The Paradise Movie
-
నాని ది ప్యారడైజ్పై రూమర్స్.. మేకర్స్ రియాక్షన్..!
దసరా బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్తో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్, ఆయా షేర్ పాట ఫ్యాన్స్ను అలరించాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. సుబ్బలక్ష్మి పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఈ మూవీలో జడల్ పాత్రలో హీరో నాని అలరించనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ చిత్రంపై ఇటీవల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్కు హీరో నాని రీ షూట్ కోరాడని సోషల్ మీడియాలో వైరలైంది. కొన్ని సన్నివేశాలతో నాని పూర్తిగా సంతృప్తి చెందలేదని.. అందుకే దర్శకుడు ఓదెలను రీ షూట్ చేయాలని కోరినట్లు పెద్దఎత్తున టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ మేకర్స్ స్పందించారు.రీ షూట్ వార్తలపై టీమ్ క్లారిటీ..ది ప్యారడైజ్ మూవీని ఎలాంటి రీ షూట్ చేయడం లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా మా సినిమాకు సంబంధించి నిరాధారమైన, బాధ్యతారహితమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయని అన్నారు. అంతా మేము అనుకున్న విధంగానే ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రణాళిక ప్రకారం జరుగుతోందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.దయచేసి సోషల్ మీడియాలో వచ్చే రీ షూట్ లాంటి వార్తలు ఎవరు నమ్మవద్దని మూవీ టీమ్ కోరింది. మా అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని.. ఏదైనా ఉంటే మేమే నేరుగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అవాస్తవ కథనాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో విలన్ శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 21న థియేటర్లలో సందడి చేయనుంది.Over the past few days, we’ve noticed several baseless rumors and irresponsible speculations being circulated about #TheParadise.For clarity:• #TheParadise was planned with absolute clarity from day one, and the film is progressing exactly as intended. Over 100 shooting days… https://t.co/kjP8VpgV9x— THE PARADISE (@TheParadiseOffl) May 12, 2026 -
విసుగెత్తిస్తున్న 'వాయిదాలు'.. దీనికి పరిష్కారం లేదా?
ఏదైనా పని ఫలానా సమయానికల్లా పూర్తి చేస్తానని చెప్పి.. చేయకపోతే ఎలా ఉంటుంది? కచ్చితంగా కోపం వస్తుంది. ఒకవేళ ఇలా రెండు మూడుసార్లు జరిగితే నిజంగా పని పూర్తయినా సరే చేయలేదేమో అనే అనుమానం కలుగుతుంది. అలానే పని ఫెర్ఫెక్ట్గా చేసినా ఇంప్రెసివ్గా అనిపించకపోవచ్చు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తెలుగులో కొన్ని సినిమాల పరిస్థితి ఇలానే తయారైంది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రేక్షకులకే చిరాకు తెప్పిస్తున్నారు. దీనికి కారణమేంటి? పరిష్కారం లేదా?(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ అంటే ప్రతిఒక్కరూ కమిట్మెంట్లా ఫీలయ్యేవారు. ఒకవేళ చెప్పిన తేదీకి రిలీజ్ చేయకపోతే నెగిటివ్ సెంటిమెంట్లా భావించేవారు. కానీ ఇప్పుడు వాయిదాలు అనేవి చాలా సాధారణం అయిపోయాయి. టెక్నికల్ అంశాల వల్ల ఇలా చేస్తున్నామని దాదాపు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కరోనా టైంలో షూటింగ్స్ సరిగా నడవక ఈ వాయిదాల పర్వం మొదలైంది. తర్వాత కరోనా వెళ్లిపోయింది గానీ వాయిదాలు మాత్రం అలానే ఉండిపోయాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ సరైన్ ప్లానింగ్ లేకపోవడంతో షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడం తదితర అంశాలు విడుదల తేదీలని పదేపదే మార్చేందుకు కారణమవుతున్నాయి. కొన్ని సినిమాలైతే అంతా సిద్ధమైపోయినా సరే ఎందుకో వాయిదా వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)గతం గురించి అక్కర్లేదు. టాలీవుడ్లో ప్రస్తుత పరిస్థితి ఓసారి చూసుకుంటే.. రామ్ చరణ్ 'పెద్ది'ని తొలుత మార్చి 27న రిలీజ్ చేస్తామని అన్నారు. ఆపై ఏప్రిల్ 30 అన్నారు. ఇప్పుడేమో జూన్లో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రాన్ని తొలుత మే 01న రిలీజ్ అని ప్రకటించారు. 'పెద్ది' కారణంగా జూన్ 26కి వాయిదా వేశారు. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీని లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్లో రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం వెల్లడించారు. తీరా చూస్తే ఏకంగా ఏడాది వాయిదా వేసి వచ్చే జూన్ అని పోస్టర్ వదిలారు. కన్నడ డబ్బింగ్ చిత్రం 'టాక్సిక్' అయితే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.సరే పైన చెప్పినవన్నీ స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ షెడ్యూల్స్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి వల్ల ఆలస్యమైందిలే అనుకోవచ్చు. కానీ సమంత లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం'ని మే 15 నుంచి జూన్ 4కి మార్చారని టాక్ వినిపిస్తోంది. నిఖిల్ చేసిన పీరియాడిక్ మూవీ 'స్వయంభు' అయితే ఫిబ్రవరి నుంచి అప్పుడు ఇప్పుడు అని చెబుతున్నారు గానీ రిలీజ్ డేట్ ప్రకటించలేకపోతున్నారు. నాని 'ప్యారడైజ్' అయితే తొలుత మార్చి అన్నారు. తర్వాత ఆగస్టు అన్నారు. ఇప్పుడసలు ఈ ఏడాది రాకపోవచ్చని అంటున్నారు. సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' అయితే అనుకున్న బడ్జెట్ దాటేసిందని, షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిందని అంటున్నారు. ఎప్పుడో విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: సత్య 'జెట్లీ' సినిమా రివ్యూ)ఇలా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పోతే సదరు సినిమాలపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడిపోతుంది. థియేటర్కి వెళ్లి చూసిన తర్వాత నచ్చితే పర్లేదు. ఒకవేళ అలా కాకపోతే మాత్రం ఇంతోటి దానికి ఇన్ని వాయిదాలు వేశారా అని ముఖం మీదే అనేస్తారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇది కేవలం ఆ ఒక్క సినిమాపైనే ప్రభావం చూపడం కాదు. మొత్తం టాలీవుడ్ వ్యవస్థ నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అదే జరిగితే తెలుగు ప్రేక్షకుడు ఇంకా థియేటర్కి దూరమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉండొచ్చు. స్టార్ హీరోల చిత్రాల్ని ప్రకటించేటప్పుడు ఆర్భాటంగా డేట్స్ కూడా ప్రకటించేయకుండా ఔట్పుట్ రెడీ అయిన దానిబట్టి విడుదల తేదీపై క్లారిటీ ఇస్తే బెటర్. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాలకు ఒకేరోజు లీకుల షాక్
టాలీవుడ్ అభిమానులు రెండు భారీ బడ్జెట్ సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది', నాని 'ది ప్యారడైజ్' ఈ రెండు చిత్రాలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఒకేరోజు ఈ రెండు సినిమాల షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని వీడియో క్లిప్ప్ లీక్ అయ్యాయి. దీంతో మేకర్స్ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు బుచ్చిబాబు ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. జూన్ 25న పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నామని బుచ్చిబాబు అన్నారు. హైదరాబాద్లో వేసిన ఒక సెట్స్లో పెద్ది ఐటెమ్ సాంగ్ జరుగుతుంది. తాజాగా రామ్ చరణ్, శ్రుతి హాసన్ డ్యాన్స్ క్లిప్పింగ్స్ షూటింగ్ ప్రదేశం నుంచి లీక్ అయ్యాయి. పెద్ది ఐటెమ్ సాంగ్పై భారీ క్రేజ్ ఉంది. ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్లో...’ అంటూ మహేష్ బాబుతో స్టెప్పులు వేసిన శ్రుతి హాసన్.. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి ఐటెమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్లో క్రేజ్ను పెంచారు.నాని 'ది ప్యారడైజ్' నుంచి కూడా ఒక ఒక ఫైట్ సీన్ లీక్ అయింది. ఇలా రెండు భారీ సినిమాల నుంచి కొన్ని వీడియోలు లీక్ కావడంతో అభిమానులలో ఉత్సాహం పెరిగినప్పటికీ, చిత్రనిర్మాతలలో ఆందోళన నెలకొంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' ఆగష్టు 21, 2026న రానుంది. -
టాలీవుడ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడో తెలుసా?
టాలీవుడ్ నుంచి ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలంతా ఇప్పుడు షూటింగ్లో బిజీ అయిపోయారు. వీరితో పాటు సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ, వెంకటెశ్ కూడా సమ్మర్లోనూ సెట్స్లోనే ఉంటున్నారు. మరి ఏ హీరో ఎక్కడ ఉన్నాడు? కొత్త సినిమాల షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఓ లుక్కేయండి.🎥 ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది🎥 అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న రాకా మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ప్రస్తుతం బన్నీ ముంబైలోనే ఉన్నాడు.🎥 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడ వేసిన ఓ సెట్లో కీలకమైన సన్నివేశలు షూట్ చేస్తున్నారు.🎥 రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ వన్ స్టూడియో శంకరపల్లి లో జరుగుతోంది. అక్కడే ఓ సెట్లో ఐటమ్ సాంగ్ షూట్ చేస్తున్నారు.🎥 నందమూరి బాలకృష్ణ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ జన్వాడ గుంటూరు కారం సెట్ లో జరుగుతోంది.🎥 కార్తీక్ డైరెక్షన్లో నాగార్జున హీరోగా కెక్కుతున్న సినిమా షూటింగ్ ఎల్బీ నగర్ లో జరుగుతుంది. నాగార్జున కెరీర్లో 100వ సినిమా ఇది.🎥 వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది.🎥 నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతుంది.🎥 విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నటిస్తున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేట సెట్ లో జరుగుతుంది.🎥 రవితేజ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.🎥 శర్వానంద్ సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న భోగి సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతోంది.🎥 రష్మిక , రవీంద్ర పుల్లే డైరెక్షన్ లో నటిస్తున్న మైసా సినిమా షూటింగ్ కేరళ లో జరుగుతోంది.🎥 శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకర పల్లి లో జరుగుతుంది.🎥 గోపీచంద్ సంకల్ప్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న భరతవర్ష సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. -
లేట్ అయినా లేటెస్ట్గా...
చిత్ర పరిశ్రమలో సినిమాకి కొబ్బరికాయ కొట్టిన రోజే విడుదల తేదీ ప్రకటిస్తుంటారు కొందరు మేకర్స్. మరికొందరు సినిమా షూటింగ్, ఔట్పుట్, పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యే సమయాన్ని బట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటారు. ఇంకొందరేమో సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండగలతో పాటు వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాలను ఫలానా తేదీకి విడుదల చేస్తామని ప్రకటిస్తుంటారు. అయితే చెప్పిన తేదీకి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పరిస్థితులు ఒక్కోసారి ఉండక పోవచ్చు.షూటింగ్స్ ఆలస్యం, పోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్, డేట్స్ క్లాష్... వంటి కారణాల వల్ల సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చేర్పులు జరుగుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో కామన్ అయింది. ఏది ఏమైనా కానీ కంటెంట్, ఔట్పుట్, క్వాలిటీ... ఇలా ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటూ లేట్ అయినా లేటెస్ట్గా వస్తాం అంటున్నారు తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్న కొందరు దర్శక–నిర్మాతలు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’, ఎన్టీఆర్ ‘ఎన్టీఆర్నీల్’, రామ్చరణ్ ‘ పెద్ది’, నాని ‘ది ప్యారడైస్’, అఖిల్ ‘లెనిన్’, నిఖిల్ ‘స్వయంభు’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, తమిళ హీరో విజయ్ ‘జన నాయగన్’ వంటి సినిమాల విడుదల తేదీలు ముందే ఖరారు అయినప్పటికీ వాయిదా పడ్డాయి. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... విశ్వంభర ఎప్పుడు? చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. తనయుడు రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం తన ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేసుకున్నారు చిరంజీవి. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న రిలీజ్ చేశారు. ‘‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘దిల్’ రాజుగారు అడగడంతో ‘విశ్వంభర’ సినిమా విడుదలను వాయిదా వేశాం’’ అంటూ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికి విడుదల వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని అందరూ భావించినప్పటికీ రిలీజ్ కాలేదు. 2025 మే 9న సినిమా విడుదల కానుందనే వార్తలు గతంలో వినిపించాయి. ఆ తర్వాత జూలై 24న ‘విశ్వంభర’ థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ రాలేదు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్కి ప్రాధాన్యం ఉందట. ఈ పనుల ఆలస్యం వల్లే రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తన పుట్టినరోజున (ఆగస్టు 22) చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేసి, ‘‘చందమామ కథలాంటి ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే వేసవి మొదలైనప్పటికీ ఈ చిత్రం విడుదల తేదీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. మరి... ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెన్నడు? అనే ప్రశ్నకు సమాధానం కోసం మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పదు. జూన్లో ఎన్టీఆర్ నీల్? ‘దేవర: పార్ట్ 1’ వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, 2, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో కాస్త బొద్దుగా కనిపించే ఆయన మరో పాత్ర కోసం బాగా సన్నబడ్డారు. జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫొటోని ఇటీవల ఆయన షేర్ చేయగా కండలు తిరిగిన దేహంతో ఉన్న ఈ పిక్ వైరల్గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట, హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు రూ. 15 కోట్ల తో ఎన్టీఆర్ ఇంటి సెట్ని నిర్మించడం హైలెట్గా మారాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి సినిమాని రిలీజ్ చేయడం లేదని యూనిట్ ప్రకటించింది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా అన్నది వేచి చూడాలి. జూన్లో పెద్ది రెడీరామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండి యన్ మూవీ ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో (2021) బ్లాక్బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ కోసం రామ్చరణ్ ఫుల్æమాస్ లుక్లోకి మారి పోయారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లకి అద్భుతమైన స్పందన వచ్చింది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి..., రై రై రారా...’ పాటలు చార్ట్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘పెద్ది’ నుంచి విడుదల చేసిన రామ్ చరణ్ శక్తివంతమైన కొత్త పోస్టర్కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే... రామ్చరణ్ బర్త్ డే కానుకగా 2026 మార్చి 27న ‘పెద్ది’ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ రెండోసారి వాయిదా వేశారు.జూన్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ‘‘మాపై మీరు (ప్రేక్షకులు) చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ ఓపికకు తగిన ప్రతిఫలం దక్కేలా అత్యుత్తమమైన కంటెంట్తో వస్తాం. విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం’’ అని ‘పెద్ది’ చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... సినిమాలోని టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్, నేపథ్య సంగీతం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆగస్టులో ప్యారడైస్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. ఈ చిత్రంలో నానీని ఫుల్ మాస్ లుక్లో చూపించారు శ్రీకాంత్ ఓదెల. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైస్’. ఈ మూవీలో మంచు మోహన్బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషి స్తున్నారు.పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు నాని. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్లో కనిపించగా అద్భుతమైన స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది.అయితే మార్చి 27న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల అవుతుండటంతో డేట్స్ క్లాష్ అయ్యే కారణం వల్ల ఈ మూవీ రిలీజ్ ఉండక పోవచ్చనే చర్చ జరిగింది కూడా. అనుకున్నట్టుగానే ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు, పాటలు, ఫైట్స్ దాదాపు పూర్తయినప్పటికీ టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అందుకే లేట్ అయినా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా లేటెస్ట్గా ఆడియన్స్ ముందుకు రావాలన్నది మేకర్స్ ఆలోచన.ఇదిలా ఉంటే.. ఆగస్టు 21న ‘ది ప్యారడైస్’ రిలీజ్ డేట్కి వరుసగా మూడు వారాల పాటు ఓనం, మిలాద్–ఉన్–నబీ, రాఖీ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండగలు కలిసి రానున్నాయి. ఈ సెలవులు తమ సినిమాకి కలిసొస్తాయని చిత్రబృందం భావించి, ఈ తేదీ ఫిక్స్ చేసినట్లు టాక్. కాగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి నానీపై ఇప్పటికే విడుదల చేసిన ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్కి అద్భుతమైన స్పందన వచ్చింది. లెనిన్ డేట్ ఫిక్స్అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘లెనిన్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం పక్కా మాస్ లుక్లోకి మారి పోయారు అఖిల్. పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో మేకోవర్ అయిన లుక్ ఆకట్టుకుంటోంది. పైగా రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగులకు కూడా మంచి స్పందన వస్తోంది.తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘వారేవా వారేవా...’కి చాలా మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఈ నెల 16న ఈ మూవీలోని ‘ఎట్టా ఎట్టా..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ను రిలీజ్ చేశారు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్గా నిలిచింది. అఖిల్ తన మాస్ స్టెప్స్తో అదరగొట్టగా, భాగ్యశ్రీ తన చార్మ్తో మెప్పించారు. ఇదిలా ఉంటే... ‘లెనిన్’ని మే 1న విడుదల చేయనున్నట్లు తొలుత అధికారికంగా ప్రకటించింది యూనిట్. అయితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలను మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో ‘లెనిన్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మూవీ విడుదలను మే 1వ తేదీ నుంచి జూన్ 26వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. అయితే అనూహ్యంగా ‘పెద్ది’ సినిమా కూడా ఏప్రిల్ 30 నుంచి జూన్కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ తేదీ మాత్రం ఖరారు కాలేదు. ఈ లెక్కన చూస్తే ఇటు ‘పెద్ది’, అటు ‘లెనిన్’ సినిమాలు జూన్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘లెనిన్’. బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో మురళీ కిశోర్ తెరకెక్కిస్తున్నారు. మా మూవీ ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మేలో స్వయంభు ‘కార్తికేయ 2’ (2022) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకోవడంతో పాటు అదే స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. నిఖిల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మించారు. భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో 2026 ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తొలుత అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ వల్ల ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి విడుదల వాయిదా వేశారు. కానీ ఆ తేదీకి కూడా రిలీజ్ని పోస్ట్ పోన్ చేశారు. అయితే కొత్త విడుదల తేదీ ఎప్పుడనే విషయాన్ని చిత్రయూనిట్ స్పష్టం చేయాలి. వార్తల్లో ఉన్న ప్రకారం మేలో విడుదలయ్యే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే... నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారాయన. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పూర్తి కాక పోవడంతో రిలీజ్ వాయిదా పడిందని ఫిల్మ్నగర్ టాక్.ఈ మూవీని 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ మూవీస్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ‘‘దర్శకుడు భరత్ కృష్ణమాచారి తన విజన్ను ‘స్వయంభు’లో భారీ స్థాయిలో ప్రజెంట్ చేశారు. ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి. ‘స్వయంభు’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. సంబరాలు ఎప్పుడు?సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటించగా, జగపతి బాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ నిర్మించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ రూపొందించారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం కోసం సాయిదుర్గా తేజ్ ప్రత్యేకంగా కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్గా మేకోవర్ అయ్యారు. ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అనంతరం పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాల విడుదల తేదీల్లోనూ మార్పులు జరిగే అవకాశం లేక పోలేదు. – డేరంగుల జగన్ మోహన్ -
పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన నాని..
-
‘ది ప్యారడైజ్’.. అంచనాలు పెంచేసిన సుబ్బలక్ష్మి!
దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్, ఆయా షేర్ పాట సోషల్లో దూసుకెళ్తున్నాయి. తాజాగా హీరోయిన్గా నటిస్తున్న కయాదు లోహర్ లుక్ని కూడా విడుదల చేశారు. కయాదు బర్త్ డే సందర్భంగా ఈ రోజు(ఏప్రిల్ 11) ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేస్తూ బర్త్డే విషెస్ తెలిపారు. ఇందులో ఆమె సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ‘వెండితెర పై వెలగని తార’ మా సుబ్బలక్ష్మిని చూడండి అంటూ కయాదు పాత్రపై క్యూరియాసిటీ పెంచారు. శ్రీకాంత్ ఓదెల సినిమాలో హీరోయిన్కి చాలా ప్రాధన్యత ఉంటుంది. దసరాలో కీర్తి సురేశ్ పోషించిన వెన్నెల పాత్ర ఏ రేంజ్లో పేలిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు సుబ్బలక్ష్మి పాత్ర కూడా అదే స్థాయిలో బలంగా ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం కయాదు ఓ మధ్యతరగతి యువతిగా కనిపించబోతునట్లు సమాచారం. ఇందులో నాని ‘జడల్’ అనే పాత్ర పోషిస్తున్నాడు. విలన్ శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఆగస్ట్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. -
చరణ్, నాని.. షేర్ ఎవరు..?
ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాట ప్రేక్షకులను మెప్పించింది. యూట్యూబ్ లైక్ల విషయంలో రామ్ చరణ్ ‘పెద్ది’లోని ‘చికిరి చికిరి’ పాటను చాలా తక్కువ సమయంలోనే అధిగమించింది. డిజిటల్ వ్యూస్ పరంగా అరుదైన మైలురాయిని చేరుకుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. ఇందులోని ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri) అంటూ సాగే ఈ పాట 24గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన తొలిసాంగ్గా రికార్డు నెలకొల్పింది.ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘పెద్ది’ పాట (తెలుగు) నాలుగు నెలల్లో 13,32,838 లైక్లను సాధించింది. దీనితో పోలిస్తే, అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ‘ఆయా షేర్ (తెలుగు)’ పాట విడుదలైన కేవలం ఒక నెలలోనే 13,35,424 లైక్లను దాటింది. సంఖ్యాపరంగా ఈ వ్యత్యాసం స్వల్పంగా ఉన్నప్పటికీ లాంగ్ రన్లో మరింత ఈ నంబర్ పెరగవచ్చు. అయితే, వ్యూస్ పరంగా చికిరి పాట 197 మిలియన్లు సాధించి టాప్లో ఉంది... ఆయా షేర్ పాట 91 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ‘చికిరి చికిరి’ పాటకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదరణ లభించగా, ‘ఆయా షేర్’ ప్రారంభంలో మాత్రమే జోరు చూపింది. అయితే, ఇప్పటికీ రామ్ చరణ్ చికిరి పాటనే టాప్లో కొనసాగుతుంది. పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుండగా.. ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కానుంది. -
32 ఏళ్ల తర్వాత ఇలా..: మోహన్బాబు
టాలీవుడ్ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది ప్యారడైజ్. విలక్షణ నటుడు మోహన్బాబు విలన్గా యాక్ట్ చేస్తున్నారు. నేడు (మార్చి 19న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియో విడుదల చేశారు. అందులో మోహన్బాబు 32 సంవత్సరాల తర్వాత నేను విలన్గా యాక్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ శ్రీకాంత్ నన్ను మాయ చేశాడు అని పేర్కొన్నారు. ఆయనను షికంజి పాత్ర కోసం ఎలా సన్నద్ధం చేస్తున్నారనేది చూపించారు.మోహన్బాబు బర్త్డే స్పెషల్ గ్లింప్స్చివర్లో మోహన్బాబుకు ఎలివేషన్ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. ఈ జనరేషన్కు మోహన్బాబు సర్ అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు. కానీ, ప్యారడైజ్తో ఆయనేంటో చూపిస్తాం అన్నాడు. అయితే ఈ గ్లింప్స్ నిడివి కేవలం 46 సెకన్లు మాత్రమే కలిగి ఉంది. ఈ సినిమా విషయానికి వస్తే అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్వీఎల్ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: 41 ఏళ్ల వయసులో తల్లయిన బుల్లితెర నటి -
నాని & వెంకీ మూవీ ఫిక్స్..!
-
'ఆయా షేర్' కోసం ఇంత కష్టమా?.. మేకింగ్ విశేషాలివే!
‘ఆయా షేర్..’ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లోని ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ని షేక్ చేస్తోంది. నాని వేసిన హుక్ స్టెప్కి చిన్న, పెద్దా, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తున్నారు. సాహిత్యంపై పట్టున్నవాళ్లు లిరిక్స్పై, డ్యాన్స్పై అవగాహన ఉన్నవాళ్లు..నాని స్టెప్పులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఈ పాటలో కనిపించిన విజువల్స్ మరోఎత్తు. ఈ పాటలో హీరోని మురికివాడకు చక్రవర్తిగా చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. హీరోను మురికివాడకు చక్రవర్తిగా చూపించడానికి 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ సెట్ను నిర్మించారట. ఇందులో ప్రధాన ఆకర్షణగా హీరో హౌస్ (కమాన్ సెట్) నిలిచింది. దీన్ని 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు, 25 అడుగుల లోతుతో నిర్మించారట. అంతేకాదు ఇందులో చూపించిన ఇళ్లను నిజంగానే నిర్మించారట. సాధారణంగా సినిమాల్లో ఇళ్ల సెట్లు అంటే డమ్మీ స్ట్రక్చర్స్ వాడుతుంటారు. కానీ ఈ సాంగ్లో వాటర్ బాడీ విలేజ్ సెట్ కోసం 60 అసలైన ఇళ్లను నిర్మించినట్లు మేకర్స్ తెలిపారు. దాదాపు 50 మంది పనివారు 30 రోజుల పాటు శ్రమించి ఈ విలేజ్ సెట్ను రూపొందించారు. ఇక ఈ పాటలో కనిపించే భారీ బిర్యానీ బౌల్ని రెడీ చేయడానికి ఏడు మంది దాదాపు ఐదు రోజుల పాటు కష్టపడ్డారట. దీనికి పాత కాలపు లుక్ రావడం కోసం ప్రత్యేకమైన 'ఏజింగ్ టెక్నిక్స్' వాడటం విశేషం. సినిమాలోని సహజత్వం కోసం 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో ఒక డంప్ యార్డ్ సెట్ను కూడా వేశారు. దీనికోసం 25 మంది సభ్యులు 30 రోజుల పాటు పనిచేశారు. ఇక్కడ నీటి కొలను సృష్టించడానికి 100 ట్యాంకర్ల నీటిని వినియోగించారు. ఇది నిండటానికే ఏడు రోజుల సమయం పట్టిందంటే సెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక పాట కోసమే ఈ రేంజ్లో సెట్ వేశారంటే..ఇక సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చదు. సీనియర్ నటుడు మోహన్ బాబు విలన్గా నటిస్తున్నాడు. తనికెళ్ల భరణి,కిల్' ఫేమ్ రాఘవ్ జూయెల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఆయా షేర్...’కి వారం పట్టింది.. ‘జడల్’ లో ఎమోషన్ ఉంది: కాసర్ల శ్యామ్
‘‘ది ప్యారడైజ్’ సినిమాలోని ‘ఆయా షేర్...’ పాట ప్రోమో మంచి బజ్ క్రియేట్ చేసింది. పాట రిలీజ్ తర్వాత అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతోంది. నా సాహిత్యానికి అనిరుధ్గారు జనాలకి రీచ్ అయ్యే విధంగా ట్యూన్ చేశారు. మట్టి వాసన తెలిసిన జానపద గాయకులు జంగిరెడ్డి, దేవయ్య అద్భుతంగా పాడారు. నా కెరీర్లో ఈ పాట ఇచ్చినంత కిక్కు ఏ పాటా ఇవ్వలేదు’’ అని పాటల రచయిత కాసర్ల శ్యామ్ చెప్పారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి విడుదల చేసిన తొలి పాట ‘ఆయా షేర్...’కి మంచి స్పందన వస్తోందని యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా ఈ పాట రచయిత కాసర్ల శ్యామ్ విలేకరలతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నానీగారి చేస్తున్న జడల్ క్యారెక్టర్లో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ జడల వెనుక మంచి కథ ఉంది. ఇప్పుడు అందరూ జడలు వేసుకుని రీల్స్ చేస్తున్నారు. ఆ సంస్కృతిని గుర్తు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘ఆయా షేర్...’ జనం నుంచి పుట్టిన ఒక వీరుడు ఆ జనాలకు స్ఫూర్తినిచ్చే క్రమంలో వచ్చే పాట. ఈ పాట రాయడానికి వారం పట్టింది. ఈ చిత్ర కథ 80 దశకాల్లో జరిగే నేపథ్యం కాబట్టి అప్పుడు ఉర్దూ ప్రభావం ఉంటుంది. అందుకే ఇందులో చాలావరకు ఉర్దూ పదాలు ఉపయోగించాను. నేను ఉపయోగించిన భాష, యాసకి సోషల్ మీడియాలో అద్భుతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవితంలో సర్వస్వం కోల్పోయానని బాధపడిన ఓ వ్యక్తి.. నా పాటతో కొత్త స్ఫూర్తి పొందానని చెప్పడం ఆనందాన్ని కలిగించింది. ఇక ఈ మధ్య ‘లెనిన్, మా ఇంటి బంగారం, ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాల్లో పాటలు రాశాను’’ అని చెప్పారు. -
ఆయా షేర్ నా తొలి పాట కావడం హ్యాపీ: సుధన్
‘దసరా’ వంటి సూపర్హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ‘ఆయా షేర్’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్లో దూసుకెళుతోందని యూనిట్ పేర్కొంది.ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ పాట కొరియోగ్రాఫర్ సుధన్ మాట్లాడుతూ– ‘‘దసరా’ చిత్రానికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను. ఆ సమయంలో ‘నువ్వెప్పుడు కొరియోగ్రాఫర్ అవుతావు’ అని అడిగేవారు. ‘సాంగ్ ఇస్తే చేస్తానని’ చెప్పేవాడిని. అలా నేను కొరియోగ్రాఫర్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత మొదట కలిసింది శ్రీకాంత్గారినే. ‘ఆయా షేర్’ పాట కొత్తగా ఉండాలని శ్రీకాంత్గారు చె΄్పారు. సినిమాలో నానీగారి ఇంట్రో సాంగ్ ఇది. దీంతో నానీగారిని కొత్తగా చూపించాలనే ఆలోచనతో కొరియోగ్రఫీ స్టార్ట్ చేశాను.ఒక ఎడిట్ వెర్షన్ చేశాను. హుక్ స్టెప్ కూడా అద్భుతంగా కుదిరింది. దర్శకుడికి నచ్చింది. ఒక కొత్త కొరియోగ్రాఫర్గా నా తొలి పాటను ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్కి చేయడం కాస్త ఒత్తిడిగానే ఉంటుంది. దర్శకుడు ఇచ్చిన చాన్స్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పని చేశాను. ఇప్పుడు ‘ఆయా షేర్...’ పాటకు వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది. ఈ సాంగ్ తర్వాత మా నిర్మాత కొరియోగ్రఫీ గురించి అడిగి తెలుసుకున్నారు. తెలుగుతో పాటు తమిళ చిత్రాలకు కూడా చాన్స్లు వస్తున్నాయి’’ అని చెప్పారు. -
నాని 'ది ప్యారడైజ్' HD మూవీ స్టిల్స్
-
ట్రెండింగ్లో నాని జడలు ఆయా షేర్ తో అరాచకం
-
'ఆయా షేర్' పాట.. నా స్టెప్ కాపీ కొట్టేశారు
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల.. 'ఆయా షేర్' పాట వింటూ చిల్ అయిపోతున్నారు. నాని హీరోగా నటిస్తున్న 'ప్యారడైజ్' సినిమాలోని పాట ఇది. అనిరుధ్ సంగీతమందించాడు. నాని పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సాయంత్రం దీన్ని రిలీజ్ చేయగా.. వెంటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. మ్యూజిక్, బీట్, లిరిక్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. ఓ యూట్యూబ్ మాత్రం ఇందులో నాని వేసిన హుక్ స్టెప్ నాదే అని, కాపీ కొట్టేశారని అంటున్నాడు.(ఇదీ చదవండి: పవన్ని టార్గెట్ చేస్తూ పూనమ్ సంచలన ట్వీట్)హైదరాబాద్లో బాబా జాక్సన్ పేరుతో ఉన్న ఓ ఇన్ఫ్లూయెన్సర్.. ఇన్ స్టా, యూట్యూబ్లో డాన్స్ వీడియోలతో బాగానే ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. గతంలో ఇతడు ఓ విదేశీయుడితో కలిసి వేసిన స్టెప్నే ఇప్పుడు 'ఆయా షేర్' పాటలో కాపీ కొట్టేశారని అంటున్నారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో సదరు ఇన్ఫ్లూయెన్సర్.. ఒరిజినల్ ఇదే అంటూ రెండు వీడియోలు కూడా పోస్ట్ చేశాడు.నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ద ప్యారడైజ్'. పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది. మోహన్ బాబు విలన్ కాగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. కాయదు లోహర్ హీరోయిన్. తొలుత మార్చి 26నే థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా ఆగస్టు 21కి వాయిదా వేశారు. కొన్నిరోజుల క్రితమే అధికారికంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించారు. తాజాగా తొలి గీతం వదిలి, అమాంతం హైప్ సొంతం చేసుకున్నారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని) View this post on Instagram A post shared by Baba Jackson (@babajackson2019) -
వైరల్ అయిపోతున్న 'ఆయా షేర్' పాట రిలీజ్
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ద ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. లెక్క ప్రకారం మార్చిలోనే థియేటర్లలోకి రావాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. నాని పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి తొలి పాట రిలీజ్ చేశారు. 'ఆయా షేర్' అంటూ సాగే ఈ గీతం.. ప్రోమోతోనే ఆకట్టుకుంది. ఇప్పుడు పూర్తి పాట కూడా అలానే అదరగొడుతోంది.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా 'ప్యారడైజ్' సినిమా తీస్తున్నారు. ఇందులో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్గా చేస్తోంది. మోహన్ బాబు విలన్ కాగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. విడుదలకు ఇంకా చాలారోజులు ఉంది కానీ హైప్ అయితే ఈ మూవీపై మామూలుగా లేదు. -
‘ఓకేరా నీ ఇష్టం’.. ఈ మాట భయపెడుతోంది : నానిపై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్
నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్తో వచ్చిన ఆ చిత్రం..బాక్సాఫీస్ని షేక్ చేసింది. శ్రీకాంత్ తొలి సినిమానే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని తన రెండో సినిమా కూడా నానితోనే ప్లాన్ చేశాడు. అదే ‘ది ప్యారడైజ్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్ని క్రియేట్ చేశాయి. నాని బర్త్డే(ఫిబ్రవరి 24) సందర్భంగా ఈ రోజు ‘ఆయా షేర్’ అనే సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela ) నానికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఎక్స్లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.‘నాని(Nani) అన్న..‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని అన్న ప్రతిసారి నాకు ‘శ్రీకాంత్ నిన్ను నమ్ముతున్నాను’ అన్నట్లుగా వినిపించేది. ఆ నమ్మకం నన్ను ప్రతిసారి భయపెట్టేసింది. అందుకే ‘ది ప్యారడైజ్’ కోసం ప్రతి సెకను నా రక్తాన్నా, ఆత్మను ధారపోశాను. నేను నీ సినిమా రూల్స్ని బ్రేక్ చేశాను. మీ వర్కింగ్ డేస్ ప్యాటర్న్ మార్చేశాను. మీ సినిమా రిలీజ్ డేట్ ప్లానింగ్ని కూడా బ్రేక్ చేశాను. చివరకు మీ వర్కింగ్ స్టైల్ని కూడా మార్చేశాను. ఇలా మీరు పెట్టిన ప్రతి నియమాన్ని నేను ఉల్లంఘించాను. అయినా సరే నువ్వు నాపై చూపిస్తున్న ఆ నమ్మకం నన్ను మరింత బాధ్యతగా పని చేసేలా చేసింది. నువ్వు నమ్మినంతగా నన్ను ఇంకెవరు నమ్మలేదు అన్న. సినిమా కోసం నేను జడలు వేసుకోవాలి అంటే.. ఓకేరా నీ ఇష్టం అన్నావు. టాటూ వేసుకోవాలని చెబితే నీ ఇష్టం అన్నావు. ప్రతిరోజు లెక్కలేనన్ని రీటేకులతో నిన్ను టార్చర్ చేసినా.. సింపుల్గా ‘ఓకేరా నీ ఇష్టం’ అన్నావు. నీతో ఎప్పుడు ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పలేదు కానీ..‘నువ్వు ఎప్పుడూ ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని ఎందుకు అంటావు అనే దానికి సమాధానం కోసం నా జీవితంలో ప్రతి సెకను నిరంతరం వెతుకుతున్నాను. బహుశా ‘ది ప్యారడైజ్’(The Paradise) సినిమాతో ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో. నన్ను నమ్మిన నా ధరణికి(దసరాలో నాని పాత్ర పేరు) నన్ను మళ్లీ నమ్ముతున్న నా జడల్కి( ది ప్యారడైస్లో నాని పాత్ర పేరు)కి హ్యాప్తీ బర్త్డే. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను నాని అన్న’ అని శ్రీకాంత్ ఓదెల రాసుకొచ్చాడు. ‘ది ప్యారడైజ్’ మూవీ ఆగస్ట్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. Nani Anna,Nuvvu "Ni istam Srikanth" ani anna prathisari I hear "I trust you Srikanth"And that trust scares me, every single second to give my blood and soul to The Paradise.I broke your every rule of cinema.I broke your working days pattern...I broke your release date… pic.twitter.com/p7Z1pFKrx8— Srikanth Odela (@odela_srikanth) February 24, 2026 -
నాని 'ది ప్యారడైజ్' టైటిల్ సాంగ్ ప్రోమో
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి టైటిల్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. ఆయా షేర్... అంటూ వందలాదిమంది డ్యాన్సర్లతో నాని వేసిన స్టెప్పులకు అదిరిపోయేలా అనిరుధ్ రవిచందర్ సంగీతం ఉంది. కాసర్ల శ్యామ్ కుమార్ రచించిన ఈ పాటను అడ్డుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. ఫిబ్రవరి 24న పూర్తి సాంగ్ను విడుదల చేస్తామని ప్రోమోలో ప్రకటించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మోహన్బాబు, సంపూర్ణేశ్బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి నటిస్తున్నారు. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, స్పానిష్లో ఆగష్టు 21న ఈ మూవీ విడుదల కానుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని ఒక ప్రేత్యకమైన గెటప్లో కనిపించనున్నారు. మొదటి సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు ఇప్పటికే తెలిపాయి. -
షేర్ రెడీ
‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. మంచు మోహన్బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ‘ఆయా షేర్’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేయడానికి టీమ్ రెడీ అవుతోంది. ‘‘ది ప్యారడైజ్’ టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. మా సినిమాకి అనిరుధ్ రవిచందర్ చక్కని సంగీతం అందించారు. ‘ఆయా షేర్’పాటని సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీలో వందలాది మంది డ్యాన్సర్లతో నానిపై భారీ సెట్లో చిత్రీకరించాం. ఈ సాంగ్ నాని ఫ్యాన్స్కు బర్త్డే ట్రీట్లా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి కెమెరా: సీహెచ్ సాయి. -
టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్కు బ్రేక్?
ఒకప్పుడు సినిమా చివర్లో పార్ట్-2 త్వరలో అనే టైటిల్ కార్డు పడితే, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్కు బ్రేక్ పడుతున్నట్టుంది. కొన్ని సినిమాలకు రెండో భాగం ప్రకటించినా, ఆ స్థాయిలో వర్కవుట్ కాలేదు. తల బొప్పికట్టే రేంజ్లో కొన్ని సినిమాలు చుక్కలుచూపించడంలో పార్ట్-2 అనేది దండగ అనే ఫీలింగ్కు వచ్చారు మేకర్స్. కథ డిమాండ్ లేకుండా సీక్వెల్స్ తీయడం అనవసరమని నిర్మాతలు భావిస్తున్నారు. బడ్జెట్ పెంచడం లేదా హైప్ క్రియేట్ చేయడం కోసం పార్ట్-2లు తీయడం సరైన పద్ధతి కాదని స్పష్టంగా చెబుతున్నారు. అసలు సీక్వెల్ ట్రెండ్ను మొదలుపెట్టిన రాజమౌళి కూడా ఇప్పుడు దానికి దూరమయ్యాడు. తను మహేష్బాబుతో చేస్తున్న తాజా చిత్రం “వారణాసి” ఒక్క భాగమే అని స్పష్టం చేశాడు. అంతేకాక సినిమా చివర్లో పార్ట్-2 కార్డులు పడవని ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్ర యూనిట్ కూడా సీక్వెల్ ఉండదని ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, జూ.ఎన్టీఆర్తో చేస్తున్న “డ్రాగన్” సినిమాను సింగిల్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.ఇప్పుడు వచ్చే ఏ సినిమాకైనా పార్ట్-2 ఉందని ప్రకటిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్ట్-2 ఉంది అనగానే దానికి వచ్చే హైప్ కంటే ట్రోలింగ్నే ఎక్కువగా జరుగుతోంది. తర్వాత వచ్చే పెద్ద సినిమాలు కూడా ఒక్క భాగంలోనే కథను ముగించాలనే నిర్ణయానికి వస్తున్నాయి. చూస్తుంటే రానున్న కాలంలో వచ్చే చిత్రాలకు ఈ పార్ట్-2 గోల తగ్గేలానే కనిపిస్తోంది. -
నాని పాన్ ఇండియా మూవీ.. ది ప్యారడైజ్ వాయిదా..!
టాలీవుడ్ హీరో నాని నటిస్తోన్న యాక్షన్ చిత్రం ది ప్యారడైజ్. దసరా మూవీతో హిట్ కొట్టిన కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో తెరెకెక్కిస్తున్నారు. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని వెల్లడించారు.కానీ మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే ది ప్యారడైజ్ మూవీ వాయిదా పడింది. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అఫీషియల్గా ప్రకటించారు. ఏకంగా ఐదు నెలలు ఆలస్యంగా థియేటర్లకు రానుంది. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్ను పంచుకున్నారు. దీంతో నాని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని శ్రీకాంత్ ఓదెల ట్వీట్ చేశారు. నేను తొందరపడాలనుకోవడం లేదు.. తనకు ఇంకాస్తా సమయం కావాలని అభిమానులకు కోరారు. I don’t want to rush. I need some time to deliver it.#TheParadise - 21-08-2026 🔒 pic.twitter.com/2aKDg7IJP3— Srikanth Odela (@odela_srikanth) February 12, 2026 -
ఆయా షేర్
‘ది ప్యారడైజ్’ సినిమా కోసం అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు జడల్. ఏ రేంజ్లో అనేది సిల్వర్ స్క్రీన్స్ పై చూడాలి. ‘దసరా’ వంటి సూపర్హిట్ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. నానిపై ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఈ పాటకు సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఎనిమిది భాషల్లో ఈ ఏడాదే రిలీజ్ కానుంది. -
పెద్ది, డకాయిట్.. ఇక ది ప్యారడైజ్ వంతు..!
ఇటీవల కొద్దికాలంగా టాలీవుడ్ సినిమా పరిస్థితి కాస్తా అయోమయానికి గురి చేస్తోంది. పెద్ద హీరోల చిత్రాల రిలీజ్ డేట్లను ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుందనేది పక్కాగా ముందే చెప్పేస్తున్నారు. ఆ రోజే గ్రాండ్ రిలీజ్ అంటూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తీరా డేట్ దగ్గరికొచ్చేసరికి వాయిదా వేసుకుంటూ పోతున్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరో ఉన్నా సరే విడుదలకు వెనకాడుతున్నారు. తాజాగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ఏకంగా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. గ్లోబల్ స్టార్ చెర్రీ- బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ వాయిదా పడడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ మార్చిలో పెద్ది చూడాలనుకున్న సినీ ప్రియులకు కూడా ఈ నిరాశే మిగిల్చింది.అంతేకాకుండా అడివి శేష్ డకాయిట్ సైతం మరోసారి వాయిదా పడింది. గతంలో చాలాసార్లు వాయిదా పడినా.. ఈ ఏడాది మార్చి 19న వస్తామని ప్రకటించారు. అంతలోనే డకాయిట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఇక మార్చిలో వస్తోన్న టాలీవుడ్ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా వస్తోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే రోజు ఉస్తాగ్ భగత్ సింగ్ విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో నాని మూవీ కూడా దాదాపు వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. దీంతో ఈ చిత్రాలన్నీ సమ్మర్కు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.దురంధర్-3 దెబ్బకేనా?ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేయడం అభిమానుల్లో నిరాశ పెంచుతోంది. తమ అభిమాన హీరోల చిత్రాలు పోస్ట్పోన్ కావడం వల్ల ఫ్యాన్స్లో ఉన్న క్యూరియాసిటీ తగ్గుతోంది. అయితే ఇలా వరుసగా టాలీవుడ్ సినిమాలు వాయిదా పడడానికి ప్రధాన కారణం ఆ ఒక్క సినిమానేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మార్చి 19న రానున్న దురంధర్-2 దెబ్బకేనని సగటు సినీ ప్రియుడు భావిస్తున్నారు. లేదంటే నిజంగానే షూటింగ్ పెండింగ్ వల్ల వాయిదా వేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వరుసగా మూడు టాలీవుడ్ చిత్రాలు వాయిదా పడడంతో సినీ ప్రియుల్లో అసలేం జరుగుతోందనే డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్.. నానితో పోటీ పడాల్సిందే..!
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.అయితే అదే రోజున నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే డేట్ కూడా ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తోన్న నాని మూవీ వాయిదా పడుతుందా? లేదంటే అదే రోజు రిలీజవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేశారు. మార్చి 27న రావాల్సిన పెద్ది ఏకంగా ఏప్రిల్ 30కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నాని ప్యారడైజ్ పోస్ట్ పోన్ అవుతుందా?.. ఉస్తాద్ భగత్ సింగ్తో బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
'నాని'తో భారీ రిస్క్ చేస్తున్న నిర్మాత.. బెడిసి కొడితే కష్టమే
టాలీవుడ్లో నాని నటించిన ‘దసరా’ భారీ విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 120 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. నాని కెరీర్లోనే మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది. ఇదే మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానితో రెండో చిత్రం ‘ది ప్యారడైజ్’ పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీలో మోహన్బాబు, కయాదు లోహర్, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మూవీ ముందుగా అనుకున్నదాని కంటే బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి.ఇండస్ట్రీలో ప్రతి నటుడికి ఒక మార్కెట్ ఉంటుంది. దానిని బట్టే వారికి రెమ్యునరేషన్ ఉంటుందని తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద నాని సినిమాల మార్కెట్ రూ. 100 కోట్లకు పైగానే ఉండొచ్చని ఒక అంచనా ఉంది. ఓటీటీ, టెలివిజన్ మార్కెట్లో నానికి మంచి డిమాండ్ ఉండటంతో ‘ది ప్యారడైజ్’ చిత్రానికి రూ. 75 కోట్ల వరకు ఢీల్ సెట్ అయినట్లు టాక్ ఉంది. ఎటుచూసినా సరే నాని సినిమాలకు ఫైనల్ మార్కెట్ విలువ రూ. 200 కోట్ల మేరకు ఉంటుంది. అది కూడా సినిమా భారీ హిట్ అందుకుంటేనే.. ఒకవేళ సినిమాపై ఏమాత్రం టాక్ మారిందా ఈ నంబర్స్ అన్నీ తారుమారు అయిపోతాయి.టైర్- 2 హీరోల్లో చాలా ఎక్కువది ప్యారడైజ్ సినిమాకు మొదట బడ్జెట్ రూ.150 కోట్లు అనుకుంటే.. ఇప్పుడు రూ.200 కోట్లు దాటేసిందట. టైర్- 2 హీరోల్లో ఈ బడ్జెట్ చాలా ఎక్కువని ఇండస్ట్రీ సూచిస్తుంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ సినిమా దసరా భారీ హిట్ కావడంతో ది ప్యారడైజ్పై నిర్మాత ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారట. ఆపై సినిమా కూడా చాలా బలంగా ఉండటంతో ఖర్చ ఎంతైనా సరే అనేంత రేంజ్లో ఆయన ఫ్రీడమ్ ఇచ్చారని తెలుస్తోంది. బడ్జెట్ గురించి వచ్చిన పుకార్లు నిజమైతే.., ఈ సినిమా సురక్షితమైన స్థానంలో ఉండాలంటే అనూహ్యమైన భారీ విజయాన్ని అందుకోవాల్సిందే.. ఏమాత్రం తేడా వచ్చినా భారీ నష్టాలు తప్పవని ముందే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయితే, నాని తన కెరీర్లోనే అత్యంత ఎక్కువ మొత్తంలో రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా మార్చి 26, 2026న విడుదల కావాల్సి ఉంది, కానీ నిర్మాణ జాప్యాల కారణంగా వాయిదా పడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో జడల్ అనే పవర్ఫుల్ రా రస్టిక్ పాత్రలో నాని కనువిందు చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.నిర్మాత చెరుకూరి సుధాకర్ గురించిచెరుకూరి సుధాకర్ సినిమాల పట్ల ఆసక్తితో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ను స్థాపించి 2016లో రన్ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, విరాట పర్వం, వంటి సినిమాలను నిర్మించారు. 2023లో విడుదలైన దసరా సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న ఆయన రీసెంట్గా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో మంచి లాభాలు అందుకున్నారు. అయితే, నిర్మాతగా రంగబలి, రామారావు ఆన్డ్యూటీ వంటి డిజాస్టర్స్ కూడా తన ఖాతాలో ఉన్నాయి. ది ప్యారడైజ్ మూవీ తరవఆ మెగాస్టార్ 157వ సినిమాను ఆయన నిర్మించనున్నారు. అయితే, ది ప్యారడైజ్ మూవీ విషయంలో నిర్మాత చెరుకూరి సుధాకర్ భారీ రిస్క్ చేస్తున్నారని -
"ది ప్యారడైజ్" రిలీజ్పై క్లారిటీ.."పెద్ది" ఇంకా సస్పెన్స్లోనే!
నాని, రామ్ చరణ్ సినిమాలు అనధికారికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు కొత్త రిలీజ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో "ది ప్యారడైజ్" సినిమాపై దాదాపు స్పష్టత వచ్చింది. మార్చి నుంచి తప్పుకున్న ఈ సినిమాను జూన్ చివర్లో విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. షూటింగ్తో పాటు గ్రాఫిక్స్ పనులకు కూడా ఓ డెడ్లైన్స్ పెట్టి, ఆ గడువులోగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవి కేవలం యూనిట్ నిర్ణయించిన తేదీలు మాత్రమే. పూర్తిగా క్లారిటీ వచ్చాకనే అధికారికంగా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు కాస్త ఎక్కువ టైమ్నే తీసుకుంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ "పెద్ది" సినిమా రిలీజ్ విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్యారడైజ్తో పోలిస్తే పెద్ది షూటింగ్ ముందే పూర్తి అవుతోంది. మొన్నటి వరకూ మే 1న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీపై కూడా యూనిట్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన "చికిరి" సాంగ్ పెద్ద హిట్ అయింది. త్వరలోనే సెకండ్ సింగిల్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఇక అదే సమయంలో రిలీజ్ డేట్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. -
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గందరగోళం
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గజిబిజి మొదలైంది. ఇప్పటికే ఏ నెలలో ఏ సినిమా వస్తుందో లెక్కలు వేసుకుని, హీరోల అభిమానులు కౌంట్డౌన్ పోస్టర్లు, సోషల్ మీడియాలో ట్రెండింగులు కూడా మొదలుపెట్టారు. కానీ ముందు అనుకున్నట్టుగా కాకుండా వరుసగా సినిమాలు వాయిదా పడుతుండటంతో పరిశ్రమలో గందరగోళం నెలకొంది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన స్వయంభు ఏప్రిల్కు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మార్చి చివర్లో విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'పెద్ది' మే నెలాఖరుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారం కోసం అదనపు సమయం తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మార్చి నుంచి వాయిదా పడుతూ మే 1న విడుదల చేస్తారనే ప్రచారం ఉంది. ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి నెలకే ముందుకు జరిపే అవకాశం ఉందని టాక్. గూఢచారి 2 మే 1న రిలీజ్ అవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ అదే తేదీకి ది ప్యారడైజ్ కూడా వస్తుందనే గాసిప్పులు వినిపిస్తున్నాయి. విశ్వంభర జూన్లో విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. కానీ అప్పటికే వాయిదా పడిన సినిమాలు జూన్లో స్లాట్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఈ వరుస వాయిదాలతో టాలీవుడ్లో రిలీజ్ షెడ్యూల్ పూర్తిగా గందరగోళంగా మారింది. ఒక సినిమా వాయిదా పడితే దాని ప్రభావం మరో సినిమాపై పడుతోంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అందరూ అయోమయంలో ఉన్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతో అభిమానులు అధికారిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
నాని 'ప్యారడైజ్'.. ఇంతమంది విలన్లా?
నాని హీరోగా నటిస్తున్న సినిమా 'ద ప్యారడైజ్'. లెక్క ప్రకారం మార్చి 26న థియేటర్లలోకి రావాలి. కానీ వాయిదా గ్యారంటీ అని తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ విషయం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మే తొలి వారం లేదంటే జూన్ నెలలో రిలీజ్ ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు. సరే రిలీజ్ గురించి కాసేపు పక్కనబెడితే ఇదే మూవీ గురించిన ఓ విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'ప్యారడైజ్' మూవీలో నాని.. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఇదివరకే రిలీజ్ చేసిన గ్లింప్స్తో ఆ క్లారిటీ వచ్చేసింది. సీనియర్ నటుడు మోహన్ బాబు.. సికంజా మాలిక్ అనే విలన్గా కనిపించబోతున్నాడు. 'కిల్' ఫేమ్ రాఘవ్ జూయెల్ కూడా ఓ విలన్. ఇప్పుడు తనికెళ్ల భరణి కూడా ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టారు. చాన్నాళ్ల తర్వాత విలన్ రోల్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.కెరీర్ ప్రారంభంలో తనికెళ్లి భరణి.. విలన్ రోల్స్ ఎక్కువగా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన తర్వాత తండ్రి తరహా పాత్రల్లో కనిపిస్తూ వచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రతినాయక పాత్ర అంటే విశేషమే. ఈ మూవీలోనే సీనియర్ నటుడు బాబు మోహన్ కూడా ఉన్నారు. ఈయనది కూడా నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. చూస్తుంటే నానితో ఢీ కొట్టేందుకు చాలామంది విలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని ఫ్రెండ్ బిర్యానీగా సంపూర్ణేశ్ బాబు నటిస్తున్నాడు. కాయదు లోహర్ హీరోయిన్. ఈ సినిమా కోసం ఒకప్పటి సీనియర్స్ని విలన్స్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ఏం ప్లాన్ చేశాడనేది మూవీ రిలీజైతే తెలుస్తుంది.(ఇదీ చదవండి: అనిల్ రావిపూడికి 'రేంజ్ రోవర్' గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి) -
తర్వాతి రెండు నెలలు డ్రై?
2026 సంవత్సరానికి టాలీవుడ్ ఘనంగా శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళకళలాడాయి. ఒక్క సినిమా తప్ప మిగతావన్నీ క్లిక్ అవ్వడం సినీ పరిశ్రమకు ప్రత్యేకమైన శుభారంభం. ప్రేక్షకులు కూడా ఈ విజయాలతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే సంక్రాంతి ఊపు కొనసాగించాల్సిన సమయంలో షెడ్యూల్లో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా సైడ్ అవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. జనవరి చివరి వారాల్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమా లేదు. చిన్న సినిమాలే వరుసగా రావడం వల్ల బాక్సాఫీస్లో స్పష్టమైన గ్యాప్ కనిపిస్తోంది. ఫిబ్రవరిలో పెద్ద సినిమా స్వయంభూ మాత్రమే కనిపిస్తోంది. కానీ ఈ సినిమా విడుదల తేదీపై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. వాయిదా పడుతుందేమో అనే వార్తలు రోజురోజుకు బలపడుతున్నాయి. స్వయంభూ వాయిదా పడితే ఫిబ్రవరిలో మరో పెద్ద సినిమా లేదు. మార్చి నుంచి మళ్లీ పెద్ద సినిమాల హవా మొదలవుతుందని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మార్చి కూడా డ్రైగానే ముగిసేలా ఉంది. ది ప్యారడైజ్ సినిమా వాయిదా పడినట్టే. పెద్ది సినిమా కూడా బాలీవుడ్ పోటీ కారణంగా తటపటాయిస్తోంది. కొంతమంది మాత్రం పెద్ది కూడా వాయిదా పడుతుందని అంటున్నారు. కానీ చెప్పలేం ఏం జరుగుతుందో చూడాలి.ఒకవేళ మార్చిలో పెద్ది కూడా వాయిదా పడితే డెకాయిట్ తప్ప మరో పెద్ద సినిమా లేకపోవడం ఖాయం. దీంతో మొత్తం పరిస్థితి టాక్సిక్ సినిమాకే దారిచ్చినట్టవుతుంది. రాబోయే రెండు నెలలు పెద్ద సినిమాల లేని డ్రై సీజన్గా మారే అవకాశం ఉంది. ప్రేక్షకులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.కానీ విడుదలల అనిశ్చితి వల్ల ఆ ఉత్సాహం తగ్గిపోయే అవకాశం ఉంది. -
మార్చి రిలీజ్లపై సందేహాలు.. ఏవి వస్తాయి? ఏవి వాయిదా?
సినీ పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది మార్చి నెల రిలీజ్లు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పెద్ది, పారడైజ్, దురంధర్ 2 – నిజంగా ఆ టైమ్లో వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నాని హీరోగా వస్తున్న పారడైజ్ సినిమాకు ఇంకా చాలా వర్క్ మిగిలి ఉంది. అందువల్ల మార్చిలో రిలీజ్ అవ్వడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమాకు ఇంకా ముప్పై రోజుల షూట్ మిగిలి ఉంది. సంక్రాంతి తర్వాత నాన్స్టాప్గా షూట్ చేసినా, రిలీజ్కు కావాల్సిన పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ టైమ్ ఒక్క నెలలో పూర్తవడం కష్టమే. కానీ ఇటీవల రిలీజ్ చేసిన రామ్ చరణ్ పోస్టర్లలో మాత్ర మార్చి నెల రిలీజ్ అంటూ ప్రకటించారు. చూడాలి ఆ టైమ్కు పెద్ది రిలీజ్ అవుతుంతో లేదో. ఇక ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించిన దురంధర్ 2 మాత్రం బాలీవుడ్ స్టైల్లో డేట్ ఫిక్స్ చేస్తే ఎక్కువగా వాయిదా లేకుండా వస్తుందని అంచనా. అయితే మార్చి నెల ఎగ్జామ్స్ సీజన్. దాంతో ఆ టైమ్లో రిలీజ్ చేస్తారా.. లేదా అనే సందేహం ఉంది. దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ సినిమా 2027 మార్చికి ప్లాన్ చేశారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు కలిగిస్తోంది. రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ కూడా అదే టైమ్లో వస్తుందని టాక్ ఉంది. కానీ అధికారిక డేట్ మాత్రం ఇంకా రాలేదు. సంక్రాంతి రిలీజ్ల మాదిరిగానే ప్రీ సమ్మర్ రిలీజ్లు కూడా ఇప్పుడు మంచి ఆప్షన్గా మారుతున్నాయి. ఎగ్జామ్స్ సీజన్ ఉన్నా, పెద్ద సినిమాలు వేసవి హాలిడేలకు దగ్గరగా రిలీజ్ అవ్వడం వల్ల బాక్సాఫీస్లో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి మార్చి 2026లో ప్రకటించిన సినిమాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ 2027 మార్చి మాత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ సినిమాలతో హాట్గా మారనుంది. -
నెట్ఫ్లిక్స్లో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది.. ఈ ఏడాది స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే!
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత పెద్ద సినిమా అయినా సరే థియేటర్స్లో రిలీజ్ అయిన నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మొన్నటి వరకు రిలీజ్కి ముందు సదరు సినిమా నిర్మాతలు ఓటీటీ సంస్థలతో డీల్ కుదుర్చుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఓటీటీ డీల్ను పూర్తి చేసుకుంటున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా తమతో డీల్ కుదుర్చుకొని.. ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాల జాబితాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) ప్రకటించింది. అందులో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ ‘పెద్ది’తో పాటు ‘ఛాంపియన్, ఫంకీ లాంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.2026లో నెట్ఫ్లిక్స్ వేదికగా అలరించే చిత్రాలివే..టైటిల్: ఉస్తాద్ భగత్ సింగ్నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీలదర్శకత్వం : హరీశ్ శంకర్టైటిల్: పెద్దినటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్దర్శకత్వం : బుచ్చిబాబుటైటిల్: ది ప్యారడైజ్నటీనటులు: నాని, సొనాలి కులకర్ణి, మోహన్ బాబుదర్శకత్వం: శ్రీకాంత్ ఓదెలటైటిల్: ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47నటీనటులు: వెంకటేశ్, శ్రీనిధి శెట్టిదర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్టైటిల్: ఆకాశంలో ఒక తారనటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లిదర్శకత్వం: పవన్ సాదినేనిటైటిల్: ఛాంపియన్నటీనటులు : రోషన్, అనస్వర రాజన్దర్శకత్వం: ప్రదీప్ అద్వైతంటైటిల్: ఫంకీనటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహార్దర్శకత్వం : అనుదీప్ కేవీటైటిల్: ‘రాకాస’సంగీత్ శోభన్, నయనసారికదర్శకత్వం: మాససా శర్మటైటిల్: బైకర్నటీనటులు : శర్వానంద్, రాజశేఖర్దర్శకత్వం : . అభిలాష్ రెడ్డిటైటిల్: వీడీ 14(వర్కింగ్ టైటిల్)నటీనటులు: విజయదేవరకొండ, రష్మికదర్శకత్వం : రాహుల్ సాంకృత్యన్ -
2026నే టార్గెట్ చేసిన స్టార్ హీరోలు.. ఎవరికి కలిసొస్తుందో?
గతేడాది చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు.. థియేటర్లలో కనిపించలేదు. కారణం ఏదైనా గానీ ఈ ఏడాది మాత్రం తలో రెండుసార్లు కనిపించబోతున్నారు. వీళ్లతో పాటు చాలామంది స్టార్ హీరోలు కూడా 2026నే టార్గెట్ చేశారు. ఒకటి రెండు కాదు 10కి పైగా భారీ బడ్జెట్ లేదా బజ్ ఉన్న చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటిపై హైప్ ఎలా ఉంది?సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలంటే 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు'. వీటిలో ప్రభాస్ చిత్రానికి ట్రైలర్స్తో బజ్ వచ్చింది. హారర్ కామెడీ కాబట్టి క్లిక్ అయ్యే ఛాన్సుంది. చిరంజీవి మూవీని కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ చేసి తీశారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అయితే బాగుంది. కానీ ట్రైలర్ బట్టి చూడాలా వద్దా అని చాలామంది డిసైడ్ అయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: బ్లూ డ్రమ్ కేసు గుర్తుందా? దీనిపై వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్కి రెడీ)వీటి తర్వాత అంటే మార్చిలో ప్యారడైజ్', 'పెద్ది' చిత్రాలు రాబోతున్నాయి. నాని 'ప్యారడైజ్', రామ్ చరణ్ 'పెద్ది'.. ఒకరోజు గ్యాప్లో థియేటర్లలోకి రానున్నాయి. వీటిపై ప్రస్తుతం బోలెడంత హైప్ ఉంది. కంటెంట్ కూడా అదే రేంజులో ఉంటే బ్లాక్ బస్టర్ టాక్ గ్యారంటీ.ఏప్రిల్లో పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రానుంది. దీనిపై రీమేక్ అని రూమర్ చాన్నాళ్లుగా వస్తుంది. టీమ్ మాత్రం అలాంటిదేం లేదని అంటోంది. ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా బయటకు వస్తే అప్పుడు హైప్ పెరగడం, తగ్గడం లాంటివి ఉంటాయి. జూన్ లేదా జూలైలో చిరంజీవి నుంచి ఈ ఏడాది మరో మూవీ వచ్చే అవకాశముంది. అదే 'విశ్వంభర'. ఇప్పటికే ఇది రిలీజైపోవాలి. కానీ గ్రాఫిక్స్ వచ్చిన ఘోరమైన విమర్శల దెబ్బకు ఆలస్యమైపోయింది. ఈ మూవీపై అయితే ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాల్లేవు.ఈ ఏడాది ద్వితియార్థంలో రాబోయే భారీ సినిమాల్లో ప్రభాస్ 'ఫౌజీ', ఎన్టీఆర్ 'డ్రాగన్'. ఈ రెండు చిత్రాల నుంచి ఇప్పటివరకు పోస్టర్స్ కూడా పెద్దగా రాలేదు. అలా అని బజ్ లేదనుకుంటే పొరపాటే. హైప్ అయితే చాలానే ఉంది. ప్రభాస్ది పీరియాడికల్ వార్ డ్రామా కాగా.. తారక్ది మూవీ. ఇవి ఏ మాత్రం క్లిక్ అయినా సరే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ గ్యారంటీ.పైనవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలు. ఇవి కాకుండా ఈ ఏడాది రిలీజయ్యే వాటిలో డకాయిట్, స్వయంభు, గూఢచారి 2, రౌడీ జనార్ధన, వృషకర్మ లాంటి మూవీస్ ఉన్నాయి. వీటిలో అడివి శేష్వి రెండున్నాయి. ఇతడి నుంచి సినిమా వచ్చి చాన్నాళ్లయిపోయింది. కానీ గట్టిగానే హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు.మరోవైపు నిఖిల్ చేసిన పీరియాడికల్ డ్రామా 'స్వయంభు', విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన', నాగచైతన్య 'వృషకర్మ'పై ప్రస్తుతానికి పెద్దగా బజ్ లేదు గానీ కంటెంట్తో హిట్ కొట్టే ఛాన్సులు వీటికి చాలా ఉన్నాయి. మరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి?(ఇదీ చదవండి: 'జన నాయకుడు' ట్రైలర్ రిలీజ్.. ఇది రీమేకేగా) -
బూతుల్ని జనాలకు అలవాటు చేస్తున్నారా?
సినిమా అనేది ఓ మాధ్యమం. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తారా సందేశం ఇస్తారా అనేది హీరోలు, దర్శకనిర్మాతల ఇష్టం. సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు గానీ చెడు మాత్రం చేయకూడదు. కానీ గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే మాత్రం ఈ విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా మాట్లాడుకునే బూతుల్ని పలు సినిమాల్లో యదేచ్ఛగా వాడేస్తున్నారు. మరి వీటిని జనాలకు అలవాటు చేయాలనుకుంటున్నారా? లేదంటే అసలేం చేద్దామనుకుంటున్నారు?(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)తెలుగు సినిమాలు కొన్నాళ్ల ముందు వరకు మరీ అంత కాకపోయినా కాస్త పద్ధతిగా ఉండేవి. ఫ్యామిలీ, కామెడీ స్టోరీలతో తీసిన మూవీస్ ఎప్పటికప్పుడు వస్తుండేవి. ఆడియెన్స్ కూడా చాలావరకు కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లేవారు. కానీ లాక్డౌన్, ఓటీటీల రాకతో ట్రెండ్ మారిపోయింది. నిజంగానే మారిందా లేదంటే దర్శకనిర్మాతలు పరిస్థితులకు తగ్గట్లు మార్చేస్తున్నారా అనేది ఇక్కడ అర్థం కాని విషయం.ఓటీటీ కంటెంట్కి సెన్సార్ లాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. కాబట్టి నచ్చిన డైలాగ్స్ నచ్చిన సీన్స్ పెట్టకోవచ్చు. అందుకే 'మీర్జాపుర్' లాంటి సిరీస్లు బ్లాక్బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సిరీస్ చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్తో తీశారు. కానీ బూతులు, యాక్షన్ సన్నివేశాలు దారుణంగా ఉంటాయి. ఈ తరహా కంటెంట్ ఇష్టపడేవాళ్లు వీటిని చూశారు. మిగిలిన వాళ్లు లైట్ తీసుకున్నారు. ఓటీటీ కంటెంట్ వేరు సినిమా కంటెంట్ వేరు. కానీ ఈ రెండింటి మధ్య గీత చెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై)ఎందుకంటే ఈ ఏడాది మార్చిలో నాని 'ద ప్యారడైజ్' సినిమా అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటివి చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. కానీ చివరలో ఉపయోగించిన ఓ బూతు పదం విని షాకయ్యారు. తల్లిని దూషించేలా ఉండే ఆ పదాన్ని సినిమాలో ఏ సందర్భంలో ఉపయోగించారో తెలీదు కానీ ప్రమోషనల్ వీడియోలో పెట్టడం మాత్రం అవసరమా అనే కామెంట్స్ కొన్ని వినిపించాయి. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'రౌడీ జనార్థన' టైటిల్ వీడియో లాంచ్ చేశారు. ఇందులోనూ రక్తపాతం, చివరలో బూతుపదాన్ని పెట్టారు.తెలంగాణ కల్చర్ అంటే పలువురు దర్శకులు మందు తాగడాన్ని చూపించినట్లు.. మాస్ సినిమాలనగానే కొందరు డైరెక్టర్స్, బూతుల్ని యదేచ్ఛగా వాడేస్తున్నారు. ఈ రెండు చిత్రాలే కాదు గతంలో ఇదే విజయదేవరకొండ 'అర్జున్ రెడ్డి'లోనూ బూతులు ఉంటాయి. విశ్వక్ సేన్ 'ఫలక్నుమా దాస్'లోనూ అలాంటి డైలాగ్స్ వినిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ దర్శకనిర్మాతలు బూతుల్ని జనాలకు అలవాటు చేసే పనిలో ఉన్నారా అనే సందేహం రావడం గ్యారంటీ!(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
పెద్ది మూవీతో బాక్సాఫీస్ క్లాష్.. ది ప్యారడైజ్ నిర్మాత ఏమన్నారంటే?
నాని హీరోగా వస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల-నాని కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ది ప్యారడైజ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో కమెడియన్ సంపూర్ణేశ్ బాబు బిర్యానీ పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత సుధాకర్ చెరుకూరి రిలీజ్ డేట్పై అడిగిన ప్రశ్నకు స్పందించారు.ఇప్పటికే ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 26న పెద్దిని రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. అయితే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ కూడా మార్చి 27 రోజున రిలీజవుతోంది. ఒక్క వ్యవధిలోనే రెండు పెద్ద సినిమాలు రానుండడంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పేలే లేదు. దీంతో ది ప్యారడైజ్కు రామ్ చరణ్ పెద్ది మూవీతో క్లాష్ తప్పదా? లేదా లాస్ట్లో విడుదల తేదీని మారుస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.దీనిపై నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పందించారు. మేము సాధ్యమైనంత త్వరగా మూవీని కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నామని వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయితే తప్పకుండా మార్చి 26నే ది ప్యారడైజ్ రిలీజ్ అవుతుందన్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద నాని వర్సెస్ రామ్ చరణ్ తప్పలా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే అప్పటికల్లా ఏదో ఒక మూవీ పోస్ట్పోస్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రిపోర్టర్: #Peddi తో #Paradise క్లాష్ తప్పదా? లేదా లాస్ట్లో మారుస్తారా?ప్రొడ్యూసర్ #SudhakarCherukuri: మార్చి 26న రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాం. అంతా పూర్తి అయితే మార్చి 26నే వస్తాం. pic.twitter.com/23VOD188Ao— greatandhra (@greatandhranews) December 20, 2025 -
'ప్యారడైజ్'లో తెలుగు కమెడియన్.. అస్సలు ఊహించలే
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ద ప్యారడైజ్'. వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలో రిలీజ్ చేయడమే టార్గెట్గా షూటింగ్ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు సందర్భంగా చిన్నపాటి మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు సడన్గా మూవీలో మరో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి చిన్నపాటి షాకిచ్చారు.'ద ప్యారడైజ్' మూవీలో నానితో పాటు మోహన్ బాబు నటిస్తున్నారు. హిందీ నటుడు రాఘవ్ జూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇది తప్పితే మిగతా నటీనటుల గురించి పెద్దగా తెలీదు. ఇప్పుడు ఈ మూవీలో తెలుగు కమెడియన్ సంపూర్ణేశ్ బాబు కూడా ఉన్నట్లు బయటపెట్టారు. బిర్యానీ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.సంపూ ఇప్పటివరకు కామెడీ సినిమాల్లో హీరోగా, సహాయ నటుడిగా చేశాడు. మధ్యలో ఓసారి బిగ్బాస్ షోలో పాల్గొన్నాడు. గత కొన్నాళ్ల నుంచి అయితే కొత్త మూవీస్ ఏం చేస్తున్నట్లు లేదు. అలాంటిది ఇప్పుడు 'ప్యారడైజ్'లో మాస్ క్యారెక్టర్లో నటిస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది. పోస్టర్లో రక్తంతో తడిసిన చేయి, భుజంపై గొడ్డలి చూస్తుంటే అసలు ఇది సంపూర్ణేశ్ బాబుయేనా అని సందేహం రాకమానదు.Meet @sampoornesh as 'BIRYANI' from #TheParadise ❤🔥Jadal's closest friend and the epitome of loyalty 💥💥Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, English, and Spanish.Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥An @anirudhofficial… pic.twitter.com/psohGvSkRm— SLV Cinemas (@SLVCinemasOffl) December 19, 2025 -
దసరా సూపర్ హిట్ కాంబో.. స్పెషల్ వీడియో రిలీజ్
దసరా బ్లాక్బస్టర్ హిట్ తర్వాత నాని మరోసారి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో జతకట్టారు. వీరిద్దరి కాంబో వస్తోన్న మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ సూపర్ హిట్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఇవాళ దర్శకుడు శ్రీకాంత్ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ది ప్యారడైజ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఈ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. 'రక్తం పడిన తర్వాత చరిత్ర ఓపెన్ అవుతుంది' అని చెబుతూ.. ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలో చూపిస్తూ డైరెక్టర్ కనిపించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదల చేయనున్నారు. -
ప్యారడైజ్లో విలన్గా మోహన్బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
ఎప్పుడూ ఏదో ఒకరకమైన గొడవలతో మంచు ఫ్యామిలీ నిత్యం వార్తల్లో ఉండేది. కానీ, ఈ మధ్య సినిమాల అప్డేట్స్తో మాత్రమే వార్తల్లో నిలుస్తోంది. మొన్నామధ్య విష్ణు 'కన్నప్ప', నిన్న మనోజ్ 'మిరాయ్', నేడు లక్ష్మి, మోహన్బాబుల 'దక్ష' సినిమాల అప్డేట్స్ నడుస్తున్నాయి. చూస్తుంటే మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి. కన్నప్పలో విష్ణు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. రిలీజ్కు రెడీ అయిన దక్షపుష్కరకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్కు మిరాయ్తో భారీ విజయం దక్కింది. మంచు లక్ష్మి కూడా తన తమ్ముళ్లలాగే మంచి హిట్ కొట్టాలన్న కసితో దక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఓ సీక్రెట్ను బయటపెట్టేసింది. అలా అనుకుంటే జీవితం నరకం'మనోజ్ కమ్బ్యాక్ నాకు ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తుంటాయి. అవి ముగిసిపోతే బాగుండు అని అందరూ అనుకుంటారు. కానీ, జీవితం ఇంతే అనుకుంటే నరకం.. జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. మనోజ్.. ఎంతో మనోవేదనను దాటుకుని ఇంతదూరం వచ్చాడు. అయితే మనోజ్కు, నాకు వయసవుతుంది.. కానీ, మా నాన్నకు వయసవ్వడం లేదు. ఆయన ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. లీక్ చేసిన మంచు లక్ష్మి(అంతలోనే నాలుక్కరుచుకున) అఫీషియల్గా వచ్చిందా? లేదా నేనే లీక్ చేశానా? సరే పోనీ.. నాని ఏమీ అనుకోడు. ఆ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఫోటోలు తీసుకునేటప్పుడు.. తన లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. శారీరక వ్యాయామాలు చేస్తున్నాడు. ఈ వయసులో చాలామంది యాక్టర్స్ ఏదో రెండు గంటలు పని చేసి, నేను ఇంతకంటే ఎక్కువ చేయను అని బిల్డప్ ఇస్తుంటారు.చాలాకాలం తర్వాత విలన్గాకానీ, నాన్నగారు అలా చేయరు. ఆయన సెట్స్కు వస్తే ఒక చిన్నబిడ్డలా ప్రవర్తిస్తారు. పెద్ద డైరెక్టర్ అయినా, కొత్త డైరెక్టర్ అయినా అందరితో ఒకేలా ఉంటారు. ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్' అని లక్ష్మీ మంచు చెప్పుకొచ్చింది. కాగా దసరా తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! దీనికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చాలాకాలం తర్వాత ఈ సినిమా కోసం మోహన్బాబు విలన్గా నటించనున్నారని ప్రచారం జరిగింది. మంచు లక్ష్మి కామెంట్స్తో ఇప్పుడది నిజమని రుజువైంది.చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
ఇప్పుడే ప్రారంభించాను!
సిసినీ ఇండస్ట్రీలో నటుడిగా 17 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు హీరో నాని. ‘అష్టా చమ్మా’ (2008 సెప్టెంబరు 5న రిలీజ్) చిత్రం ద్వారా నాని నటుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. స్వాతి, అవసరాల శ్రీనివాస్, భార్గవి ముఖ్య తారలుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.‘‘మీ అందరి ప్రేమతో 17 ఏళ్ళు పూర్తయ్యాయి. నేను ఇప్పుడే ప్రారంభించాను’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాని. ఇక ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నారు నాని. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో వేసిన సెట్స్లో జరుగుతోంది.ఈ చిత్రం నుంచి నాని పోస్టర్ను రిలీజ్ చేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల కానుంది. -
'జడలు ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు'.. ది ప్యారడైజ్ యాక్షన్ సీక్వెన్స్ వీడియో!
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్'. దసరాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే నాని ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్లో ఇంతకు ముందెన్నడు కనిపించని విధంగా రెండు జడలతో కనిపించారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. డిఫరెంట్ లుక్లో నాని కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ వీడియోను పంచుకున్నారు మేకర్స్. ఈ సీక్వెన్స్ను జైల్లో తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్లో నాని డిప్స్ కొడుతూ కనిపించారు. 'వాడి జడల్ని ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు' అనే డైలాగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ది స్పార్క్ ఆఫ్ ప్యారడైత్ పేరుతో ఈ సీక్వెన్స్ రాప్ వీడియోను రిలీజ్ చేశారు.అయితే ఈ చిత్రంలో నాని సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుందని టాక్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయెల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది. -
రెండు జడలతో నాని ఫస్ట్ లుక్.. ఫుల్ క్రేజీ
సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తున్న నాని.. ఇప్పుడు మరోసారి క్రేజీ పాత్రతో రాబోతున్నాడు. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతం నాని 'ద ప్యారడైజ్' మూవీ చేస్తున్నాడు. ఇదివరకే ఈ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజైంది. కాకపోతే నాని ఫేస్ రివీల్ చేయలేదు. ఇప్పుడు పూర్తిగా ముఖాన్ని చూపిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలానే పాత్ర పేరుని కూడా బయటపెట్టారు.(ఇదీ చదవండి: లేడీ యాంకర్ చేతబడి.. వాళ్లను చెప్పు తీసుకుని కొట్టాలి: యాంకర్ రవి)ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న 'ప్యారడైజ్'లో నాని.. రెండు జడలతో కనిపించబోతున్నాడు. ఈ పాత్రకు జడల్ అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వారం పది రోజుల క్రితమే దీన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలనుకున్నారు. కానీ 'కింగ్డమ్' రిలీజ్, తర్వాత సినీ కార్మికుల సమ్మె కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు షేర్ చేశారు.ఇందులో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్ అని రూమర్స్ వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలానే హిందీ నటుడు రాఘవ్ జుయెల్ విలన్ కాగా.. మోహన్ బాబు, బాబు మోహన్ ప్రతినాయక పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే గ్లింప్స్ కోసం ఇచ్చిన మ్యూజిక్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వచ్చే ఏడాది మార్చి 26న మూవీ పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ప్రముఖ నటి 'హుమా ఖురేషి' సోదరుడు హత్య)His Name/వాడి పేరు‘Jadal’‘జడల్’Calling a spade a spade. #THEPARADISE @odela_srikanth @anirudhofficial @SLVCinemasOffl @Dop_Sai @NavinNooli @artkolla @kabilanchelliah pic.twitter.com/gN3i0fPxv7— Nani (@NameisNani) August 8, 2025 -
తెలుగు సినిమాలో వేశ్య పాత్రలో కాయదు?
ఒక్క సినిమా సక్సెస్తో ఓవర్ నైట్ అయిపోయిన హీరోయిన్లు చాలామంది ఉంటారు. రీసెంట్ టైంలో అలా 'డ్రాగన్' అనే తమిళ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాయదు లోహర్. ఈ చిత్ర విజయంతో ఈమెకు అటు తమిళం, ఇటు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వీటితో పాటు ఇప్పుడు మరో క్రేజీ పాత్ర ఈమెని వరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటది? ఎవరా హీరో?అసోంకి చెందిన కాయదు లోహర్.. తెలుగులో ఇదివరకే 'అల్లూరి' అనే సినిమా చేసింది. కానీ ఇది ఫ్లాప్ అయ్యేసరికి తమిళంలో ప్రయత్నించింది. అక్కడ ఫేమ్ తెచ్చుకుంది. అలా మళ్లీ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ 'ఫంకీ'లో ఈమె హీరోయిన్గా చేస్తోంది. ఇప్పుడు నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్యారడైజ్'లోనూ కాయదునే హీరోయిన్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్ని భయపెడుతున్న మెహర్ రమేష్)అనౌన్స్మెంట్ వీడియోతోనే అటెన్షన్ సొంతం చేసుకున్న 'ప్యారడైజ్'లో నాని.. ఇప్పటివరకు చూడని డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నాడు. రాఘవ్ జూయల్ అనే హిందీ నటుడు ఇందులో విలన్ అని రీసెంట్గానే ప్రకటించారు. మోహన్ బాబు, బాబు మోహన్ కూడా విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారని లీక్స్ వచ్చాయి. ఇప్పుడు నానికి జోడిగా వేశ్య పాత్రలో కాయదు లోహర్ కనిపించబోతుందని అంటున్నారు.సాధారణంగా వేశ్య పాత్రలు అనగానే హీరోయిన్లు కాస్త వెనకడుగు వేస్తారు. కానీ కాయదు లోహర్ మాత్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈమెకు నానికి మధ్య బోల్డ్ సీన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమై, కాయదు రోల్ ఆకట్టుకుంటే మాత్రం ఈమె దశ తిరిగిపోవడం గ్యారంటీ. మరి వీటిపై ఓ క్లారిటీ వస్తే తప్ప ఏం మాట్లాడలేం.(ఇదీ చదవండి: కారణం లేకుండా విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తున్నారు: నాగవంశీ) -
ప్యారడైజ్లో ఎంట్రీ
‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘కిల్, గ్యారా గ్యారా’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్ జుయల్ ‘ది ప్యారడైజ్’లో భాగమయ్యారు. ఈ విషయాన్ని ప్రకటించి, ఓ వీడియోతో రాఘవ్ జుయల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది యూనిట్.‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘ది ప్యారడైజ్’ రూపొందుతోంది. నానీతో కలిసి మరో మరపురాని నటనను కనబరచడానికి రాఘవ్ సిద్ధంగా ఉన్నారు. హాలీవుడ్ స్టూడియోతో కలిసి పని చేయడం కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నాం’’ అని యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: సీహెచ్ సాయి. -
ప్యారడైజ్లోకి ఎంట్రీ
‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. హైదరాబాద్లో జరుగుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్లో నాని పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ‘ధగడ్ ఆగయా!’ అంటూ నాని సరికొత్త లుక్ రిలీజ్ చేశారు. ‘‘ది ప్యారడైజ్’ కోసం గ్రాండ్గా సెట్స్ వేశాం. 40 రోజుల హైదరాబాద్ షెడ్యూల్లో భాగంగా ఓ వారం పాటు కీలకమైన బాల్యం సన్నివేశాలు చిత్రీకరించాం. శనివారం నాని ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ‘దసరా’ పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. ‘ది ప్యారడైజ్’ ప్రపంచ స్థాయికి వెళ్లబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
పెద్ది vs ప్యారడైజ్.. ఒకరు కాదు పోటీలో ముగ్గురు
లెక్క ప్రకారం రామ్ చరణ్ పుట్టినరోజు నాడే 'పెద్ది' సినిమా (Peddi Movie) గ్లింప్స్ రిలీజ్ కావాలి. కానీ సాంకేతిక సమస్యల కారణంగా తాజాగా శ్రీరామనవమి కానుకగా విడుదల చేశారు. వీడియో బాగుంది. చివరి షాట్ కి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రిలీజ్ డేట్ దగ్గరే అసలు సమస్య వచ్చినట్లు అనిపించింది. (ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)ఎందుకంటే వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్బంగా మార్చి 27న థియేటర్లలో 'పెద్ది' రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్నిరోజుల క్రితం నాని 'ద ప్యారడైజ్' (The Paradise Movie) చిత్రాన్ని వచ్చే మార్చి 26న విడుదల చేస్తామని పేర్కొన్నాడు. అంటే ఈ రెండు చిత్రాల మధ్య పోటీ కన్ఫర్మ్ అయింది.ఇక్కడ చరణ్, నాని మధ్య పోటీ కాదు. మరో ఇద్దరి మధ్య కూడా ఉందని చెప్పొచ్చు. చరణ్ (Ram Charan) ఇదివరకే తండ్రి చిరంజీవితో సినిమా నిర్మించారు. నాని కూడా త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాబట్టి పెద్ది మూవీతో పోటీ పడతాడా అంటే సందేహమే అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా)ప్యారడైజ్ తీస్తుంది శ్రీకాంత్ ఓదెల కాగా.. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు. వీళ్లిద్దరూ కూడా సుకుమార్ శిష్యులే. ఒకవేళ పోటీ కచ్చితం అయితే మాత్రం సుక్క శిష్యుల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. మరోవైపు ప్యారడైజ్ కి అనిరుధ్ సంగీత దర్శకుడు కాగా.. పెద్ది చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కోలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా పోటీనే అనుకోవచ్చు. ఇలా ఒక్కరు కాదు ఈ రెండు చిత్రాల వల్ల ఏకంగా తలో ముగ్గురు మధ్య పోటీ అనుకోవచ్చేమో. మరి ఈ రెండింటిలో ఏది చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారనేది కూడా చూడాలి.(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్) -
త్వరలో చూస్తారు!
‘దసరా’(2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాని సంతృప్తిగా లేరని, అదేవిధంగా బడ్జెట్ బాగా పెరిగిపోవడంతో సినిమా ఆగిపోయిందంటూ గత కొద్దిరోజులుగా ఆన్లైన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ వార్తలపై చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. ‘‘ది ప్యారడైజ్’పై ఎలాంటి అనుమానాలొద్దు. మేము అనుకున్నవిధంగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ మూవీని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నామో త్వరలోనే చూస్తారు. ఆ సమయం వరకు పుకార్లు సృష్టిస్తూ కొందరు బతికేయచ్చు. ఎందుకంటే ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తుంటాయి కదా! మా సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను చాలా దగ్గరగా చూస్తున్నాం. అదేవిధంగా ఈ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కూడా గమనిస్తున్నాం. ప్రేమ, ద్వేశాన్ని రెండింటినీ తీసుకుని.. వాటన్నిటితో ఒక శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం. తెలుగులో ఉండే గొప్ప చిత్రాల్లో ఒకటిగా ‘ది ప్యారడైజ్’ ఉంటుంది. సినిమాపై పుకార్లు సృష్టిస్తున్న వారందరూ త్వరగా కోలుకోవాలి. అభిమానులంతా గర్వపడే చిత్రంతో నాని మీ ముందుకు వస్తారని మాట ఇస్తున్నాం’’ అని యూనిట్ పోస్ట్ చేసింది. ఈ సినిమా 2026 మార్చి 26న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమేరా: ఏఓ విష్ణు, సంగీతం: అనిరుధ్ రవిచందర్. -
అలాంటి జోకర్లందరూ జాగ్రత్తగా ఉండండి.. 'నాని' టీమ్ పోస్ట్
టాలీవుడ్ హీరో నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ సినిమా 'ది ప్యారడైజ్'(The Paradise ).. పోస్టర్తో పాన్ ఇండియా రేంజ్లో సినీ ప్రేక్షకులను మెప్పించిన ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఓటీటీ ఢీల్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. కేవలం గ్లింప్స్తోనే సంచలనం క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నాని అసంతృప్తితో ఉన్నారని, కొన్ని మార్పులు చేయాలని కోరినట్లు వైరల్ అయింది. ఆపై బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోవడం వల్ల ఈ సినిమాను ఆపేస్తున్నారని కథనాలు వచ్చాయి. అయితే, ఈ అంశంపై చిత్ర యూనిట్ గట్టిగానే రియాక్ట్ అయింది.సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు రూమర్స్ వైరల్ చేసేవారిని జోకర్స్తో పోలుస్తూ ఇలా చెప్పుకొచ్చారు. 'ది ప్యారడైజ్ ప్రాజెక్ట్పై ఎలాంటి అనుమానాలు వద్దు. మేము అనుకున్నట్లుగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని చాలా గొప్పగా తెరకెక్కిస్తున్నాం. దానిని మీరందరూ కూడా త్వరలో చూస్తారు. ఆ సమయం వరకు రూమర్స్తో కొందరు బతికేయవచ్చు. 'గజరాజు నడుస్తూ ఉంటే..గజ్జి కుక్కలు అరుస్తాయి'. ది ప్యారడైజ్ సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను మేము చాలా దగ్గరగా చూస్తునే ఉన్నాం. ఆపై ఈ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కూడా గమనిస్తున్నాం. మేము ప్రేమ, ద్వేశాన్ని రెండూ తీసుకుంటాము. వాటన్నిటితో ఒక శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం. తెలుగు పరిశ్రమలో ఉండే గొప్ప చిత్రాలలో ఒకటిగా ఈ మూవీ ఉంటుంది. సినిమాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.. ఫ్యాన్స్ అందరూ మెచ్చేలా ప్యారడైజ్ సినిమాతో నాని తిరిగొస్తాడని మాట ఇస్తున్నాం.' అని ఒక చిత్ర యూనిట్ ఒక పోస్ట్ చేసింది.హిట్ 3 టీజర్లో మోస్ట్ వయోలెంట్ ఆఫీసర్గా కనిపించిన నాని దానికి మించిన రేంజ్లో ది ప్యారడైజ్లో కనిపంచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వచ్చే సంవత్సరం మార్చి 26న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషలలో ది ప్యారడైజ్ విడుదల కానుంది. To all 🤡s out there, you feed on us... because we let you do so.#TheParadise is rising in all its glory. Rest assured, it is on the right track. And you all will witness it soon.Meanwhile, keep feeding on us as much as you can. Because...'Gajaraju nadiste..Gajji kukkalu…— THE PARADISE (@TheParadiseOffl) April 2, 2025 -
హిస్టారికల్ ప్యారడైజ్
‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై రూపొందుతోన్న ఈ మూవీ 2026 మార్చి 26న విడుదల కానుంది. కాగా ఈ సినిమా సరిగ్గా 365 రోజుల్లో తెరపైకి రానుందని పేర్కొని, ‘వన్ ఇయర్ టు గో... ఇండియన్ సినిమా విట్నెస్ ది మ్యాడ్నెస్’ అంటూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే విడుదలైన మా టీజర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్రిప్పింగ్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సాధించింది. హైదరాబాద్ చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ నానీని మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో చూపించనుంది. సుధాకర్ చెరుకూరి అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం, ఏఓ విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మా చిత్రం తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ సహా 8 భాషల్లో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.


