
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం నిర్మాతగా అభిమానుల ముందుకు రానుంది. ఆమె నిర్మించిన తాజా చిత్రం శుభం త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే గత కొద్ది కాలంగా వ్యక్తిగత విషయాలతొనే వార్తల్లో నిలుస్తోంది. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తర్వాత.. సమంతపై పెద్దఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ సిరీస్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సామ్ డేటింగ్లో ఉందంటూ చాలాసార్లు కథనాలొచ్చాయి. ఇటీవల పికిల్ బాల్ లీగ్లోనూ వీరిద్దరూ జంటగా కనిపించారు. ఆ తర్వాత కోలీవుడ్లో బీహైండ్వుడ్స్ అవార్డ్స్ ఫంక్షన్లో రాజ్ నిడిమోరు, సమంత సందడి చేశారు. కొంతకాలంగా ఈవెంట్స్లో కనిపించడంతో ఆ రూమర్స్కు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని టాక్ కూడా వినిపిస్తోంది.
ఈ వార్తల నేపథ్యంలో సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్షిప్ మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సమంత, రాజ్ నిడిమోరు సంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. దీంతో మరోసారి వీరిద్దరి డేటింగ్పై చర్చ మొదలైంది. అయితే ఈ రూమర్స్పై ఇప్పటి వరకు సమంత, రాజ్ ఒక్కసారి కూడా స్పందించలేదు. వీరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఇప్పట్లో రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు.
కాగా.. రాజ్ డైరెక్షన్లో సామ్ 'సిటాడెల్: హనీ బన్నీ, 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' (2021) అనే రెండు ప్రాజెక్ట్ల్లో నటించింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' లోనూ సమంత నటిస్తోంది. సమంత చివరిసారిగా వరుణ్ ధావన్తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్లో కనిపించింది.