలు భాషల్లో విడుదల కానుంది. హిందీ, కన్నడ వెర్షన్లకు దీపిక డబ్బింగ్ చెప్పారు. ఇతర భాషల్లో ఆమె పాత్రకు వేరేవారితో డబ్బింగ్ చెప్పిస్తారా? లేక దీపికానే చెబుతారా? అనేది తెలియాల్సి ఉంది. -
పెళ్లి ఫోటోలు డిలీట్.. ఎయిర్పోర్ట్లో మెరిసిన స్టార్ కపుల్!
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ జంట ఒకరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీపికా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. త్వరలోనే ఈ జంట తమ మొదటి బిడ్డను జీవితంలోకి ఆహ్వానించనున్నారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరిపై మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ జంట ముంబయి ఎయిర్పోర్ట్లో మెరిసింది. రణవీర్తో కలిసి తిరిగివచ్చిన దీపికా జంటగా కనిపించారు. అయితే పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంపై ఇప్పటివరకు రణ్వీర్ సింగ్ స్పందించలేదు. దీపికా ఈ ఏడాది సెప్టెంబరులో తమ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.దీపికా సినిమాల విషయానికొస్తే రణవీర్ సింగ్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్లతో కలిసి సింఘమ్ ఎగైన్లో కనిపించనుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీలతో కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించింది. మరోవైపు రణవీర్ సింగ్, కియారా అద్వానీ జంటగా డాన్- 3 చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోనుందా? అవును సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్తగా ఈ చర్చే నడుస్తోంది. ఎందుకంటే సదరు హీరో ఇన్ స్టాలో ఉండాల్సిన పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు. దీంతో పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఏమై ఉంటుందబ్బా అని అభిమానులు, నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఇందులో నిజమెంత?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే వీళ్లలో కొందరు కలిసి ఉంటుంటే.. మరికొందరు మాత్రం మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్ కపుల్ రణ్వీర్ - దీపిక చేరబోతున్నారా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే రణ్వీర్ తన ఇన్ స్టా ఖాతాలోని పెళ్లి ఫొటోల్ని డిలీట్ చేశాడు. దీంతో లేనిపోని అనుమానాలు వచ్చాయి.దీపిక ఇన్ స్టాలో ఉన్నాయి కానీ రణ్వీర్ ఖాతాలో మాత్రం పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు. అయితే దీపికతో కలిసున్న మిగతా ఫొటోలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాదన్నట్లు దీపిక ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఇలాంటి టైంలో విడాకులు రూమర్ అనేది నమ్మేలా అనిపించట్లేదు. పెళ్లి పిక్స్ కనిపించకుండా పోవడం బహుశా ఏదో పొరపాటు వల్ల అయ్యిండొచ్చని వీళ్ల ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాలంటే రణ్వీర్ స్పందించాల్సిందే. (ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?) View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
Singham Again: 400 మంది డ్యాన్సర్లతో మాస్ డ్యాన్స్!
అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్లతో కలిసి మాస్ డ్యాన్స్ చేసేద్దాం అంటూ కరీనా కపూర్ సందడి చేస్తున్నా రట. అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా అక్షయ్ కుమార్, రణ్వీర్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సింగమ్ ఎగైన్’. ‘సింగమ్ ఫ్రాంచైజీ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొనగా భారీ ఓ మాస్ సాంగ్ని చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని టాక్. కీలక తారాగణంతో పాటు దాదాపు నాలుగు వందల మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని భోగట్టా. కాగా ప్రస్తుతం దీపికా పదుకోన్ గర్భవతి కావడంతో ఆమె ఈ పాటలో కనిపించే చాన్స్ లేదని బాలీవుడ్ అంటోంది. -
Deepika Padukone: ఫైనల్లీ ఆ టాటూని తొలగించిన దీపికా పదుకొణె!
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్లో దీపికొ పదుకొణె- రణ్వీర్ సింగ్ జంట ఒకటి. రామ్ లీలా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. 2018 నవంబర్ 14న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. త్వరలోనే ఈ బ్యూటీ ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భం దాల్చిందనే విషయాన్ని రణ్వీర్ వెల్లడించాడు. తాజాగా ఈ భామ ఇన్స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది. శనివారం దీపికా తన ఇన్స్టా ఖాతాలో ఓ ఫోటోని షేర్ చేసింది.అందులో ఆమె మెడ కనిపించేలా వెనుక వైపు తిరిగి ఉంది. గతంలో ఆమె వీపు భాగంపై ఓ టాటూ ఉండేది. ఇప్పుడది కనిపించలేదు. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో రణ్వీర్ సింగ్తో పెళ్లి కంటే ముందు దీపికా పదుకొణె మరో స్టార్ హీరో రణ్బీర్ కపూర్తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ ఇద్దరి ప్రేమ విషయం బాలీవుడ్ అంతా తెలుసు. పెళ్లి కూడా చేసుకుంటారని అంతా భావించారు. కానీ కారణం ఏంటో తెలియదు కానీ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రణ్బీర్తో స్నేహం ఏర్పడడం..అది కాస్త ప్రేమగా మారడంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే రణ్బీర్తో ప్రేమలో ఉన్న సమయంలో దీపికా తన వీపుపై RK(రణ్బీర్ కపూర్ షార్ట్ కట్) అని టాటూ వేయించుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆ టాటూని చెరిపేయలేదు. దీంతో అప్పట్లో ఈ టాటూపై బాలీవుడ్లో పెద్ద చర్చే జరిగింది. కానీ దీపికా మాత్రం ఆ టాటూపై స్పందించలేదు. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఆ టాటూ కనిపించకపోవడంతో.. ప్రెగ్నెంట్ అయిన తర్వాత దీపికా ఆ టాటూని తొలగించిందనే నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన కల్కీ 2898 ఏడీ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
గ్లామరస్ క్వీన్ దీపిక బ్యూటీ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపిక పదుకునే తన నటన, అభినయంతో మంచి ఫ్యాన్ పాలోయింగ్ని సంపాదించుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ 'ఓం శాంతి ఓం'తో ఒక్కసారిగా రాత్రికే రాత్రే స్టార్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో విజయపథంలో దూసుకుపోతుంది. అంతేగాదు బాలీవుడ్లో అత్యధిక పారితోషం తీసుకుంటున్న హీరోయిన్ల సరసన నిలిచింది. ఇక దీపిక చందమామలాంటి ముఖంతో మంచి స్టన్నింగ్ లుక్తో ఇట్టే ప్రేకక్షులను కట్టిపడేస్తుంది. అందుకు ఆమె వన్నెతరగని అందమే కారణం. అసలు వాళ్లు అంతలా గ్లామర్ని ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటుంది కదా!. మరీ దీపికా పదుకునే బ్యూటీ రహస్యం ఏంటో చూద్దామా..! దీపిక చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తన తల్లి నుంచే నేర్చుకున్నానని చెబుతోంది. తప్పనిసరిగా మేకప్ని తొలగించే.. నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్ని తొలగించే పడుకుంటానని చెబుతోంది దీపిక. ఎంతటి బిజీ షెడ్యూల్ అయినా సరే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోనిదే పడుకోనని అంటోంది. దీని వల్ల ముఖంపై మలినాలు, మొటిమలు, బ్లాక్హెడ్స్ వంటివి ఉండవని చెబుతోంది. సన్స్క్రీన్ తప్పనిసరి.. బయటకు వెళ్తే తప్పనిసరిగా సన్స్క్రీన్ లేకుండా వెళ్లనని అంటోంది. దీని వల్ల యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోగలం. అలాగే వృధాప్య ప్రమాదాన్ని నివారిస్తుంది. చర్మ క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది. ప్రకాశవంతమైనే మేని ఛాయను ప్రోత్సహిస్తుంది. వేసవి లేదా చలికాలంలో ఇంటి లోపల లేదా బయటతో సంబంధం లేకుండా తన దినచర్యలో భాగంగా ప్రతిరోజూ రెండుసార్లు తప్పనిసరి ముఖానికి సన్స్క్రీన్ రాసుకుంటానని చెబుతోంది. క్లోడ్ వాటర్ థెరపీ అలాగే ముఖానికి క్లోడ్ వాటర్ థెరఫీ కూడా ప్రతిరోజు తీసుకుంటానని అంటోంది. ఇది ముఖాన్ని ఫ్రెష్గా ఉండేలా చేస్తుందని అంటోంది. అలాగే ముఖం అంతా రక్త ప్రసరణ సాఫీగా జరిగి చర్మం ప్రకాశవంతంగా ఉండటంలో తోడ్పడుతుంది. హైడ్రేటెడ్గా ఉంచడం.. తన దినచర్యలో భాగంగా నూనె లేదా మాయిశ్చరైజర్ తప్పనిసరిగా ముఖానికి రాయడం విస్మరించదు. ఇది చర్మాన్ని డీ హైడ్రేషన్కి గురికాకుండా చేస్తుంది. ఇలా ముఖం తేమగా ఉండటం వల్ల ముకం ప్రకాశవంతంగా ఉంటుంది. కొబ్బరి నూనె.. శిరోజాలకు తప్పనిసరిగా కొబ్బిర నూనెనే ప్రివర్ చేస్తానని చెబుతోంది. ఇది చుండ్రుని నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఫలితం జుట్టు మంచి షైనీగా మెరుస్తు ఉంటుంది. గ్లామర్ మెయింటెయిన్ చేయడంలో శిరోజాల అందం కూడా ముఖ్యమేనని అంటోంది. జీవనశైలి గ్లోయింగ్ స్కిన్ అనేది చర్మ సంరక్షణ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడి ఉండదని నొక్కి చెబుతోంది దీపిక. మంచి జీవనశైలి, చక్కటి వ్యాయామం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటం వంటి అలవాట్లే మనం అందాన్ని ఇనుమడింప చేస్తాయని చెబుతోంది. అవే మన ముఖాన్ని కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది. పైగా ఆర్యోగకరమైన జీవితాన్ని పొందగలమని అన్నారు. (చదవండి: జుట్టు మృదువుగా నిగనిగలాడాలంటే గంజితో ఇలా చేయండి!) -
అనిషా పదుకోన్: మహిళల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..
పట్టణాలలో, నగరాలలో మానసిక సమస్యలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. పల్లెల్లో ఎలా? ముఖ్యంగా మహిళలకు మానసిక సమస్యలు వస్తే? డిప్రెషన్తో బాధ పడ్డ నటి దీపికా పదుకోన్ గ్రామీణ మహిళల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్ లవ్ లాఫ్’ అనే సంస్థను స్థాపించింది. దాని బాధ్యతను చెల్లెలు అనిషా పదుకోన్కు అప్పజెప్పింది. అనిషా నిర్వహణలో ఆ సంస్థ ఆరు రాష్ట్రాలలో గ్రామీణ మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. చెన్నైకి గంటన్నర ప్రయాణ దూరంలో ఉండే తిరువళ్లూరులో శశికళ అనే మహిళకు మతి చలించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెను తీసుకొచ్చి చెన్నైలో చూపిస్తే మందులు వాడాలన్నారు. చెకప్ల కోసం, మందుల కోసం నెలకోసారి చెన్నై రావాలంటే డబ్బులు ఖర్చవుతాయి. ఆమె అంత డబ్బు ఖర్చు పెట్టలేని పేద మహిళ. మందులు మానేసింది. మానసిక స్థితి ఇంకా దెబ్బ తిని ఊళ్లో దిమ్మరిగా తిరగడం మొదలెట్టింది. గ్రామీణ స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్న ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థ ప్రతినిధులకు ఈ సంగతి తెలిసింది. తమతో కలిసి పని చేస్తున్న చెన్నైకి చెందిన వసంతం ఫౌండేషన్కు ఈ సంగతి తెలియపరిచారు. ఆ ఫౌండేషన్ వారు ఆమెను తరచు వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. కావలసిన మందులు కొనిచ్చారు. కేర్గివర్గా పని చేస్తున్న తల్లికి దారి ఖర్చులు సమకూర్చారు. శశికళకు పూర్తిగా నయమైంది. ఆ తర్వాత ఆమె చిన్న చిల్లరకొట్టు నడుపుకోవడానికి 5000 రూపాయల సహాయం అందించారు. శశికళ ఇప్పుడు తన పిల్లలను చూసుకుంటూ జీవిస్తోంది. ‘ఇలా సహాయం అందాల్సిన వారు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అంటుంది అనిషా పదుకోన్. ఆమె ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థకు సి.ఇ.ఓ. దీపిక స్థాపించిన సంస్థ తాను డిప్రెషన్తో బాధ పడుతున్నట్టు దీపికా పదుకోన్ 2015లో లోకానికి వెల్లడి చేసింది. స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చింది. అంతే కాదు తన బాధ్యతగా 2016లో బెంగళూరు కేంద్రంగా స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ను స్థాపించింది. దానికి తన చెల్లెలు అనిషా పదుకోన్ను సి.ఇ.ఓగా నియమించింది. అనిషా ఈ సంస్థ కోసం చురుగ్గా పని చేస్తోంది. ఇప్పటికి ఈ ఫౌండేషన్ సేవలను ఆరు రాష్ట్రాలకు విస్తరించింది. ఆ ఆరు రాష్ట్రాలలోని 13 జిల్లాల్లో ఈ సంస్థ వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరివల్ల 15,000 మంది గ్రామీణ మహిళలు ఇప్పటి వరకూ మానసిక చికిత్స పొందారు. అంతే కాదు 26,000 మంది సంరక్షకులు, అంగన్వాడి కార్యకర్తలు మానసిక చికిత్సలో ప్రాథమిక అవగాహనకై ట్రయినింగ్ కూడా ఈ సంస్థ వల్ల పొందారు. గోల్ఫ్ ప్లేయర్ అనిషా పదుకోన్ తండ్రి ప్రకాష్ పదుకోన్ ప్రఖ్యాత బాడ్మింటన్ ప్లేయర్ కావడం వల్ల అనిషా స్పోర్ట్స్ పట్ల ఆసక్తి కనపరిచింది. ఆమె గోల్ఫ్ క్రీడను ప్రొఫెషనల్ స్థాయిలో నేర్చుకుని మన దేశం తరఫున అమెచ్యుర్ లెవల్లో ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆ ఆటను కొనసాగించే సమయంలోనే దీపికా పడుకోన్ సూచన మేరకు ఫౌండేషన్ బాధ్యతలు తీసుకుంది. ‘ఇక్కడ పని చేయడం మొదలెట్టాక మానసిక సమస్యల తీవ్రత అర్థమైంది. మన దేశంలో 20 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో గ్రామీణ స్త్రీలు ఎక్కువ శాతం ఉన్నారు. వీరి కోసం మందులు, వైద్యం, పెన్షన్, సంరక్షకుల ఏర్పాటు, ఉపాధి... ఇవన్నీ సాధ్యం కావాలంటే పెద్ద ఎత్తున సాయం కూడా అందాలి. వాలంటీర్లు ముందుకు రావాలి. కలిసి పని చేయాలి’ అంటుంది అనిషా. స్త్రీలు వ్యాయామం చేయడంతో పాటు పోషకాహారం తీసుకుంటూ తగినంత నిద్ర పోవడం అవసరం అంటుందామె. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని పిలుపునిస్తోంది. ఇవి చదవండి: చదువు శక్తినిస్తుంది -
మరికొద్ది గంటల్లోనే ఫైటర్ వచ్చేస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?
హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. దీంతో రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫైటర్. ఫైటర్ మూవీ స్ట్రీమింగ్ డేట్ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే అంటే ఈనెవ 21న స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ చిత్రం తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించింది. మార్చి 21న అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళం ఆడియోల్లోనూ స్ట్రీమింగ్కు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండునున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో యుద్ధ విమానాల విన్యాసాలు, వీఎఫ్ఎక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలిచాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్.. ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా ఈ మూవీలో నటించారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీద షేక్, అషుతోశ్ రానా, గీతా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. Ladies and Gentlemen, FIGHTER is all set for landing!! ✈️🔥 🤩 Fighter is releasing tonight at 12am on Netflix! pic.twitter.com/KYqnb3hKFL — Netflix India (@NetflixIndia) March 20, 2024 -
'పుష్ప 2' చిత్రంతో పోటీకి దిగుతున్న రెండు పాన్ ఇండియా సినిమాలు
కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ 61 ఏళ్ల వయసులో కూడా సినీ పరిశ్రమలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. యంగ్ హీరోలు కూడా ఆశ్చర్యపోయేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్గా ప్రభుదేవాతో 'కరటక దమనక' చిత్రంతో హిట్ కొట్టిన శివన్న.. మరో సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. శివ రాజ్కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో 'భైరతి రంగల్' ఒకటి. ఈ చిత్రం గురించి చిత్ర బృందం అభిమానులకు శుభవార్త అందించింది. సినిమా విడుదల తేదీని ప్రకటించి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఆగష్టు 15, 2024న విడుదల చేయనున్నట్లు శివరాజ్కుమార్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. ఈమేరకు పోస్టర్ను కూడా వదలడం జరిగింది. అందులో శివన్న రగ్గడ్ లుక్లో కనిపస్తున్నారు. కన్నడ సూపర్ హిట్ చిత్రమైన 'ముఫ్తీ'కి 'భైరతి రంగల్' ప్రీక్వెల్గా రానుంది. ఈ చిత్రాన్ని గీతా శివ రాజ్కుమార్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' కూడా విడుదల కానుంది. అదే రోజు బాలీవుడ్ నుంచి మరో ప్రాంచైజీ చిత్రం 'సింగం ఎగైన్' కూడా రానుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, విక్కీ కౌషల్, కరీనా కపూర్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటిస్తున్నారు. దీంతో పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న 'పుష్ప 2' చిత్రానికి గట్టి పోటీ తగలనుంది. పుష్ప సినిమా కలెక్షన్లకు అడ్డుగా కన్నడలో శివరాజ్ కుమార్ సినిమా ఉంటే.. బాలీవుడ్లో భారీ స్టార్స్తో వస్తున్న సింగం ఎగైన్ చిత్రం ఉంది. ఈ రెండు చిత్రాలను తట్టుకుని పుష్ప గాడు ఎంతమేరకు అక్కడ నిలబడుతాడో వేచి చూడాలి. Justice Arrives This Independence Day#BhairathiRanagal IN CINEMAS 15th August 2024 @NimmaShivanna @GeethaPictures #Narthan @RahulBose1 @RaviBasrur #Naveen #chethandsouza @dhilipaction @kaanistudio @The_BigLittle #Geethapictures #BhairathiRanagalAug15 #Mufthi pic.twitter.com/ekOhYdqIHR — DrShivaRajkumar (@NimmaShivanna) March 10, 2024 -
ప్రభాస్ కల్కి.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
సలార్ తర్వాత వస్తోన్న ప్రభాస్ మరో చిత్రం 'కల్కి 2989 ఏడీ'. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తోంది. కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాస్.. భైరవగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ పోస్టర్ను షేర్ చేస్తూ రివీల్ చేశారు. కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్పై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా..ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ప్రభాస్తో ఆయన తొలిసారి నటిస్తున్నారు. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టామని నాగ్ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. #BHAIRAVA 💥💥💥#Prabhas #Kalki2898AD pic.twitter.com/5QR4icF6w7 — Kalki 2898 AD (@Kalki2898AD) March 8, 2024 -
ప్రభాస్ కల్కిలో దీపికా పదుకోన్ తెలుగు పలుకులు?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తెలుగులో చేస్తున్న తొలి స్ట్రయిట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షనల్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ , కమల్హాసన్ , దిశాపటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో పద్మ అనే పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. ‘కల్కి 2898 ఏడీ’కి సంబంధించి ఇప్పటికే దీపిక పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తయిందని తెలిసింది. అయితే ఈ సినిమాలోని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని దీపిక అనుకుంటున్నారని టాక్. సొంత డబ్బింగ్ అయితే తన పాత్రకు మరింత బలం వచ్చినట్లు అవుతుందని ఆమె భావిస్తున్నారట. అతి త్వరలోనే దీపిక వాయిస్కు ప్రాథమిక డబ్బింగ్ టెస్ట్ నిర్వహించి, తుది నిర్ణయం తీసుకోనున్నారట నాగ్ అశ్విన్ . ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో జరుగుతోందని తెలిసింది. ప్రభాస్, దిశాపటానీలపై ఓ సాంగ్ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మే 9న విడుదల కానుంది. -
ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ త్వరలోనే తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ శుభవార్తను ఫిబ్రవరి 29న సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు దీపికా, రణ్వీర్. ఈ సందర్బంగా ఇన్స్టా పోస్ట్ వైరల్గా మారింది. అంతేకాదు పుట్టబోయేది కవలలు అంటు తెగ చర్చిస్తున్నారు ఫ్యాన్స్. ప్రెగ్నెన్సీని అలా ప్రకటించారో లేదో, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు అంటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఇందుకు ఇన్స్టా పోస్ట్లో పేర్కొన్న బ్లూ, పింక్ షేడ్స్లో షూస్, టోపీలు, ఫ్రాక్, ఇతర బొమ్మలను ఉదహరిస్తున్నారు. పింక్ కలర్ ఆడ బిడ్డకు, బ్లూ కలర్ మగబిడ్డకు సంకేతం కాబట్టి, దీపికా రణ్వీర్ దంపతులకు ట్విన్స్ పుట్టబోతున్నారంటూ నెటిజన్లు పలు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఇంకా బేబీ ఎవరనేది తెలియదు కాబట్టి ఈ రెండు కలర్స్ పెట్టారని మరో యూజర్ ఈ వాదనను కొట్టిపారేశారు. కాగా దీపికా, రణ్వీర్ 2018,నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో పుట్టనున్న బిడ్డకోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పెళ్లి తరువాతనటులుగా ఇద్దరూ దూసుకుపోతున్నారు. రోహిత్ శెట్టి 'సింగం ఎగైన్', నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'లో దీపిక నటిస్తుండగా, మరోవైపు రణ్వీర్ 'సింబా 2', 'డాన్ 3' ,'సింగమ్ ఎగైన్' చిత్రాల్లో కనిపించనున్నాడు. -
ప్రెగ్నెంట్.. అయినా డ్యాన్స్, దాండియా చేసిన స్టార్ హీరోయిన్
'అందరూ పెళ్లి చేసుకుంటున్నారు.. పిల్లల్ని కంటున్నారు? మరి మీరెప్పుడు పేరెంట్స్గా ప్రమోషన్ పొందుతారు?'.. ఈ ప్రశ్న వినీవినీ విసిగెత్తిపోయారు బావుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్- దీపికా పదుకోణ్. దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2018లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే వీరు తల్లిదండ్రులం కాబోతున్నామంటూ గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్లో డెలివరీ డేట్ ఇచ్చారని వెల్లడించారు. స్టేజీపై డ్యాన్స్ ఈ విషయాన్ని పక్కన పెడితే అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్గా జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ వేడుకలకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో రణ్వీర్-దీపికా కూడా ఉన్నారు. అందరూ ఆడిపాడుతుంటే చూస్తూ కూర్చోవాలా? అనుకున్నారో ఏమో కానీ.. ఇద్దరూ కలిసి స్టేజీపై ఓ పాటకు డ్యాన్స్ చేశారు. అక్కడితో ఊరుకోలేదు. స్టేజీ దిగాక ఇద్దరూ దాండియా ఆడుతూ ఎంజాయ్ చేశారు. ప్రెగ్నెంట్ అయినా కూడా దీపిక ఇలా డ్యాన్స్, దాండియా చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆశ్యర్యపోతున్నారు. తన ముఖం కళతో వెలిగిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు. దీపిక భర్తను బెదిరించిన ఓరీ మరోవైపు ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ వాలిపోయే ఓరీ కూడా ఈ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగమయ్యాడు. ఇంకేముంది.. దీపికాతో కలిసి ఫోటోకు పోజిచ్చాడు. ఈ ఫోటో తీయడానికి రణ్వీర్ అష్టకష్టాలు పడుతుంటే బాగా తీయమని బెదిరించాడు ఓరీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Deepika Padukone TR (@deepikainfinity) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) చదవండి: మొగలిరేకులు ఫేమ్ దయ మృతికి కారణాలివే! -
జామ్నగర్ ఎయిర్పోర్టులో దీపికా-రణ్వీర్.. ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి.. (ఫోటోలు)
-
దీపికా పదుకొణె ప్రెగ్నెంట్..ప్రభాస్ 'కల్కి' పరిస్థితి ఏంటి?
-
హ్యాపీ... హ్యాపీ
‘పేరెంట్స్గా ఎప్పుడు ప్రమోట్ అవుతారు?’ అనే ప్రశ్నకు పెళ్లయినప్పట్నుంచి చిరునవ్వే సమాధానంగా ఇస్తూ వచ్చారు రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్. ఫైనల్గా తాము తల్లిదండ్రులు కానున్నట్లు ఈ భార్యాభర్తలు గురువారం ఇన్స్టా వేదికగా వెల్లడించారు. సెప్టెం బర్లో డెలివరీ డేట్ ఇచ్చినట్లు దీపిక పేర్కొన్నారు. ఈ హ్యాపీ న్యూస్ను సోషల్ మీడియాలో షేర్ చేయగానే పలువురు ప్రముఖులు రణ్వీర్–దీపికలకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్లు షేర్ చేశారు. ఇక 2013లో ‘రామ్లీల’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు రణ్వీర్, దీపిక. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందట. ఆ తర్వాత ‘పద్మావత్’ కోసం రణ్వీర్–దీపిక కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో విడుదల కాగా, అదే ఏడాది నవంబరులో రణ్వీర్, దీపిక ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. -
తల్లిదండ్రులు కాబోతున్న దీపికా పదుకొనే, రణవీర్ సింగ్
-
తల్లి కాబోతున్న దీపిక.. భర్తతో సంతోష క్షణాలు (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్కు ప్రెగ్నెన్సీ.. అఫీషియల్గా ప్రకటించిన దంపతులు!
బాలీవుడ్ స్టార్ మోస్ట్ క్రేజ్ ఉన్న కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్. ఈ జంటపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాదిలో వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్లు నెట్టింట టాక్ వినిపించింది. ఇటీవల బాఫ్టా వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకొణె చీరకట్టులో కనిపించింది. ఆ తర్వాత దీపికా వదులుగా ఉండే ఔట్ఫిట్లో కనిపించింది. దీంతో దీపిక ప్రెగ్నెన్నీతో ఉందంటూ సోషల్ మీడియాలో వైరలైంది. తాజాగా అందరూ ఊహించినట్లుగానే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది బాలీవుడ్ జంట. దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని బాలీవుడ్ దంపతులు తమ ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఇకపోతే దీపిక.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ని 2018లో పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
'కల్కి 2898' టైటిల్ సీక్రెట్ ఇదే: నాగ్ అశ్విన్
ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి నిత్యం ఏదొ ఒక వైరల్ న్యూస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా నాగ్ అశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్లో పాల్గొన్నాడు. అక్కడ కల్కి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అశ్విన్ పంచుకున్నాడు. మహాభారతం, స్టార్ వార్స్... రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పుట్టిందని నాగ్ అశ్విన్ అన్నారు. ఈ సినిమా కూడా మహాభారతం కాలం నుంచి మొదలయి 2898లో పూర్తవుతుంది. అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టడం జరిగింది. సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ కూడా ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం.' అని తెలిపారు. ఈ ఏడాది సమ్మర్లో మే 9న ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 విడుదల కానుంది. -
షారుఖ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. పఠాన్ మళ్లీ రాబోతున్నాడు!
షారుక్ ఖాన్ కెరీర్లో రూ. వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘పఠాన్’ (2023). వైఆర్ఎఫ్ (యశ్రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్లో భాగంగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ‘పఠాన్’ సినిమాను నిర్మించారు. షారుక్ ఖాన్ టైటిల్ రోల్ చేశారు. కాగా ‘పఠాన్’ సినిమాకు సీక్వెల్గా ‘పఠాన్ 2’ తెరకెక్కించే పనిలో ఉన్నారట దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఆల్రెడీ ‘పఠాన్ 2’ స్క్రిప్ట్ వర్క్ మొదలైందని, స్టోరీ బేసిక్ ఐడియాకు షారుక్ ఖాన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, వైఆర్ఎఫ్ స్పై యూనిర్స్లో భాగంగానే ‘పఠాన్’ ఉంటుందని బాలీవుడ్ భోగట్టా. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది డిసెంబరులో ప్రరంభం కానుందని టాక్. -
తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి కాబోతుందా? అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ఈ వార్తలకు బలమొచ్చేలా కొన్ని హింట్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ బ్యూటీ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఈమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రెగ్నెన్సీతో ఉందా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత? దీపికా పదుకొణె పేరు చెప్పగానే హిందీ హీరోయిన్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఈమె పుట్టి పెరిగిందింతా బెంగళూరులోనే. కన్నడ సినిమాతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది గానీ హిందీలో వరస ప్రాజెక్టులు చేస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం 'కల్కి'లో ప్రభాస్ సరసన నటస్తోంది. హిందీలో 'సింగం రిటర్న్స్'లో మాత్రమే చేస్తోంది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) తాజాగా ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల వేడుక 'బాఫ్టా'లో పాల్గొన్న దీపిక.. చీరకట్టులో కనిపించింది. అయితే ఈమెని సరిగా అబ్జర్వ్ చేస్తే బేబీ బంప్ ఉందేమోననే సందేహం వచ్చింది. తాజాగా ముంబయి తిరిగొచ్చేసిన దీపిక.. వదులుగా ఉండే ఔట్ఫిట్లో కనిపించింది. వీటితో పాటు దీపిక ప్రెగ్నెన్నీతో ఉందనే సమాచారం బయటకొచ్చింది. చేతిలో ఉన్న మూవీస్ షూటింగ్ చివరకు వచ్చేయడం, బేబీ బంప్తో కనిపించడం, ప్రెగ్నెన్సీ రూమర్స్ రావడంతో దీపిక పదుకొణె నుంచి త్వరలో గుడ్ న్యూస్ రాబోతుందనిపిస్తోంది. ఇకపోతే దీపిక.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ని 2018లో పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) #deepikapadukone airport look in a stylish way ✈️♥️ pic.twitter.com/b0x66dBAa0 — Womansera (@WomansEra2) February 20, 2024 -
బాఫ్టాలో మెరిసిన దీపికా పదుకోన్
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఒప్పెన్ హైమర్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. లండన్లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల (బాఫ్టా) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. దేశం నుంచి దీపికా పదుకోన్ ఈ వేడుకల్లో పాల్గొని, ‘నాన్ ఇంగ్లిష్’ విభాగంలో ఉత్తమ చిత్రానికి (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) అవార్డు అందజేశారు. ఇక ‘భాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో పురస్కారాలు అందుకుని సత్తా చాటింది. అవార్డులతో ‘ఒప్పెన్ హైమర్’ టీమ్ ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, సహాయనటుడు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాల్లో ‘ఒప్పెన్ హైమర్’కి అవార్డులు దక్కాయి. క్రిస్టోఫర్ నోలన్కు దర్శకుడిగా దక్కిన తొలి బాఫ్టా అవార్డు ఇది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం తాజాగా బాఫ్టాలో ఏడు పురస్కారాలు దక్కించుకుని, వచ్చే నెలలో జరిగే ఆస్కార్ రేసులో 13 విభాగాల్లో పోటీలో ఉంది. ఇక ‘బాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ తర్వాత ‘పూర్ థింగ్స్’ మూవీ అధికంగా ఐదు (కాస్ట్యూమ్, మేకప్, హెయిర్–స్టైలింగ్,ప్రోడక్షన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో) అవార్డులను పొందింది. ఆ తర్వాత ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకి మూడు పురస్కారాలు దక్కాయి. భారతీయత ఉట్టిపడేలా... ‘భాఫ్టా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్గా వ్యవహరించిన దీపికా పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయ నటి దీపికా కావడం విశేషం. ఈ వేదికపై భారతీయత ఉట్టిపడేలా చీరలో మెరిశారు దీపికా పదుకోన్. ‘చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది’ అనే ప్రశంసలు ఈ బ్యూటీ సొంతమయ్యాయి. ఈ వేడుకలో బ్యాక్ స్టేజీలో దీపికా దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయ సినీ వేడుకల్లో దీపికా పదుకోన్ పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో దీపిక ప్రజెంటర్గా వ్యవహరించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటను ఆమె ఆస్కార్ వేదికపై పరిచయం చేశారు. -
సింగమ్ వర్సెస్ సైతాన్ .. అదిరిపోయిన అర్జున్ కపూర్ ఫస్ట్ లుక్!
బాలీవుడ్ సింగమ్ ఫ్రాంచైజీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్’. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, దీపికా పదుకోన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘సింగమ్’ ఫ్రాంచైజీ దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరగుతోంది. కాగా ఈ సినిమాలో అర్జున్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, ఆ పాత్రను సైతాన్గా అభివర్ణిస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్ను షేర్ చేశారు రోహిత్ శెట్టి. ‘ఈ తుఫానుకు సిద్ధంగా ఉండండి’ అంటూ అర్జున్ పాత్రను ఉద్దేశించి, సోషల్ మీడియాలో షేర్ చేశారు అజయ్ దేవగన్. రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్, జ్యోతీ దేశ్పాండే నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. మరోవైపు ‘సింగమ్ ఫ్రాంచైజీ’లో భాగంగా 2011లో ‘సింగమ్’, 2014లో ‘సింగమ్ రిటర్న్స్’ ఇప్పుడు ‘సింగమ్ ఎగైన్’ సినిమాల్లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Rohit Shetty (@itsrohitshetty) -
హృతిక్ రోషన్కు తీవ్ర గాయాలు.. జూ ఎన్టీఆర్ 'వార్- 2' మరింత ఆలస్యం
ప్రముఖ బాలీవుడ్ కథా నాయకుడు హృతిక్ రోషన్ కాలికి గాయమైంది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేసి ఆయన తెలిపారు. నడుముకు ఒక బెల్ట్ పెట్టుకుని క్రచెస్ సాయంతో నిలుచున్న ఒక ఫోటోను ఆయన షేర్ చేశారు. గతంలో మీలో ఎంతమందికి ఈ క్రచెస్, వీల్ చైర్ అవరసమెచ్చింది..? ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి..? అని రాసుకొచ్చారు. గాయంతో కలిగిన బాధ నుంచి ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ వంటి స్టార్స్తో పాటు అభిమానులు మెసేజ్లు చేస్తున్నారు. హృతిక్ త్వరగా కోలుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఫోటోలో హృతిక్ రోషన్ను గమనిస్తే ఆయనకు తీవ్రమైన గాయాలే అయినట్లు ఉన్నాయి. అందుకు గల కారణాలను మాత్రం ఆయన తెలపలేదు. ఫైటర్ షూటింగ్ సమయంలో ఏమైనా జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఆయన కాలికి గాయం కావడంతో కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబినేషన్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రం వార్-2 షూటింగ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. 'వార్' మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా పోటాపోటీగా నటించారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. దీంతో 'వార్2'పై సినీ ప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్ డేట్స్ కూడా ఇచ్చేశారు. త్వరలో షూటింగ్ అనుకుంటున్న సమయంలో హృతిక్ రోషన్కు గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కావచ్చు అని తెలుస్తోంది. ఈ ఏడాదిలో 'ఫైటర్' సినిమాతో హిట్ కొట్టారు హృతిక్ రోషన్. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొణె ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద రూ. 340 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం బాలీవుడ్లో ఇప్పటికి కూడా రన్ అవుతుంది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
దీపికా పదుకొనే మెచ్చిన 'ఈమా దత్షి' రెసిపీ!
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఒకనొక ఇంటర్వ్యూలో ఈమా దత్షి రెసిపీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. నిజానికి ఈమా దత్షీ రెసిపీ భూటాన్ వంటకం. తన అభిమానులకు ఈ వంటకం గురించి షేర్ చేశారు దీపికా. ఈ రెసిపీ రుచి, తయరీ విధానాల గురించి పంచుకున్నారు. గతేడాది దీపికా ఏప్రిల్ 2023లో భూటాన్ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ ప్రత్యేక భూటాన్ వంటకంపై మనసు పారేసుకున్నానని, ఇప్పుడది తన ఫేవరెట్ డిష్ అని చెప్పుకొచ్చారు ఆమె. ఇంతకీ ఏంటా ఈమా దత్షి రెసిపీ. ఏ కూరగాయాలకు సంబంధించిన వంటకం అంటే.. ఈమా దత్షి అనేధి భూటాన్ జాతీయ వంటకం.దీన్ని పచ్చి ఎర్ర మిరపకాయలు, చీజ్, మిరియాలు, ఉల్లిపాయలు, టొమాటోలతో కలిపి చేసే ఒక విధమైన రెసిపీ. దీన్ని లంచ్ లేదా డిన్నర్ టైంలో కర్రీగా తినదగిన రెసిపీ. దీన్ని ఎవ్వరైనా పదినిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆస్వాదించొచ్చు. ఎలా చేయాలంటే...? టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, నల్ల మిరియాలు తదితర పదార్థాలన్నింటిని తీసుకుని వాటిపై కాస్త నూనె పొయ్యండి. పాన్లో ఒక కప్పు నీరు పోసి పదార్థాలను బాగా కలపి పెద్దమంటపై ఉంచండి. అలాగే పాన్పై మూత పెట్టండి. వేడిని ఎక్కువ పెంచి పది నిమిషాలు ఉడకనివ్వండి. కూరగాయాలు ఉడికన తర్వాత మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది. వెంటనే స్టవ్ని మీడియంలో పెట్టి.. కాస్త నెయ్యి, కొద్దిగా చీజ్, కొద్దిగా మసాల వంటివి కూడా వెయ్యండి. అంతే ఈమా దత్షి రెడీ. ఇది అన్నం లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది. జొంగ్ఖా భాషలో ఈమా అంటే మిరపకాయ. ఇక దట్షి అంటే చీజ్ అని అర్థం. వాటితో చేసే రెసిపీ కాబట్టి దీన్ని 'ఈమా దత్షి' అని పిలుస్తారు భూటాన్ వాసులు. View this post on Instagram A post shared by Leaping Windows (@leapingwindows) (చదవండి: స్టన్నింగ్ బ్యూటీ శోభితా ధూళిపాళ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
Kalki 2898 AD: దీపికకు భారీ రెమ్యునరేషన్.. కెరీర్లోనే తొలిసారి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఒకరు. ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బీజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పటికే ఈ బ్యూటీ నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. ఈ మధ్యే ఫైటర్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె ‘కల్కి 2898 AD’ సినిమాలో నటిస్తున్నారు.ప్రభాస్ హీరోగా నటిస్తున్న సైంటిఫిక్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ఇది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికాతో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో నటించేందుకు దీపికా భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ కోసం దీపికాకు రూ.20 కోట్ల పోరితోషికం అప్పజెప్పారట మేకర్స్. దీపికా కెరీర్లో ఇదే అత్యధిక రెమ్యునరేషన్ అట. గతంలో ఒక్కో సినిమాకు రూ. 12-15 కోట్ల వరకు పారితోషికం తీసుకునేదట. ఈ చిత్రాకి ఎక్కువ కాల్షీట్లు కేటాయించాల్సి రావడంతో రూ.20 కోట్ల అడిగిందట. కీలక పాత్ర కావడంతో నిర్మాతలు కూడా దీపికా డిమాండ్కి ఓకే చెప్పారని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న విడుదల కానుంది. -
చివరి ఘట్టానికి చేరుకున్న ప్రభాస్ 'కల్కి'
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సైంటిఫిక్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోలు నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మేజర్ షెడ్యూల్ ఈ నెల రెండో వారంలో చిత్రీకరించేలా ప్లాన్ చేశారట నాగ్ అశ్విన్. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె.. ఇలా ఈ సినిమా ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం. ఈ షెడ్యూల్తో ఈ సినిమా ప్రధాన భాగం చిత్రీకరణ పూర్తవుతుందని టాక్. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న విడుదల కానుంది. -
‘ఫైటర్’తో 14వ సారి 100 కోట్ల క్లబ్ లోకి హృతిక్ రోషన్!
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో 14వ సారి 100 కోట్ల క్లబ్ లో చేరారు. ఈ చిత్రం విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ఈ ఘనత సాధించింది. ఈ చిత్రంతో హృతిక్ కి మరో రికార్డ్ కూడా దక్కింది. అగ్నిపథ్, కాబిల్ తర్వాత రిపబ్లిక్ డే కి విడుదలై 100 కోట్ల గ్రాస్ సాధించిన హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది. మంచి పాజిటివ్ టాక్, హృతిక్ రోషన్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో ఫైటర్ మూవీ ఆడియన్స్ ని అలరిస్తోంది. (చదవండి: ఆదిపురుష్..కొన్ని సీన్స్ నచ్చలేదు: ప్రశాంత్ వర్మ) ఓవర్సీస్ లో సైతం ఫైటర్ మూవీ అద్భుతంగా రాణిస్తోంది.వార్ తర్వాత సింగిల్ డే లో 40 కోట్లు సాధించిన హృతిక్ రెండవ చిత్రంగా ఫైటర్ రికార్డు సాధించింది. ఆస్ట్రేలియాలో సైతం హృతిక్ కెరీర్ లో ఫైటర్ హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన చిత్రంగా దూసుకుపోతోంది. ఫైటర్ చిత్రం సాధించిన రికార్డులు ఇంకా చాలానే ఉన్నాయి. హృతిక్ రోషన్ కెరీర్ లో ఫైటర్ చిత్రం వరుసగా 100 కోట్లు సాధించిన 10వ చిత్రంగా నిలిచింది. ఈ 100 కోట్ల పరంపర 2001లో కభీ ఖుషి కభీ గమ్ చిత్రంతో ప్రారంభం అయింది. ఈ చిత్రంతో పాటు క్రిష్, ధూమ్ 2, జోధా అక్బర్ చిత్రాలు కూడా అప్పట్లో 100 కోట్లు సాధించాయి. హృతిక్ రోషన్ కెరీర్ లో 100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలు లివే! కభీ ఖుషి కభీ గమ్ క్రిష్ ధూమ్2 జోధా అక్బర్ 5.జిందా న మిలేగా దోబారా అగ్నిపథ్ క్రిష్ 3 బ్యాంగ్ బ్యాంగ్ మొహంజదారో కాబిల్ 11,సూపర్ 30 వార్ విక్రమ్ వేద ఫైటర్ -
దీపికా పదుకొణ్ మసాలా సాంగ్ను తొలగించిన 'ఫైటర్' టీమ్
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్ జోడీగా నటించిన ఫైటర్ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైంది. భారీ యాక్షన్ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. సినిమా బాగుందని మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్తో రన్ అవుతుంది. కాగా, ఈ చిత్రం నుంచి ‘ఇష్క్ జైసా కుచ్’ సాంగ్ను తొలగించేశారు. ఈ సాంగ్ యూట్యూబ్లోకి వచ్చిన రోజు నుంచి దీపికా అందాలకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికే యూట్యూబ్లో సాంగ్ను చూసినవారు థియేటర్లో కూడా చూడొచ్చు అనుకుంటే ఫైటర్ మేకర్స్ షాక్ ఇచ్చారు. బిగ్ స్క్రీన్పై ఈ సాంగ్ కనిపించకపోయేసరికి వారిలో కొంతమేరకు నిరాశ కలిగింది. ఈ సాంగ్లో హీరోయిన్ దీపికా పదుకొణ్ విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. కానీ సినిమాలో ఆమె పాత్ర ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కీలకమైన పదవిలో ఉంటూ ఇలాంటి అసభ్యకరమైన సాంగ్లో చూపించడం కరెక్ట్ కాదని కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫైనల్గా ఆ సాంగ్ను దర్శక నిర్మాతలు సినిమా నుంచి తొలగించడం జరిగింది. గతంలో పఠాన్ సినిమాలో కూడా దీపికా పదుకొణ్ మితిమీరిన అందాల ప్రదర్శన ఇచ్చింది. అప్పుడు ఆమె దుస్తుల మీద కూడా వివాదం చెలరేగింది. కానీ ఆ సమయంలో షారుక్ ఖాన్ వివరణ ఇవ్వడంతో ఆ సాంగ్ థియేటర్లో కూడా రన్ అయింది. ప్రస్తుతం ఫైటర్ సినిమా విషయంలో ఎయిర్ ఫోర్స్ అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో ‘ఇష్క్ జైసా కుచ్’ సాంగ్ను తొలగించేశారు. యూట్యూబ్లో మాత్రం ఈ సాంగ్ను చూడవచ్చు. సినిమా చూసిన తర్వాత ఇలాంటి దేశభక్తి సినిమాలో ఆ సాంగ్ లేకపోవడమే మంచిదని కూడా కామెంట్లు వస్తున్నాయి. -
శింబుతో జతకట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!
తమిళ హీరో శింబు నటించిన చివరి చిత్రం పత్తుతల. ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో ఈయన తర్వాత చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శింబు కథానాయకుడిగా కమల్ హాసన్ ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి దేశింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారట. ఈయన చెప్పిన కథ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖ స్టార్స్ను మెప్పించిందని, ఇందులో రజనీ నటించాల్సిందని ప్రచారం జరిగింది. హీరో, విలన్.. అన్నీ ఒక్కడే అలాంటి కథలో ఇప్పుడు శింబు నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రం కోసం శింబు కరాటే వంటి విద్యల్లో శిక్షణ పొందడం విశేషం. ఇది పీరియాడికల్ కథా చిత్రంగా ఉంటుందని టాక్. ఈ మూవీలో శింబు హీరో, విలన్ పాత్రను తనే పోషించనున్నారని టాక్! ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ మోస్ట్ టాప్ హీరోయిన్గా రాణిస్తున్న దీపికాపదుకొనే, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ క్వీన్తో.. హీరోకు జంటగా కీర్తీసురేశ్, విలన్ సరసన దీపికా పదుకొనే నటించబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఇది నిజంగానే భారీ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రమవుతుంది. దీపికా పదుకొనే చాలా గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్ ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా పలకరించనున్నారన్నమాట. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్లను ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది: మెగాస్టార్ ఎమోషనల్ -
హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాపై పబ్లిక్ టాక్
బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం ఫైటర్.దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. భారీ యాక్షన్ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఫైటర్ చిత్రంపై బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. సినిమా చాలా బాగుందని ఆయన తెలపారు. ఫైటర్ సినిమాను చాలా బ్రిలియంట్గా తెరకెక్కించాడని ఆయన తెలిపారు. ఈ సినిమాను మిస్ చేసేకోవద్దని ఆయన చెప్పారు. సోషల్మీడియాలో ఫైటర్ సినిమాకు 4.5 రేటింగ్ ఇచ్చారు.సినిమాకు అంతగా బజ్ లేకపోడంతో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేవని ఆయన తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ చిత్రం ద్వారా హ్యట్రిక్ కొట్టారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్తో పాటు డ్రామా, ఎమోషన్స్, దేశభక్తి అన్నీ ఉన్నాయని తెలిపారు. సినిమా కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నారు. హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాలో షో టాపర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు తరణ్ ఆదర్శ్. దీపికా పదుకోన్తో ఆయన కెమిస్ట్రీ సూపర్ అంటూ పేర్కొన్నారు. అనిల్ కపూర్ ఎప్పటిలా అద్భుతంగా నటించారని చెప్పారు. సెకండాఫ్ ఫైటర్ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని తెలిపారు. ఇందులో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే డైలాగ్స్ ఉన్నట్లు చెప్పారు. హృతిక్ రోషన్ భారీ హిట్ కొట్టాడని మాస్ కా బాప్ అంటూ ఈ చిత్రంలోని బీజీఎమ్ సూపర్ అని నెటిజన్లు తెలుపుతున్నారు. ఫైటర్ సినిమా మెగా బ్లాక్ బస్టర్ అని ఈ చిత్రంలోని గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ పనితీరు చాలా బాగుందని ఒక నెటిజన్ తెలిపాడు. దేశభక్తి ఉన్న ఇలాంటి ఏరియాల్ యాక్షన్ను ఇంతవరకు చూడలేదని ఒక నెటిజన్ తెలిపాడు. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. దీపికా పదుకొణె తన కెరీర్లో ఈ చిత్రం బెస్ట్గా ఉంటుంది. అనిల్ కపూర్ ఫైటర్ సినిమాకు ఆత్మలాంటివాడు. హృతిక్ రోషన్కు భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టే సినిమా అని నెటిజన్లు తెలుపుతున్నారు. #OneWordReview...#Fighter: BRILLIANT. Rating: ⭐️⭐️⭐️⭐️½#War. #Pathaan. Now #Fighter. Director #SiddharthAnand scores a hat-trick… Aerial combat, drama, emotions and patriotism, #Fighter is a KING-SIZED ENTERTAINER, with #HrithikRoshan’s bravura act as the topping… JUST DON’T… pic.twitter.com/t9fmssfw2P — taran adarsh (@taran_adarsh) January 24, 2024 Baap Level Entry of #HrithikRoshan BGM + Greek God Screen Present is Totally Goosebumps, Goosebumps. MASS KA BAAP 🔥🔥🔥#FighterReview #Fighter #HrithikRoshan𓃵 pic.twitter.com/n92lKNlG1L — AMIR ANSARI (@amirans934) January 25, 2024 #FighterReview - ⭐⭐⭐⭐⭐ Lots of Action, VFX is Top Level, and Storytelling is Masterclass, best movie of #HrithikRoshan𓃵 Career. A MUST WATCH 🔥🔥🔥#HrithikRoshan #Fighter pic.twitter.com/Grl1RTPriE — FMOVIES 🎥 (@FMovie82325) January 24, 2024 EXCLUSIVE 🚨🚨🚨 #Fighter Public Review Action Sequences are never seen before Once in a lifetime experience for Everyone #SiddharthAnand #HrithikRoshan#FighterReview#FighterOn25thJan #FighterFirstDayFirstShowpic.twitter.com/txIAHM8tcM — The Unrealistic Guy (@Guy_Unrealistic) January 25, 2024 FIGHTER RECEIVED EXCELLENT RESPONSE IN AUSTRALIA AND NEW ZEALAND 🔥🔥 People Call it Dhamaka of Entertainment and Patriotism 🇮🇳🇮🇳#FighterFirstDayFirstShow #FighterReview #Fighter https://t.co/dFow4B2YG1 — Anand Abhirup 📌 🧡 🦩 (@SanskariGuruji) January 25, 2024 #Fighter is a MASTERPIECE and a MEGA BLOCKBUSTER Film filled with a lot of Action, Drama, emotions and full-on patriotism. From Hrithik performance to the direction Everything was so good about the movie. This will take the Box office by storm. Rating - 5/5 #FighterReview pic.twitter.com/RG1w74ZvN5 — Renjeev Chithranjan (@RenjeevC) January 25, 2024 #FighterReview 1st half done: It’s okay so far those who have seen top gun but built up is nice.#HrithikRoshan𓃵 entry will have whistles and that arrogance is just amazing Hrithik and #DeepikaPadukone has better chemistry on screen than promos. — MeerajRules (@meerajrules) January 25, 2024 -
ఫైటర్ మూవీ ట్రైలర్
-
స్టార్ హీరో దేశభక్తి సినిమాపై వివాదం.. ఆ దేశాల్లో నిషేధం
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫైటర్'. దేశభక్తి నేపథ్యంలో తీసిన ఈ యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీ.. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న అంటే గురువారమే థియేటర్లలోకి రానుంది. హిందీలో ఒకింత పర్లేదు గానీ తెలుగులో అసలు ఈ మూవీ ఒకటి వస్తుందని కూడా చాలామందికి తెలియదు. అలాంటిది విడుదలకు కొన్ని గంటల ముందు ఈ చిత్రబృందానికి మరో షాక్ తగిలింది. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) బాలీవుడ్ మరీ దారుణంగా తయారవుతోంది. ఈ మధ్య కాలంలో దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ తరహా మూవీస్ మరీ ఎక్కువైపోతున్నాయి. పఠాన్, టైగర్.. ఇలా లెక్కకు మించి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఇలాంటి కథతోనే తీసిన ఏరియల్ యాక్షన్ మూవీ 'ఫైటర్'. హృతిక్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ లాంటి స్టార్స్ నటించారు. అలానే 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ చిత్రంపై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. యూఏఈ మినహా దాదాపు గల్ఫ్ దేశాలన్నింట్లోనూ 'ఫైటర్' సినిమాపై నిషేధం విధించారు. సాధారణంగా తీవ్రవాదం లేదా భారత్-పాకిస్థాన్ వివాదాల లాంటి అంశాలతో తీసిన చిత్రాల్ని గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేస్తుంటారు. రీసెంట్గా సల్మాన్ 'టైగర్ 3' ఇలానే నిషేధానికి గురవగా, ఇప్పుడు 'ఫైటర్'కి అలాంటి పరిస్థితే ఎదురైంది. యూఏఈలో మాత్రం పీజీ 15 వర్గీకరణతో సెన్సార్ ఆమోదించారు. ఇకపోతే గల్ఫ్ కంట్రీస్లో నిషేధం వల్ల 'ఫైటర్' మూవీకి మిలియన్ డాలర్ల వసూళ్లు నష్టం ఉండే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
అబ్బురపరిచే విజువల్స్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ట్రైలర్!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటిస్తోన్న తాజా చిత్రం ఫైటర్. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్గా కనిపించనున్నారు. 2019లో జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ట్వీట్ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో హృతిక్ రోషన్ ప్రేక్షకులకు అభిమానులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. గతంలో లక్ష్య చిత్రంలో హృతిక్ రోషన్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్గా మెప్పించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్గా ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ట్రైలర్ చూస్తే హృతిక్ రోషన్ పెర్ఫామెన్స్, డైలాగులు అభిమానుల్లో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషన్తో హృతిక్ రోషన్ నటన ఆకట్టుకుంటోంది. ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్లో బాలీవుడ్ హీరో లుక్స్ సూపర్గా ఉన్నాయి. ఫైటర్ జెట్ పైలెట్గా హృతిక్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు సరికొత్త అనుభూతిని కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియా 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందే జనవరి 25న ఫైటర్ చిత్రం రిలీజ్ అవుతోంది. హృతిక్ రోషన్ నుంచి వస్తున్న తొలి 3డీ చిత్రం ఇదే. ఫైటర్ మూవీని 3డీ ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందించారు. కాగా.. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. दिल आसमान के नाम, और जान देश के नाम । जय हिन्द! 🇮🇳#FighterTrailer OUT NOW. https://t.co/8b4COYyiWy#Fighter Forever. #FighterOn25thJan releasing worldwide. Experience on the big screen in IMAX 3D. pic.twitter.com/ANMv5FreCv — Hrithik Roshan (@iHrithik) January 15, 2024 -
1000 కోట్ల హీరోయిన్..!
-
పాన్ ఇండియా హీరోలతో పోటీ పడుతున్నా దీపికా
-
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అంటూ ప్రభాస్ పోస్ట్
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో దీపికా పదుకొణె ఒకరు. భారతదేశంలోనే టాప్ హీరోయిన్గా ఆమె కొనసాగుతుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ మెంబర్గా వ్యవహరించి ప్రపంచానికి తానేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో వ్యాఖ్యాతగా మెరిసింది. ఇలా తన జీవితంలో ఎన్నో విజయాలను అందకున్న ఈ బ్యూటీ నేడు (జనవరి 5) 38వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమ, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా హీరో ప్రభాస్ కూడా ఆమెకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీపికను 'అత్యంత అందమైన నటి' అని ప్రభాస్ పేర్కొన్నాడు. భవిష్యత్తు రోజులు అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. వీరిద్దరూ కలిసి సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్ ప్రధానంగా ఇందులో నటించారు. ఈ చిత్రం ప్రతిష్టాత్మక శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)లో కూడా ప్రదర్శించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్, దీపికా అభిమానులు కొత్త సినిమాపై చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం 'సలార్' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బర్త్ డే గర్ల్ దీపికా పదుకొనే నటించిన ఫైటర్ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. హృతిక్ రోషన్ తో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్న 'ఫైటర్' ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్తో కూడా 'ది ఇంటర్న్' ప్రాజెక్ట్పై దీపిక సంతకం చేసింది. ఇలా ఈ బ్యూటీ చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. -
Deepika Padukone: రెడ్ డ్రెస్ లో సొగసులు ఆరబోసిన అందాల తార దీపికా
-
Deepika Padukone Unseen Photos: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె బర్త్డే స్పెషల్.. ఈ రేర్ ఫొటోలు చూశారా?
-
పిల్లలను కనడంపై దీపికా పదుకొణె ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ లిస్ట్లో దీపికా పదుకొణె-రణ్వీర్ సింగ్ జంట ఒకటి. ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన రణ్ వీర్ సింగ్, దీపికా.. 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ జంట తమ ఐదో వివాహ వార్షికోత్సవాన్ని బెల్జియంలో ఘనంగా జరుపుకుంది. అయితే పెళ్లి చేసుకొని ఐదేళ్లు గడుస్తున్నా..ఇప్పటి వరకు ఈ జంటకు పిల్లలు లేరు. వరుస సినిమాలతో బిజీగా ఉండడం కారణంగా కొన్నాళ్ల పాటు పిల్లలను కనకుండా ఉండాలని ఈ జంట భావించిందట. అయితే ఇప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై దీపికా పదుకొణె పరోక్షంగా స్పందించారు. పిల్లలు అంటే తనతో పాటు రణ్వీర్కు చాలా ఇష్టమని, సొంత కుటుంబాన్ని ప్రారంభించడం కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని చెప్పింది. అంతే కాదు తన పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నారో కూడా దీపికా చెప్పుకొచ్చింది. ‘నేను ఇప్పుడు ఎవరినైనా కలిస్తే చాలా ఎదిగిపోయావని పొగిడేస్తుంటారు. కానీ మా బంధువులు మాత్రం నన్ను ఒక సెలెబ్రిటీలా ట్రీట్ చేయరు. సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నావో..ఇప్పుడు అలానే ఉన్నావని అంటుంటారు. మొదట నేను ఒక కూతురిని.. ఒక సోదరిని.. ఆ తర్వాతే సెలబ్రెటీని! ఫేమ్ వచ్చాక మన ప్రవర్తనలో మార్పు రాకూడదు. మా పేరెంట్స్ నన్ను అలానే పెంచారు. మా పిల్లల్ని కూడా రణ్వీర్, నేను అలానే పెంచాలనుకుంటున్నాం. మా పిల్లలకు మంచి విలువలు నేర్పించాలనుకుంటున్నాం’అని దీపికా చెప్పుకొచ్చింది. దీపికా సినిమాల విషయాకొస్తే.. పఠాన్, జవాన్ చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కీ 2898’తో పాటు శెట్టి దర్శకత్వంలో 'సింగం ఎగైన్'లోనూ నటిస్తోంది. -
న్యూ బ్రాండ్ అంబాసిడర్గా దీపికా పదుకొనె.. ఏ కంపెనీకంటే..
ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనెను తమ కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. షారుక్ ఖాన్ తర్వాత దీపికా పదుకొనెను రెండో బ్రాండ్ అంబాసిడర్గా హ్యుందాయ్ ఇండియా నియమించుకున్నట్లు తెలిపింది. షారుక్ ఖాన్ స్థానంలో దీపికా పడుకొనె తమ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతుందా లేక ఇద్దరూ కలిసి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తారా అనే విషయంలో కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసాధారణ నైపుణ్యం, నటనా సామర్థ్యం కలిగిన గ్లోబల్ ఇండియన్ ఐకాన్ దీపికా పడుకొనెను తమ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు. ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు ఆమె తిరుగులేని ఆకర్షణ శక్తి, అద్భుతమైన కెరియర్ హ్యుందాయ్ మోటార్ ఇండియాకు ఉపయోగపడుతుందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. హ్యుందాయ్ మోటార్ ఇండియా జనవరి 2021 నాటికి భారతదేశంలో 17% మార్కెట్ వాటాను కలిగి ఉంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని అనుబంధ సంస్థ కియాతో కలిసి 2022లో భారతదేశంలో 10 లక్షల కార్లను తయారుచేసింది. ఈ రెండు కంపెనీలు కలిసి ప్రస్తుతం దేశంలో దాదాపు 23% వాటాను కలిగి ఉన్నాయి. -
ఇష్క్ జైసా కుచ్..
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా రూపొందిన చిత్రం ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ‘ఇష్క్ జైసా కుచ్..’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ‘‘హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ల మధ్య వచ్చే ఫుల్ రొమాటింక్ సాంగ్ ‘ఇష్క్ జైసా కుచ్..’. దీపిక, హృతిక్ డ్యాన్స్ అదరగొట్టారని ప్రేక్షకులు అంటారు. ఈ సినిమాలో హృతిక్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా (పాటీ) కనిపించనుండగా, స్క్వాడ్రన్ లీడర్ మిన్నీగా (దీపికా) కనిపిస్తారు’’ అని మేకర్స్ అన్నారు. -
ఫైటర్ మూవీ నుంచి కొత్త సాంగ్ రిలీజ్..
-
హృతిక్-దీపిక రొమాంటిక్ సాంగ్.. రెచ్చిపోవడంలో పీక్స్!
బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న సినిమా 'ఫైటర్'. 'వార్', 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ సాగుతున్నాయి. (ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'ఇష్క్ జైసా కుచ్' అని సాగే ఓ రొమాంటిక్ వీడియో గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటలో హృతిక్, దీపిక ఫుల్ రొమాటింక్ మోడ్లో రెచ్చిపోయారు. ఇక వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించైతే చెప్పడానికి ఇంకేం లేదు. అంతలా అదరగొట్టేశారు! వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు 'ఫైటర్' సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హృతిక్.. స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా.. దీపిక పదుకొణె స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా కనిపించనున్నారు. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్ కపూర్ సందడి చేయనున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుక్కి పెళ్లి కుదిరిందా?) -
100 కోట్లు కొల్లగొడుతున్న భార్య,భర్తలు
-
హృతిక్ రోషన్, దీపికా పదుకొనె 'ఫైటర్' నుంచి పార్టీ సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఫైటర్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ఎక్కువగా ఏరియల్ యాక్షన్ సన్నివేశాలే ఉండనున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నాటి నుంచి అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్గా నిర్మిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా దీనిని 2024 జనవరి 25న గ్రాండ్గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. తాజాగా ఫైటర్ మూవీ నుంచి "షేర్ కుల్ గయ" అనే పార్టీ సాంగ్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇందులో హృతిక్ రోషన్ , దీపికా పదుకొనె డాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ను ఫిదా చేస్తున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ , హృతిక్ రోషన్ కాంబినేషన్లో గతంలో 'బ్యాంగ్ బ్యాంగ్, వార్' సినిమాలు వచ్చాయి. అవి రెండూ కూడా సంచలన విజయాలు సాధించాయి, ఆ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మరింత ఎక్కువ అంచనాలతో ఫైటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.