breaking news
Duleep Trophy 2026-27
-
వైభవ్ మాస్ రివెంజ్ తిలక్ కు దిమ్మతిరిగే షాక్
-
'డీఆర్ఎస్ ఏముందిలే బ్రో.. కాబోయే కెప్టెన్వి నువ్వు’
ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్గా మాత్రమే గాక బ్యాటర్గానూ అదరగొట్టిన ఇషాన్ రెండు ఇన్నింగ్స్లు కలిపి 350కి పైగా పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మరోవైపు సెమీస్లో (తొలి ఇన్నింగ్స్లో 92 రన్స్, రెండో ఇన్నింగ్స్లో 40 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ ఫైనల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ తనకిచ్చిన వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం వైభవ్ సమర్థంగా నిర్వహించాడు. మ్యాచ్లో ఇషాన్ కిషన్కు తలలో నాలుకలా కొనసాగుతూ వచ్చిన వైభవ్ తన కెప్టెన్ డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు సెమీస్లో ఇషాన్ గాయంతో కొన్ని ఓవర్ల పాటు మైదానంలోకి రాలేదు. ఆ సమయంలో వైభవ్ స్టాండిన్ కెప్టెన్గానూ అదరగొట్టాడు. అతడు తీసుకున్న డీఆర్ఎస్ ఫలితాలు అనుకూలంగా రావడంతో తొలి విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈస్ట్జోన్ డగౌట్ వద్ద ఇషాన్ కిషన్.. వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తిన వీడియోను బీసీసీఐ కాస్త ఆలస్యంగా విడుదల చేసింది. ఈ వీడియోలో వైభవ్ను ఇషాన్ కిషన్ సరదాగా ఆటపట్టించాడు. వైభవ్ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇషాన్ తన సమక్షంలో వైభవ్ మాట్లాడాలంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.ఇషాన్ మాట్లాడుతూ.."డీఆర్ఎస్ విషయంలోనూ ప్రతి చోటా క్రెడిట్ అంతా వైభవ్కే దక్కింది. నిజానికి రివ్యూ తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. కానీ దగ్గరికి వచ్చి చాలా కాన్ఫిడెంట్గా ‘రివ్యూ లే లో భాయ్’ అంటూ చెప్పాడు. అంతే.. ఇంటర్నెట్ అంతా ‘వైభవ్, వైభవ్..’ అంటూ ప్రశంసలు. కెప్టెన్గా డీఆర్ఎస్ తీసుకునేది నేను.. క్రెడిట్ అంతా ఈ చిచ్చర పిడుగుకే వచ్చింది" అంటూ ఇషాన్ సరదాగా వైభవ్ను ట్రోల్ చేశాడు.దీనికి వైభవ్ సూర్యవంశీ కూడా ఇషాన్కు స్టన్నింగ్ రిప్లై ఇచ్చాడు. "మీరు ఉన్నప్పుడు రివ్యూ తీసుకోమని చెప్పింది నేనే.. కానీ గాయంతో పెవిలియన్లో ఉన్నప్పుడు డీఆర్ఎస్ తీసుకున్నది ఎవరు? అది కూడా చెప్పండి" అంటూ వైభవ్ చురక వేశాడు. వైభవ్ సమాధానాన్ని ఇషాన్ అలా చూస్తూ ఉండిపోయాడు.‘అవును.. అప్పుడు కూడా వైభవే రివ్యూలు తీసుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. అతడిలో కెప్టెన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో వైభవ్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం అతడి కెరీర్ ఎలా సాగుతుందో. వైభవ్ జట్టులో ఉండటం వల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. జట్టులోని ప్రతి ఒక్కరినీ.. అది జూనియర్ అయినా, సీనియర్ అయినా.. జాగ్రత్తగా చూసుకుంటాడు. ఓహ్.. జూనియర్ అంటే నువ్వు ఒక్కడివే కదా! సారీ.. సారీ’ అంటూ ఇషాన్ మరోసారి సరదాగా వ్యాఖ్యానించాడు.Ishan Kishan with Vaibhav Sooryavanshi. 😂❤️ pic.twitter.com/hAB688xia1— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2026Read: ‘వైభవ్.. నువ్వు నా కెరీర్కు కూడా సాటి రాలేవు’ -
‘వైభవ్.. నువ్వు నా కెరీర్కు కూడా సాటి రాలేవు’
ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో సౌత్జోన్పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఈస్ట్జోన్ టైటిల్ను అందుకుంది. ఈస్ట్జోన్ టైటిల్ గెలవడంలో జట్టులోని ప్రతీ ఆటగాడిది కీలకపాత్రే అని చెప్పొచ్చు. ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ ధనాదన్ ఆటతీరు, అభిమన్యు ఈశ్వరన్ క్లాస్, కెప్టెన్ ఇషాన్ కిషన్ మాస్ డబుల్సెంచరీ, కుమార్ కుషాగ్ర సెంచరీ.. ఇక బౌలింగ్లో ముకేశ్కుమార్, మహ్మద్ షమీ.. ఇలా జట్టు మొత్తం సమిష్టి ప్రదర్శన చేయడంతోనే ఈస్ట్జోన్ దులీప్ ట్రోఫీని దక్కించుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ ప్రశంసలు కురిపించాడు. కనీసం నా కెరీర్ వయసుకు కూడా సాటి రాని వైభవ్ ఇవాళ స్టార్ ఆటగాడిగా మారిపోయాడని షమీ పేర్కొన్నాడు. షమీ మాట్లాడుతూ.."నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. నిజం చెప్పాలంటే వైభవ్ వయసు అక్షరాలా నా కెరీర్తో వయసుతో సమానం. అతడిలో టీనేజ్ అమాయకత్వం అలాగే ఉంది. అందరితో సరదగా జోకులు వేయడానికి ఇష్టపడతాడు. 15 ఏళ్ల వయసులో ఒక కుర్రాడు ఏం చేస్తాడో వైభవ్ అదే చేస్తున్నాడు. కానీ పరిణితితో కూడిన దృక్పథాన్ని అలవరచుకున్నాడు. ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించగల శక్తి అతడి సొంతం. వైభవ్ లాంటి యువకులు ఇప్పటికే చాలా పరిణితి చెంది ఉంటారు. క్రికెట్ ఆడే స్థాయి, ఐపీఎల్, ఇతర ఒత్తిడుల కారణంగా ఎంతో పరిణితి వస్తోంది. వైభవ్ విషయంలో అది ఎప్పుడో రుజువయ్యింది. కాబట్టి అలాంటి వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు." అని చెప్పుకొచ్చాడు.2011లో జన్మించిన వైభవ్ వయసుతోనే షమీ కెరీర్ వయసు సమానం కావడం విశేషం. 2011లో షమీ తొలిసారి దేశవాళీలో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఇక 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో ఆడే అవకాశం ఎంతమంది ఆటగాళ్లకు లభిస్తుంది? కానీ వైభవ్ ఆ అవకాశాన్ని పొందడమే కాదు, తనని తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడి, 206.56 స్ట్రైక్ రేట్తో 252 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ అత్యధిక పరుగులు (776 పరుగులు) చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. తన ఆటతో వైభవ్ రాజస్తాన్ రాయల్స్ను ఒంటిచేత్తో ప్లేఆఫ్స్ చేర్చడం విశేషం.షమీ, వైభవ్ కీలకపాత్రఈస్ట్జోన్ దులీప్ ట్రోఫీని ఎగరేసుకుపోవడంలో షమీ, వైభవ్ సూర్యవంశీలు కీలకపాత్ర పోషించారు. నార్త్ ఈస్ట్జోన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో విఫలమైనప్పటికీ, సెంట్రల్ జోన్తో జరిగిన సెమీస్లో వైభవ్ సూర్యవంశీ (92, 40 పరుగులు) అదరగొట్టాడు. ఇక ఫైనల్లో 44 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మరోవైపు, క్వార్టర్ ఫైనల్స్లో షమీ పొదుపుగా బౌలింగ్ చేయగా, సెమీస్లో 5 వికెట్లు పడగొట్టి సెంట్రల్ జోన్ బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీశాడు. ఇక ఫైనల్స్లో, అతను ఫ్లాట్ పిచ్పై రవిచంద్రన్ స్మరణ్ వంటి కీలక వికెట్తో సహా మరో 2 వికెట్లు పడగొట్టాడు.Read: ఫైనల్లో సబలెంకా; పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు! -
వైభవ్పై ఫిర్యాదు చేసిన తిలక్ వర్మ.. అసలేం జరిగిందంటే
దులీప్ ట్రోఫీ-2026 విజేతగా ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్జోన్ నిలిచిన సంగతి తెలిసిందే. సౌత్జోన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ‘డ్రా’గా ముగియగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్కు 14 ఏళ్ల తర్వాత ట్రోఫీ దక్కింది. అయితే ఈ మ్యాచ్లో సౌత్జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ మధ్య సరదా స్లెడ్జింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.అసలేమి జరిగిందంటే?తొలి రోజు ఆటలో వైభవ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తిలక్ అతడి వద్దకు వెళ్లి.. ఏంటి వైస్ కెప్టెన్? అంత స్లోగా బ్యాటింగ్ చేస్తున్నావు? అని స్లెడ్జ్ చేశాడు. అయితే అందుకు బదులుగా నాలుగో రోజు ఆటలో తిలక్ బ్యాటింగ్కు వచ్చినప్పుడు వైభవ్ కూడా అతడిని సరదాగా ఆటపట్టించాడు. తిలక్ వద్దకు దగ్గరగా వెళ్లి మాట్లాడే క్రమంలో వైభవ్ భుజం అతడికి తగిలింది. దీంతో తిలక్ అంపైర్కు ఫిర్యాదు చేశాడు. అంపైర్ వచ్చి వైభవ్ను మందలిస్తుండగా.. "సార్, ఫస్ట్ ఇన్నింగ్స్లో నాతో కూడా ఇలాగే జరిగింది" అని వైభవ్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(270) అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం సౌత్జోన్ తమ మొదటి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఈస్ట్జోన్ తమ రెండో ఇన్నింగ్స్ను ఆఖరి రోజు ఆటలో 7 వికెట్ల నష్టానికి 388 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కౌనైన్ ఖురేషీ (190 బంతుల్లో 116 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్స్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా, అనుకూల్ రాయ్ (112 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కుమార్ కుషాగ్ర (46) రాణించారు.సౌత్ బౌలర్లలో నిధీశ్ 2 వికెట్లు పడగొట్టగా...సీవీ మిలింద్, సిరాజ్, రషీద్, విజయ్ ఒక్కో వికెట్ తీశారు. గురువారం 48.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఈస్ట్ మరో 176 పరుగులు జోడించింది. ఫలితం ‘డ్రా’ ఖాయం కావడంతో సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగకుండా ఇరు జట్ల కెప్టెన్లు ఆటను ముగించేందుకు అంగీకరించారు. ఇషాన్ కిషన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.చదవండి: ENG vs PAK: సేమ్ సీన్ రీపీట్! అప్పుడు సెహ్వాగ్.. ఇప్పుడు పాక్ ఓపెనర్Pure drama in the #DuleepTrophy 2026 Final! 🍿#TilakVarma had a word for #VaibhavSooryavanshi in the 1st innings... and the youngster served it right back while Tilak was batting! 🔥🗣️ pic.twitter.com/DPdi3iwVRA— Star Sports (@StarSportsIndia) September 10, 2026 -
గెలుపు జోష్లో హల్చల్ చేసిన ఇషాన్, వైభవ్
దులీప్ ట్రోఫీ 2026 టైటిల్ను ఈస్ట్ జోన్ కైవసం చేసుకుంది. సౌత్ జోన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రా అయినా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఆ జట్టు విజేతగా నిలిచింది. ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడం ఇది మూడోసారి. పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇషాన్ కిషన్ నేతృత్వంలో ఈ జట్టు చాంపియన్గా అవతరించింది.Handshakes in the middle to conclude a fantastic Final 🤝East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026టైటిల్ గెలిచిన తర్వాత ఈస్ట్ జోన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా కెప్టెన్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ స్టంప్స్ చేతబట్టి భాంగ్రా డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. జట్టు కోచ్ రతన్ కుమార్, సహాయక సిబ్బంది, ఇతర ఆటగాళ్లతో కలిసి ఇషాన్, వైభవ్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గెలుపును ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.బ్యాట్తోనూ అదరగొట్టిన ఇషాన్ కిషన్టైటిల్ గెలిచాక తనదైన శైలిలో చిందులేసిన ఇషాన్, ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడంలోనూ అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో అతడు భారీ డబుల్ సెంచరీ (270), హాఫ్ సెంచరీ (80) సాయంతో 350 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్లో తన జట్టు భారీ స్కోర్ (708) చేయడానికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ స్కోరే (ఆధిక్యం) ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడానికి కారణమైంది. బ్యాట్తో తన అద్భుత ప్రదర్శన కారణంగా ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సౌత్ జోన్ తరఫున తొలి ఇన్నింగ్స్లో అద్బుత పోరాటం (99) చేసిన ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. తిలక్ అంతకుముందు సెమీఫైనల్లో అద్భుత శతకంతో మెరిశాడు. చదవండి: దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్. -
దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్
దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్ క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ జట్టు మూడోసారి సొంతం చేసుకుంది. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరోసారి చాంపియన్గా అవతరించింది. కెప్టెన్గా, ఆటగాడిగా ఈ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. సౌత్ జోన్ సారథిగా వ్యవహరించిన తిలక్ వర్మ బ్యాటర్గా రాణించినప్పటికీ.. కెప్టెన్గా మాత్రం చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.𝙏𝙝𝙖𝙩 𝙒𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙁𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🏆 Congratulations to the Ishan Kishan-led East Zone on winning their third #DuleepTrophy title 👏👏#EZvSZ | @ishankishan51 pic.twitter.com/u6D4UvOTEp— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్ ఆదివారం మొదలైంది. టాస్ గెలిచి తొలి రెండురోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ జట్టు.. మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఇషాన్ డబుల్ సెంచరీటాపార్డర్లో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44).. వన్డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) అదరగొట్టారు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (270)తో కదం తొక్కాడు. మరోవైపు.. కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101).. అనుకుల్ రాయ్ (45), ఎండీ కౌనియన్ ఖురేషి (40) రాణించారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ తిలక్ వర్మ 99 పరుగులు చేయగా.. దేవదత్ పడిక్కల్ 62 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో సీవీ మిలింద్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, ఎండీ కౌనియన్ ఖురేషి, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో సౌత్ జోన్ 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్కు తొలి ఇన్నింగ్స్లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలో ఆన్ ఆడించకుండా..ఆ తర్వాత సౌత్కు ‘ఫాలోఆన్’ ఇవ్వకుండా ఈస్ట్ బుధవారమే బ్యాటింగ్కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (8), ఈశ్వరన్ (3) విఫలమైనా...ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ మూడో వికెట్కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.ఇషాన్ 80 పరుగులు చేయగా.. శిఖర్ మోహన్ 52 పరుగులతో రాణించాడు. ఇక ఆఖరిదైన గురువారం నాటి ఐదో రోజు ఆటలో ఆల్రౌండర్ ఖురేషి అజేయ శతకం (116)తో రాణించగా.. అనుకుల్ రాయ్ హాఫ్ సెంచరీ (64) సాధించాడు. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా 46 పరుగులు చేశాడు.మ్యాచ్ డ్రా.. ఈస్ట్దే టైటిల్ఈ క్రమంలో 388 పరుగుల వద్ద ఏడు వికెట్ల నష్టానికి ఈస్ట్ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా మొత్తంగా 760 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. దీంతో ఆఖరి రోజు ఆట కాబట్టి సౌత్ జోన్ ‘డ్రా’కు అంగీకరించింది. నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లోనూ ఈస్ట్ ఆధిక్యంలో ఉన్నందున ట్రోఫీ ఈస్ట్ జోన్కే దక్కింది. ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.Handshakes in the middle to conclude a fantastic Final 🤝East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026 -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు
చెపాక్ వేదికగా సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అసాధరణ ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్లో భారీ డబుల్ సెంచరీతో కదం తొక్కిన ఇషాన్(270).. రెండో ఇన్నింగ్స్లో వన్డే తరహాలో మెరుపులు మెరిపించాడు. కేవలం 98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 80 పరుగులు చేశాడు.ఈ భారత వికెట్ కీపర్ బ్యాటర్ మొత్తంగా రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 350 పరుగులు చేశాడు. తద్వారా 65 ఏళ్ల దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒక మ్యాచ్లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా కూడా కిషన్ నిలిచాడు. ఇంతకుముందు భారత మాజీ క్రికెటర్ రామణ్ లంబా చేసిన 320 పరుగులే అత్యధికంగా ఉండేది. 1987లో భిలాయ్ వేదికగా వెస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్లో నార్త్ జోన్ తరపున లంబా ఈ ఫీట్ సాధించాడు. తాజా నాక్తో లంబాను అధిగమించి కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.అడుగు దూరంలోఇక ఈ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ జట్టు మూడోసారి సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. సౌత్జోన్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్కు నేడు చివరి రోజు కాగా... ప్రస్తుతం ఈస్ట్ ఓవరాల్గా 584 పరుగులు ముందంజలో ఉంది. మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయం కాబట్టి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకున్న ఈస్ట్ విజేతగా నిలవడం లాంఛనమే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 212 పరుగులు చేసింది. తిలక్ వర్మ 99 అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 242/6తో బుధవారం ఆట కొనసాగించిన సౌత్జోన్ తమ మొదటి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తిలక్ వర్మ (99; 9 ఫోర్లు) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా, సీవీ మిలింద్ (43; 7 ఫోర్లు) రాణించాడు. ఈస్ట్కు తొలి ఇన్నింగ్స్లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత సౌత్కు ‘ఫాలోఆన్’ ఇవ్వకుండా ఈస్ట్ బ్యాటింగ్కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (8), ఈశ్వరన్ (3) విఫలమైనా...ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ మూడో వికెట్కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.చదవండి: పసికూనపై సౌతాఫ్రికా ప్రతాపం.. 99 పరుగుల తేడాతో ఘన విజయం -
584 పరుగుల ఆధిక్యం.. టైటిల్కు అడుగు దూరంలో ఈస్ట్జోన్!
దులీప్ ట్రోఫీని అందుకునేందుకు ఈస్ట్జోన్ జట్టు అడుగుదూరంలో నిలిచింది. సౌత్జోన్తో జరుగుతున్న ఫైనల్లో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 51 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కుమార్ కుషాగ్ర (34), ఖురేషీ (26) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఈస్ట్జోన్ 584 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం ఆటకు చివరి రోజు కావడంతో ఈస్ట్జోన్ గెలుపు లాంఛనమే. ఐదోరోజు ఉదయం సెషన్లో వేగంగా బ్యాటింగ్ చేసి సౌత్జోన్ ముంగిట 650 పరుగుల లక్ష్యాన్ని టార్గెట్గా ఉంచే అవకాశముంది. ఇంత టార్గెట్ ఛేదించడం అసాధ్యం కాబట్టి మ్యాచ్ డ్రా అవనుంది. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ విజేతగా నిలవనుంది. దీంతో 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీలో ఫైనల్ చేరిన ఈస్ట్జోన్ చాంపియన్గా నిలిచేందుకు అడుగుదూరంలో ఉంది.Photo Credit: BCCI Twitterతొలి ఇన్నింగ్స్ మాదిరే రెండో ఇన్నింగ్స్ను వేగంగా ఆరంభించిన ఈస్ట్జోన్కు ఓపెనర్లు వైభవ్ (8), అభిమన్యు ఈశ్వరన్ (3) శుభారంభం అందించలేకపోయారు. అయితే మిడిలార్డర్లో శిఖర్ మోహన్ (52), కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), కుమార్ కుషాగ్ర (34) రాణించడంతో ఈస్ట్జోన్ 200 పరుగుల మార్క్ను దాటింది. సౌత్జోన్ బౌలర్లలో సిరాజ్, త్రిపురానా విజయ్, నిదీష్, షేక్ రషీద్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు సౌత్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) సెంచరీ చేజార్చుకోగా, పడిక్కల్ (62), సీవీ మిలింద్ (43) పర్వాలేదనిపించారు. ముఖేశ్కుమార్ 3 వికెట్లు తీయగా, షమీ, ఖురేషీ, శికర్ మోహన్లు తలా 2 వికెట్లు పడగొట్టారు.MD Nidheesh breaks the partnership 👏He gets the crucial wicket of East Zone captain Ishan Kishan who played yet another superb knock of 80(98) 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/j9C01OLgmB— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: షాకింగ్.. కోహ్లిపై ఆధారపడిన పాక్ మహిళా ప్లేయర్లు! -
ఏ బౌలర్ను వదల్లేదు.. భీకర ఫామ్లో ఇషాన్ కిషన్!
టీమిండియా వికెట్ కీపర్, ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ భీకర ఫామ్లో ఉన్నాడు. సౌత్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇప్పటికే డబుల్ సెంచరీతో బీభత్సం సృష్టించిన ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరును ప్రదర్శిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్లో వన్డే తరహా బ్యాటింగ్తో అలరించిన ఇషాన్ 98 బంతుల్లో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు శిఖర్ మోహన్ (52) అర్థసెంచరీతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి ఈస్ట్జోన్ 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈస్ట్జోన్ ఇప్పటికే 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.త్రిపురానాను దంచికొట్టాడు..ఫిఫ్టీ మార్క్ సాధించిన తర్వాత త్రిపురానా వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6, 4 బాదడంతో పాటు సింగిల్ సహా మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాదే క్రమంలో ఏ బౌలర్ను విడిచిపెట్టని ఇషాన్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరును కనబరుస్తూ ప్రతీ బౌలర్ను చితక్కొడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో 708 పరుగులకు ఆలౌటైన ఈస్ట్జోన్, ఆ తర్వాత సౌత్జోన్ను 336 పరుగులకే కట్టడి చేసి తొలి ఇన్నింగ్స్లో 372 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్ అందుకోనుంది.4,6,6,4 BY ISHAN KISHAN - He smashing everyone in Duleep Trophy final 🥶 pic.twitter.com/lKPAA2awOY— Johns. (@CricCrazyJohns) September 9, 2026Read: ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్! -
300 పరుగులు పూర్తి చేసిన ఇషాన్ కిషన్
సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మరో మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 270 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్లోనూ సత్తా చాటి, మ్యాచ్ మొత్తంలో 300 పరుగులు పూర్తి చేశాడు. త్రిపురణ విజయ్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది ఈ ఘనత సాధించాడు. నాలుగో రోజు టీ విరామం సమయానికి ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (8), అభిమన్యు ఈశ్వరన్ (3) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఇషాన్ కిషన్ 48, శిఖర్ మోహన్ 34 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. సిరాజ్, త్రిపురణ విజయ్కు తలో వికెట్ దక్కింది.తృటిలో సెంచరీ చేజార్చుకున్న తిలక్అంతకుముందు తిలక్ వర్మ ఒంటరిపోరాటం చేయడంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. తిలక్కు చామ మిలింద్ (43) సహకరించడంతో సౌత్ జోన్ 300 పరుగుల మార్కును దాటగలిగింది. దీనికి ముందు దేవ్దత్ పడిక్కల్ (62) అర్ద సెంచరీతో రాణించాడు. సౌత్ జోన్ ఇన్నింగ్స్లో పడిక్కల్, తిలక్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, షమీ, ఖురేషి, శిఖర్ మోహన్ తలో 2 వికెట్లు తీశారు.ఇషాన్ డబుల్ ధమాకాఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.ఈస్ట్జోన్దే టైటిల్సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్జోన్కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లో ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ దక్కనుంది. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ 13 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకోనుంది. చదవండి: సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్ -
సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్
చెపాక్ వేదికగా సౌత్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్జోన్ విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్ 708 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా.. అందుకు బదులుగా తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకే ఆలౌటైంది. తిలక్ వర్మ సెంచరీ మిస్సౌత్జోన్ జట్టులో తిలక్ వర్మ (99), దేవదత్ పడిక్కల్ (62) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆ జట్టు 300 మార్కును దాటగలిగింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్కు 300 పరుగులకు పైగా భారీ ఆధిక్యం లభించింది. అంతేకాకుండా సౌత్జోన్ ఫాలో-ఆన్ కూడా దాటలేకపోయింది. వైభవ్ విఫలంఅయినప్పటికీ ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సౌత్జోన్కు ఫాలోఆన్ ఇవ్వకుండా.. వారే రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించేందుకు మైదానంలోకి దిగారు. అయితే ఈస్ట్జోన్ తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ వికెట్లను కోల్పోయింది. సిక్కోలు కుర్రాడి దెబ్బమూడు పరుగులు చేసిన ఈశ్వరన్ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్కు పంపగా.. యువ సంచలనం వైభవ్ను సిక్కోలు కుర్రాడు త్రిపురాన విజయ్ అవుట్ చేశాడు.ఇన్నింగ్స్ ఆరువ ఓవర్లో విజయ్ తొలి బంతిని ఔట్సైడ్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన వైభవ్.. ఫ్రంట్ఫుట్కు వచ్చి ఓవర్ కవర్స్ దిశగా భారీ షాట్కు ప్రయత్నించాడు. కానీ బంతి ఎక్కువగా టర్న్ అయ్యి అతడి బ్యాట్ను దాటుకుంటూ వికెట్ కీపర్ జగదీశన్ చేతికి వెళ్లింది. వెంటనే జగదేశన్ స్టంప్స్ను గిరాటేశాడు. అప్పటికి క్రీజు బయట ఉండడంతో 8 పరుగులు చేసిన వైభవ్ స్టంపౌట్గా వెనుదిరిగాల్సి వచ్చింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో కూడా విజయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.చదవండి: IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్కోచ్గా వస్తా? -
ఈస్ట్జోన్దే టైటిల్!.. చరిత్ర సృష్టించనున్న వైభవ్!
దులీప్ ట్రోఫీని ఈసారి ఈస్ట్ జోన్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనల్లో సౌత్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్జోన్కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లో ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ దక్కనుంది. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ 13 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకోనుంది. ఇదే సమయంలో జట్టులో సభ్యుడిగా ఉన్న వైభవ్ సూర్యవంశీ కూడా చరిత్ర సృష్టించనున్నాడు. వైభవ్ సూర్యవంశీ వయసు 15 ఏళ్లు కావడంతో, అత్యంత పిన్న వయస్సులో దులీప్ ట్రోఫీ నెగ్గిన జట్టలోని ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటికే టోర్నీలో సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ సాధించి అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచిన వైభవ్, కప్ను ఈస్ట్జోన్ సొంతం చేసుకుంటే మాత్రం పైన చెప్పుకున్న ఘనత కూడా వైభవ్ ఖాతాలో చేరనుంది.డ్యాన్స్ చేసిన వైభవ్..ఇక మ్యాచ్లో సౌత్జోన్ ఇన్నింగ్స్ సందర్భంగా త్రిపురానా విజయ్ వికెట్ పడినప్పుడు వైభవ్ సూర్యవంశీ డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 708 పరుగులు చేసిన ఈస్ట్జోన్కు పోటీ ఇచ్చే క్రమంలో సౌత్జోన్ తరఫున ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మతో పాటు దేవదత్ పడిక్కల్, సీవీ మిలింద్ కాస్త ప్రతిఘటించారు. తాను ఒక ఎండ్లో పాతుకుపోయినప్పటికీ, మరో ఎండ్లో మాత్రం వరుసగా వికెట్లు పడడంతో వైభవ్ ఉబ్బితబ్బియయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన త్రిపురానా విజయ్ కెప్టెన్తో ఏర్పడిన సయన్వయ లోపంతో రనౌట్గా వెనుదిరిగాడు. ఖురేషీ వేసిన ఆఫ్స్టంప్ బంతిని తిలక్ వర్మ కట్షాట్ ఆడాడు. తనవైపు వచ్చిన బంతిని అభిజిత్ సర్కార్ వేగంగా అందుకొని అంతే వేగంతో వికెట్ కీపర్ ఇషాన్ వైపు విసిరాడు. అప్పటికే తిలక్ సింగిల్ తీయాలా వద్దా అనే డైలమాలోనే ముందుకు పరిగెత్తాడు. దీంతో కాస్త లేటుగా రనప్ అందుకున్న త్రిపురానా విజయ్ స్ట్రైక్ ఎండ్కు చేరేలోపే ఇషాన్ వికెట్లను గిరాటేయడంతో అతడు రనౌట్ అయ్యాడు. విజయానికి చేరువ కావడంతో సంతోషం పట్టలేని వైభవ్ చిన్న డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం కెమెరాలకు చిక్కింది. ఇక తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్ 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీ సాధించగా, కుమార్ కుషాగ్ర (101) సెంచరీ చేశాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థసెంచరీలు సాధించారు. సౌత్జోన్ బౌలర్లలో త్రిపురానా విజయ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌత్జోన్ 107.3 ఓవర్లలో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా, పడిక్కల్ (62) అర్థసెంచరీ సాధించాడు. ఈస్ట్జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా, షమీ, ఖురేషి, శిఖర్ మోహన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.Excellent reflex catch and run out ⚡️Top-fielding efforts bring wickets for East Zone 👌South Zone are 322/8 Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/FKDmQcDYG3— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: ‘పూటుగా తాగి పీడకలనుకొని మరిచిపోతా’ -
708 పరుగులు.. అయినా నో డిక్లరేషన్.. తెలివిలేదా?
దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో అతి భారీ స్కోరు సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సౌత్ జోన్తో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో.. ఇషాన్ కిషన్ సేన సమిష్టిగా రాణించింది.ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందిస్తే.. వన్డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) భారీ స్కోరు దిశగా పునాది వేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) విఫలమైనప్పటికీ.. కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం పట్టుదలగా ముందుకు సాగాడు.270 పరుగులుఈ క్రమంలో ద్విశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగినప్పటికీ.. ఆఖర్లో మళ్లీ బ్యాటింగ్కు వచ్చాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. ఇషాన్కు తోడుగా కుమార్ కుశాగ్రా శతకం (101)తో చెలరేగాడు.I.C.Y.M.I2️⃣7️⃣0️⃣ runs3️⃣3️⃣4️⃣ balls3️⃣0️⃣ fours7️⃣ sixes8️⃣0️⃣.8️⃣3️⃣ SRWatch 🎥 highlights of Ishan Kishan's marathon knock 👌👌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/An6sT09tfu— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026708 పరుగులు చేసి ఆలౌట్మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (45) ఎండీ కౌనేన్ ఖురేషి (40) రాణించగా.. టెయిలెండర్ మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్ ఈ మేరకు సమిష్టిగా రాణించి రెండు రోజులు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసింది. మొత్తంగా మొదటి ఇన్నింగ్స్లో ఈస్ట్ జోన్ 163 ఓవర్లు ఆడి 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.తెలివిలేదా?.. నిజానికి రెడ్బాల్ మ్యాచ్లో ఫలితం తేలాలంటే.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఈ స్థాయి భారీ స్కోరు సాధించడం కంటే.. కాస్త ముందుగానే డిక్లేర్ చేసి.. ఫలితం సాధించే దిశగా ముందుకు వెళ్తుంది. కానీ ఇషాన్ కిషన్ మాత్రం జట్టు ఆలౌట్ అయ్యేంత వరకు బ్యాటింగ్ చేయించాడు. ఇందుకు రెండు రోజులు తీసుకున్నాడు.నిబంధనల ప్రకారమే తెలివిగానిజానికి ఇలా చేయడం ద్వారా మ్యాచ్ డ్రా అవుతుందే తప్ప ఫలితం తేలదు. అయినా ఇషాన్ ఎందుకిలా చేశాడు?.. ఇషాన్ మాత్రమే కాదు.. ఆ స్థానంలో ఏ కెప్టెన్ ఉన్నా ఇలాగే చేస్తాడు. ఎందుకంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రెడ్బాల్ క్రికెట్ నిబంధనల ప్రకారం..రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఫైనల్ మ్యాచ్ కోసం టెస్టు మాదిరే ఐదు రోజులు కేటాయిస్తారు. అయితే, ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే గనుక తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. అందుకే ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసేందుకే మొగ్గుచూపింది.336 పరుగులకే ఆలౌట్.. ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమేఇక సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 709 పరుగులు చేస్తేనే మ్యాచ్పై ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. బుధవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా తొలి ఇన్నింగ్స్లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఫలితంగా ఈస్ట్ జోన్కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక బుధవారం ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. గురువారం ఒక్కరోజు మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ ఆడించకుండా డ్రా చేసుకునేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంది. కాబట్టి దులిప్ ట్రోఫీ-2026 విజేతగా ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమే అని చెప్పవచ్చు.చదవండి: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే? -
పాపం తిలక్ వర్మ.. ఒక్క పరుగు చేసి ఉంటే?
ఈస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్జోన్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి విధించిన ఫాలో-ఆన్ మార్కును సౌత్జోన్ అందుకోలేకపోయింది. ఫాలో-ఆన్కు 173 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్ జట్టుకు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.పాపం తిలక్ వర్మఈ తుది పోరులో సౌత్జోన్ కెప్టెన్ తిలక్ వర్మ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు సహచర బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నా.. తిలక్ మాత్రం బాధ్యతాయుతమైన నాక్తో జట్టును ముందుకు నడిపించాడు. అయితే దురదృష్టవశాత్తూ తిలక్ తన 9వ ఫస్ట్క్లాస్ సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయాడు. ఈ హైదరాబాదీ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కౌనైన్ ఖురైషీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అతడితో పాటు దేవ్దత్త్ పడిక్కల్(62), సీవీ మిలింద్(43), జగదీశన్(32) రాణించారు. ఈస్ట్జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్ మూడు, ఖురేషీ, మహ్మద్ షమీ, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(270) భారీ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ డ్రా అయితే ఏ జట్టుకు అయితే తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం లభిస్తుందో ఆ టీమ్నే విజేతగా నిర్ణయిస్తారు.చదవండి: వెస్టిండీస్తో సిరీస్.. టీమిండియాలోకి ఆర్సీబీ కెప్టెన్? -
షమీకి వార్నింగ్
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి అంపైర్ వార్నింగ్ ఇచ్చారు. సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో బంతి స్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో షమీతో పాటు ఈస్ట్ జోన్ ఆటగాళ్లందరినీ అంపైర్ హెచ్చరించారు.మ్యాచ్ మూడో రోజు చివరి సెషన్లో (60వ ఓవర్) ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మ బంతిని పరిశీలించారు. బంతిని మెరిపించేందుకు ఆటగాళ్లు (ఈస్ట్ జోన్) అతిగా చెమటను ఉపయోగించవద్దని సూచించారు. నిబంధనల ప్రకారం బంతి స్వభావాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చడం నిషేధం.కాగా, ఈస్ట్ జోన్ బౌలర్లు పాత బంతితోనూ రివర్స్ స్వింగ్ రాబట్టి సౌత్ జోన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా షమీ (2-17), ముకేశ్ కుమార్ (2-36) అద్బుతంగా బౌలింగ్ చేసి సౌత్ జోన్ను కష్టాల్లోకి నెట్టారు. వీరి ధాటికి సౌత్ జోన్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 242 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 466 పరుగులు వెనుకపడి ఉంది. సౌత్ జోన్ను కెప్టెన్ తిలక్ వర్మ (56 నాటౌట్) గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.చదవండి: నిప్పులు చెరిగిన షమీ.. సౌత్జోన్ కకావికలం -
పోరాడుతున్న తిలక్ వర్మ
ఈస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల అతి భారీ స్కోర్ చేయగా.. సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది (మూడో రోజు ఆట ముగిసే సమయానికి). ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆ జట్టు ఇంకా 466 పరుగులు వెనుకపడి ఉంది.129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌత్ జోన్ను తిలక్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. స్మరణ్ రవిచంద్రన్తో కలిసి ఐదో వికెట్కు 45 పరుగులు, శ్రేయస్ గోపాల్తో కలిసి ఆరో వికెట్కు 66 పరుగులు జోడించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తిలక్ 56, చామ మిలింద్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.సౌత్ జోన్ ఇన్నింగ్స్లో దేవ్దత్ పడిక్కల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. రికీ భుయ్ 1, నారాయణ్ జగదీశన్ 32, షేక్ రషీద్ 27, స్మరణ్ రవిచంద్రన్ 23, శ్రేయస్ గోపాల్ 26 పరుగులు చేసి ఔటయ్యారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో షమీ, ముకేశ్ కుమార్ తలో 2 వికెట్లు తీయగా.. శిఖర్ మోహన్, ఖురేషి చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.చదవండి: పాక్తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు! -
నిప్పులు చెరిగిన షమీ.. సౌత్జోన్ కకావికలం
దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్ తరఫున ఆడుతున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సౌత్జోన్తో ఫైనల్లోనూ చెలరేగుతున్నాడు. సెమీఫైనల్లో ఐదు వికెట్లు తీసిన షమీ ఫైనల్లో బంతులో నిప్పులు చెరిగాడు. 11 ఓవర్లు వేసిన షమీ 4 మెయిడెన్లు సహా 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ముఖేశ్ కుమార్ కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన షమీని ఎదుర్కోవడంలో సౌత్జోన్ బ్యాటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సౌత్జోన్ జట్టు 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (37), శ్రేయస్ గోపాల్ (13) క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్జోన్ జట్టు 163 ఓవర్లలో 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీతో మెరవగా, కుమార్ కుశాగ్ర (101) సెంచరీతో రాణించగా, అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థశతకాలతో రాణించారు. త్రిపురణ విజయ్ నాలుగు వికెట్లతో మెరిశాడు.ఇటీవలే షమీ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 900 వికెట్ల మార్క్ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.చదవండి: చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడనున్న మెస్సీ, రొనాల్డో! -
అద్భుత ఫామ్ను కొనసాగించిన పడిక్కల్
టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో (టెస్టు సిరీస్లో) వరుసగా రెండు సెంచరీలు సాధించిన అతడు.. ప్రస్తుతం జరుగుతన్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో కీలకమైన అర్ద సెంచరీతో సత్తా చాటాడు.ఈస్ట్ జోన్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో సౌత్ జోన్ తరఫున బరిలోకి దిగిన పడిక్కల్, తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన పరుగులు సాధించాడు. కేవలం 65 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. మొత్తం 104 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు.పడక్కిల్ అర్ద సెంచరీతో రాణించినప్పటికీ.. సౌత్ జోన్ కష్టాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు కేవలం 176 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ (1), నారాయణ్ జగదీశన్ (32), పడిక్కల్ (62), షేక్ రషీద్ (27), స్మరణ్ రవిచంద్రన్ (23) ఔట్ కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ (18), శ్రేయస్ గోపాల్ (2) క్రీజ్లో ఉన్నారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో షమీ, ముకేశ్ కుమార్ తలో 2 వికెట్లు తీయగా.. శిఖర్ మోహన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో చేసిన స్కోర్కు సౌత్ జోన్ ఇంకా 532 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు. చదవండి: వారెవ్వా వైభవ్ సూర్యవంశీ!.. ఇషాన్ను ఒప్పించి మరీ! -
వారెవ్వా వైభవ్ సూర్యవంశీ!.. ఇషాన్ను ఒప్పించి మరీ!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శించిన వాళ్లకు ఆటతో పాటు నాయకత్వ నైపుణ్యాలతోనూ అదిరిపోయేలా కౌంటర్ ఇస్తున్నాడంటూ కొనియాడుతున్నారు. కాగా రెడ్బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేనప్పటికీ పదిహేనేళ్ల వైభవ్కు బీసీసీఐ కీలక బాధ్యతను అప్పగించిన సంగతి తెలిసిందే.అపుడే వైస్ కెప్టెన్గానా?ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2026 టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్కు వైభవ్ను డిప్యూటీగా నియమించింది. దీంతో చిన్న వయసులోనే, అనుభవం లేని వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్గా ఎలా నియమిస్తారని భారత మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.అయితే, వైభవ్ అటు ఆటగాడిగా రాణిస్తూనే.. తన నాయకుడిగానూ తానేం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. సెంట్రల్ జోన్తో సెమీ ఫైనల్లో ఇషాన్ గైర్హాజరీలో వైభవ్ ఒకరోజు మొత్తం కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది.708 పరుగులకు ఆలౌట్ఇక టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ సౌత్ జోన్తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో.. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 708 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా సౌత్ జోన్ తమ బ్యాటింగ్ మొదలుపెట్టింది.సందిగ్దంలో జట్టుఈ నేపథ్యంలో ఆరో ఓవర్లో ఈస్ట్ జోన్ పేసర్ ముకేశ్ కుమార్ వేసిన రెండో బంతిని సౌత్ జోన్ ఓపెనర్ రికీ భుయ్ బౌండరీ దిశగా తరలించే ప్రయత్నం చేశాడు. అయితే, లెంగ్త్ను తప్పుగా అంచనా వేసిన రికీ షాట్ ఆడటంలో విఫలం కాగా.. వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా బంతిని క్యాచ్ పట్టి.. అప్పీలు చేశాడు.ఇషాన్ను ఒప్పించిన వైభవ్అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్న కెప్టెన్ ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లిన వైభవ్ సూర్యవంశీ.. ‘రివ్యూ తీసుకో.. పర్లేదు’ అంటూ సలహా ఇచ్చాడు. కానీ మిగతా ఆటగాళ్లు మాత్రం బంతి ముందుగా బ్యాట్ను తాకిందా? లేదంటే ప్యాడ్కు తాకిందా? అనే సందేహంలో ఉన్నారు.అయితే, ఇషాన్ కిషన్ వైభవ్ మాట మీద నమ్మకంతో రివ్యూకు వెళ్లగా.. రికీ భుయ్ అవుటైనట్లు తేలింది. దీంతో ఈస్ట్ జోన్ సంబరాలు అంబరాన్నంటాయి. వైభవ్ సూర్యవంశీని ఇషాన్, ముకేశ్తో పాటు మిగతా జట్టు సభ్యులందరూ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా దులిప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్లో 37 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేశాడు.చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు🗣️ Take it...take itVaibhav Sooryavanshi 🤝 ReviewThe vice-captain urges the captain to take the review, and it turns out to be successful 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/MmtESDSnMy— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026 -
తిలక్ వర్మ జట్టు నుంచి తీసేస్తే.. శతక్కొట్టి ఘాటు కౌంటర్!
ఈస్ట్ జోన్తో దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో సౌత్ జోన్ కఠిన సవాలు ముంగిట నిలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. మొదటి ఇన్నింగ్స్లో 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.టీమిండియా స్టార్లతో కళఈ క్రమంలో సౌత్ జోన్ ఈస్ట్ జోన్కు బదులిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈస్ట్ జోన్కు ఇషాన్ కిషన్.. సౌత్ జోన్కు తిలక్ వర్మ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈస్ట్ జోన్లో వైభవ్ సూర్యవంశీ, మహ్మద్ షమీ వంటి స్టార్లు ఉండగా.. సౌత్ జోన్లో దేవదత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్ ఆడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ కరుణ్ నాయర్ సోషల్ మీడియా పోస్టు వైరల్గా మారింది. కెప్టెన్ తిలక్ వర్మ తనను తుదిజట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణమేంటో తనకు అర్థం కావడం లేదన్న అర్థంలో అతడు వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అసలేం జరిగిందంటే..రంజీ వీరుడుదేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ఆడుతున్న కరుణ్ నాయర్.. 2025-26 రంజీ సీజన్లో 13 ఇన్నింగ్స్లో కలిపి 699 పరుగులు సాధించాడు. మొత్తంగా ఇప్పటికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 26 శతకాల సాయంతో 9374 పరుగులు రాబట్టాడు.దురదృష్టవశాత్తూ.. తుదిజట్టు నుంచి తీసేశాఅయితే, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్లో భాగంగా నార్త్ జోన్తో జరిగిన సెమీ ఫైనల్ తుదిజట్టులో కరుణ్ నాయర్కు చోటు దక్కలేదు. ఈ విషయం గురించి కెప్టెన్ తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘‘కరుణ్ దురదృష్టవంతుడు. ఈసారి అతడికి అవకాశం ఇవ్వలేకపోతున్నాము. ప్రత్యర్థి జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున.. నేను కొడిమెల హిమతేజను తుదిజట్టుకు ఎంచుకున్నా.యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి కదా!.. కరుణ్ నాయర్ ఇప్పటికే దేశీ క్రికెట్లో తానేంటో నిరూపించుకున్నాడు. కానీ ఈసారి దురదృష్టవశాత్తూ అతడికి అవకాశం దక్కడం లేదు’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. సౌత్ జోన్ కోచ్ మాత్రం కరుణ్ నాయర్ వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేడని పేర్కొన్నాడు.శతకంతో కదంతొక్కిఇలాంటి తరుణంలో సౌత్ జోన్ను వీడి.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీస్ ఎలెవన్ తరఫున ఛత్తీస్గడ్తో మ్యాచ్ ఆడాడు కరుణ్ నాయర్. ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. డాక్టర్ కె. తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా 183 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్సాయంతో 104 పరుగులు సాధించాడు. ఓవైపు ఈస్ట్ జోన్ బ్యాటర్లు సౌత్ జోన్ బౌలింగ్ను చితక్కొడుతున్న వేళ కరుణ్ నాయర్ సెంచరీతో ఈ మేరకు కదం తొక్కాడు.అర్థం కావడమే లేదుఈ పరిణామాల నేపథ్యంలో క్రిక్ఇన్ఫో జర్నలిస్టు ఒకరు.. ‘‘దులిప్ ట్రోఫీ ఫైనల్ ఆడే తుదిజట్టు నుంచి తప్పించిన మరుసటి రోజే కరుణ్ నాయర్ ప్రి-సీజన్ రెడ్బాల్ పోటీలో అద్భుతమైన శతకం సాధించాడు.కరుణ్ జట్టుతో ఉండి ఉంటే సౌత్జోన్ 708 పరుగుల మైలురాయిని కాస్త సులువుగానే చేరుకునేది. అయినా అతడిని తుదిజట్టు నుంచి ఎందుకు తప్పించారో అస్సలు అర్థం కావడం లేదు’’ అని ట్వీట్ చేశారు.తిలక్ను టార్గెట్ చేసిన కరుణ్!ఇందుకు స్పందనగా.. ‘‘అర్థం కావడం లేదు అనే పెద్ద పెద్ద మాటలు అవసరం లేదేమో!’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని కరుణ్ నాయర్ జోడించాడు. ఈ నేపథ్యంలో.. తనను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారంటూ పరోక్షంగా తిలక్ వర్మను టార్గెట్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.చదవండి: టీమిండియాతో టీ20.. జపాన్ జట్టు ప్రకటన -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
సౌత్ జోన్తో జరుగుతున్న దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెన్నై వేదికగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ భారీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ 708 పరుగుల మేర అతి భారీ స్కోరు సాధించింది. An innings of pure class 👌Watch 🎥 snippets of Ishan Kishan's fantastic double century so far 💯💯Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ | @ishankishan51 pic.twitter.com/jOndIaA5Uo— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఫైనల్ ఆదివారం మొదలైంది. చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సోమవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాపార్డర్ సూపర్ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ భారీ అర్ధ శతకం (85)తో ఆకట్టుకున్నాడు. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ డబుల్ సెంచరీసౌత్ జోన్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఇషాన్.. డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గాయపడి మైదానం వీడాడు. అయితే, జట్టుకు అవసరమైన మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. శతక్కొట్టిన కుశాగ్రాట్రిపుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ త్రిపురాన విజయ్ బౌలింగ్లో స్మరణ్ రవిచంద్రన్కు క్యాచ్ ఇవ్వడంతో ఇషాన్ కిషన్ మారథాన్ ఇన్నింగ్స్కు తెరపడింది. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101), అనుకూల్ రాయ్ (45), ఎండీ కొనియన్ ఖురేషి (40) రాణించారు. టెయిలెండర్లలో మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ముకేశ్ కుమార్ డకౌట్ అయ్యాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురాణ విజయ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చామా మిలింద్, శ్రేయస్ గోపాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షేక్ రషీద్కు ఒక వికెట్ దక్కింది.చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్దులిప్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు నమన్ ఓజా పేరిట ఉండేది. సెంట్రల్ జోన్ తరఫున 2014లో నార్త్ జోన్తో మ్యాచ్ సందర్భంగా అతడు 217 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా ఇషాన్ 270 పరుగులు సాధించి నమన్ ఓజాను అధిగమించాడు.చదవండి: షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించిన పాక్ కెప్టెన్! -
రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ 128 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు నిదీశ్ వేసిన బంతి పొత్తి కడుపు కింద భాగంలో బలంగా తాకింది. బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయిన ఇషాన్ స్క్వేర్ లెగ్ రీజియన్ దిశగా పరిగెత్తి అక్కడే కూర్చుండిపోయాడు. ఫిజియో వచ్చి ఇషాన్ గాయాన్ని పర్యవేక్షించాడు. అదే సమయంలో ఫిజియోతో వచ్చిన డాక్టర్ ‘రెస్ట్ తీసుకో’ అని సలహా ఇచ్చాడు. కానీ ఇషాన్ మాత్రం తాను బ్యాటింగ్ కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసిన ఇషాన్ డబుల్ సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. 270 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన మరో 30 బంతుల్లో 250 మార్క్ను చేరుకున్నాడు. ఆ తర్వాత నొప్పి తిరగబెట్టడంతో ఇషాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి ఇషాన్తో మాట్లాడాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. మరి మిగతా మ్యాచ్కు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా? ఉండడా అనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది. ఏది ఏమైనా డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పినా వినకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించి అందరి మన్ననలు పొందాడు.అయితే స్కోరు కార్డుపై మాత్రం ఇషాన్ రిటైర్డ్ హర్ట్ అయినట్లు ప్రదర్శించడంతో అతడు మళ్లీ బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఈస్ట్జోన్ 650 పరుగుల మార్క్ను దాటడంతో తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశం లేకపోలేదు. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్కు చేరడం గమనార్హం. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్జోన్ తాజాగా టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈస్ట్జోన్ 650 పరుగుల మార్క్ను దాటడంతో సౌత్జోన్ అంత స్కోరు చేయాలన్నా రెండు రోజులు పడుతుంది. ఇప్పటికే రెండు రోజుల ఆట ముగియడం, మరో మూడు రోజులు ఉండడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్ ఛాంపియన్గా నిలిచే అవకాశం ఉంది.Ishan Kishan brings up his 2️⃣0️⃣0️⃣ in style 💯💯 🙌What a magnificent knock from the East Zone captain so far 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/2NaE6qG4VK— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026Doctor: rest loIshan: century laga deta hu 💀🙏Ishan Kishan during a Duleep Trophy match, sarcastically noting an apparent injury with "oops🤕" before adding he recovered quickly and is batting well. pic.twitter.com/5eZraPJVix— CricketIndian_🚩🇮🇳 (@CricketIndian_) September 7, 2026 That moment when Ishan Kishan reached 2️⃣5️⃣0️⃣ 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/6YJYiwNtjV— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026చదవండి: భారత్తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్ -
250 రిటైర్డ్ హర్ట్.. చరిత్రలో మూడో బ్యాటర్గా ఇషాన్ కిషన్
సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతడికి కుమార్ కుషాగ్రా (101), శికర్ మోహన్ (85), అభిమన్యు ఈశ్వరన్ (72), వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45) కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఈస్ట్ జోన్ అతి భారీ స్కోర్ దిశగా సాగుతోంది.రెండో రోజు టీ విరామ సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసింది. మొహమ్మద్ ఖురేషి (6 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. టీ విరామానికి ముందు అనుకూల్ రాయ్ ఔటయ్యాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్, చామ మిలింద్ తలో 2 వికెట్లు తీయగా.. షేక్ రషీద్కు ఓ వికెట్ దక్కింది. అభిమన్యు ఈశ్వరన్ రనౌటయ్యాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీతో కదంతొక్కిన ఇషాన్ కిషన్ పలు అరుదైన ఘనతలు సాధించాడు. రామన్ లాంబా (320), అన్షుమన్ గైక్వాడ్ (216), చటేశ్వర్ పుజారా (256), యశస్వి జైస్వాల్ (209) తర్వాత దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్గా, 65 ఏళ్ల దులీప్ ట్రోఫీ చరిత్రలో 250 పరుగుల మార్కును తాకిన మూడో బ్యాటర్గా నిలిచాడు.డబుల్ సెంచరీకి ముందే ఇషాన్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 4000 పరుగులు కూడా పూర్తి చేశాడు. 2014లో ఈ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన ఇషాన్.. ఇప్పటివరకు 10 సెంచరీలు, 19 అర్ద సెంచరీలు చేశాడు.కాగా, ప్రస్తుత మ్యాచ్లో ఇషాన్ 250 పరుగుల తర్వాత రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బంతి పొత్తి కడుపులో బలంగా తాకడం వల్ల ఇషాన్ అసౌకర్యానికి గురయ్యాడు. అప్పుడే అతడు రిటైర్డ్ హర్ట్గా వెళ్తాడని అంతా అనుకున్నారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజ్లో నిలబడిన ఇషాన్ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా డబుల్ సెంచరీ, 250 మార్కును కూడా తాకాడు.చదవండి: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. 26 ఫోర్లు, 2 సిక్స్లతో -
ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. 26 ఫోర్లు, 2 సిక్స్లతో
చెపాక్ స్టేడియం వేదికగా సౌత్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ 270 బంతుల్లో తన రెండో ఫస్ట్క్లాస్ డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 26 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ఫస్ట్క్లాస్ క్రికెట్లో కిషన్ అత్యధిక స్కోర్ 273గా ఉంది. రంజీ ట్రోఫీ (2016–17) మ్యాచ్లో ఢిల్లీ జట్టుపై ఢిల్లీపై అతడు ఈ స్కోర్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.122 ఓవర్లు ముగిసే సరికి ఈస్ట్జోన్ 5 వికెట్ల నష్టానికి 555 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో కిషన్(204)తో పాటు అనుకుల్ రాయ్(30) ఉన్నాడు. సౌత్ జోన్ బౌలర్లు ప్రత్యర్ధి బ్యాటర్లను ఔట్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.కాగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఈస్ట్జోన్కు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందించారు. అనంతరం ఫస్ట్ డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్(85) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఈ క్రమంలో ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ కిషన్.. తనదైన శైలిలో మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కుమార్ కుషాగ్ర (101)తో కలిసి ఐదో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో రోజు ఆటలో కుషాగ్ర ఔటైనప్పటికి కిషన్ మాత్రం తన జోరును కొనసాగిస్తున్నాడు.చదవండి: స్మృతి మంధానపై భారత మాజీ క్రికెటర్ విమర్శలు -
'అందని ద్రాక్ష పుల్లన'.. అతడి విషయంలో నిజమైంది!
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ జట్టు తరఫున ఆడుతున్న 31 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో చాలా సీనియర్ ఆటగాడు. 2019 దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ బాది వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత ఇండియా-ఏ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ ఇండియా-ఏ తరఫున మాత్రం పెద్దగా రాణించలేదు. దేశవాళీ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా 2021 జనవరిలో అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ తుది జట్టులో మాత్రం స్థానం లభించలేదు. అలా 2021 నుంచి 2026 దాకా టెస్టుల్లో అరంగేట్రం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే వస్తున్నాడు అభిమన్యు ఈశ్వరన్. ఇక్కడ మరో విచిత్రమైన విషయమేంటంటే.. అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన 2021 నుంచి అతడి కళ్ల ముందే 11 మంది ఆటగాళ్లు టెస్టుల్లో అరంగేట్రం చేయడం గమనార్హం. ఒక రకంగా అభిమన్యు ఈశ్వరన్ టాలెంట్ను తొక్కసినట్లేననిపిస్తోంది. ఇప్పటివరకు అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 197 ఇన్నింగ్స్ల్లో 8,545 పరుగులు సాధించాడు. ఇందులో 38 అర్థసెంచరీలు, 27 సెంచరీలు ఉన్నాయి. అందని ద్రాక్ష పుల్లన అంటే ఇదేనేమో!చెన్నై వేదికగా జరుగుతున్న తాజా దులీప్ ట్రోఫీ ఫైనల్లోనూ ఈస్ట్జోన్కు ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ మరోసారి ఆకట్టుకున్నాడు. 120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు సాధించాడు. ప్రస్తుతం తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్జోన్ జట్టు 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (63 నాటౌట్) క్రీజులో ఉన్నారు.Meet Abhimanyu Easwaran 🥲>31-year-old Abhimanyu Easwaran was born in Dehradun, Uttarakhand.>At the age of 10, he moved to Kolkata and started his cricket journey.>In the 2019 Duleep Trophy final, he smashed a brilliant century.>After that, he was named in the India A squad.… pic.twitter.com/ryHD2qxmTn— Sam (@cricsam02) September 6, 2026చదవండి: సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్.. తొలిరోజు ఈస్ట్జోన్దే -
సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్.. తొలిరోజు ఈస్ట్జోన్దే
చెన్నై చిదంరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో ఆ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. ఆదివారం సౌత్జోన్తో మొదలైన ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్జోన్ 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (75 బంతుల్లో 63 నాటౌట్) క్రీజులో ఉన్నారు. సౌత్జోన్ బౌలర్లలో సీవీ మిలింద్ 2 వికెట్లు తీయగా, త్రిపురాణా విజయ్ ఒక వికెట్ పడగొట్టాడు.వైభవ్ మాస్.. అభిమన్యు, శిఖర్ క్లాస్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్జోన్కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో 44, 5 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (86 బంతుల్లో 72 పరుగులు) మరో ఎండ్లో నింపాదిగా ఆడాడు. వైభవ్ ఔటయ్యాకా బరిలోకి దిగిన శ్రీకర్ మోహన్ (120 బంతుల్లో 85 పరుగులు) కూడా తనదైన శైలి బ్యాటింగ్తో అలరించాడు. అభిమన్యు, సుదీప్ కుమార్ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగిన్పటికీ, శిఖర్కు జత కలిసిన ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. సౌత్జోన్ బౌలింగ్ను చీల్చి చెండాడిన ఇషాన్ అర్ధసెంచరీ మార్క్ చేరుకున్నాడు. శిఖర్ ఔటైనప్పటికీ, కుమార్ కుషాగ్ర వేగంగా ఆడి పరుగులు రాబట్టాడు. ఇషాన్ కిషన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఇషాన్ కిషన్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది పదో సెంచరీ. అనంతరం కాసేపటికే కుమార్ కుషాగ్ర కూడా అర్థసెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే బ్యాడ్లైట్ కారణంగా అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు.💯 for Ishan Kishan 👏He brings it up in style 💥The East Zone captain leading from the front with a superb knock 🙌Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/ql9el4G60Q— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026చదవండి: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా! -
ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావ్?
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలోనూ సత్తాచాటుతున్నాడు. సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు సౌత్ జోన్తో జరుగుతున్న తుది పోరులోనూ అదరగొట్టాడు.టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ను సైతం ఈ చిచ్చరపిడుగు వదల్లేదు. కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 44 పరుగులు చేసి సౌత్ జోన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.తిలక్ మాస్టర్ ప్లాన్అయితే దూకుడుగా ఆడుతూ డేంజర్గా మారుతున్న వైభవ్ను అడ్డుకోవడానికి వైభవ్ను కట్టడి చేసేందుకు సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశాడు. వైభవ్ దగ్గరకు వెళ్లి, "ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావు?" అంటూ చిన్నగా మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు.తిలక్ విసిరిన ఈ మాటల వలలో పడ్డ వైభవ్, ఒక్కసారిగా ఏకాగ్రత కోల్పోయాడు. తర్వాతి బంతికే భారీ పుల్ షాట్కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో వైభవ్ ఆధిపత్యానికి తెరపడింది. తిలక్ వర్మ వేసిన ఈ మాస్టర్ ప్లాన్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోందితుది జట్లుఈస్ట్ జోన్: అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ, కుమార్ కుషాగ్రా, సుదీప్ కుమార్ ఘరామి, శిఖర్ మోహన్, ఇషాన్ కిషన్(కెప్టెన్), మహ్మద్ కౌనైన్ ఖురైషి, అనుకుల్ రాయ్, మహమ్మద్ షమీ, అభిజిత్ కె సర్కార్, ముఖేష్ కుమార్సౌత్ జోన్: రికీ భుయ్, నారాయణ్ జగదీషన్(వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షేక్ రషీద్, తిలక్ వర్మ(కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, శ్రేయస్ గోపాల్, త్రిపురాన విజయ్, మహ్మద్ సిరాజ్, చామ వి మిలింద్, మహ్మద్ నిధీష్చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్Tilak Verma vs Vaibhav Suryavanshi. pic.twitter.com/YIDfgF0qps— Ishan's Fan (@Ishanworld32) September 6, 2026 4️⃣,6️⃣,4️⃣Vaibhav Sooryavanshi on the charge with some delightful shots 🔥The 50-run stand also comes up between Vaibhav and Abhimanyu Easwaran 🙌Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/0XLR4LI50R— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026 -
భారీ మైలురాయిని తాకనున్న షమీ
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తన కెరీర్లో ఓ భారీ మైలురాయిని తాకనున్నాడు. ఆదివారం సౌత్ జోన్తో మొదలయ్యే దులీప్ ట్రోఫీ ఫైనల్ అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 100వ మ్యాచ్ కానుంది. ఈ టోర్నీలో షమీ ఈస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.షమీ ఇప్పటివరకు 99 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 382 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ 8-90గా (ఇన్నింగ్స్లో) ఉంది. ప్రస్తుత దులీప్ ట్రోఫీలో షమీ ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు.ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్న షమీ రీఎంట్రీ కోసం చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా టీమిండియా సెలెక్టర్లు అతడిని కనికరించడం లేదు. 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు ముందు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (అతడి రంజీ జట్టు అసోసియేషన్) షమీని సత్కరించింది. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంతకం చేసిన 100వ నంబర్ జెర్సీని బహుకరించింది. ఈస్ట్ జోన్ సహచరులు కూడా సంతకాలు చేసిన జెర్సీని షమీకి బహుకరించారు.MOHAMMED SHAMI 100* 🇮🇳- A special gift from Cricket Association of Bengal for Mohammed Shami.Indian legend will be playing his 100th First Class matches tomorrow. pic.twitter.com/SVwDBKsL9p— Johns. (@CricCrazyJohns) September 5, 2026షమీ తన 100వ మ్యాచ్పై స్పందిస్తూ, ఈ ప్రయాణం హార్డ్ వర్క్, సవాళ్లు, నేర్చుకోవడం, మరచిపోలేని జ్ఞాపకాలతో సాగిందని అన్నాడు. ఈ ప్రత్యేక మైలురాయికి తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్లు, సహచరులు, అభిమానులతో పాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలిపాడు.చదవండి: పాకిస్తాన్ మ్యాచ్లో చరిత్ర సృష్టించిన షఫాలీ.. సరికొత్త ప్రపంచ రికార్డులు -
పడిక్కల్ ఎంట్రీ.. ఆంధ్ర ప్లేయర్పై వేటు?
దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్ బాల్ టోర్నమెంట్ దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్కు రంగం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్- సౌత్ జోన్ టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో సౌత్ జోన్ జట్టుకు శుభవార్త అందింది.టీమిండియా స్టార్లు మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్ జట్టుతో చేరారు. సౌత్ జోన్ కెప్టెన్, టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ శనివారం ధ్రువీకరించాడు. పడిక్కల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు. మ్యాచ్కు ముందు విలేకరులతో మాట్లాడుతూ..మరింత పటిష్టంగా‘‘పడిక్కల్ రాకతో మా బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారింది. గత రెండు, మూడు మ్యాచ్లలో అతడు అద్భుత ఫామ్ను కొనసాగించాడు. నిజంగా అతడు రావడం మా జట్టుకు అదనపు బలం. ఇక సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మా బౌలింగ్ విభాగానికి సిరాజ్ బలంగా మారాడు. తన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకున్నాడు. మా జట్టులోని కొంత మంది జూనియర్ ఆటగాళ్లకు ఇదొక అదనపు ప్రయోజనం.ఓపెనర్లుగా వాళ్లేఇక ఇంతకుముందు రికీ భుయ్ ఓపెనర్గా వచ్చాడు. అయితే, అతడు మిడిలార్డర్లో ఆడుతున్నాడు. ఇప్పుడు జగ్గీ (జగదీశ్ నారాయణన్)తో కలిసి మరోసారి ఓపెనింగ్ చేస్తాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా సీనియర్ ప్లేయర్ రికీ భుయ్ సేవలు వాడుకుంటున్నాము’’ అని తిలక్ వర్మ తెలిపాడు.నో రాహుల్కాగా పడిక్కల్ వన్డౌన్లో ఆడుతుండటంతో.. ఆంధ్ర ప్లేయర్ షేక్ రషీద్పై వేటు పడింది. కీలక సెమీస్ మ్యాచ్లో అతడు (0,1) పూర్తిగా విఫలమయ్యాడు. ఇదిలా ఉంటే.. పడిక్కల్, సిరాజ్లతో పాటు టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా సౌత్ జోన్ తరఫున దులిప్ ట్రోఫీ ఫైనల్లో ఆడతాడనే ప్రచారం జరిగింది. అయితే, తిలక్ వర్మ మాత్రం జగ్జీ- రికీ భుయ్ ఓపెనర్లుగా వస్తారని.. పరోక్షంగా ఈ ప్రచారాన్ని ఖండించాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా ఇటీవలే శ్రీలంక పర్యటన ముగించుకుంది. ఈ టూర్లో భాగంగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత్ 1-0తో గెలిచింది. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ రెండు టెస్టుల్లో కలిపి రెండు శతకాలు బాదాడు. మరోవైపు.. సిరాజ్ లంకతో టెస్టు సిరీస్లో రెండు వికెట్లు పడగొట్టాడు.చదవండి: ‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీని ఎవరూ ఆపలేరు’ -
‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీ ఆపలేరు’
టీమిండియా సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ జాతీయ జట్టులో చోటు కోల్పోయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో 13 ఏళ్ల తర్వాత ఈస్ట్జోన్ ఫైనల్కు చేరడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో జరిగిన సెమీఫైనల్లో షమీ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆదివారం నుంచి ఈస్ట్జోన్, సౌత్జోన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఆటగాడు బాగా రాణిస్తున్నాడంటే ఎంపికకు అతడి వయసుతో సంబంధముండదని తెలిపాడు. షమీ విషయంలోనూ అదే వర్తిస్తుందని, జట్టులో చోటు కోల్పోయినప్పటి నుంచి షమీ కసితో ఉన్నాడని, అతడిని టీమిండియాకు ఎంపిక చేయాల్సిన సమయం వచ్చిందని ఇషాన్ అభిప్రాయపడ్డాడు.Photo Credit: BCCI Twitterఇషాన్ మాట్లాడుతూ.. ‘‘అత్యుత్తమ ఆటగాళ్లలో షమీ ఒకడని నేను భావిస్తున్నాను. స్టార్గా వెలుగొందుతున్న షమీ బెంగాల్ తరఫున ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతీ మ్యాచ్లో వికెట్లు తీస్తూ కీలక బౌలర్గా మారిపోయాడు. ఒక బౌలర్గా టీమిండియాకు కూడా ఎంతో సేవ చేశాడు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని నేను భావిస్తాను. కష్టపడుతున్న సమయంలో వయసును లెక్కలోకి తీసుకోకూడనేది నా అభిప్రాయం. షమీ భాయ్లో ఆ కసి నాకు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎలా ఆడాడు అనేదాన్ని పక్కనబెట్టి ఇప్పుడెలా ఆడుతున్నాడనే దానిపై బీసీసీఐ సెలెక్టర్లు దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఈస్ట్జోన్ జట్టుకు షమీ ఆడుతుండడం మా అదృష్టం. అతడు మా జట్టులో ఉండడం మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. 36 ఏళ్ల వయసులో ఎక్కువ ఓవర్లు వేస్తే అలసిపోయే బౌలర్లతో పోలిస్తే షమీ వేరుగా కనిపిస్తాడు. Photo Credit: BCCI Twitterనేను అడగకముందే జట్టుకు వికెట్ అవసరమైనప్పుడల్లా తాను బౌలింగ్ చేస్తానంటూ షమీ భాయ్ ముందుకు వచ్చేవాడు. ఒక కెప్టెన్గా అతడి కసిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. టీమిండియాలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే అతడి తాపత్రయం నా కళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆకలిగొన్న సింహంలా కనిపిస్తున్నాడు. షమీ భాయ్ రీఎంట్రీని ఎవరూ ఆపలేరు.’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఇక సౌత్జోన్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా షమీపై ప్రసంశల జల్లు కురిపించాడు. షమీ లాంటి చాకచక్యమైన పేసర్ను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని తిలక్ వర్మ పేర్కొన్నాడు. షమీ భాయ్తో ఆడడం మాకు ఎప్పుడూ ఇష్టమే అని తిలక్ వెల్లడించాడు. ఇటీవలే షమీ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 900 వికెట్ల మార్క్ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.Read: నాలుగేళ్ల తర్వాత బరిలో విలియమ్స్ సిస్టర్స్.. ఫలితం ఏంటంటే? -
సిరాజ్తో పాటు ఆ ఇద్దరు టీమిండియా స్టార్లకు పిలుపు!
దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నమెంట్ దులిప్ ట్రోఫీ-2026 సీజన్ తుదిదశకు చేరుకుంది. సెప్టెంబరు 6న మొదలయ్యే ఫైనల్లో ఈస్ట్ జోన్- సౌత్ జోన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకు చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియం వేదిక.ముగ్గురు టీమిండియా స్టార్లకు పిలుపుఈ నేపథ్యంలో దులిప్ ట్రోఫీ ఫైనల్లో ఆడాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ముగ్గురు టీమిండియా స్టార్లకు పిలుపు వచ్చినట్లు సమాచారం. భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, శతకాల వీరుడు దేవదత్ పడిక్కల్ సౌత్ జోన్ తరఫున బరిలోకి దిగనున్నట్లు PTI వెల్లడించింది.కాగా ఈ ముగ్గురూ ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడారు. అయితే, సాయి సుదర్శన్ గాయం కారణంగా దూరం కాగా.. పడిక్కల్ ఊహించని రీతిలో తుదిజట్టులోకి వచ్చాడు. మూడో స్థానంలో వచ్చి రెండు సెంచరీలతో అలరించాడు.మళ్లీ దేశీ క్రికెట్ బరిలోతదుపరి న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా టెస్టులు ఆడాల్సి ఉండగా.. పడిక్కల్ మళ్లీ దేశీ క్రికెట్ బరిలో దిగుతుండటం విశేషం. దులిప్ ట్రోఫీ ఫైనల్లోనూ సత్తా చాటి టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకోవాలని పడిక్కల్ పట్టుదలగా ఉన్నాడు.ఇక కేఎల్ రాహుల్తో పాటు పడిక్కల్ కూడా దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ఆడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు చివరగా ఫిబ్రవరి 2026లో జమ్మూ కశ్మీర్తో రంజీ ట్రోఫీ ఫైనల్లో బరిలోకి దిగారు. అయితే, జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఇక సిరాజ్ హైదరాబాద్ ఆటగాడన్న సంగతి తెలిసిందే.స్టార్ల మధ్య పోరు దులిప్ ట్రోఫీ ఫైనల్ నేపథ్యంలో కేఎల్ రాహుల్, పడిక్కల్, సిరాజ్ సౌత్ జోన్కు ఆడనున్నారు. ఈ జట్టుకు టీమిండియా స్టార్ తిలక్ వర్మ కెప్టెన్. మరోవైపు.. ఈస్ట్ జోన్ను ఫైనల్కు చేర్చడంలో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన వంతు పాత్ర పోషించాడు. ఈ జట్టుకు భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ కాగా.. వైభవ్ అతడికి డిప్యూటీ.టీమిండియా స్టార్ల రాకతో దులిప్ ట్రోఫీ ఫైనల్ మరింత రసవత్తరంగా మారనుంది. తిలక్ వర్సెస్ ఇషాన్ పోరులో.. రాహుల్, పడిక్కల్, సిరాజ్... వైభవ్ సూర్యవంశీ ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సౌత్ జోన్లో తనయ్ త్యాగరాజన్ స్థానాన్ని సిరాజ్ భర్తీ చేస్తున్నట్లు సమాచారం.చదవండి: టీమిండియా హెడ్కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ -
టెస్టు క్రికెట్పై తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
దులీప్ ట్రోఫీలో భాగంగా వన్ మ్యాన్ షో చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. నార్త్జోన్తో జరిగిన సెమీఫైనల్లో సౌత్జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో అజేయ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో అజేయ అర్థసెంచరీతో జట్టును విజయపథంలో నడిపించి "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్రజంటేషన్ సందర్భంగా తిలక్ వర్మ తన క్రికెట్ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రెడ్ బాల్ క్రికెట్ ఆడడాన్ని ఎంతో ఇష్టపడుతా. వైట్బాల్ క్రికెట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని నేనెప్పుడు కల కనలేదు. అదంతా దేవుడే ప్లాన్ చేశాడని భావిస్తున్నా. తొలుత టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన నేను తర్వాత వన్డే క్రికెట్ కూడా ఆడాను. కానీ రెడ్బాల్ క్రికెట్లో బలాన్ని నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్నా. అదే నా కల..ఎప్పటికైనా టీమిండియా టెస్టు జట్టులో ఆడాలన్నదే నా కల. అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నా. నిజానికి పదేళ్ల వయసు నుంచే క్రికెట్లో కష్టపడుతున్నా. నా కష్టాన్ని ఎవరూ చూసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నా వయసు 23. ఐపీఎల్ కారణంగా వైట్బాల్ క్రికెట్లో టీమిండియాకు ఎంపికయ్యాను. కానీ ఐపీఎల్కు రాకముందే రెడ్ బాల్ క్రికెట్లో చాలా కష్టంతో కూడిన గ్రౌండ్వర్క్ చేశాను. అందుకే టెస్టు క్రికెట్ ఆడడాన్ని ప్రేమించడంతో పాటు ఎంజాయ్ చేస్తాను. అదే నా బలం కూడా. ఇప్పుడైతే దేశం తరఫున టీ20లు, వన్డేల్లో ఆడుతున్నాను. గత మూడు, నాలుగేళ్లుగా దేశవాళీ క్రికెట్లో రెడ్బాల్ క్రికెట్ ఆడేందుకు సమయం కుదరడం లేదు. రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటున్నప్పటికీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా అదీ జరగడం లేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే రెడ్బాల్ క్రికెట్లో వీలైనంత మేర రాణించాలని భావించాను.’ అని చెప్పుకొచ్చాడు.ఈజీగా మార్చుకోగలను..అయితే టెస్టుల్లో ఇప్పుడు మూడు లేదా ఆరో స్థానం ఖాళీగా ఉంది. ఒకవేళ మీకు అవకాశమొస్తే ఆ స్థానాలను భర్తీ చేయగలరా అని తిలక్ వర్మకు ప్రశ్న ఎదురైంది. దీనిపై తిలక్ వర్మ స్పందిస్తూ.. ‘నిజానికి రెడ్బాల్ నుంచి వైట్బాల్కు షిఫ్ట్ అవ్వడం ఈజీ. అదే సమయంలో వైట్బాల్ నుంచి రెడ్బాల్కు షిఫ్ట్ అవ్వడం కఠినం. కానీ నేను సాధ్యమైతనంత మేర వైట్బాల్ నుంచి రెడ్బాల్కు సులువుగానే మారగలను. అయితే రెడ్బాల్ క్రికెట్లో మంచి టెక్నిక్ ఉన్నప్పుడే మనం అన్ని ఫార్మాట్లలోనూ గుడ్ ప్లేయర్గా మారగలం’ అని పేర్కొన్నాడు. ఇక దులీప్ ట్రోఫీలో సౌత్జోన్ జట్టు ఫైనల్ చేరడం సంతోషంగా ఉందని తెలిపాడు. తనకు ఫైనల్ మ్యాచ్ ఆడాలని ఉందని, కానీ అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ కారణంగా అది సాధ్యపడుతుందా అనేది చూడాలని తెలిపాడు. నిజానికి ఆఫ్గన్తో తొలి టీ20 మ్యాచ్ 13న జరగనుండడంతో, 11న టీమిండియాకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నాడు. తనకు సాధ్యమైతే మాత్రం ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు రెడీ ఉన్నట్లు తిలక్ వర్మ వెల్లడించాడు.South Zone cruise into the final 🙌They chase down 181 and beat North Zone by 7 wickets 👌Scorecard ▶️ https://t.co/AGjIStrDAT#DuleepTrophy | #SZvNZ pic.twitter.com/UXTDC4wdF4— BCCI Domestic (@BCCIdomestic) September 2, 2026 🚨 CAPTAIN TILAK VARMA SHINES IN THE SEMIFINAL! Tilak Varma led South Zone into the Duleep Trophy final with a brilliant all-round batting display:116* (250) — 1st innings51* (79) — 2nd inningsHighest scorer of the matchPlayer of the Match#TilakVarma #DuleepTrophy… pic.twitter.com/36hLYlXrEX— Clutch Sports (@Clutchsportsz) September 2, 2026చదవండి: లంక జట్టు ప్రకటన; రెండేళ్ల తర్వాత జట్టులోకి మాజీ కెప్టెన్! -
తిలక్ వర్మ వన్మ్యాన్ షో.. ఫైనల్లో సౌత్జోన్
దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో సౌత్జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2 వేదికగా నార్త్జోన్తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్జోన్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యాన్ని సౌత్జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. కెప్టెన్ తిలక్ వర్మ (79 బంతుల్లో 51 నాటౌట్) అజేయ అర్థ సెంచరీతో జట్టును విజయపథంలో నడిపించగా, స్మరణ్ రవిచంద్రన్ (32 నాటౌట్) అతడికి సహకరించాడు. అంతకముందు ఓపెనర్లు రికీ భుయ్ (42), నారాయన్ జగదీషన్ (43) రాణించారు. నార్త్జోన్ బౌలర్లలో అబిద్ ముస్తాక్ 2 వికెట్లు తీయగా, గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్లో అజేయ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో అజేయ అర్థ సెంచరీతో రాణించి మ్యాచ్లో వన్మ్యాన్ షో ప్రదర్శన కనబరిచిన కెప్టెన్ తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఆదివారం (సెప్టెంబర్ 9 నుంచి) నుంచి మొదలకానున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్తో సౌత్జోన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక నార్త్జోన్ తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం సౌత్జోన్ 312 పరుగులకు ఆలౌట్ కాగా, తిలక్ వర్మ అజేయ సెంచరీతో మెరిశాడు. దీంతో సౌత్జోన్కు తొలి ఇన్నింగ్స్లో 117 పరుగుల ఆధిక్యం లభించింది. తమ రెండో ఇన్నింగ్స్లో నార్త్జోన్ 297 పరుగులకు ఆలౌట్ కావడంతో సౌత్జోన్ ముంగిట 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. South Zone cruise into the final 🙌They chase down 181 and beat North Zone by 7 wickets 👌Scorecard ▶️ https://t.co/AGjIStrDAT#DuleepTrophy | #SZvNZ pic.twitter.com/UXTDC4wdF4— BCCI Domestic (@BCCIdomestic) September 2, 2026Read: ‘సీఎం సార్ ప్లీజ్ ఒక్క ఫొటో’.. కేరళలో రొనాల్డో సోదరి -
గెలిపించిన షమీ, ఇషాన్ కిషన్.. ఫైనల్లో ఈస్ట్జోన్
దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. బెంగళూరులోకి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరిగిన సెమీఫైనల్లో ఈస్ట్జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్పై విజయాన్ని అందుకుంది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్జోన్ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (39 నాటౌట్), మహ్మద్ షమీ (8 నాటౌట్) అజేయంగా నిలిచి ఈస్ట్జోన్ను గెలిపించారు. వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (40) రాణించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక సెంట్రల్ జోన్ తమ ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌట్ కాగా, ఈస్ట్ జోన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే రెండో ఇన్నింగ్స్లో షమీ, ముకేశ్ కుమార్ మెరుపులతో సెంట్రల్ జోన్ అనూహ్యంగా 158 పరుగులకే కుప్పకూలింది. అయితే ఛేదనలో ఈస్ట్జోన్ కాస్త తడబడినప్పటికీ, ముందు వైభవ్.. చివర్లో ఇషాన్, షమీలు బాధ్యతగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.139 పరుగుల ఆధిక్యంలో నార్త్జోన్మరోవైపు నార్త్జోన్, సౌత్జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్లో నార్త్జోన్ 139 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి నార్త్జోన్ 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. నిషాంత్ సింధూ (20), అన్షుల్ కంబోజ్ (29) క్రీజులో ఉన్నారు. అంతకముందు సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులకు ఆలౌటైంది.𝐄𝐀𝐒𝐓 𝐙𝐎𝐍𝐄 𝐀𝐑𝐄 𝐈𝐍 𝐓𝐇𝐄 𝐃𝐔𝐋𝐄𝐄𝐏 𝐓𝐑𝐎𝐏𝐇𝐘 𝐅𝐈𝐍𝐀𝐋! 🔥🏆A statement win over defending champions Central Zone, sends East Zone into the Duleep Trophy summit clash! 💥👏 pic.twitter.com/lNed1OiRyt— CricTracker (@Cricketracker) September 1, 2026Read: రిటైర్మెంట్ విషయంలోనూ మెస్సీ రికార్డు -
మరోసారి దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ!
దులిప్ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్లో వరుసగా బౌండరీలు బాది దుమ్ములేపాడు. అయితే, ఆఖరికి యశ్ ఠాకూర్ పైచేయి సాధించడంతో.. అదే ఓవర్లో అవుటై వైభవ్ పెవిలియన్ చేరాడు.దులిప్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ఈస్ట్ జోన్- సెంట్రల్ జోన్ తలపడుతున్నాయి. బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌత్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌట్ అయింది.ధనాధన్ఆ తర్వాత ఈస్ట్ జోన్ సైతం సరిగ్గా 266 పరుగులే చేసి తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీ (69) సాధించగా.. వైభవ్ సూర్యవంశీ ఆది నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పొట్టి క్రికెట్ మాదిరి చెలరేగి కేవలం 42 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగించిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏడు ఫోర్లు, ఏడు సిక్స్ల సాయంతో 92 పరుగులు చేశాడు. అయితే, హర్ష్ దూబే బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి విఫలం కాగా.. అర్షద్ ఖాన్ క్యాచ్ పట్టడంతో వైభవ్ ఇన్నింగ్స్కు తెరపడింది.నెమ్మదిగా మొదలుపెట్టినా..ఇదిలా ఉంటే.. సౌత్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 158 పరుగులకే కుప్పకూలింది. దీంతో మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈస్ట్ జోన్ 159 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఆరంభంలో కాస్త నెమ్మదిగానే ఆడినా.. 14వ ఓవర్లో మాత్రం దూకుడు ప్రదర్శించాడు. 4⃣,6⃣,4⃣,4⃣, 🇼Vaibhav Sooryavanshi 🆚 Yash Thakur battle part 2⃣ 🔥#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/wX8L5AHdTB— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026ఆఖరి బంతికి అవుట్సౌత్ జోన్ పేస్ బౌలర్ యశ్ ఠాకూర్ బౌలింగ్లో మొదటి బంతికి ఫోర్ బాదిన వైభవ్.. రెండో బంతిని సిక్సర్గా మలిచాడు. మూడు, నాలుగు బంతుల్లో మళ్లీ ఫోర్లు బాదాడు. అయితే, ఐదో బంతికి పరుగుకు యత్నించని వైభవ్.. ఆఖరి బంతికి మరోసారి షాట్కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు.What. A. Catch 😮Central Zone captain Rajat Patidar pulls off an absolute blinder 🔥Scorecard ▶️ https://t.co/kyExeix2VY#DuleepTrophy | #CZvEZ pic.twitter.com/NfAD3Kk9RH— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026యశ్ ఠాకూర్ వేసిన బౌండరీ వైపు తరలించగా.. సౌత్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. లక్ష్య ఛేదనలో మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 40 పరుగులు చేశాడు. చదవండి: ‘నువ్వెంత కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ -
35 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్నాడు; ట్రోల్ చేసినోళ్లకు హెచ్చరిక
దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్లోనే కాదు ఫీల్డింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. సెంట్రల్ జోన్తో జరుగుతున్న సెమీఫైనల్లో షమీ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో షమీ తీసిన మూడు వికెట్లు తీయగా.. అందులో క్రీజులో పాతుకుపోయిన హర్ష్ దూబేని అద్భుత రీతిలో కాట్ అండ్ బౌల్డ్గా పెవిలియన్ చేర్చడం విశేషం. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1లో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్ 46వ ఓవర్ షమీ యార్కర్ బాల్ వేశాడు. హర్ష్ దూబే డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా, బంతి ఎడ్జ్ అయి షమీ వైపు దూసుకొచ్చింది. అప్రమత్తమైన షమీ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడంతో హర్ష్ దూబే షాక్ తిన్నాడు. Photo Credit: BCCI Twitterఅప్పటికే హర్ష్ దూబే 51 బంతుల్లో 24 పరుగులతో క్రీజులో నిలదొక్కుకున్నాడు. హర్ష్దూబే వెనుదిరిగిన వెంటనే సెంట్రల్ జోన్ ఆలౌటైంది. షమీ 56 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో సెంట్రల్ జోన్ 50.2 ఓవర్లలో 158 పరుగులకు ఇన్నింగ్స్ను ముగించింది. 35 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫిట్నెస్తో అదరగొడుతున్న షమీని జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో షమీ నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం అభినందించాల్సిన విషయం.గతేడాది విజయ్ హజారే ట్రోఫీలోనూ షమీ అంచనాలకు మించి రాణించాడు. ఏడు ఇన్నింగ్స్లు కలిపి 15 వికెట్లు పడగొట్టాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 సీజన్లో షమీ బెంగాల్ తరఫున ఏడు మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలోనూ షమీ ఏడు మ్యాచ్ల్లోనే 37 వికెట్లు పడగొట్టి సెలెక్టర్లకు హెచ్చరికలు పంపాడు.షమీ భారత్ తరఫున చివరిసారి 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటినుంచి షమీ మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు. 2023లో భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో షమీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ టోర్నీలో 24 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ, గాయాలు అతడిని తరచూ ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు అదే గాయాల సాకుతో టీమిండియా మేనేజ్మెంట్ షమీని పూర్తిగా పక్కనబెట్టేయడం గమనార్హం.Brilliant reflexes 👌Mohd. Shami pulls off a fantastic one-handed-catch off his own bowling to dismiss Harsh Dubey 🙌#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/G7ZYgbpmi7— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026Read: కెప్టెన్గా శార్దూల్ ఠాకూర్పై వేటు -
రింకూ సింగ్ విఫలం.. వైభవ్ సూర్యవంశీ దంచికొడితే!
దులిప్ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సెంట్రల్ జోన్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ వరుస విరామాల్లో వికెట్లు కూల్చారు. ఫలితంగా సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 158 పరుగులకే కుప్పకూలింది.నామమాత్రపు లక్ష్యంతద్వారా ఈస్ట్ జోన్కు 159 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని విధించగలిగింది. కాగా బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ సెమీస్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడగా.. అతడి డిప్యూటీ వైభవ్ సూర్యవంశీ తొలిరోజే తాత్కాలిక కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు.ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్లో ఈస్ట్ జోన్.. సెంట్రల్ జోన్ను 266 పరుగులకు ఆలౌట్ చేసింది. ముకేశ్ కుమార్, అభిజీత్ సర్కార్ మూడేసి వికెట్లు కూల్చగా.. మహ్మద్ షమీ, ఎండీ కౌనియన్ ఖురేషి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.టీ20 ఫార్మాట్ తరహాలో ధనాధన్అనంతరం బ్యాటింగ్కు దిగిన ఈస్ట్ జోన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్లో సరిగ్గా 266 పరుగులకే ఆలౌట్ అయింది. ఈస్ట్ జోన్ ఈ స్కోరు చేయడంలో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీదే కీలక పాత్ర. అభిమన్యు అర్ధ శతకం (106 బంతుల్లో 69)తో ఆకట్టుకోగా.. వైభవ్ మాత్రం టీ20 ఫార్మాట్ తరహాలో ధనాధన్ దంచికొట్టాడు.అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 92 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో సుదీప్ ఘరామి (25) ఒక్కడే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు.చెలరేగిన ముకేశ్ కుమార్, షమీఈ క్రమంలో రెండో రోజు తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్.. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఇక మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 158 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అమన్ మోఖడే (41) రాణించాడు. సౌత్ జోన్ ఇన్నింగ్స్లో అతడిదే టాప్ స్కోరు.Superb bowling 🙌Mukesh Kumar outsmarts Aman Mokhade with an excellent setup👌#DuleepTrophy | #CZvEZ pic.twitter.com/voMx1Bt43n— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026మిగిలిన వారిలో రింకూ సింగ్ (20) నిరాశపరచగా.. హర్ష్ దూబే 24, అర్షద్ ఖాన్ 25 పరుగులు రాబట్టారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ మూడు వికెట్లు కూల్చాడు. అనుకుల్ రాయ్, ఎండీ కౌనియన్ ఖురేషి, అభిజిత్ సర్కార్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మూడో రోజు ఆట సందర్భంగా ఈస్ట్ జోన్ సారథి ఇషాన్ కిషన్ తిరిగి వచ్చాడు. దీంతో బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టమైంది.Brilliant reflexes 👌Mohd. Shami pulls off a fantastic one-handed-catch off his own bowling to dismiss Harsh Dubey 🙌#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/G7ZYgbpmi7— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026ఇక సౌత్ జోన్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఈస్ట్ జోన్ బరిలోకి దిగింది. తొలి ఇన్నింగ్స్లో మాదిరే వైభవ్ సూర్యవంశీ దంచికొడితే మాత్రం ఈస్ట్ జోన్ సులువుగానే ఫైనల్ చేరడం ఖాయం.చదవండి: భారత్తో సిరీస్.. ఆసీస్ జట్ల ప్రకటన -
కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ బ్యాడ్ టైం అంటే ఇదేరా బుద్దోడా
-
సచిన్ను వెంటాడిన ఫోబియా వైభవ్కు అంటుకుందా?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు (అన్ని ఫార్మాట్లు) సాధించిన ఏకైక క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అయితే సచిన్కు నెర్వస్ నైంటీస్ ఫోబియా ఉండేది. ఈ కారణంగా సచిన్ చాలాసార్లు సెంచరీలు చేజార్చుకున్నాడు. ఒకవేళ సచిన్కు 90 ఫోబియా లేకపోయుంటే అతడి ఖాతాలో 150 సెంచరీలు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా చిన్న వయసులోనే క్రికెట్లో అడుగుపెట్టి సచిన్ రికార్డును బద్దలుకొట్టిన వైభవ్ సూర్యవంశీని కూడా 90 ఫోబియా చుట్టుముట్టేసింది. ఈ మధ్యకాలంలో వైభవ్ తొంభైల్లో చాలాసార్లు ఔటయ్యాడు.ఇటీవలి కాలంలో ఐపీఎల్ నుంచి దేశవాళీ టోర్నీలు, అనధికారిక మ్యాచ్లు చూసుకుంటే వైభవ్ వరుసగా 93 (38 బంతుల్లో), 97 (29 బంతుల్లో), 96 (47 బంతుల్లో), తాజాగా దులీప్ ట్రోఫీలో 92 పరుగుల వద్ద సెంచరీలకు అతి సమీపంలోకి వచ్చి అవుట్ అయ్యాడు. ఇలా ఇప్పటికే నాలుగు సెంచరీలను చేజార్చుకున్నాడు.ఏమిటీ నెర్వస్ నైంటీస్?90 ఫోబియాను క్రికెట్ పరిభాషలో "నెర్వస్ నైంటీస్" (Nervous Nineties) అని పిలుస్తారు. ఒక బ్యాటర్ సెంచరీ (100 పరుగులు) మైలురాయికి చేరుకునే ముందు, 90 నుండి 99 పరుగుల మధ్య ఒత్తిడికి గురై అవుట్ అవ్వడాన్ని ఇది సూచిస్తుంది. సాధారణంగా బ్యాటర్లు 90ల్లోకి రాగానే సెంచరీ కోసం కాస్త నెమ్మదిగా ఆడతారు. ఈ తరుణంలో అనవసర ఒత్తిడికి లోనయ్యి వికెట్ను ఇచ్చేసుకుంటారు. సచిన్ తన కెరీర్లో చాలాసార్లు ఈ నెర్వస్ నైంటీస్ను ఎదుర్కొన్నాడు. తాజాగా వైభవ్ను కూడా నెర్వస్ నైంటీస్ ఫోబియా చుట్టుముట్టినట్లుగా అనిపిస్తోంది.ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (5), ఆర్యన్ పాండే (4) క్రీజులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ 43 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌట్ కాగా, తొలి ఇన్నింగ్స్లో సెంట్రల్ జోన్ కూడా 266 పరుగులకే ఆలౌటైంది.HEARTBREAKING MOMENT FOR VAIBHAV SOORYAVANSHI !💔Vaibhav Suryavanshi missed his maiden century in the Duleep Trophy by just 8 runs. - Just look at the reaction of Vaibhav Suryavanshi 😭😭 pic.twitter.com/BYA3KPUSc3— lndian Sports Network (@IS_Netwrk29) August 31, 2026Read: దుమ్మురేపుతున్న షమీ.. ప్రొఫెషనల్ క్రికెట్లో అరుదైన ఫీట్ -
దుమ్మురేపుతున్న షమీ.. ప్రొఫెషనల్ క్రికెట్లో అరుదైన ఫీట్
భారత జట్టులో చోటు కోల్పోయినప్పటికీ సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్లో తన బౌలింగ్తో దుమ్మురేపుతున్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న షమీ.. సెంట్రల్ జోన్పై రెండు వికెట్లు తీసి ప్రొఫెషనల్ క్రికెట్లో 900 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం ఫస్ట్క్లాస్, లిస్ట్-ఎ, టీ20 ఫార్మాట్లలో కలిపి షమీ 900 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ప్రొఫెషనల్ క్రికెట్లో 900 వికెట్లు సాధించిన ఆరో బౌలర్గా షమీ రికార్డులకెక్కాడు. ఇక షమీ ఖాతాలో ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 379 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్లో 283 వికెట్లు, టీ20ల్లో 238 వికెట్లు పడగొట్టాడు.ఇక ప్రొఫెషనల్ క్రికెట్లో భారత పేసర్లలో కపిల్ దేవ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా తొలి స్థానంలో ఉన్నాడు. కపిల్దేవ్ ఖాతాలో 1170 వికెట్లు ఉన్నాయి. రెండో స్థానంలో జహీర్ ఖాన్ (1168 వికెట్లు), జయదేవ్ ఉనద్కత్ (941 వికెట్లతో) మూడవ స్థానంలో ఉన్నాడు. జవగల్ శ్రీనాథ్ 940 వికెట్లతో నాలుగవ స్థానం, వినయ్ కుమార్ 923 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.షమీ చివరిసారిగా గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జెర్సీలో ఆడాడు. అప్పటి నుంచి అతనికి జాతీయ జట్టులో అవకాశం రాలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ యువ ఆటగాళ్లపైనే దృష్టి సారించడంతో షమీని పట్టించుకోవడం లేదు.ఇక బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ 900 వికెట్ల మార్క్ అందుకున్న షమీకి కృతజ్ఞతలు తెలిపింది. "మహ్మద్ షమీకి అభినందనలు. ప్రొఫెషనల్ క్రికెట్లో 900 వికెట్లు తీసిన ఆరో భారత పేసర్గా నిలవడం అంత సులభం కాదు. షమీ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 379 వికెట్లు, లిస్ట్ ఎ క్రికెట్లో 283, టీ20లలో 238 వికెట్లు పడగొట్టాడు. అతని ఈ ఘనతకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ గర్విస్తోంది." అని పేర్కొంది.THE CLASS OF SHAMI 🫡🔥- He completed 900 wickets in Professional cricket. pic.twitter.com/0t4jUs6fMZ— Johns. (@CricCrazyJohns) August 31, 2026Read: జకోవిచ్.. ప్లీజ్ రిటైరవ్వు; ఇలా చూడలేకపోతున్నాం! -
శతక్కొట్టిన తిలక్ వర్మ
నార్త్ జోన్తో మ్యాచ్లో టీమిండియా స్టార్, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ శతక్కొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డ ఈ కెప్టెన్ సాబ్ 218 బంతుల్లో ఎట్టకేలకు వంద పరుగుల మార్కు అందుకున్నాడు. దేశీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ 2026 రెండో సెమీ ఫైనల్లో భాగంగా సౌత్ జోన్- నార్త్ జోన్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2లో తలపడుతున్నాయి.195 పరుగులకే ఆలౌట్ ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన నార్త్ జోన్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ అర్ద శతకం (76)తో ఆకట్టుకోగా.. కెప్టెన్ కన్హయ్య వాధ్వాన్ 35 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకే ఆలౌట్ అయింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్కు అన్షుల్ కాంబోజ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ రికీ భుయ్ను 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ చేశాడు. ఇక వన్డౌన్లో వచ్చిన షేక్ రషీద్ డకౌట్ అయ్యాడు. గుర్నూర్ బ్రార్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 175 పరుగుల భాగస్వామ్యంఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (63 బంతుల్లో 36) కాస్త ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ తిలక్ వర్మ సౌత్ జోన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. స్మరణ్ రవిచంద్రణ్ (27)తో కలిసి 37 పరుగులు జోడించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. శ్రేయస్ గోపాల్తో కలిసి ఏడో వికెట్కు ఏకంగా 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.పాపం శ్రేయస్అయితే, సెంచరీ దిశగా పయనిస్తున్న శ్రేయస్ను అర్ష్దీప్ సింగ్ బోల్తా కొట్టించాడు. దీంతో 88 పరుగుల వద్ద శ్రేయస్ అవుటయ్యాడు. దీంతో తిలక్- శ్రేయస్ల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత తనయ్ త్యాగరాజన్ (6).. విద్వత్ కావేరప్ప (0), ఎండీ నిధీశ్ (0- రనౌట్) త్వరత్వరగా పెవిలియన్ చేరారు.ఎట్టకేలకు సెంచరీఅప్పటికి 91 పరుగుల వద్ద ఉన్న తిలక్ వర్మకు కావూరి సాయితేజ తోడయ్యాడు. చేతిలో ఒకే ఒక్క వికెట్ ఉండగా.. సాయి తేజ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. తిలక్ వర్మ ఎట్టకేలకు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒత్తిడిలోనూ మెరుగ్గా రాణించి శతక మార్కు అందుకున్న తిలక్.. జట్టును భారీ ఆధిక్యం దిశగా నడిపిస్తున్నాడు. ముగిసిన రెండో రోజు ఆటఈ క్రమంలో సోమవారం నాటి ఆట ముగిసే సరికి సౌత్ జోన్ 94 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్లో 90 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తిలక్ వర్మ 106, సాయితేజ సున్నా పరుగులతో అజేయంగా ఉన్నారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ వీరవిహారం -
పాపం వైభవ్ సూర్యవంశీ!.. చరిత్రకెక్కినా చేదు అనుభవం!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో సెంచరీ చేసే అవకాశాన్ని ఈ పదిహేనేళ్ల పిల్లాడు మరోసారి తృటిలో చేజార్చుకున్నాడు. కాగా దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2026లో వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సెమీ ఫైనల్లో భాగంగా కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడగా.. అతడి డిప్యూటీ అయిన వైభవ్ తాత్కాలిక సారథిగా పగ్గాలు చేపట్టాడు. బెంగళూరు వేదికగా ఆదివారం సెంట్రల్ జోన్తో మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈస్ట్ జోన్కు అభిమన్యు ఈశ్వరన్తో కలిసి వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. కేవలం 42 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డ ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.100-run stand 🙌Vaibhav Sooryavanshi and Abhimanyu Easwaran with a solid opening stand so far 🤝Scorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/7eVSb3iuPU— BCCI Domestic (@BCCIdomestic) August 31, 2026 ఇదే జోరు కొనసాగిస్తూ వైభవ్ సూర్యవంశీ సెంచరీకి చేరువయ్యాడు. అయితే, 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్ష్ దూబే బౌలింగ్లో అర్షద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి ఈ ఓపెనింగ్ బ్యాటర్ పెవిలియన్కు చేరాడు. మొత్తంగా 81 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదిన వైభవ్ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 93. ఇప్పుడు 92 పరుగుల వద్ద అవుటై దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్ అయ్యాడు.తొలి ప్లేయర్గా ఘనతకాగా సెంచరీ చేజార్చుకున్నప్పటికీ అత్యంత పిన్న వయసులోనే దులిప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. 15 ఏళ్ల 157 రోజుల వయసులో అతడు ఈ ఘనత సాధించాడు.ఆల్ టైమ్ రికార్డు మిస్అయితే, కాస్త నెమ్మదిగా ఆడి ఉంటే.. దులిప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత చిన్న వయసులోనే శతక్కొట్టిన ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ ఆల్టైమ్ రికార్డు సాధించేవాడు. కానీ హర్ష్ దూబే బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వైభవ్ విఫలమయ్యాడు. బంతిని గాల్లోకి లేపగా డీప్ మిడ్వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అర్షద్ క్యాచ్ పట్టడంతో వైభవ్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది. ఇదిలా ఉంటే.. అభిమన్యు ఈశ్వరన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.భోజన విరామ సమయానికి ఈస్ట్ జోన్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 58, సుదీప్ కుమార్ ఘరామీ 16 పరుగులతో క్రీజులో నిలిచారు. వైభవ్ అవుటైన వెంటనే వన్డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా డకౌట్గా వెనుదిరిగాడు.చదవండి: అదంతా నాటకం: పాక్ ఓపెనర్పై ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్! -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు 57 ఏళ్ల రికార్డ్ బ్రేక్
బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్జోన్ తాత్కాలిక కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ యువ సంచలనం.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. 15 ఏళ్ల వైభవ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.ఈ క్రమంలో కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్లతో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తంగా 92 పరుగులు చేసి తన ఫస్ట్క్లాస్ సెంచరీని తృటిలో చేజార్చకున్నాడు. కాగా ఈ ఫైరీ ఫిప్టీతో సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల 157 రోజుల వయస్సులో సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత లెజెండరీ క్రికెటర్ లక్ష్మణ్ సింగ్ పేరిట ఉండేది. అతడు 1969లో 16 ఏళ్ల 23 ఏళ్ల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో 57 ఏళ్ల లక్ష్మణ్ సింగ్ రికార్డ్ను వైభవ్ బద్దలు కొట్టాడు.తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్ 25 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజులో అభిమన్యు ఈశ్వరన్(53), ఎస్ కుమార్(4) ఉన్నారు. అంతకుముందు సెంట్రల్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటైంది. పేస్ బౌలర్లు ముకేశ్ కుమార్, అభిజిత్ కె. సర్కార్ తలా మూడు వికెట్లతో సత్తా చాటారు. వీరితో పాటు మహమ్మద్ షమీ, ఖురేషీ చెరో రెండు వికెట్లు తీశారు. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో రింకూ సింగ్ (88 బంతుల్లో 60) అర్ధశతకంతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఆర్యన్ జుయల్ (46), యశ్ ఠాకూర్ (30) పర్వాలేదనిపించారు.చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ప్రపంచ రికార్డ్ బ్రేక్100-run stand 🙌Vaibhav Sooryavanshi and Abhimanyu Easwaran with a solid opening stand so far 🤝Scorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/7eVSb3iuPU— BCCI Domestic (@BCCIdomestic) August 31, 2026 strong> -
రింకూ సింగ్ ఒంటరి పోరాటం
బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ బౌలర్లు అదరగొట్టారు. పేస్ బౌలర్లు ముకేశ్ కుమార్, అభిజిత్ కె. సర్కార్ తలా మూడు వికెట్లతో సత్తా చాటారు. వీరితో పాటు మహమ్మద్ షమీ, ఖురేషీ చెరో రెండు వికెట్లు తీశారు. వీరి ధాటికి సెంట్రల్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో రింకూ సింగ్ (88 బంతుల్లో 60) అర్ధశతకంతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఆర్యన్ జుయల్ (46), యశ్ ఠాకూర్ (30) పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా, ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్కు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తొలి రోజు ఆట ఆరంభంలోనే గాయపడటంతో జట్టును నడిపించే బాధ్యతను వైభవ్ తన భుజాన వేసుకున్నాడు.మరోవైపు సౌత్జోన్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో నార్త్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకే కుప్పకూలింది. విద్వత్ కావేరప్ప నాలుగు వికెట్లు పడగొట్టి నార్త్జోన్ పతనాన్ని శాసించాడు. ఖమ్రాన్ ఇక్బాల్(76) టాప్ స్కోరర్గా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో జగదీశన్(340, తిలక్ వర్మ(1)ఉన్నారు.చదవండి: అంపైర్కే షాక్ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ.. 3 సెకెన్లలో! వీడియో వైరల్ -
అంపైర్కే షాక్ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ.. 3 సెకెన్లలో! వీడియో వైరల్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా వ్యహరిస్తున్నాడు. రెగ్యులర్ సారధి ఇషాన్ కిషన్ గాయం కారణంగా మైదానం వీడడడంతో వైస్ కెప్టెన్గా ఉన్న వైభవ్ జట్టు బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. వైభవ్ అద్భుతమైన రివ్యూతో సెంట్రల్ జోన్ స్టార్ బ్యాటర్ ఆర్యన్ జుయల్ను పెవిలియన్కు పంపాడు.సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ తొలి బంతిని జుయల్కు ఔట్ సైట్ ఆఫ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని ఆర్యన్ జుయల్ ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్కు దగ్గరగా వెళ్తూ వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర చేతుల్లో పడింది. వెంటనే వికెట్ కీపర్తో పాటు ఈస్ట్ జోన్ ఆటగాళ్లు క్యాచ్కు అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ వైభవ్ మొదట రివ్యూ తీసుకోవాలా వద్దా అనే సందేహంలో పడ్డాడు. అయితే సహచర ఆటగాళ్లతో చర్చించి 3 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉండగా వైభవ్ డీఆర్ఎస్కు వెళ్లాడు. థర్డ్ అంపైర్ 'అల్ట్రాఎడ్జ్' పరిశీలించగా బంతి బ్యాట్ను తాకినట్లు స్పష్టమైన స్పైక్ కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అవుట్గా ప్రకటించాడు. 15 ఏళ్ల వయసులోనే కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ చూపించిన సమయస్ఫూర్తికి జట్టు సభ్యులంతా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: బీసీసీఐ బిగ్ ప్లాన్.. ఇంగ్లండ్కు ‘కాశ్మీర్ ఎక్స్ప్రెస్’ ఆకిబ్ నబీ!Stand-in Captain Vaibhav Sooryavanshi goes for the review with 3 seconds remaining...and gets it right 👏DRS done right as the set Aryan Juyal (46) is dismissed ✅The celebrations say it all 🙌#DuleepTrophy pic.twitter.com/IwBQbr8hJQ— BCCI Domestic (@BCCIdomestic) August 30, 2026 -
15 ఏళ్లకే కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ
టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించాడు. 15 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పాడు. దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా సెంట్రల్ జోన్తో ఇవాళ మొదలైన తొలి సెమీఫైనల్లో వైభవ్ ఈస్ట్ జోన్ తాత్కాలిక కెప్టెన్గా నియమితుడయ్యాడు.CAPTAIN VAIBHAV SOORYAVANSHI 🔥- Vaibhav Sooryavanshi is currently leading the Easy Zone team in Duleep Trophy. pic.twitter.com/cGaFDpceMD— Johns. (@CricCrazyJohns) August 30, 2026రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో గాయపడటంతో వైభవ్కు ఈ అవకాశం వచ్చింది. సీనియర్ జట్టు కెప్టెన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో వైభవ్ చిరునవ్వుతో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్లో వైభవ్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ లాంటి సీనియర్ బౌలర్లను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వారితో అతడు ఎలా వ్యవహరిస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వైభవ్కు ఇది కేవలం రెండో దులీప్ ట్రోఫీ మ్యాచ్. ఓవరాల్గా 10వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే. ఇంత తక్కువ అనుభవంలో షమీ లాంటి అనుభవజ్ఞుడైన పేసర్ను వైభవ్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈస్ట్ జోన్కు త్రిపుర పేసర్ అభిజిత్ సర్కార్ శుభారంభం అందించాడు. అమన్ మొఖాడే (8), కునాల్ చందేలా (6)లను ఆదిలోనే ఔట్ చేశాడు. కొద్ది సేపటికే ముకేశ్ కుమార్ సెంట్రల్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ (12)ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్కు పంపాడు. దీంతో సెంట్రల్ జోన్ 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు స్కోర్ 81-3గా ఉంది. ఆర్యన్ జుయల్ (42), యశ్ రాథోడ్ (6) క్రీజ్లో ఉన్నారు. చదవండి: భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు సంబంధించి కీలక అప్డేట్స్ -
ఆబిద్ మ్యాజిక్.. రుతురాజ్ సేనకు అనూహ్య ఓటమి
దులీప్ ట్రోఫీ 2026లో సంచలనం నమోదైంది. పెద్దగా స్టార్లు లేని నార్త్ జోన్ జట్టు, స్టార్లతో నిండిన వెస్ట్ జోన్ జట్టుకు ఊహించని షాకిచ్చింది. ఇవాళ తొలి సెషన్లోనే ముగిసిన క్వార్టర్ ఫైనల్-2లో నార్త్ జోన్ 52 పరుగుల తేడాతో వెస్ట్ జోన్ను ఓడించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది.చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠగా ప్రారంభమైనప్పటికీ.. అబిద్ ముష్తాక్, నిశాంత్ సింధు కేవలం 6.3 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించారు.ఆబిద్ మాయాజాలంజమ్మూ కశ్మీర్కు చెందిన ఎడమచేతి స్పిన్ ఆల్రౌండర్ ఆబిద్ ముస్తాక్ ఈ మ్యాచ్లో మ్యాజిక్ చేశాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టి నార్త్ జోన్ను సెమీఫైనల్కు చేర్చాడు.వెస్ట్ జోన్ 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు 67 పరుగులు చేయాల్సి ఉండగా, నార్త్ జోన్కు మూడు వికెట్లు మాత్రమే కావాల్సి ఉండింది. క్రీజ్లో ఉర్విల్ పటేల్ లాంటి పేరొందిన బ్యాటర్ ఉన్నాడు. తనుశ్ కోటియన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే బ్యాటింగ్కు రావాల్సి ఉండింది.అయితే ఆట ప్రారంభమైన రెండో బంతికే ముస్తాక్ తనుశ్ కోటియన్ను క్లీన్ బౌల్డ్ చేసి నార్త్ జోన్ను విజయానికి చేరువ చేశాడు. ఆ తర్వాత ముస్తాక్ తుషార్ దేశ్పాండేను కూడా ఔట్ చేయగా.. మరో మూడు బంతుల వ్యవధిలో నిశాంత్ సింధు ఉర్విల్ పటేల్ను ఎల్బీడబ్ల్యూ చేయడంతో వెస్ట్ జోన్ ఓటమిపాలైంది.మ్యాచ్ మొత్తంలో అద్భుతంగా బౌలింగ్ (9-99) చేసిన ఆబిద్కు ప్లేయర్గా అఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నార్త్ జోన్ తరఫున ఆయుశ్ బదోని (51, 50), అర్ష్దీప్ సింగ్ (4 వికెట్లు), అన్షుల్ కాంబోజ్ (60, 22, 3 వికెట్లు) కీలక ప్రదర్శనలు చేశారు. నిన్ననే ముగిసన తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ నార్త్ ఈస్ట్ జోన్పై ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్కు దూసుకెళ్లింది.సెమీఫైనల్లో ఎవరెవరు..?ఆగస్ట్ 30న మొదలయ్యే తొలి సెమీస్లో ఈస్ట్ జోన్ జట్టు రజత్ పాటిదార్ నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్స్ సెంట్రల్ జోన్ను ఢీకొట్టనుంది. ఆగస్ట్ 30ననే మొదలయ్యే రెండో సెమీస్లో నార్త్ జోన్ జట్టు తిలక్ వర్మ నేతృత్వంలోని సౌత్ జోన్లో తలపడుతుంది.చదవండి: ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఇషాన్, వైభవ్ జట్టు -
రుతురాజ్కు కొత్త అనుభవం
టీమిండియా ప్రామిసింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్కు ఓ కొత్త అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్న అతడు.. ఫస్ట్క్లాస్ కెరీర్లో తొలిసారి రనౌటయ్యాడు. ఈ టోర్నీలో వెస్ట్ జోన్కు నాయకత్వం వహిస్తున్న రుతు.. నార్త్ జోన్తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో కీలకమైన 66 పరుగులు చేసి రనౌట్గా వెనుదిరిగాడు.రుతు 47 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో మునుపెన్నడూ రనౌట్ కాలేదు. 44.51 సగటున 9 సెంచరీలు, 17 అర్ద సెంచరీల సాయంతో 3294 పరుగులు చేసినా ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు.FIRST TIME IN HIS CAREER 💔- Ruturaj Gaikwad has been run-out for the first time in his FC cricket. pic.twitter.com/cVYjjwaIbH— Johns. (@CricCrazyJohns) August 25, 2026మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్ట్ జోన్ జట్టు విజయానికి ముంగిట్లో ఉంది. ఆ జట్టు మరో 67 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. అయితే చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఉర్విల్ పటేల్ (17) క్రీజ్లో ఉన్నాడు. తనుశ్ కోటియన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే బ్యాటింగ్కు రావాల్సి ఉంది.287 పరుగుల లక్ష్య ఛేదనలో రుతురాజ్ ధాటిగా ఆడి 70 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి తన జట్టును విజయానికి చేరవ చేశాడు. యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ అత్యంత కీలకమైన 96 పరుగులు చేసి జట్టు విజయానికి పునాది వేశాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ 251 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్ జోన్ 187 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ జోన్ షమ్స్ ములానీ (4-78), తనుశ్ కోటియన్ (4-46) ధాటికి 222 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 287 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్ జోన్ 28 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. ముషీర్ ఖాన్, రుతురాజ్ ఆదుకున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 220-7గా ఉంది.ఇదిలా ఉంటే, నిన్ననే ముగిసిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్పై ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆగస్ట్ 30న మొదలయ్యే తొలి సెమీస్లో ఈస్ట్ జోన్ జట్టు సెంట్రల్ జోన్ను ఢీకొట్టనుంది. నార్త్ జోన్-ఈస్ట్ జోన్ మ్యాచ్ విజేత ఆగస్ట్ 30ననే మొదలయ్యే రెండో సెమీస్లో సౌత్ జోన్లో తలపడుతుంది. చదవండి: ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఇషాన్, వైభవ్ జట్టు -
టెస్ట్ జట్టులో చోటుపై ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు
భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టెస్ట్ క్రికెట్పై తనకున్న ఆసక్తిని మరోసారి స్పష్టం చేశాడు. దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్కు నాయకత్వం వహిస్తున్న అతడు.. నార్త్ ఈస్ట్ జోన్పై ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించిన అనంతరం ఇలా అన్నాడు."నేను భారత టెస్ట్ జట్టులో భాగం కావాలని 100 శాతం కోరుకుంటున్నాను. టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రతి ఒక్కరూ ఈ ఫార్మాట్ను ఇష్టపడతారు. ప్రజలు నమ్మకపోవచ్చు కానీ, నాకు నిజంగా రెడ్ బాల్ క్రికెట్ అంటే చాలా ఇష్టం"పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడైన బ్యాటింగ్కు పేరున్న ఇషాన్.. టెస్ట్ క్రికెట్లోనూ తనకు తగిన సామర్థ్యం ఉందని ఈ వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పాడు.2023లో చివరి టెస్ట్ఇషాన్ కిషన్ 2023 వెస్టిండీస్ పర్యటనలో భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్ల సిరీస్లో రెండు టెస్టులూ ఆడిన అతను మూడు ఇన్నింగ్స్ల్లో 78 పరుగులు మాత్రమే చేశాడు.పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన సిరీస్ డిసైడర్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇషాన్ కేవలం 34 బంతుల్లోనే 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే అదే అతడి చివరి టెస్ట్ ఇన్నింగ్స్గా మిగిలిపోయింది.ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో భారత సెలెక్టర్లు వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్కు ప్రాధాన్యం ఇచ్చారు.ఫస్ట్క్లాస్ క్రికెట్లో మంచి రికార్డువైట్ బాల్ క్రికెట్లో ఇషాన్కు మంచి పేరున్నప్పటికీ, రెడ్ బాల్ క్రికెట్లోనూ అతడి గణాంకాలు బలంగానే ఉన్నాయి.ఇప్పటివరకు 65 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అతడు.. 106 ఇన్నింగ్స్ల్లో 3897 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 39.36గా ఉంది. ఇందులో 9 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు ఉన్నాయి.అంత ఈజీ కాదుఇషాన్కు వ్యక్తిగతంగా రెడ్ బాల్ క్రికెట్పై మక్కువ ఉన్నప్పటికీ.. టెస్ట్ జట్టులోకి తిరిగి రావడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ స్థానానికి బలమైన పోటీ ఉంది. రిషభ్ పంత్తో పాటు ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్ వంటి బలమైన ఆప్షన్లు మేనేజ్మెంట్ ముందున్నాయి.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అసాధారణ రీతిలో పరుగులు చేసినా ఇషాన్కు టెస్ట్ జట్టులో చోటు దక్కడం అనుమానమే. ఎందుకంటే పంత్, జురెల్, రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నారు. వీరిని కాదని ఇషాన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. చదవండి: ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఇషాన్, వైభవ్ జట్టు -
ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఇషాన్, వైభవ్ జట్టు
దులీప్ ట్రోఫీ 2026 తొలి క్వార్టర్ ఫైనల్లో ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్) నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్పై ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్కు దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. సుదీప్ కుమార్ ఘరామీ (146), షాబాజ్ అహ్మద్ (167) సెంచరీలతో కదంతొక్కడంతో 467 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ జట్టు.. అభిజిత్ సర్కార్ (5-20), షాబాజ్ అహ్మద్ (3-20) ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది.ఆతర్వాత ఫాలో ఆన్లోనే ఏమాత్రం ప్రతిఘటించలేకపోయిన నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లోనూ 146 పరుగులకే ఆలౌటై, ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలైంది. అనుకూల్ రాయ్ (5-37) రెండో ఇన్నింగ్స్లో నార్త్ ఈస్ట్ జట్టును దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండో ఇన్నింగ్స్లో బంతితో సత్తా చాటి 2 వికెట్లు (4 బంతుల వ్యవధిలో) తీశాడు. చదవండి: బౌలర్గానూ ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ -
బౌలర్గానూ ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ
బ్యాటింగ్ సంచలనం, టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బంతితోనూ ఇరగదీశాడు. నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి తన ఫస్ట్క్లాస్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఈ టోర్నీలో వైభవ్ ఈస్ట్ జోన్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.నాలుగు బంతుల్లో రెండు వికెట్లునార్త్ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 26వ ఓవర్ వద్ద ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. షాబాజ్ అహ్మద్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి బంతిని అందించాడు. తొలి ఓవర్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన వైభవ్.. ఆ తర్వాత ఓవర్లో అద్భుతం చేశాడు.28వ ఓవర్లో కిషన్ లింగ్డోహ్ను ఔట్ చేసి తన తొలి ఫస్ట్క్లాస్ వికెట్ సాధించాడు. వైభవ్ బంతిని అటాక్ చేయడానికి లింగ్డోహ్ ముందుకొచ్చాడు. అయితే బంతికి భారీ లీడింగ్ ఎడ్జ్ రావడంతో కవర్ ప్రాంతం వైపు వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డెనిష్ దాస్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు.ఆ తర్వాత మరో మూడు బంతులకే వైభవ్ మరో వికెట్ తీశాడు. ఇమ్లివాటి లెమ్తుర్ బ్యాట్ అంచును తాకిన బంతిని ఇషాన్ కిషన్ అద్భుతమైన రిఫ్లెక్స్తో క్యాచ్ పట్టాడు. దీంతో ఒకే ఓవర్లో వైభవ్కు రెండు వికెట్లు దక్కాయి.VAIBHAV SOORYAVANSHI, THE BOWLER 🔥- Sooryavanshi picks 2 wickets in 4 balls in Duleep Trophy Quarter-Final. pic.twitter.com/G5pfCmFXYF— Johns. (@CricCrazyJohns) August 25, 2026బంతితోనూ వైభవ్కు మంచి భవిష్యత్తు..?వైభవ్ సూర్యవంశీ ప్రధానంగా బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారీ షాట్లు ఆడగల సామర్థ్యంతో అతను ఇప్పటికే భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు.అయితే వైభవ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా. అతని బౌలింగ్లో హిప్ రొటేషన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. దులీప్ ట్రోఫీలో లభించిన అవకాశాన్ని అతను చక్కగా ఉపయోగించుకుని నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు.దీంతో భవిష్యత్తులో అవసరమైనప్పుడు బంతితోనూ జట్టుకు ఉపయోగపడే పార్ట్టైమ్ ఆల్రౌండర్గా ఎదిగే అవకాశం వైభవ్కు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సచిన్తో మరో పోలికచిన్న వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్లోకి వచ్చి సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ను ఇప్పటికే పలువురు సచిన్ టెండూల్కర్తో పోల్చుతున్నారు. సచిన్ కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి బ్యాట్తో పాటు అప్పుడప్పుడు బంతితోనూ భారత్కు కీలక వికెట్లు అందించాడు. ఇప్పుడు వైభవ్ కూడా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో తన ప్రతిభను చూపించడం ఆసక్తికరంగా మారింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ గెలుపు దిశగా సాగుతోంది. ఫాలో ఆన్ ఆడుతున్న ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి భారీ ఇన్నింగ్స్ ఓటమి దిశగా పరుగులు పెడుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. దీనికి ముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 467 పరుగుల భారీ స్కోర్ చేసింది. చదవండి: సిరాజ్ రెచ్చగొట్టాడు.. ప్రసిద్ద్ పని కానిచ్చేశాడు..! -
అభిజిత్ పాంచ్ పటాకా.. ఈస్ట్జోన్కు భారీ ఆధిక్యం
దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో ఈస్ట్జోన్ భారీ ఆధిక్యం సాధించింది. ఈస్ట్జోన్ బౌలర్లు అభిజిత్, షాబాజ్ అహ్మద్ ధాటికి నార్త్ ఈస్ట్ జోన్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా నార్త్ ఈస్ట్ జోన్ 111 పరుగులకే కుప్పకూలింది. అర్పిత్ సుభాష్ (32) టాప్ స్కోరర్గా నిలవగా, రాంగ్సన్ జొనాథన్ (21) పర్వాలేదనిపించాడు. అభిజిత్ సర్కార్ 5 వికెట్లతో చెలరేగగా, షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 356 పరుగుల ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ ఆడకుండా నార్త్ ఈస్ట్ను ఫాలోఆన్ ఆడిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి నార్త్ ఈస్ట్ జోన్ జట్టు వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. అంతకముందు ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 467 పరుగులకు ఆలౌటైంది. సుదీప్ కుమార్ (185 బంతుల్లో 146), షాబాజ్ అహ్మద్ (244 బంతుల్లో 167) సెంచరీలతో చెలరేగారు. కుమార్ కుషాగ్రా (55) అర్ధసెంచరీ సాధించాడు. నార్త్ ఈస్ట్ బౌలర్లలో ఫిరోజైమ్ జొతిన్, ఆకాశ్ చౌదరీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.ఎవరీ అభిజిత్ సర్కార్?త్రిపురకు చెందిన అభిజిత్ సర్కార్ కుడిచేతి ఫాస్ట్ బౌలర్. 2022లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా అభిజిత్ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్పై మూడు వికెట్ల ప్రదర్శనతో టోర్నమెంట్ను ప్రారంభించిన అభిజిత్, నాలుగు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2022-23 రంజీ ట్రోఫీ సీజన్లో త్రిపుర తరఫున అభిజిత్ ఏడు ఇన్నింగ్స్ల్లోనే 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విదర్భపై ఆరు వికెట్ల చిరస్మరణీయ ప్రదర్శన ఉంది. ఇక 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో కేవలం ఆరు ఇన్నింగ్స్లలోనే 15 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్లో బరోడాపై ఐదు వికెట్ల ప్రదర్శనలతో మెరిశాడు.pic.twitter.com/fNCliUpmou 🚨 THREE WICKETS IN ONE OVER! 🔥🔥🔥Abhijit Sarkar completes his five-wicket haul in style, ripping through the batting with three wickets in the over! 🎯That’s how you finish a fifer! 💥#DuleepTrophy #3rdManView— Third Man View (@3rdManView) August 24, 2026Read: కష్టాల్లో పడిన లంక.. రెండోరోజు భారత్దే ఆధిపత్యం -
వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో వెనుక కారణమిదే?
దులీప్ ట్రోఫీ 63వ ఎడిషన్ ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈస్ట్ జోన్తో నార్త్ఈస్ట్ జోన్, నార్త్ జోన్తో వెస్ట్ జోన్ తలపడుతున్నాయి. అయితే దులీప్ ట్రోఫీలో అందరి కళ్లు ఈస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీపై నెలకొని ఉన్నాయి. కానీ మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే వైభవ్ మూడు ఫోర్లు కొట్టినప్పటికీ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. నార్త్ఈస్ట్ జోన్ పేసర్ బిష్వోర్జిత్ కొంతోజమ్ బౌలింగ్లో వైభవ్ వెనుదిరిగాడు. అయితే పెవిలియన్ చేరుతున్న క్రమంలో వైభవ్ జెర్సీ వెనుక భాగంలో ఉన్న సంఖ్యకు టేప్ అంటించి ఉండడం అభిమానులు గమనించారు. ఆ తర్వాత ఫీల్డింగ్ సమయంలోనూ వైభవ్ జెర్సీ వెనుక భాగంలో టేప్ అలాగే ఉండడం కనిపించింది. దీంతో అసలు వైభవ్ జెర్సీకి టేప్ ఎందుకు వేసుకున్నాడనే దానిపై ఆరా తీశారు. దీంతో విషయం బయటపడింది.మ్యాచ్లో వైభవ్ 13వ నంబర్ ఉన్న జెర్సీని ధరించాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీ జెర్సీ నెంబర్ 3. ఐపీఎల్ రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఇదే జెర్సీ నెంబర్తో బరిలోకి దిగాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సమయంలోనూ వైభవ్ మూడు నెంబర్ జెర్సీతోనే ఆడాడు. అయితే దులీప్ ట్రోఫీలో వైభవ్కు మూడో నెంబర్ జెర్సీ స్థానంలో 13వ నెంబర్ జెర్సీ అందించారు. ఈస్ట్ జోన్ జట్టు వైభవ్ కోసం తనకు అచ్చొచ్చిన మూడో నెంబర్ జెర్సీని అందించడంలో విఫలమైందని లాజిస్టిక్స్ మేనేజర్ తెలిపాడు. తనకు మూడు నెంబర్ జెర్సీ అయితేనే అచ్చొస్తుందని భావించాడేమో.. అందుకే వైభవ్ తనకు ఇచ్చిన 13వ నెంబర్ జెర్సీలో ఒకటి సంఖ్య కనిపించకుండా టేప్ అంటించాడు. ఒకటి సంఖ్య లేకపోవడంతో ఇప్పుడు ఆ జెర్సీ 3 నెంబర్గా మారిపోయింది. ఇక మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో అభిమానులు వైభవ్ జెర్సీపై ఫన్నీ కామెంట్స్ చేశారు. "పాపం జెర్సీ మారడంతో వైభవ్కు లక్ కలిసిరాలేదని కొందరు పేర్కొంటే... ఒకవేళ తనకు అచ్చొచ్చిన 3వ జెర్సీ నెంబర్ను ఇచ్చి ఉంటే మ్యాచ్లో ఇరగదీసేవాడేమో" అని మరికొందరు తెలిపారు. అయితే వైభవ్ తన జెర్సీని తెప్పించాలని ఇప్పటికే ఈస్ట్జోన్ జట్టుకు సమాచారం ఇచ్చాడట. రెండో ఇన్నింగ్స్లో వైభవ్ సూర్యవంశీ తన లక్కీ నెంబర్ జెర్సీతోనే బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు.Exciting early battle 🔥4️⃣,4️⃣,🇼Bishworjit Konthoujam wins the contest against Vaibhav Sooryavanshi 👌#DuleepTrophyScorecard ▶️ https://t.co/XJFhfvvTIU pic.twitter.com/4xGnLaAhpx— BCCI Domestic (@BCCIdomestic) August 23, 2026Read: బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ కీలక ప్రకటన! -
ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ విఫలమైనా.. భారీ స్కోరు!
దులిప్ ట్రోఫీ- 2026 క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి, బౌలింగ్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ భారీ శతకాలతో చెలరేగి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రతిష్టాత్మక దేశీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ మ్యాచ్లు ఆదివారం మొదలయ్యాయి.ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్- నార్త్ ఈస్ట్ జోన్ తలపడుతున్నాయి. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2లో టాస్ గెలిచిన నార్త్ ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఈస్ట్ జోన్కు ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి.వైభవ్ సూర్యవంశీ విఫలంఓపెనర్లలో సీనియర్ అభిమన్యు ఈశ్వరన్ (15), వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (8) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన కుమార్ కుశాగ్రా (55).. నాలుగో నంబర్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామీ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.ఘరామీ, షాబాజ్ సెంచరీలుఈ క్రమంలో ఘరామీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 185 బంతులు ఎదుర్కొన్న అతడు.. 25 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 146 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో విరాట్ సింగ్ (2), కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (4) నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో బౌలింగ్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ అనూహ్య రీతిలో నిలకడైన ఆటతో సెంచరీతో కదం తొక్కాడు. మొత్తంగా 244 బంతులు ఎదుర్కొన్న షాబాజ్.. 167 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, నాలుగు సిక్స్లు ఉన్నాయి. ఇక మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (37) ఓ మోస్తరుగా రాణించగా.. మహ్మద్ షమీ 11, ముకేశ్ 7, అభిజిత్ సర్కార్ 9 (నాటౌట్) పరుగులు చేశారు.A masterclass in grit and determination! 🏏Shahbaz Ahmed brings up a magnificent 150 (211) for East Zone in the Duleep Trophy 2026-27, anchoring the innings with pure class. 🌟#DuleepTrophy #EastZone #ShahbazAhmed #CAB pic.twitter.com/RChs72osxT— CABCricket (@CabCricket) August 24, 2026 స్కోరెంతంటే?ఫలితంగా ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 112.5 ఓవర్లు ఆడి 467 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఘరామీ- షాబాజ్ అత్యధికంగా ఆరో వికెట్కు 150 పరుగులు జోడించారు. మరోవైపు.. అనుకుల్ రాయ్తో కలిసిషాబాజ్ ఏడో వికెట్కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో ఆకాశ్ చౌదరి, ఫిరోయిజామ్ జోటిన్ మూడేసి వికెట్లు తీయగా.. బిశ్వోర్జిత్ కొంతుజమ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ రంగ్సేన్ జొనాథన్, టెచి నెరి తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్ -
సెంచరీలతో కదంతొక్కిన ఘరామీ, షాబాజ్
దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 23) మొదలైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ఈస్ట్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్.. నార్త్ జోన్-ఈస్ట్ జోన్ జట్లు తలపడుతున్నాయి. తొలి క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఈస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది.రెండో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 251 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.సెంచరీలతో కదంతొక్కిన ఘరామీ, షాబాజ్నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ ప్లేయర్లు సుదీప్ కుమార్ ఘరామీ (146), షాబాజ్ అహ్మద్ (100 బ్యాటింగ్) సెంచరీలతో కదంతొక్కారు. ఈ జట్టు స్టార్ ప్లేయర్లు, కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇషాన్ కిషన్ (4), వైభవ్ సూర్యవంశీ (8) నిరాశపరిచారు. మిగతా ప్లేయర్లలో అభిమన్యు ఈశ్వరన్ 15, కుమార్ కుషాగ్రా 55, విరాట్ సింగ్ 2, అనుకూల్ రాయ్ 22 (బ్యాటింగ్) చేశారు. నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో జొతిన్ 3, ఆకాశ్ చౌదరి 2, బిష్వోర్జిత్ ఓ వికెట్ పడగొట్టారు.సత్తా చాటిన తనుశ్, తుషార్నార్త్ జోన్తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో వెస్ట్ జోన్ బౌలర్లు తనుశ్ కోటియన్ (4-72), తుషార్ దేశ్పాండే (4-57) సత్తా చాటారు. వీరికి ముకేశ్ చౌదరి (1-47), శార్దూల్ ఠాకూర్ (1-38) సహకరించారు. నార్త్ జోన్ ప్లేయర్లలో తొమ్మిదో నంబర్ ఆటగాడు అన్షుల్ కంబోజ్ (60) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇతనితో పాటు ఆయుశ్ బదోని (51), ఆయుశ్ దొసేజా (42) రాణించారు. కమ్రాన్ ఇక్బాల్ 26, యశ్ ధుల్ 9, అబ్దుల్ సమద్ 6, కన్హయ్య వధవాన్ 5, నిషాంత్ సింధు 15, అబిద్ ముస్తాక్ 19, అర్షదీప్ సింగ్ 4, సునీల్ కుమార్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా.. పృథ్వీ షా (22) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఆబిద్ ముస్తాక్ అద్భుతమైన బంతితో అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ను (3) అర్షదీప్ సింగ్ పెవిలియన్కు పంపాడు. ఆట ముగిసే సమయానికి ముషీర్ ఖాన్ (6), శివాలిక్ శర్మ (0) క్రీజ్లో ఉన్నారు. -
తుస్సుమనిపించిన ఇషాన్ కిషన్
దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు వేదికగా ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ వికెట్ వికెట్ కీపర్ బ్యాటర్, ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కిషన్ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఫెరోయిజమ్ జోతిన్ సింగ్ బౌలింగ్లో వికెట్ కీపర్ అర్పిత భటేవరాకు క్యాచ్ ఇచ్చి ఇషాన్ పెవిలియన్కు చేరాడు. ఇప్పటికే భారత పరిమిత ఓవర్ల జట్టులో తన స్ధానాన్ని సుస్థిరం చేసుకున్న కిషన్.. టెస్టు జట్టులోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడుతున్నాడు. అయినప్పటికి ఈ జార్ఖండ్ ఆటగాడు తన మార్క్ చూపించలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఈస్ట్ జోన్ జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (8), అభిమన్యు ఈశ్వరన్ (15) త్వరగానే పెవిలియన్ బాట పట్టడంతో ఈస్ట్ జోన్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.ఈ సమయంలో సుదీప్ కుమార్ ఘరామీ, కుమార్ కుషాగ్రా ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక కుషాగ్రా ఔటయ్యాడు.ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన విరాట్ సింగ్ (2), ఈషాన్ కిషన్ (4) స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు చేరారు. 56 ఓవర్లు ముగిసే సరికి ఈస్ట్జోన్ 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. క్రీజులో షాబాజ్ అహ్మద్(42), ఘరామీ(130) ఉన్నారు. -
నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ.. అంచనాలు తల్లకిందులు
దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దారుణంగా నిరాశపరిచాడు. రెడ్బాల్ క్రికెట్ తొలి పరీక్షలోనే అతడు ఘోరంగా విఫలమయ్యాడు. నార్త్ ఈస్ట్ జోన్తో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇవాళ ప్రారంభమైన మ్యాచ్లో వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.ఈ మ్యాచ్కు ముందు వైభవ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈస్ట్ జోన్కు వైస్ కెప్టెన్గా ఎంపిక కావడం అతడి రెడ్బాల్ సామర్థ్యాన్ని పరీక్షించే కీలక అవకాశంగా ఉండింది. అయితే ఈ అవకాశాన్ని వైభవ్ ఒడిసిపట్టుకోలేకపోయాడు. తక్కువ స్కోర్కే ఔటై, అభిమానులను నిరాశపరిచాడు.ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్కు దిగగా, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్తో కలిసి వైభవ్ ఓపెనర్గా వచ్చాడు. రెండో ఓవర్లో బంతిని ఎదుర్కొన్న అతడు బిష్వర్జిత్ కొంథౌజమ్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దీంతో భారీ స్కోర్ చేసేలా కనిపించాడు.అయితే అదే ఓవర్ చివరి బంతికి అతడి ఇన్నింగ్స్ ముగిసింది. కొంథౌజమ్ ఆఫ్ స్టంప్ వెలుపల గుడ్ లెంగ్త్లో బంతిని వేశాడు. దానిని పాయింట్ దిశగా ఆడేందుకు ప్రయత్నించగా, గల్లీలో ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చాడు.వైట్బాల్ క్రికెట్లో దూకుడుగా ఆడే వైభవ్కు రెడ్బాల్ ఫార్మాట్లో ప్రధాన సవాలు షాట్ ఎంపిక, ఓపికగా బ్యాటింగ్ చేయడం. కొత్త బంతిపై ప్రతి బంతినీ దాడి చేయకుండా, పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ గేర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.సూర్యవంశీకి ఇదే మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో మరో అవకాశం లభించే అవకాశం ఉంది. అక్కడ భారీ స్కోరు సాధిస్తే తొలి ఇన్నింగ్స్లో ఎదురైన వైఫల్యాన్ని కొంతవరకు భర్తీ చేయడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని రెడ్బాల్ అవకాశాలకు తనను తాను బలంగా ప్రతిపాదించుకోగలడు.మ్యాచ్ విషయానికొస్తే.. 27 ఓవర్లు ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ స్కోర్ 13-4గా ఉంది. అభిమన్యు ఈశ్వరన్ (15), వైభవ్ సూర్యవంశీ (8), కుమార్ కుషాగ్రా (55), విరాట్ సింగ్ (2) ఔట్ కాగా.. కెప్టెన్ ఇషాన్ కిషన్ (4), సుదీప్ కుమార్ ఘరామీ (49) క్రీజ్లో ఉన్నారు. -
వైభవ్ విషయంలో నేనైతే అది అంగీకరించను: ఆసీస్ దిగ్గజం
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పదిహేనేళ్ల పిల్లాడి ఆటకు తాను ఫిదా అయ్యానని.. అతడు కేవలం పొట్టి ఫార్మాట్కే పరిమితం కాబోడని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ సందర్భంగా వైభవ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఆరంభంలో విఫలమైనా..ఈ సిరీస్లో వైభవ్ (13,15,14) విఫలమైనప్పటికీ.. జింబాబ్వే గడ్డ మీద అదరగొట్టాడు. మూడు మ్యాచ్లలో కలిపి 151 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా టీ20 సిరీస్లో జింబాబ్వేను 3-0తో క్లీన్స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ దేశవాళీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. ఈస్ట్ జోన్ జట్టుకు అతడు ఏకంగా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో విమర్శలు రాగా.. మాథ్యూ హెడెన్ తాజాగా స్పందించాడు.ఫిట్గా ఉండటం ముఖ్యంANIతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది వైభవ్ కేవలం పొట్టి ఫార్మాట్ ప్లేయర్ మాత్రమే అని అంటున్నారు. నేనైతే ఆ విషయాన్ని అంగీకరించను. సంప్రదాయ ఫార్మాట్లోనూ అదరగొట్టగల సత్తా అతడికి ఉంది. అయితే, ఇందుకు వైభవ్ ఫిట్గా ఉండటం ముఖ్యం.అంతకంటే ముందు.. మానసికంగా అతడు మరింత దృఢంగా మారాలి. ఏదేమైనా పదిహేనేళ్ల వయసులోనే అతడు అద్భుతమైన ఆట తీరుతో తనను తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ వంటి బ్లాక్బస్టర్ టోర్నమెంట్లో కేవలం పాల్గొనడమే కాకుండా.. ఏకంగా సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగానూ నిలిచాడు. దీనిని బట్టి వైభవ్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.వరల్డ్క్లాస్ ప్లేయర్గా ఎదుగుతాడుఅతడు కచ్చితంగా వరల్డ్క్లాస్ ప్లేయర్గా ఎదుగుతాడు. అయితే, వైభవ్ ఆట తీరును మరింత మెరుగపరచుకోవాల్సి ఉంటుంది. అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని ఎలా ఉపయోగిస్తాడన్నదే ముఖ్యం’’ అని మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్.. 776 పరుగులు చేశాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. చదవండి: నాడు పావురాల రెట్టల వల్ల పోయిన పరువు.. తాజా పరిణామంపై సింధు స్పందన -
జట్టుకు దూరమైన సర్ఫరాజ్ ఖాన్
ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మేజర్ టోర్నమెంట్కు దూరమయ్యాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ 2026 సీజన్కు అతడు అందుబాటులో ఉండటం లేదు. టీమిండియా నుంచి అకస్మాత్తుగా పిలుపు రావడంతో.. సర్ఫరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ జట్టును వీడాడు.కాగా దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్కు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్క్లాస్క్రికెట్లో ఇప్పటికే ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన ఈ ముంబైకర్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగపెట్టాడు.2024లో చివరిగా టీమిండియా తరఫునఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టు మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 371 పరుగులు సాధించాడు. అయితే, అదే ఏడాది చివరగా న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్కు తర్వాత అవకాశాలు కనుమరుగయ్యాయి. దీంతో ఫిట్నెస్పై దృష్టి సారించిన సర్పరాజ్ ఖాన్.. భారీగా బరువు తగ్గి స్లిమ్గా తయారయ్యాడు.సాయి సుదర్శన్ స్థానంలోదేశీ క్రికెట్లోనూ మరోసారి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్ల నుంచి సర్ఫరాజ్కు పిలుపు రాలేదు. అయితే, శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఎంపికైన సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకోకపోవడం అతడి పాలిట వరంగా మారింది. దీంతో తాజాగా సాయి స్థానాన్ని సర్ఫరాజ్తో భర్తీ చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియాతో చేరేందుకు సర్ఫరాజ్ ఖాన్ శ్రీలంకకు పయనమయ్యాడు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ జట్టుకు అతడు దూరం కాగా.. సెలక్టర్లు జై గోహిల్కు పిలుపునిచ్చారు. ఈ విషయం గురించి వెస్ట్ జోన్, ముంబై చీఫ్ సెలక్టర్ రాజేశ్ పవార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. జై గోహిల్కు అవకాశం‘‘సర్ఫరాజ్ స్థానంలో గోహిల్ను ఎంపిక చేశాము. నిజానికి అతడు స్టాండ్ బై ప్లేయర్గా ఉండేవాడు. ఇప్పుడు ప్రధాన జట్టులోకి తీసుకున్నాము. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు’’ అని రాజేశ్ పవార్ పేర్కన్నాడు.కాగా వెస్ట్ జోన్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాగా.. షామ్స్ ములానీ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇక ఆగష్టు 23 నుంచి సెప్టెంబరు 10 వరకు దులిప్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు.. టీమిండియా- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.దులిప్ ట్రోఫీ 2026 సీజన్కు వెస్ట్ జోన్ జట్టు (అప్డేటెడ్)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షామ్స్ ములాని (వైస్ కెప్టెన్), హర్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), జైమీద్ పటేల్, పృథ్వీ షా, శివాలిక్ శర్మ, సిద్దార్థ్ దేశాయ్, జై గోహిల్, ముషీర్ ఖాన్, అతీత్ షేత్, ముకుశ్ చౌదరి, తనుశ్ కొటియాన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే.చదవండి: నా కాబోయే భర్త అలా ఉండాలి: సారా టెండుల్కర్ -
RBI అసిస్టెంట్ మేనేజర్గా ఇషాన్ కిషన్.. జీతం ఎంతంటే?
టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ విధుల్లో భాగంగా.. సహచర ఉద్యోగులతో అతడు కలిసి ఉన్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.టీమిండియా రీఎంట్రీలో అదుర్స్అసలు విషయం ఏమిటంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా టీమిండియా తరఫున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్-2026లో అదరగొట్టి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనలతో బిజీగా గడిపిన ఇషాన్ కిషన్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీమిండియా టెస్టు సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లగా ఇషాన్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. దీంతో స్వస్థలంలో ఉన్న అతడు.. ఆర్బీఐ విధుల్లో చేరినట్లుగా ఉన్న ఫొటో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయంలోకాగా స్పోర్ట్స్ కోటాలో భాగంగా ఇషాన్ కిషన్కు చాన్నాళ్ల క్రితమే ఆర్బీబీలో ఉద్యోగం వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూస్18 కథనం ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం లభించగా.. ఇషాన్ ఆర్బీఐ విధుల్లో చేరాడు. పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లిన ఇషాన్కు సహచర ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. అతడితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్గా మారాయి.జీతం ఎంతంటే..?కాగా ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్గా నెలకు ఇషాన్ కిషన్కు రూ. 1.22 లక్షల నుంచి 1.24 లక్షల వరకు వేతనం అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రొవిడెంట్ ఫండ్ సహా మిగతా కటింగ్స్ అన్నీ పోనూ చేతికి దాదాపు రూ. 1.12 లక్షలు అందుతున్నట్లు సమాచారం.ఇక ఆగష్టు 23 నుంచి దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. త్వరలోనే మళ్లీ అతడు ఆటతో బిజీ కానున్నాడు. ఈ జట్టుకు బిహార్ చిచ్చరపిడుగు, టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్.కాగా 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు 32 వన్డేలు, 55 టీ20 మ్యాచ్లు, 2 టెస్టు మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 1107, టీ20లలో 1608 పరుగులు.. టెస్టుల్లో 78 రన్స్ చేశాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.చదవండి: అనుష్క శర్మ అలా చేస్తే తప్పేంటి?: షమీIndian cricketer Ishan Kishan has reportedly resumed work as an Assistant Manager at the Reserve Bank of India office in Patna during his break from competitive cricket. Kishan was appointed to the post through the sports quota and was seen carrying out his official… pic.twitter.com/AZPdCflCrM— News18 (@CNNnews18) August 5, 2026 -
అభిషేక్ శర్మకు నో ప్లేస్.. ఊహించని ఆటగాడికి కెప్టెన్సీ
దులీప్ ట్రోఫీ 2026 కోసం 15 మంది సభ్యుల నార్త్ జోన్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ జట్టుకు కెప్టెన్గా ఎవరూ ఊహించిన ఆటగాడికి అవకాశం లభించింది. జమ్మూ కశ్మీర్కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కన్హయ్య వాధ్వాన్కు సెలెక్టర్లు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. అతడికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోనీని ఎంపిక చేశారు.ఈ జట్టులో అత్యధికంగా (6) రంజీ ఛాంపియన్ జమ్మూ కశ్మీర్ ఆటగాళ్లకు చోటు లభించింది. టీమిండియా ఆటగాళ్లు అర్ష్దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉన్నందున శుభ్మన్ గిల్, ఆకిబ్ నబీని ఎంపిక చేయలేదు. దులీప్ ట్రోఫీ ఆగస్టు 23న ప్రారంభం కానుండగా.. అదే రోజు నార్త్ జోన్-వెస్ట్ జోన్ మ్యాచ్ ప్రారంభం కానుంది.నార్త్ జోన్ జట్టు:సనత్ సంగ్వాన్, క్వామ్రాన్ ఇక్బాల్, యశ్ ధుల్, ఆయుష్ దోసేజా, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోనీ (వైస్ కెప్టెన్), కన్హయ్య వాధ్వాన్ (కెప్టెన్), నిశాంత్ సింధు, అర్జున్ శర్మ, అబిద్ ముస్తాక్, అర్ష్దీప్ సింగ్, సునీల్ కుమార్, అన్షుల్ కాంబోజ్, యుధ్వీర్ సింగ్, నిఖిల్ కశ్యప్.ఎవరీ కన్హయ్య వాధ్వాన్..?జమ్మూ కశ్మీర్ రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ సాధించడంలో వాధ్వాన్ కీలక పాత్ర పోషించాడు. 13 ఇన్నింగ్స్ల్లో 474 పరుగులు, 36.56 సగటుతో రాణించాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. రంజీ ట్రోఫీ ఫైనల్లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు.24 ఏళ్ల వాధ్వాన్ గతేడాది దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున ఆడాడు. మూడు ఇన్నింగ్స్ల్లో 99 పరుగులు చేశాడు. గత ఎడిషన్లో శుభ్మన్ గిల్ నాయకత్వంలో ఆడిన అతను, ఇప్పుడు తొలిసారి నార్త్ జోన్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. -
సెంట్రల్ జోన్ కెప్టెన్గా పటీదార్.. అందరి కళ్లు అతడిపైనే!
దులీప్ ట్రోఫీ 2026కు సంబంధించి సెంట్రల్ జోన్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రజత్ పటీదార్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, ఫినిషర్ రింకూ సింగ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు మోయనున్నాడు. 15 మందితో పాటు అమన్దీప్ ఖరె, మయాంక్ మిశ్రా, సౌరబ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయలు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఆగస్టు 23న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఐదు టెస్టులు జరగనున్నాయి. సెంట్రల్ జోన్తో పాటు నార్త్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్తో పాటు సౌత్జోన్ ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది. అయితే ఇటీవలే శ్రీలంకతో టెస్టు సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆల్రౌండర్ సారాంశ్ జైన్ కూడా సెంట్రల్ జోన్లో చోటు లభించింది. సారాంశ్తో పాటు ఎస్ఆర్హెచ్ బౌలర్లు జీషన్ అన్సారి, హర్ష్ దూబేలకు కూడా జట్టులో చోటు లభించింది.గతేడాది జరిగిన దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆయేడు ఫైనల్లో సౌత్జోన్ను మట్టికరిపించిన సెంట్రల్ జోన్ను పటీదార్ దశాబ్ద కాలంలో తొలిసారి చాంపియన్గా నిలిపాడు. అంతేకాదు ఆ సీజన్లో 382 పరుగులు చేసిన పటీదార్ ఖాతాలో ఒక సెంచరీ ఉంది. ఈసారి చాంపియన్ హోదాలో సెంట్రల్ జోన్ నేరుగా సెమీఫైనల్ ఆడనుంది. ఆగస్టు 23 నుంచి 26 మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్స్లో ఈస్ట్ జోన్తో నార్త్ఈస్ట్ జోన్, నార్త్ జోన్తో వెస్ట్జోన్ తలపడనున్నాయి. ఈ రెండింటిలో గెలిచిన జట్లు సెమీస్లో చాంపియన్ సెంట్రల్ జోన్తో పాటు రన్నరప్ సౌత్జోన్తో ఆడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది.సెంట్రల్ జోన్ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), రింకు సింగ్ (వైస్ కెప్టెన్), ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), సారాంశ్ జైన్, అమన్ మొఖాడే, కునాల్ చండేలా, జీషన్ అన్సారీ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, కునాల్ సింగ్ రాథోడ్ (వికెట్ కీపర్), యాష్ ఠాకూర్, నాచికేత్ భూటెస్టాండ్ బై ప్లేయర్స్: అమన్దీప్ ఖరే, మయాంక్ మిశ్రా, సౌరభ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయ.సపోర్ట్ స్టాఫ్: నిఖిల్ డోరు - హెడ్ కోచ్, దేశ్రాజ్ చౌహాన్ - ఫిజియో, చంద్రశేఖర్ రావు - వీడియో అసిస్టెంట్, మోహిత్ కుమార్ - మసీర్, మనీష్ ఝా - అసిస్ట్ కోచ్, మయాంక్ అగర్వాల్ - ట్రైనర్, జుఫ్రీ జకేరియా - మేనేజర్.చదవండి: నీరజ్కు చెక్.. ఫాస్ట్ బౌలర్ నుంచి జావెలిన్ చాంపియన్ దాకా -
సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీని నియమించడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టగా.. తాజాగా భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. రెడ్బాల్ క్రికెట్లో అనుభవం లేని ఆటగాడిని ఏకంగా వైస్ కెప్టెన్ను చేయడం ఏమిటని ప్రశ్నించాడు.అనుభవం తక్కువకాగా దేశవాళీ ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ ఎంపిక కాగా.. అతడి డిప్యూటీగా పదిహేనేళ్ల వైభవ్కు అవకాశం దక్కింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటికీ ఈ బిహారీ పిల్లాడు రెడ్బాల్ క్రికెట్లో మాత్రం ఇప్పటికి కేవలం 8 మ్యాచ్లు ఆడి 207 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇవ్వడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ విషయం గురించి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దీప్ దాస్ గుప్తా సైతం సెలక్టర్ల నిర్ణయంపై పెదవి విరిచాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?‘‘వైభవ్ను వైస్ కెప్టెన్గా నియమించడాన్ని నేను అస్సలు సమర్థించను. అనుకూల్ రాయ్ వంటి సీనియర్ ప్లేయర్లు ఎంతో మంది జట్టులో ఉన్నారు. చాలా ఏళ్లుగా వాళ్లంతా రెడ్బాల్ క్రికెట్లో సేవలు అందిస్తున్నారు. అలాంటి వాళ్లకి నాయకత్వ బృందంలో చోటివ్వాలి.15, 16 ఏళ్ల వయసుకే వైభవ్ సూర్యవంశీ క్రికెటర్గా పరిణతి సాధించాడని నేను ఒప్పుకొంటాను. అతడి ప్రతిభ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే, రెడ్బాల్ క్రికెట్లో పూర్తిగా ఆడకముందే అతడికి వైస్ కెప్టెన్గా బాధ్యత ఇవ్వడం సరికాదు.అతడు ఇప్పుడిప్పుడే ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. వైస్ కెప్టెన్ స్థాయికి తగ్గ గణాంకాలు కూడా ప్రస్తుతం అతడి ఖాతాలో లేవు. ముందు అతడిని ఆడనివ్వండి. తనను తాను నిరూపించుకోనివ్వండి’’ అని దీప్ దాస్ గుప్తా సెలక్టర్లకు హితవు పలికాడు.మా నిర్ణయం సరైందేఇదిలా ఉంటే.. ఈస్ట్ జోన్ సెలక్టర్ ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదుగుతాడని.. అన్నీ తెలిసే తాము అతడిని ఇప్పుడు వైస్ కెప్టెన్ని చేశామని పేర్కొన్నాడు. దులిప్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా వైభవ్ భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నాడు.చదవండి: ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీస్తున్న కుల్దీప్ యాదవ్ -
అందుకే వైస్ కెప్టెన్గా వైభవ్: కుండబద్దలు కొట్టిన సెలక్టర్
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి దక్కిన ప్రమోషన్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ టోర్నీలో ఈస్ట్ జోన్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ సారథ్యంలో వైభవ్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.అయితే, వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్గా బాధ్యతలు ఇవ్వడం పట్ల కామెంటేటర్ హర్షా భోగ్లే అభ్యంతరం వ్యక్తం చేశాడు. రెడ్బాల్ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని పిల్లాడిని కీలక పదవికి ఎలా ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్ని చేశాముఈ నేపథ్యంలో ఒడిశా మాజీ క్రికెటర్, ఈస్ట్ జోస్ సెలక్షన్ కమిటీలో భాగమైన ప్రవంజన్ ములిక్ స్పందించాడు. క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ను కెప్టెన్గా నియమించలేదు కదా!.. అతడు ఇప్పుడు కేవలం వైస్ కెప్టెన్ మాత్రమే. ఆ జట్టుకు ఇషాన్ కిషన్ సారథి. అయితే, ఇషాన్ వికెట్ కీపర్ కూడా!రోజంతా ఇషాన్ యాక్టివ్గానే ఉంటాడు. కాబట్టి వైభవ్కు పెద్దగా పనేమీ ఉండదు. అయితే, ఇషాన్కు డిప్యూటీగా అతడు ఎంతో కొంత నేర్చుకుంటాడు. మరింత పరిణతి సాధిస్తాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్గా ఎంపిక చేశాము. ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ అవుతాడుదులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఉప నాయకుడిగా ఉండటం గొప్ప అవకాశం. అతడు టీమిండియా తరఫున బాగా ఆడాలని కోరుకుంటున్నాడు. మేము కూడా యువ ఆటగాళ్లకు సరైన సమయంలో అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నాము. ఎవరికి తెలుసు.. ఏదో ఒకరోజు వైభవ్ టీమిండియా కెప్టెన్ కూడా అవ్వొచ్చు.ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే మేము అతడికి వైస్ కెప్టెన్గా అవకాశం ఇచ్చాము. ఇంతకు ముందు భారత అండర్-19 జట్టుకు, బిహార్ ఫస్ట్క్లాస్ క్రికెట్ జట్టుకు అతడు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. దులిప్ ట్రోఫీ సందర్భంగా జాతీయ సెలక్టర్లు అతడి ఆటను తప్పక పరిశీలిస్తారు. అతడు త్వరలోనే భారత టెస్టు జట్టుకు కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు కదా!’’ అని ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.చదవండి: టీమిండియాకు శుభవార్త


