breaking news
Pawan Kalyan
-
కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునేవారే లేకుండాపోయారు: బొత్స
-
పవన్.. మీరు ఉప్పు, కారం తినడం లేదా?
సాక్షి,కాకినాడ: ఊగిపోయి మాట్లాడావు కదా.. ఇప్పుడు ఏమైంది నీ పౌరుషం పవన్ అని శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు. కాకినాడలో బొత్స మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకునేవారే లేకుండాపోయారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయం దండగ,లాభంలేదని చంద్రబాబు బుర్రలో ఉంది. చంద్రబాబు అధికారంలో ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూరియా ఎందుకు దొరుకుంతుంది? కూటమి అధికారంలో ఉన్న ఏపీలో యూరియా ఎందుకు దొరకడం లేదు. 9వ తేదీన రైతు సంఘాలతో కలిసి ఉద్యమిస్తాం. ఆర్డీవో ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇస్తాం. 32మంది బలిదానాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది. విశాఖ ఉక్కుపై ప్రజల్ని చైతన్య పరుస్తాం. విశాఖ ఉక్కుకోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. విశాఖ ఉక్కు గురించి సీఎం,డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడరు. పవన్ కల్యాణ్ ఉగిపోయి మాట్లాడావు కదా.. ఏమైందీ మీ పౌరుషం. ఎన్నికలకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్లు ఇప్పుడు ఏమయ్యారు. విశాఖ ఉక్కుపై ప్రభుత్వ భవిష్యత్తు కార్యచరణ ఏంటీ? పవన్.. మీరు ఉప్పు కారం తినడం లేదా?. ప్రధాని మోదీతో విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు ఏం మాట్లాడారు. 15నెలల్లో కూటమి ప్రభుత్వం రూ.2లక్షల కోట్లు అప్పు చేసిందని’ వ్యాఖ్యానించారు. -
బర్త్ డే రోజు పవన్ కు బిగ్ షాక్
-
కంఫర్ట్ జోన్లోనే పవన్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనపరుస్తున్న విధేయత, విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన పరువును సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పలుమార్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు వరుస తప్పులపై పల్లెత్తు మాట కూడా అనకపోవడం జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యేలందరిని నిశ్చేష్టులను చేస్తోంది. ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో ప్రభుత్వ తీరుపట్ల, టీడీపీ తమను తక్కువ చేసి చూస్తున్న వైనంపై తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. అయితే అధినేతే కిక్కురుమనకుండా ఉండటంతో వీరు కూడా నోరె మెదపలేని పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి సంతృప్తిగా ఉన్నారన్నది విశ్లేషకుల వ్యాఖ్య. చంద్రబాబు ద్వారా తనకు అందుతున్న సౌకర్యాలకు అలవాటుపడిన పవన్ తన ప్రతిష్టను పణంగా పెట్టి మరీ ప్రశ్నించకుండా ఉంటున్నారని ఆయనను దగ్గరగా చూసిన ఒక ప్రముఖు జర్నలిస్టు వ్యాఖ్యానించారు. సుగాలి ప్రీతి కేసు అంశంలో పవన్ కళ్యాణ్ మాటమార్చిన వైనం, ఆ బాలిక తల్లి పార్వతీ బాయినే పరోక్షంగా విమర్శిస్తున్న తీరు చూసిన ప్రజటు ముక్కున వేలేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్లో మస్తు షేడ్స్ ఉన్నాయని, ఎప్పుడు ఏమాటైనా అనగల సమర్థుడని, చంద్రబాబును మించి అబద్దాలు ఆడగలరని ఈ వ్యవహారం స్పష్టం చేస్తోంది. ఎన్నికలకు ముందు పవన్ సుగాలి ప్రీతి తల్లి ఇంటికి వెళ్లి ఆడిన డ్రామా అంత ఇంత కాదు. రెండు లక్షల మందితో కలిసి తాను సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించానని చెప్పుకుని ఎన్నికల ప్రచారం చేసుకున్న ఆయన ప్రస్తుతం తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. ఇక్కడ కూడా చంద్రబాబుపై ఈగ వాలకుండా మాట్లాడి, మొత్తం నెపాన్ని అంతటిని గత ముఖ్యమంత్రి జగన్పై నెట్టేసి తన అసలు రంగు బయటపెట్టుకున్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. అయినా ఏ పార్టీకి ఆ పార్టీ ఒక వ్యక్తిత్వం, కొన్ని విధానాలు కలిగి ఉంటుంది. ఆ పార్టీ అధినేతను పొత్తులోని ఇతర పార్టీల నేతలు గౌరవప్రదంగా చూసే పరిస్థితి ఉంటుంది. వాటన్నిటికి పవన్ తిలోదకాలు ఇచ్చేశారు. ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరుగుతుంటే అవసరమైతే ప్రశ్నిస్తుంటారు. కాని పవన్ వాటన్నిటిని వదలివేశారని ఆ పార్టీవారే చెబుతున్నారు. టీడీపీ వారు సైతం ఇది తమ జేబులో ఉండే పార్టీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని జనసేన క్యాడరే వాపోతోంది. 2017 ఆగస్టులో సుగాలి ప్రీతిపై కొందరు నీచులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నది పవన్ మద్దతిచ్చిన టీడీపీనే. చంద్రబాబు సీఎం. ఈ కేసులో కొందరు నిందితులను అరెస్టు చేసినా, వారికి 23 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఆ సమయంలోనే డీఎన్ఏ శాంపిల్స్ కలవలేదన్న నివేదిక కూడా వచ్చింది. అంటే తప్పు చంద్రబాబు ప్రభుత్వానిదే కదా? అయినా పవన్ కళ్యాణ్ ఆ అంశం ప్రస్తావించరు. తమ ఒత్తిడి వల్ల ఆమె కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఒకరికి ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నారు. అది జగన్ ప్రభుత్వం ఇచ్చిందన్న సంగతిని మరుగుపరచి తమ వల్లే లభించిందని క్రెడిట్ పొందే యత్నం చేశారు. పోనీ అంతటితో ఆగారా? జగన్పై విమర్శలు చేశారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం ఎవరిని మాట్లాడనివ్వలేదట.స్వేచ్చ లేదట. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతీ కుటుంబాన్ని పలకరించడానికి ఈయన తానే రెండు లక్షల మందితో ఎలా వెళ్లగలిగారు? జగన్ను నోటికి వచ్చినట్లు ఎలా దూషించగలిగారు? ఈ అంశాన్నే కాదు. 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని, వారిని వలంటీర్లు కిడ్నాప్ చేశారని కేంద్రం నుంచి తనకు సమాచారం వచ్చిందని ఎలా చెప్పగలిగారు? ఇంకో ఎన్నో అనుచిత భాషణలు చేసిన పవన్పై ఆ రోజుల్లో ఒక్క కేసు కూడా పెట్టలేదు. అదే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా పడితే అలా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ వారినే కాకుండా అనలిస్టులను, జర్నలిస్టులను కూడా వేధిస్తూంటే ఇది మాత్రం పవన్ కు స్వేచ్ఛగా అనిపిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే చంద్రబాబు పాలన సమయంలో సుగాలి ప్రీతి హత్య కేసు జరిగిందని మాట మాత్రం అనలేకపోవడమే విడ్డూరం. చంద్రబాబుపై ఈగ వాలినా సహించలేని స్థితికి పవన్ చేరుకున్నారు అన్నమాట. ప్రత్యేక విమానాలలో తిరగడం, తన శాఖలను గాలికి వదలి సినిమా షూటింగ్లలో పాల్గొనడం, పవన్ సినిమా ప్రమోషన్లు చేసుకున్నా చంద్రబాబు ఒక్క మాట అనకపోవడం వంటి సౌకర్యాల కారణంగానే పవన్ నోరు విప్పడం లేదని పలువురు భావిస్తున్నారు. 2014 టర్మ్లో అప్పుడప్పుడైనా పవన్ ప్రశ్నించినట్లు కనిపించేవారు. ఆ వెంటనే ఏ కామినేని శ్రీనివాస్ వంటివారో వచ్చి పవన్ను స్పెషల్ ఫ్లైట్ లో చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లేవారు. ఆ తర్వాత ఏదో సర్దుబాటు చేసుకునేవారు. కొన్నిసార్లు హైదరాబాద్లో చంద్రబాబు ఇంటిలో కూర్చుని మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ప్రశ్నలు ఆగిపోయేవి. ఇప్పుడు జనసేన కూడా అధికారంలో భాగస్వామి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పదవే పరమాన్నంగా మారిపోయింది. తమకు అవమానాలు జరుగుతున్నాయని పార్టీ సమావేశంలో పలువురు కార్యకర్తలు వాపోయినా, పవన్ వారిని బుజ్జగించారే తప్ప అలా జరగకుండా చూస్తానని గట్టి హమీ ఇవ్వలేదు.పైగా కింది స్థాయిలో సర్దుకు పోలేకపోవడం వారి అసమర్థత అన్నట్లుగా కూడా మాట్లాడారు. చంద్రబాబుతో తాను మాట్లాడతానని అన్నప్పటికీ ఈ పరిస్థితిలో ఎంత న్యాయం జరుగుతుందోనని జనసేన కార్యకర్తలు సంశయంతోనే ఉన్నారు. ఇంతకీ సుగాలి ప్రీతి కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని పవన్ ఆ రోజుల్లో డిమాండ్ చేశారా? లేక కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరారా? డబ్బు ఇచ్చేస్తే కేసు క్లోజ్ చేయవచ్చని ఇప్పుడు భావిస్తున్నారా? తానేమీ చేయలేనని చేతులెత్తేయడం ద్వారా తనేమిటో ప్రజలకు అర్ధం అయ్యేలా ఆయనే చేసుకున్నారన్న భావన కలుగుతుంది. సినిమాలలోనే కాదు. రాజకీయాలలోనూ నటించి, అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తున్నట్లు అనిపించడం లేదూ!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
'వీరమల్లు'కు జీఎస్టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించి హరి హర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడతో సుమారు రూ.60 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి. దీంతో నిర్మాత ఏఎం రత్నం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. కనీసం తమకు జీఎస్టీ అయినా చెల్లించాలని నిర్మాతను బయ్యర్లు డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి. తాను కూడా నష్టపోయానని సంబంధం లేదని తేల్చిచెప్పినట్లు కొందరు చెప్పుకొస్తున్నారు. సుమారు రూ. 18 కోట్ల జీఎస్టీలు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశాన్ని సినిమాటోగ్రఫీ మాజీ మంత్రి పేర్ని నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జీఎస్టీ బిల్లు లేకుండానే అనుమతిహరి హర వీరమల్లు టికెట్ల రేట్లు పెంపు, జీఎస్టీ అంశం గురించి పేర్ని నాని ఇలా అన్నారు. ' ఏపీలో సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీఓ ప్రస్తుత ప్రభుత్వం కొట్టివేయలేదు. కానీ, దానిని పాటించకుండా వారికి ఇష్టం వచ్చనట్లు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు ఒక్క జీఎస్టీ ప్రూఫ్ కూడా ఇవ్వకుండా కేవలం తెల్లకాగితంతో నిర్మాత వెళ్లితే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అందరికీ నీతులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఇది తప్పనిపించలేదా.? అందరిని ప్రశ్నిస్తానని చెప్తాడు.. కానీ, ఆయన్ను ప్రశ్నిస్తే తట్టుకోలేడు. సూక్తులు మాత్రమే చెప్తాడు.. వాటిని ఆయన ఎంత మాత్రం పాటించడు.' అంటూ పేర్ని నాని పేర్కొన్నారు.జగన్ ప్రభుత్వం తెచ్చిన జీఓ ఎందుకు రద్దు చేయలేదు?సినిమా టికెట్ల ధరల విషయంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన జీఓ గురించి నాని ఇలా అన్నారు. 'హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే టికెట్ ధరలు పెంచుకోవాలని మేము జీఓలో చెప్పాం. అందుకు సంబంధించిన జీఎస్టీ ప్రూఫ్స్ కూడా ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే టికెట్ ధరల పెంపునకు అనుమతి తీసుకోవాలని గతంలో మేము జీఓ జారీ చేశాం. బ్లాక్ టికెట్ల అమ్మకాలు నిలువరించేందుకు అడ్డుకట్ట వేశాం. దీంతో పవన్ కల్యాణ్ ఊగిపోయారు. సినిమాల కోసం తాము పెట్టుబడిపెట్టుకుని నిర్మించుకుంటే ప్రభుత్వ జోక్యం ఏంటి అంటూ ఆయన రెచ్చిపోయారు. తాము తెచ్చిన ప్రభుత్వ జీఓపై నోటికొచ్చింది మాట్లాడుతూ ఊగిపోయారు. కానీ, ఇప్పటికీ అదే జీఓను ఏపీ సినిమా పరిశ్రమలో ఎందుకు కొనసాగుతుంది..?' అని నాని ప్రశ్నించారు. -
ఇదేం పరిపాలన అయ్యా.. బాబు, పవన్ కు పేర్ని కిట్టు ఛాలెంజ్
-
'ఓజీ' కొత్త గ్లింప్స్ రిలీజ్
'ఓజీ' సినిమా నుంచి కొత్త గ్లింప్స్ రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం.. కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఇందులో విలన్ పాత్రధారిని పరిచయం చేశారు. అతడి పాత్ర పేరు ఓమి. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ రోల్ చేశాడు. సదరు పాత్రతో గ్లింప్స్ చివరలో హ్యాపీ బర్త్ డే ఓజీ అని చెప్పించారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. సైలెంట్గా మొదలుపెట్టేశారు)అంతా బాగానే ఉంది గానీ పవన్ పుట్టినరోజు సందర్భంగా అతడిని హైలైట్ చేసే గ్లింప్స్ లాంటిది పడితే అభిమానులు కాస్త ఖుషీ అయ్యేవారు. అలా కాకుండా హీరో కంటే విలన్ పాత్రకు ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చేలా గ్లింప్స్ రిలీజ్ చేయడం కాస్త విచిత్రంగా అనిపించింది. ఎప్పటిలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. సుజీత్ దర్శకుడు కాగా తమన్ సంగీతమందించాడు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమాకు అభిమానుల్లో బజ్ గట్టిగానే ఉంది. పవన్ గత చిత్రం 'హరిహర వీరమల్లు' దారుణంగా ఫెయిల్ అవడంతో ఈ మూవీపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్) -
ఆటోపై పవన్ పోస్టర్ తీసేస్తున్న ఫ్యాన్స్
-
ప్రచారానికి వాడుకుని వదిలేశారు: సుగాలి ప్రీతి తల్లి పార్వతి
నంద్యాల (అర్బన్): హత్యాచారానికి గురైన తన కుమార్తె సుగాలి ప్రీతి అంశాన్ని జనసేనాని పవన్కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకుని ఇప్పుడు గాలికి వదిలేశారని ఆమె తల్లి పార్వతి విమర్శించారు. నంద్యాలలో సోమవారం గిరిజన సంఘాలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఈ కేసును గాలికి వదిలేశారన్నారు. న్యాయం చేయాలంటూ అమరావతికి వెళితే జన సైనికులు, వీర మహిళలతో అవమానాలకు గురి చేస్తున్నారని.. ఎమ్మెల్యేలు, మంత్రులు వెటకారం మాటలతో ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.లోకేశ్ రెడ్బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలన్నారు. గవర్నర్ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానన్నారు. ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య శంకర్నాయక్ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడం పవన్కళ్యాణ్కు అటవాటుగా మారిందని, ప్రీతి తల్లి పార్వతి వీల్చైర్ యాత్రకు అన్ని గిరిజన ప్రజా సంఘాలు, సమాఖ్యల సంపూర్ణ మద్దతు కూడగడతామన్నారు. కార్యక్రమంలో జీపీఎస్ అధ్యక్షుడు రాజునాయక్, ఉపాధ్యక్షుడు రాంబాలాజీనాయక్, మాలమహానాడు అధ్యక్షుడు సాంబశివుడు, బిలావత్ శంకర్నాయక్, విక్రం సింహనాయక్ పాల్గొన్నారు. -
నాటి ప్రగల్భాలు ఏమయ్యాయి పవన్!
కర్నూలు(టౌన్): సుగాలి ప్రీతి హత్యాచారం కేసుపై గత ఎన్నికలకు ముందు ఊగిపోతూ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడరేమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలులోని వాసవీ గార్డెన్స్లో ఉన్న సుగాలీ ప్రీతి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రీతి తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.అనంతరం వరుదు కళ్యాణి మాట్లాడుతూ 2017 ఆగస్టులో ప్రీతి హత్యాచారం జరిగితే ఆ తర్వాత రెండేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏంచేశారని ప్రశి్నంచారు. ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఈ కేసును రాజకీయంగా వాడుకున్నారని, అధికారంలోకి వస్తే దోషుల తాట తీస్తామని, వదిలి పెట్టే ప్రసక్తి లేదని ఊగిపోతూ ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు అపాయింట్మెంటు కూడా ఇవ్వకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ లా అండ్ ఆర్డర్ తన చేతిలో లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు సర్కారు విఫలం ‘‘రాష్ట్రంలో రోజూ 70 నుంచి 80 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. చంద్రబాబు సర్కారు మహిళల రక్షణలో విఫలమైంది. హోంమంత్రిగా మహిళ ఉన్నా.. అబలలకు రక్షణ లేదు. అసలు హోంమంత్రి అనిత పనిచేస్తున్నారా? టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలే మహిళలను లైంగికంగా వేధిస్తున్నా చర్యలు లేవు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలని, కేసును సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రీతి తల్లి వీల్చైర్ యాత్రకు అనుమతి కోరితే ఈ ప్రభుత్వం ఎందుకివ్వడం లేదు? రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసిన లోకేశ్.. సుగాలి ప్రీతి కేసుపై ఎందుకు స్పందించడం లేదు.?’’ అని కళ్యాణి ప్రశ్నించారు. జగనన్న వల్లే బాధిత కుటుంబానికి న్యాయం ‘‘2019లో జగనన్న సీఎం అయిన తరువాత సుగాలి ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఇంట్లో ఒకరికి ఉద్యో గం, రూ.8 లక్షల నగదు అందజేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి సర్కారు ప్రీతి కేసులో న్యాయం చేయాలి. ప్రీతి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.’’ అని కళ్యాణి చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు విజయ మనోహారి, గాజుల శ్వేతారెడ్డి, కల్లా నాగవేణి రెడ్డి, మంగమ్మ, భారతి పాల్గొన్నారు. -
బర్త్డే స్పెషల్
పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. నేడు (సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవన్ కల్యాణ్ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్తో టాకీ భాగం దాదాపు పూర్తవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అయనంక బోస్, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్స్: దినేష్ నరసింహన్, హరీష్. -
జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా?: వరుదు కల్యాణి
సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండికూడా ఏం చేయలేకపోతున్నారని.. మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ.. ‘‘2017 ఆగస్టు 19వ తేదీన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగాయి. చంద్రబాబు హయాంలోనే ఈ ఘటన జరిగింది. న్యాయం జరగలేదు సరికదా.. పరిహారం కూడా అందలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, వైఎస్ జగన్ హయాంలో చట్టపరమైన న్యాయం చేశారు... 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు. రుషికొండ భవనాలు చూడానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్కి.. సుగాలి ప్రీతి కేసు కనిపించ లేదా?. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసు మీద పెట్టిన శ్రద్ద.. ఈ గిరిజన బాలిక గురించి పట్టదా?. న్యాయం కోసం నిలదీస్తే.. నా చేతిలో ఏం లేదని పవన్ చెప్పడం అసలు ఏంటి?. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లాక.. రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా?. నారా లోకేష్ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా? మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చంద్రబాబు.. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఈ కేసును కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్ వాడుకున్నారు. పవన్ మాటలకు చేతలకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది. న్యాయం సంగతి పక్కనపెడితే.. జనసేన ఎమ్మెల్యేలు తిరిగి ఆమె కుటుంబం పైనే ఎదురుదాడికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం విడనాడి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది అని వరుదు కళ్యాణి అన్నారు.ఇదీ చదవండి: వామ్మో.. చింతమనేని! -
వైఎస్ జగన్ ఒక పెళ్లికి వెళితే వచ్చిన జనం కూడా నీ సభకు రాలేదు
-
మీ చెట్టుకు పళ్ళు ఉంటేగా రాళ్లు వేయడానికి.. పవన్ పై పేర్ని నాని లాస్ట్ పంచ్ సూపర్
-
సుగాలి ప్రీతీని అడ్డుపెట్టుకొని డిప్యూటీ సీఎం అయ్యావ్.. పవన్ పై YSRCP మహిళలు ఫైర్
-
సుగాలి ప్రీతి కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ మోసం చేశారు
-
పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు.. లైవ్ లో బొమ్మేసి ఏకిపారేసిన పేర్ని నాని
-
టీడీపీ అంతర్జాతీయ పార్టీ, జనసేన జాతీయ పార్టీ: పేర్ని నాని సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైరికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ, జనసేన జాతీయ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఎన్నిక్లలో సుగాలి ప్రీతి పేరును పవన్ రాజకీయంగా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేస్తే అది కూడా పవన్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘జనసేనకు ఐడియాలజీ అనేది ఉందా?. జనసేన ఐడియాలజీ అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిమా!. జనసేన సిద్ధాంతం అర్థం కాక ఆ పార్టీ నేతలే సతమతమవుతున్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ న్యాయం చేశారు. పవన్ ఎన్నిక్లలో సుగాలి ప్రీతి పేరును రాజకీయంగా వాడుకున్నారు. చంద్రబాబు హయాంలోనే సుగాలి ప్రీతి నిందితులకు బెయిల్ వచ్చింది. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేశారు.ప్రీతి తల్లిదండ్రులకు వైఎస్ జగన్ భూమి, ఇల్లు, ఉద్యోగాలు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి పవన్ కేకలు వేస్తూ మాట్లాడారు. ప్రీతి కేసును సీబీఐని అప్పగించాలని పవన్ ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే నిందితులు అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చారు. సుగాలి ప్రీతి కుటుంబానికి పవన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పవన్ తీరుతో ప్రీతి కుటుంబం మానసికంగా కుంగిపోయింది. నిందితులకు డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో చంద్రబాబు హయంలోనే నిందితులకు బెయిల్ వచ్చింది. సుగాలిప్రీతి హత్య విషయంలో పవన్ ప్రశ్నించాల్సింది చంద్రబాబును.. కానీ, ఆయనను ప్రశ్నించే ధైర్యం పవన్కు లేదు’ అంటూ విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై పవన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. త్వరలో మరో రెండు వేల మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు. కూటమి వేధింపులు తాళలేక 1440 మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. వీఆర్ఎస్ తీసుకోవడానికి మరో 1000 మంది ఉద్యోగులు రెడీ ఉన్నారు’ అని తెలిపారు. -
స్టీల్ ప్లాంట్పై కూటమి నేతల దొంగ బుద్ధి బట్టబయలు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. విశాఖ ఉక్కు అందరిది..స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్సార్సీపీ ధ్యేయం అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్సార్సీపీ వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాము. పోరాటంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటాము. కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్సార్సీపీ ధ్యేయం. మా పార్టీ కార్పొరేటర్ల పోరాటంతో GVMCలో స్టీల్ ప్లాంట్పై తీర్మానం చేయించారు.విశాఖ ఉక్కు ప్రజల అందరి హక్కు. 32 మంది ప్రాణ త్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే కూటమి నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ప్లాంట్పై కూటమి నేతల దొంగ బుద్ధి బయట పడింది. ప్లాంట్ కోసం కూటమి నేతలు గతంలో దొంగ దీక్షలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై మొదటి నుంచి వైఎస్ జగన్ది ఒకే మాట.. ప్రైవేటీకరణ జరగకూడదు అని చెప్పారు. ఎలాంటి పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే తాను వచ్చి పోరాటంలో పాల్గొంటానని జగన్ చెప్పారు.పవన్ కళ్యాణ్ గతంలో ఎంపీలు స్టీల్ ప్లాంట్ కోసం ఉప్పు కారం తినాలని మాట్లాడారు. ఈ రోజు ఉప్పు కారం ఎవరికి పంపుతారు. ఎవరు తినాలి ఉప్పు కారం.. అది పవనే చెప్పాలి. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రధాన మంత్రితో మాట్లాడలేదు. వైఎస్ జగన్ ధైర్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ప్రధాని మోదీని కోరారు’ అని గుర్తు చేశారు. -
సుగాలి ప్రీతి కేసుపై పవన్ వ్యాఖ్యలకు అంబటి అదిరిపోయే కౌంటర్
-
పవన్ కల్యాణ్ కు షాకిచ్చిన జనసైనికులు
-
ఒంటరి పోటీతో ఎలా ఉండేదో!.. చిరంజీవిని ఉద్దేశించే వ్యాఖ్యలు!
అల్లిపురం/జగదాంబ(విశాఖ): ఒంటరి పోటీతో జనసేనకు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండేవన్న విషయం ఎప్పుడూ చర్చనీయాంశమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీలు పెట్టి, రాజకీయ వ్యూహం లేకపోవడం వల్ల ఎంతో మంది వెళ్లిపోయారని అన్నారు. అందుకే కేవలం ‘ఐడియాలజీ’పై మాత్రమే కాకుండా, రాజకీయ వ్యూహంతో గత ఎన్నికల్లో కలిసి జట్టుగా పోటీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ‘విడిగా వెళితే వచ్చి ఉండేదో.. రాదో..’ అని ఈ సందర్భంగా అన్నారు.రానున్న రోజుల్లో సినిమాలూ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. ‘సేనతో సేనాని’ పేరుతో విశాఖలో మూడు రోజుల పాటు నిర్వహించిన సమావేశాల అనంతరం శనివారం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ‘పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు త్రిశూల్ కార్యక్రమాన్ని దసరా తర్వాత ప్రారంభిస్తాం. ఏదో ఒక రోజు జనసేన జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్రంలో కూటమి సుస్థిరంగా ఉండాలి. జనసేన వల్లే విశాఖ స్టీలు ప్రైవేటుపరం కాకుండా ఆగింది’ అని పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. చిరంజీవిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు! కాగా, ‘పార్టీలు పెట్టి సరైన రాజకీయ వ్యూహం లేక వెళ్లిపోయారు’ అంటూ పరోక్షంగా అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ గురించే ఆయన మాట్లాడరనే గుసగుసలు సమావేశంలోనే కార్యకర్తల నుంచి వినిపించడం గమనార్హం. దీంతో, పవన్ వ్యాఖ్యలపై అటు సోషల్ మీడియాలో సైతం పలువురు నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
సుగాలి ప్రీతి మరణంతో పవన్ రాజకీయం!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: 14 ఏళ్ల గిరిజన బాలికపై టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. టీడీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వీరికి పరిహారం ఇచ్చింది. కేసును సీబీఐకి అప్పగించింది. తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీబీఐ కేసు నుంచి తప్పుకుంది. ‘న్యాయం’ చేస్తామన్న పవన్ కళ్యాణ్ మాట మార్చారు.‘ప్రీతి’కి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని వారికి శిక్ష పడాలనే డిమాండ్తో ప్రీతి సమాధి వద్ద నుంచి అమరావతికి వీల్ చైర్ ర్యాలీ చేయాలనుకున్న ఆమె తల్లి సుగాలి పార్వతిని ప్రభుత్వం, పోలీసులు బెదిరించి ఆపేశారు. దీంతో ఏం చేయాలో తెలీక నిత్యవేదనతో జీవిస్తోంది ప్రీతి కుటుంబం. పవన్ కళ్యాణ్పై ప్రీతి తల్లి, ఆమెపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో తిరిగి ఈ వివాదం తెరపైకి వచ్చింది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఎవరిది తప్పు అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఈ క్రమంలో ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.టీడీపీ ప్రభుత్వ హయాంలో హత్యాచారం రాజునాయక్, పార్వతిల కుమార్తె ప్రీతి కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూలులో చదివేది. 2017 ఆగస్టు 19న ప్రీతిపై అత్యాచారం చేసి, చంపేసి ఫ్యాన్కు ఊరేసుకున్నట్లు చిత్రీకరించారు. 2017 ఆగస్టు 21న పోస్టుమార్టం నిర్వహించారు. వైద్య రిపోర్టులన్నీ ప్రీతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని తేల్చాయి. అయినప్పటికీ నిందితులకు శిక్ష పడలేదు. ఆశ్చర్యమేంటంటే కేసులోని ముగ్గురు కీలక నిందితుల్లో ఏ2, ఏ3కి ఎనిమిది రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ పోక్సో కేసులో 90 రోజుల వరకు బెయిల్ ఇవ్వకూడదు.అయినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో బెయిల్ వచ్చింది. హత్యాచారం నిజమే అని అన్ని రిపోర్టులు చెప్పినా.. నిందితుల డీఎన్ఏ, అత్యాచారం ఘటనతో మ్యాచ్ కాలేదని చెప్పింది. అప్పుడు అధికారంలో ఉన్నది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలను మార్చి నిందితులను తప్పించారని ప్రీతి తల్లి ఆరోపిస్తోంది. మరో ఘోరం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో బాధిత కుటుంబాలకు 6 నెలల్లో పరిహారం ఇవ్వాలి. కానీ రూ.8,12,500 డబ్బు మినహా 6 నెలల్లో ఇవ్వాల్సిన ఇతరత్రా బెనిఫిట్స్ను నాటి టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. దీన్నిబట్టే ఆ కేసుపై అప్పటి ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టమవుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్ ప్రీతి తల్లి 2018లో వైఎస్ జగన్ను పాదయాత్రలో కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి మొర పెట్టుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ సీఎం అయ్యాక 2020లో కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు ప్రీతి తల్లి కలిశారు. కేసును సీబీఐతో విచారణ చేయించాలని అడిగారు. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేశారు. 2021లో కర్నూలు నగరంలో 5 సెంట్ల స్థలం, 5 ఎకరాల పొలంతో పాటు ప్రీతి తండ్రి రాజు నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వైఎస్ జగన్ అండగా నిలిచారు. రాజకీయానికి వాడుకున్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతిపై హత్యాచారం 2017లో జరిగితే అప్పట్లో మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2020 ఫిబ్రవరి 11న కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకున్నారు. 2024లో కూటమి అధికారం వచ్చాక పవన్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. కానీ సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదు. 2024 జూలై 27న ప్రీతి తల్లి కలిసి న్యాయం కోసం వేడుకున్నా పవన్ స్పందించలేదు. ఇంతలో ఈ కేసును స్వీకరించే వనరులు తమ వద్ద లేవని 2025 ఫిబ్రవరి 13న హైకోర్టుకు సీబీఐ చెప్పింది.అయినా పవన్ కళ్యాణ్, చంద్రబాబు చొరవ తీసుకోలేదు. దీంతో కేసును సీబీఐ స్వీకరించాలని ప్రీతి తల్లి దివ్యాంగురాలైన పార్వతి కౌంటర్ వేశారు. ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసును సీఐడీకి అప్పగించి నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వం యత్నించింది. అయితే ఇందులో డీఎస్పీ స్థాయి అధికారితోపాటు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ప్రమేయం ఉందని.. వారిని సీఐడీ విచారించలేదని, సీబీఐతోనే విచారణ చేయించాలని పార్వతి ప్రభుత్వానికి లేఖ రాశారు. న్యాయం జరిగేదాకా పోరాటంఘటన జరిగింది టీడీపీ ప్రభుత్వ హయాంలో.. బెనిఫిట్స్ ఇవ్వంది అప్పుడే.. జగన్ ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు సీబీఐకి కేసును అప్పగిస్తూ జీవో జారీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐ కేసు నుంచి తప్పుకుంది. సీఐడీకి అప్పగించింది. అదీ సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు విచారిస్తారట. ఈ కేసులో అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులు కేఎన్ వినోద్కుమార్, రమణమూర్తి, సీఐలు మహేశ్వరరెడ్డి, శేషయ్యతో పాటు ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ లక్ష్మీనారాయణను విచారించాలి. వీరే కేసును నీరుగార్చారు. వీరిని విచారిస్తే ఎవరు ఒత్తిడి చేశారు? కేసు ఎందుకు నీరుగార్చారో తేలుతుంది. నిందితులకు శిక్ష పడుతుంది. ప్రీతికి న్యాయం జరుగుతుంది. అప్పటి వరకూ పోరాటం చేస్తా. – పార్వతి, సుగాలి ప్రీతి తల్లి -
జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టకు..!
సాక్షి, విశాఖపట్నం: ఆర్థికాంశాల కంటే సామాజిక అంశాలే వెనుకబాటుతనానికి కారణమని అంబేద్కర్ గ్రహించారని.. అలాంటి వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పడం తెలిసిందే. అయితే ఆయన పార్టీ వాళ్లేమో.. అంబేద్కర్ కంటే పవనే గొప్ప అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. అవును.. పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనలో జనసేన నేతలు మరీ దుర్మార్గంగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటో కనిపించకుండా.. దానిపై పవన్ కళ్యాణ్ పోస్టర్ను అంటించారు. తాటి చెట్ల పాలెం సిగ్నల్ వద్ద ఈ పోస్టర్ వెలిసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన ఇంచార్జి పసుపులేని ఉషాకిరణ్ పేరిట ఈ పోస్టర్లు వెలిసినట్లు తెలుస్తోంది. మహాత్ముల ఫొటోలు.. వాళ్ల కొటేషన్లు అక్కడున్న గోడపై వరుసగా ఉన్నాయి. అందులో అంబేద్కర్ చిత్రాన్ని మాత్రమే జనసేన పోస్టర్ కవర్ చేసింది. దీంతో ఆ దారి గుండా వెళ్తున్న వాళ్లు అది చూసి.. జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టను చేరిందని, తమ ప్రచార పిచ్చి కోసం అంబేద్కర్ను అవమానించారంటూ వ్యాఖ్యానించారు. ఇటు సోషల్ మీడియాలోనూ.. అంబేద్కర్ కంటే పవన్ గొప్పాడని జనసేన భావిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. పవన్ పరువు తీసే పనిలో జనసేనవాళ్లు బిజీగా ఉన్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ చర్యపై మీరెలా స్పందిస్తారు?.. -
జనసేనలో అసంతృప్తి.. కిందా మీదా పడ్డ పవన్ కల్యాణ్
విశాఖ సిటీ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. కూటమి ప్రభుత్వంలో తమకు విలువ లేకుండా పోయిందని పార్టీ నేతలు ఆక్రోశం వెళ్లగక్కారు. ఎమ్మెల్యేలు, అధికారులు తమను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తే.. అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టేశారని అధినేతనే నిలదీశారు. తమకు పదువులే కాదు.. కనీసం గుర్తింపు కూడా లేదని వాపోయారు. వారిని సముదాయించడానికి పవన్ కల్యాణ్ కిందా మీదా పడాల్సి వచ్చింది. జనసేన ప్లీనరీ సందర్భంగా రెండు రోజులుగా విశాఖలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా భేటీ అయ్యారు. ఇందులో నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో తమ పరిస్థితులను, కష్టాలను అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. జనసైనికులు, వీర మహిళలే పార్టీకి బలం జనసేన పార్టీ సైద్ధాంతిక భావజాలాన్ని నమ్మిన జనసైనికులు, వీర మహిళలే పార్టీకి బలమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఇచ్చే బలంతోనే జనసేన జాతీయ పార్టీ స్థాయికి ఎదిగేలా పనిచేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సిద్ధాంతాన్ని నమ్మే సమూహం కావాలని పిలుపునిచ్చారు. సినిమా అభిమాన బలాన్ని రాజకీయంగా వ్యవస్థీకృతం చేయాలి. ఎవరో ఒకరికి బాధ్యత అప్పగించడం తన ఉద్దేశం కాదని, పార్టీని సంస్థాగతంగా ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నామని చాలా మంది అడుగుతున్నారన్నారు. కానీ జనసేనను భుజాన వేసుకుంటూ మోస్తున్నది జనసైనికులు, వీరమహిళలే అన్నారు. కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కూటమిలో విలువ లేదు.. కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలు, కార్యకర్తలకు కనీసం విలువ లేకుండా చేస్తున్నారని కొందరు అధినేతకు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే వారి స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని, తమను కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అధికారులు సైతం తమకు విలువ ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడితే ఇప్పటి వరకు పదవులు లేవని, గుర్తింపు కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతోందని, దీని నుంచి బయట పడే విషయంపై పార్టీ పెద్దలు దృష్టిసారించాలని సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీ ఇంకా ఎదగాలని, ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా ఆ ప్రభావం పారీ్టపై కూడా పడుతోందని, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించినట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న నేతలు, కార్యకర్తలకు అధినేత పవన్ సరి్ధచెప్పడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. -
రామ్మోహన్ నాయుడు వీడియో వేసి ఏకిపారేసిన గుడివాడ
-
రుషికొండలో పవన్, నాదెండ్ల కొత్త డ్రామా.. గుడివాడ అమర్నాథ్ మాస్ కౌంటర్
-
రుషికొండలో పవన్, నాదెండ్ల కొత్త డ్రామా: అమర్నాథ్
సాక్షి, విశాఖ: రుషికొండ భవనాలను వాడుకునేందుకు కూటమి నేతలు పోటీపడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు. రుషికొండలో పవన్ డ్రామా చేశారు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్పై తీవ్ర విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రుషికొండలో పవన్ డ్రామా చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారు. కూటమి నేతలకు రుషికొండ పర్యాటక ప్రాంతంగా మారింది. చంద్రబాబు హైదరాబాద్లో 200 కోట్ల రూపాయలతో పెద్ద భవనం కడతే అది పూరి గుడిసె.. అమరావతిలో ఐదు ఎకరాల్లో చంద్రబాబు రాజభవనం కడితే అది స్కీమ్ ఇల్లు. వైఎస్ జగన్ ఇల్లు కట్టుకుంటే అవి మాత్రం ప్యాలెస్. రుషికొండ భవనాలు ఎవరు వాడుకోవాలనే దాని మీద చంద్రబాబు, పవన్, లోకేష్ మధ్య పోటీ నెలకొంది. అందుకే రుషికొండ భవనాలు దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. రుషికొండ భవనం సీలింగ్ కట్ చేశారు. కట్ చేసిన ప్రాంతంలో పవన్ ఫోటో షూట్ చేశారు. చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయం చిన్నపాటి వర్షానికి కారిపోతుంది. చదరపు అంగుళానికి రూ.13వేలు పెట్టి కట్టారు. వాటి దుస్థితి చూడండి. అవి పవన్కు కనిపించడం లేదా?. ఏరోజైనా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమరావతి సచివాలయానికి వెళ్లారా?. ఎన్నికల్లో రుషికొండ భవనాలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు. పర్యాటక రిసార్ట్ అంటూ ఎందుకు జీవో విడుదల చేశారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్డ్ చేయడానికే రుషికొండలో పవన్ డ్రామాకు తెరలేపారు. రుషికొండలో పవన్, నాదెండ్ల మనోహర్ ఫోటో షూట్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.స్టీల్ ప్లాంట్ కోసం డైవర్షన్ పాలిటిక్స్కు పవన్ కళ్యాణ్ తెరలేపారు. విశాఖ ఉక్కు నా ఆత్మ అంటూ చంద్రబాబు ప్రసంగించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మాట్లాడారు. విశాఖ ఉక్కు అమ్మేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. ఈవెంట్ల కోసం విశాఖ, పేమెంట్లు కోసం అమరావతి వాడుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ అంశంలో చేతగాని వ్యక్తులు ఎవరో పవన్ను చూస్తే తెలుస్తుంది. వేలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డున పడ్డారు. వారి గురించి చంద్రబాబు, పవన్ ఒక మాట మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మా వైఖరి మారలేదు. మొదటి నుంచి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. స్టీల్ ప్లాంట్పై మా వైఖరి ఒకటే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కూటమి గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని వైఎస్ జగన్ ఎన్నికలకు ముందే చెప్పారు. వైఎస్ జగన్ వలనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని కేంద్ర మంత్రి కుమార స్వామి తెలిపారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు, పవన్, లోకేష్ వైజాగ్ వస్తున్నారు. త్వరలోనే స్టీల్ ప్లాంట్పై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. తప్పుడు హామీలు, అబద్ధాలతో కూటమి అధికారంలోకి వచ్చింది. స్టీల్ ప్లాంట్ కార్మికుల అవస్థలు కూటమి నేతలు పట్టించుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్పై గతంలో పవన్ కల్యాణ్ ఎన్ని హామీలు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు ఏం అయ్యాయి? అని ప్రశ్నించారు. -
KSR Live Show: ఆటలో అరటిపండు.. పవన్ ను వాడుకుంటున్న చంద్రబాబు
-
రుషికొండ డ్రామా బట్టబయలు
-
కుట్ర అడ్డం తిరిగింది.. అడ్డంగా ఇరుక్కున్న బాబు.. పవన్
-
Big Question: కార్మికులు రోడ్డున పడుతుంటే రుషికొండలో ఏం చేస్తున్నావ్ పవన్
-
నోటికి అన్నమే కదా తింటున్నావ్.. పవన్ పై జాడ శ్రావణ్ సంచలన వ్యాఖ్యలు
-
వీరమల్లును మించిన ఫ్లాప్ డ్రామా.. కుట్ర బయటపెట్టిన ఈశ్వర్
-
సుగాలి ప్రీతి తల్లిపై ఎదురుదాడి.. బయటపడ్డ పవన్ నిజస్వరూపం
-
జగన్ ప్యాలెస్ కాదు.. పర్యాటక రిసార్ట్
ప్రతి విషయంపైనా ప్రజలను మభ్యపెట్టి, అబద్ధాలను నిజాలుగా భ్రమింపజేస్తూ దుష్ప్రచారం చేయడం చంద్రబాబు నైజం అని మరోసారి నిరూపితమైంది...! విశాఖపట్నం రుషికొండ భవనాల సాక్షిగా... ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందే కుట్రలో భాగంగా... చంద్రబాబుతో పాటు కూటమి పార్టీలు సాగించినదంతా తప్పుడు ప్రచారమేననితేలిపోయింది..! రుషికొండలో నిర్మించినది మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్యాలెస్ కాదని, అది పర్యాటక శాఖ రిసార్ట్ అనే వాస్తవాన్ని చంద్రబాబు ప్రభుత్వం బహిరంగంగానే అంగీకరించింది...! అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి... దాదాపు ఏడాదిన్నర పాటు రుషికొండ భవనాలను విస్మరించింది...! ఇప్పుడు అది వైఎస్ జగన్ ప్యాలెస్ కాదు.. పర్యాటక శాఖ రిసార్ట్ అంటూ నిజాన్ని ఒప్పుకొని నాలుక్కర్చుకుంది...! ...అయితే, ఇంతకాలం తాము సాగించిన తప్పుడు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు... రుషికొండ భవనాలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ముందుపెట్టి పెద్ద డ్రామా ఆడింది..! సీఎం చంద్రబాబు డైరెక్షన్లో... రుషికొండ భవనంలో పవన్ కళ్యాణ్ తన నట కౌశలాన్ని చూపించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన.. రీల్ యాక్షన్, డ్రామా సన్నివేశాలను రియల్గానూ కొనసాగించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమా సాగిందిలా..సాక్షి, అమరావతి, విశాఖపట్నం: విశాఖపట్నంలో జనసేన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్... శుక్రవారం ఉదయం హఠాత్తుగా రుషికొండపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అత్యద్భుత పర్యాటక భవనాలను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ తన సినీ నటనా చతురతను ప్రదర్శించారు. అద్భుతంగా నిర్మించిన ఈ భవనంపై గతంలోనూ ఏడుపు ప్రదర్శించిన పవన్ మరోసారి అదే కంటగింపు కొనసాగించారు. రూ.లక్షల్లో కరెంట్ బిల్లు వస్తోందంటూ ఆరోపించారు. రూ.450 కోట్లతో నిర్మించిన భవనం పాడైపోతోందంటూ రాగాలు తీశారు. అసలు వాస్తవం ఏమంటే, రుషికొండపై ప్రపంచం మెచ్చుకోదగ్గ ప్రభుత్వ భవనాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించింది. దీన్నిచూసి ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి విష ప్రచారం చేశారు. పర్యాటకానికి ప్రపంచ చిరునామాగా మార్చాల్సిన ఈ భవనాన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. మరమ్మతుల పేరుతో భారీగా దోచుకునేందుకు పన్నాగం మొదలుపెట్టింది. ప్రైవేటుకు ఇస్తున్నట్లు నేరుగా చెబితే వ్యతిరేకత వస్తుందని గ్రహించిన చంద్రబాబు... పవన్ కళ్యాణ్ను పంపించి డ్రామా సృష్టించినట్లు తెలుస్తోంది. నాసిరకం అని ముద్ర వేసే కుట్ర: రాజధాని పేరిట రూ.వేల కోట్లతో అమరావతిలో తాత్కాలిక భవనాలు నిర్మించిన చంద్రబాబు... కేవలం రూ.450 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలను చూసి అచ్చెరువొందారు. అద్భుతంగా నిర్మించారంటూ గతంలో చంద్రబాబుతో పాటు పవన్ కూడా కితాబిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భవనాలను పరిశీలించిన మంత్రులు, ఆ పారీ్టల నేతలంతా కూడా అద్భుతం అని కొనియాడారు. అమరావతి తాత్కాలిక భవనాలు, రుషికొండ నిర్మాణాల వ్యయాలను బేరీజు వేస్తూ నిపుణులు సైతం ప్రశంసించారు. మేధావులు చంద్రబాబు సాగించిన దుబారా వ్యయం పైనా చర్చ లేవనెత్తారు. దీంతో రుషికొండ భవనం అద్భుతం కాదని నిరూపించేందుకు కుట్ర ప్రారంభించారు. ఏడాదిన్నర ఖాళీగా ఉంచి... దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఖాళీగా ఉంచేశారు. ఇప్పుడు నాసిరకంగా నిర్మించారంటూ విమర్శలు మొదలుపెట్టేందుకు స్కెచ్ వేశారు. పవన్ కళ్యాణ్ వెళ్లి చూసినప్పుడు లోపల సీలింగ్ విరిగి పడినట్లుగా చూపించారు. ఆ వీడియోలను నిశితంగా పరిశీలిస్తే.. బరువైన సీలింగ్ నాసిరకంగా ఉండడం వల్ల పడిపోతే.. 90 డిగ్రీల కోణంలో సరిగ్గా కిందపడుతుంది. కానీ, ఈ ముక్కలు కాస్త పక్కన పడ్డాయి. పైగా సీలింగ్ను చూస్తే రంపంతో కోసినట్లుగా కనిపిస్తోంది. అంటే, పవన్ వస్తున్నారని తెలిసి.. ప్రభుత్వం ఇదే అదనుగా సీలింగ్ను విరగ్గొట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా ఎలాంటి లీకులు లేకుండా సీలింగ్ ఎలా పడిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తే.. కావాలని రుషికొండ భవనానికి చెడ్డ పేరు తెచ్చేందుకు డ్రామాలు ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇల్లు ఖాళీగా ఉన్నా కరెంటు బిల్లు రాదా? రుషికొండ భవనాలకు భారీగా కరెంటు బిల్లు వస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిర్మాణాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. అయితే, పటిష్ఠ నిర్మాణాన్ని ఏడాదిన్నరగా వినియోగించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది వాస్తవం కాదా? భవనం ఖాళీగా ఉన్నప్పటికీ కరెంటు బిల్లు రాకుండా ఉంటుందా? అంటూ అధికారులు గుసగుసలాడడం కనిపించింది. అయినప్పటికీ, ఇదికూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తప్పేనని చెప్పడం చూస్తే... అభాండాలు వేసేందుకు ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరమ్మతుల పేరుతో కొట్టేసి.. ప్రైవేట్కు ఇచ్చేసి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ భవన సముదాయాలను ఖాళీగా ఉంచారు. ఇప్పుడు ప్రైవేట్కు ఇచ్చేందుకు స్కెచ్ వేశారు. టూరిజం భవనాలు కాబట్టి.. టూరిజం పాలసీలో భాగంగా తక్కువ ధరకు లీజుకిచ్చి, దాని ద్వారా భారీగా నొక్కేసేందుకు యత్నాలు మొదలైనట్లు పర్యాటక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలు రుషికొండ టూరిజం భవనాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కానీ, ఈ భవనాలు ఎందుకు పనికొస్తాయి? అని స్వయంగా చంద్రబాబు గతంలో వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రైవేట్కు ఇవ్వాలని చూస్తున్నామని నేరుగా చెబితే తనపై వ్యతిరేకత వస్తుందని భావించి, పవన్ను పావుగా వాడుకున్నట్లుంది. విశాఖ పర్యటనలో ఉన్న పవన్తో చంద్రబాబు మాట్లాడి రుషికొండ భవనాలను పరిశీలించాలని ప్రైవేట్కు ఇవ్వాలా? ఎలా వాడాలి? అనేదానిపై మీడియాతో మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. బాబు పథకం ప్రకారమే... అక్కడ ఏర్పాట్లు చేసిన తర్వాత పవన్ ప్రవేశించి.. సినిమా షూటింగ్ తరహాలో యాక్షన్ డ్రామా మొదలుపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, కర్నూలుకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి హత్య అంశాన్ని ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ లబి్ధకి ఉపయోగించుకున్నారు. దీనిపై ప్రీతి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే మొదట సుగాలి ప్రీతి కేసు ఫైల్ పైనే సంతకం చేస్తానని పవన్కళ్యాణ్ చెప్పిన వైనాన్ని ప్రస్తావిస్తూ సూటిగా ప్రశ్నిoచారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని పూర్తిగా డైవర్ట్ చేసేందుకు పవన్.. విశాఖలో రుషికొండ డ్రామాకు తెరతీశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంత్రులూ.. ఏం చేద్దాం చెప్పండి..! రుషికొండ భవనాలు పర్యాటక శాఖ రిసార్ట్ అంటూ వాస్తవాన్ని అంగీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భవనాలను సముచితంగా ఉపయోగించుకునేలా అధ్యయనానికి, సిఫార్సులు చేయడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ రిసార్ట్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో నిర్ణయం తీసుకోవడానికి మంత్రుల బృందం ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాలని ఉత్తర్వుల్లో సూచించారు.విశాఖ స్టీల్ప్లాంట్పై కిక్కురుమనకుండా..» అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ మాట మారిందేల? » ప్లాంట్ ప్రైవేటీ కరణపై జనసేనాని రెండు నాల్కల ధోరణివిశాఖ స్టీల్ ప్లాంట్లోని కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ గురించి పవన్ కిక్కురుమనలేదు. అసలు ఆ విషయం రాకుండా కవర్ చేయడానికి తాపత్రయపడ్డారు. స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలు చూసేందుకు వెళ్లారు. అందులో సీలింగ్ వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిచోట్ల ఊడిందని చెబుతూ రాద్ధాంతం చేశారు. అటు రూ.వేల కోట్ల విలువైన ఉక్కు పరిశ్రమపై మాట్లాడకుండా డైవర్ట్ చేస్తూ ఇలా పూట గడిపేశారని విశాఖ యువత దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో టీడీపీ, జనసేన ఎంపీల బలం ఉన్న ఈ సమయంలో పవన్కళ్యాణ్ కీలకమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై విశాఖ పర్యటనలో బేలగా మాట్లాడారు. ఇది కార్మికులతో పాటు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేంద్రం మెడలు వంచైనా ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కార్మికులు ప్రతిఘటిస్తుంటే.. ‘‘ఢిల్లీ అంటే ఏమనుకుంటారు?’’ అంటూ వారిని పరోక్షంగా తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వేగంగా చేపడుతున్న ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలేవీ చేపట్టకపోగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ తప్పించుకునే ధోరణి కనబరిచారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా దీక్షకూ సిద్ధమని మాట్లాడిన జనసేన అధినేత, ఇప్పుడు కార్మికులను తప్పుపట్టేలా మాట్లాడుతున్నారు. క్యాప్టివ్ మైన్స్ తేవడం చేతకాక వైఎస్సార్సీపీపై నిందలా? » చంద్రబాబు, పవన్ చేతికానితనంతోనే ప్రైవేటీకరణ » వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని.. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతకానితనం వల్లే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను వేగంగా కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో ఉంటూ టీడీపీ, జనసేనలు స్టీల్ ప్లాంట్కు ఎందుకు క్యాప్టివ్ మైన్స్ను సాధించలేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ లాస్లో ఉన్నట్టు చూపించి అమ్మేసే పనిలో ఉంటే మౌనం దాల్చారని పేర్కొన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని... తాము ఉద్యోగులు, కార్మికుల తరుఫున పోరాడతామని చెప్పారు. ఈ ప్లాంట్కు జపాన్, కొరియా, అమెరికా, రష్యాల్లో మార్కెట్ ఉందని, క్యాప్టివ్ మైన్స్ ఇస్తే అద్భుతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేనలు చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపింది వైఎస్ జగన్. ఆపలేక చేతులెత్తేసింది మీరు. చిత్తశుద్ధి లేని కూటమి నాయకులు, ఎన్నికలకు ముందు ఒకలా, గెలిచాక మరోలా మాట్లాడుతున్నారు’ అంటూ జూపూడి మండిపడ్డారు. -
మాపై పవన్ ఆరోపణలు సరికాదు: సుగాలి ప్రీతి తల్లి
సాక్షి, కర్నూలు: తమపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధను కలిగిస్తున్నాయని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో తమకు పరిహారం అందించారన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు మూడు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి 14 నెలలు అవుతున్న తమకు న్యాయం చేయలేదని పార్వతి అన్నారు.‘‘తమకు న్యాయం చేయక పోగా పవన్.. తమపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. పవన్ రెండు ఉద్యోగాలు ఇప్పించారని దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగనే మాకు ఉద్యోగం ఇప్పించారు. డీఎన్ఏ రిపోర్టులు మార్చారని.. పవన్ ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. న్యాయం చేయమని అడిగితే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం. నిందితులను శిక్షించేవరకు పోరాడతా’’ అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి స్పష్టం చేశారు. -
ఏపీలో మహిళలకు భద్రత కరువైంది: వరుదు కళ్యాణి
సాక్షి, నెల్లూరు: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కూటమికి ఓట్లు వేసినవారు బాధపడుతున్నారన్నారు. కూటమి పాలనలో లిక్కర్ అమ్మకాలు దారుణంగా పెరిగాయని.. లిక్కర్ అమ్మకాలతో మహిళలకు భద్రత కరువైంది’’ అని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మద్యానికి బానిసలై.. మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ఏపీలో మహిళలపై గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ పెరిగాయి. మహిళల రక్షణ కోసం వైఎస్సార్సీపీ మహిళా విభాగం పోరాడుతుంది. ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీలకు చంద్రబాబు మంగళం పాడారు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు...రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఎక్కడికక్కడ బెల్టు షాపులు, పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చేశారు. గతంలో మేము ‘దిశ’ పేరుతో మహిళా రక్షణ చేపడితే దాదాని పూర్తిగా నీరుగార్చారు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి లభ్యం, డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతుంది. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటూ అధికారంలోకి వచ్చారు. హామీలు విస్మరించి.. సూపర్ సిక్స్ అమలు చేసేశాం అంటున్నారు...ఎన్నికలకు ముందు ఉచిత బస్సు అనీ, ఐదు బస్సుల్లో అవకాశం కల్పించారు. ఏపీ రాష్ట్రాన్ని ముగ్గురు సీఎంలు పరిపాలిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్లు ముగ్గురు సీఎంలే. కలల రాజధాని నిర్మాణం అన్నారు.. నేడు అలల్లో తేలే రాజధాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం సంపద కాదు.. అప్పలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలే స్వయంగా మహిళలను వేధించే పరిస్థితి చూస్తున్నాం. మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిపై చర్యలు లేవు..మహిళపై చేయి వేసిన వారి తాట తీస్తా.. తోలు తీస్తా అన్న పవన్ ఎక్కడ తీస్తున్నాడో తెలియడం లేదు. చంద్రబాబు పాలనలోనే సుగాలి ప్రీతి ఘటన జరిగింది. ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం ప్రీతి ఘటనను వాడుకున్నాడు పవన్.. రాజకీయ లబ్ధి కోసం వాడుకుని తీరా వచ్చాక గాలికి వదిలేశారు. పవన్కు చిత్తశుద్ధి వుంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి’’ అంటూ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. -
సుగాలి ప్రీతి కేసు లేదు.. స్టీల్ ప్లాంట్ ఊసులేదు
రాష్ట్రానికి దాదాపు ముప్పైమంది ఎంపీలున్నారు.. మీరంతా ఎందుకున్నట్లు?.. సిగ్గుందా? లజ్జ ఉందా?? మీకసలు పౌరుషం లేదా??? పౌరుషం కావాలంటే కాసింత గొడ్డుకారం తినండి! ఒంటికి రాసుకోండి!!.. అప్పుడైనా మీకు పౌరుషం వస్తుందేమో..!!! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేస్తుంటే ఈ వైఎస్సార్సీపీ వాళ్లెం చేస్తున్నారు? ఇదేనా మీ నైతికత.. ఇదేనా మీ బాధ్యత .. అదే నేను ఉండుంటే ఢిల్లీవాళ్ళు ఇలాగె చెలరేగిపోయేవాల్లా.. ఖచ్చితంగా నేను ఆ ప్రయివేటీకరణంను ఆపేసేవాణ్ని.. ఎన్నికలకు ముందు చిందులు తొక్కిన పవన్.. నేడు ఆ అంశాన్ని మెల్లగా సైడ్ చేసేసారు. విశాఖలో మూడురోజులపాటు పార్టీ నేతలు.. కార్యకర్తలతో సమావేశాలు అంటూ హడావుడి చేసిన పవన్ తనలోని అసలైన రాజకీయ నాయకున్ని బయటకు తీశారు. ఎప్పట్లానే పదిహేనేళ్ళు మళ్ళా తెలుగుదేశంతో కలిసి సాగుతానని అన్నారు. దానికి కార్యకర్తలు.. నాయకులు తలూపాలని చెప్పేశారు.పదవులు ముఖ్యం కాదని.. సమాజమే ప్రధానమని... దేశోద్ధారణకు పార్టీ ఏర్పాటు చేసానని చెప్పేసారు. తనకు తన అన్న నాగబాబుకు పదవులు వచ్చాయి కాబట్టి అలాగే అంటాడు. కానీ గ్రామ.. మండల స్థాయిల్లో పని చేస్తున్న కార్యకర్తలు.. నాయకుల పరిస్థితి ఏమిటని ? తమను తెలుగుదేశం వాళ్ళు సెకెండ్ గ్రేడ్ పౌరుల్లా చూస్తున్నారని లోలోన జనసైనికులు కుమిలిపోతున్నా ఆ సౌండ్ బయటకు రాకుండా చేతులు అడ్డం పెట్టుకున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఎమోషన్ అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కీలక విభాగాలను ప్రయివేటుకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం వేసిన నోటిఫికేషన్ గురించి పవన్ ఎక్కడా కిక్కురుమనలేదు. అసలు ఆ విషయాన్నీ కూడా జనంలోకి రాకుండా కవర్ చేయడానికి తాపత్రయపడ్డారు. మరోవైపు సుగాలీ ప్రీతి హత్య గురించి ఎన్నికలకు ముందు గంగవెర్రులెత్తిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారని, ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ తమకు న్యాయం చేయకపోతే జనసేన ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే మొదట ఓపెన్ చేసేది సుగాలి ప్రీతి కేసు అని... అప్పట్లో చెప్పిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ మీద కూడా ఎక్కడా ప్రస్తావించకుండా వైయస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలు చూడ్డానికి వెళ్లారు. అందులో సీలింగ్కు వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిచోట్ల ఊడిందని చెబుతూ రాద్ధాంతం చేస్తున్నారు. అటు వేలకోట్ల విలువైన ఉక్కుపరిశ్రమ గురించి మాట్లాడకుండా ఇలాంటి చిల్లర విషయాలు ప్రస్తావిస్తూ ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేస్తూ ఇలా పూటగడిపేస్తున్నారని విశాఖలోని యువత దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తానికి మూడురోజుల పవన్ ప్రోగ్రాం సొంత డబ్బా కొట్టుకోవడానికి .. చంద్రబాబును కాపాడ్డానికి ఉపయోగపడిందని అంటున్నారు..:::సిమ్మాదిరప్పన్న -
సుగాలి ప్రీతి మరణాన్ని పవన్ రాజకీయం చేసి డిప్యూటీ CM అయ్యారు: శ్రావణ్
-
‘సుగాలి ప్రీతి కుటుంబానికి సాయం.. పవన్ క్రెడిట్ ఏమీ లేదు’
సాక్షి,తాడేపల్లి: సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది. ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?’అని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచారు. ఆ క్రెడిట్ తనదేనంటూ పవన్ సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారంపై పోతిన మహేష్ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ మాట మార్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఒకమాట మాట్లాడటం ఆయనకే చెల్లింది. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసిందే జగన్. పవన్ వైజాగ్ వెళ్లి పెట్టిన మీటింగ్ వలన ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా?.రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక, మద్యం దోపిడీ గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు?.సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీని గురించి జనసేన ఎమ్మెల్యేలు అడుగుతారనే పవన్ కళ్యాణ్ వారికి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ నేతల జోక్యం గురించి మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని సొంత ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వలేదు.సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది.ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?. వైఎస్ జగన్ మాత్రమే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు. పొలం, నగదు, ఉద్యోగం ఇచ్చింది జగనే. కానీ ఆ క్రెడిట్ ని కూడా పవన్ నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు. అసలు ఆ కేసును త్వరగా ఎందుకు తేల్చటం లేదో పవనే సమాధానం చెప్పాలి?.విచారణ జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారు?.చంద్రబాబు హయాంలో డీఎన్ఏలు మార్చి ఉంటారు.దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?పవన్ కళ్యాణ్ చంద్రబాబు చొక్కా పట్టుకుని ఎందుకు నిలదీయలేదు?.సోషల్ మీడియా ని అడ్డం పెట్టుకుని సుగాలి ప్రీతి అంశం మీద దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాని నియంత్రించాలని చట్టం తెస్తారట. హోంమంత్రి పదవిని తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును విచారించాలి.వచ్చే 15ఏళ్లు చంద్రబాబు పల్లకి మోయాలని పవన్ అంటున్నారు. జనసైనికులు దీనిపై ఆలోచించుకోవాలి. జనసేన సైనికులందరినీ పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్మేశారు.రుషికొండ భవనాలు ప్రభుత్వానివేనని పవన్ అంగీకరించారు. అమరావతిలో భూములు లాక్కోవటం వలనే పర్యావరణం దెబ్బ తిన్నదని పవన్ నర్మగర్భంగా చంద్రబాబును అన్నారు. ప్రకృతిని నాశనం చేస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించే అన్నారని’ పోతిన మహేష్ స్పష్టం చేశారు. -
సీఎం, డిప్యూటీ సీఎం విశాఖ పర్యటనకు నిరసన సెగ
-
మీ జాతకాలు నా దగ్గరున్నాయి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘మీ జాతకాలు అన్నీ నా వద్ద ఉన్నాయి. ఎవరెవరు ఏమి చేస్తున్నారో నాకు తెలుసు. పదవి అనేది మనకు సేవ చేసేందుకు లభించిన అవకాశం. కానీ కొంత మంది తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. కనీసం మనల్ని నిలబెట్టిన కేడర్ను కూడా పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది సరికాదు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ కూడా ప్రకటిస్తా మీ పద్ధతి మార్చుకోండి. లేదంటే నా తరహాలో నేను సరిదిద్దాల్సి వస్తుంది’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మూడు రోజుల పాటు విశాఖలో తలపెట్టిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తానని తెలపడంతో పాటు ప్రతీ ఒక్కరి పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక మెకానిజం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా మనకు అవకాశం కల్పించిన ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులపై ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయని.. వీటిని వెంటనే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని హితవు పలికినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మీ తీరు మారకపోతే నేను నా పద్ధతిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్టు సమాచారం. మొత్తంగా చంద్రబాబు తరహాలో ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నామని తెలపడంతో పాటు ర్యాంకులు కూడా ఇస్తామని చెప్పడం గమనార్హం. విశాఖలో మూడు రోజులపాటు జరుగుతున్న సమావేశాల్లో మొదటిరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.ఉమ్మడి విశాఖ ఎమ్మెల్యేలే టాప్..!ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురిపై భారీ స్థాయిలో ఆరోపణలు గుప్పుమంటున్నాయనే చర్చ జరిగినట్టు సమాచారం. మైనింగ్ నుంచి పోస్టింగుల వరకూ.. ప్రతీ పనికి ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా భూకబ్జా ఆరోపణలు కూడా వస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఒక ఎమ్మెల్యేపై నేరుగా కొంత మంది చంద్రబాబుకే ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు కేబినెట్ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలతో మాట్లాడి సరిదిద్దుకోవాలని సూచించినట్టు కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ పూర్తిస్థాయిలో అసంతృప్తిని వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే మండలానికి ఒకరిని నియమించి వసూళ్లు చేపడుతుండగా.. మరో ఎమ్మెల్యే సోదరుడు మొత్తం పెత్తనమంతా చేస్తున్నారని కూడా పవన్ దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఇక మరో ఎమ్మెల్యే అందినకాడికి దండుకుంటున్నారని కూడా పక్కా సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యేపై నేరుగా ఫిర్యాదులు లేకపోయినప్పటికీ.. ఆయన అల్లుడిపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని కూడా పవన్ పేర్కొన్నట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం నలుగురి ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ అసంతృప్తిని వెలిబుచ్చినట్టు ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.చంద్రబాబు ఆదేశాలతోనే...!వాస్తవానికి గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూటమిలోని ఎమ్మెల్యేలపై విమర్శలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలను పిలిచి మందలించి పంపుతున్నానని.. బీజేపీ, జనసేన అధ్యక్షులు కూడా వారి ఎమ్మెల్యేలను పిలిచి తప్పులుంటే సరిచేసుకోవాలని చెప్పాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఎమ్మెల్యేలకు పవన్ క్లాస్ పీకారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా తమ ఎమ్మెల్యేలకు పనితీరు ఆధారంగా చంద్రబాబు తరహాలో రేటింగ్ కూడా ఇస్తానని చెప్పడం పట్ల జనసేన నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రతీ పార్టీ పనితీరుకు ప్రత్యేకమైన విధానం ఉంటుంది. మరో పార్టీ స్టైల్ను ఫాలో కావడం మంచిది కాదు. చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ఆదేశించారంటూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఈ తరహాలో క్లాస్ పీకడం సరికాదు’ అని సమావేశంలో పాల్గొన్న ఓ నేత అభిప్రాయపడ్డారు. అయితే, పార్టీ అధినేత నిరంతరం ఈ విధంగా సమావేశం కావడం మంచిదేనని.. కార్యకర్తలు చెప్పే సమస్యలు వింటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
Parvati: మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ పైనే అని చెప్పిన పవన్
-
పవన్ కళ్యాణ్ ఒక నమ్మక ద్రోహి.. సుగాలి ప్రీతీ తల్లి కన్నీరు
-
పవన్పై సుగాలి ప్రీతి తల్లి ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా?. అలాగే, లోకేష్ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా? అని అడిగారు. పవన్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు.. అధికారం వచ్చాక ఎందుకు గుర్తు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు.సుగాలి ప్రీతికి నమ్మకం ద్రోహం పేరుతో విజయవాడలో సుగాలి పార్వతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుగాలి పార్వతి మాట్లాడుతూ.. నా కూతుర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఎనిమిది సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాను. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినా తరువాత ఈ కేసును పవన్ కల్యాణ్ గాలికి వదిలేశారు. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్పైనే అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అసెంబ్లీ సమావేశాల్లో నా కూతురు కేసుపై చర్చించాలి. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సీబీఐ విచారణ జరిపించాలి. సేనతో సేనాని అంటున్నారు.. నా కూతురుకి మాత్రం న్యాయం చేయలేకపోయారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితకు శ్రీకాంత్ పెరవలిపై ఉన్న దృష్టి నా కూతురు విషయంలో లేదు. ఎమ్మెల్సీ అనంత విషయంలో ఉన్న ఆత్రుత నా కూతురు విషయంలో లేదు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా?. ఎందుకు ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారని మంత్రి అనితను అడుగుతున్నాను.గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తాను. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై డిజిటల్ క్యాంపైయిన్ చేస్తాం. నిరాహార దీక్షకి కూడా పూనుకుంటాం. ఎనిమిది సంవత్సరాలు అవిటి తనంతో పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించదా?. లోకేష్ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు.. అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తులేదు?. జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
పవన్ కల్యాణ్ 'ఓజీ' మెలోడీ సాంగ్ విడుదల
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఓజీ నుంచి మరో సాంగ్ విడుదలయ్యింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. 'సువ్వి.. సువ్వి' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ను సింగర్ శృతి రంజని పాడారు. కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. ఈ పాట కోసం తమన్ మెలోడీ మ్యూజిక్ను అందించారు. గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డీవీవీ దానయ్య నిర్మాత. శ్రియారెడ్డి, ప్రకాశ్రాజ్, అర్జున్దాస్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. -
ప్రశ్నించడమంటే ఇదేనా పవనూ: గోరంట్ల మాధవ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారంటూ నిలదీశారు. తన శాఖ అధికారుల మీదే దాడిని ప్రశ్నించలేనప్పుడు పదవికి రాజీనామా చేస్తే బెటర్ అంటూ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు.మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బుడ్డా రాజశేఖరరెడ్డ పవిత్ర శ్రీశైలంలో మద్యం తాగి అటవీశాఖ అధికారుపై దాడి చేశారు. అధికారులను రాత్రంతా తిప్పుతూ దాడి చేశారు. తమ అధికారులపై దాడి చేసినా ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఇంత జరిగినా పవన్ తల వంచుకుని కూర్చోవడం సిగ్గుచేటు’’ అంటూ మాధవ్ మండిపడ్డారు.ప్రతిభ కలిగిన పోలీసు అధికారులు ఏపీలో పని చేయలేకపోతున్నారు. కొందరు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. పోలీసులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చంద్రబాబు ఇవ్వకుండా వేధిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయితే రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసులను దూషిస్తే కనీసం కేసు నమోదు చేయలేదు.బుడ్డా రాజశేఖరరెడ్డిని అరెస్టు కూడా చేయలేదు. పైగా తూతూమంత్రపు కేసు కట్టి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ఘటనలు తప్ప అని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు?. ప్రశ్నించలేనప్పుడు పవన్ కళ్యాణ్ పదవి కి రాజీనామా చేయాలి. పోలీసులపై దాడి జరుగుతుంటే పోలీసు సంఘం ఏం చేస్తుంది?. ఇంతవరకు కనీసం నోరెత్తి ఎందుకు ప్రశ్నించలేదు. బుడ్డా రాజశేఖరరెడ్డి దౌర్జన్యాలకు చంద్రబాబు అవార్డు ఇస్తాడేమో?’’ అంటూ గోరంట్ల మాధవ్ ఎద్దేవా చేశారు. -
సుగాలి ప్రీతి తల్లి వీల్చైర్ యాత్ర అడ్డుకోవటం తగదు: శైలజానాథ్
-
చంద్రబాబు మోసాలను వివరించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు
-
శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: అటవీ శాఖ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. అయితే అందులో శ్రీశైలం జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ను A1 నిందితుడిగా చేర్చడం చర్చనీయాంశమైంది. ఆగస్టు 19 మంగళవారం.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం సమీపంలో అటవీ శాఖ సిబ్బందిని కిడ్నాప్ చేసి మరీ బుడ్డా రాజశేఖర్రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ఫారెస్ట్ సిబ్బంది తమకు అనుకూలంగా పని చేయడం లేదని దూషించారు. పైగా సీసీకెమెరాల్లోనూ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా దాడి చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే.. అనూహ్యంగా.. జనసేన నేత పేరును ఈ కేసులో ఏ1గా చేర్చి, దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2 గా చేర్చారు. పైగా ఇద్దరి పైనా బెయిలబుల్ కేసులే పెట్టారు. ఫారెస్ట్ అధికారులు చెప్పింది ఏంటంటే.. శ్రీశైలం శిఖరం చెక్పోస్ట్ దగ్గర ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్, ఆయన అనుచరులు అటవీశాఖ సిబ్బందిని అడ్డుకుని వారిని దుర్భాషలాడడం ప్రారంభించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యోగులు తమకు అనుకూలంగా పనిచేయడం లేదని దూషించారు. అటవీ శాఖ వాహనంలోకి బలవంతంగా ఎక్కించి శ్రీశైలం అడవుల వైపు అర్ధరాత్రి తీసుకెళ్లారు. పైగా ఎమ్మెల్యే తన మనుషులను సిబ్బందిపై శారీరకంగా దాడి చేయమని ఆదేశించాడు. అంతేకాదు.. నలుగురు సిబ్బందిని గెస్ట్ హౌస్లో బంధించి వేధించాడు. ఇదీ చదవండి: అరాచకాలకు కేరాఫ్ ‘బుడ్డా’ఈ సంఘటనపై అటవీ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తరువాత శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడిని నిరసిస్తూ చెంచు, ఇతర గిరిజన సంఘాల సభ్యులు సున్నిపెంట, శ్రీశైలం, దోర్నాల, యర్రగొండపాలెంలో నిరసన చేపట్టారు. ఉద్యోగ సంఘాలు ఈ దాడికి తీవ్రంగా ఖండించాయి. చివరకు అటవీశాఖ సిబ్బంది,అసోషియేషన్ నాయకులు ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్కు కలిసి ఫిర్యాదు చేశారు. పవన్ ఆదేశాల మేరకు.. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ , ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లపై 115(2),127(2),351(2),132 r/w ,3(5) BNS act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేని పక్కనపెట్టి అటవీ శాఖ మంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన వ్యక్తికే కేసును అంట గట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ”ఇదేమీ బానిసత్వం రా దేవుడా.. ఇన్నాళ్లూ జెండాలే అనుకుంటే.. ఇప్పుడు వాళ్ల కేసులు కూడా మోయాలా..?” అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
పవన్ కల్యాణ్ మూవీలో సాంగ్.. ఆ కారణంతో చేయనని చెప్పా: ఉదయభాను
టాలీవుడ్లో యాంకర్ గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. నటిగానూ రాణించింది. పలు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్లోనూ మెప్పించిన ఉదయభాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం బార్బరిక్ త్రిబాణధారి మూవీతో మరోసారి అభిమానులను పలకరించేందుకు వస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారామె.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఉదయభాను కొన్ని సినిమాల్లో పాటలు చేయడానికి నో చెప్పానని తెలిపింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో పార్టీ సాంగ్కు నో చెప్పేశానని వెల్లడించింది. నాకు స్క్రిప్ట్ నచ్చకపోతే డైరెక్టర్తోనే నేరుగా వేరేవాళ్లను తీసుకోమని చెప్పానన్నారు. అందుకే త్రివిక్రమ్ మూవీలోనూ సాంగ్ చేయనని చెప్పానని ఉదయభాను తెలిపారు. అయితే ఆ సాంగ్ చేసేందుకు భయపడ్డానని.. అంత పెద్ద స్టార్స్ మధ్య పార్టీ సాంగ్ కావడంతో చేసేందుకు వెనకడుగు వేశానని ఉదయభాను పేర్కొంది.కాగా.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2013లో రిలీజైన సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో నదియా, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. -
DCM పవన్ స్థాయిని తగ్గించి మరీ నారా లోకేష్ కు ఎలివేషన్
-
పక్కనే ఉంటూ పవన్ స్థాయిని తగ్గించే పనిలో!
ఆంధ్రప్రదేశ్లోని అధికార కూటమిలో ఇటీవలి పరిణామాలను గమనించారా? మంత్రి లోకేశ్ను ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం.. ఇంకోపక్క ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను తక్కువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఏమిటన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ప్రకటనలన్నింటిలో పవన్ కల్యాణ్ పక్కనే లోకేశ్ ఫొటో కూడా ముద్రిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర స్థాయిలో ప్రధాని, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ఫొటోలను మాత్రమే ప్రచురించాలి. అయితే చాలా రాష్ట్రాలు వీటిని విస్మరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో కూడా వేస్తున్నారు. ఏపీ పరిస్థితి కూడా ఇదే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పవన్తోపాటు లోకేశ్ ఫొటో కూడా వేయడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పని ఏదైనా వైస్సార్సీపీ హయాంలో చేసి ఉంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇల్లెక్కి గగ్గోలు పెట్టేవారు. సుప్రీంకోర్టునే ధిక్కరిస్తారా? అని ప్రశ్నించేవారు. రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేవారు. టీడీపీ మీడియా నానా యాగీ చేసి ఉండేది. కాని ఇప్పుడు లోకేశ్ ఫొటో వేస్తున్నా నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక, రాజకీయ బంధం అంత బలీయమన్నమాట. విశేషం ఏమిటంటే లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. వీటికి సంబంధించిన ప్రకటనల్లో మంత్రి ఫొటో వేస్తే ఫర్వాలేదేమో కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు కూడా ఆయా మంత్రులవి కాకుండా లోకేశ్ ఫొటో ముద్రిస్తూండటంతోనే వస్తోంది తేడా. ఏ హోదాలో అలా చేస్తున్నారని ఎవరూ అడగడం లేదు. అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. లోకేశ్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు మరింత బలం చేకూరుస్తాయి. ప్రస్తుతం చంద్రబాబుకన్నా లోకేశే పవర్ పుల్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేశ్ గురించి పొగుడుతున్నారు. తద్వారా టీడీపీలోను, కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారన్నమాట. లోకేశ్ను సాధ్యమైనంత త్వరగా సీఎంను చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరుల్లో కాని, కుటుంబ సభ్యులు కొందరి నుంచి గట్టిగానే ఉందని చెబుతారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తుందని చంద్రబాబు చెప్పి ఉండవచ్చని, పవన్తోసహా, వివిధ వర్గాల వారిని మానసికంగా సిద్దం చేసిన తర్వాత లోకేశ్ను సీఎం పదవిలోకి తీసుకురావచ్చని నచ్చ చెప్పి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాలలో ఉన్న భావన. అందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయకత్వంలో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న రాగాన్ని పవన్ కల్యాణ్ ఎత్తుకున్నారు. అంటే.. లోకేశ్ను సీఎంగా ఇప్పటికిప్పుడు చేయడానికి ఆయన సుముఖంగా లేరన్నమాట. దాంతో లోకేశ్ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపును తెచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ, జనసేన నుంచి నిరసన రావడం ఆరంభమైంది. తమ అధినేత పవన్ స్థాయిని తగ్గిస్తారా? అని ప్రశ్నించసాగారు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉందన్నది వారి వాదన. వాస్తవానికి ఈ విషయంలో లోకేశ్ అప్పట్లో క్లారిటీతో మాట్లాడారు. సీఎం పదవిని పవన్కు షేర్ చేయడానికి గాని, ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరికే కట్టబెట్టడానికిగాని ఆయన సానుకూలంగా మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పాలిట్ బ్యూరో చర్చిస్తుందని అన్నారు. అయినా రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ ఒక్కరికే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు. లోకేశ్కు డిప్యూటి సీఎం పదవి ఇవ్వడానికి జనసేన వైపు అంత సుముఖత కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా లోకేశ్కు ప్రస్తుతం ఎలివేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతర శాఖల ప్రచార ప్రకటనలలో కూడా పవన్తోపాటు లోకేశ్ ఫొటో వేయడం ఆరంభించారు. దీనివల్ల లోకేశ్ స్థాయిని పెంచేసినట్లయింది. పవన్ కళ్యాణ్, లోకేశ్లు ఒకటే స్థాయి అని ప్రపంచానికి తెలియ చేసినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా తొలుత కొంత అసౌకర్యంగా ఫీలై ఉండవచ్చు కానీ పదవిని అనుభవించడానికి అలవాటు పడ్డాక, అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ను ‘అన్నా..’ అని సంబోధిస్తూనే లోకేశ్ తెలివిగా తనమాటే చెల్లుబడి అయ్యేలా చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద తొలి విడత రైతులకు ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు ఇస్తున్న సందర్భంలో వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఫోటో వేయకుండా పవన్ కల్యాణ్ లోకేశ్ ఫోటోలనే వేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్కీమ్ అమలు ప్రచార ప్రకటనలో సైతం రవాణాశాఖ మంత్రి రామ ప్రసాదరెడ్డికి బదులు లోకేశ్ ఫొటో వేశారు. తద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినా, పవన్, లోకేశ్లది ఒకటే స్థాయి అన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వగలిగారన్న విశ్లేషణలు వస్తున్నాయి.అంతకుముందు లోకేశ్కు డిప్యూటి సీఎం పదవి ఎలా ఇస్తారని గొణిగిన జనసేన వర్గాలు కూడా నోరు మెదపలేకపోతున్నాయి. దీనివల్ల తమ నేత స్థాయి తగ్గిందని జనసేన క్యాడర్ భావిస్తున్నప్పటికి, పవన్ కి లేని బాధ తమకు ఎందుకులే అని సరిపెట్టుకుంటున్నారట. టీడీపీలో కాబోయే సీఎం లోకేశ్ అన్న సంగతేమి రహస్యం కాదు. అయితే ఎప్పుడు అవుతారన్నదే చర్చగా ఉంది. ఈ టర్మ్లోనే కావచ్చని కొందరు, వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్ధిగా ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ పదవిని వెంటనే తన కొడుక్కు ఇవ్వదలిస్తే చంద్రబాబు ఒక్కరోజులో చేయవచ్చు. కాని ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదలి ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, సిద్దపడకపోవచ్చు. కాకపోతే పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటే అనుకోవచ్చేమో! ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా పెద్ద ఇబ్బందులు లేవు. లోకేశ్కు సీఎం పదవి ఇస్తే పార్టీ గట్టిగానే ఉంటుందా? లేదా? అన్న మీమాంస ఆయనకు ఉండవచ్చు.అలాగే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి అందరిని కలుపుకుని వెళ్లగలరా? లేదా?అన్నదానిపై కూడా ఆలోచన చేస్తుండవచ్చు. మానసికంగా తయారు చేయకుండా లోకేశ్ కు ప్రమోషన్ ఇస్తే సమస్యలు వస్తాయని ఆయన భావిస్తుండవచ్చు. అయితే ఏ పని చేసినా దాన్ని సమర్థించే దశకు పవన్ కల్యాణ్ను తీసుకు రాగలిగారు. పవన్ కల్యాణ్ అవసరాలు తీరుస్తూ ఆయనకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లులు సమకూర్చడం ద్వారా గౌరవిస్తున్నట్లు కనిపిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూటమి నేతలలో ఉందట. అందువల్లే టీడీపీ నేతలకన్నా పవనే ఎక్కువ విధేయతను కనబరచుతున్నారని ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు. జనసేన వైపు నుంచి ఎవరూ టీడీపీని ప్రశ్నించరాదని పవన్ సోదరుడు నాగబాబు స్పష్టంగా చెప్పడం, అలా ప్రశ్నించే వారు ఎవరైనా ఉంటే పార్టీని వదలి వెళ్లవచ్చని ఒక ఎమ్మెల్యేకే పవన్ హెచ్చరిక చేయడం వంటివాటిని ఉదాహరణలుగా చూపుతున్నారు. దీంతో లోకేశ్ను సీఎంగా చేసినా పవన్ కల్యాణ్ పెద్దగా అభ్యంతరం పెట్టకవచ్చన్న భావన ఇటీవలి కాలంలో బలపడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. లోకేశ్కు ఎలివేషన్ ఇవ్వడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రచార ప్రకటనలలో ఫోటోలు వేయడం, తల్లికి వందనం స్కీమ్ లోకేశే కనిపెట్టారని ప్రకటించడం, అలాగే ఆయా ప్రసంగాలలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి. లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవడం, ఢిల్లీ వెళ్లిన సందర్భాలలో ఆయా కేంద్ర మంత్రులను కలవడం, వాటికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చేలా చేయడం వంటివి చేస్తున్నారు. తప్పు కాదు కానీ... లోకేశ్ రాజకీయ అపరిపక్వత, కక్షపూరిత ధోరణి, రెడ్బుక్ అంటూ ప్రజల దృష్టిలో ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల దృష్టిలో విలన్గా కనిపిస్తుండడం వంటివి ఆయనకు నష్టం చేయవచ్చన్న ఆందోళన తెలుగుదేశం వర్గాలలో ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్ కళ్యాణ్ పై ఏపీ హైకోర్టులో మాజీ ఐఏఎస్ పిటిషన్
-
Jr.NTR తల్లిపై టీడీపీ నేత అడ్డమైన కూతలు.. ఒక్క ముక్కలో తేల్చేసిన సాక్షి
-
సడన్ సర్ప్రైజ్.. ఓటీటీలోకి 'వీరమల్లు'
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు'.. థియేటర్లలో ఫ్లాప్ అయింది. సోషల్ మీడియాలో సీన్లపై బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీని సడన్ సర్ప్రైజ్ అన్నట్లు వదిలారు. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఈ సినిమా రానుంది? ఏంటి సంగతి అనేది ఇప్పుడు చూద్దాం.దాదాపు ఐదేళ్ల పాటు అష్టకష్టాలు పడి థియేటర్లలోకి వచ్చిన సినిమా 'హరిహర వీరమల్లు'. గత నెల 24న థియేటర్లలోకి వచ్చింది. అయితే అప్పుడు కూడా రిలీజ్ అవుతుందా లేదా అనుకున్నారు గానీ ఎలాగోలా విడుదలైంది. తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ రావడంతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓటీటీలోకి రావడంపై గత కొన్నిరోజులుగా పలు రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది.'హరిహర వీరమల్లు' సినిమాని 20వ తేదీ అంటే రేపటి(బుధవారం) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ వదిలారు. మరి థియేటర్లలో వచ్చినప్పుడు అంతలా ట్రోల్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఇంకెంత ట్రోల్స్కి గురవుతుందో ఏంటో?'హరిహర వీరమల్లు' విషయానికొస్తే.. 16వ శతాబ్దంలో నదిలో కొట్టుకొచ్చిన ఓ పిల్లాడు ఓ అగ్రహారం వాసులకి దొరుకుతాడు. వాళ్లు ఆ బాలుడికి వీరమల్లు అని పేరు పెడతారు. పెద్దయ్యాక వజ్రాల దొంగ అవుతాడు. మచిలీపట్నంలో తాను చేసిన దొంగతనం గురించి విని దొర (శరత్ ఖేదేకర్).. ఓ వజ్రాల దొంగతనం కోసం తనని పిలిపిస్తాడు. ఆ దొర దగ్గర పంచమి (నిధి అగర్వాల్) ఉంటుంది. ఆమె వీరమల్లు ప్రేమలో పడుతుంది. వీరమల్లు కూడా ఆమెని ఇష్టపడతాడు. దొర చెప్పిన వజ్రాలని దొంగిలించడంతో పాటు పంచమిని తీసుకెళ్లిపోయే క్రమంలో గోల్కండ నవాబుకి వీరమల్లు చిక్కుతాడు. ఆ నవాబు (దలిప్ తాహిల్) వీరమల్లుకి ఓ పని అప్పజెబుతాడు. కొల్లూరులో దొరికి అలా అలా చేతులు మారి ఔరంగజేబు దగ్గరకు చేరిన కోహినూర్ వజ్రాన్ని తీసుకురమ్మని. మరి వీరమల్లు ఆ వజ్రాన్ని తీసుకొచ్చాడా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
నా బిడ్డ కేసును పవన్ కల్యాణ్ గాలికొదిలేశారు: సుగాలి పార్వతి
సాక్షి, కర్నూలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరించే మొదటి కేసు సుగాలి ప్రీతిదే.. జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో చెప్పినమాట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆయన ఈ కేసు ఊసెత్తలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రీతి తల్లి పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి కేసును గాలికి వదిలేశారు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్, హోం మినిష్టర్ అనితను కలిసిన తమకు న్యాయం జరగలేదు. అందుకే తాను న్యాయం కోసం వీల్ చైర్ యాత్ర ను ప్రారంభించాను. కానీ, యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. అందుకే హైకోర్టును ఆశ్రయించా. ఈనెల 22వ తేదీన కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఆ వెంటనే యాత్ర మొదలుపెడతా అని అన్నారామె. అదే సమయంలో.. నిందితులకు అధికార పార్టీ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య , అత్యాచారం చేసిన ఆధారాలు స్పష్టంగా ఉన్న ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారామె.ఇదిలా ఉంటే.. సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోరుతూ ఆమె తల్లి పార్వతి కర్నూల్ నుంచి విజయవాడకు వీల్చైర్ యాత్ర ప్రారంభించాలనుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా కేసు ముందుకు కదలడం లేదని.. న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకనే తాను న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయని చెబుతున్నారామె. అయితే.. ఈ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వీల్ చైర్ యాత్రకు అనుమతి లేదని అంటున్నారు. యాత్రను చేపట్టవద్దంటూ కర్నూలు పోలీసులు బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో పార్వతి హైకోర్టును ఇవాళ ఆశ్రయించారు.‘‘నా కూతురు అత్యాచారం,హత్యకు గురై 8 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ మాకు న్యాయం జరుగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిష్కరించే మొదటి కేసు సుగాలి ప్రీతిదే అని హామి ఇచ్చారు. కాని కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండి పోయింది. తానే న్యాయపోరాటం చేస్తానని హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అందుకే న్యాయం కోసం పోరాటానికి దిగుతున్నా. అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు’’ అని అంటున్నారామె.కేసు నేపథ్యం..కర్నూలు నగర శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీబాయ్ 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు లైంగిక దాడి చేసి చంపేశారని తల్లిదండ్రులు సుగాలి రాజు నాయక్, పార్వతిదేవి ఆరోపించారు.బాబు హయాంలో ముందుకు సాగని కేసుఅయితే ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరిగింది. అదే రోజు కర్నూలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పోక్సో చట్ట నిబంధనల కింద కూడా కేసు పెట్టినా, అప్పటి ప్రభుత్వ పెద్దల తీరుతో తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ స్కూలు కరస్పాండెంట్, ఆయన కుమారులను అరెస్ట్ చేశారు. తరువాత కొద్ది రోజులకే వారు బెయిల్పై బయటకు వచ్చేశారు. చంద్రబాబు హయాంలో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.అయితే.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తల్లిదండ్రులు కోరగా, ఆమేరకు ఆయన ఉత్తర్వులిచ్చారు. అంతేకాక 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలాన్ని అందించారు. ప్రీతి తండ్రి రాజు నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం కోరుతున్నా.. సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ రఘురామ రాజన్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రీతి మృతి కేసులో అంతర్రాష్ట్ర పర్యవసానాలు, తాము జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన సంక్లిష్టత లేవని అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీబీఐ ప్రధాన కార్యాలయానికి కూడా తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన, సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఈ కేసులో అంత సంక్లిష్టత లేదని హైకోర్టుకు తెలిపింది. వనరుల కొరత కారణంగా చూపుతూ తాము దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది. ప్రీతి తల్లిదండ్రుల పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టును కోరింది. అలా గత బాబు హయాంలో నత్తనడకన సాగిన కేసు.. ఇప్పుడు మళ్లీ ఆయన ప్రభుత్వం రావడంతో పూర్తిగా యూటర్న్ తీసుకుంది. మరోవైపు.. ప్రీతి మృతి కేసును అప్పట్లో రాజకీయంగా వాడుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారే అనే విమర్శలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. -
Steel Plant Employees: పరిపాలనా భవనం ఎదుట కార్మికుల ఆందోళన
-
Sugali Preethi: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయపోరాటం చేస్తానన్న పవన్ కళ్యాణ్
-
పవన్ కళ్యాణ్ ఆ రోజు మాటిచ్చి.. ఈ రోజు నోరు మెదపడం లేదు ఎందుకు
-
ప్రశాంతమైన కన్మణి
పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్మోహన్ పోషించిన కన్మణి పాత్ర ఫస్ట్ లుక్ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ‘‘ఓజీ’లో పవన్ కల్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తారు.ప్రతి తు పానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంకా అరుళ్మోహన్ కన్మణి పాత్ర. మా సినిమా నుంచి ఇటీవల విడుదలైన మొదటి పాట ‘ఫైర్ స్టార్మ్..’కు విశేష స్పందన లభించింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్న ఈ సినిమాకి సంగీతం ఎస్. తమన్, కెమెరా: రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస. -
పవన్ టికెట్ కు డబ్బులిచ్చిన లోకేష్.. కొమ్మినేని సెటైర్లు
-
చంద్రబాబు, పవన్ల రోడ్ షో.. అంబులెన్స్కు తప్పని కష్టాలు!
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు విజయవాడలో శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) చేపట్టిన రోడ్ షోలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీరు బస్సులో విజయవాడ బస్టాండ్కు వెళ్తూ చేపట్టిన రోడ్ షో కారణంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. తాడేపల్లిలో సర్వీస రోడ్, హైవే మద భారీగా ట్రాఫిక జామ్ అయయింది. అదే సమయంలో అంబులెన్స్ సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. అంబులెన్స్ వచ్చినప్పటికీ చంద్రబాబు కాన్వాయ్ దారి ఇవ్వలేదు. అంబులెన్స్కైనా దారి కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. వాహనాల మధ్యలో నిలిచిపోయింది అంబులెన్స్. -
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
2024 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. అధికారంలోకి రావడమే తరువాయి.. ‘‘మీ ఇష్టం ...మీరు ఎక్కడకు కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు’’ అని ఇద్దరూ తెగ ఊరించారు. ఇంకో అడుగు ముందుకేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘‘ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న చెప్పాడని బస్ కండక్టర్కు తెలపండి.. నేను సేఫ్ డ్రైవర్ని’’ పదే పదే చెప్పారు కూడా. ఈ హామీకి సంబంధించిన ప్రచారం కోసం తయారు చేసిన ప్రకటనల్లో ‘‘మహిళలు ఏపీలోని ఏ పుణ్యక్షేత్రానైన్నా ఉచితంగా దర్శించి రావచ్చు’’ అని ఉండేది. ఒక యాడ్ ఎలా ఉందంటే... ‘‘టీ కూడా పెట్టకుండా బిజీగా రాసుకుంటున్నావు..’’ అని భర్త తన భార్యను ప్రశ్నిస్తాడు..‘‘మొక్కులు తీర్చుకోవడానికి యాత్రలకు గాను పుణ్యక్షేత్రాల జాబితా తయారు చేస్తున్నా’’.. అని భార్య జవాబు.. ‘‘అసలే ఖర్చులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఎలా’’ అని భర్త ప్రశ్న.. ‘‘మనం ఒక పనిచేస్తే సగం ఖర్చు తగ్గించుకోవచ్చు’’ అని భార్య సమాధానం..‘‘జనసేనకు ఓటు వేస్తే ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు. దాంతో సగం ఖర్చు తగ్గిపోతుంది’’ అని భార్య వివరణరిప్లై.. ఇక అంతే కూటమికి ఓటు వేస్తే ఫ్రీబస్ అంటూ ఊదరగొట్టేశారు..అధికారం అయితే వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 14 నెలల వరకు అందుబాటులోకి రాలేదు. ఆడబిడ్డ నిధితోసహా పలు స్కీములు అమలు చేయకుండా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ముఖ్యంగా మహిళలలో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో, దాన్ని ఎంతో కొంత తగ్గించాలన్న ఉద్దేశంతో ఇచ్చిన హామీలలో కొన్ని అయినా, కొంత మేర అయినా అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని వీటిని అరకొరగా చేస్తుండడంతో ప్రజలలో వ్యతిరేకత పెద్దగా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. టీడీపీ జనసేనలు తమను మోసం చేశాయని మహిళలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని పేరుకే తప్ప పెద్దగా ప్రయోజనం లేకుండా అమలు చేయ సంకల్పించారని విమర్శిస్తున్నారు. దానికి కారణం ఆడవారు ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు రకరకాల షరతులు పెట్టడమే. ఉచిత బస్ స్కీమ్పై కూటమి మంత్రులు ఇంతకాలం పలురకాల పిల్లి మొగ్గలు వేశారు. జిల్లాల వరకే ఉచితం అని ఒకసారి, ఉమ్మడి జిల్లాలలో ప్రయాణాలకు అనుమతిస్తామని మరోసారి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణాలు ఉంటాయని అన్నప్పుడు అంతా నవ్వుకున్నారు. యథా ప్రకారం మరో మోసం చేశారని విమర్శించారు. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శల ఒత్తిడి ఉండనే ఉంది. కడప నుంచి అమరావతి ఎప్పుడు ఉచిత బస్లలో వెళదామని స్త్రీలు ఎదురు చూస్తున్నారని ఒక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొత్త ఆలోచన చేసి రాష్ట్రమంతా పర్యటించవచ్చంటూ చెబుతూనే లిటిగేషన్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుకునేలానే చెప్పేవారు. తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం.. ఏ గుడికి అయినా, ఎంత దూరం అయినా హాపీగా వెళ్లి రావచ్చనుకున్న ఆడవాళ్ల ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పదహారు రకాల బస్ సర్వీసులు ఉంటే ఐదింటిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారట. దాని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లలోనే ఫ్రీ. ఇవేవి దూర ప్రాంతాలకు వెళ్లేవి కావు. ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించినా, అవి సరిపడా ఉండవు. పైగా వీటిలో చాలా బస్సులు నాన్స్టాప్లుగా మార్చారు. అన్ని కలిపి 8458 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని టీడీపీ మీడియా మహిళలను మభ్య పెట్టాలని యత్నించింది. ఈ లెక్కలు కూడా కావాలని పెంచి చెప్పినవే. ఏ మహిళైనా విశాఖ నుంచి తిరుపతికి వెళ్లాలంటే పది బస్సులు మారి వెళ్లాల్సి వస్తుందని, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లక్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైన్, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వీల్లేదు. నాన్స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోకాని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు వెళ్లే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కాని టిక్కెట్ తీసుకోవల్సిందే. అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే స్త్రీలు టిక్కెట్లు తీసుకోవల్సిందే అన్నమాట. మహిళలు హైదరాబాద్ వెళ్లాలన్నా బస్సులు మారుతూ గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏపీ సరిహద్దు వరకే ఉచితం కనుక, ఆ తర్వాత టిక్కెట్ తీసుకుని మరో బస్సు ఎక్కాలన్నమాట. అమరావతి బస్సుల్లో కాని, ఆర్టీసీ అద్దెకు తీసుకుని నడిపేవాటిల్లోనూ ఉచిత ప్రయాణం అవకాశం లేదు. నాన్స్టాప్ బస్సులు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి ఉంటాయి. వాటిలో ఎక్కడానికి వీలు లేదు. ఉదాహరణకు విజయవాడ-గుంటూరు మధ్య ప్రతి పావుగంటకు నాన్స్టాప్ బస్సులు ఉంటాయి. అలాగే విశాఖ- శ్రీకాకుళం, తిరుపతి-కడప, నెల్లూరు-ఒంగోలు ,విజయవాడ-ఏలూరు, కాకినాడ- రాజమండ్రి, అనంతపురం-కర్నూలు, నంద్యాల-కర్నూలు ఇలా వివిధ పట్టణాల మధ్య పెద్ద సంఖ్యలో నాన్స్టాప్ బస్సులు ఉంటాయి. ఇవి ఉచిత పథకంలో భాగం కాదు. తిరుమల, పాడేరు, శ్రీశైలం ఘాట్ రోడ్డులలో కూడా టిక్కెట్ కొనాల్సిందేనట. అలాంటప్పుడు పుణ్య క్షేత్రాలకు ఉచితంగా వెళ్లడం ఎలా సాధ్యం. చివరికి గిరిజనులు అధికంగా ప్రయాణించే పాడేరు ఘాట్ రోడ్డులో కూడా ఈ స్కీమ్ ఉండదట. అంటే ప్రజలను మభ్య పెట్టడానికే ఎన్నికల సమయంలో అన్నీ ఫ్రీ అని అబద్దపు ప్రచారం చేశారన్నమాట. అప్పుడేమో ఎలాంటి షరతులు పెట్టకుండా నమ్మబలికి , ఇప్పుడేమో అన్నీ కండిషన్స్ పెడతారా అని మహిళలను మండిపడుతున్నారు. ఇంకో విషయం చెప్పాలి. ఎల్లో మీడియాలో మే నెల18 న రాసిన ఒక స్టోరీలో ఉచిత స్కీమ్ అమలుకు ఏపీ ప్రభుత్వంపై రూ.3182 కోట్ల భారం పడుతుందని లెక్కవేశారు. అదే మీడియా ఆగస్టు 10న రాసిన ఒక కథనంలో ఏడాదికి ఈ స్కీమ్ కింద భారం రూ.1942 కోట్లు అవుతుందని అంచనా వేశారని తెలిపారు. అంటే దాదాపు 1200 కోట్ల మేర భారం తగ్గించారంటే ఆ మేరకు ఉచిత బస్ ప్రయాణ సర్వీసులలో కోత పెట్టినట్లే. నిజానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ స్కీమును అమలు చేశారు. ఆ పథకం అమలులో ఆ రాష్ట్రాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణలో నెలకు సుమారు రూ.300 కోట్లు ఖర్చు అవుతున్నదని అంచనా. ఏపీలో కూడా తొలుత సుమారు రూ.250 కోట్ల వ్యయం అంచనా వేసినా, ఆ తర్వాత దానికి కోత పెట్టుకుంటూ స్కీమ్ను నామమాత్రం చేశారా అన్న సంశయం కలుగుతుంది. తెలంగాణలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులను రీయింబర్స్ చేయడం లేదు. దాంతో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. నిధుల కొరత కారణంగా తెలంగాణలో గౌలిగూడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోందని ఒక వార్త వచ్చింది. ఏపీలో గత జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా మార్చినందున కొంత భారం తగ్గుతుంది. అయినా స్కీమ్ అమలులో తీవ్ర జాప్యం చేశారు. ఇది ఇలా ఉండగా, ఉచిత బస్ స్కీమ్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆటోలు, టాక్సీల వారు వాపోతున్నారు.స్వయంఉపాధి కింద వేలాది మంది బతుకుతున్న వారికి ఇది ఒక గండంగా మారుతుంది. ఫ్రీ బస్ స్కీమ్ హామీ వల్ల ఆటోలవారు నష్టపోకుండా వారికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, రుణ సదుపాయం, రాయితీల కల్పన వంటివి చేస్తామని హామీ ఇచ్చినా, ఇంతవరకు అవి అమలు కావడం లేదు. దాంతో ఆటో యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు గురి అవుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం మొత్తమ్మీద చూస్తే విజయవాడ, విశాఖ వంటి పెద్ద నగరాలలో సిటీ బస్సుల్లో తిరిగే మహిళలకే కాస్త ఉపయోగం.అదేమీ పెద్ద ఖర్చు కాదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానానికి, ఆచరణలో అమలు చేస్తున్నదానికి చాలా తేడా ఉందన్నమాట.ఉచిత బస్ స్కీమ్ వల్ల వేల రూపాయలు ఆదా అవుతాయని చేసిన ప్రచారం అంతా ఉత్తదే అన్నమాట. పుణ్య క్షేత్రాలన్నీ తిరిగేసి మొక్కులు తీర్చుకోవాలనుకున్న ఏపీ మహిళలు, కనీసం టీడీపీ, జనసేనలకు మద్దతు ఇచ్చిన వనితలకు ఇది పెద్ద నిరాశ మిగుల్చుతుందని భావించవచ్చు. ఇదన్నమాట! స్త్రీ శక్తి పేరుతో అమలు చేయతలపెట్టిన ఉచిత బస్ ప్రయాణం పథకం అసలు రంగు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ ప్రభుత్వ వాహనంలో టాలీవుడ్ హీరోయిన్ షికార్లు
ప్రభుత్వానికి చెందిన మంత్రులు, అధికారులు మాత్రమే ప్రభుత్వ వాహనాల్లో తిరిగేందుకు అర్హులు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాస్త డిఫరెంట్. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే రీసెంట్గా పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్గా నటించిన నిధి అగర్వాల్.. దర్జాగా ప్రభుత్వ వాహనంలో షికార్లు చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.ఇటీవల భీమవరంలో ఓ ప్రైవేట్ ఈవెంట్కి హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరైంది. అయితే ఆమె వేరే ఏ కారులో వచ్చిన పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ ప్రభుత్వ వాహనంలో దర్జాగా తిరుగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. అసలు సినిమా తారలకు ప్రభుత్వ వాహనాలు ఎలా కేటాయిస్తారని నెటిజన్లు, ప్రజలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.గత నెల 24న థియేటర్లలోకి వచ్చిన 'హరిహర వీరమల్లు'లో నిధి అగర్వాల్ హీరోయిన్గా చేసింది. మరో సినిమా చేయకుండా ఐదేళ్లపాటు ఈ ప్రాజెక్ట్పైనే ఉండిపోయింది. కానీ ఏ మాత్రం ప్రయోజనం కలగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీలో చెప్పుకోదగ్గ పాత్రేం కాదు. అలానే ఫ్లాప్ కావడం కూడా ఓ రకంగా ఈమెకు మైనస్ అయిందని తెలుస్తోంది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించే అమ్మాయిలకు ప్రభుత్వ కారులు సరఫరా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టే పన్నులను ఇలా సొంత మనుషులకు వాడుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు#NidhiAgerwal #PawanKalyan #AndhraPradesh #HHVM #UANow #GovtCars pic.twitter.com/eS6ePG4zOl— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) August 11, 2025 -
సంచలన ఆడియో.. ఆ వందకోట్లు నొక్కింది వీడే.. పవన్ ఎమ్మెల్యేపై టీడీపీ నిందలు
-
కూటమి ప్రభుత్వ తీరుపై సర్పంచ్ వినూత్న నిరసన
-
పవన్ కల్యాణ్ పై సినీ కార్మికులు ఫైర్
-
పవన్ కల్యాణ్ సినిమాకు ముంబై టీమ్.. ఆందోళనలో తెలుగు కార్మికులు
చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 శాతం వరకు తమ వేతనాల్ని పెంచాలని డిమాండ్ చేసింది. జీతాలు పెంచే వరకు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులెవరూ సినిమాలు, వెబ్సిరీస్ల చిత్రీకరణలకు హాజరు కాకూడదని ఆదివారం నిర్ణయించింది. అయితే, తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో 'పవన్ కల్యాణ్' నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ జరుగుతుంది. అందుకోసం ముంబై నుంచి సినీ కార్మికులను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దింపింది. అక్కడ షూటింగ్ పనులను కూడా ప్రారంభించింది. వేతనాలు పెంపు కోసం తెలుగు కార్మికులు బంద్కు పిలుపునిస్తే ఇలా చేయడం ఏంటి అంటూ తెలుగు సినీ కార్మికులు మండిపడుతున్నారు. మన కార్మికులు కష్టం హీరో పవన్ కళ్యాణ్కు తెలియదా..? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. మన తెలుగు కార్మికుల డిమాండ్లపై చర్చలు జరిపి న్యాయం చేయకుండా ఇలా చేయడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. కనీసం పవన్ కల్యాణ్ అయినా వారికి న్యాయం చేయాలి కదా అంటూ ఆయన తీరుపై తప్పుబడుతున్నారు.ఫిల్మ్ ఛాంబర్ చర్చలుకార్మికుల వేతనాల పెంపు విషయంలో కొద్దిరోజులుగా ఫిల్మ్ ఫెడరేషన్ - ఫిల్మ్ ఛాంబర్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. 30 శాతం వేతనాల పెంపు అనే డిమాండ్ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఖండించింది. ఈ అంశంలో ఫిల్మ్ ఫెడరేషన్ చాలా పక్షపాతంగా వ్యవహరిస్తుందంటూ తెలిపింది. తెలుగు కార్మికులకు కనీస వేతనాల కంటే ఎక్కువే చెల్లిస్తున్నామని ఫిల్మ్ ఛాంబర్ గుర్తుచేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నామని ఫిల్మ్ ఛాంబర్ చెప్పింది. -
బీఆర్ నాయుడు డైరెక్షన్.. తిరుమలలో మఠాలపై బాబు, పవన్ దాడి: భూమన
సాక్షి, తిరుపతి: హైందవ ధర్మ పరిరక్షణకు పాటు పడే మఠాలపై కూటమి సర్కార్ దాడి చేస్తోందని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. పీఠాధిపతులకు అవమానకరమైన రీతిలో పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలపై హిందూ సంస్థలు స్పందించాల్సి ఉందన్నారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో విశిష్ట అద్వైత మఠం, శృంగేరి, పెజావర్ పీఠం, వైఖానస మఠం, అహోబిల మఠం, చినజీయర్ మఠం, మంత్రాలయం మఠం నెలకొల్పారు. హైందవ పరిరక్షణ కోసమే మఠాలు ఉన్నాయి. సంప్రదాయాలు, మఠాల నిర్వహణ సత్ సంకల్పంతో నిర్వహించాలని, శ్రీ మహావిష్ణువు వెలసిన దివ్య క్షేత్రంలో స్వామి వారి వైభవం విశ్వవ్యాప్తం చేయడానికి ఉన్నాయి. అటువంటి మఠాలకు చంద్రబాబు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. పీఠాధిపతులను కూటమి ప్రభుత్వం అవమానిస్తోంది. హైందవ మఠాలపై కూటమి దాడి సరికాదు.కూటమి ప్రభుత్వం దాదాపు 32 మఠాలకు నోటీసులు జారీ చేసింది. పీఠాధిపతులకు అవమానకరమైన రీతిలో పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటి?. పవిత్రమైన మఠాధిపతుల అధీనంలో ఉన్న మఠాలకు ఏవిధమైన నోటీసులు ఇచ్చారో చెప్పాలి. హైందవ మఠాలపై చేస్తున్న దాడి ఇది. హిందూ సంస్థలు వెంటనే స్పందించాల్సి ఉంది. ఇదంతా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోనే జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి మూల మూర్తి దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టేలా ఉన్నారు. విద్వేష పూరితమైన ఆలోచన ఇది. మఠాధిపతులు మేల్కొవాలి. మఠాలపై దాడిని ఖండించాలి. సనాతన ధర్మం పట్ల గొడ్డలి వేటు ఇది. సనాతన ధర్మం కావడమే నా లక్ష్యం అంటున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’ అని డిమాండ్ చేశారు. -
మా నాన్నను చంపేశాయి.. మీ కుంకీ ఏనుగులు ఎక్కడ?
-
'ఓజీ' సినిమా తొలి పాట రిలీజ్
రీసెంట్గా పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలపడింది. దీంతో అభిమానులు ఈ మూవీ గురించి మర్చిపోవడం మొదలుపెట్టారు. ఈ సెప్టెంబరు చివర్లో రిలీజయ్యే 'ఓజీ' కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సినిమా నుంచి 'ఫైర్ స్ట్రోమ్' అంటూ సాగే తొలి లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?)పాట గురించి రిలీజ్ ముందు వరకు హైప్ ఎక్కువగానే ఇచ్చారు గానీ తమన్ ఇదివరకే కంపోజ్ చేసిన పాటల్లానే బాగుంది. కాకపోతే మరీ సూపర్గా అయితే అనిపించలేదు. అదే టైంలో లిరిక్స్ని మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. ప్రస్తుతానికైతే అభిమానులకు నచ్చినట్లే కనిపిస్తోంది. రానురాను పాట అలవాటు అవుతుందేమో చూడాలి.'ఓజీ' సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేసింది. సుజీత్ దర్శకుడు కాగా.. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారు. సెప్టెంబరు 25న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. అదే రోజున బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్ కూడా ఉంది. మరి ఇద్దరు పోటీకి దిగుతారా? లేదంటే ఎవరైనా తప్పుకొంటారా అనేది చూడాలి?(చదవండి: 'మహావతార్ నరసింహ' ఆల్టైమ్ రికార్డ్ .. కలెక్షన్స్ ఎంతంటే?) -
పోలవరం ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించాడట!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే రూ.100 కోట్లు సంపాదించాడంట.. ఆయన గొప్పతనం యూట్యూబ్లో ఇప్పుడే కనిపించింది.. ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా.. పవన్ కళ్యాణ్ ఏమీ పట్టించుకోరా..’ అంటూ మాజీ మంత్రి, టీడీపీ ముఖ్య నేత దేవినేని ఉమ.. జనసేన కీలక నేత కరాటం రాంబాబుతో వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో రూ.100 కోట్లు సంపాదించాడనే విషయంతోపాటు, తరచూ వివాదాస్పద నేతగా మీడియాలో హాట్ టాపిక్గా ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు.. అందుకు సంబంధించిన ఓ వీడియో చూసి, మరో టీడీపీ నేత ఫోన్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్, జనసేన నేత కరాటం రాంబాబుకు ఫోన్ చేశారు. వారిద్దరి మధ్య సాగిన సంభాషణ శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదేమి దోపిడీ అన్నట్టు టీడీపీ నేత ఉమా జనసేన నేతను ప్రశ్నించడం.. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదా అని ఆరా తీయడం.. తమకూ చాలా ఇబ్బందిగా ఉందని జనసేన నేత చెప్పడం.. ఏడాదిగా ఏ ఒక్కరూ తనతో మాట్లాడలేదని బదులివ్వడం.. కూటమి పారీ్టల్లో హాట్ టాపిక్గా మారింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రధానాంశాలు.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు: రాంబాబు గారూ.. బాగున్నారా.. ఎక్కడ ఉన్నారు.. ఏదో యూట్యూబ్లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకు వచ్చారు. సంవత్సరంలోనే వంద కోట్లంటే దేశ చరిత్రలోనే గొప్ప విషయం. జనసేన కీలక నేత కరాటం రాంబాబు: ఇప్పుడు వ్యవస్థ అంతా పాడైపోయింది. ఉమా: సంవత్సరంలోనే ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు.. ఇంకా నాలుగేళ్లు ఉందిగా? కరాటం: నాలుగేళ్లు ఉండటమేమిటండీ.. చెడ్డ పేరు తెచ్చుకోవడమేమిటండీ. పార్టీకి ఇంత డ్యామేజీ. ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చినప్పుడు కేకలు వేస్తూనే ఉంటాను. అల్లరి ఎక్కువగా జరుగుతోంది.. ఉమా గారు.. మీరు ఎక్కడ ఉన్నారండీ.. ఉమా: నా మీద 82 కేసులున్నాయి కదా.. కోర్టు పని మీద రాజమండ్రికి వచ్చాను. ఇదంతా యూట్యూబ్లో చూసి ఎలా ఉన్నారు.. ఏమిటని అడుగుదామని ఫోన్ చేశాను. చాలా కష్టపడి మీరు తీసుకువచ్చి పెట్టారు. అందరిని కలుపుకుని మీరు కూడా అంతా తగ్గి ఒప్పించారు. కరాటం: ఇబ్బందిగానే ఉందండి. మాకున్నదే దానం చేశాం.. ఎప్పడూ చెయ్యి చాచడం అంటే తెలియదండీ.. కంట్రోల్ చేస్తున్నానండి. మళ్లీ మాములు స్థితికి తీసుకురావాలి. కూటమి అంతా దెబ్బ తినేస్తుంది. ఉమా: ఇదంతా పవన్ కళ్యాణ్కు తెలుస్తుంది కదా.. కరాటం: ఏమోనండి.. మరీ ఏం జరుగుతుందో.. ఉమా: మిమ్మల్ని కూడా అడగటం లేదా? కరాటం: ఇప్పటి వరకు నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఉమా: అసలు రాంబాబు గారు ఎలా ఉన్నారని గానీ, ఏమిటని గానీ.. కరాటం: ఇప్పటి వరకు అసలు ఏ ఫోన్ రాలేదు. వాళ్లు ఫోన్ చేయనప్పుడు నేను కూడా సైలెంట్గానే ఉన్నానండి. మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడు పని చేసిపెట్టాను. ఆ సోంబాబు ఏం చేశాడు కోటి రూపాయలు తీసుకున్నానని పెట్టాడు. ఉమా: ఆ.. అదంతా పట్టించుకోకండి.. కరాటం: జైలులోకి వెళ్లిపోతాడంటే కాపాడింది నేనండి.. ఉమా: అవునండీ.. నాకు తెలుసండీ.. కలుద్దాం.. అటు వైపు వచ్చినప్పుడు కలుద్దామండీ.. కరాటం: అలాగేనండీ.. -
Anantapur: లోకేష్, పవన్ కు ఛాలెంజ్ విద్యార్థులతో పెట్టుకోవద్దు..
-
ఓటీటీలో 'హరి హర వీరమల్లు'.. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్!
పవన్ కల్యాణ్ నటించిన తొలి పాన్-ఇండియన్ సినిమ 'హరి హర వీరమల్లు' నెలరోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈమేరకు సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. జులై 24న విడుదలైన ఈ చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, మొదటి ఆటతోనే భారీ డిజాస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో సుమారు రూ. 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.'హరి హర వీరమల్లు' ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆగష్టు 22న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని మొదట ఢీల్ సెట్ చేసుకున్నారట. అయితే, సినిమా డిజాస్టర్గా మిగలడంతో నిర్మాతలు తమ ప్లాన్లో మార్పులు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం వీరమల్లు డిజిటల్ విడుదల విషయంలో పరిశీలిస్తున్నారట.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్ట్రీమింగ్కు తీసుకురావలనే ప్లాన్లో ఉన్నారట. అదే జరిగితే 30రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. అయితే, ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.'హరి హర వీరమల్లు' విడుదలతోపాటు వివాదాలను కూడా తీసుకొచ్చింది. కోహినూర్ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. అయితే, ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీయడంతో చాలామంది తప్పుబట్టారు. కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడనేది సినిమా కథగా చెప్పడం ఏంటంటూ విమర్శించారు. ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడం.. ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా ఉందంటూ కొందరు పేర్కొన్నారు. ఇలా అనేక కారణాల వల్ల సినిమాకు ఎక్కువ నష్టం జరిగింది.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. నాసర్, సునీల్, దలీప్ తాహిల్, ఆదిత్య, సచిన్ ఖేడేకర్ కూడా ఉన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. -
YSRCPలో చేరిన జనసేన సీరియర్ నేత సామిరెడ్డి లక్ష్మణ
-
అయిపాయె.. రెంటికీ చెడ్డ జనసేనాధిపతి!
ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల కష్టం చూస్తే జాలేస్తుంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ప్రమోషన్ కోసం వారు చాలా కష్టపడుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే సినిమా చూడాలని ప్రేక్షకులను బతిమలాడుతున్నట్లు ఉంది. కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక షోలు నిర్వహించి జనాన్ని తరలించే యత్నాలు చేయడం, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సినిమా సక్సెస్ చేయాలని కోరడం పవన్ కల్యాణ్కు సహజంగానే అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. సినిమాపై ప్రేక్షకుల ఆదరణ విషయంలో సందేహాలు కలిగాయి. మొత్తం పరిణామ క్రమం అంతా పార్టీని డ్యామేజీ చేశాయనిపిస్తోంది.సినిమా బాగుందా? లేదా? అనేదానితో ఇక్కడ నిమిత్తం లేదు. మొదటి వారం కలెక్షన్లు ఎలా ఉన్నాయా? అనేది చర్చనీయాంశం కాదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఈ సినిమా కోసం అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బాగా బిజీగా ఉండే పంచాయతీ రాజ్ శాఖకు మంత్రి అయినప్పటికీ, ఆ విధులను పక్కనబెట్టి సినిమా షూటింగ్లలో పాల్గొనడాన్ని ప్రజలు గమనించారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ కుమార్ వంటివారు చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఏ రకంగా పవన్ తన పదవిని ఈ సినిమా గురించి వాడుకున్నారో తెలియచేస్తూ వీడియోలు విడుదల చేశారు. పవన్ తాను గతంలో ఎప్పుడూ సినిమా విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనలేదని చెప్పారు. కాని హరిహర వీరమల్లు కోసం నాలుగు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీన్ని బట్టి ఈ సినిమా సక్సెస్ కోసం పవన్తోపాటు పార్టీ నేతలంతా కష్టపడాలని నిర్ణయించుకున్నారు అన్నమాట. అయినా.. సినిమా ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదని అంటున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫంక్షన్ కోసం విశాఖలో యూనివర్శిటీ హాల్ను వాడుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో సినిమాల్లో నటించవచ్చా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నటించకూడదన్న చట్టం ఏమీ లేదు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఒకట్రెండు సినిమాలలో నటించారు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నటించిన సినిమా ఫెయిల్ అయితే, విపక్షంలో ఉన్నప్పుడు నటించిన సినిమా సఫలమైంది. ఎన్టీఆర్ సినిమాలలో నటించడంపై ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసేది. టీడీపీ కూడా ఏదో సమాధానం చెప్పేది. అంతే తప్ప ఏ పార్టీ అదేదో వ్యక్తిగత వివాదంగా తీసుకోలేదు. కానీ.. పవన్ కల్యాణ్ ఎప్పుడైతే తన సినిమా గొడవలోకి వైఎస్సార్సీపీని లాగి విమర్శలు చేశారో, అప్పుడు ఇది రాజకీయ రగడగా మారింది. సినిమాను బాయ్కాట్ చేసుకోండని ఒకసారి, ఎవరూ దీనిపై గొడవ పడవద్దని ఇంకోసారి, అవసరమైతే దాడి చేయండని మరోసారి ఇలా రకరకాల ప్రకటనలు చేశారు. తణుకు వంటి కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు రౌడీల మాదిరి అల్లరి చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు చెందిన వాహనం బాయినెట్ పై ఎక్కి గంతులు వేశారు. వీటిపై అసంతృప్తి చెందిన వైసీపీ అనుకూల సోషల్ మీడియా సీరియస్గా తీసుకున్నారు. కొందరు బాయ్కాట్ అంటూ ప్రచారం చేశారు. అయినా సినిమా బాగుంటే ఇలాంటివి పెద్దగా పనిచేయవని అంతా భావించారు.ఏపీలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పవన్ కళ్యాణ్ మరీ రెచ్చగొట్టడం విస్మయం కలిగిస్తుంది. బహుశా వైసీపీ వారు ఎటూ చూడరులే అన్న భావనతో జనసేన, టీడీపీ క్యాడర్ను బాగా యాక్టివ్ చేసేందుకు ఈ వ్యూహం అనుసరించారో, ఇంకే కారణమో తెలియదు కాని ఒక రాజకీయ పార్టీ క్యాడర్ను తన సినిమాకు తానే దూరం చేసుకున్నట్లయింది. సినిమా పరంగా తనను అభిమానించే వారు ఇతర పార్టీల్లోనూ ఉంటారన్న సాధారణ స్పృహ లేకుండా ఆయన మాట్లాడారు. ఇప్పుడే కాదు. గతంలో కొన్ని సినిమాల విడుదల సందర్భంగా జరిగిన ఫంక్షన్లలో పవన్ కల్యాణ్ అతడి వర్గీయులు కొందరు సినీ ప్రముఖులు అనవసర రాజకీయ వ్యాఖ్యలు చేశారు.. ఉదాహరణకు రిపబ్లిక్, మట్కా, లైలా, భైరవం వంటి సినిమా ఫంక్షన్లలో పవన్ కల్యాణ్.. ఆయన మనుషులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాజీ ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేశారు. ఆ ప్రభావం సినిమాలపై పడి నిర్మాతలు నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ నాయకత్వం ముందుగానే ఈ పరిణామాలను ఊహించి కార్యకర్తలతో సినిమా చూడాలని కోరుతూ ర్యాలీలు తీయించింది. ఇలాంటివి గతంలో జరగలేదనే చెప్పాలి. జనసేన మంత్రులు టెలికాన్ఫరెన్స్ పెట్టి సినిమాకు జనాన్ని ఎలా తరలించాలో చెప్పడం, సంబంధిత ఆడియో లీక్ అవడంతో పార్టీ పరువు పోవడమే కాకుండా, సినిమాపై కూడా నెగిటివ్ టాక్కు అవకాశం ఏర్పడింది. సినిమా బాగుంటే ఇలా ఎందుకు చేస్తారన్న ప్రశ్న వచ్చింది. దానికి తగినట్లే సినిమా రివ్యూలు కూడా ఆశాజనకంగా రాలేదు. సినిమా మొదటి సగం కాస్త ఫర్వాలేదు కాని, రెండో హాఫ్ ఏవో ఒకటి, రెండు చోట్ల తప్ప, అసలు బాగోలేదని టాక్ వచ్చింది. అంతేకాక ఒకసారి ఇది చరిత్ర అని, మరోసారి ఇది కల్పిత పాత్ర అని ప్రచారం చేశారు. కోహినూర్ వజ్రం పేరుతో సినిమా తీసినా, ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సన్నివేశాలు పెట్టడంపై పలువురు ఆక్షేపించారు. ఒకవైపు సినిమా కథ అంతంత మాత్రంగా ఉండడం, ప్రేక్షకులకు గ్రాఫిక్స్ నచ్చకపోవడం, రాజకీయ దుమారం సృష్టించుకోవడం వంటి కారణాలతో హరిహర వీరమల్లు సినిమా అంతగా సక్సెస్ కాలేదన్న భావన ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించి వైసీపీ అభిమానులలో ఒక స్పష్టత ఉండగా, టీడీపీ అభిమానులు మాత్రం దాగుడుమూతలు అడినట్లు అనిపిస్తుంది. నిజంగా టీడీపీ క్యాడర్ అంతా సినిమా చూసి ఉంటే ఈ సినిమా ఇలా ఫెయిల్ అయ్యేది కాదన్న అభిప్రాయం లేకపోలేదు. పైకి శుభాకాంక్షలు చెబుతూ, లోపల మాత్రం సినిమా ఇలా దెబ్బతినడంపై సంతోషం ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. జనసేన ర్యాలీలలో టీడీపీ వారు పెద్దగా పాల్గొన్నట్లు కనిపించలేదు. పవన్ సినిమా సక్సెస్ కాకపోతేనే ఆయన టీడీపీని ధిక్కరించకుండా ఉంటారని ఆ పార్టీ వారు భావించి ఉండవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రకంగా అటు వైసీపీని దూరం చేసుకుని, ఇటు టీడీపీ నుంచి సరైన ఆదరణ పొందలేకపోవడంతో పాటు స్వయంకృతాపరాధాల కారణంగా ఈ సినిమా నష్టపోయి ఉండవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇకనైనా రాజకీయాలు వేరు..సినిమాలు వేరు అనే సూత్రాన్ని వపన్ చిత్తశుద్దితో పాటిస్తే మంచిదేమో!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
లక్షా 75వేల కోట్లు ఏమయ్యాయి? కూటమికి గోపిరెడ్డి సూటి ప్రశ్నలు
-
చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్కి కౌంటర్స్ ఇస్తూనే ఉంటారు. రాజకీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు 'హరిహర వీరమల్లు'పై రెచ్చిపోయారు. పవన్ చేతకానితనం వల్లే ఈ మూవీ ఆలస్యమైందని, ప్రమోషన్లకు వచ్చినట్లు షూటింగ్కి వచ్చుంటే రెండేళ్ల క్రితమే ఈ చిత్రం రిలీజ్ అయ్యేండేది కదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ ఇలా రెచ్చిపోయారు.(ఇదీ చదవండి: నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్)'మనసాక్షి లేని ఇలాంటి దొంగల గురించి ఏం మాట్లాడుతాం. చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? ఎవరికి అమ్ముతున్నారు. ఇంతకు ముందు ఏఎన్నార్, ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయంటే ఎదురుచూసేవాళ్లం. కానీ మీరు చేస్తున్నది నమ్మకద్రోహం కాదా?''బాహుబలి లాంటి సినిమా రాజమౌళి తీస్తే అది ఎలా ఆడింది? ట్రెండ్ సెట్ చేసింది. అదే మేము చేస్తున్నామని చెప్పి ఎలాంటి సినిమాలు తీస్తున్నారు. ఎలాంటి దోపిడి చేస్తున్నారు? ఎవరిని దోపిడి చేస్తున్నారు? మీ అభిమానుల్నే కదా! మీ సినిమాలో ఆ రేంజు వీఎఫ్ఎక్స్ ఉన్నాయా? కథ ఉందా? నిజాయతీ ఉందా? నాలుగైదు సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైంది. మీ చేతకాని తనంతో కదా?''కథల్ని మార్చి, అందులో మీ రాజకీయ సిద్ధాంతాల్ని రుద్ది, దాన్ని ఓ సినిమాగా చేయాలని వచ్చి.. ఇంత కష్టపడ్డాం, ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం అని అంటున్నారు. ఈ పదిరోజులు ప్రమోషన్లకు వచ్చినట్లు షూటింగ్స్కి నిజాయితీగా వచ్చుంటే రెండేళ్ల ముందే రిలీజయ్యేది కదా ఈ సినిమా!''మహేశ్ బాబు-జూ.ఎన్టీఆర్ గతంలో ఓ వేదికపై ఉన్నప్పుడు ఏం చెప్పారు వాళ్లు ఫ్యాన్స్కి? మేమిద్దరం ఫ్రెండ్సే.. మేం మేం బాగానే ఉంటాం. మా కోసం మీరు కొట్టుకోవద్దు అని అన్నారు. కానీ ఈయనేం మాట్లాడుతున్నాడు.. తిరిగి కొట్టమంటాడా? నిన్ను చొక్కా చించుకుని ప్రేమించేవాళ్లు.. నిన్ను ప్రేమిస్తుంటే వాళ్లని నీ సైనికులు అనుకుంటున్నావా? ఇది నాన్సెన్స్. పవన్ ఫ్యాన్స్కి బాడీ పార్ట్స్ తప్పితే వేరేది తెలియదు. వాళ్లని నువ్వు కరెక్ట్గా ఉండమని చెప్పవు. కానీ వేరే ఎవడైనా ట్రోల్ చేస్తే మాత్రం గట్టిగా ట్రోల్ చేయమంటావా? అసలు మనసాక్షి లేని ఇలాంటి వాళ్లతో ఏం మాట్లాడతాం. ఇది కోపం కాదు నా ఆవేదన''నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేసి.. అది జనాలకు నచ్చకపోతే నేను అర్థం చేసుకుంటా. ఒకవేళ ఫ్లాప్ అయితే అది ప్రయోగం అనుకోవచ్చు. కానీ నీ అహంకారం వల్లే సినిమా ఐదేళ్లకు వచ్చింది. ఒక డైరెక్టర్ అనుకున్న పరిస్థితిని మీరు కల్పించారా? ఎవరిని మోసం చేస్తావు? ఒక నిజాయితీ ఉండాలి కదా. నీకు సిగ్గు అనిపించడం లేదా? ఇలాంటి ద్రోహానికి రూల్స్ లేవు కాబట్టి తప్పించుకుంటున్నారు. నేను పాలిటిక్స్ మాట్లాడుతాను కానీ నా సినిమాల్లో మాట్లాడను. అది వేరు ఇది వేరు కదా. చివరికి ఎవరిని కోల్పోతున్నావు? నిన్ను ప్రేమించేవాళ్లనే దోపిడి చేయడం కరెక్ట్ కాదు' అని ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇంట తీవ్ర విషాదం) -
పవన్, పురంధేశ్వరి.. మాటలు రావట్లేదా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుల యావ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎందుకోసం?.. ఎవరికోసం చేస్తోందో తెలియదు కానీ.. అప్పుల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరిపోయింది. సంపద సృష్టికర్తనని, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ‘‘అప్పు చేసి పప్పు కూడు’’ తింటున్నట్టుగా ఉంది. ఒకపక్క ఆదాయం ఆశించినంతగా పెరగకపోవడం, ఇంకోపక్క అప్పులు మోత మోగిపోతుండటంతో రాష్ట్రం భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది.తాజా ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే రాష్ట్రం రికార్డు స్థాయిలో రూ.37 వేల కోట్ల అప్పులు చేసినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తెలిపిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. సగటున నెలకు రూ.12.300 కోట్లు అన్నమాట. ఇవి కాకుండా కార్పొరేషన్ల ద్వారా, గనుల తాకట్టుల ద్వారా కూడా వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు ఇటీవలి కాలంలో వచ్చిన వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఖజానానే తాకట్టు పెట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇదేదో తమ గొప్పదనం అన్నట్టుగా చంకలు గుద్దుకోవడం ఒక హైలైట్ కాగా.. వైఎస్సార్సీపీ వాళ్లు కుట్ర చేసినా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నామహో అని చాటింపు వేసుకోవడం ఇంకో హైలైట్!. గనులు తాకట్టు పెట్టడం, రుణం ఇచ్చే వారు ఆర్బీఐ ఖాతా నుంచే నేరుగా డబ్బు వసూలు చేసుకునే నిబంధనకు అంగీకరించడం ఎంత వరకు కరెక్ట్?. గౌరవపూర్వకమన్నది ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. టీడీపీ నేతలు వీటి గురించి మాట్లాడరు. వైఎస్సార్సీపీ వారిపై బురదజల్లేందుకు మాత్రం తయారుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలంలోనే సుమారు రూ.1.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంక్, హడ్కో తదితర సంస్థల నుంచి తీసుకున్న వేల కోట్ల అప్పులు దీనికి అదనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఉండగా ఏ చిన్న అప్పు చేసినా ఆర్థిక విధ్వంసం జరిగిపోతోందని, రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని నానా యాగీ చేసిన టీడీపీ, దాని మురికి మీడియా.. ఇప్పుడు కూటమి సర్కార్ చేస్తున్న అప్పుల గురించి పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నోరు మెదపడం లేదు. వీరంతా.. జగన్ సీఎంగా ఉండగా అప్పులు చేయడమే తప్పని అన్నారు. కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అప్పులు చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నారన్న వింత వాదనకు దిగారు. నిజానికి కేంద్రంలో, రాష్ట్రంలోనూ పాలన చేస్తున్నది ఈ కూటమి పార్టీలే!. ఏ మేరకు, ఎందుకోసం అప్పులు చేసిందో ప్రస్తుత ప్రభుత్వం చెప్పలేదు కానీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కొత్త విషయం తెలిపారు.వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పది లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అయితే, దానికి ఆధారాలు మాత్రం చూపరు. బడ్జెట్ స్పీచ్లోనేమో ఏపీ అప్పు అంతా కలిపి సుమారు ఆరు లక్షల కోట్లు అని చదువుతారు. ఎన్నికలకు ముందు రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు తదితర కూటమి నేతలు ప్రచారం చేశారు. పైగా అదంతా జగన్ వచ్చిన తర్వాత జరిగిన అప్పు అన్న చందంగా పచ్చి అబద్దాలు జనంలోకి తీసుకువెళ్లారు. విభజన టైమ్కు ఉన్న అప్పు, 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాత్రం మాట్లాడరు. అలాగే జగన్ టైమ్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కరోనా సంక్షోభం కారణంగా అప్పులు చేయడానికి కేంద్రమే అనుమతి ఇచ్చిన విషయాన్ని దాచేస్తారు. ఎప్పుడు ఏ అబద్దం చెబుతారో, ఎలాంటి వదంతులు సృష్టిస్తారో తెలియని ఇలాంటి పార్టీలతో రాజకీయాలు చేయాలంటే అంతకన్నా ఎక్కువ అసత్యాలు ప్రచారం చేయగలగాలి. అంత యుక్తి కానీ, శక్తి కానీ వైఎస్సార్సీపీకి లేదన్నది వాస్తవం. జగన్ జనాన్ని నమ్ముకోవడం తప్ప, ఇలాంటి దుష్ట పన్నాగాలు పన్నే అలవాటు ఉన్న వ్యక్తి కాదు.కాగ్ లేటెస్ట్గా ఇచ్చిన నివేదికలో వెల్లడైన అంశాలు ఏపీలో కూటమి పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలియ చేస్తుంది. ఏడాది కాలానికిగాను దాదాపు రూ.80వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్లో తెలిపారు. దానికి శాసనసభ ఆమోదం తెలిపింది. కానీ 12 నెలల్లో తీసుకోవాల్సిన అప్పులో సుమారు సగం (రూ.37 వేల కోట్లు) మూడు నెల్లలోనే తెచ్చేసుకున్నారు. ఈ లెక్కన ఏడాది పూర్తి అయ్యేసరికి మరో మళ్లీ 1.25 లక్షల కోట్లు అప్పు చేయాల్సి రావచ్చు. ఇతర మార్గాల ద్వారా ఇంకెన్ని వేల కోట్ల అప్పు చేస్తారో చెప్పలేం. ఈ అప్పులన్నీ ఏమవుతున్నాయో, వేటి కోసం ఖర్చు పెడుతున్నారో పాలకులు చెప్పడం లేదు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను ఒకటి, అర తప్ప అమలు చేయడం లేదు.ఇటీవల తల్లికి వందనం స్కీమ్ ఇచ్చినా, చాలా లొసుగులు బయటకు వచ్చాయి. ఎన్నికలలో చెప్పినట్లుగా ప్రతీ విద్యార్దికి రూ.15 వేల చొప్పున ఇవ్వలేదు. రూ.13వేలే ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులోనూ బలహీన వర్గాల వారికి ఇంకా కోత పెట్టారు. కేంద్రం ఇచ్చే స్కాలర్షిప్లను జత చేసి అన్యాయం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్లో రూ. 4300 కోట్లు బకాయి పెట్టారు. ఆరోగ్యశ్రీ సంగతి తెలియదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు. వలంటీర్లకు అసలుకే మోసం తెచ్చారు. వీటన్నిటిని ఎగవేసినా, రాష్ట్ర ఆర్థిక స్థితి సజావుగా ఉందా అంటే అదీ కనిపించడం లేదు. రాష్ట్ర ఆదాయంలో వృద్ది అన్నీ కలిపి 6.14 శాతంగా ఉంటే, అప్పులు మాత్రం 15.61 శాతంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఆయన ఏది చెప్పినా ఆధార సహితంగా చెబుతుంటారు. కాగ్ ఇచ్చిన రిపోర్టులోని అంశాలను ఆయన విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలపై కాకుండా, అప్పులపైనే ఆధార పడుతోందని జగన్ అభిప్రాయపడ్డారు.మరోవైపు ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. జీఎస్టీ అమ్మకం పన్ను ఆదాయాలు తగ్గుదలను ఉదాహరణగా చూపారు. అటు సంక్షేమం సరిగా అమలు చేయక,, ఇటు అభివృద్ధి లేక ప్రభుత్వం ఏపీ ప్రజలను సంక్షోభంలోకి తీసుకుపోతోందని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ తెలిపిన ఈ అంశాలకు చంద్రబాబు లేదా కేశవ్ సమాధానం ఇచ్చే పరిస్థితి ఉందా అన్నది ప్రశ్న. కాకపోతే వారు తమ మీడియా బలంతో రొడ్డ కొట్టుడు ప్రకటనలు చేసి జగన్ పై విమర్శలు సాగిస్తారు. అలాకాకుండా కాగ్ నివేదికను దగ్గర పెట్టుకుని, జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు లేదా కేశవ్ వివరణ ఇస్తే ఏమైనా అర్దం ఉంటుంది. ఆ పని మాత్రం చేయరు. సంక్షేమం, అభివృద్దిలో కాకుండా అప్పులలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్గా చేసినందుకు కూటమి సర్కార్ సిగ్గుపడాలో, గర్వపడాలో వారే ఆలోచించుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత. -
మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కర్నూలులో ధర్నా
-
డిప్యూటీ సీఎం అయ్యాక చేసిన ఏకైక పని నీ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడమే...
-
ఉపాధి హామీ పథకం టీడీపీ నేతల దోపిడీకి అడ్డాగా మారింది: శైలజానాథ్
-
KSR Live Show: P4తో టీచర్లకు ఝలక్.. వీరమల్లు తిప్పలు
-
ఎవరిని అడిగి సినిమాలు తీస్తున్నావ్? పవన్ కళ్యాణ్ పై విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
-
Janatantram: పవన్ కోహినూర్ కథ ..
-
సినిమా టికెట్ రేట్లు పెంచడమా సంపద సృష్టి అంటే
-
Political Corridor: నన్నే ప్రశ్నిస్తావా.. ఔట్..!
-
'హరి హర వీరమల్లు'కు జూనియర్ దెబ్బ
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే డిజాస్టర్గా మిగిలిపోయింది. సినిమా మేకింగ్, గ్రాఫిక్స్ పనితీరుపై తీవ్రమైన విమర్శలు రావడంతో వీరమల్లుపై గట్టిదెబ్బ పడింది. రెండో రోజున బాక్సాఫీస్ వద్ద 85 శాతం వరకు కలెక్షన్స్ పడిపోయాయి. దీంతో చాలా చోట్ల శనివారం నుంచే వీరమల్లును తొలగించి మరో సినిమాను ప్రదర్శించారు. ఈ క్రమంలో వైజాగ్లోని లీలామహల్, వెంకటేశ్వర వంటి గుర్తింపు ఉన్న సింగిల్ థియేటర్స్ నుంచి వీరమల్లు చిత్రాన్ని తొలగించేశారు.'లీలామహల్' నుంచి వీరమల్లు ఔట్విశాఖపట్నంలో లీలామహల్ థియేటర్కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 600 సీట్లతో నిర్మించిబడిన ఈ థియేటర్కు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. రీసెంట్గా పెద్ద ఎత్తున అధునీకరణ చేశారు. జనసేన ఎమ్మేల్యేలు కూడా తమ కార్యకర్తలతో జులై 24న ఇక్కడ సినిమా చూశారు. ప్రీమియర్తో పాటు మొదటిరోజున అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. కానీ, రెండోరోజు మొదటి ఆటకు కేవలం 29 టికెట్లు మాత్రమే తెగడంతో శనివారం నుంచే ఈ చిత్రాన్ని తొలగించి 'జూనియర్' సినిమాను ప్రదర్శించారు. వీకెండ్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో సంచలనంగా మారింది. ఆపై వీరమల్లు సినిమాకు వన్ వీక్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే ఆంశమని చెప్పవచ్చు. ఎలాగూ ఒక వారం అగ్రిమెంట్ వుంది కనుక వీరమల్లును అలా రన్ చేయవచ్చు. కానీ, మరీ 30 టికెట్ల లోపు మాత్రమే తెగుతుండటం.. ఆపై సోమవారం నుంచి ఇవీ కూడా వుండవేమో అనే అనుమానంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే విశాఖలోనే వెంకటేశ్వర థియేటర్తో కూడా వన్ వీక్ అగ్రిమెంట్ 'వీరమల్లు'కు వుంది. కానీ, అక్కడ కూడా మహావతార్ నరసింహ సినిమాను వేసుకున్నారు. ఇలా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద నగరాల్లో వీరమల్లును తొలగించి మహావతార్, జూనియర్ చిత్రాలను ప్రదర్శించడం విశేషం. ఒక స్టార్ హీరో సినిమాను ఇలా పక్కన పెట్టి ఎలాంటి అంచనాలు లేని సినిమాలను ప్రదర్శిస్తుండటం నెట్టింట వైరల్ అవుతుంది. వీరమల్లు సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని పవన్ అభిమానులతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆపై ఏకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి పవన్ అభిమానులతో కాన్ఫిరెన్స్ కాల్స్ మాట్లాడారు. అందుకు సంబంధించిన సంభాషణ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. -
హరిహర’.. మళ్లీ మళ్లీ చూడరా!
సాక్షి, అమరావతి/చిలకలపూడి (మచిలీపట్నం): రాజకీయాల కోసం ఇప్పటివరకూ సినిమాను వాడుకోవడాన్ని చూశాం. ఇప్పుడు సినిమా హిట్ కోసం ఏకంగా తమ పార్టీని.. పార్టీ శ్రేణులను ఉపయోగించుకునే సరికొత్త ఒరవడికి జనసేన తెరలేపింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అట్టర్ ఫ్లాప్ అని టాక్ రావడం.. కలెక్షన్లూ దారుణంగా పడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వార్తలు వస్తుండడంతో తమ అధినేత పరువు నిలబెట్టే బాధ్యతను ఆ పార్టీ భుజానకెత్తుకుంది.ఇందులో భాగంగా.. రాజకీయ సభలకు జనాలను తరలించేందుకు పార్టీలు నేతలతో టెలి కాన్ఫరెన్స్లు నిర్వహించినట్లుగానే జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఈ సినిమా హిట్ కోసం వరుస టెలీకాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. సినిమాపై పూర్తి నెగిటివ్ టాక్ రావడం.. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో ఏదో విధంగా సినిమాకు హిట్ టాక్ తెచ్చేందుకు వీరు రంగంలోకి దిగారు. జనసైనికులు, వీరమహిళలు అందరూ పెద్దఎత్తున పవన్ తాజా సినిమాను సపోర్టు చేయాలని వారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.తద్వారా పవన్కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉంటుందని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ టెలీకాన్ఫరెన్స్లో చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వీరి ఆడియో క్లిప్లు వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్కు రెండ్రోజుల ముందు నుంచి ఇప్పటివరకు ఇలా రెండు మూడుసార్లు ఈ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలతో టెలీకాన్ఫరెన్స్లు నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.పవన్ ఇమేజ్ తగ్గకుండా చూడాలి : నాదెండ్ల నాదెండ్ల మాట్లాడుతూ.. ఈ సినిమా ఆడితేనే పవన్కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉంటుందని, అలా తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులందరిపైనే ఉందన్నారు. ఇందుకోసం సినిమా మరికొన్ని రోజులు నడిచేలా చూడాలని.. ప్రజలందరు కూడా చూసేలా చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. అలాగే, జనసేన నాయకులకు ప్రజల్లోకి వెళ్లగలిగే అవకాశం అధినేత తాజా సినిమా (పేరు చెబుతూ) ద్వారా దొరికిందన్నారు. అధినేత సినిమా విడుదల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు సినిమా విజయవంతానికి కష్టపడిన తీరును మొన్నటి మంత్రివర్గ సమావేశం తర్వాత పవన్కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లానని.. సినిమా విజయవంతం చేసే కార్యక్రమాన్ని ఇంకో నాలుగైదు రోజులు కొనసాగించాలంటూ నాదెండ్ల మనోహర్ నేతలు, కార్యకర్తలకు సూచించారు. అలాగే, పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలన్నారు.ఒకటికి రెండుసార్లు చూడండి.. అందరికీ చూపించండి : కందుల దుర్గేష్ మరో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సినిమా బాగుందని విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒకటి, రెండుసార్లు సినిమా చూసి, మరికొంత మందిని తీసుకెళ్లడం అవసరమని టెలీకాన్ఫరెన్స్లో తెలిపారు. మరోవైపు.. పార్టీ శ్రేణులే డబ్బులు పెట్టి ప్రజలను సినిమాకు పంపాలని ఎమ్మెల్సీ హరిప్రసాద్ చెప్పారు. ప్రతీ జనసైనికుడు ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువసార్లు చూడాలన్నారు. ప్రతీ థియేటర్కు వెళ్లి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఆరా తీసి రోజూ హాలు నిండేలా చూడాలని చెప్పారు. సినిమాకు నెగిటివ్ టాక్ రావడంవల్ల దానిని అధిగమించేందుకు సక్సెస్ మీట్ నిర్వహించారని వివరించారు. రానున్న ఐదు రోజులపాటు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి సినిమాను బాగుందనే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. టెలీకాన్ఫరెన్స్లో పాల్గొన్న పార్టీ ఎమ్మెల్యే ఒకరు సినిమా రిలీజు తర్వాత తాను ఎన్ని థియేటర్ల వద్దకు వెళ్లి సినిమా పరిస్థితి గురించి తెలుసుకున్న వివరాలు వివరించారు. -
రెండు కోహినూర్ కథలు!
నలభై యాభయ్యేళ్ల కిందటి దాకా తెలుగు నాటకరంగం బతికే ఉండేది. సినిమా, టీవీలు దాన్ని పూర్తిగా మింగేయకముందు నాటి సంగతి. 1970లలో సాంఘిక ఇతివృత్తంతో కూడిన నాట కాలు, నాటికలను విరివిగా ప్రదర్శించేవాళ్లు. ఆ రోజుల్లో వచ్చిన ఒక నాటిక పేరు ‘కోహినూర్ కావాలి’. రాజకీయాలపై అదొక సెటైర్. ఒక రాజకీయ నిరుద్యోగి తన గుర్తింపు కోసం చేసే ప్రయత్నం. కథ సరిగ్గా గుర్తులేదు కానీ, సింగిల్ లైన్లో దాని సారాంశాన్ని చెప్చొచ్చు. సదరు నిరుద్యోగి బాగా ఆలోచించి లండన్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమం చేస్తాడు. కోహినూర్ రాదు కానీ, ఆ నిరుద్యోగి కోరిక మాత్రం తీరుతుంది. విద్యార్థులు పావులుగా మిగిలిపోతారు.ఇప్పుడున్న మన రాజకీయ నాయకులకు ఇటువంటి సెటైర్లను పేల్చకుండా రోజులు గడవని పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని మన అగ్ర నాయకులు ఈ వారం తాజాగా పేల్చిన ఓ రెండు సెటైర్లను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా సీనియర్ మోస్ట్ నాయకుడైన చంద్రబాబు వంతు. ఆయన తనకు ప్రీతిపాత్రమైన సింగపూర్ యాత్రకు శనివారం బయల్దేరారు. అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం మరోసారి సింగపూర్ను ఒప్పించడం ఆయన ఉద్దేశం. తప్పేమీ లేదు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లాడనుకోవచ్చు. కానీ, ఆయనకో డౌటు కూడా ఉన్నది. ఈసారి సింగపూర్ వాళ్లు ఒప్పుకుంటారో లేదోననే గుంజాటన వ్యక్తం చేశారు. కుదరక పోతే, ‘‘... అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడనే’’ సామెత మనకు ఉండనే ఉన్నది.సింగపూర్ స్పందనపై ఆయన అనుమానానికి చెప్పిన కారణమే ఒక పెద్ద బుకాయింపు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుదిరిన స్టార్టప్ ఏరియా ఒప్పందాన్ని జగన్ సర్కార్ రద్దు చేయడమే గాక వారిని వేధించడం వల్లనే వెనకాడు తున్నారని చంద్రబాబు చెప్పారు. కానీ అసలు సంగతి దాచేస్తే దాగేది కాదు. అప్పటి స్టార్టప్ ఏరియా ఒప్పందంలో సింగపూర్ తరఫున మంత్రి ఈశ్వరన్ కీలక భూమిక పోషించారు. ఆయనతో చంద్రబాబుకు చిరకాల స్నేహముందనేది బహిరంగ రహస్యం. అవినీతి ఆరోపణలపై ఈశ్వరన్ను మంత్రివర్గం నుంచి తొలగించడమే గాకుండా సింగపూర్ ప్రభుత్వం ఆయనను జైలుకు కూడా పంపించింది. ఈమధ్యనే ఆయన విడుదలయ్యారు. అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో భాగస్వామ్యం పట్ల సింగపూర్కు అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈశ్వరన్ పాత్ర కారణంగా ఉండాలి.ముందుగానే మధ్యవర్తుల ద్వారా ఒక అవగాహన కుదరకుండా ఏ ప్రభుత్వాధినేతా విదేశాలకు వెళ్లి బేరం మొదలు పెట్టడు. చేతి నుంచి పైసా పెట్టుబడి పెట్టకుండా కేవలం బ్రాండ్ వాడుకునేందుకు భాగస్వామిగా ఉండి వేలకోట్లు సంపా దించే అవకాశాన్ని సింగపూర్ వాళ్లు కాదనకపోవచ్చు. ఇంతకు ముందు కుదిరిన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ఒప్పందాన్ని పరిశీ లిస్తే దాని లోగుట్టు బోధపడుతుంది. ఒకవేళ ముందస్తు అవగాహనంటూ ఏదీ లేకపోతే ఆయన పర్యటన అసలు కారణం ఇంకేదైనా ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాధినేత కనుక సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో మర్యాద పూర్వక భేటీలు జరగవచ్చు. జగన్ నిర్వాకం కారణంగా భాగస్వామ్యానికి వాళ్లు ఒప్పు కోలేదని వచ్చిన తర్వాత బురద చల్లవచ్చు. ముందస్తు అవగా హన ప్రకారమే ఒప్పందం కుదిరితే చంద్రబాబు వెళ్లాడు గనుక వాళ్లు దిగొచ్చారని, సింగపూర్ బ్రాండ్ మనకు కోహినూర్ డైమండ్ కంటే విలువైనదని భాజా మోగించుకోవచ్చు. ఇలా ఉభయతారకంగా ఉండాలనే జగన్పై ఓ కామెంట్ విసిరి ఆయన సింగపూర్ వెళ్ళారు.గతంలో కుదిరిన స్టార్టప్ ఒప్పందం ఒక దోపిడీ పథకమని దాన్ని పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రాజధాని ప్రాంతం కోర్ ఏరియాలో 1,691 ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీల కన్సార్టియానికి అప్పగించారు. వారితో నామమాత్రపు భాగ స్వామిగా కేపిటల్ సిటీ డెవలప్మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ) ఉంటుంది. ఈ భాగస్వాములతో కలిసి ‘అమరావతి డెవలప్ మెంట్ పార్ట్ట్నర్స్’ పేరుతో వ్యవహారం నడుపుతారు. ఈ భూమిలో 250 ఎకరాలు ఉచితంగా సింగపూర్ కన్సార్టియానికి బహుమతిగా లభిస్తుంది. ఇక మిగిలిన 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే కన్సార్టియం పని. అభివృద్ధి చేయడానికయ్యే 5,500 కోట్ల రూపాయల ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. స్నేహితుడైన ఈశ్వరన్ నేతృత్వంలో వచ్చిన సింగపూర్ కన్సార్టియానికి ఇలా దోచిపెట్టే ఒప్పందాన్ని స్కామ్ అనకుండా ఉండగలమా? గతంలో కూడా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని ప్రచారం చేశారు కానీ, జరిగింది మాత్రం కంపెనీలతోనే! ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.ఇక రెండో కోహినూర్ కథలో నిజంగానే కోహినూర్ డైమండ్ వృత్తాంతం ఇమిడి ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు సంబంధించిన వ్యవహారం. ప్రాథమికంగా పవన్ కల్యాణ్ సినిమా నటుడు. కేవలం నటుడు అంటే సరిపోదు. పుష్కలంగా అభిమానగణం ఉన్న పాపులర్ హీరో. ఆయన కొత్త సినిమా హరిహర వీరమల్లు మొన్ననే విడుదలైంది. విడుదలతోపాటు వివాదాలను కూడా మోసుకొచ్చింది. రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్లు సినిమాల్లో నటించకూడదన్న నియమం ఏమీ లేదు కాబట్టి ఆయన నటించడం మీద పేచీ ఏమీ లేదు. కాకపోతే ఉన్నతమైన ప్రభుత్వ బాధ్యతలో ఉన్న వ్యక్తి కనుక తను నటిస్తున్న సినిమా ఇతివృత్తం విషయంలోనూ, ఆ సినిమా విడుదలకు సంబంధించిన ఇతరత్రా విషయాల్లోనూ ఆదర్శంగా ఉంటారని ఎవరైనా ఆశిస్తారు.విడుదలైన తొలి వారం పది రోజుల్లో టికెట్ రేట్లు పెంచుకునే విషయంపై గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే ఏ సినిమా నిర్మాతైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని, తన సినిమాలకైనా ఇది వర్తిస్తుందని కొద్దికాలం కిందనే పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ కేవలం నిర్మాత విజ్ఞప్తి మేరకే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇంత చిన్న విషయంపై కూడా పవన్ తన మాట మీద నిలబడలేకపోయారు. విడుదలకు ముందురోజు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. మొఘల్ కాలంలో జరిగిన అక్రమాల గురించి మన చరిత్రలో చెప్పలేదనీ, విజయనగర సామ్రాజ్యం గొప్పతనం గురించి కూడా చెప్పలేదనీ ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా సత్యదూరం.విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంతో పోలుస్తూ కావల్సినన్ని చరిత్ర వ్యాఖ్యానాలు అందుబాటులో ఉన్నాయి. కృష్ణదేవరాయల దండయాత్రల గురించీ, ఆయన కళా సాహితీ రంగాల పోషణ గురించీ, సాహితీ సమరాంగణాన చక్రవర్తిగా ఆయన వాసికెక్కడం గురించీ బోలెడన్ని కథలూ, గాథలూ వ్యాప్తిలో ఉన్నాయి. ఈ అంశాలన్నీ చరిత్ర పాఠాల్లో కూడా ఉన్నాయి. విజయనగర వీధుల్లో రతనాలను రాశులుగా పోసి అమ్మేవారని కూడా చదువుకున్నాము. అశోకుడు చెట్లు నాటించెను, బాటలు వేయించెను, బావులు తవ్వించెను అనే పాఠం చదవకుండా ఎవరైనా ప్రాథమిక విద్యను పూర్తి చేస్తారా? ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం తనకంటే పెద్ద వాడైన దారా షికోను హత్య చేయించాడని, తండ్రిని చెరసాలలో పెట్టించాడనే అంశాలు కూడా మన చరిత్రలో లేవని పవన్ ఆరోపణ. అది కూడా నిజం కాదు. ఆ సాహిత్యం పుష్కలంగా అందుబాటులో ఉన్నది.కోహినూర్ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. కృష్ణా తీరంలో లభించిందని ప్రతీతి. అక్కడినుంచి కాకతీయల రాజధాని ఓరుగల్లుకు, అల్లా వుద్దీన్ ఖిల్జీ ద్వారా ఢిల్లీకి, నాదిర్షా ద్వారా పర్షియాకు, మహా రాజా రంజిత్సింగ్ వశమై లాహోర్కు, అక్కడి నుంచి బ్రిటిష్ వారితో లండన్కు ప్రయాణం చేసిన వజ్ర రాజం. ఆరొందల సంవత్సరాల ట్రావెలాగ్ కోహినూర్ది. అట్లాగే ఔరంగజేబు. 17వ శతాబ్దంలో భారతదేశాన్ని శాసించిన మొఘల్ చక్రవర్తి. ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీశారట! ఈ కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడ నేది సినిమా కథగా చెబుతున్నారు. చారిత్రకాంశాలతో ఫాంట సీలు తీయొద్దని ఎవరూ చెప్పలేరు. సృజనాత్మక కళలపై ఆంక్షలు పెట్టడం, లక్ష్మణ రేఖలు గీయడం కూడా వాంఛనీయం కాదు. కాకపోతే ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడాన్ని, ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ఉద్దేశించడాన్ని మాత్రం సహించలేము.తనది సనాతన ధర్మ పథమని ఈమధ్యనే పవన్ కల్యాణ్ ప్రకటించుకున్న విషయం విదితమే. తన ధర్మపథ ప్రచారానికి తద్వారా తన రాజకీయ భవిష్యత్ ఉన్నతికి దోహదపడే ప్రచార చిత్రంగా దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన భావించి ఉండ వచ్చు. ఈ కారణంగా కొంత భాగాన్ని డైరెక్ట్ చేసిన క్రిష్ అర్ధంతరంగా తప్పుకున్నారనే ప్రచారం కూడా ఉన్నది. అదెంతవరకు వాస్తవమో తెలియదు. ప్రచార చిత్రంగా వాడుకున్నా ఫరవా లేదు. కానీ, మొఘల్ చక్రవర్తుల కాలంలో అన్నీ అక్రమాలు, అకృత్యాలే జరిగాయా? ఇంకే గొప్పతనం లేదా?... వివిధ చారిత్రక దశల్లో ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై అధ్యయనం చేసిన నిపుణుల సమాచారం ప్రకారం క్రీస్తుశకం 16, 17 శతాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటాగా ఉన్నది. కొద్ది తేడాతో చైనా తర్వాత రెండో స్థానం. భారత ఉపఖండంలో విశాల భూభాగాన్ని ఐక్యం చేసి శాంతి, సుస్థిరతలను సాధించినందు వలన అక్బర్ చక్రవర్తి కాలంలో వ్యవసాయం, వస్త్ర పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెంది, బ్రిటిష్ వలస దోపిడీ మొదలయ్యేంతవరకూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నది.అశోక చక్రవర్తి కాలంలో జరిగిన సామ్రాజ్య విస్తరణ,శాంతి – సుస్థిరత స్థాపనల ఫలితంగా, ఆ కాలంలో విరాజిల్లిన బౌద్ధమతం వెలుగులో వ్యవసాయ వాణిజ్యాలతోపాటు శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో కూడా ముందంజ వేసింది. అనంతర కాలంలో రెండు మూడు శతాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 35 శాతం వాటాను సొంతం చేసుకొని ఆర్థిక సూపర్ పవర్గా వెలుగొందిందని అంచనా వేశారు. అశోకా ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్ అని ఊరికే అనలేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారత నేత పనివాళ్ల వేళ్లను విరగ్గొట్టిందీ, భారత వ్యవసాయాన్ని ధ్వంసం చేసిందీ, భారతదేశ సంపదను కొల్ల గొట్టి తమ దేశానికి తరలించుకుపోయిందీ బ్రిటిష్వాళ్లే కాని, మొఘల్స్ కాదు. బాబర్ సెంట్రల్ ఏసియా నుంచి వచ్చి ఉండ వచ్చు. అనంతర మొఘల్సందరూ ఇక్కడే పుట్టారు. ఇక్కడే చనిపోయారు. ఈ దేశ చరిత్ర మీద తాజ్మహల్ వంటి సంత కాలను చేశారు. బ్రిటిష్ వలసదారులకు వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి నాయకత్వం వహించింది ఆఖరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ కాదా? బ్రిటిష్ వాళ్ళు ఆయన్ను పట్టుకొని బర్మాలో ప్రవాస ఖైదు విధిస్తే, తాను చని పోయాక తన జన్మభూమి భారత్లో అంత్యక్రియలు చేయాలని చివరి రోజుల్లో ఆయన కోరుకున్న విషయం చరిత్రే కదా! బాధ్యత గల వ్యక్తులు చారిత్రకాంశాలతో కూడిన సినిమాలు తీసినప్పుడు ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసు కోవడం అవసరం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పవన్ కళ్యాణ్ నిన్ను ప్రజలు ఎన్నుకుంది సేవ కోసం, సినిమాల కోసం కాదు
-
Margani Bharat: మీరు చేసిన దానికి 3 రెట్లు ఉంటుంది...
-
'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' భారీ అంచనాలతో జులై 24న విడుదలైంది. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, ప్రీమియర్ షోలు పూర్తి అయన తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. పేలవమైన కథాంశం, విఎఫ్ఎక్స్ కారణంగా 'వీరమల్లు' విమర్శల పాలైంది. దీంతో మొదటిరోజు, ప్రీమియర్ షోలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 47 కోట్ల నెట్ వరకే పరిమితం అయింది. రెండోరోజులు పూర్తి అయ్యే సరికి రూ. 56.29 కోట్ల నెట్ కలెక్షన్స్కు చేరుకుంది. అయితే, డే-2 మరింత దారుణమైన కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్క్ పేర్కొంది.చిన్న హీరోల సినిమాలు విడుదలైతేనే మొదటిరోజు, రెండోరోజు అంటూ కలెక్షన్స్ మేకర్స్ ప్రకటిస్తారు. కానీ, 'హరి హర వీరమల్లు' చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఎక్కడా కూడా ప్రకటించలేదు. అయితే, బాక్సాఫీస్ లెక్కలను మాత్రమే ఎప్పటికప్పుడు ప్రచురించే 'సాక్నిల్క్' మాత్రం ప్రపంచవ్యాప్తంగా వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో పేర్కొంది. రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 8.79 కోట్ల నెట్ మాత్రమే రాబట్టినట్లు తెలిపింది. బెనిఫిట్ షోల ద్వారా రూ. 12.75 కోట్ల నెట్, మొదటిరోజు రూ. 34.75 కోట్ల నెట్, రెండో రోజు రూ. 8.79 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి మొత్తంగా ఇప్పటి వరకు రూ. 56.29 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే రెండురోజులకు గాను రూ. 92 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు శనివారం, ఆదివారం వీకెండ్ ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. -
పవన్ కళ్యాణపై కేసు
-
పవన్.. దాడులు చేస్తే అది సివిలైజేషనా?
సాక్షి, తాడేపల్లి రూరల్: మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడుతుంటే.. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మాత్రం వాటిని అమలు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ప్రజలను, తన అభిమానులను రెచ్చగొడుతున్నారు. వీరా మనల్ని పరిపాలించేది.. అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్.. తన సినిమా ఈవెంట్లో అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడటంపై శుక్రవారం రాత్రి తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. “సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు.. దాడి చేయండి.. కొట్టండి.. మీకు నచ్చిన విధంగా దాడి చేయండి.. అది సివిలైజేషన్’ అంటూ పవన్కళ్యాణ్ ప్రజలను, వారి సైనికులను రెచ్చగొట్టడం దారుణమన్నారు. అదే రకమైన ప్రవర్తన జనసైనికులకూ వచ్చిందన్నారు.మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కారును అడ్డగించి ఆపి రాళ్లు రువ్వి, పైకెక్కి వారు చేసిన విన్యాసాలను అందరూ చూశారని, తిరుపతిలో ఓ థియేటర్ అద్దాలు పగులగొట్టి.. టికెట్ లేకుండానే సినిమా చూశారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ విధమైన ప్రవర్తనతో వీరు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతున్నారని ప్రశ్నించారు. -
DCM అధికార దుర్వినియోగం.. పవన్ పై కరప్షన్ కేసు
-
Big Question: సినిమా పాయే.. DCM పరువు పాయే
-
చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి రోజా
-
Tribals: పవన్ కళ్యాణ్ తీరును నిరసిస్తూ గుర్రాలపై నిరసన
-
అబ్బా.. ఓపెనైపోయాడు.. సినిమా ఫ్లాప్ అని ఒప్పేసుకున్నాడు
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కార్యకర్తలని.. ఫ్యాన్సును రెచ్చగొట్టి నానాయాతన పడి రిలీజ్ చేయించుకున్న హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని విషయాన్ని పవన్ కళ్యాణ్ రెండో రోజు ఒప్పేసుకోవాల్సి వచ్చింది.సినిమాను సినిమాగా కాకుండా దానికి పొలిటికల్ ఫ్లేవర్ అద్ది.. రాజకీయంగా సైతం లబ్ధి పొందాలని భావించిన పవన్ కళ్యాణ్ వీరమల్లు చిత్రం కోసం తెలుగుదేశం కార్యకర్తలను సైతం వాడుకున్నారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్రంలోని ఎంతోమంది టిడిపి ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఈ సినిమాకు అనుకూలంగా ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కట్టడం సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టడం జరిగింది. వాస్తవానికి సినిమా బాగుంటే ఎవరూ పాజిటివ్గా ప్రచారం చేయక్కర్లేదు... బాగోలేకపోతే ఎంత ప్రచారం చేసినా జనాలు థియేటర్కు వెళ్ళేది లేదు. ఈ విషయం ఎన్నో మార్లు స్పష్టమైనది. అయినా సరే పవన్ కళ్యాణ్ తనకు తాను ఓ దైవంశ సంభూతుడుగా భావించుకుంటూ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ జనసేన కుర్రాల్లను రెచ్చగొట్టి మరీ హడావిడి చేశారు. మొదటి రోజు కేవలం ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు మాత్రం థియేటర్లో గందరగోళం సృష్టించి చెలరేగిపోయారు..తీరా సాయంత్రానికి రకరకాల వెబ్సైట్లు సోషల్ మీడియా చానెళ్లలో రివ్యూలతోబాటు చూసినవాళ్లు చెప్పిన మౌత్ పబ్లిసిటీ దెబ్బకు రెండోరోజుకు అసలు రంగు బయటపడింది.సినిమా బాలేదు.. నాసిరకంగా ఉంది.. అవాస్తవాలను చరిత్రగా చెప్పడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది అనే టాక్ జనంలోకి వెళ్లిపోయింది. దీంతో ఇక సినిమా ఫ్లాప్ అంట కదా మరి వెళ్లొద్దులే అని జనం వెనుకడుగు వేశారు. మూడో రోజుకు థియేటర్లు మొత్తం ఖాళీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ కు వాస్తవం బాధపడింది. సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి మనసు అంగీకరించక కార్యకర్తలను రెచ్చగొట్టే డైలాగులు చెబుతున్నారు.సినిమాను నెగిటీవ్గా ప్రచారం చేయాలనుకుంటున్న వారికి అక్కడికక్కడే సమాధానం చెప్పండి.. మెతకగా ఉండకండి... వీరత్వం చూపండి రెచ్చిపోండి అంటూ కార్యకర్తలను ఫాన్సను రెచ్చగొడుతున్నారు. ఆ సినిమాను వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది బ్యాన్ చేస్తున్నట్లుగా పోస్టులు పెట్టగా దాని ప్రభావం కూడా ఉందన్న విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది. కానీ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వాళ్లకు క్రెడిట్ ఇవ్వడానికి అంగీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు.సినిమా జయాపజయాలు గురించి తాను పట్టించుకోనని చెబుతూ వేదాంతం చెబుతున్నారు. జీవితాలను ఆనందంగా తీసుకోవాలని అన్నారు. బంధాలు..బాంధవ్యాలు ముఖ్యం అని ఏదేదో మాట్లాడుతున్నారు. రిలీజుకు ముందు బిల్డప్పులు కొట్టిన పవన్ రిలీజ్ తరువాత నీరసం వచ్చి వాయిస్లో తేడా వచ్చేసింది. తాను పేద కుటుంబములో పుట్టానని.. హీరో అయ్యానని..రాజకీయ పార్టీ పెట్టానని.. గెలుపు ఓటములు తనకు పెద్దగా లెక్కలేదంటూ బాధను అణచుకుని గాంభీర్యం చూపుతున్నారు.రిలీజ్కు ముందు మీసం మెలేసిన పవన్ ఇప్పుడు మొత్తం సాఫ్ అయిపోయి శ్మశాన వైరాగ్యం కబుర్లు చెబుతుండటంతో బాబుకు బాగానే గుణమర్ధన అయిందని జనం భావిస్తున్నారు.*సిమ్మాదిరప్పన్న -
హరి హర వీరమల్లు మొదటిరోజు కలెక్షన్స్..!
-
KSR Live Show: విద్యార్థులు ఏడుస్తుంటే.. ఆ పనిలో వీరమల్లు బిజీ బిజీ
-
పవన్ కళ్యాణ్ తీరును నిరసిస్తూ గుర్రాలపై నిరసన
-
పవన్.. పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేసినట్టేనా?
సినిమా ప్రచారం కోసమో.. వైఎస్సార్సీపీపై ఉన్న అక్కసో తెలియదు కానీ.. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఒక ప్రకటన ఆయనలోని లోపలి మనిషిని బయటపెట్టినట్లు అయ్యింది. ‘‘కోసేస్తాం.. నరికేస్తాం.. అంటే చేతులు కట్టుకుని కూర్చోం’’ అని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రత్యేకంగా టీడీపీ మురికి మీడియా ఈ వ్యాఖ్యలను బాగా హైలైట్ చేసింది. ‘‘వైఎస్సార్సీపీ తాటాకు చప్పుళ్లకు బెదిరే వాళ్లెవరూ లేరిక్కడ’’ అనడంతోపాటు పవన్ ఇంకా చాలా మాటలన్నట్లు తెలుస్తోంది.తన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఆయన ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత తన పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం పెట్టి సినిమా సంగతులతో పాటు వైఎస్సార్సీపీపై విమర్శలు కూడా చేశారు. సినిమాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెబుతూనే ఆయన వైఎస్సార్సీపీని విమర్శించడం ద్వారా సినీ నిర్మాతకు మేలు చేయదలిచారా? లేక కీడు జరిగినా పర్వాలేదని భావిస్తున్నారా!. అసలు ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రస్తావన తేవలసిన అవసరం ఏంటి?. టీడీపీ, సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ల వారి మెప్పుదల కోసం కాకపోతే? హరిహర వీరమల్లు సినిమా టిక్కెట్ల ధరలు పెంపునకు సీఎం అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞత చెప్పవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో మేనేజ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పవచ్చు. ఆక్షేపణ లేదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతకాలం క్రితం అసెంబ్లీలో ఇకపై సినిమాలకు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండవని గంభీరంగా ప్రకటించినా, పవన్ కళ్యాణ్ కోసం మాట తప్పడం విశేషం. ఈ వ్యవహారంలో పవన్.. వైఎస్సార్సీపీ ప్రస్తావన తెచ్చి వారిని బెదిరించాల్సిన అవసరం ఏంటి?. నిజానికి పవన్ కళ్యాణ్ ఏడాదికాలంగా ఒకటి, రెండుసార్లు తప్ప ఏపీలో ఎక్కడ ఏ అరాచకం జరిగినా ప్రశ్నించడం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా మాట్లాడటం లేదు. చంద్రబాబుతో కలిసి సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం, ఎన్నికల ప్రణాళిక అంటూ ప్రజాగళం పేరుతో బోలెడన్ని హామీలు ఇచ్చారు. ఏనాడైనా తన పార్టీ వారితో కలిసి వీటిని సమీక్షించారా?. సూపర్ సిక్స్ హామీలు అన్నిటిని ఎందుకు అమలు చేయలేక పోతున్నామని చంద్రబాబును ప్రశ్నించారా?.ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తే ఏపీని అమ్ముకోవల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో పవన్ ఏకీభవిస్తారా?. అది మోసం చేయడం అవుతుందా? కాదా?. కూటమి హామీలకు తనది గ్యారంటీ అని ఆ రోజుల్లో పవన్ ప్రకటించారా? లేదా?. దీనిపై ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడం లేదు?. పోనీ, తన పార్టీ వారి గురించైనా ఆలోచిస్తున్నారా!. శ్రీకాళహస్తిలో జనసేన నియోజకవర్గ ఇంఛార్జి కోట వినూత దంపతులు పార్టీ కార్యకర్త రాయుడును దారుణంగా హత్య చేస్తే పవన్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై వినూత భర్త చేసిన ఆరోపణ ఏంటి?. వినూత వ్యక్తిగత వీడియోలు తీయించడానికి రాయుడును ఆయన మనుషులు ప్రయోగించారన్న విమర్శ మాటేమిటి?. అది అసలు పవన్ దృష్టిలో సమస్యే కాదా?. వైఎస్సార్సీపీ వారు కోసేస్తాం.. అని అన్నారట. అది అవాస్తవం అని తెలిసినా ఎందుకు పవన్ అలా మాట్లాడుతున్నారు.మరి శ్రీకాళహస్తిలో తన పార్టీవారే ఒక సామాన్య కార్యకర్తను నరికేశారే! సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే మహిళలపై కొన్ని అఘాయిత్యాలు జరిగినట్లు, దళితులను గ్రామ బహిష్కరణ చేసినట్లు కథనాలు వచ్చాయే. అలాంటి ఘటనలు జరిగినప్పుడు చేతులు కట్టుకుని కూర్చోకుండా కారణం ఏమిటో తెలుసుకుని వారికి న్యాయం చేయాలి కదా!. ఆ పని చేయకుండా వైఎస్సార్సీపీ వారిని బెదిరించడం ఏంటి?. ఇప్పటికే ఎర్ర బుక్కు పేరుతో వందలాది మంది వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెడుతున్నారు కదా!. ఇది పవన్ కళ్యాణ్కు సరిపోవడం లేదా!. పోనీ శాఖాపరంగా ఎంత బాగా పని చేస్తున్నది ఆయనకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకే తెలియ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారిపైన బహిరంగంగానే దూషణల పర్వానికి దిగితే ఆ శాఖ మంత్రిగా పవన్ ఏం చేశారు?. చేతులు కట్టుకుని కూర్చున్నారా? లేక ఏమైనా చర్య తీసుకోగలిగారా? ప్రభాకర్ రెడ్డే ఒక ఏఎస్పీపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అదేమి పద్దతి అని అయినా పవన్ అడగగలిగారా?. ముందు తను సమర్థంగా పని చేస్తున్నట్లు రుజువు చేసుకుని అప్పుడు ఇతరులపై విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది.టీడీపీ సేవలోనే పవన్ తరిస్తున్నారని జనసేన కార్యకర్తలు ఇప్పటికే భావిస్తున్నారట. దాని గురించి ఆలోచిస్తున్నారా! సినిమాలు చేస్తున్నారని విమర్శిస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలలో నటించినప్పుడు కూడా అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. తనను ఎవరూ ఏమీ అనకూడదని భావిస్తే కుదురుతుందా! సినిమాలు మీ ఇష్టం. కానీ, ప్రజలకు అత్యవసరమైన పంచాయతీ రాజ్ శాఖకు బాధ్యత వహిస్తున్న సంగతి మర్చిపోకూడదు. వేల సంఖ్యలో ఫైళ్లు అపరిష్కృతంగా ఉంటున్నాయన్న విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదు. దానిపై ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా? వాళ్లలా తనకు పత్రికలు, టీవీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, బినామీ వ్యాపారాలు లేవని పవన్ అంటున్నారు.వైఎస్సార్సీపీ వారిపై విమర్శలు చేయబోయి పవన్ కళ్యాణ్ టీడీపీ వారిని కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తప్పుపట్టినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు నేతలకు ఆయా వ్యాపారాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భజన చేసే మురికి మీడియా బోలెడంత ఉండగా సొంత మీడియా అవసరం పవన్కు ఏం ఉంటుంది!. ఇవేవీ జనానికి తెలియదన్నట్లుగా పవన్ అమాయకంగా మాట్లాడితే సరిపోతుందా!. సినిమా టిక్కెట్ల ధరల పెంపు గురించి కూడా గత ప్రభుత్వంపై చేసిన విమర్శలు అర్థ రహితంగా ఉన్నాయి. పైగా జనం అంతా టిక్కెట్ల రేట్లు పెంచాలని అడుగుతున్నారట. ఇంతకన్నా అబద్దం ఏం ఉంటుంది?.పవన్కు అధికారం ఉంది కనుక టిక్కెట్ల రేట్లు పెంచుకుంటే పెంచుకోవచ్చు. కానీ మధ్యలో వైఎస్సార్సీపీపై ఆరోపణ చేయడం ఏమిటి? గత ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి ఒక విధానం ప్రకటించింది. దాని ప్రకారం ఏపీలో కూడా నిర్దిష్ట శాతం షూటింగ్ చేయాలని కోరింది. అదీ తప్పేనా? అవును! తమకు మద్దతు ఇస్తున్న ఈనాడు మీడియా గ్రూప్నకు చెందిన రామోజీ ఫిలిం సిటీకి ఎక్కడ నష్టం వస్తుందని అనుకున్నారో, లేక ఇంకే కారణమో కాని, ఏపీకి సినీ పరిశ్రమను తరలించడానికి కూటమి ప్రభుత్వం పెద్దగా కృషి చేయడం లేదు. దాని గురించి నేరుగా మాట్లాడకుండా సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలనవసరం లేదని, తొలుత మౌలిక వసతులు అభివృద్ది చెందాలని అంటే ప్రయోజనం ఏమిటి?.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు విశాఖలో సినీ స్టూడియోలు, ఇతర వసతులు కల్పించడానికి చేసిన కృషి గురించి విస్మరిస్తున్నారు. తనకు పదవి ఉంటే చాలు.. తన సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే చాలు.. అంతా బాగున్నట్లుగా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని పవన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నట్లుగా ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గురివింద గింజ సామెత మాదిరి వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఎల్లకాలం అది సాధ్యమవుతుందా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గిరిజనుల ఆగ్రహం
సాక్షి,అల్లూరి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుర్రాలపై నిరసన చేపట్టారు. ఈ ఏడాది పవన్ ‘అడవి తల్లి బాట’ పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటన సమయంలో ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఇచ్చిన హామీ నీటిమీద రాతలు మిగిలాయి.డిప్యూటీ సీఎం హోదాలో పవన్ హామీ ఇచ్చిన నెలలు గడుస్తున్నా.. రోడ్ల పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అసల వర్షా కాలం కావడంతో నానా అగచాట్లు పడుతున్న గిరిజనులు పవన్ తీరును ప్రశ్నించారు. నిరసనకు దిగారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రోడ్లు వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. -
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్కాట్ దెబ్బ
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు'కు బాయికాట్ దెబ్బ గట్టిగానే తగిలింది. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఏ చిత్రం బతికి బట్ట కట్టలేదని మరోసారి నిరూపితం అయింది. ఎంత పెద్ద హీరో ఉన్నా సరే ఆ సినిమాకు కష్టాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్, లైలా, రిపబ్లిక్, మట్కా వంటి చిత్రాలు బాయికాట్ దెబ్బతో మొదటిరోజే కనిపించకుండా పోయాయి. ఇప్పుడు హరిహర మీరమల్లు కూడా మొదటిరోజే ప్యాకప్ చెప్పే పరిస్థితి వచ్చింది. సినిమాలు చేసుకోండి. కానీ, ఆ వేదికలపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాల కలెక్షన్స్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్హరిహర వీరమల్లును ఎలాగైనా నిలబెట్టాలని పవన్ కల్యాణ్ అనుకున్నారు. కానీ, సినిమా వేదికపై ఆయన రాజకీయాలు మాట్లాడటం.. ఆపై ఆజ్యం పోసేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పరుష వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో వైఎస్సార్సీపీ అభిమానులు భగ్గుమన్నారు. #BoycottHHVM హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేశారు. ఈ దెబ్బ గట్టిగానే వీరమల్లుకు గుచ్చుకుంది. ఈ చిత్రం ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ఏకంగా మూడు రోజులు ప్రచారంలోనే మునిగిపోయారు. వరుస మీడియా సమావేశాలు ఆపై సోషల్మీడియా ఇన్ఫ్లూయన్సర్లతో సెల్ఫీలు వంటివి గట్టిగానే చేశారు. కేవలం ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యల వల్ల ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయింది.పుష్ప2 సినిమా మొదటిరోజు కలెక్షన్స్ (294 కోట్లు) దాటేస్తామని చెప్పుకున్న పవన్ ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలిపి మొదటిరోజు రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే 'వీరమల్లు' రాబట్టింది. నెట్ పరంగా అయితే రూ. 47 కోట్లు మాత్రమేనని ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్క్ పేర్కొంది. సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచి ఆపై 700 వందలకు పైగా ప్రీమియర్ షోలు వేస్తేనే కలెక్షన్స్ ఇలా ఉంటే... ఎలాంటి బెనిఫిట్స్ లేకుంటే 'వీరమల్లు' పరిస్థితి ఊహించుకోవడమే కష్టమని చెప్పవచ్చు.వీరమల్లుకు బెనిఫిట్ షోల ద్వారా రూ. 12.75 కోట్ల నెట్ వస్తే.. మొదటిరోజు రూ. 34.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిందని సాక్నిల్క్ పేర్కొంది. హైదరాబాద్, విజయవాడలో మాత్రమే అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయాయని ఆ సంస్థ తెలిపింది. పుష్ప2 హిందీ వెర్షన్ మొదటి రోజున రూ. 72 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ రికార్డ్ను 'వీరమల్లు' మొత్తం కలెక్షన్స్తో కూడా టచ్ చేయలేకపోయాడు. -
విజయవాడలో ధియేటర్ అద్దాలు పగలగొట్టిన పవన్ సైకో ఫ్యాన్స్
-
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇదీ పవన్ కల్యాణ్ అసలు రంగు
ఊసరవెల్లిని మించి పవన్ కల్యాణ్ రంగులు మార్చేస్తున్నారు. ‘‘జనసేనాని రూల్స్ మాట్లాడతారు.. కానీ పాటించరు.. నీతులు చెబుతారు.. కానీ ఆచరించరు. టిక్కెట్ రేట్లు పెంచుకుంటానికే డిప్యూటీ సీఎం అయ్యారు కదా సార్’’ అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. అప్పుడు ‘పుష్ప’ సినిమా సమయంలో ప్రతి ఒక్క నిర్మాత ప్రత్యక్షంగా వచ్చి కలిసి టికెట్ల ధరలు పెంచుకోవాలన్న పవన్.. ఇప్పుడు తన ‘వీర మల్లు’కు మాత్రం.. నిర్మాత రిక్వెస్ట్ పెట్టగానే హైక్ ఇచ్చేస్తారా?.. ఇదేనా మీరు చెప్పిన ‘‘నీకో చట్టం.. నాకో చట్టం" డైలాగ్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.మే 27న అధికారికంగా డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి అంటూ ఓ ట్వీట్ చేశారు. నా సినిమా అయిన సరే టికెట్ల ధరలు పెంపు కావాలంటే.. ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధర పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా సంప్రదింపులు చేయాలని.. ఇందులో తన, మన బేధాలు పాటించవద్దని స్పష్టంగా చెప్పారు..అయితే, ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. హరిహర వీరమల్లు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కేవలం మూవీ నిర్మాత రిక్వెస్ట్కు స్పందించిన చంద్రబాబు సర్కార్.. టికెట్ల రేటు పెంచుకోమంటూ పర్మిషన్ ఇచ్చేసింది. తన సినిమా రేట్లు పెంచుకుని డిప్యూటీ సీఎం సంతోష పడిపోయారు.పుష్ప సినిమా అప్పుడు : ప్రతి ఒక్క నిర్మాత ప్రత్యక్షంగా వచ్చి కలిసి రేట్స్ పెంచుకోవాలి మీ వీర మల్లు అప్పుడు : నిర్మాత రిక్వెస్ట్ పెట్టగానే హైక్ ఇచేస్తారా @PawanKalyan ఇదేనా మీరు చెప్పిన " నీకో చట్టం నాకో చట్టం " డైలాగ్ 💦 pic.twitter.com/dAzZbDCouZ— Rohit_Ysrcp (@Rohit_Ysrcp) July 24, 2025కాగా, గతంలో కూడా పవన్ కల్యాణ్ ఒక మాట అన్నారు.. ఒకరు కూడా వచ్చి చంద్రబాబును కలవలేదని.. లేఖ రాస్తూ.. ఇకపై సినిమా రేట్ల టికెట్లకు సంబంధించి ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు.. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలంటూ సెలవిచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఎంతమంది ప్రతినిధులు వచ్చారు? అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. -
హరిహర వీరమల్లుపై ట్రోలింగ్.. పంచతంత్రం సీరియల్ బెటర్!
హరిహర వీరమల్లు (Harihara Veeramallu Movie).. ఐదేళ్ల కిందట మొదలైన సినిమా! ఎన్నో ఆలస్యాల తర్వాత జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరిహర వీరమల్లుకు ఎటువంటి బజ్ లేకపోయేసరికి హీరోయిన్ నిధి అగర్వాల్ సినిమాను తన భుజాలపై వేసుకుని ప్రమోషన్ చేసుకుంది. అసలే నిర్మాత పెట్టిన డబ్బులు వస్తాయో, లేదోనన్న భయంతో నిలువునా వణికిపోతున్నాడు. ఏం లాభం?అతడి బాధ అర్థం చేసుకుందో, ఏమోకానీ కెరీర్ను పక్కనపెట్టి మరీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్లో చురుకుగా పాల్గొంది నిధి. తననలా చూశాక పవన్ కల్యాణ్కు బుద్ధి వచ్చినట్లుంది. సినిమా కోసం ఇంతలా కష్టపడుతున్న నిధిని చూస్తే సిగ్గేసిందంటూ వెంటనే ప్రమోషన్స్లో పాల్గొన్నారు. అయినా లాభం లేదనుకోండి, అది వేరే విషయం!(చదవండి: హరిహర వీరమల్లు మూవీ రివ్యూ)అభిమానులకే నచ్చట్లేదుపవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా అనగానే అభిమానులు నానా హడావుడి చేశారు. కానీ సాయంత్రమయ్యేసరికి దాదాపుగా సైలెంట్ అయిపోయారు. కొందరు అభిమానుల నుంచి కూడా సినిమాకు నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. కక్కలేక మింగలేక అన్నట్లుంది వారి పరిస్థితి! హరిహర వీరమల్లు వరస్ట్గా ఉంది.. ఓజీ సినిమాకు చూసుకుందాంలే అని వారే ఒప్పేసుకుంటున్నారు.పేలవమైన వీఎఫ్ఎక్స్ముఖ్యంగా రూ.250 కోట్ల బడ్జెట్ అన్నప్పుడు వీఎఫ్ఎక్స్ కూడా దానికి తగ్గట్లే ఉండాలి. కానీ ఈ చిత్రంలో కొన్ని పేలవమైన గ్రాఫిక్స్ సినీప్రియులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. సినిమా అంత కలగూర గంపలా కనిపిస్తుంది. సినిమా కంటే తక్కువ.. సీరియల్ కంటే ఎక్కువ అని నెటిజన్లు హరిహరవీరమల్లును ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో పవన్.. కోహినూర్ వజ్రాన్ని తేవడం ఏమో కానీ ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత తలనొప్పి అందించారు. బహుశా అందుకునేమో.. నిర్మాత రత్నం ఈ సినిమా హిట్టయితేనే పార్ట్ 2 ఉంటుందని థియేటర్ బయట నెమ్మదిగా జారుకున్నాడు. Done with my show #HHVM 🦅 Meeru ikkada review lu ichinantha worst ga aithe ledu antha kanna daridram ga undi💥 pic.twitter.com/NJLv3nEZ0f— 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 𝐈𝐜𝐨𝐧🗡️ (@icon_trolls) July 23, 2025Panchatantram 1episode>#HHVM whole movie 🤣— 🅰️llu🅰️rjun🔥mb🦁ntr🐯 (@BiBrfvr111388) July 24, 2025మిమ్మల్ని ఎవరూ ఆపాల్సిన పని లేదు మార్నింగ్ షోస్ కి మీరే ఆగిపోయారు 😂😂#HariHaraVeeeraMallu #DisasterHariHaraVeeraMallu pic.twitter.com/NyhOAQH8q8— Graduate Adda (@GraduateAdda) July 24, 2025#HHVM review raddam anukunna..Kani review rayadam kosam movie chudali anna kuda bhayam ga undi😭We wait for OG🫡— Telugu Meme Club (@telugumemeclub) July 24, 2025Cinema ki Thakkuva serial ki ekkuva 🍪🐶#HHVM #HHVMReview— GL 𝗔𝗔 DIATOR (@Gowthureddy_) July 24, 2025Manaki #OG undi idi #HHVM already decide ina output average ga untadi anukunnam kani worst ga undi feenini moyalsina pani ledu #OG lekkalu anni sarichestadi— NimmakuruNatukodi (@brolaughsalot) July 24, 2025Aurangzeb: ఎవరు నువ్వు ? చార్మినార్ దగ్గర ఏం పని ? Veera Mallu: నేను చార్మినార్ లోనే పుట్టాను....#HHVM #HariHaraVeeraMallu pic.twitter.com/mBBtePsyvK— 2.0 (@alanatiallari) July 23, 2025చదవండి: నీళ్ల కిచిడీయే ఆహారం.. మా పేదరికాన్ని చూసి వెక్కిరించేవాళ్లు -
కూటమి కొత్త కథ .. రాబోయే రోజుల్లో పవన్ జీరో
సాక్షి: తాడేపల్లి:ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సిట్ చట్ట ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్లో పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం ఒక కొత్త కథను అల్లి ఎల్లో మీడియా ప్రచురిస్తుంటే, దానిని బట్టి సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకువెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్ట్కు సమర్పించని రిమాండ్ రిపోర్ట్లు కూడా ఎల్లో మీడియాలో ఒకరోజు ముందుగానే ప్రచురితం అవుతున్నాయంటేనే సిట్ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబుకు భజన చేస్తున్న ఎల్లో మీడియా ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసమే ఇలాంటి దుర్మార్గమైన కథనాలను రాసి, సిట్ను నడిపిస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి వైఎస్సార్సీపీ నేతలను కక్షపూరితంగా అరెస్ట్లు చేయిస్తున్న చంద్రబాబు దుర్మార్గాల్లో ఎల్లో మీడియా భాగస్వామిగా మారింది. జరగని అవినీతిపై ఎలా దర్యాప్తు చేయాలో తెలియక తల పట్టుకుంటున్న సిట్ బృందానికి చక్కని కథలు, టీవీ సీరియల్స్ను రాసి, వారితో ఎవరెవరిపై ఎలా తప్పుడు కేసులు బనాయించాలో రోజుకో కథనం రాసే బాధ్యతను ఎల్లో మీడియాకు చంద్రబాబు అప్పగించారు. అందుకే ప్రతిరోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు విచిత్రమైన అంశాలను రాస్తూ, తమ ఊహలను వార్తలుగా ప్రచురిస్తూ ఏం చేయాలో సిట్ బృందానికి దిశానిర్ధేశం చేస్తున్నాయి. లిక్కర్ కేసులో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ రిమాండ్ రిపోర్టుని కోర్టుకు సమర్పించకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో దానిపై అక్షరం పొల్లుపోకుండా కథనాలు ప్రత్యక్షం అవుతున్నాయి. జడ్జి ముందు పెట్టాల్సిన డాక్యుమెంట్ వారం ముందరే ఈ రెండు పేపర్లకి ఎలా లీకవుతోంది.? ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఎవరి మీదనైతే వార్తలు రాస్తున్నారో సిట్ వారి మీదనే కేసులు నమోదు చేస్తుంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఎల్లో మీడియా చెప్పినట్టు సిట్ నడుస్తుందా అనే అనుమానాలు కలగకుండా ఉండవు. సిట్ కి విశ్వసనీయత లేదని స్పష్టంగా తెలుస్తుంది. రెండు అపార్టుమెంట్ల నిండా వేల కోట్ల డబ్బులు దాచిపెట్టారని ఇష్టానుసారం ఎల్లో మీడియా ఛానెళ్లలో డిబేట్లు నడుపుతున్నారు. తప్పుడు కథనాలు రాసి విష ప్రచారం చేస్తున్నారే కానీ, ఎక్కడా అంత పెద్ద మొత్తంలో సిట్ డబ్బులు సీజ్ చేసింది కూడా లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు రూ.50 వేల కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ విలువను రూ. 3,500 కోట్లకు తగ్గించుకుంటూ వచ్చారు. న్యాయపరంగా ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టే ఏ అవకాశాన్ని మేం వదులుకోం. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటాం.డిస్టిలరీన్నీ చంద్రబాబు అనుమతులతో ఏర్పాటైనవే:డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకున్నారనేది సిట్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. కానీ వాస్తవంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుమతులిచ్చినవే. వైయస్సార్సీపీ హయాంలో ఒక్క దానికి కూడా అనుతివ్వలేదు. కొంతమంది అధికారులను లోబర్చుకుని, బెదిరించి, భయపెట్టి వారితో వాంగ్మూలాలు తీసుకుని కేసులు నమోదు చేశారు. లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పడానికి సిట్ వద్ద ఒక్క ఆధారం కూడా లేదు. ఏదోఒక విధంగా వైయస్సార్సీపీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే కక్షపూరితంగా లిక్కర్ కేసును సృష్టించారు.రాష్ట్రంలో న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు:నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు మా చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి బందోబస్తు కల్పించాలని కోర్టు స్పష్టంగా చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. పోలీసులు యథేచ్చగా చట్టాన్ని, న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించి కూటమి నాయకుల అరాచకాలకు సహకరిస్తున్న పోలీసులు, ప్రభుత్వ అధికారులు రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూల్యం చెల్లించుకోకతప్పదు. వైయస్సార్సీపీని ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకు మూడింతలు బలంగా తిరగబడతాం. వైఎస్సార్సీపీ పోరాటాలు కొత్తకాదు. పార్టీ ఏర్పాటే తిరుగుబాటుతో మొదలైంది.పవన్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు:తనకు పాలన చేతకాదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పేశాడు. ఏదైనా అలజడి సృష్టించి వైఎస్సార్సీపీ మీద బురద జల్లడానికే చంద్రబాబు ఆయన్ను వాడుకుంటున్నాడు. ఆయనకున్న సినిమా క్రేజ్ని తెలుగుదేశం పార్టీ వాడుకుని మొన్న ఎన్నికల్లో లబ్ధిపొందింది. పవన్ కళ్యాణ్ బలం, బలహీనత జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పూర్తిగా అర్థమైంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాన్ జీరో కావడం తథ్యం. వైఎస్సార్సీపీ హయాంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని, దానివెనుక వాలంటీర్ల పాత్ర ఉందని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై మా ప్రభుత్వ హయాంలో నమోదైన కేసును కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనిపై క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేసి న్యాయస్థానాల్లో పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. -
Kakinada: భూములపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అనుచరుల కన్ను
-
పవన్.. చేతనైతే ‘కోహినూర్’ను వెనక్కి రప్పించు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన హరిహర వీరమల్లు చిత్రం ఇవాళ రిలీజ్ అయ్యింది. కోహినూర్ వజ్రం సీక్వెన్స్ ఈ చిత్ర కథలో భాగమని చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. “ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్... దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి” అని పవన్ పేల్చిన డైలాగూ ఉంది. అయితే బ్రిటిషర్లు తీసుకెళ్లిన ఆ వజ్రాన్ని నిజంగానే వెనక్కి తేవాలంటూ పవన్కు ఓ లేఖ చేరింది ఇప్పుడు. కోహినూర్.. ఒక వజ్రం(Kohinoor Diamond) మాత్రమే కాదు. శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఓ చిహ్నం కూడా. భారత్తో పాటు పాక్, అఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూడా ఈ వజ్రం తమదేనంటూ వాదిస్తుంటాయి. చివరకు.. 1849లో లాహోర్ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా చేతికి వెళ్లింది. అక్కడి నుంచి క్వీన్ విక్టోరియా కిరీటంలో పొదిగారు. రాజకుటుంబంలో మగవాళ్లు కోహినూర్ను అరిష్టంగా భావించి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత లండన్ టవర్ జ్యువెల్స్ టవర్లో ప్రదర్శనగా ఉంటోంది. కోహినూర్ను భారత్కు రప్పించేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ విజ్ఞప్తులను ఇంగ్లండ్ తోసిపుచ్చుతూ వస్తోంది. క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తర్వాత మరోసారి ఈ డిమాండ్ ఊపందుకుంది. 2025లో బ్రిటన్ మంత్రి లీసా నాండీ(Lisa Nandy) భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ చర్చ జోరుగా సాగింది. కోహినూర్ను ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు అంటూ కామెంట్ చేశారామె. అయితే భారత విదేశాంగ శాఖ మాత్రం సంతృప్తికర పరిష్కారం కోసం మార్గాల అన్వేషణ కొనసాగుతోందని అంటోంది. ఈ నేపథ్యంలో.. పవన్కు చేరిన లేఖలో అంశాలు ఇలా.. ‘‘మీరు ప్రముఖ పాత్రలో నటించి విడుదల చేసిన "హరిహర వీరమల్లు" చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు. కానీ మీ అభిమానులు, ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు. అపోహలతో కూడిన ఈ ఊహజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీస్తుంది. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదు. కావున ఈ చిత్రం కాల్పనిక కట్టు కథ ఆని మీరు ప్రజలకు స్పష్టం చేయాలని కోరుతున్నాను.బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. హరిహర వీరమల్లు పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక ఫాంటసీ సృష్టి మాత్రమే. దీనితో ముడిపడి ఉన్న మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం లాంటివి వాస్తవాలు. వాస్తవాలకు కట్టు కథలను జోడించడంవల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయి.కృష్ణానది పరివాహ ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం ఆనాడు (దాదాపు 700 సంవత్సరాల క్రితం) కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు, వారి నుండి మొగల్ చక్రవర్తులకు, వారి నుండి నాదిర్షాకు, వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు, వారి నుండి పంజాబ్ సిక్కు రాజుకు, అక్కడినుండి బ్రిటిష్ వారికి అది లభించింది.బ్రిటిష్వారు దానిని దొంగతనంగా లండన్ తరలించారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రాలేదు. బ్రిటిష్ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరం. మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయింది. వారు భారతదేశంలో అంతర్భాగం అయిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది.యావన్మంది ప్రజలు ఒక్క తాటి పైకి వచ్చి పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్ళి పోయారు. ఈ చారిత్రిక వాస్తవాన్ని కూడా మీరు గుర్తించడం అవసరం.మీరు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు.కోహినూర్ డైమండ్.. మన వారసత్వ సంపద. ఆ పని చేయకుండా కట్టు కథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి, ప్రజలకు నష్టమని గుర్తించాలని కోరుతున్నాను’’ అంటూ పవన్ కల్యాణ్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఓ లేఖ రాశారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహినూర్ డైమండ్ కథాంశంగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కావడం గమనార్హం.VIDEO | Andhra Pradesh Deputy CM Pawan Kalyan (@PawanKalyan ) says, "The Kohinoor should definitely be brought back to India. I personally feel it belongs to our nation, it is the property of Bharat. That is our heart and soul, that is our Ratnagarbha. I think it should be… pic.twitter.com/sPZHjsBJjM— Press Trust of India (@PTI_News) July 22, 2025 -
Karumuri Nageswara: పవన్ ఫ్యాన్స్ వీరంగం.. ఇదేనా మీ జనసైనికు నేర్పిన సంస్కారం
-
బాబాయ్ సినిమాను పట్టించుకోని రామ్ చరణ్.. ఆ మెగా హీరోలు మాత్రం!
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు. దాదాపు ఐదేళ్లపాటు షూటింగ్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచి ఈ చిత్రం కోసం నిరీక్షించిన అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. బాక్సాఫీస్ బద్దలవుతుందని రిలీజ్కు ముందు హల్చల్ చేశారు. కానీ తొలి ఆట నుంచే ఊహించని విధంగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఉత్సాహంగా థియేటర్కు వెళ్లిన అభిమానులు.. బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఆ జోష్ కనిపించలేదు. దీంతో తొలిరోజే వీరమల్లుకు పెద్ద షాక్ తగిలినట్లే అర్థమవుతోంది.అయితే హరిహర వీరమల్లు రిలీజ్ కావడంతో మెగా హీరోలంతా పవన్ కల్యాణ్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ సినిమా సక్సెస్ కావాలంటూ ట్వీట్ చేశారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ తారలు వీరమల్లు చిత్రం రిలీజ్ వేళ మద్దతుగా పోస్టులు పెట్టారు.అయితే మెగా హీరో, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం బాబాయ్ సినిమా రిలీజ్కు ముందు ఎలాంటి పోస్ట్ చేయలేదు. ట్రైలర్ రిలీజ్ రోజు మాత్రమే పోస్ట్ పెట్టిన చెర్రీ.. హరిహర వీరమల్లు విడుదలకు ముందు ఎలాంటి విషెస్ చెప్పలేదు. దీంతో బాబాయ్ సినిమాకు చెర్రీ పోస్ట్ పెట్టకపోవడంపై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరోవైపు పెద్ది సినిమాతో బిజీగా ఉండడం వల్లే కుదరక పోయి ఉండొచ్చని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా బాబాయ్ చిత్రానికి మెగా హీరో రామ్ చరణ్ సపోర్ట్ చేయకపోవడం గమనార్హం.The Power Storm we've all been waiting for is finally coming to the big screens in just a few hours.. Wishing my guru @PawanKalyan mama, a historic blockbuster with #HariHaraVeeraMallu 🔥@DirKrish garu’s foundation for a powerful story, along with the commendable efforts of… pic.twitter.com/iR7MYcuYtZ— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 23, 2025 It's Veera's Time 🔥Wishing the team of #HariHaraVeeraMallu all the success❤️A lot of hearts gone into this, hoping for a powerful blockbuster! 👊Super excited to watch Kalyan babai again on the Big Screen!! Power storm is coming! ❤️ pic.twitter.com/mHVHcXr45B— Varun Tej Konidela (@IAmVarunTej) July 23, 2025 -
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు దాదాపు ఐదేళ్ల తర్వాత రిలీజైంది. క్రిష్ డైరెక్షన్లో మొదలైన ఈ చిత్రం చివరికి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ముగించారు. అభిమానుల భారీగా అంచనాల మధ్య ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే తొలి రోజు నుంచే ఈ సినిమాకు నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. పవన్ ఫ్యాన్స్ సైతం సినిమా చూసి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల అంచనాలను అందుకోవడంతో హరిహర వీరమల్లు విఫలమైనట్లు తెలుస్తోంది.అయితే అభిమానుల సంగతి పక్కనపెడితే ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం చేసిన కామెంట్స్ మరింత హాట్టాపిక్గా మారాయి. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన షాకింగ్ సమాధానమిచ్చారు. హరిహర వీరమల్లు పార్ట్-2 గురించి ప్లాన్ చేస్తున్నారా? అని ఓ ఛానెల్ రిపోర్టర్ నిర్మాతను అడిగారు. దీనికి రత్నం మాట్లాడుతూ.. ఈ సినిమా హిట్ అయ్యాకే దాని గురించి అలోచిస్తాం అని అన్నారు. ఏఎం రత్నం సమాధానం చూస్తే ఆయనకే ఈ సినిమా హిట్ కావడంపై డౌట్ ఉన్నట్లు అర్థమవుతోంది. తమ చిత్రం సూపర్ హిట్ అవుతుందన్న ఆత్మవిశ్వాసం నిర్మాతకు లేదంటే హరిహర వీరమల్లుకు పెద్ద షాకే. ఇప్పటికే ఫ్యాన్స్ నిరాశలో ఉండడంతో నిర్మాత కామెంట్స్తో హరిహర వీరమల్లు హిట్ కావడంపై ఆశలు ఇక లేనట్లే.కాగా.. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కీలక పాత్ర పోషించారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏంతమేరకు కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాల్సిందే.Appude Guess Cheyalsindi, We did a Mistake pic.twitter.com/b7hGjkbqMi— Shiva Akunuri (@AkunuriShivaa) July 23, 2025 -
ఆ ఓటీటీలోకి హరి హర వీరమల్లు.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) నేడు(జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయితే ఈ చిత్రానికి తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని సీజీ వర్క్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలకు సైతం అద్భుతమైన వీఎఫెక్స్ వాడుతున్నారు. కానీ ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకు ఇంత పేవలమైన సీజీ వర్క్ చేయడం ఏంటని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. (చదవండి: హరి హర వీరమల్లు రివ్యూ)పవన్ ఫ్యాన్స్ సైతం ఆ సినిమా పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం ఈ సినిమా ఓటీటీ వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది అనేది గూగుల్లో సెర్చ్ చేసి మరీ వెతుకున్నారు.విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ మంచి ధరకు డిజిటల్ రైట్స్ పొందింది. సినిమా రిలీజ్ అయినా 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారట. ఈ లెక్కన సెప్టెంబర్ రెండో వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు అన్యూహ్యంగా నెగెటివ్ టాక్ రావడంతో ఓటీటీలో అనుకున్నదాని కంటే ముందే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. సినిమా హిట్ అయితే ఎనిమిది వారాల వరకు ఆగేవారు కానీ.. ఇప్పుడున్న టాక్ని బట్టి చూస్తే నెలలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఈ లెక్కన ఆగస్ట్ ఎండింగ్లోపే ఈ సినిమా డిజిటల్ తెరపై వచ్చే అవకాశం ఉంది. -
బాబు, రేవంత్.. ఇలాంటి సినిమాలకు రాయితీలా?: నారాయణ ఫైర్
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సినిమాల విడుదల సందర్భంగా రాయితీలు, టికెట్ రేట్ల పెంపు సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో హింసను ప్రేరేపించే సినిమాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి రాయితీలు ఇవ్వడం ఏంటి? అని ప్రశ్నించారు.సీపీఐ నారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆర్ నారాయణ మూర్తిని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలి. నారాయణ మూర్తి యూనివర్సిటీ సినిమాలో పేపర్ లీకేజీల వలన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నది చూపించారు. అలాంటి ఒక సందేశాత్మక చిత్రం తీశారు. నారాయణ మూర్తికి ఏ ప్రభుత్వ సహాయం అవసరం లేదు అన్నారు. సమాజంలో హింసను ప్రేరేపించే సినిమాలకు ఏపీ, తెలంగాణ సీఎంలు రాయితీలు ఇస్తారా?పవన్ కళ్యాణ్ సహా పలువురి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకొనేందుకు, బ్లాక్లో అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వడం ఏంటి?. ఇది దివాళాకోరు రాజకీయం. ప్రజలు దీన్ని అసహ్యించుకుంటారు. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలకు రాయితీలు ఇవ్వకుండా హింసను ప్రేరేపించే చిత్రాలకు రాయితీలు ఇవ్వడం దివాళాకోరుతనం అవుతుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల తగ్గించాలి: డీవైఎఫ్ఐ డిమాండ్
సాక్షి, అమరావతి: హరిహర వీరమల్లు సినిమా కోసం పెంచిన టికెట్ ధరలను తక్షణమే తగ్గించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) రాష్ట్ర శాక అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, జి. రామన్నలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిత్యావసరాలతో సహా అన్ని ధరలు చుక్కలంటుతున్నాయని, చివరికి వినోదం కోసం సినిమా వీక్షించే అవకాశం కూడా సామాన్యలకు లేకుండా ఇష్టమొచ్చినట్లుగా వసూలు చేసుకునే అవకాశం కల్పించడం దారుణమని పేర్కొన్నారు. బెనిఫిట్ షోల పేర్ట ఒక్కో టికెట్కు రూ. 700 నుంచి రూ. 1000 వసూలు చేయడం దారుణమని, ఈ దోపిడీ విధానానికి స్వస్తి చెప్పాలన్నారు. మిగిలిన రోజుల్లో కూడా టికెట్ ధరలు రూ. 177 నుంచి రూ.377 వరకు పెంచి సామాన్యులకు సైతం సినిమా చూసే అవకాశం లేకుంటా చేస్తున్నారని మండిపడ్డారు. -
'హరి హర వీరమల్లు'కు పవన్ రెమ్యునరేషన్
పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా జులై 24న థియేటర్స్లోకి వచ్చేసింది. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. అయితే, చాల పేలమైన కథ, మేకింగ్ విలువల వల్ల మొదటి ఆటతోనే డిజాస్టర్గా నిలిచిందని సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. సుమారు. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏంతమేరకు కలెక్షన్స్ రాబడుతుందో తెలియాల్సి ఉంది. అయితే, ఈ సినిమాకు పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ ఎంత అనేది ఆయన చెప్పారు.పవన్ కల్యాణ్ తన మునుపటి చిత్రం 'బ్రో' కోసం తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 50 కోట్లు అంటూ ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే, హరి హర వీరమల్లు చిత్రం కోసం ఆయన రూ. 20 కోట్ల లోపే తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, ఆ సినిమా విడుదలైన తర్వాత వచ్చే ఆదాయాన్ని బట్టి తన పారితోషికాన్ని పరిగణనలోకి తీసుకుంటానని ఇంటర్వ్యూలో పవన్ అన్నారు. కానీ, తాజాగా అందుతున్న మరో సమాచారం ప్రకారం.. రెమ్యునరేషన్తో పాటు సినిమా రన్ పూర్తి అయ్యాక నిర్మాతకు వచ్చే లాభాలను బట్టి మిగతా రెమ్యూనరేషన్ ఉంటుందని సమాచారం. అంటే సినిమాకు వచ్చే రెవెన్యూలో ఆయనకు షేర్ ఉంటుందని ముందే ఒక డీల్ ఉందట. అందుకే ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు వంటి అంశాలపై పవన్ ఎక్కువ శ్రద్ధ పెట్టారని అంటున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్, విశాఖపట్నంలో మీడియా సమావేశాలు నిర్వహించారు. ఇదంతా సొమ్ము చేసుకునే పనిలో భాగమేనని నెట్టింట టాక్. ఇందులో హీరోయిన్గా నటించిన నిధి అగర్వాల్ మాత్రం ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 2.5 కోట్ల వరకు తీసుకున్నట్లు ఇండస్ట్రీలో చెబుతున్నమాట. -
నోరు జారిన పవన్.. ఏపీకి సినిమా ఇండస్ట్రీ అవసరం లేదు
-
మామిడి పళ్ళు కిలో 4రూ.. హరిహరవీరమల్లు సినిమా టికెట్ 600
-
అంతా డూప్.. వీరమల్లు విరిగిన ముల్లు..
-
వరుసగా ఏడు ఫ్లాపులు.. ఒక్క టికెట్ కు రూ.700 లా?
-
పవన్ ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ల వద్ద పోలీసుల లాఠీచార్జ్!
సాక్షి, కృష్ణా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేశారు. ఈ సందర్భంగా పవన్.. ఫ్యాన్స్ రెచ్చిపోయారు. మచిలీపట్నంలోని రేవతి ధియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి థియేటర్ వద్ద రచ్చ రచ్చ చేశారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. వారిని కట్టడి చేయలేక పోలీసులు.. లాఠీలకు పని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియెలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మచిలీపట్నంలోని రేవతి ధియేటర్లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షోకి పరిమితికి మించి అభిమానులు థియేటర్కు వచ్చారు. దీంతో, పోలీసులు.. వారిని కట్టడి చేయలేకపోయారు. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తోసుకుంటూ థియేటర్లోకి చొచ్చుకొచ్చారు. దీంతో, థియేటర్ ఎంట్రన్స్ గేటు గ్లాస్ ధ్వంసమైంది. అంతటితో ఆగకుండా.. ఫ్యాన్స్ తోసుకుంటూ ఒకరిపై మరొకరు వాటర్ క్యాన్లతో దాడి చేసుకున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. లాఠీలకు పని చెప్పడంతో పరిస్థితి కొంత సర్దుమణిగింది.ఇక, కడప నగరంలోని రాజా థియేటర్ వద్ద కూడా పవన్ ఫాన్స్ హంగామా సృష్టించారు.. బైక్ సౌండ్స్తో రచ్చ రచ్చ చేశారు. బైకుల సైలెన్సర్లు తీసి నగరంలో బైక్ రైడింగ్తో హంగామా చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలుగా విడిపోయి ఫ్యాన్స్ కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు సర్దిచెప్పినా పవన్ ఫ్యాన్స్ వినిపించుకోలేదు. దీంతో, థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. సంధ్య థియేటర్ వద్ద భారీ బందోబస్తు..ఇదిలా ఉండగా.. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. థియేటర్ ముందు హంగామా చేశారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి అనుమతిస్తున్నారు. థియేటర్ లోపల కూడా పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. -
థియేటర్ లో పవన్ ఫ్యాన్స్ ఫైటింగ్..
-
Big Question: సంసారిలా ఊగిపోయిన చిట్టిమల్లు అసలు రంగు
-
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
టైటిల్: హరిహర వీరమల్లునటీటులు: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, సునీల్, నాజర్, రఘు బాబు తదితరులునిర్మాణ సంస్థ: మెగా సూర్య ప్రొడక్షన్స్నిర్మాత: ఎ. దయాకర్ రావుసమర్పణ: ఏఎం రత్నందర్శకత్వం: క్రిష్, జ్యోతికృష్ణసంగీతం: ఎంఎం కీరవాణిసినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంసవిడుదల తేది: జులై 24, 2025ఎట్టకేలకు హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ..నేడు(జులై 24) థియేటర్స్లో రిలీజైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఇది 16వ శాతాబ్దంలో జరిగే కథ. హరి హర వీరమల్లు (పవన్ కల్యాణ్) ఓ గజ దొంగ. ఉన్నవాళ్ల దగ్గర దోచుకొని లేని వాళ్లకు పంచేస్తుంటాడు. మొఘల్ సైన్యం తరలించుకుపోతున్న వజ్రాల్ని దొంగలించి చిన్న దొర(సచిన్ కేడ్కర్) దృష్టిలో పడతాడు. చిన్న దొర అతన్ని పిలుపించుకొని గోల్కొండ నవాబుకు పంపాల్సిన డైమాండ్స్ని దొంగిలించి తనకు ఇవ్వాలని కోరతాడు. దానికి బదులుగా రెండు వజ్రాలను ఇస్తానని ఒప్పందం చేసుకుంటాడు. వీరమల్లు మాత్రం వజ్రాలతో పాటు చిన్నదొర దగ్గర బంధీగా ఉన్న పంచమి(నిధి అగర్వాల్)ని విడిపించాలనుకుంటాడు. కానీ వీరమల్లు ప్లాన్ బెడిసి కొట్టి గొల్కొండ నవాబుకు బంధీగా దొరికిపోతాడు. వీరమల్లు నేపథ్యం తెలిసిన నవాబ్.. ఢిల్లీలోని ఎర్రకోటలో ఔరంగజేబు(బాబీ డియోల్) ఆధీనంలో ఉన్న కొహినూర్ వజ్రాన్ని వెనక్కి తెచ్చి ఇవ్వాలని కోరతాడు. వీరమల్లు తన స్నేహితులు(నాజర్, సునీల్, రఘు బాబు,సుబ్బరాజు)తో పాటు నవాబు మనుషులతో కలిసి ఢిల్లీకి పయనం అవుతాడు. వీరమల్లు ఢిల్లీ ప్రయాణం ఎలా సాగింది? ఈ జర్నీలో ఆయనకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు ఔరంగజేబు దగ్గర ఉన్న కొహినూర్ వజ్రాన్ని తీసుకురాగలిగాడా లేడా? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu Review) చిత్రంపై మొన్నటి వరకు పెద్ద అంచనాల్లేవు. ప్రచార చిత్రాలు చూసి ఫ్యాన్స్ సైతం ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై కాస్త బజ్ క్రియేట్ చేసింది. దానికి తోడు పవన్ కూడా తొలిసారి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో సినిమా బాగుందేమో అందుకే ఆయన రంగంలోకి దిగాడని ఫ్యాన్స్తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా భావించారు. కానీ వారి ఆశలపై వీరమల్లు నీళ్లు చల్లాడు. కథే రొటీన్ అంటే అంతకు మించిన అవుట్ డేటెడ్ స్క్రీన్ప్లేతో ఫ్యాన్స్కి సైతం ఇరిటేషన్ తెప్పించాడు. ఇక సీజీ వర్క్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఈ మధ్య చిన్న చిన్న సినిమాలలో కూడా వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. మరి స్టార్ హీరో, బడా నిర్మాత ఉండి కూడా గ్రాఫిక్స్ వర్క్ ఇంత పేలవంగా ఉండడానికి కారణం ఎవరో..? తెలియదు.గుర్రాల సీక్వెన్స్లతో పాటు క్లైమాక్స్లో వచ్చే సుడిగుండం సీన్ వరకు ప్రతీ చోట గ్రాఫిక్స్ టీం ఘోరంగా విఫలం అయింది. ఇక యాక్షన్ సీన్లు అయితే కొన్ని చోట్ల మరీ సిల్లీగా అనిపిస్తాయి. కథ కథనం విషయానికొస్తే.. అసలీ కథే గందరగోళంగా ఉంటుంది. ప్రేక్షకుడు ఏ ఎమోషన్కి కనెక్ట్ కావాలో అర్థం కాక.. అలా కుర్చీలో కూర్చిండిపోతాడు. హిందువులపై మొగల్ సైన్యం చేసిన అరచకాలకు సంబంధించిన సన్నివేశాలు ఇటీవల వచ్చిన ఛావా చిత్రాన్ని గుర్తు చేస్తాయి. వీరమల్లు పాత్ర ఫిక్షనల్ కాబట్టి కనీసం ఆ ఎమోషన్తో కూడా సరిగ్గా కనెక్ట్ కాలేం. ఇక వీరమల్లు చేసే దొంగతనాల సీన్స్ రాబిన్ హుడ్ పాత్రతో వచ్చిన పలు సినిమాలను పోలి ఉంటాయి. హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు మొదలు వార్ సీక్వెన్స్ అన్నీ బాహుబలి చిత్రాన్ని గుర్తు చేస్తాయి. కొన్ని చోట్ల మంచి సన్నివేశాలు ఉన్నా.. పేలవమైన సీజీ వర్క్ కారణంగా అవి కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఉన్నంతలో ఫస్టాఫ్ పర్వాలేదు. దర్శకుడు క్రిష్ కొన్ని సీన్లను బాగానే డీల్ చేశాడు. సెకండాఫ్ వచ్చే సరికే కథ ఎటో వెళ్లిపోయింది. పవన్ కోసమే అన్నట్లు కొన్ని సన్నివేశాలను బలవంతంగా ఇరికించడం.. ఆ ఇరికించిన సీన్లలో ఎమోషన్ సరిగా పండకపోవడంతో ద్వితియార్థం మొత్తంగా బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ ముందు వచ్చే సుడిగుండం సీన్ అయితే ప్రేక్షకుడి సనహానికి పరీక్ష పెడుతుంది. అసలు క్లైమాక్స్ సన్నివేశాన్ని అంతలా ఎందుకు సాగదీశారో అర్థం కాక.. హీటెక్కిన బుర్రతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. ఎవరెలా చేశారంటే..పవన్ కల్యాణ్ పాత్ర కొత్తగా ఉంది కానీ నటన పరంగా చేయడానికేమి లేదు. ఆయనకు ఎలివేషన్ ఇవ్వడమే తప్ప.. నటనతో మెప్పించాడానికి ఏమీ లేదు. కొన్ని యాక్షన్స్ సీన్స్ పరవాలేదు. చాలా వరకు డూప్తోనే కవర్ చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. నిధి అగర్వాల్ పాత్ర నిడివి తక్కువే అయినా... ఉన్నంతలో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఒకటి ఫస్టాఫ్కే హైలెట్ అని చెప్పొచ్చు. అయితే షూటింగ్ ఐదేళ్లుగా సాగింది కాబట్టి కొన్ని చోట్ల బొద్దుగా కనిపించింది.ఔరంగజేబుగా బాబీ డియోల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. చిన్న దొరగా సచిన్ ఖేడేకర్, పెద్ద దొర పాత్రలో కోట శ్రీనివాసరావు ఒకటి రెండు సీన్లలో కనిపించినా.. బాగానే నటించారు. రఘుబాబు, సునీల్, సుబ్బరాజ్, సత్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. కీరవాణి సంగీతమే ఈ సినిమాకు కాస్త ప్లస్ అయిందని చెప్పాలి. అయితే అదే బీజీఎం కొన్ని చోట్ల చిరాకుగానూ అనిపిస్తుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ ఫస్టాఫ్ వరకు పర్వాలేదు. సెకండాఫ్కి వచ్చేసరికి ఘోరంగా విఫలం అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. (గమనిక : ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే) -
‘హరి హర వీరమల్లు’ ట్విటర్ రివ్యూ
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘హరిహర వీరమల్లు: స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ నేడు(జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న అర్థరాత్రే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. అలాగే ఓవర్సీల్లోనూ ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. హరిహర వీరమల్లు కథేంటి..? పవన్ కల్యాణ్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.Stay strong thatha @AMRathnamOfl 🥲#HariHaraVeeeraMallu#DisasterHHVM pic.twitter.com/nlE8HfUCPP— Chintu Reddy (@CHINTUUU24) July 23, 2025 23 euros petti ocha, andar dengestunnar nen okkadne ee arachakam chudala? 😐lekapothe nen kuda dengestey money bokka ani baadapadala ardamkavatled #DisasterHHVM #HariHaraVeeeraMallu pic.twitter.com/o9FTUKVvk7— Single Groot (@aigroot0001) July 23, 2025 Horse Scenes Ee laptop Lone edit Chesaru Anukunta 🤣🤣Jyothi Krisna Em Direct Chesinav..Worst vfx in second half #hariharaveeramallu pic.twitter.com/SyOypIQTPh— News Telugu (@neduru_thiru) July 23, 2025 హరిహర వీరమల్లు చిత్రానికి ఎక్స్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే..బాగోలేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. సినిమాలోని వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. పవన్ గుర్రపు స్వారీ సన్నివేశాలపై పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అభిమానుల సైతం ఆట్టుకునేలా సినిమా లేదని కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. ఉన్నంతలో కాస్త ఫస్టాఫ్ చూడవచ్చని చెబుతున్నారు. సెకండాఫ్ మొత్తం చెడగొట్టారని, క్రిష్ ఎందుకు బయటకు వచ్చాడు ఇప్పుడు అర్థమైందని పలువురు నెటిజన్స్ సెటైరికల్ ట్వీట్స్ పెడుతున్నారు.#HariHaraVeeraMallu is a lackluster period action drama, weighed down by an outdated and incoherent screenplay, further hampered by subpar technical quality! The first half is somewhat tolerable and includes a few well-executed sequences, such as the introductory block and the…— Venky Reviews (@venkyreviews) July 23, 2025 హరిహర వీరమల్లు ఒక పేలవమైన పిరియాడికల్ యాక్షన్ డ్రామా. రొటీన్ స్క్రీన్ప్లే, టెక్నికల్గా చాలా పూర్గా ఉందంటూ ఓ నెటిజన్ కేవలం 2 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. జౌరంగజేబు, వీరమల్లు పేరుతో చరిత్రను వక్రీకరించి తీశారని కొందరు అంటున్నారు. వీరిద్దరి మధ్య చరిత్రలో కనీసం ఒక్క పేజీ కూడా ఉండదు. కానీ, ఇలా ఏకంగా సినిమా తీసి ప్రజలను తప్పుదారి పట్టించడమే కదా అంటూ తెలుపుతున్నారు.Nenu fan ne but aa graphics kosam aa ra 5y teesukunnaru hatsoff to krish🙏🙏Andhariki ante best ichindhi ante kreemdifferences endhuku vachayo ardham ayindhi.Story complete ga change chesi Padesaru 2nd half...1st half ayyaka movie hit ayipoyindhi anukunna #HariHaraVeeraMallu— loki (@loki88255310283) July 23, 2025 నేను పవన్ కల్యాణ్ అభిమానినే.కానీ ఆ గ్రాఫిక్స్ కోసం 5 ఏళ్లు తీసుకున్నారంటేనే బాధగా ఉంది. క్రిష్కి హ్యాట్సాఫ్. అందరి కంటే ఆయనే బెస్ట్ ఇచ్చాడు. ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు అర్థం అయింది. సెకండాఫ్ కథ మొత్తం మార్చిపడేశారు. ఫస్టాఫ్ అయ్యాక మూవీ హిట్ అనుకున్నా.. అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Very good first half Second half first 40 mins avrg Last 40 mins are good !! Keeravani’s score is the heart of the film 🔥🔥🔥🔥 Kusthi fight & pre climax fights stand out ,Songs are good Vfx is below par !! Overall a good film with bad vfx #HariHaraVeeraMallureview pic.twitter.com/OirpOZznM7— HHVM Vinny 🦅🔥 (@Vinny_tweetz) July 23, 2025 ఫస్టాఫ్ కాస్త పర్వాలేదనిపించినా.. సెకండాఫ్లో మన సహనానికి పరీక్ష పెట్టినట్లు ఉంది. అయితే, చివరి 30 నిమిషాలు ఫ్యాన్స్లో జోష్ నింపే ప్రయత్నం చేశారనిపించింది. కుస్తీ ఫైట్, ప్రీక్లైమాక్స్ యాక్షన్ సీన్ బాగుంది. పాటలు బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ పని తీరు దారుణంగా ఉంది. ఓవరాల్గా ఇది పేలవమైన వీఎఫ్ఎక్స్ ఉన్న మంచి సినిమా అంటూ మరో నెటిజన్ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.#HariHaraVeeraMallu Strictly Mediocre 1st Half! Apart from PKs presence, a few blocks came out well mainly the intro block from the title cards to PKs introduction sequence. Keervanis bgm is the lifeline so far. However, the screenplay has an outdated feel to it in many places.…— Venky Reviews (@venkyreviews) July 23, 2025 ఫస్టాఫ్ మాములుగానే ఉంది. పవన్ పాత్రతో పాటు, కొన్ని సన్నివేశాలు బాగా వచ్చాయి, ముఖ్యంగా టైటిల్ కార్డ్స్ నుండి పీకే పరిచయ సన్నివేశం వరకు బాగుంది. అయితే, స్క్రీన్ప్లే చాలా చోట్ల పాత అనుభూతిని కలిగిస్తుంది. వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉంది. చాలా పాత్రలకు సరైన లిప్ సింక్ లేదు. పవన్ పాత్ర డబ్బింగ్ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.VFX and CG are worst to the core 😤🤮🤣Ela ra asala ila, mari intha darunam ah 🫢🫣#HariHaraVeeraMalluPremiers #HHVM #hariharaveeramallu— Chay Reviews (@chay_reviews) July 23, 2025 -
చంద్రబాబు, పవన్కల్యాణ్పై మహిళల ఆగ్రహం
-
నిండు గర్భిణి అని కూడా చూడకుండా.. పోలీసులకు కంప్లైంట్ చేస్తే!?
-
అయ్యా చంద్రబాబు, బాధిత మహిళకు రక్షణ కల్పిస్తారా ?
-
హైకోర్టులో పవన్ కల్యాణ్ పరువు నష్టం కేసు
-
పవన్ ను ఓ రేంజ్ లో ఇమిటేట్ చేసిన బియ్యపు మధుసూదన్ రెడ్డి
-
KSR Live Show: రాజకీయ కట్టప్ప.. నాకు వాళ్లే ముఖ్యం
-
ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే.. ఆంధ్రాను అమ్మాలి
ఎన్నికలకు ముందు చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చాక మహా శక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 19 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ.. ఒక్కొక్కరికీ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం. – 2024 మార్చి 13న టీడీపీ ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్ పోర్టల్లో పేర్లు నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చంద్రబాబుఏరుదాటాక.. అచ్చెన్న ఆడవాళ్లకు నెలకు రూ.1,500 హామీని అమలు చేయాలంటే, ఆంధ్రానే అమ్మాలి. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి? పథకం ఎలా అమలు చేయాలి? అని ఆలోచన చేస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నారు. – విజయనగరం జిల్లా సభలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు‘ఇచ్చిన ప్రతి హామీకి క్యాలిక్యులేషన్ చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నాం. ఎలా అమలు చేయాలో తెలుసుకున్నాకే హామీ ఇచ్చాం. సూపర్ సిక్స్ వెరీ క్లియర్. ఇది మా ఎష్యూరెన్స్. పూర్తి చేస్తామని చెబుతున్నా. కెమేరాలు ఉన్నాయి. రికార్డు చేసుకోండి. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. చేయకపోతే ప్రజలకు కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా ఉంటుంది. –2023 డిసెంబరులో ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో నారా లోకేశ్‘వైఎస్సార్సీపీ నాయకులు అడుగుతున్నారు హామీలు ఎలా నిలబెట్టుకుంటారని...? అలాంటి వారందరికీ మీ లోకేశ్ ఒకటే సమాధానం ఇస్తున్నాడు. జగన్ అప్పుల అప్పారావు అయితే, మా చంద్రన్న సంపద సృష్టికర్త. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిసి మా చంద్రన్న మహాశక్తి ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా నాలుగు ప్రకటనలు ఉన్నాయి. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 వాళ్ల ఖాతాలో వేస్తున్నాం. సంవత్సరానికి రూ.18 వేలు. ఐదేళ్లు రూ.90 వేలను తెలుగింటి ఆడపచుల అకౌంట్లలో మన చంద్రన్న వేయబోతున్నాడు’ –2023లో ఓ బహిరంగ సభలో నారా లోకేశ్‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ... రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం’–ప్రజాగళం పేరుతో 2024 ఏప్రిల్ 30న చంద్రబాబుతో కలిసి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా అందులో పేర్కొన్న హామీల అమలుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.‘చంద్రబాబు–పవన్కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో ‘ప్రతి మహిళకు నెలకు రూ.1500’ (19 నుంచి 59 సంవత్సరాల వరకు) అని పేర్కొన్నారు. కానీ, ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు నుంచే... మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ‘19–59 సంవత్సరాల వరకు’ అన్నది కూడా లేకుండా, భవిష్యత్కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి ‘18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500’ అంటూ ప్రత్యేక కరపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ పంచుతూ ప్రచారం చేశారు’.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని ఇంటింటా బాండ్లు పంపిణీ చేసి.. తీరా గద్దెనెక్కాక చంద్రబాబు, కూటమి నేతలు మాట తప్పారు. సూపర్ సిక్స్ కింద మేనిఫెస్టోలో కూడా చేర్చి ఆ హామీ అమలు చేయకుండా మోసం చేశారు. తొలి ఏడాది రూ.32,400 కోట్లు ఎగ్గొట్టి అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు. ఈ ఏడాదైనా ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే ‘ఆంధ్రాను అమ్మితే తప్ప ఇవ్వలేం’ అని చేతులెత్తేశారు. ప్రభుత్వ మోసం కారణంగా ఒక్క ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలో మహిళలు గడిచిన 13 నెలల్లో ఏకంగా రూ.35,100 కోట్లు కోల్పోయారు. అధికారమే పరమావధిగా హామీల వర్షం కురిపించి.. ప్రజలను నమ్మించి.. గద్దెనెక్కాక వారిని నిలువునా మోసం చేయడంలో తనను మించిన వారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు చాటుకున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీకి చెందిన చిన్న, పెద్ద నాయకుల వరకు ప్రజల ఇళ్లకు వెళ్లి తమ ప్రభుత్వం వస్తే ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇచ్చేలా పథకం అమలు చేస్తారని ఊదరగొట్టారు. ‘గ్యారంటీ’ కార్డులను కూడా పంపిణీ చేశారు. తీరా 13 నెలల పాటు పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి.. ఇప్పుడేమో ఈ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రాన్నే అమ్మాల్సి ఉంటుందంటూ ప్రభుత్వంలోని కీలక మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం కూటమి మోసాలకు పరాకాష్టగా నిలిచింది. ఎగవేతపై 2 నెలల కిందటే బాబు సంకేతాలు⇒ ఆడ బిడ్డ నిధి హామీ అమలుపై సీఎం చంద్రబాబు పూర్తిగా చేతులేత్తేసినట్టే కనిపిస్తోంది. వాస్తవానికి రెండు నెలల కిందటే కర్నూలు బహిరంగ సభలో ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఆయన మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో పి–4 కార్యక్రమం ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తానని, అప్పటికీ పేదలు మిగిలితే అడ్డబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు పి–4కు అనుసంధానం చేసి మహిళల ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తానంటూ కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.⇒ అంటే 2029 వరకు ఈ పథకం అమలు ఉండదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలతో దీనికి మరింత బలం చేకూరుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి... ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం అనే ఉద్దేశం తప్ప... ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి లేదని వివరిస్తున్నారు. ఇందులోభాగంగానే హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు సాకులు మీద సాకులు వెదుక్కుంటున్నారని చెబుతున్నారు.మహిళలు నష్టపోయిన మొత్తం రూ.35,100 కోట్లు⇒ ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే వీరంతా 18 ఏళ్లు దాటినవారే. ఈ నేపథ్యంలో... టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు చెప్పిన హామీ ప్రకారం మొత్తం 2.10 కోట్ల మందికి ప్రభుత్వం ప్రతి నెల రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన దాదాపు 30 లక్షల మంది పెన్షనర్లను తీసేసినా రాష్ట్రంలో సుమారు 1.80 కోట్ల మంది ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులయ్యే అవకాశం ఉంది. వారికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున 13 నెలల కాలంలో మొత్తం రూ.35,100 కోట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.⇒ ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పటినుంచి అమలవుతుందా? అని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 13 నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఒక్కొక్క నెల ఆలస్యం అయ్యేకొద్దీ వారు కోల్పోతున్న మొత్తం పెరుగుతోంది. ఇలా గత 13 నెలల్లో రాష్ట్రంలోని పేద మహిళలందరూ నెలకు ఏకంగా రూ.2,700 కోట్ల చొప్పున ఇప్పటికి రూ.35,100 కోట్ల లబ్ధిని కోల్పోయారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన వైఎస్ జగన్కోవిడ్ వంటి మహమ్మారులు ఎదురైనా వెనక్కుతగ్గని వైనంమేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంత పవిత్రంగా భావించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారంటే.. కచ్చితంగా అమలు చేస్తామని నిరూపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి మహమ్మారులు, అనుకోని విపత్తులు వచ్చినా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కుతగ్గలేదు.2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును అపలేదు. కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన నవరత్న పథకాలను చూపిస్తూ.. ‘రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుందోంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దుష్ప్రచారం చేసింది. తీరా సరిగ్గా ఎన్నికల సమయానికి ప్రజలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు కూటమి హామీల వరద పారించింది. అధికారం దక్కాక మాత్రం వాటిని ఒక్కోటిగా పక్కనపెడుతోంది.కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా..! కూటమి ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను నట్టేట ముంచారు. ఆడబిడ్డ నిధి, బీసీ మహిళలకు 50 ఏళ్ల మహిళలకే పెన్షన్ ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేదని, రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ మంత్రులతో చెప్పిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా? – బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం ఇది మంచి ప్రభుత్వమా? ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం–సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత అమలు చేయలేమని వ్యాఖ్యలు చేయడం మీకు తగునా అచ్చెన్నాయుడు? ఇది మంచి ప్రభుత్వమా చంద్రబాబూ? – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం ముందుగా తెలియదా? కూటమి పార్టీలు అబద్ధపు హామీలు ఇచ్చాయని మరోమారు తేటతెల్లమైంది. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి హామీలు అమలు చేయగలమా లేదా అనేది ముందుగా తెలియదా? చేయలేమని తెలిసీ ఎందుకు హామీలు ఇచ్చారు? – ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎంమహిళలను నిలువునా మోసం చేశారు.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలనడం మహిళలను ఈ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసేందుకు కుట్రలు పన్నుతుందో తెలుస్తోంది. మొదటి ఏడాది ఎగ్గొట్టినా రెండో ఏడాది నుంచి అయినా ఇస్తారని చూస్తున్న మహిళల నోట్లో కూటమి మన్ను కొట్టింది. అధికార దాహంతో హామీలు గుప్పించారు. అమలు చేయలేక చేతకాని మాటలు మాట్లాడటం మహిళలను నిట్టనిలువునా మోసం చేయడమే. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్అబద్ధపు హామీలిచ్చారా? చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎన్నికల ముందు కళ్లు మూసుకుపోయిన అబద్ధపు హామీలు ఇచ్చారా? మీ మాటలు నమ్మి ఆడబిడ్డలు ఓట్లు వేశారు. వారిని మోసం చేసేందుకు చంద్రబాబే అచ్చెన్నాయుడు చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని అమ్మేస్తే కాని తీర్చలేని హామీలు మీకు ఎవరు ఇమ్మన్నారు? – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్సంపద సృష్టిస్తానని చేతులెత్తేశారు! ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలనకు చీతొలి అడుగుచీ అంటూ టీడీపీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు ఏమో సంపద సృష్టిస్తా.. పథకాలు అమలు చేస్తా అన్నారు. ఇప్పుడేమో మంత్రి అచ్చెన్నాయడు చీఆడబిడ్డ నిధిచీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలంటున్నారు. పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? – విడదల రజిని, మాజీ మంత్రి అడ్డమైన హామీలు ఇచ్చి మోసం చేస్తారా? సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలా? అలా మాట్లాడడానికి సిగ్గులేదా అచ్చెన్నాయుడు? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా? – ఆర్కే రోజా, మాజీ మంత్రి చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందే అని అచ్చెన్నాయుడు అనడం దారుణం. ఈ విషయం ఎన్నికలప్పుడు చంద్రబాబుకు తెలియదా? అమలు చేయలేని హామీలివ్వడం అంటే ప్రజలను మోసం చేయటమే కాదా? హామీలు అమలు చేయటంలో చేతులెత్తేసి మంత్రులతో ఇలా నిస్సిగ్గుగా మాట్లాడించడంతో చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి నిఘంటువులో కొత్త పదం వెతకాలి. ఆడబిడ్డ నిధి అమలుకు రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనని మంత్రి మాట్లాడటం మహిళలను అవమానపరచడమే. వాగ్దానాలు ఇచ్చినప్పుడు తెలియదా? ముఖ్యమంత్రి సంతకానికి ఉన్న విలువ ఇదేనా? కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు ప్రజలకు మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల ఆశలపై వెన్నుపోటు పొడిచారు. అచ్చెన్నాయుడు నోట మాట వచ్చిందంటే అది చంద్రబాబు మాటే. సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతామంటూ వివిధ నూతన విధానాల పేరుతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. కూటమి దగాకోరు మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు. – డాక్టర్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రిఅచ్చెన్నాయుడూ.. సిగ్గుండాలి రాష్ట్రాన్ని ఇప్పటికే అమ్మేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా ఏదో ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రాన్ని అమ్మాలని వ్యాఖ్యలు చేయడానికి అచ్చెన్నాయుడుకి సిగ్గుండాలి. ఏరు దాటాక తెడ్డు తగలేసే వైఖరి కూటమిది. ఆడబిడ్డలకు ఇస్తానన్న పథకాలను అమలు చేయకపోగా సిగ్గూఎగ్గూ లేకుండా రాష్ట్రాన్ని అమ్మాలని అనటం సబబు కాదు. మహిళలను వంచిస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. – అంబటి రాంబాబు, మాజీ మంత్రి హామీలు ఎందుకిచ్చారు? ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేస్తోంది. ఆడబిడ్డలకు ఈ ప్రభుత్వ అబద్ధపు హామీలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. అమలు చేయలేని హామీలు ఎందుకు ఇచ్చారో కూటమి నేతలు చెప్పాలి. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి నమ్మించి.. నయ వంచన.. ‘ఆడబిడ్డల కష్టాలు కళ్లారా చూశాను. ఆ కష్టాల నుంచి బయట పడేయడానికి ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చాం’ అని ఎన్నికల ముందు ప్రతి సభలో చంద్రబాబు ప్రచారం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ప్రతి నెలా రూ.1,500లు చొప్పున ఏడాదికి రూ.18000 ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నయవంచన చేశారు. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ ప్రజలను దగా చేసింది.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గు చేటు. అలవికాని హామీలిచ్చి టీడీపీ ప్రజలను నిలువుగా దగా చేసింది. ఓటు వేసినందుకు ప్రజలు టీడీపీని అసహ్యించుకుంటున్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. – పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ పథకాలకు ఎగనామం పెట్టేందుకే .. ఆడబిడ్డ నిధి సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఏపీనే తాకట్టు పెట్టాలని టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు అనడం ఆశ్చర్యకరంగా ఉంది. సంక్షేమ పథకాల హామీలకు ఎగనామం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. సూపర్ సిక్స్తో పాటు 143 హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. – కేకే రాజు, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడుప్రభుత్వ మెడలు వంచుతాం అలవిగాని హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారు. ఏడాదిలోనే రూ.1,87,000 కోట్ల అప్పులు చేశారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ నిజస్వరూపం బయటపడింది. చంద్రబాబు జీవితమంతా మోసపూరితం, కుట్రలే. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా పోరాటం చేస్తాం. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ప్రజలు ప్రభుత్వ భరతం పడతారుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందనే కనీస పరిజ్ఞానం కూడా కూటమి ప్రభుత్వానికి లేదు. రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని అమ్మినా చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయలేరు. బాబు ష్యూరీటీ, మోసం గ్యారెంటీ అని తేలిపోయింది. ప్రజలంతా ఈ ప్రభుత్వ భరతం పట్టడం ఖాయం. – ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాటపై నిలబడే ప్రభుత్వం కాదిది కూటమిది మాటపై నిలబడే ప్రభుత్వం కాదని తెలిసిపోయింది. మేనిఫెస్టోను అమలు చేయలేమని వారికి కూడా తెలుసు. అయినా ఎన్నికల్లో నీకు రూ.18వేలు, నీకు రూ.18వేలు అని మహిళందరికీ చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేసే కార్యక్రమంలో భాగంగానే అచ్చెన్నాయుడితో మాట్లాడించారు. – పి.రవీంద్రనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు మహిళలను మోసగించే ఎత్తుగడ మహిళలకు రూ.1,500 ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలా? మంత్రి అచ్చెన్నాయుడి మాటలు మహిళలను మోసగించే ఎత్తుగడ అని స్పష్టమవుతుంది. చంద్రబాబు జీవితమంతా ప్రజలను మోసగించడమే. అమలుకాని హామీలు ఇవ్వడం ఆ తరువాత వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. – ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు దమననీతికి నిదర్శనం. పథకం అమలుకు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటు. ఆడబిడ్డనిధిని అమలు చేయలేమని చేతులెత్తేయడం కూటమి పాలన దగా కోరుకు నిదర్శనం. – శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
పవన్ వ్యాఖ్యలు.. ట్రెండింగ్లో #BoycottHHVM
పవన్ కల్యాణ్ ప్రవర్తన వింతగా ఉంటుంది. సినిమాలు వేరు రాజకీయాలు వేరని ఆయనే చెబుతాడు. మళ్లీ ఆయనే సినిమా వేదికపై రాజకీయాలు, రాజకీయ వేదికలపై సినిమా విషయాలు మాట్లాడుతాడు. పవన్ ప్రవర్తనే ఇప్పుడు ఆయన సినిమాను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఆయన హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమాకు ఇప్పుడు నిరసన సెగ తగిలింది. పవన్ వ్యాఖ్యలతో విసుగెత్తిపోయిన వైఎస్సార్సీసీ అభిమానులకు తోడు అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా హరిహర వీరమల్లు సినిమాను బాయ్కాట్ చేయాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో #BoycottHHVM ట్యాగ్ ఇప్పుడు ట్విటర్లో ట్రెండింగ్గా మారింది.ఏం జరిగిదంటే..తాజాగా జరిగిన హరిహర వీరమల్లు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ రాజకీయాలు మాట్లాడారు. సినిమా గురించి చెప్పడం మరచి.. ‘గతంలో భీమ్లా నాయక్ సినిమా టికెట్ రూ.10-15 పెట్టిన నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. మన సత్తా ఏంటో చూపిద్దాం’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. దీనికి ఆజ్యం పోసేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఇప్పుడు ఇదే నిరసనకు దారి తీసింది. వైఎస్సార్సీపీ అభిమానులు పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సినిమాను బాయ్కాట్ చేస్తున్నారు. మేమే కాదు ..మాతో పాటు మరో 20-30 మందిని కూడా సినిమాను చూడనియ్యబోమంటూ #BoycottHHVM హ్యాష్ట్యాగ్తో ట్వీట్స్ చేస్తున్నారు.స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా..అభిమానం ఉంటే ఆ హీరో సినిమాలు చూడాలే తప్ప ఇతర హీరోల సినిమాలను నాశనం చేయకూడదు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఏ హీరోకైనా కాస్త పేరొస్తే చాలు.. ఆయన సినిమాను తొక్కేయాలని చూస్తారనే టాక్ టాలీవుడ్లో ఉంది. గతంలో బన్నీ, మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలపై ట్రోల్స్ చేశారు. పుష్ప 2 రిలీజ్ అప్పుడు అయితే అల్లు అర్జున్పై దారుణమైన కామెంట్స్ చేస్తూ.. సినిమాను బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఇతర హీరోల ఫ్యాన్స్ అన్నట్లు అందరి హీరోల సినిమాలను ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా పవన్ సినిమాపై పగ బట్టారు. తాము హరిహర వీరమల్లు సినిమాను చూడబోం అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ..తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు వైఎస్సార్సీపీ అభిమానులు, మరోవైపు స్టార్ హీరోల ప్యాన్స్ దెబ్బకి #BoycottHHVM హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది.అనవసరం గా కెలుక్కున్నారు రా సైనిక్స్..మీకు ర్యాంప్ ఆడిస్తున్నారు AA Army 🔥🔥🔥😂😂🔥🔥 #AAArmy #BoycottHHVM pic.twitter.com/JbrppHXqqk— నల్లపరెడ్డి 🔥🔥🔥 (@naveenk23021806) July 21, 2025Get ready to face trolls #HHVMమూవీస్ లో రాజకీయం చేయకండి రా అంటే వినరు అనుభవిస్తారు ఇప్పుడు చూస్తాం ఎలా ఆ మూవీ హిట్ అవుతుందో.....✊🏿✊🏿 గతం లో జరిగినది మర్చిపోయినట్టు ఉన్నారు ఈ సారి బాగా గుర్తుండిపోతుంది..... #BoycottHHVM#BoycottHHVM pic.twitter.com/SH7yvXWHFI— Aji (@AJAY83527762580) July 21, 2025ముందు నూయ్ వెనక గుయ్ అన్నటుంది చాలా రిస్క్లో పడ్డాడు @PawanKalyan 🫣🤭NTR FANS MINGUTHARU :::..🔥🔥MH & AA FANS THANTARU:::🔥🔥YSRCP FANS KINDA KOSTARU :::::ఎటు చూసినా కింద మీద వాయిస్తున్నారు 🔥🔥#BoycottHHVM #BoycottHHVM pic.twitter.com/2JXfcONayv— Aji (@AJAY83527762580) July 21, 2025#BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #pk🐕 pic.twitter.com/X2WNe3EFY0— Tony (@Youth4YSRCP) July 22, 2025Hero Evaru..............?Hero Name Cheppandi Ra Ayya .....?Hero Brahmanandam Antunnaru ..?Nijamena..........? 🤣🤣#BoycottHHVM pic.twitter.com/8VGiub64Ag— Lakshmi Reddy (@Lakshmired7313) July 22, 2025నిన్న మొన్నటి నుండి #BoycottHHVM అని మా వాళ్ళు అంటుంటే సరే అని లైట్ తీసుకున్న కానీ ఈరోజు కొంతమంది గాంజ నా కొడుకులు నా అన్న @ysjagan గురించి తప్పుగా మాట్లాడారు 🔥చూస్కుందాం బారాబర్ చూస్కుందాం 🔥🔥సినిమాని చూడాలి అనుకునేవాళ్ళను కూడా మీ అతితో నాశనం చేసుకుంటున్నారు 🤙#BoycottHHVM pic.twitter.com/uZTQOwhmoT— jagan__fan__kurnool (@darvesh_md25012) July 22, 2025సినిమా వాళ్ళు ఇంకా మారారా ??#HariHaraVeeraMallu ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి రాజకీయ విమర్శలు !!#BoycottHHVM అని పిలుపు ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా సైన్యం ….సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని ఎవడు ఈ సినిమా చూడడు అని శపధం !! pic.twitter.com/qAJzYhjj6f— cinee worldd (@Cinee_Worldd) July 21, 2025సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడతారా.. ముందు ముందు ఉంది రా మీకు జాతర..YCP boys.. HHVM is a disaster movie #BoycottHHVMpic.twitter.com/U2d1IoQjeb— 𝕁𝕦𝕤𝕥 𝔸𝕤𝕜𝕚𝕟𝕘 🇮🇳 (@JustAsking2_0) July 21, 2025నా దగ్గర డబ్బులు లేవు అని బీద అరుపులు అరిచి, వాడికున్న అలాగా ఫాన్స్ దగ్గర నుండి ఓపెనింగ్స్ రాబెట్టుకొని(తల్లి చెల్లి పెళ్ళాం దగ్గర పుస్తులు తాకట్టు పెట్టి మరీ కొంటారు పిచ్చి నా) నెక్స్ట్ మూవీకి ఎక్సట్రా పేమెంట్ అడుగుతాడు.ఇది బుర్ర తక్కువ వెధవలికి అర్ధం కాదు🤣😂.#BoycottHHVM pic.twitter.com/Rxs0Wfd1xh— గంగ పుత్రుడు (@bheesmudu) July 22, 2025సినిమా టికెట్ ధర పెంచి గర్వంగా చెప్పుకోవడం కాదు...💦💦💦దమ్మూ ధైర్యం ఉంటే రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి గర్వంగా చెప్పుకోండి... #BoycottHHVM pic.twitter.com/IZ3Oa93n6j— Ayyapa Reddy (@YSJaganMarkGove) July 22, 2025Get ready to face trolls #HHVMమూవీస్ లో రాజకీయం చేయకండి రా అంటే వినరు అనుభవిస్తారు ఇప్పుడు చూస్తాం ఎలా ఆ మూవీ హిట్ అవుతుందో.....✊🏿✊🏿 గతం లో జరిగినది మర్చిపోయినట్టు ఉన్నారు ఈ సారి బాగా గుర్తుండిపోతుంది..... #BoycottHHVM#BoycottHHVM pic.twitter.com/SH7yvXWHFI— Aji (@AJAY83527762580) July 21, 2025 -
నిధీని చూసి సిగ్గు తెచ్చుకొని ప్రమోషన్స్లో పాల్గొంటున్నా: పవన్ కల్యాణ్
‘‘హరిహర వీరమల్లు’(Hari Hara Veeramallu Movie) సినిమా క్రిష్గారి వల్ల నా దగ్గరకు వచ్చింది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల ఆయన మధ్యలో వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆయన తర్వాత జ్యోతికృష్ణ ఈ సినిమాను హ్యాండిల్ చేశారు. ఇక నేను డిప్యూటీని సీయంని కావొచ్చు. కానీ ఈ సినిమాకు హీరోని. నిధీ అగర్వాల్గారు యాక్టివ్గా ఈ సినిమా ప్రమోషన్ చేయడం చూసి, సిగ్గు తెచ్చుకుని నేను మీడియా ఇంట్రాక్షన్లో పాల్గొంటున్నాను’’ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హీరో పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఏపీ మంత్రి కందుల దుర్గేష్, కర్ణాటక మంత్రి కె. ఈశ్వర్ ముఖ్య అతిథులుగా ΄ాల్గొని, ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఇంకా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘హరిహర వీరమల్లు’ అనేది కల్పిత పాత్ర. విజయవాడ దగ్గరలోని కొల్లూరు దగ్గర్లో లభించిన కోహినూర్ వజ్రం నిజాం నవాబు దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత మొఘలులకు వెళ్లి, ఫైనల్గా... ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని క్రిష్గారు కథ చెప్పారు. మా చేతుల్లో ఉన్నది ది బెస్ట్ ఇవ్వడం. అది చేశాం. మీకు (అభిమానులు, ప్రేక్షకులు) నచ్చిందా బద్దలు కొట్టేయండి’’ అన్నారు. ‘‘మేమెంతో కష్టపడి తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు దయాకర్ రావు. ‘‘1684 నుంచి ‘హరిహర వీరమల్లు’ కథ మొదలవుతుంది’’ అని అన్నారు జ్యోతికృష్ణ. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, కీరవాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆయ్న గాలి ఆయ్నే తీసుకున్న పవను
-
ఎట్టకేలకు స్పందించిన డైరెక్టర్ క్రిష్
'హరిహర వీరమల్లు' మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలోనే డైరెక్టర్ క్రిష్ ఎక్కడా కనిపించలేదు. సినిమాని మొదలుపెట్టి, చాలావరకు షూటింగ్ చేసింది ఈయనే. తర్వాత పలు కారణాల వల్ల తప్పుకొన్నాడు. మూవీ రిలీజ్ దగ్గరవుతున్నా క్రిష్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తలో మాట అనుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో క్రిష్ ట్వీట్ చేశాడు.(ఇదీ చదవండి: 'పుష్ప' ఘటన తరువాత మళ్లీ 'హరిహర..' కోసం బెనిఫిట్ షోలు)అంతకు ముందు నిర్మాత ఏఎం రత్నం కావొచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ కావొచ్చు.. క్రిష్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 'హరిహర వీరమల్లు' గురించి సరిగ్గా రిలీజ్కి రెండు రోజుల ముందు క్రిష్ ట్వీట్ చేశారు. 'ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా ఓ చరిత్ర పరిశోధకుడిగా, నమ్మలేని నిజాల్ని తవ్వితీసే సాధకుడిలా, ఓ ప్రపంచాన్ని నిర్మించాలన్న కలతో ముందగుడు వేసేవాడిగా, వినోదాన్ని, విజ్ఞానాన్ని సమకూర్చే సినిమా మీద నమ్మకం ఉన్నవాడిగా నాకో పెద్ద యుద్దాన్నే పరిచయం చేసింది' అని రాసుకొచ్చారు.అలానే హీరో, నిర్మాతకు కూడా క్రిష్.. తన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరికి తప్పితే తన తర్వాత మిగిలిన పార్ట్ అంతా తీసిన జ్యోతికృష్ణకు గానీ, మిగిలిన టీమ్ గురించి గానీ క్రిష్ ఎక్కడా ప్రస్తావించలేదు. ఏదైతేనేం ఇన్నాళ్లు సైలెంట్గా ఉండటంతో క్రిష్, టీమ్ మధ్య ఏమైనా ఉందేమోనని అంతా అనుకున్నారు. ఇప్పుడు ట్వీట్ చేయడంతో అలాంటివేం లేవని ఓ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: Hari Hara Veera Mallu: మీడియా ప్రతినిధులపై పోలీసుల దురుసు ప్రవర్తన) -
Hari Hara Veera Mallu: మీడియా ప్రతినిధులపై పోలీసుల దురుసు ప్రవర్తన
హైదరాబాద్: మాదాపూర్లోని శిల్పకళావేదికలో సోమవారం జరిగిన హరిహరి వీరమల్లు ప్రీ లాంచ్ కార్యక్రమానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడమేగాక లాఠీచార్జ్ చేశారు. వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తుండగా దానిని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై మాదాపూర్ అడిషనల్ డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు వైఖరిపై రంగారెడ్డి జిల్లా ఎల్రక్టానిక్ మీడియా జాయింట్ సెక్రటరీ మహమ్మద్ షకిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
'పుష్ప' ఘటన తరువాత మళ్లీ బెనిఫిట్ షోలు..
తెలంగాణలో ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని, సినిమా టికెట్ల ధరలూ పెంచబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' కోసం తెలంగాణ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. గతేడాది డిసెంబర్లో విడుదలైన 'పుష్ప2' బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ కూడా జీవచ్ఛవంలా ఉన్నాడు. ఆ సమయంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పుష్ప2 ఘటన తర్వాత అల్లు అర్జున్పై చాలా తీవ్రంగా ట్రోల్కు గురయ్యాడు. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు అతనిపై విరుచుకపడ్డారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు. 'ఇకపై తెలంగాణలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవు. నేను సీఎంగా ఉన్నంత కాలం ఎట్టిపరిస్థితిలో అనుమతి ఇచ్చేది లేదు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం సినిమా వాళ్ల ఆటలు సాగనివ్వను. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండి. కానీ, మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకునేది లేదు. చట్టం అందరికీ ఒక్కటే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.' సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడు వీరమల్లు కోసం తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంపు, బెనిఫిట్ షోల కోసం అనుమతి ఇచ్చేయడం పెద్ద హాట్టాపిక్గా మారింది.రోహిన్ రెడ్డి వల్లే టికెట్లకు హైక్ వచ్చింది: ఏఎం రత్నంతెలంగాణలో 'హరిహర వీరమల్లు' సినిమాకు టికెట్ ధరలు పెంపు, బెనిఫిట్ షో రావడం పై నిర్మాత ఏఎం రత్నం పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రీసెంట్గా జరిగిన ఘటన (పుష్ప2) వల్ల తమకు మొదట రేట్లు ఇవ్వలేదని అన్నారు. 'రోహిన్ రెడ్డి వల్ల మా సినిమా టికెట్ హైక్కు అనుమతి వచ్చింది. ఆయన వల్లే బెనిఫిట్ షో కూడా వచ్చేసింది.' అన్నారు. రోహిన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నేత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడిగా ఉంటారని గుర్తింపు ఉంది. 2023లో అంబర్ పేట నుంచి పోటీ చేసిన ఓడిపోయారు. గతంలో ఆయన నిర్మాతగా సాయి ధరమ్ తేజ్తో 'తిక్క' అనే సినిమాను నిర్మించారు.తెలంగాణలో బెనిఫిట్ పొందిన రీసెంట్ చిత్రాల ధరలు ఇలా..కల్కి 2898 ఏ.డీసింగిల్ స్క్రీన్ 265/-మల్టీప్లెక్స్ 413/-దేవరసింగిల్ స్క్రీన్ 295/-మల్టీప్లెక్స్ 413/-పుష్ప2సింగిల్ స్క్రీన్ 354/-మల్టీప్లెక్స్ 531/-గేమ్ ఛేంజర్సింగిల్ స్క్రీన్ 277/-మల్టీప్లెక్స్ 445/-హరిహర వీరమల్లుసింగిల్ స్క్రీన్ 354/-మల్టీప్లెక్స్ 531/-జులై 23న రాత్రి 9గంటలకు ప్రీమియర్ షో.. టికెట్ ధర: రూ.600+ జీఎస్టీరేవంత్ రెడ్డి దోస్త్ వల్ల తెలంగాణలో సినిమా టికెట్ హైక్ అనుమతి వచ్చిందిఅల్లు అర్జున్ తొక్కిసలాట ఘటన తరువాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వదు అనుకున్నాంరేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి ద్వారా మాకు టికెట్ హైక్, ప్రీమియర్ షో లకు అనుమతి వచ్చింది https://t.co/sHu3NXTxPt pic.twitter.com/LizKBQtOwA— Telugu Scribe (@TeluguScribe) July 21, 2025 -
పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు.. తెలంగాణలోనూ భారీగా టికెట్ ధరల పెంపు!
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న హరిహర వీరమల్లు చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. టికెట్ ధరలతో పాటు ఈనెల 23 ప్రత్యేక బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంపునకు ఆమోదం తెలిపింది. ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 600 వరకు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అంతే కాకుండా ఈ నెల 24 నుంచి 27 వరకు ఐదు ఆటలు ప్రదర్శించుకోడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి రోజు నుంచే మల్టీప్లెక్స్ల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో రూ.150 టికెట్ ధరలు పెంచుకునేందుకునేలా వెసులుబాటు కల్పించింది. అలాగే జులై 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీఫ్లెక్స్ల్లో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.106 పెంచుకునేలా అనుమతులు జారీ చేసింది. పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత మళ్లీ హరి హార విరమల్లు సినిమాకి ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం గమనార్హం. అయితే గతంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఏపీలోనూ భారీగా ధరల పెంపు..ఏపీలోలోనూ గత ప్రభుత్వంలో బెనిఫిట్ షోలు రద్దు చేయగా.. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' కోసం మళ్లీ వాటిని తీసుకొచ్చారు. 23న అంటే విడుదలకు ముందు రోజు రాత్రి 9 గంటల ప్రీమియర్ షోలకు అనుమతించారు. ఈ షోకి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్ల్లో అయితే ఏకంగా రూ.200 పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల పాటు రేట్ల పెంపు అమల్లో ఉండనుంది. 'హరిహర వీరమల్లు' సినిమా దాదాపు ఐదేళ్లపాటు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ తీశారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్ విలన్. తొలుత క్రిష్ డైరెక్టర్ కాగా.. మధ్యలో ఆయన తప్పుకొన్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. ఆయన మిగతా అంతా పూర్తి చేశారు. -
పంచాయతీలను నాశనం చేశారు పవన్ కళ్యాణపై సర్పంచులు ఫైర్
-
రాయుడు హత్య కేసులో పవన్ మౌనం వెనుక..
-
కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువ: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకొన్నారు. టాలీవుడ్లో చాలామంది హీరోల్లో తను ఒకడినే తప్ప పెద్ద గొప్పేం కాదని చెప్పారు. ఇంకా చెప్పాలంటే కొందరు హీరోలతో పోలిస్తే తాను చాలా తక్కువని కూడా అన్నారు. ఈయన నటించిన 'హరిహర వీరమల్లు'.. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకొంది. ఫైనల్గా జూలై 24న అంటే ఈ వీకెండ్ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా పవన్ మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్లో ఈ రోజు ఉదయం ప్రెస్మీట్లో పాల్గొన్నారు.(ఇదీ చదవండి: 'వీరమల్లు' నిర్మాతకు కీలక పదవి.. పవన్ కల్యాణ్ ప్రకటన)ఇందులోనే మాట్లాడిన పవన్.. 'రాజకీయంగా నాకు పేరుండొచ్చు. దేశవ్యాప్తంగా నేను తెలుసుండొచ్చు కానీ సినిమాల పరంగా చూస్తే కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువనే. దానికుండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్లకు బిజినెస్ అయినంతగా నాకు బిజినెస్ అవ్వదు. వాళ్లకు వచ్చినంతగా నాకు కలెక్షన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి ఎప్పుడూ నేను సినిమాలపై పెట్టలేదు' అని చెప్పుకొచ్చారు.మరో సందర్భంలో మాట్లాడుతూ.. 'నువ్వు చిరంజీవి తమ్ముడైనా, కొడుకైనా.. చివరికి నా కొడుకైనా టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడలేం' అని ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. పవన్ చెప్పడం వరకు బాగానే ఉంది కానీ ఆయన అభిమానులకు ఇది చెవికెక్కుతుందా అనేది చూడాలి. ఎందుకంటే మా హీరో స్టార్, సూపర్స్టార్ అని ఇతర హీరోల అభిమానులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. ఇప్పటికైనా వాళ్లు అర్థం చేసుకుని మారతారా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'ఫిష్ వెంకట్'కు ఎందుకు సాయం చేయాలి: నట్టి కుమార్) -
'వీరమల్లు' నిర్మాతకు కీలక పదవి.. ప్రకటించిన పవన్ కల్యాణ్
పవన్కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ చిత్రాన్ని క్రిష్, జ్యోతికృష్ణ దర్శకులు సంయుక్తంగా తెరకెక్కించారు. ఏఎం రత్నం నిర్మించారు. జులై 24న విడుదల సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ స్పెషల్ ప్రెస్మీట్ నిర్వహించింది. అక్కడ నిర్మాతకు పవన్ కల్యాణ్ బంపరాఫర్ ప్రకటించారు.నిర్మాత ఏఎం రత్నంను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించనున్నట్లు కొద్దిరోజుల క్రితం నుంచే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే విషయం గురించి పవన్ కల్యాణ్ ఇలా స్పందించారు. 'నాకు ఇష్టమైన నిర్మాత ఏఎం రత్నం. తెలుగు పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తి. ఆయనకు ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఈ క్రమంలోనే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఏఎం రత్నం పేరును ప్రతిపాదించాను. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా చెప్పాను. నా నిర్మాత అని మాత్రమే ఆయనకు ఈ పదవి ఇవ్వడం లేదు. అందరి హీరోలతో సినిమాలు చేశాడు. పాన్ ఇండియాలో కూడా ఏఎం రత్నానికి పరిచయాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఉంటే పరిశ్రమ ఇంకా బాగుంటుంది. నా పరిధిలో ఉన్న శాఖ కాబట్టి ఏఎం రత్నం పేరును ప్రతిపాదించాను. భవిష్యత్లో అవుతుందని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు. -
సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు
సందర్భాన్ని బట్టి తన అవసరాన్ని బట్టి మాటలు మార్చడం ప్రజలను ఏ మార్చడంలో పవన్ కళ్యాణ్ను మించిన వాళ్లు లేరని మరో మారు రుజువైంది. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో ఎన్నో మార్లు నాటి వైఎస్ జగన్పై చెలరేగిపోయారు. సమయం సందర్భం లేకుండా గంగవెర్రులెత్తిపోయారు ..ఏయ్ జగన్ అంటూ ఊగిపోయారు.అసలు ప్రైవేట్ వ్యక్తులు నిర్మించే సినిమాలకు సంబంధించి టికెట్లు ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది అంటూ నిలదీశారు... తన సినిమాలకు సంబంధించి అవసరమైతే ప్రజలకి ఫ్రీ షో చూపిస్తానని టికెట్ల ధరల కోసం ప్రభుత్వం దగ్గరకు వెళ్లేది లేదని డైలాగులు కొట్టారు.మొత్తానికి ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక హరిహర వీరమల్లు సినిమా రిలీజుకు వచ్చింది. దాదాపు ఐదేళ్లు క్రితం షూటింగ్ మొదలైన ఈ చిత్రం అపుడపుడూ షూటింగ్ చేసుకుంటూ మొత్తానికి ఆమధ్య నిర్మాణం పూర్తి చేసుకుంది. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ ఆ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.. మొత్తానికి రిలీజ్ డేట్ వచ్చేసరికి పవన్లోని ఆర్థిక అవకాశవాది బయటకు వచ్చాడు.అవసరం అయితే తాను ఫ్రీగా సినిమా చూపిస్తాను అంటూ గతంలో కొట్టిన డైలాగులు కొండెక్కించిన పవన్ ఇప్పుడు వ్యాపారి రూపంలోకి వచ్చారు. నిర్మాత ఏఎం రత్నం నుంచి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న పవన్ ఆయనకు లబ్ది చేకూర్చేందుకు టికెట్ల ధరలు పెంచేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీంతో ఈమేరకు టికెట్ ధరలు పెరిగాయి.ఇందులో భాగంగాజూలై 23న వేసే ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్స్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ.600లుగా నిర్ణయించారు. ఆపై జీఎస్టీ అదనం. రాత్రి 9:00 గంటలకు ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు. మరోవైపు 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్,మల్టీఫ్లెక్స్ ధరలను కూడా పెంచారు. లోయర్ క్లాస్లో రూ.100, అప్పర్ క్లాస్లో రూ.150, మల్టీ ప్లెక్స్ లో రూ.200 వరకు టికెట్ ఛార్జీలను పెంచుకునే అవకాశం కల్పించారు. అవతలివాళ్లకు వచ్చేసరికి బోలెడు రూల్స్ మాట్లాడే పవన్ ఇప్పుడు తనవరకు వచ్చేసరికి ఆర్థికలాభం మాత్రమే చూసుకుంటున్నారు అని ప్రజలు భావిస్తున్నారు. ఆయన మాటలకు. చేతలకు మధ్య చాలా తేడా ఉంటుందని మరోమారు స్పష్టమైంది* సిమ్మాదిరప్పన్న -
డైరెక్టర్ క్రిష్ లేకుండానే మేకింగ్ వీడియో
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మరో వారంలో రిలీజ్ కానుంది. అయినాసరే అనుకున్నంతగా హైప్ రావట్లేదు. దీంతో పెట్టిన బడ్జెట్ రికవరీ కోసమో ఏమో గానీ ఏపీ ప్రభుత్వం నుంచి భారీగా టికెట్ రేట్ల పెంపు తెచ్చుకున్నారు. ఈ మేరకు జీవో కూడా వచ్చింది. తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే ఓ సందేహం కలుగుతోంది. అటు ప్రమోషన్లలో గానీ ఇటు మేకింగ్ వీడియోలోని గానీ ఒకటి మిస్ అవుతోంది. అదే క్రిష్.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా)'హరిహర వీరమల్లు' నిర్మించింది ఏఎం రత్నం కావొచ్చు, హీరోగా చేసింది పవన్ కల్యాణ్ కావొచ్చు. కానీ ఈ సినిమా తీయడానినికి మూలకారణం క్రిష్. కొన్నాళ్ల పాటు మూవీ టీమ్తో పాటు ట్రావెల్ చేసిన ఈయన.. ప్రాజెక్ట్ మరీ ఆలస్యం అవుతుండేసరికి అనివార్య కారణాలతో తప్పుకొన్నారు. అనంతరం నిర్మాత కొడుకైన జ్యోతికృష్ణ.. మిగిలిన పార్ట్ అంతా దర్శకత్వం వహించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్లలో క్రిష్ ఏ మాత్రం కనిపించట్లేదు. సరే ఇది పక్కనబెడితే.. తాజాగా మేకింగ్ వీడియోలోనూ క్రిష్ ఒక్కటంటే ఒక్క షాట్లోనూ లేరు.మేకింగ్ వీడియోలో క్రిష్ లేకపోవడానికి కారణమేంటి అనేది మూవీ టీమ్కే తెలియాలి. పవన్తో పాటు ప్రధాన తారాగణం అంతా కనిపించాడు. చెప్పాలంటే పవన్తో పాటు జ్యోతికృష్ణ ఎక్కువగా కనిపించారు. త్రివిక్రమ్ కూడా కనిపించారు గానీ క్రిష్కి ఇందులో చోటు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డైరెక్షన్ క్రెడిట్ మాత్రం క్రిష్తో పాటు జ్యోతికృష్ణ పంచుకున్నారు. మూవీ రిలీజ్ తర్వాత అయినా సరే క్రిష్ మీడియా ముందుకొస్తారా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు'.. ఏపీలో భారీగా టికెట్ రేట్ల పెంపు)