breaking news
Raj Nidimoru
-
దుబాయ్ ట్రిప్లో సమంత.. ఆమెతో పాటే అతను కూడా!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం దుబాయ్లో చిల్ అవుతోంది. ఓ ప్రైవేట్ ఈవెంట్కు హాజరైన ముద్దుగుమ్మ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇవీ చూసిన నెటిజన్స్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఫోటోల్లో మరో వ్యక్తి కనిపించడంతో మరోసారి చర్చకు దారితీసింది. షూటింగ్ చేస్తూ సమంత కనిపించగా.. అందులో ఉన్నది కచ్చితంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరు అని కామెంట్స్ పెడుతున్నారు. సామ్ ఫోటోలను కూడా అతనే తీశాడని రాసుకొస్తున్నారు.ఈ ఫోటోలు వైరల్ కావడంతో అబుదాబి సెలవులకు బాయ్ఫ్రెండ్తో కలిసి సమంత చిల్ అవుతున్నారని పలువురు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గత కొన్ని నెలలుగా సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్పై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. పలు సందర్భాల్లో వీరిద్దరు జంటగా కనిపించడంతో ఆ వార్తలు తెగ వైరలయ్యాయి. ఇటీవల రాజ్ భార్య భార్య శ్యామలి దే సైతం సమంతతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని ఉద్దేశించి పోస్ట్ రాశారు. అయితే తమ రిలేషన్పై ఇప్పటి వరకు సమంత కానీ.. రాజ్ కానీ స్పందించలేదు.ఇటీవల విడుదలైన సమంత నిర్మించిన శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడిమోరు పాల్గొన్నారు. అంతకుముందు సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2','సిటాడెల్: హనీ బన్నీ'వెబ్ సిరీస్ల్లో రాజ్ నిడిమోరుతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరు నెట్ఫ్లిక్స్ రానున్నా 'రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్' కోసం జతకట్టారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత- రాజ్ డేటింగ్ రూమర్స్.. డైెరెక్టర్ భార్య పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా చేసిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది. జిమ్లో వర్కవుట్స్తో పాటు పికిల్ బాల్ ఆడుతున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరుతో పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. అలా మరోసారి ఇద్దరు కలిసి జంటగా కనిపించడంతో డేటింగ్పై చర్చ మొదలైంది. ఇటీవల శుభం మూవీ రిలీజ్ తర్వాత విమానంలో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోను సామ్ షేర్ చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.తాజాగా ఈ వీడియో చూసిన తర్వాత డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామలి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. 'అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది.. కర్మ వాటిని సరిదిద్దుతుంది.. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది' అంటూ ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చింది. గతంలో కూడా ఆమె వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ వార్తలపై పరోక్షంగా స్పందించారు.కాగా.. శుభం మూవీ సక్సెస్ తర్వాత విమానంలో సమంత షేర్ చేసిన ఫోటో చూశాకే రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడిమోరు కనిపించారు. అంతకుముందు ఇద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కానీ ఇప్పటివరకు తమపై వస్తున్న వార్తలపై సమంత కానీ.. రాజ్ కానీ స్పందించలేదు. మరోవైపు సమంత, రాజ్ ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' అనే కొత్త ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, జైదీప్ అహ్లవత్, వామికా గబ్బి, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
డైరెక్టర్తో సమంత డేటింగ్.. మరోసారి అతనితో కలిసి!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన సొంత బ్యానర్లో శుభం అనే మూవీని నిర్మించింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా సక్సెస్ కావడంతో సమంత సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలో తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది.అయితే గత కొద్దికాలంగా హీరోయిన్ సమంతపై డేటింగ్ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పలుసార్లు జంటగా కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ఇటీవల విమానంలో రాజ్ నిడిమోరుతో క్లోజ్గా ఉన్న ఫోటో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఇవీ చూసిన నెటిజన్స్ వీరిద్దరు డేటింగ్లో ఉన్నది నిజమేనా? అనే డైలామాలో పడ్డారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ వార్తలపై స్పందించలేదు.తాజాగా సమంత డేటింగ్పై చర్చ మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను దీనికి కారణం. హ్యాపీ వీకెండ్ అంటూ జిమ్లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోలతో పాటు ఫోటోలు కూడా పంచుకుంది. వీటిలో రాజ్ నిడిమోరుతో కలిసి సామ్ పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. కోర్టులో ఇద్దరు పికిల్ బాల్ ఆడుతూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిపై నెట్టింట మరోసారి చర్చ మొదలైంది. శుభం మూవీ విడుదలకు ముందు ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే.కాగా.. సమంత, రాజ్ నిడిమోరు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీసుల్లో కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరు 'రక్త బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్' అనే చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
డేటింగ్లో సమంత.. స్పందించిన మేనేజర్
సౌత్ ఇండియా పాపులర్ నటి సమంత డేటింగ్లో ఉన్నారని జరుగుతున్న ప్రచారంపై తన మేనేజర్ స్పందించారు. తాజాగా తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ (Subham) విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సమంత అతిథి పాత్రలో నటించారు. మూవీ విడుదల సమయంలో ప్రమోషన్స్లో భాగంగా ఆ చిత్ర యూనిట్తో పాటు దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. రాజ్- సమంత ఇటీవల తరచూ ఒకే చోట కనిపించడంతో కొద్దిరోజులుగా రూమర్స్ వచ్చాయి. తాజా ఫొటోతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. వారు డేటింగ్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్పై సమంత మేనేజర్ స్పందించారు.డైరెక్టర్ రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మేనేజర్ అన్నారు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనంటూ తెలిపారు. సమంత నిర్మించిన శుభం సినిమా ప్రమోషన్స్ సమయంలో తీసిన ఫోటోలను ఇలా తప్పుడు వార్తలకు లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్ తన కూతురితో పాటు సమంతతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడని వచ్చిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. అసలు ఆయనకు కూతురే లేదన్నారు. తనతో పాటు ఉన్న అమ్మాయి కోడైరెక్టర్ కృష్ణ డీకే కూతురని చెప్పుకొచ్చారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని సమంత మేనేజర్ కోరారు. -
రాజ్ భుజంపై వాలిన సమంత.. దర్శకుడి భార్య పోస్ట్ వైరల్!
దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru), హీరోయిన్ సమంత(samantha) ప్రేమలో ఉన్నారనే వార్త గతకొంత కాలంగా నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటో ఒకటి ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఆమె నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ సక్సెస్ సెలెబ్రేషన్స్లో భాగంగా చిత్రబృందం రాజ్ నిడిమోరుతో కలిసి ఫోటోలు దిగింది. వాటిని సమంత తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా..అవికాస్త వైరల్గా మారాయి. రాజ్ భుజంపై వాలిన సమంత ఫోటోపై నెటిజన్లు రకరకాలు స్పందించారు. వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతారని, ఈ విషయాన్ని చెప్పడానికే సమంత ఆ ఫోటోని షేర్ చేసిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేశారు. వారిద్దరు డేటింగ్లో ఉన్నారనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ్ సతీమణి శ్యామాలి(Shhyamali De) తాజాగా ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసే వారందరికీ ప్రేమతో ఆశీస్సులు పంపుతున్నాను’అని అమె ఇన్స్టాలో రాసుకొచ్చారు. కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న శ్యామాలి సమంత ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ఆమెను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. శ్యామాలి ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టారనేది తెలియదు కాని..నెటిజన్స్ మాత్రం సమంత,రాజ్ల గురించే ఈ పోస్ట్ పెట్టారని కామెంట్ చేస్తున్నారు. కాగా, రాజ్, శ్యామాలిల వివాహం 2015లో జరిగింది. వీరిద్దరి ఒక పాప కూడా ఉన్నారు. పెళ్లికి ముందు శ్యామాలి బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఓం ప్రకాశ్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేశారు. వివాహం తర్వాత రాజ్ రూపొందించిన చిత్రాలకు సంబంధించి ఆమె క్యాస్టింగ్లో సాయం చేస్తుండేవారు. అయితే గతకొంత కాలంగా రాజ్, శ్యామాలి మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే వారిద్దరు అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. -
అతనితో రిలేషన్లో సమంత.. ఆ ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందా?
సమంత ఇటీవల నిర్మాతగా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన సొంత బ్యానర్లో నిర్మించిన శుభం మూవీతో నిర్మాతగా మారిపోయింది. మే 9న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ను సామ్ ఎంజాయ్ చేస్తోంది. హీరోయిన్గా మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా తనకు ఎదురలేదని చెబుతోంది సమంత. అయితే తాజాగా శుభం సినిమా వీక్షించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫోటోల్లో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా సామ్తో పాటే ఉన్నారు. శుభం వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.అయితే గత కొద్దికాలంగా సమంతపై డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య రెండో పెళ్లి తర్వాత ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి. దీనికి కారణం సిటాడెల్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరు. అతనితో ఇప్పటికే సమంత చాలాసార్లు పలు వేదికలపై జంటగా కనిపించింది. పికిల్ బాల్ లీగ్లో వీరిద్దరూ ఒక్కసారిగా వేదికపై మెరిశారు. అప్పుడు కూడా రాజ్తో సామ్ డేటింగ్లో ఉందని వార్తలొచ్చాయి.తాజాగా మరోసారి శుభం మూవీని సమంత, రాజ్ కలిసి వీక్షించిన ఫోటోలు షేర్ చేయడంతో నెట్టింట చర్చ మొదలైంది. అంతేకాకుండా ఈ ఫోటోల్లో విమానంలో రాజ్ భుజాలపై సన్నిహితంగా కనిపిస్తూ పోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోతో రిలేషన్ను అఫీషియల్గా ప్రకటించారంటూ పోస్టులు పెడుతున్నారు. మరో నెటిజన్స్ ఈ జంటకు సామ్రాజ్ అనే కొత్త పేరు బాగుంటుందని కామెంట్ చేశాడు. ఏదేమైనా వీరిద్దరు కలిస్తే డేటింగ్ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ వీటికి ఫుల్స్టాప్ పడేలా కనిపించడం లేదు. కాగా. గతంలో తిరుమలకు వెళ్లిన సమయంలోనూ సమంత, రాజ్ నిడిమోరు జంటగా కనిపించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత
గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత విడాకులు తీసుకుంది. ఇది జరిగి దాదాపు నాలుగేళ్లు గడిచిపోయాయి. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది. కానీ గత కొన్నిరోజుల క్రితం సమంత పెళ్లి గురించి రూమర్స్ వినిపించాయి. ఇప్పుడదే దర్శకుడితో మళ్లీ కనిపించడం, ఆ ఫొటోలని పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.విడాకుల తర్వాత సమంత.. తాను మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాననే విషయాన్ని బయటపెట్టింది. మధ్యలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేసింది. ఇది తప్పితే మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ వెబ్ సిరీసులో నటించిందంతే.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) సరే అసలు విషయానికొస్తే.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రెండో సీజన్ లో సమంత నటించింది. ఈ సిరీస్ చేసిన దర్శకుల్లో ఒకరైన రాజ్ తో రీసెంట్ టైంలో సమంత ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూనే ఉంది. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ కలిసి తిరుపతి కూడా వెళ్లొచ్చారు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వినిపించాయి. సామ్ నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి ఇది రూమర్ గానే మిగిలిపోయింది.తాజాగా న్యూ బిగినింగ్స్ అని ఓ పోస్ పెట్టింది. ఇందులో తన త్రలాలా నిర్మాణ సంస్థ గురించి, తాను నిర్మించిన శుభం మూవీ గురించి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులోనూ రాజ్ తో సమంత దిగిన కొన్ని ఫొటోలు కనిపించాయి. దీంతో బయట వినిపిస్తున్న రూమర్స్ ని ఏమైనా నిజం చేస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఆ డైరెక్టర్తో తిరుమలకు సమంత.. వీడియో వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం నిర్మాతగా అభిమానుల ముందుకు రానుంది. ఆమె నిర్మించిన తాజా చిత్రం శుభం త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే గత కొద్ది కాలంగా వ్యక్తిగత విషయాలతొనే వార్తల్లో నిలుస్తోంది. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తర్వాత.. సమంతపై పెద్దఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ సిరీస్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సామ్ డేటింగ్లో ఉందంటూ చాలాసార్లు కథనాలొచ్చాయి. ఇటీవల పికిల్ బాల్ లీగ్లోనూ వీరిద్దరూ జంటగా కనిపించారు. ఆ తర్వాత కోలీవుడ్లో బీహైండ్వుడ్స్ అవార్డ్స్ ఫంక్షన్లో రాజ్ నిడిమోరు, సమంత సందడి చేశారు. కొంతకాలంగా ఈవెంట్స్లో కనిపించడంతో ఆ రూమర్స్కు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని టాక్ కూడా వినిపిస్తోంది.ఈ వార్తల నేపథ్యంలో సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్షిప్ మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సమంత, రాజ్ నిడిమోరు సంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. దీంతో మరోసారి వీరిద్దరి డేటింగ్పై చర్చ మొదలైంది. అయితే ఈ రూమర్స్పై ఇప్పటి వరకు సమంత, రాజ్ ఒక్కసారి కూడా స్పందించలేదు. వీరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఇప్పట్లో రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు.కాగా.. రాజ్ డైరెక్షన్లో సామ్ 'సిటాడెల్: హనీ బన్నీ, 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' (2021) అనే రెండు ప్రాజెక్ట్ల్లో నటించింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' లోనూ సమంత నటిస్తోంది. సమంత చివరిసారిగా వరుణ్ ధావన్తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్లో కనిపించింది. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
బర్త్ డే పార్టీలో జంటగా సమంత, రాజ్ నిడిమోరు.. మరోసారి డేటింగ్ వార్తలు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే చెన్నైలో జరిగిన బిహెండ్వుడ్స్ హాల్ ఆప్ ఫేమ్ అవార్డుల వేడుకకలో మెరిసింది. ఈ వేదికపై సిటాడెల్ వెబ్ సిరీస్లో నటనకు అవార్డ్ కూడా అందుకుంది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో ప్రత్యేకమైన అవార్డ్తో సమంతను సత్కరించారు. అయితే ఈ వేడుకల్లో సిటాడెల్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరు సైతం సందడి చేశారు. సమంతతో కలిసి వేదికపై కనిపించారు.అయితే గత కొన్ని నెలలుగా సమంత- రాజ్ నిడిమోరుపై డేటింగ్ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే పికిల్ బాల్ టోర్నమెంట్లోనూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ సమయంలోనూ సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. తాజాగా మరోసారి సామ్- రాజ్ నిడిమోరు ఓ పార్టీలో మెరిశారు. తన స్నేహితురాలు, డిజైనర్ క్రేషా బజాజ్ పుట్టినరోజు వేడుకలకు సమంత, నిడిమోరు హాజరయ్యారు. దీంతో మరోసారి వీరిద్దరిపై నెట్టింట చర్చ మొదలైంది. నెల రోజుల్లోపే రెండోసారి జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. తాజాగా వీరిద్దరు కలిసి బర్త్ డే పార్టీలో దిగిన ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఏదేమైనా సమంత, రాజ్ నిడిమోరు క్లారిటీ ఇస్తే కానీ ఈ వార్చలకు ఇప్పట్లో చెక్ పడేలా లేదు. అయితే తమపై వస్తున్న డేటింగ్ రూమర్స్పై ఇప్పటి వరకు సామ్ కానీ, రాజ్ ఎవరూ కూడా స్పందించలేదు.ఇక సినిమాల విషయానికొస్తే సమంత గతేడాది సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీలో కనిపించింది. ఈ సిరీస్లో వరుణ్ ధావన్కు జోడీగా నటించింది. ప్రస్తుతం సమంత తెలుగులో ఓ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది. -
ఆ డైరెక్టర్తో సమంత.. వైరల్గా మారిన ఫోటోలు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. టాలీవుడ్లో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ వెబ్ సిరీస్లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన కనిపించింది. అయితే ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు సామ్.అయితే మరోవైపు పికిల్ బాల్ టోర్నమెంట్తో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. గతంలోనే చెన్నై సూపర్ ఛాంప్స్ టీమ్ను కొనుగోలు చేసిన సమంత తన జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ పికిల్ బాల్ టోర్నమెంట్లో సమంత సందడి చేసింది. తన టీమ్కు సపోర్ట్ చేస్తూ కనిపించింది.రాజ్ నిడిమోరు చేయి పట్టుకుని..అయితే ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్ టోర్నమెంట్లో మెరిసింది. ఇద్దరు జంటగా కనిపించి సందడి చేశారు. దీంతో మరోసారి వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. గతంలోనే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓకే వేదికపై జంటగా కనిపించడంతో డేటింగ్లో రూమర్స్ నిజమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు ఆమె షేర్ చేసిన ఫోటోల్లో దర్శకుడి చేతిని పట్టుకున్నట్లు సామ్ కనిపించింది. దీంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరింత బలపడుతున్నాయి. కాగా.. వీరిద్దరు సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్లో కలిసి పనిచేశారు. అప్పటి నుంచే ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత, రాజ్ కలిసి పికిల్ బాల్ టోర్నీలో సన్నిహితంగా ఉండడం చూసిన ఫ్యాన్స్ సామ్ డేటింగ్లో మునిగి తేలుతోందంటూ పోస్టులు పెడుతున్నారు. -
సమంతతో డేటింగ్ రూమర్స్.. అసలు ఎవరీ రాజ్?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడనున్నారు. అయితే చైతూ నిశ్చితార్థం తర్వాత అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంతపై పడింది. ఇంతకీ ఆమె రియాక్ట్ అవుతుందా? లేదా అని ఫ్యాన్స్ వేచిచూశారు. కానీ చైతూ ఎంగేజ్మెంట్ గురించి సోషల్ మీడియాలో ఎక్కడా పోస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే సమంతపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. దీంతో అసలు సమంతకు రాజ్ ఎలా పరిచయం? అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ అతని పూర్తి వివరాలేంటో ఓ లుక్కేద్దాం.రాజ్ నిడిమోరు ప్రస్థానమిదేఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జన్మించిన రాజ్ నిడిమోరు జన్మించారు. ఇంజనీరింగ్ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. తన స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్ ఫిల్స్మ్ అనే బ్యానర్ను స్థాపించారు. మొదట వీరిద్దరు షాదీ అనే షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరు సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుంచి రాజ్, సమంతకు పరిచయం ఉండడం వల్లే తాజాగా డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి. అయితే రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లైంది. -
నాగచైతన్య ఎంగేజ్మెంట్.. అతనితో సమంత డేటింగ్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా నిశ్చితార్థం తర్వాత చైతూ చాలా సంతోషంగా ఉన్నాడని నాగ్ తెలిపారు.అయితే చైతూకు ఎంగేజ్మెంట్ కావడంతో అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంతపైనే పడింది. చైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత ఎలాంటి పోస్టులు పెడుతుందా అని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురించి ఆమె ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు.డైరెక్టర్తో డేటింగ్?ఈ సంగతి అటుంచితే.. తాజాగా సమంతపై నేషనల్ మీడియాలో తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రెడ్ఇట్ కథనం ప్రకారం సామ్ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వరుస కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అతను సమంత నటిస్తోన్న సిటాడెల్.. హనీ బన్నీ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలోనూ సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేశారు. ఆ సిరీస్ తర్వాతే అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుంది. అయితే సమంత- రాజ్ నిడిమోరుపై వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రెండు వెబ్ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి కథనాలు వినిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లయిన రాజ్ నిడిమోరు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు.కాగా.. 2017లో సమంత- నాగచైతన్య పెళ్లాడింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు తమ తమ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. -
'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్స్తో మరోసారి సమంత
స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత తన సినిమా ప్రాజక్ట్లతో బిజీగా మారింది. ప్రస్తుతం తనకు మరో వెబ్ సరీస్లో నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం దానికి సంబంధించిన లుక్ కోసం జిమ్లో తెగ కష్టపడుతుంది సమంత. అయితే ఈ తాజా వెబ్ సిరీస్ను ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలు డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. గతంలో 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో ఓ ముఖ్యమైన పాత్రను సమంత పోషించిన విషయం తెలిసిందే. మరోవైపు సమంతకు బాలివుడ్లో పలు ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్ 2'తో సమంతకు అక్కడ మంచి గుర్తింపు రావడంతో తనకు మూడు సినిమా ఆఫర్స్ వచ్చినట్టు సమాచారం. ప్రముక నిర్మాణ సంస్ధ యష్ రాజ్ ఫిలిమ్స్ సమంతతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో సమంతకు భారీ రెమ్యునరేషన్నే ఆ సంస్ధ ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
నవ్వులు పూయిస్తున్న ‘సినిమా బండి’ ట్రైలర్
ప్రవీణ్ కంద్రెగుల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సినిమా బండి’. బాలీవుడ్ దర్శకద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో ఒక ఆటో డ్రైవర్ కు తన ఆటో లో ఒక ఖరీదైన కెమెరా దొరుకుతుంది. దానితో సినిమా తీయాలనుకుంటాడు. అతని స్నేహితులతో కలిసి సినిమా ప్రయత్నాలు మొదలుపెడతారు. నిజానికి వాళ్లలో ఎవరికీ సినిమా ఎలా తీయాలనేదానిపై అవగాహన లేదు. ఆ అమాయకులు సినిమా తీయడానికి చేసిన ప్రయోగాలు ఎలా ఉంటాయానేదే ఈ సినిమాలో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లో నటీనటులు సినిమా తీసే క్రమంలో వచ్చే సన్నివేశాలు, కామెడీ, డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. ఈ 'సినిమా బండి' మే 14 న నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. -
రాజ్, డీకేలకు గ్రీన్ సిగ్నల్
చకచకా సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తూ... దూసుకుపోతున్నారు మహేష్. ప్రస్తుతం ఆయన ‘1’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘ఆగడు’ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశారు. ఈ సినిమాల తర్వాత క్రిష్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే... మహేష్ బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు పచ్చజెండా ఊపేశారు. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ దర్శక ద్వయం మహేష్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ని తయారు చేసే పనిలో ఉన్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందిన ‘రాజకుమారుడు’ చిత్రం ద్వారానే మహేష్ హీరోగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘సైనికుడు’ లాంటి భారీ చిత్రాన్ని కూడా మహేష్తో నిర్మించారు అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ బేనర్లో మహేష్ నటించనున్న మూడో సినిమా ఇది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్కి వెళ్లనుందని సమాచారం. -
నాని ప్రమోషనల్ సాంగ్
‘‘ ‘ఈగ’ సినిమా తర్వాత నేను చేసిన ప్రమోషనల్ సాంగ్ ఇది. ఈ సినిమాలో నేనిచ్చిన వాయిస్ ఓవర్ తర్వాత వచ్చే సాంగ్ ఇది. మహేష్ శంకర్ చక్కటి సంగీతం అందించారు’’ అని నాని చెప్పారు. వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేష్, మెలని ముఖ్యతారలుగా సిరాజ్ కల్లా దర్శకత్వంలో రాజ్ నిడుమోరు, కృష్ణ డీకే నిర్మిస్తున్న ‘డి ఫర్ దోపిడి’ కోసం నానిపై ప్రత్యేకంగా చిత్రీకరించిన ప్రమోషనల్ సాంగ్ను హైదరాబాద్లో విడు దల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘బాలీవుడ్లో మేం చేసిన ‘గో గోవా గాన్’ చిత్రానికి నృత్యదర్శకత్వం చేసిన ఆదిల్ షేక్ నేతృత్వంలో ఈ ప్రమోషనల్ సాంగ్ చేశాం. ఒక్క రోజులో ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేశామ’’ని తెలిపారు. టైటిల్ సాంగ్నే ప్రమోషనల్ సాంగ్గా చిత్రీకరించామని దర్శకుడు చెప్పారు. నవంబర్ ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ‘దిల్’ రాజు తెలిపారు. -
నిర్మాతగా నాని
హీరో నాని నిర్మాతగా మారారు. బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ నిడిమోర్, కృష్ణ డీకే తెలుగులో ‘డిఫర్ దోపిడి’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రషెస్ చూసిన నాని... సినిమా నచ్చడంతో ఈ చిత్ర నిర్మాణంలో తానూ భాగస్వామిగా చేరారు. వరుణ్సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేష్, మెలనీ ఇందులో ప్రధాన పాత్రధారులు. సిరాజ్ కల్లా దర్శకుడు. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి రాజ్నిడిమోర్, కృష్ణ డీకే మాట్లాడుతూ -‘‘నాని ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే నాని వాయిస్ ఓవర్ కూడా అందిస్తుండటం విశేషం. న్యూయార్క్కి చెందిన లుకాస్ ఛాయాగ్రహణం, మహేష్శంకర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. దేవ కట్టా ఇందులో పోషించిన ఏసీపీ కృష్ణమాచార్య పాత్ర సినిమాకే హైలైట్. ఈ నెల 27న పాటలను, అదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.