దీపికా పదుకోనె, రణ్ వీర్ సింగ్ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు.
2018లో ఎంతో ఘనంగా వారిద్దరి పెళ్లి జరిగింది. అయితే, 2024 ఫిబ్రవరిలో దీపికా ప్రెగ్నెంట్ అని పంచుకున్నారు.
దీపికా ప్రెగ్నెంట్ కాదని.. బేబీ బంప్ ఫేక్ అంటూ కొందరు నెటిజన్లు పోస్ట్లు పెట్టారు
నెటిజన్ల కామెంట్లను చాలామంది ప్రముఖులు తప్పుపట్టారు.
దీపిక పదుకోనె సెప్టెంబర్ 28న బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తోంది.
ముంబయిలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.. కానీ మొదట ప్రసవం కోసం వారు లండన్కు వెళ్లనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
గత ఆరు నెలలుగా షూటింగులకు దూరంగా ఉన్న దీపికా.. వచ్చే ఏడాది మార్చిలో తిరిగి షూటింగ్స్లో పాల్గొనాలని చూస్తుంది.
దీపికా చివరిసారిగా కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న సింగం ఎగైన్లో రణ్వీర్ సింగ్తో కలిసి కనిపించనుంది.


