breaking news
Diwali 2025
-
బిగ్బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!
బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్బీ అమితాబ్ బచ్చన్ దీపావళి కానుక ఇపుడు నెట్టింట విమర్శలకు తావిస్తోంది. సిబ్బందికి దివాలీ కానుకకు సంబంధించిన వీడియో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది బిగ్బీ దివాలీ గిఫ్ట్కు మెచ్చుకోగా, మరికొందరు ఆయన కానుకపై నిరాశగా పెదవి విరిచారు. సిగ్గు చేటు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే... బిగ్బీ తన సిబ్బందికి దీపావళి కానుకగా రూ.10,000 నగదు, ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారంటూ ముంబైలోని అమితాబ్ నివాసం జుహూ వద్ద ఒక కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను తీసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాలీవుడ్ అతిపెద్ద నటుడు అమితాబ్ బచ్చన్ తన ఇంటి సిబ్బందికి ,భద్రతా సిబ్బందికి రూ. 10,000 నగదు , ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారు అనే క్యాప్షన్తో ఈ వీడియోనే షేర్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం గమనార్హం. ఈ వీడియో వేలాది వీక్షణలతోపాటు నెటిజన్లలో చర్చకు దారితీసింది. పండుగ సీజన్లో తన ఉద్యోగులను ప్రశంసించినందుకు కొందరు అమితాబ్ను ప్రశంసించారు. మరికొందరు బిగ్బి లాంటి వాళ్ల స్థాయికి, ఆస్తులతోపోలిస్తే ఇది "చాలా తక్కువ" ,"ఇది చాలా విచారకరం అనే విమర్శలు వెల్లువెత్తాయి. మరికొందరైతే, రోజంతా మీ భద్రకోసం, మీకోసం కాపలాకాసే వారికి కేవల 10వేల రూపాయలా, సిగ్గు చేటు, దీపావళి నాడు ప్రతి ఒక్కరూ తమ సిబ్బందికి రెట్టింపు జీతం ఇవ్వాలి. కొంతమంది 20-25 వేలు బోనస్గా కూడా ఇస్తారు" అంటూ స్పందించారు. పలు కంపెనీలు, కార్పొరేట్లు తమ కార్మికులకు లగ్జరీ దీపావళి కానుకలు, హ్యాంపర్లు బహుమతిగా ఇస్తున్న వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయిన సమయంలో ఈ ట్రోలింగ్ విపరీతంగా నడుస్తోంది. View this post on Instagram A post shared by Sagarthakurvlog (@sagar.thakur84)నోట్: ఈ వీడియోలో అమితాబ్ క్లిప్లో పలువురు సిబ్బంది, భద్రతా సిబ్బంది బహుమతులు అందుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దీనిపై ఎలాంటి ధృవీకరణ లేదు. -
ఆకుపచ్చని చీరలో ఇషా స్టన్నింగ్ లుక్:! హైలెట్గా రూబీ డైమండ్ నెక్లెస్..
రిలయన్స్ రీటైల్ హెడ్ ఇషా అంబానీ ఎప్పటికప్పుడు తనదైన ఫ్యాషన్ సిగ్నేచర్తో కనిపిస్తుంటారామె. అటు తన వ్యాపార సామ్రాజ్యంలో తనైదైన పాత్ర పోషిస్తూనే.. ఇటు ఫ్యాషన్ పరంగా బాలీవుడ్ దిగ్గజ నటులకు తీసిపోని లుక్లో మెరుస్తుంటారామె. అందులోనూ అంబానీ కుటుంబికులు ధరించే వస్తువులు అత్యంత లగ్జరియస్ గానూ, చారిత్రాత్మకంగా పేరుగాంచిన అమూల్యమైన ఆభరణాలు తప్పక ఉంటాయి. ఈ ఏడాది దివాలీ వేడుకలకు ఇషా సన్నద్ధమైన అందమైన లుక్కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఇషాకి సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ నమ్రతా సోని మేకప్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. “అత్యంత అందమైన ఇషా అంబానీతో దీపావళి,” అనే క్యాప్షన్ని జోడించి మరి ఈ వీడియోని పోస్టు చేసింది నమ్రతా సోని. దీపావళి వేడుకల కోసం ఇషాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వీడియోని షేర్ చేసింది. ఈ వేడుకల కోసం ఇషా డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన రంగురంగుల పట్టు చీరను ధరించింది. ఆ చీరలో రాజవంశస్థురాలి మాదిరి దర్పంతో వెలిగిపోతుందామె. ఈ ఎథ్నిక్ చీరకి రూబీ, డైమండ్, ముత్యాలతో పొదిగిని ఆభరణాన్ని జత చసింది. పూల ఆకారంలో ఉన్న నెక్లెస్ ఇషాని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేలా చేసింది. అందుకు తగ్గ చెవిపోగులు, బ్రాస్లెట్లతో ఫ్యాషన్కే అర్థం చెప్పేలా అత్యంత అద్భుతంగా ఉందామె లుక్. అందులోనూ ఆ ఆకుపచ్చని చీరకు అత్యంత కాంట్రాస్టింగ్గా ధరించిన ఎరుపు చీర ఆమె లుక్ మరింత అందంగా ఆకర్ణణీయంగా కనిపించేలా చేసింది. కాగా, ఇషా అంబానీ తన సోదరుడు ఆకాష్ అంబానీలతో కలిసి తన పుట్టినరోజు వేడుకని అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఈ వేడుకకు బాలీవుడ్ అతిరథ మహారథులంతా కదిలివచ్చి మరి సందడి చేశారు. View this post on Instagram A post shared by namratasoni (@namratasoni) (చదవండి: ఫ్యాషన్ సెన్స్.. కారాదు నాన్సెన్స్..) -
మనవరాలితో పోటీ : సీనియర్ నేత దివాలీ సెలబ్రేషన్స్
అనంతపురం జిల్లాకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి డా. ఎన్ రఘువీరారెడ్డి ఈ దీపావళిని అందరికంటే భిన్నంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట అందర్నీ ఆకట్టు కుంటోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సహా కీలక బాధ్యతలు నిర్వర్తించిన డా. నీలకంఠం రఘువీరారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ, ప్రకృతిలో మమేకమై, వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపు తున్నారు. ఆయన ఫోటోలు బాగా వైరలయ్యాయి. రఘువీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటారు. తరచూ అనేక వీడియోలను పోస్ట్ చేస్తూ, పలువురికి ప్రేరణగా నిలుస్తూ ఉంటారు. అంతేకాదు తనముద్దుల మనవరాలితో ఆనందంగా గడుపుతున్న విశేషాలను గతంలోనూ పంచుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా మనవరాలితో చిన్నపిల్లాడిలా సంతోషంగా గడిపిన ఒక వీడియోను షేర్ చేశారు. దీపాల వెలుగులు, స్వీట్లతోపాటు మనవరాలితో సరదాగా ఆర్మ్ రెజ్లింగ్ మ్యాచ్తో ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నాను అని పోస్ట్ చేశారు.Celebrated Diwali with smiles, sweets, lights and a friendly Arm wrestling match with my granddaughter! 💪✨ pic.twitter.com/DegpdBQ6Oq— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) October 22, 2025దీంతో చాలామంది అభిమానులు ఫిదా అవుతున్నారు. అదిరింది సార్...సర్ చిన్న పాప సార్ నొప్పి పుడుతుంది విజయాన్ని తనకే ఇచ్చేయండి సార్...మమ్మల్ని అందరినీ గెలుపు వైపు నడిపించినట్టుగానే.. పాపను కూడా గెలిపించండి అని కమెంట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మాకు రాజకీయాల్లో నచ్చిన వ్యక్తి మీరే.. మళ్లీ రాజకీయాల్లోకి రావాలి అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. -
మళెనాడు దీపావళి చాలా స్పెషల్
దీపావళి పండుగ ముగిసినా..ఆ టపాసులు, చిచ్చుబుడ్డుల ఆనందోత్సాహం మాత్రం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. అయితే ఈ పండుగను దేశంలో పలు రాష్ట్రాల ప్రజలు జరపుకునే విధానంలో విభిన్న సంస్కృతులు కనబడతాయి. అందులోనూ కన్నడ నాట ఈ పండుగ వ్యవసాయ మూలాలను గుర్తుకుతెచ్చేలా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఈ పండుగ సమయంలోనే దీపావళి బొనాంజాలా కర్ణాటకలోని ఓ గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన కాంతార మూవీ ఏ రైంజ్లో సూపర్ డూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఎప్పటికీ మన మూలాలుతో కూడిన సినిమా అయినా పండుగైనా..అదరహో అనేలా అందర్నీ ఆకర్షిస్తుంది, కట్టిపడేస్తుంది. అందుకు ఉదాహరణే కర్ణాటకలోని మలేనాడు గ్రామంలో జరిగే దీపావళి పండుగ. ఇక్కడ ఈ వేడుక ఏవిధంగా జరుగుతుందంటే..పశ్చిమ కనుమల ప్రాంతమైన కర్ణాటకలో మళెనాడులో దీపావళి పండుగ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా జరుగుతంది. వ్యవసాయ ఆధారిత దేశమైన మన మూలాన్ని గుర్తుకుతెచ్చే సంప్రదాయబద్ధంగా జరపుకుంటారు అక్కడి ప్రజలు. అక్కడ దీపావలిని మూడు రోజుల పండుగలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అక్కడి ప్రజలు.తొలిరోజు: బూరే హబ్బా, పశువుల పూజమళెనాడు దీపావళి ప్రారంభాన్ని బూరే హబ్బా సూచిస్తుంది. అంటే ఇది మన ఆరోగ్యం కోసం చేసే ధన్వంతరి పూజ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధాలు, మూలికలను గ్రామస్తులు పవిత్రంగా భావిస్తారు. ఈ దీపావలి రోజు మంచి అమూల్యమైన మూలికలను, ఔషధాలను సేకరించి వాటిని కొత్త కొండలో నింపుతారు. ఆ తర్వాత వ్యవసాయానిక ఆధారమైన పశువులను పూజిస్తారు. ఇక కుండలో సేకరించిన మూలికలలోకి..ఆ రోజు రాత్రి అప్పుడే తీసుకువచ్చిన నీటితో నింపడమే కాకుండా స్నానపు పెద్దకుండను కూడా నీటితో నిప్పుతారు. ఇది శుద్ధి చేసే ప్రక్రియ అన్నమాట. ఇది ఆరోగ్యం, పరిశుభ్రత విలువలను నేర్పించేలా సాగుతుంది తొలి రోజు పండుగ.రెండోరోజు లక్ష్మీ పూజ, నూనె స్నానాలురెండో రోజు ఇంటిని రంగవల్లులతో అలంకరించి మట్టి దీపాలు, అరటి ఆకులతో అత్యంత శోభాయమానంగా అలంకరిస్తారు. అలాగే నూనెతో స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. ఈ లక్ష్మీ పూజ చేసేరోజు ఆరోగ్య ప్రదంగా ఉండేలా నూనె స్నానాలు చేసి ఇంటిల్లాపాది లక్ష్మీ పూజ చేస్తారు. ఆఖరి రోజుచివరి రోజు వివిధ పిండి వంటలు చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, బాణసంచా కాల్చడం వంటివి ఉంటాయి. అయితే గ్రామస్తులు ముఖ్యంగా చేసే వంటకాలేంటంటే హోలిగే(బొబ్బట్లు), చక్కులి(జంతికలు), కడుబు(బియ్య పిండితో చేసి కుడుములు మాదిరి ) వంటకాలను తప్పనిసరిగా చేస్తారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మలెనాడులో ప్రత్యేకంగా తీర్థహాళ్లి ప్రాంతంలో ఈ దీపావళి రోజున దీపాలను వెలిగించడంతో తోపాటు బలి మహారాజును స్వాగతించే తంతు ఉంటుంది. అందుకోసం కాగాడాలను పంట్టుకుని చేలగట్ల వద్దకు వస్తారు. దీపావళి అమవాస్య మరునాడు బలిపాఢ్యమి..ఆ రోజు ఆయన భూమ్మీదకు వచ్చి సందర్శిస్తాడని అక్కడి ప్రజల నమ్మకం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చివరగా పట్టణాల్లో జరిగే ఆధునిక శోభతో జరిగే దీపావళి పండుగలా కాకుండా మలెనాడులో ప్రకృతితో మమేకమై వ్యవసాయంతో ముడిపడిన పండుగగా జరుపుకోవడం విశేషం. ఇక్కడ ఆధ్యాత్మికతతో తోపాటు, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతిని మిళితం చేసేలా ఈ వెలుగుల పండుగును జరుపుకుంటారు. The deepavali celebrated on Malenadu area especially Thirthahalli, putting Deepada stock , and welcoming Bali maharaj to see his land ,it's a symbolic lighting arrangements to show our native to Bali maharaj , as we belive he visits at the time of Deepavali Bali Padyami.… pic.twitter.com/JQ5WzqCzL1— Madhukara R Maiya 🇮🇳 (@madhumaiya) October 22, 2025 (చదవండి: 200 ఏళ్లుగా అక్కడ దీపావళి లేదు..! కానీ మహాలయ అమావాస్యే..) -
అక్కడ మహాలయ అమావాస్యే దీపావళి పండుగ..!
దేశమంతా దివ్వెల కాంతులు అద్దుకుని, తారాజువ్వలతో నింగి కూడా మెరిసి΄ోయేది దీపావళి అమావాస్య నాటి రాత్రే! కానీ కర్ణాటక, దావణగేరేలోని లోకికేరే పల్లెలో మాత్రం సీన్ చిత్రంగా ఉంటుంది. ఆ ఊరివాసులు దాదాపు రెండువందల ఏళ్లుగా దీపావళి పండుగను జరుపుకోవట్లేదు. ఆ రాత్రి అక్కడ ముంగిళ్లలో దీపాల కొలువు.. టపాసుల సందడి కాదుకదా కనీసం వీధి దీపాలు కూడా వెలగని విషాదం కనిపిస్తుంది. దానికి ఒక నేపథ్యం ఉంది.అదేంటంటే...రెండు శతాబ్దాల కిందట.. దీపావళికి ముందు.. పండుగకోసం అవసరమైనవి తీసుకురావడానికి లోకికేరేకి చెందిన కొంతమంది యువకులు దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లారు. ఆ వెళ్లినవారు ఎంత పొద్దెక్కినా తిరిగి రాలేదు. గ్రామస్తులంతా ఆ అడవికి వెళ్లి అణువణువు గాలించారు. అయినా లాభం లేక΄ోయింది. వాళ్ల ఆనవాళ్లను కూడా కనిపెట్టలేకపోయారు. ఆ యువక బృందం ఆ రాత్రే కాదు.. ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ బాధలో వాళ్లు దీపావళి జరుపుకోలేదు. తర్వాత ఏడాదికీ ఆ విషాదాన్ని మరువలేక΄ోయింది ఆ గ్రామం. కొంతమంది పండుగ ఆనవాయితీకి అంతరాయం ఎందుకు కలిగించాలని ప్రయత్నించి పండుగ జరిపారు. యాదృచ్చికంగా వాళ్లు నష్టాలను చవిచూడటం, అనారోగ్యం, ఇంట్లో దొంగలు పడటం లాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు. కుర్రాళ్లు కనిపించకుండా ΄పోయిన బాధను మరిచి వాళ్లు పండుగ జరుపుకున్నందుకే ఆ అరిష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని నమ్మారు. దాంతో ఆ నమ్మకమే స్థిరపడి నాటినుంచి ఆ ఊళ్లో దీపావళినాడు ఊరంతా దీపాలు వెలిగించి దీపావళి జరపకోవడాన్నే సంప్రదాయంగా మలుచుకున్నారు. అదలా ఇప్పటికి రెండువందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.అయితే...మహాలయ అమావాస్యను మాత్రం ఆ పల్లెలోని పూర్వీకుల సంస్మరణ దినంగా పండుగ జరుపుకుంటారు. ఆ రోజు వాళ్ల సంప్రదాయ, సంస్కృతుల మేరకు దీపావళి నాడు చేయాల్సిన కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తారు. అంటే మహాలయ అమావాస్యనాడు తమదైన తీరులో దీపావళి జరుపుకుంటారు. ఒకరకంగా మహాలయ అమావాస్యే వారికి దీపావళి. ఇదీ లోకికేరే దీపావళి కథ! (చదవండి: దీపావళి 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..) -
వైభవంగా నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ ఉత్సవాలు (ఫొటోలు)
-
దీపావళి వేళ అపశ్రుతి..
భోపాల్: దీపావళి పండగ నాడు మధ్యప్రదేశ్లో కాల్షియం కార్బైడ్ తుపాకీలతో వందమందికి పైగా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. క్షతగాత్రుల్లో అత్యధికులు 8–14 ఏళ్ల బాలలే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్తోపాటు పొరుగునే ఉన్న విదిశ జిల్లాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సుమారు 60 మంది భోపాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, కళ్లకు గాయాలైన ఐదుగురు సహా మిగతా బాధితులు విదిశలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. గ్యాస్ లైటర్, ప్లాస్టిక్ పైపు, కాల్షియం కార్బైడ్ను ఉపయోగించి తయారు చేసిన మొరటు తుపాకులను దీపావళి సందర్భంగా జనం విచ్చలవిడిగా కొనుగోలు చేశారు. ‘తుపాకీలోని కాల్షియం కార్బైడ్ నీటితో కలిసినప్పుడు ఎసిటలీన్ గ్యాస్ తయారవుతుంది. దానికి నిప్పురవ్వ తగలగానే పేలిపోయేలా రూపొందించారు. ఈ పేలుడుతో ప్లాస్టిక్ పైపు నుంచి చిన్నచిన్న ముక్కలు వెలువడతాయి. ముఖం, కళ్లు సహా ఇవి తగిలిన ప్రతిచోటా గాయాలయ్యాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి’అని భోపాల్ చీఫ్ మెడికల్ హెల్త్ అధికారి మనీశ్ శర్మ చెప్పారు. అయితే, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. దీపావళి నాడు ఒక్క భోపాల్ నగరంలోనే ఇటువంటి 150 కేసులు తమ దృష్టికి వచ్చాయన్నారు. భోపాల్ ఎయిమ్స్లో ఈ తుపాకీ కారణంగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలుడికి చూపును పునరుద్ధరించేందుకు వైద్యులు ప్రయతి్నస్తున్నారని ఆయన వెల్లడించారు. హమీదియా ఆస్పత్రిలో మరో ఇద్దరు చిన్నారులకు ఇదే రకమైన చికిత్స జరుగుతోందన్నారు. కళ్లకు గాయాలతో ఈ ఆస్పత్రిలో పది మంది చిన్నారులు చేరారన్నారు. విదిశ జిల్లా ఆస్పత్రిలో చూపు తీవ్రంగా దెబ్బతిన్న ఐదుగురు చిన్నారులకు సైతం చూపును తిరిగి తెచ్చేందుకు చికిత్స చేస్తున్నామని కంటి వైద్య విభాగం అధిపతి ఆర్కే సాహు చెప్పారు. కాగా, ప్రమాదకరమైన కార్బైడ్ పైప్ గన్లను విక్రయించకుండా చూడాలంటూ ఈ నెల 18వ తేదీన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అధికారుల సమావేశంలో కోరారు. అయినప్పటికీ వీటి విక్రయం, వాడకం యథావిధిగా జరిగిపోయిందని బాధితుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. -
బ్రూనైలో సేవ కార్యక్రమాలతో ఘనంగా దీపావళి వేడుక
బ్రూనై దారుస్సలాం తెలుగు సంఘం, దీపావళి పండుగను దాతృత్వం సేవా కార్యక్రమాలతో అర్థవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు విల్లేజ్ పందాన్ బి ప్రాంతంలోని పాదచారుల మార్గంలో సమాజ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని సంఘం ప్రతి త్రైమాసికం శుభ్రపరుస్తూ వస్తోంది. ఈసారి బృందం ఏడు ట్రక్కుల వ్యర్థ పదార్థాలను సేకరించి, వాటిని టెలిసాయ్ రీసైక్లింగ్ సెంటర్కు తరలించింది.ఈ కార్యక్రమానికి సొమునాయుడు దాది, సతీష్ పొలమత్రసెట్టి నాయకత్వం వహించగా, రమేష్ బాబు బదరవూరి, చింత వెంకటేశ్వరరావు మద్దతు అందించారు. పనగా బి గ్రామాధ్యక్షుడు శ్రీ మహమ్మద్ రవియాని బిన్ మోర్నీ గారి నేతృత్వంలోని MPK బృందం సమన్వయం, సహకారం అందించింది.అదే రోజున, సంఘం సభ్యులు రిపాస్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 24 యూనిట్ల రక్తం విజయవంతంగా సేకరించగా, కొంతమంది సభ్యులు ఆరోగ్య కారణాల వల్ల తమ రక్తదానాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నవీన్ కుమార్ సురపనేని సమన్వయం చేశారు. ఈ సేవా కార్యక్రమాలకు భారత రాయబారి హిజ్ ఎక్సలెన్సీ శ్రాము అబ్బగాని, పుష్పా అబ్బగాని హాజరై, సభ్యులను అభినందించి, సేవా కార్యక్రమాల పట్ల ప్రశంసలు తెలిపారు.తెలుగు సంఘం అధ్యక్షుడు వెంకట రమణ రావు సూర్యదేవర మాట్లాడుతూ.. “దీపావళి పండుగ ఆత్మీయత, వెలుగు దాతృత్వానికి ప్రతీక. సమాజానికి సేవ చేయడం, శుభ్రతా కార్యక్రమాలు రక్తదానం వంటి చర్యలు ఈ పండుగను మరింత అర్థవంతంగా మారుస్తాయి. సభ్యుల ఉత్సాహం సేవా మనసు సంఘానికి గర్వకారణం.” అని తెలిపారు.(చదవండి: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు) -
రష్యా ముడి చమురుకు కత్తెర
వాషింగ్టన్: భారతీయులతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్, అమెరికాల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవాలని మోదీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో మంగళవారం రాత్రి జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నారు. సంప్రదాయ చమురు దీపాన్ని స్వయంగా వెలిగించారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం అధికంగా ముడిచమురు కొనుగోలు చేయబోదని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా చమురు విషయంలో ఆయన తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలును పూర్తిగా ఆపేస్తామంటూ భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పరిమితంగానే కొనుగోలు చేస్తుందంటూ తాజాగా వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీపావళి వేడుకల్లో ఆహా్వనితులను ఉద్దేశించి ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. ట్రంప్ ఏం చెప్పారంటే... ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ ‘‘మీ ప్రధానమంత్రి మోదీతో ఇప్పుడే మాట్లాడాను. మా మధ్య చక్కటి సంభాషణ జరిగింది. వాణిజ్యం సహా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ జరిగింది. ఎందుకంటే ఆ అంశంపై మోదీకి ఎక్కువ ఆసక్తి ఉంది. మోదీ నిజంగా గొప్ప వ్యక్తి. ఆయన నాకు చాలాఏళ్లుగా మంచి మిత్రుడు. మేమిద్దరం ఎంతో స్నేహంగా ఉంటాం. భారత్–పాకిస్తాన్ సంబంధాలపైనా మోదీతో చర్చించాను. పాకిస్తాన్తో యుద్ధాలు వద్దన్న అభిప్రాయం మా సంభాషణలో వ్యక్తమైంది. భారత్, పాకిస్తాన్లతో అమెరికాకు ఎలాంటి యుద్ధాలు, విభేదాలు లేకపోవడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. కీలక ఒప్పందాలపై కలిసి పని చేస్తున్నాంవైట్హౌస్ వేడుకల అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారతీయులను ఎంతగానో అభిమానిస్తున్నానని చెప్పారు. మోదీతో ఫోన్లో మాట్లాడానని, ఆయనతో తనకు చక్కటి సంబంధాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారత్ అధికంగా(టూ మచ్) ముడి చమురు కొనుగోలు చేయబోదని ఉద్ఘాటించారు. కొన్ని కీలక ఒప్పందాలపై భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని వివరించారు. తనలాగే మోదీ కూడా ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవడాన్ని కళ్లారా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్ భారీగా కత్తెర వేస్తుందని తాను భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చాలావరకు తగ్గిపోవడం తథ్యమని అన్నారు. ముడిచమురు దిగుమతుల తగ్గింపు ప్రక్రియ చాలాకాలం కొనసాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు ఎంతగానో తోడ్పాడు అందిస్తున్నాయని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలకు భారత్–అమెరికన్లు సారథ్యం వహిస్తున్నారని, వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అదే మనకు దారిదీపం వైట్హౌస్లో దీపావళి పండుగకు అడోబ్ సంస్థ సీఈఓ శంతను నారాయణ్, మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మోహ్రోత్రా, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, అమెరికాలో భారత రాయబారి వినయ్మోహన్ క్వాత్రా, ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ దీపావళి సందేశాన్ని విడుదల చేశారు. ‘‘చీకటిపై వెలుగు విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం విజయానికి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపం వెలిగిస్తున్నాం. దీపావళి సమయంలో ప్రాచీన గాథలను గుర్తుచేసుకోవాలి. శత్రువులు పరాజయం పాలైన, అవరోధాలు తొలగిపోయిన, సామాన్యులకు విముక్తి లభించిన గాథలను మనం తెలుసుకోవాలి. నిండుగా వెలుగులు విరజిమ్ముతున్న దీపం మనకు దారి చూపిస్తుంది. జ్ఞానమార్గంలో నడవాలని, శ్రద్ధతో పనిచేయాలని, మనకు లభించే ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేయాలని బోధిస్తుంది’’ అని ట్రంప్ వివరించారు. మోదీకి ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు ఫోన్ చేసి మాట్లాడి, దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలు కలిసికట్టుగా పనిచేయాలని, ప్రపంచాన్ని వెలిగిస్తూనే ఉండాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేలి్చచెప్పారు. ఉగ్రవాదంపై భారత్, అమెరికాలు ఉమ్మడిగా పోరాటం చేయాలన్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్, మోదీ సంభాషణలో పాకిస్తాన్ ప్రస్తావన రాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. -
సోదర ప్రేమ, భగినీ హస్త భోజనం : ముహూర్తం ఎపుడంటే
ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకునే వెలుగుల పండగ దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. దీపావళిని అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఇందులో ఒకటి అన్నా చెల్లెళ్ల పండగ ‘భగినీహస్త భోజనం’. అదే బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ద విదియతో ముగుస్తాయి. అసలేంటీ భగినీహస్త భోజనం తెలుసుకుందాం.భగినీ హస్త భోజనం లేదా భాయ్ ధూజ్సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. "భాయ్ ధూజ్'' అనే పేరుతో నార్త్ ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందింది. మన పురాణాల ప్రకారం యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేక పోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది. ఇద్దరూ చాలా సంతోషంగా గడుపుతారు. ఈ సంతోషంలో అన్నయ్యను ఒక కోరిక కోరుతుంది సోదరి. అక్కాచెల్లెలు చేతితో అన్నం తింటే వదిలిపెట్టు అన్నయ్యా కోరుకున్నదట ఆమె. దీనికి ఎంతో సంతోషించిన యమధర్మరాజు కార్తీకమాస శుక్ల పక్ష విదియనాడు ఏ అన్నయ్య అక్క చెల్లెలింటికి వెళ్ళి అన్నం తింటాడో ఆ అన్నయ్యకి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా ఉంటుందని అనుగ్రహించాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది. అలా ఈ రోజు తమ సోదరి చేతి భోజనం చేయడం వలన అప మృత్యు భయం తొలగిపోతుందని ఓ నమ్మకం. ఈ రోజున తన సోదరుడిని గౌరవంగా చూసుకునే ఏ సోదరి అయినా ఎల్లకాలం సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటుందని చెప్పాడు. అందుకే దీనిని సోదరి ద్వితీయ అని పిలుస్తారు. ఎక్కడున్నా ఈ రోజు కచ్చితంగా అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు.ఈ ఏడాది స్పెషల్ : ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల దీర్ఘాయుష్షు, ఆనంద , శ్రేయస్సు కోసం యముడిని పూజించడం ద్వారా, వారి నుదుటిపై తిలకం (చంద్రుని గుర్తు) పూయడం ద్వారా, పవిత్ర తోరం (రక్షా సూత్రం) కట్టడం ద్వారా ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణులపై ఆప్యాయత, బహుమతులను కురిపిస్తారు. ఈ సంవత్సరం, ఆయుష్మాన్ యోగా , శివవాస యోగా అనే రెండు శుభ సంయోగాలు ఒకేసారి సంభవించడం వల్ల భాయ్ దూజ్ ప్రాముఖ్యత పెరిగింది.ముహూర్తం : 2025 భాయ్ దూజ్ పంచాంగం ప్రకారం, కార్తీక శుక్ల ద్వితీయ తిథి అక్టోబర్ 23 రాత్రి 10:46 గంటల వరకు ఉంటుంది. తిలకం, పూజకు అత్యంత శుభ సమయం మధ్యాహ్నం 1:13 నుండి మధ్యాహ్నం 3:28 వరకు ఉంటుంది. -
పండగపూట ప్రమాదం.. నా భుజం వరకు మంటలు..: బుల్లితెర నటి
దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఇంటి ముంగిట దీపాలు వెలిగించడంతో పాటు పలురకాల పటాసులు కాలుస్తుంటారు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హిందీ బిగ్బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్, బుల్లితెర నటి ప్రియా మాలిక్ (Priya Malik) కూడా అందరిలాగే దీపావళిని వేడుకగా సెలబ్రేట్ చేసుకుంది. ఇరుగుపొరుగువారితో కలిసి ఫోటోలు దిగింది. ఈ సమయంలో తన వెనకున్న దీపానికి ఆమె డ్రెస్ అంటుకుంది.ఫోటోలు దిగుతుండగా..క్షణాల వ్యవధిలోనే అది పెద్ద మంటగా మారింది. కుడి భుజం దగ్గరివరకు అగ్నిరవ్వలు ఎగిసిపడ్డాయి. అది చూసిన నటి తండ్రి.. ఆమె డ్రెస్ చింపేశి ఆమెను కాపాడాడు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ఈ సంఘటన తల్చుకుంటేనే భయంగా ఉంది. నేను, నా కుటుంబసభ్యులు ఇంకా షాక్లోనే ఉన్నాం. ఫోటోలు దిగే సమయంలో నా డ్రెస్కు నిప్పంటుకుంది. నన్ను కాపాడటం కోసం నాన్న డ్రెస్ చింపేశాడు. దానివల్లే నేను బతికిబట్టకట్టాను.నాకే ఆశ్చర్యం!చాలామంది ఏమనుకుంటారంటే.. ఇలాంటివి మనకెందుకు జరుగుతాయిలే అని లైట్ తీసుకుంటారు. కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల నా ప్రాణాలే పోయేవి. నాన్న హీరోలా వచ్చి కాపాడాడు. భుజాలు, వీపు, చేతివేళ్లపై కాలిన గాయాలున్నాయి. చిన్నపాటి గాయాలతో బయటపడ్డందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. సంతోషకర విషయమేంటంటే.. ఆ ప్రమాదం జరిగిన సమయంలో నా చేతిలో నా కొడుకు లేడు అని చెప్పుకొచ్చింది. బిగ్బాస్ 9తో పాపులర్ అయిన ప్రియ మాలిక్.. 2022లో ఎంటర్ప్రెన్యూర్ కరణ్ బక్షిని పెళ్లాడింది. వీరికి 2024లో కుమారుడు జోరావర్ జన్మించాడు.చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ -
హీరోయిన్ శ్రియ దీపావళి లుక్.. పండగ కళ ఉట్టిపడేలా! (ఫోటోలు)
-
దీపికా పదుకోన్ దివాలీ సర్ప్రైజ్.. మహారాణిలా బుజ్జి ‘డింపుల్ క్వీన్’ (ఫొటోలు)
-
కార్తీకమాసం ప్రారంభం.. ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
వైట్హౌజ్ దీపావళి సెలబ్రేషన్స్లో ట్రంప్.. వైరల్ అవుతున్న ఫొటోలు
-
చిరంజీవి ఇంట్లో నయనతార ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్..ఫొటోలు వైరల్
-
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో వెండి నాణేల పంపిణీ, ఆనందోత్సాహాల్లో భక్తులు
అటు దేశవ్యాప్తంగా, ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. చిన్నాపెద్దా కులమత భేదాలు లేకుండా వెలుగుల పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయాలు సర్వాంగ సుందరంగా విద్యుద్దీప కాంతులతో వెలిగిపోయాయి. అయితే తెలంగాణా,హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి దేవాలయంలో దీపావళి సంబరాలు ఎప్పటిలాగానే విశేషంగా నిలిచాయి.వెండి బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద కొలువై ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికొలువైన ఉన్న వెండి నాణేలను పంపిణీ చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు భక్తులు తరలి వచ్చారు. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సంపదకు మారుపేరైన అమ్మవారిని దర్శించుకున్న మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో భక్తులకు వెండి నాణేలు పంపిణీ చేశారు.మహాహారతి తరువాత ఏడాదంతా అమ్మవారి ఖజానాకు భక్తులు సమర్పించిన వెండి కానుకలతో ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి నాణేలను దీపావళి రోజు భక్తులకు పంపిణీ చేయడం ఆనవాయితీ. ఈక్రమంలో ఈ ఏడాది కూడా వెండి నాణెలు పంపిణీ చేసినట్లు ఆలయ ట్రస్టీ వివరించారు. అలాగే ఈ హారతి మూడు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు.కాగా భాగ్యలక్ష్మి దేవాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్వీట్ చేశారు. On this auspicious Diwali, I visited the sacred Charminar Bhagyalakshmi Temple, offered heartfelt prayers for peace & prosperity. Wishing everyone a joyous, prosperous Diwali filled with light! 🪔✨#Diwali #Charminar #Diwali2025 #BhagyalakshmiTemple pic.twitter.com/ZdxYxVsHek— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@gadwalvijayainc) October 20, 2025 -
'కూతుళ్లు మన ఇంటి లక్ష్మీ దేవతలు'..! వారి రాకతోనే..: నీతా అంబానీ
ఆడపిల్లలను ఇంటి లక్ష్మిగా కీర్తిస్తుంటారు మన పెద్దలు. ఆ విషయాన్ని గుర్తుచేశారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. ఈ దీపావళి పండుగలో వెలుగుని తెచ్చేది కూతుళ్లే అంటూ హృదయపూర్వక సందేశాన్ని అందించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.రిలయన్స్ దీపావళి పార్టీలో నీతా అంబానీ కూతుళ్ల కోసం జరుపుకునే పండుగగా అభివర్ణించిన సందేశం ప్రతి ఒక్కరు మనుసును హత్తుకుంది. తరుచుగా మన పెద్దలు చెప్పేమాటను ఆమె గుర్తు చేస్తూ..ఈ పండుగ అందమే కూతుళ్లని, వారి రాకతోనే మన ఇల్లుకాంతిమయం అవుతుందంటూ భావోద్వేగంగా మాట్లాడారు. అంతేగాదు. తన మనవరాళ్లు ఆదియ శక్తి పిరమల్, వేద అంబానీలను తన ఇంటి లక్ష్మీగా పరిచయం చేసింది. వారి వల్ల తమ ఇల్లు వెలిగిపోతుంటుందని, నట్టింట వారు నడయాడుతుంటే లక్ష్మీ దేవి ఉన్నట్లే అనిపిస్తుందని అన్నారామె. భారతీయ సంప్రదాయంలో కూమార్తెలను లక్ష్మీదేవత ప్రతిరూపంగా భావిస్తుంటారు. వారి వల్లే తమ ఇంటి శ్రేయస్సు, ఆనందం, అదృష్టమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. దాన్ని ఆమె ఈ పండుగ నేపథ్యంలో గుర్తు చేస్తూ..ఆడపిల్లలు మన ఇంటి లక్ష్ములు అంటూ మన సంస్కృతిని లింగ సమానత్వం, సాధికారతను మిళితం చేసేలా గొప్పగా సందేశమిచ్చారామె. అంతేగాదు ఈ పండుగకు అసలైన అర్థం, అంతరార్థం బహుచక్కగా వివరించి.. నెటిజన్ల మనసును దోచుకున్నారామె. పైగా కుటుంబం విలువను తెలియజేసేలా ఐక్యత, ప్రేమ, అనేవి దీపాల వెలుగల వలే మన జీవితాల్ని కాంతిమయం చేస్తాయని తన భావోద్వేగ సందేశంతో చెప్పకనే చెప్పారు నీతా అంబానీ. View this post on Instagram A post shared by The Times of India (@timesofindia) (చదవండి: Hungover After Diwali: దీపావళి హ్యాంగోవర్ని తగ్గించే నేచురల్ డిటాక్స్..తక్షణ ఉపశమనం!) -
గౌరీ లక్ష్మీపూజ, షారూఖ్ ఖాన్ దీపావళి శుభాకాంక్షలు, నెటిజన్లు ఫిదా!
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన ఇంట్లో జరిగిన దీపావళి పూజ వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రతీ ఏడాదిలాగానే బాద్షా దీపావళి వేడుకలను నిర్వహించారు. తన భార్య గౌరీ ఖాన్ పూజ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "అందరికీ దీపావళి శుభాకాంక్షలు! లక్ష్మీదేవి మీకు శ్రేయస్సు మరియు ఆనందాన్ని ప్రసాదించాలి. అందరికీ ప్రేమ, కాంతి మరియు శాంతిని కోరుకుంటున్నాను" అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఖాన్ కుటుంబానికి నెటిజన్లు దీపావళి శుభాకాంక్షలు అందించారు. ప్రతీ ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా అన్నీ శుభాలే జరగాలని ఫ్యాన్స్ ఆయనను అభినందించారు. అలాగే షారూఖ్ మతసామరస్యంపై ప్రశంసలు కురిపించారు. ఇదీ చదవండి: ముచ్చటగా మూడోసారి: తన రాక్స్టార్స్కు బ్రాండ్ న్యూ కార్లు గిఫ్ట్స్కాగా షారూఖ్ 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది నవంబర్ 2 ఆయనను ఫిల్మ్ ఫెస్టివల్తో సత్కరిస్తారు. అక్టోబర్ 31 నుంచి PVR INOX ఒక ప్రత్యేక ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో షారూఖ్ సినీ జీవితంలో బ్లాక్బస్టర్ చిత్రాలను ప్రదర్శిస్తారు. రెండు వారాల పాటు జరిగే ఫిల్మ్ ఫెస్టివల్, 30 కి పైగా నగరాలు , దాదాపు View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
ముచ్చటగా మూడోసారి: తన రాక్స్టార్స్కు బ్రాండ్ న్యూ కార్లు గిఫ్ట్స్
దీపావళికి బోనస్లు, స్వీట్లు, గిఫ్ట్లు సహజమే. కానీ ఖరీదైన బహుమతు లివ్వడం వార్తల్లో నిలుస్తాయి. తాజాగా హెల్త్కేర్ సంస్థ వ్యవస్థాపకుడు సామాజిక కార్యకర్త ఎంకే భాటియా ముచ్చటగా మూడోసారి తన ఉద్యోగులకు వచ్చిన విలువైన బహుమతులు నెట్టింట సందడిగా మారాయి.చండీగఢ్కు చెందిన వ్యాపారవేత్త ‘మిట్స్ నేచురా లిమిటెడ్’ కంపెనీ అధినేత ఎంకే భాటియా దీపావళి వేడుకల్లో భాగంగా తన ఉద్యోగుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉద్యోగులకు 51 సరికొత్త కార్లను బహుమతిగా ఇచ్చారు. స్వయంగా తాళాలు అందజేసి వారిని అభినందించారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన బృంద సభ్యులకు ఎస్యూవీ, స్కార్పియో వంటి ఖరీదైన కార్లను అందించారు. ఎంకే బాటియా ఇలా కార్లను బహుమతిగా ఇవ్వడం వరుసగా ఇది మూడోసారి. ఇదీ చదవండి: గౌరీ పూజ, షారూఖ్ ఖాన్ దీపావళి శుభాకాంక్షలు, నెటిజన్లు ఫిదా!లింక్డ్ఇన్ పోస్ట్లో, భాటియా ఏమన్నారంటే. ‘‘గత రెండు సంవత్సరాలుగా, అత్యంత అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చాం. అసలు వారిని ఉద్యోగులు లేదా సిబ్బంది అని ఎప్పుడూ పిలవలేదు. వారు నా జీవితంలో రాక్స్టార్ సెలబ్రిటీలు, మా ప్రయాణంలోని ప్రతి దశనూ బ్లాక్బస్టర్గా మార్చేసే తారలు. ఈ దీపావళి ఎక్స్ట్రా స్పెషల్" అంటూ కార్లను హ్యాండ్ఓవర్ చేసిన ఫోటోలను షేర్ చేశారు. తన కంపెనీకి వారే వెన్నెముక అనీ, వారి కృషి, నిజాయితీ, అంకితభావమే తమ కంపెనీవిజయానికి పునాది. అందుకే వారి శ్రమను గుర్తించడం, ప్రోత్సహించడం, కంపెనీని మరింత అభివృద్ధి దిశ,ఉన్నత శిఖరాలకు నడిపించడం ఏకైక లక్ష్యమని తెలిపారు. వార్తా సంస్థ PTI ప్రకారం, భాటియా ఈ వారంలో ఉద్యోగులకు వాహనాలను అందజేశారు. ఆ తర్వాత షోరూమ్ నుండి కంపెనీ మిట్స్ హౌస్ ఆఫీస్ వరకు వేడుకగా "కార్ గిఫ్ట్ ర్యాలీ" కూడా జరిగిందట.మీ విజయాన్ని లాభాలను ఉద్యోగులతో పంచుకోవడం చాలా సంతోషం అంటూ భాటియాను చాలామంది నెటిజన్లు ప్రశంసించారు. అంతేకాదు ఈ వీడియోను తన మేనేజర్కి చూపిస్తే ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారనీ, ఆ తరువాత డ్రైఫ్రూట్స్, 4 దీపాలు ఇచ్చారంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. వరుసగా మూడోసారిగత ఏడాది 15 కార్లను, అంతకు ముందు సంవత్సరం, 12 కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాబోయే సంవత్సరంలో 50 కార్లను బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్టు భాటియా గత దీపావళికే ప్రకటించడం విశేషం. -
నటి అనసూయ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు
ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని తెలుగు సంఘాలు, ముఖ్యంగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఇవి సిలికాన్ వ్యాలీని కాంతిమయం చేశాయి. బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) కూడా మిల్పిటాస్లో వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో సుమారు 25 వేలమందికి పాల్గొన్నారు. (చదవండి: టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలో వైభవంగా దీపావళి వేడుకలు) -
దీపావళి జోష్..తర్వాత రోజు తలెత్తే హ్యాంగోవర్ని హ్యాండిల్ చేద్దాం ఇలా..!
దీపావళి వేడుకలతో రాత్రంతా ఆహ్లాదంగా ఆడిపాడి గడుపుతారు అందరు. ముఖ్యంగా ఈ వేడుక పుణ్యామా అని రకరకాల స్వీట్లు, విందులతో పొట్టపగిలేలా ఆరగించేస్తాం. మరోవైపు బంధు మిత్రులతో కలిసి టపాసులు కాల్చి..ఆడిపాడి ఎప్పుడో పడుకుంటాం. పొద్దున లేచాక..ఏదో నిద్ర లేనట్లుగా పొట్టంతా ఉబ్బరంగా, ఒకటే తలనొప్పిగా భారంగా ఉంటుంది. శరీరమంతా ఏదో తెలియని బరువులా ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పండుగ హ్యాంగోవర్తో ఇబ్బంది పడుతుంటాం. నార్మల్ స్థితికి వచ్చి యథావిధిగా యాక్టివ్గా ఉండాలంటే ఈ నేచురల్ పానీయమే మేలంటున్నారు నిపుణులు. దీపావళి తర్వాత ఉత్సాహంగా ఉండటానికి ఇది అల్టిమేట్ రికవరీ పానీయంగా చెబుతున్నారు. మరి అదెంటో చూసేద్దామా..!.హ్యాంగోవర్ ఎందుకు వస్తుందంటే..దీపావలి పండుగ పేరుతో అతిగా తిని, బాగా ఎంజాయ్ చేస్తాం. పైగా శరీరం అలిసిపోతున్న బంధు మిత్రులను చూసి ఎక్కడలేని ఉత్సాహాన్ని కొనితెచ్చుకుంటాం. దాంతో మరుసటి రోజు డీహైడ్రేషన్కి గురయ్యే నీరసంతో విలవిలాడుతుంటాం. దీన్నే దీపావళి హ్యాంగోవర్ లేదా పండుగ హ్యాంగోవర్ అంటారు. దీన్నుంచి తక్షణమే రీలిఫ్ ఇచ్చే అద్భుత పానీయం నిమ్మ కొబ్బరి నీరు అని చెబుతున్నారు నిపుణులు. ఇది సహజసిద్ధమైన డిటాక్స్లా పనిచేస్తుందట. ఏవిధంగా అంటే..రీహైడ్రేట్ చేసి శరీరాన్ని యాక్టివ్ చేస్తుందట. అలాగే కొబ్బరి నీరులో 94% నీరు, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీనికి నిమ్మకాయను జోడించడంతో రుచిపెరగడమే కాకుండా ఖనిజ శోషణ కూడా మెరుగుపడుతుందట. ముఖ్యంగా పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ప్రేగుకి ఉపశమనం అందించి, జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది. కొబ్బరినీళ్లల్లో ఉండే మెగ్నీషియం జీర్ణకండరాలను సడలించి.. ఆమ్లత్వం, మలబద్ధకం, అసౌకర్యాన్ని నివారిస్తుంది. అలాగే జలుబు, అలసట వంటి వాటిని నివారిస్తుంది. నిమ్మకాయలో ఉండే సీ విటమిన్ రోగనిరోధక శక్తిని అందించి..యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ వంటి వాటిని అందించి శరీరం తక్షణమే కోలుకునేలా చేస్తుంది. వేయించి పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చే పేగువాపుని తగ్గిస్తుందట. ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చూస్తుందట. దీంతోపాటు చర్మాన్ని గ్లో అప్ చేసి, హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుందట. ఈ నిమ్మకాయ కొల్లాజెన్ ఉత్పత్తికి హెల్ప్ అవుతుందట. అలాగే కొబ్బరిలో ఉండే సహజ చక్కెరలు స్థిరమైన శక్తిని అందించి, ఆకస్మికంగా చక్కెర లెవల్స్ పడిపోవడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు నిపుణులుతయారీ విధానం:ఇంట్లో దీన్ని ఎలా తయారు చేయాలంటే..కావలసినవి: 1 కప్పు తాజా కొబ్బరి నీరు (240 మి.లీ)2 టేబుల్ స్పూన్లు తాజా నిమ్మరసం 1 టీస్పూన్ తేనె లేదా బెల్లం సిరప్చిటికెడు నల్ల ఉప్పు లేదా కొన్ని పుదీనా ఆకులు తయారీ: కొబ్బరి నీటిలో నిమ్మరసం వేసి బాగా కలపండి. కావాలనుకుంటే తేనె లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు. చల్లగా కావాలనుకుంటే కొంచెం ఐస్, పుదీనా రెమ్మతో సర్వ్ చేసుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాల కోసం 1/2 టీస్పూన్ తురిమిన అల్లం కూడా జోడించొచ్చు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!) -
టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలోవైభవంగా దీపావళి వేడుకలు
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ , సిసిలీయా అబ్బాట్ దంపతులు రాష్ట్రంలోని కొంతమంది ప్రవాస భారతీయనాయకులను ఆహ్వానించి, తమ అధికార నివాసభవనంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. గత 11 సంవత్సరాలుగా ప్రతీ ఏడాదీ గవర్నర్ దంపతులు దీపావళి పండుగ జరుపుకోవడం విశేషం. గౌరవ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులు వివిధరంగాలలో విశేషంగా కృషి చేస్తూ, టెక్సస్ రాష్ట్ర శరవేగ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలతోపాటు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ వంటకాలతో దీపావళి విందు ఏర్పాట్లు చెయ్యడమేగాక అందరికీ దీపావళి కానుకలిచ్చి సత్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనురాగ్ జైన్ దంపతులు ఈ సంవత్సరపు దీపావళి వేడుక ఏర్పాట్లను సమన్వయపరచారు. గౌరవ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ దంపతులు, టెక్సస్ రాష్ట్ర కార్యదర్శి జేన్ నెల్సన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ నగరాలైన డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో, కార్పస్ క్రిస్టీ, మిడ్ల్యాండ్, ఓడిస్సా మొదలైన నగరాలనుండి 100 మందికి పైగా పాల్గొన్న ప్రవాస భారతీయులలో ప్రవాసాంధ్రులైన డా. ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ ఏరుబండి, వెంకట్ గొట్టిపాటి, సతీష్ మండువ, నీలిమ గోనుగుంట్ల, ఆషా రెడ్డి, సుజిత్ ద్రాక్షారామ్, బంగార్ రెడ్డి, రాజ్ కళ్యాణ్ దుర్గ్ వారి కుటుంబ సభ్యులున్నారు.భారత అమెరికా దేశాలమధ్య సంభందాల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కు ప్రవాసభారతీయులందరి తరపున డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రవాసభారతీయుల ముఖ్యమైన అన్ని ఉత్సవాలకు హాజరయ్యే గవర్నర్ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డాలస్ లో జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా హాజరైన సంఘటన గుర్తుచేసుకుని గవర్నర్ కు మరోసారి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. -
దీపావళి సెలబ్రేషన్స్లో టీమిండియా క్రికెటర్లు (ఫోటోలు)
-
అంబరాన్నంటిన దీపావళి.. సెలబ్రిటీల సెలబ్రేషన్స చూశారా? (ఫొటోలు)
-
దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు.. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు
-
దీపావళి వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు (ఫొటోలు)
-
diwali 2025 : అదిరిపోయిన సెలబ్రిటీల దివాలీ వేడుక
-
టాలీవుడ్ ముద్దుగుమ్మల దీపావళి సెలబ్రేషన్స్.. ఫోటోలు
-
మతాబులా వెలిగిపోతున్న భూమి పడ్నేకర్ ఫెస్టివ్ లుక్ చూశారా?
-
విషాదాలకు దూరంగా.. వెలుగులు పంచుదాం!
వెలుగులు విరజిమ్మే దీపావళి కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లను పారదోలి సంతోషాలను పంచుతుంది. అయితే అలాంటి దీపావళికి ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలి. మన ఆనందం మరొకరికి బాధ కలిగించొద్దని, వ్యక్తిగత బాధ్యత, శ్రద్ధ, జాగ్రత్తలతో పాటు, పర్యావరణ స్పృహ, సామాజిక బాధ్యతను గుర్తించాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టపాసులు కాల్చే క్రమంలో చుట్టుపక్కల వారికి హాని కలుగకుండా జాగురూకతతో మెలగాలి. భారీ శబ్దాలతో చిన్నపిల్లలు, వృద్ధులు, హార్ట్ పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది. పశువులు, పెంపుడు జంతువులు, పక్షులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తెరగాలి. వీటితో పాటు టపాసుల నుంచి వచ్చే పొగ, స్పార్క్స్ వల్ల కళ్లకు, ఊపిరితిత్తులకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉందని గ్రహించి తదనుగుణంగా వ్యవహరించి సహజమైన, సంప్రదాయ వెలుగులతో పండుగను ఆస్వాదించాలని పర్యావరణ వేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో మన జీవితాల్లో వెలుగులు పంచే దీపావళి మరొకరి జీవితాల్లో చీకట్లు నింపకుండా జాగురూకతతో వ్యవహరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేడు దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పండుగల్లోనూ అధునాత పోకడలు సంతరించుకుంటున్నాయి. ఈ దీపావళికి ముఖ్యంగా యువత పర్యావరణ సంరక్షణ, జంతు సంక్షేమం వంటి అంశాలను గౌరవిస్తూ.. నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుతున్నారు. సంబంధిత అధికారులు సైతం పండుగ నియమావళి, సూచనలపై ముందస్తుగానే ప్రచారం చేశారు. పండుగ ఉత్సాహం, సంతోషం బాధ్యతతో కూడిన సమతుల్యాన్ని పాటించాలని నగర పోలీసు శాఖ, పర్యావరణ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. జంతు సంరక్షణ, పర్యావరణ బాధ్యత.. భారీ శబ్దాల వల్ల జంతువులు భయపడి జనాలపై దాడికి దిగే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మనం కాల్చిన టపాసుల కారణంగా అవి గాయపడే ప్రమాదం ఉంది. వీటిని గుర్తించాలి. ముందుగా ఇళ్లలోని పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. దీంతో పాటు వీధుల్లోని జంతువులకు హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తించాలి. మన చుట్టూ ఉండే ప్రదేశాల పట్ల కూడా బాధ్యతతో మెలగాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మనతో పాటు ఇతర పౌరులూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. కొద్దిసేపు ఆనందాన్ని ఇచ్చే స్మోక్ క్రాకర్స్ దీర్ఘకాలం పాటు మనకు హాని కలిగిస్తాయని గ్రహించాలి. ప్రభుత్వం సూచించిన గ్రీన్, ఎకో ఫ్రెండ్లీ క్రాకర్లను మాత్రమే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి. ఇదీ చదవండి: 35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీనిబంధనలు ఇవే.. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు టపాసుల అమ్మకాలు, వినియోగానికి ప్రత్యేక నియమాలు అమలు చేస్తున్నాయి. అనుమతులు లేని చోట టపాసులు నిల్వ చేయడం, అమ్మకం చట్టరీత్యా నేరం. భారీ శబ్దాలు చేసే, అధికంగా పొగను విడుదల చేసే టపాసులకు పరిమితులు పెట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాత్రి 10 గంటల తర్వాత టపాసులు పేల్చకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అపార్ట్మెంట్లలో, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చేటప్పుడు ఇతరుల ప్రైవసీ, వృద్ధులు, చిన్నపిల్లలు, రోగులను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని పలు హౌసింగ్ సొసైటీలు, యువజన సంఘాలు ‘గ్రీన్ దీపావళి’ కార్యక్రమాలను చేపట్టాయి. క్రాకర్ ఫ్రీ జోన్లను ఏర్పరచి, పర్యావరణ స్నేహపూర్వక పండుగకు ఆయా కమ్యూనిటీలు ప్రోత్సహిస్తున్నాయి. కేవలం విద్యుత్ కాంతులు, లేదా సంప్రదాయంగా వస్తున్న నూనె దీపాలు, కొవ్వుతులను వినియోగించి పండుగను జరుపుకోవాలని, పిల్లల్లోనూ ఆ దిశగా చైతన్యం తీసుకురావాలని, ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగను చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. చదవండి: ఈ తియ్యటి పండుతో షుగర్కి చెక్ : తాజా అధ్యయనంప్రజల్లో కొత్త చైతన్యం.. అగ్నిమాపక సూచనలు.. నగరంలోని అగి్నమాపక శాఖ, వైద్యులు పౌరులకు పలు సూచనలు జారీ చేశారు. టపాసులు వాడేటప్పుడు పిల్లల పక్కన పెద్దవారు తప్పనిసరిగా ఉండాలి. వదులుగా ఉండే దుస్తులు, పొడవైన దుపట్టాలు ధరించడం ప్రమాదకరం. ఇళ్లల్లో దీపాల వద్ద కర్టెన్లు, పేపర్ అలంకరణల విషయంలో జాగ్రత్త పాటించాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్, నీటి బకెట్, ఫైర్ కంట్రోలర్స్ వంటి భద్రతా సామగ్రి ఇళ్లల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఏదైనా ప్రమాదవ శాత్తూ గాయాలైతే తక్షణ వైద్య సహాయం పొందలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొగతో కళ్లకు ప్రమాదం.. క్రాకర్స్ కాల్చే సమయంలో వచ్చే ప్రమాదకరమైన పొగ వల్ల కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ పొగ నేరుగా కంటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి వీలైనంత దూరంగా కాల్చాలి. కొన్ని రకాల క్రాకర్స్ నుంచి వెలువడే నిప్పు రవ్వలు కంట్లో పడే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు క్రాకర్స్ నుంచి వెలువడే కాంతి కూడా కంటిలోని నల్లగుడ్డుని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే అదే పనిగా ఆ వెలుగును చూడకుండా ఉంటే మంచిది. ఏవైనా జరిగి కళ్లు మండుతున్నట్లు అనిపిస్తే వెంటనే వాటిని నలపకుండా స్వచ్ఛమైన చల్లటి నీటితో కడుక్కోవాలి. కొద్ది సేపటి తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటే వైద్యులను సంప్రదించాలి. కళ్లలో దురద వస్తే వైద్యుల సూచన మేరకు చుక్కల మందు స్వేస్తే సరిపోతుంది. కొందరు ఏడాది పిల్లలతో కూడా క్రాకర్స్ కాలి్పస్తుంటారు.. ఇది ప్రమాదకరమైన చర్యగా గుర్తించాలి. వీలైతే సన్గ్లాస్, సాధారణ కళ్ల జోడు పెట్టుకుంటే మంచిది.– పి.సత్యవాణి, ప్రొఫెసర్, సరోజినీదేవి నేత్రాలయం, మెహిదీపట్నం -
Diwali 2025: బిగ్బాస్ బ్యూటీల దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ప్రతీ కుక్కకూ ఓ దీపావళి..దివాలీ శునకపూజ..ఎక్కడంటే..
ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదని, ప్రతీ పనికిరాని అని మనం అనుకునే వ్యక్తికీ కూడా ఒక రోజంటూ వస్తుందని వాడుకగా చెప్పుకుంటాం. అయితే నేపాల్లో నిజంగానే కుక్కలకు అంటూ ఒక రోజు వస్తుంది. కుక్కలకే కాదు కాకులకు కూడా. ఈ వివరాలు తెలియాలంటే దీపావళి సందర్భంగా నేపాల్ లో కనిపించే ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి.యమ పంచక్ లేదా దీపావళి అని కూడా పిలిచే తీహార్ , నేపాల్లో జరుపుకునే అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి. తరచుగా లైట్ల పండుగ అని కూడా పేర్కొనే తీహార్, ఉత్సాహభరితమైన ఆచారాలు, కుటుంబ బంధాలు ప్రకృతితో సహజీవనపు వేడుకగా గుర్తింపు పొందింది. నేపాల్ అంతటా హిందువులు, బౌద్ధులు కూడా జరుపుకునే పండుగ ఇది. ఐదు రోజుల పాటు దేవతలు, జంతువులు సోదర సోదరీమణుల మధ్య అను బంధాన్ని ఈ పండుగ గౌరవిస్తుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ (కార్తీక మాసం) ఆధారంగా ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు తీహార్ వేడుకలు జరుపు కుంటున్నారు. ఈ ఉత్సవం నేపాల్ ఇళ్లు, వీధులను కాంతులతో, సంగీత సంబరాలతో నింపుతుంది. దాదాపుగా మన దగ్గర జరిగే దీపావళి తరహాలోనే ఈ పండుగ కూడా ఉంటుంది. రంగు రంగుల లైట్లు రంగులను ఆస్వాదించడం, లక్ష్మీ దేవిని పూజించడం, రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం వరకూ కాకపోతే.. మానవులు జంతువులు, సోదరులు సోదరీ మణుల మధ్య బలమైన సంబంధాన్ని ప్రదర్శించడం ప్రత్యేకత అని చెప్పాలి.తీహార్ అంటే?కాంతి ప్రేమ ల పండుగ, ఇది జంతువుల ప్రాముఖ్యత, కుటుంబ సంబంధాల విలువలను, దైవిక ఆశీర్వాదాలను నొక్కి చెబుతుంది. ఇది యముడు (మరణ దేవుడు) , లక్ష్మీదేవి (సంపద శ్రేయస్సు నిచ్చే దేవత) లను గౌరవించడానికి ప్రకృతిలో అంతర్భాగంగా ఉన్న జంతువుల పట్ల కృతజ్ఞతను తెలియజేయడానికి జరుపుకుంటారు. చెడుపై మంచి విజయంపై సాధించే మాదిరిగా కాకుండా, తీహార్ పండుగ ఐక్యత, శ్రేయస్సు మానవులు, దేవతల మధ్య అనుబంధాన్ని చూపించేదిగా ఉంటుంది. చదవండి: ఈ తియ్యటి పండుతో షుగర్కి చెక్ : తాజా అధ్యయనంప్రత్యేకం ‘‘కుకర్ తిహార్’’ (Kukur Tihar )ఐదు రోజుల పాటు జరిగే పండుగలో రెండవ రోజు కుకర్ తిహార్ గా జరుపుకుంటారు. ఆ రోజు కుక్కలకు గజ్రాలు (పూల హారం) వేసి అలంకరిస్తారు, తిలకం (కుంకుమ బొట్టు) పెడతారు, ప్రత్యేకమైన ఆహారం ఇస్తారు. ఈ ఆచారం వెనుక భావన ఏమిటంటే హిందూ పురాణాల్లో కుక్కలను యమ« దర్మరాజు దూతలుగా పరిగణిస్తారు. కాబట్టి వాటిని గౌరవిస్తే మనకు రక్షణ లభిస్తుందని నమ్మకం. విశేషం ఏమిటంటే ఆ రోజున వీధి కుక్కలకు సైతం పూజ చేస్తారు మన దేశంలోనూ గోవులకు పూజలు చేసే సంప్రదాయం ఉన్నా ఈ విధంగా కుక్కలకు పూజ చేయడం మాత్రం ఒక్క నేపాల్లో తప్ప మరెక్కడా లేదు.ఐదు రోజులు ఐదు విధాలుగా...–1వ రోజున కాగ్ తిహార్ జరుపుతారు. ఆ రోజున కాకులకు, గద్దలకు పూజ చేస్తారు. అన్నం, తీపి పదార్థాలు ఇస్తారు. వీటిని గౌరవిస్తే చెడు శకునాలు దరిచేరవనీ నమ్మకం.–2వ రోజు కుకర్ తీహార్ పేరుతో కుక్కలకు పూల హారం, తిలకం వేసి పూజ చేస్తారు. వీటిని కూడా యమధర్మరాజు దూతలుగా పరిగణిస్తారు.–3వ రోజు గై తిహార్ పేరుతో ఉదయం వేళలో ఆవులను పూజిస్తారు. ఆవు సంపద, శాంతి, మాతృత్వానికి చిహ్నం గా నమ్ముతారు. అదే రోజునసాయంత్రం ఇళ్లు శుభ్రపరచి దీపాలతో అలంకరించి లక్ష్మీ పూజ చేస్తారు.–4వ రోజున గోవర్ధన్ పూజ / ‘మ్హ ’ పూజ చేస్తారు. ఆ రోజున ఎద్దులను పూలతో, పసుపుతో అలంకరించి పూజిస్తారు.. అంతేకాదు అదే రోజు ‘‘మ్హా పూజ’’ అంటే స్వశరీరాన్ని పూజించి ఆత్మశుద్ధి పొందడం.ఇదీ చదవండి: 35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ–5వ రోజున భాయ్ తికా పేరుతో అక్కాచెల్లెమ్మలు, అన్నా తమ్ముళ్ల అనుబంధంను వేడుకగా జరుపుకుంటారు.ఆ రోజు అక్కాచెల్లెమ్మలు తమ అన్నల తలపై రంగురంగుల తికా (ఏడు రంగులతో) వేస్తారు. అన్నలు చెల్లెమ్మలకు బహుమతులు ఇస్తారు. ఇది ప్రేమ, రక్షణ, బంధుత్వానికి ప్రతీకగా భావిస్తారు. -
చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై సోమవారం (అక్టోబర్ 20) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో .. చంద్రబాబు మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,0003.50 ఏళ్లకే పెన్షన్, నెల నెలా రూ.4వేలు.4.ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట5.ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,0006.ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు7.అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం…8.ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలుఇవన్నీ వెలగని దీపాలో…లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?. వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా.మా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య… ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు, ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు’ అంటూ ధ్వజమెత్తారు. .@ncbn గారూ… మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా? 1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,0003.50 ఏళ్లకే పెన్షన్,…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025 -
'దీపావళి' బ్లాస్ట్.. కొత్త సినిమా పోస్టర్లు చూసేయండి (ఫోటోలు)
-
అధ్బుతమైన దీపోత్సవంతో రెండు ప్రపంచ రికార్డులు
ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరం అయోధ్య ఆదివారం 2025 దీపోత్సవంలో సరికొత్తగారెండు ప్రపంచ రికార్డును సృష్టించింది. 2.6 మిలియన్ల దీపాల ప్రదర్శనతో గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించింది. దీంతో గత ఏడాది అక్టోబర్లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను తిరిగ రాసింది. రెండోది 2,128 మంది పూజారులు , భక్తులు ఒకేసారి మా సరయు ఆరతి ప్రదర్శించడం మరో విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా బాణా సంచా పేలుళ్లతో ఆకాశం మిరుమిట్లు కాంతులతో వెలిగిపోయింది.వేలాది మంది భక్తులు, యాత్రికులు , సందర్శకులు ఈ వేడుకలలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. ఇది ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ సాంస్కృతిక ,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ పర్యాటక , సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకలో లక్షలాది దీపాలు (మట్టి దీపాలు) సరయు నదీ ఒడ్డు దీదీప్య మానంగా వెలిగిపోయింది. భక్తులకు అద్భుతమైన ఆనందాన్ని పంచింది. ఈ సందర్బంగా ఈ ఏడాది 2100 మంది భక్తులు సరయూ నదీ తీరాన దీపాలను వెలిగించి తరించారు. అయోధ్య అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసిన ఘాట్లలో 26,17,215 దివ్య దీపాలు వెలిగించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. డ్రోన్ల సాయంతో ప్రమిదలను లెక్కించి గిన్నిస్ పుస్తక ప్రతినిధులు ప్రపంచ రికార్డ్ను ధ్రువీకరించారు. ఇది 14 సంవత్సరాల వనవాసం ,రావణుడిపై విజయం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడాన్ని గౌరవంగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.2017లో మొదలైన ఈ వేడుక ఇలా సాగింది. యూపీ ముఖ్యమంత్రి యోగి నాయత్వంలో 2025లో తొమ్మిదవ ఎడిషన్ 26.17 లక్షలకు పైగా దీపాలతో రికార్డు సృష్టించింది. 2017లో 1.71 లక్షల దీపాల నుండి 2018లో 3.01 లక్షలు, 2019లో 4.04 లక్షలు, 2020లో 6.06 లక్షలు, 2021లో 9.41 లక్షలు, 2022లో 15.76 లక్షలు, 2023లో 22.23 లక్షలు , 2024లో 25.12 లక్షలకు చేరింది. 2025లో తొమ్మిదవ ఎడిషన్ 26.17 లక్షలకు పైగా దీపాలతో రికార్డు సృష్టించిన సంగతి తె లిసిందే. Ayodhya lit up with 26 lakh diyas this Deepotsav 2025, making two world records! 🪔Diwali celebrates Lord Ram’s return and the victory of light over darkness. ✨Happy Deepawali! 🪔 💫#Diwali #Deepotsav #Ayodhyapic.twitter.com/oaQLbLWsuR— Swapnil Srivastav (@theswapnilsri) October 20, 2025 -
దీపావళి పూట...శివాజీ కోట, పేడ దీపావళి, దివ్య దీపావళి!
భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి.మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. ఈ పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. ఈనేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోజరుపుకునే వేడుకల గురించి తెలుసుకుందాం.దీపావళి పూట...శివాజీ కోట! దీపావళి సీజన్లో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శివాజీ పాలించిన కోటకు ప్రతిరూపంగా మట్టికోటలను తయారుచేయడం అనేది ఆచారం. ఈ కోటను నిర్మించే క్రమంలో బురదలో విత్తనాలు నాటుతారు. కోట చుట్టూ పచ్చదనం ఉండేలా చేస్తారు. రాత్రివేళల్లో ఈ మట్టి కోటపై చిన్న చిన్న దీపాను వెలిగిస్తారు.జార్ఖండ్లో దీపావవళి పండగ సందర్భంగా సోహ్రై వేడుకను జరుపుకుంటారు.ఈ వేడుకలో భాగంగా దేవతలను స్వాగతించడానికి ఘరోండాలు(మట్టి బొమ్మల ఇళ్ళు) తయారు చేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి అగరువత్తులు కాల్చుతారు. సోహ్రై వేడుకలలో పశువులకు స్నానం చేయించి పూజలు చేస్తారు.పేడ పూసుకునివేడుక చేసుకుంటారు: కర్నాటక, తమిళనాడు సరిహద్దులలోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకొని ‘గోరెహబ్బ’ వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా మగవాళ్లు ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఆడవాళ్లు ఒంటికి రాసుకుంటారు. ఆవుపేడలో ఔషధగుణాలు ఉన్నాయనే నమ్మకంతో ఏర్పడిన శతాబ్దాల నాటి సంప్రదాయం ఇది.దీపావళి తరువాత పదిహేను రోజులకు వారణాసిలో దేవ దీపావళిని జరుపుకుంటారు. కార్తిక పూర్ణిమ రాత్రి గంగానది వెంబడి ఉన్న ఘాట్లు లక్షలాది దీపాలతో వెలుగుతాయి. ఆ వెలుగులప్రతిబింబాలు నదిలో అందమైన చిత్రాలను ఆవిష్కరిస్తాయి. గంగానదిలో స్నానం చేయడానికి దేవతలు భూమి మీదికి దిగి వచ్చిన రోజుగా ఈ రోజును జరుపుకుంటారు.ఈ సారి రికార్డ్ బ్రేక్ : గత సంవత్సరం అక్టోబర్లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను వెలిగించి ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సెట్ చేసింది. తాజాగా...28 లక్షల దీపాలను వెలిగించి తన రికార్డ్ను తానే బ్రేక్ చేయాలనుకుంటోంది. -
దీపావళి దివ్వెలు : అందమైన తారలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి.. బాణాసంచా దుకాణాల వద్ద ఫుల్ రష్ (ఫొటోలు)
-
వార్నీ.. ఇవేం సెలబ్రేషన్స్ భయ్యా!! దీపావళి-2025 ధమాకా.. వీటిని చూశారా?
దీపావళి వేళ.. ఒక చిన్న వీడియో, ఒక సరదా ఫోటో అసాధారణ స్పందనను తెచ్చుకుంటున్నాయి. లక్షల మంది హృదయాలను గెలుచుకుంటూ వైరల్ కంటెంట్గా మారుతున్నాయి. ఆ సాధారణ దృశ్యాలు, వినూత్న ఆలోచనలను సోషల్ మీడియా మరింత సంబరంగా మార్చుతోంది. వాటిల్లో కొన్ని మీకోసం..దీపావళి పండుగ వేళ.. ఇంటి డెకరేషన్లు, తమ ముస్తాబులు, తాము చేసుకునే సంబురాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అదే సమయంలో సరదాగానూ కొంత కంటెంట్ వైరల్ అవుతుంది. సినీ నటులు రజినీకాంత్, బ్రహ్మానందాలు నోట్లో బాంబులు పెట్టుకోవడం.. సినిమాల్లో దీపావళి శుభాకాంక్షలు చెప్పడం.. ఓ తెలుగమ్మాయి ధైర్యంగా సుతిల్ బాంబులను చేత్తో అంటించి విసిరేయడం, కుక్క నోటితో బాణాసంచాని కరుచుకుపోయి పదే పదే ఇంట్లో పడేయడం, పొల్యూషన్తో సంబంధం లేకుండా బాంబ్ఫ్రూఫ్ వేడుకలు(డప్పులు, తినే కంచాలతో సౌండ్లు).. ఇలాగన్నమాట. అయితే ఈసారి కొంత కొత్త స్టఫ్ నెట్లో వైరల్ అవుతోంది. ఇదేం సెలబ్రేషన్ భయ్యా.. అది అత్యంత ఖరీదైన ఏరియా. అలాంటి చోట ‘వెరీ లేజీ సెలబ్రేషన్స్’ను ఎవరూ కలలో కూడా ఊహించని పరిణామం ఇది!. అవును.. నోయిడాలో ఓ బ్యాచిలర్ బద్మాషుగాళ్లు చేసిన పని నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీపావళి సెలబ్రేషన్స్లో భాగంగా.. కుల్వంత్ సింగ్, యాగేశ్వర్ అనే ఇద్దరు కుర్రాళ్లు తమ బాల్కనీకి అలంకరించారు. ఓ గ్రీన్ లైట్ దండ బల్బ్ సెట్ను వేలాడదీసి దానిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అంతే.. View this post on Instagram A post shared by Kulwant Singh Rangra (@kulwant_singh0810)రాత్రికి రాత్రే అది ఆ ఇద్దరినీ ఫేమస్ చేసింది. లక్షల మంది దానికి స్పందిస్తూ.. ఆ యువకులపై చిత్రవిచిత్రమైన కామెంట్లు చేశారు. దీంతో తమ బాల్కనీని మరిన్ని లైట్ సెట్లతో కలర్ఫుల్గా మార్చేశారు. కావాలని చేశారో.. అనుకోకుండా జరిగిందోగానీ లక్షల మందిని ఆకట్టుకున్న ఈ వీడియో వైరల్ సంబరంగా మారింది. నువ్వో ఆణిముత్యానివి!దీపావళి వేడుకల్లో ఓ వ్యక్తి ల్యాప్ట్యాప్తో చిందులేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైభవ్ చంద్ర అనే వ్యక్తి ఆఫీస్ దీపావళి సెలబ్రేషన్స్ వీడియో అంటూ దానిని పోస్ట్ చేశారు. అయితే.. ఈ వీడియో కొత్తేదేనా? వైభవ్ ఎందుకు పోస్ట్ చేశాడన్నదానిపై స్పష్టత లేదు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్నా.. దీపావళి వేడుకలను మిస్ కాలేదు అంటూ క్యాప్షన్ ఉంచాడు. దీంతో ఆ ఎంప్లాయిపై ఆణిముత్యం అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా చర్చ మొదలైంది. View this post on Instagram A post shared by Vaibhav Chhabra (@vaibhav9497)టచ్ చేశావ్ భయ్యా.. హైదరాబాద్(తెలంగాణ)కు ఓ వ్యక్తి వెరైటీగా జరిపిన దీపావళి సంబురాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. సాధారణంగా మనకు డెలివరీలు వస్తే ఏం చేస్తాం.. వెంటనే పెమెంట్ చేసేసి మన పార్శిల్స్ అందుకుని వచ్చేస్తాం. కానీ, ఇక్కడో హైదరాబాదీ వివిధ డెలివరీ యాప్స్లో స్వీట్లను ఆర్డర్ చేసి.. తీసుకొచ్చిన ఆ డెలివరీ బాయ్స్ చేతికి అందించాడు. పైగా షేక్హ్యాండ్తో హ్యాపీ దీపావళి చెప్పడంతో నెట్టింట యూజర్లు తెగ ఖుషీ అయిపోతున్నారు. View this post on Instagram A post shared by Gundeti Mahendhar Reddy (@_the_hungry_plate_)యూ నెయిల్డ్ ఇట్ బ్రో!ఇక్కడో ఆర్టిస్ట్ వెరైటీగా చేసిన ప్రయత్నం.. నెట్టింట సందడి చేస్తోంది. తన సృజనాత్మతకు పని చెబుతూ.. చేతి గోళ్ల మీద ఓ వ్యక్తి పెయింటింగ్ వేశాడు. ఈ త్రీడి నెయిల్ ఆర్ట్లో.. బాణాసంచాతో పాటు హ్యాపీ దీపావళి అనే అక్షరాలనూ అతను చెక్కాడు. ఈ క్రమంలో.. ఓ గోటిపై ఏకంగా దీపాన్ని వెలిగించడం గమనార్హం. దీనిపై అతనికి ప్రశంసలతో పాటు కొంత మంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Yogesh Kumar (@love_nail_yogesh) -
వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో నరకాసుర వధ (ఫొటోలు)
-
బండ్ల గణేశ్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్.. సినీ ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
హైదరాబాద్ : సంబరంగా దీపావళి సదర్ వేడుకలు (ఫొటోలు)
-
క్యూ2 ఫలితాల ఎఫెక్ట్
దీపావళి సందర్భంగా మంగళవారం(21) నిర్వహించనున్న మూరత్ ట్రేడింగ్ను మినహాయిస్తే ఈ వారం మార్కెట్లు మూడు రోజులే పనిచేయనున్నాయి. అయితే క్యూ2 ఫలితాలతోపాటు పలు అంశాలు మార్కెట్లను నడిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత వారాంతాన మార్కెట్లు ముగిశాక డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్(ఆర్ఐఎల్)సహా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జూలై–సెపె్టంబర్ ఫలితాలు ప్రకటించాయి. దీంతో నేడు(20న) ఈ కౌంటర్లు యాక్టివ్గా ట్రేడ్కానున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో ఈ వారం హిందుస్తాన్ యూనిలీవర్, కాల్గేట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోఫోర్జ్, ఐటీసీ హోటల్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో నేడు ఫలితాల ప్రభావంతో ట్రెండ్ నిర్దేశితంకానున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. హెచ్యూఎల్, డాక్టర్ రెడ్డీస్ కార్పొరేట్ ఫలితాల సీజన్కు దారి చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అంచనా వేశారు. సంవత్ 2082 షురూ స్టాక్ మార్కెట్లలో మంగళవారం కొత్త ఏడాది సంవత్ 2082 ప్రారంభంకానుంది. దీపావళి పండుగ సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు(బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 వరకూ ప్రత్యేక(ముహూరత్) ట్రేడింగ్ను నిర్వహించనున్నాయి. మరుసటి రోజు(22న) బలిప్రతిపాద సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఆపై గురు, శుక్రవారాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఫలితాలు, పండుగ జోష్ సంవత్ 2082 తొలి రోజు సెంటిమెంటుకు బలాన్నివ్వనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. గణాంకాలు.. దేశీయంగా 21న సెపె్టంబర్ నెలకు మౌలిక రంగ గణాంకాలు వెలువడనున్నాయి. 2025 ఆగస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔట్పుట్ 6.3 శాతం ఎగసింది. ఇది 13 నెలల గరిష్టంకాగా.. కోల్, స్టీల్, సిమెంట్ తదితరాలు ఇందుకు సహకరించాయి. ఇక 24న అక్టోబర్ తయారీ, సరీ్వసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. తయారీ పీఎంఐ సెపె్టంబర్లో 57.7కు నీరసించగా.. ఆగస్ట్లో 59.3కు బలపడింది. అంతర్జాతీయ అంశాలు చైనాపై యూఎస్ విధించిన తాజా టారిఫ్లు, వీటిపై చైనా స్పందనతోపాటు.. పరిష్కారం వంటి అంశాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు తెలియజేశారు. యూఎస్, చైనా మధ్య వాణిజ్య ఆందోళనలకు తెరపడితే సెంటిమెంటు పుంజుకోవచ్చని గౌర్ అభిప్రాయపడ్డారు. జూలై–సెపె్టంబర్కు చైనా జీడీపీ గణాంకాలు 20న విడుదలకానున్నాయి. ఏప్రిల్–జూన్లో 5.2 శాతం వృద్ధి చూపింది. 23న యూఎస్ సెపె్టంబర్ గృహ విక్రయ గణాంకాలు వెలువడనున్నాయి. 24న యూఎస్ ద్రవ్యోల్బణ వివరాలు వెల్లడికానున్నాయి. ఇవికాకుండా ముడిచమురు ధరలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు తీరు వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మిశ్రా, గౌర్ పేర్కొన్నారు.కొనుగోళ్లకు ఎఫ్పీఐలు సై ఈ నెలలో రూ. 6,480 కోట్లు గత మూడు నెలలుగా దేశీ స్టాక్స్పట్ల విముఖత చూపుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అక్టోబర్లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టపడటంతో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల 1–17 మధ్య రూ. 6,480 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతక్రితం సెపె్టంబర్లో రూ. 23,885 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. ఆగస్ట్లో రూ. 34,900 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే.గత వారమిలా..13–17 మధ్య ముగిసిన గత వారం వరుసగా మూడోసారి దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,625 పాయింట్లు(2 శాతం) ఎగసి 83,952 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 483 పాయింట్లు(2 శాతం) బలపడి 25,710 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు స్వల్పంగా 0.2 శాతం పుంజుకున్నాయి. -
దీపాలపై డబ్బులు తగలేయొద్దు
లక్నో: దీపావళి వేడుకలపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీపాలు, కొవ్వొత్తులపై అనవసరంగా డబ్బులు తగలేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. దీపాలు వెలిగించడానికి ప్రజల సొమ్ము వృథా చేయొద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘సలహాలు ఇవ్వాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ, రాముడి పేరిట ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. కొన్ని నెలలపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. నగరాలు, ఇళ్లను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తారు. మనం కూడా అలా ఎందుకు చేయకూడదు? క్రిస్మస్ నుంచి మనం ఎందుకు నేర్చుకోకూడదు. దీపాలు, కొవ్వొత్తుల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. ఈ విషయం అందరూ ఆలోచించాలి. డబ్బులు వృథా చేయొద్దు. ప్రభుత్వం నుంచి మనం కోరుకొనేది ఆదే. విద్యుత్ దీపాలతో దీపావళి వేడుకలు చేసుకుందాం’’ అని ప్రజలకు అఖిలేశ్ యాదవ్ సూచించారు. ఆ దుర్గతి హిందువులకు పట్టలేదు: వీహెచ్పీ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి దీపావళి సందర్భంగా క్రిస్మస్ను ప్రశంసిస్తున్నాడని, ఈ విషయం ప్రజలు గమనించాలని కోరారు. వరుస దీరిన దీపాలు అఖిలేశ్ హృదయాన్ని కాల్చేస్తున్నాయని చెప్పారు. అందుకే దీపాలపై డబ్బులు ఖర్చు చేయొద్దని చెబుతున్నాడని, క్రిస్మస్ను చూసి నేర్చుకోవాలని చెబుతున్నాడని విమర్శించారు. అఖిలేశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఆయన ఆంటోనీ లేదా అక్బర్: బీజేపీ అఖిలేశ్ యాదవ్పై మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి, బీజేపీ నాయకుడు విశ్వాస్ సారంగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అఖిలేశ్ను ఆంటోనీ లేదా అక్బర్ అని పిలవాలని అన్నారు. ఆయన మతం మారినట్లు కనిపిస్తోందని చెప్పారు. ప్రమిదలు తయారు చేసి, మన ఇళ్లల్లో వెలుగులు నింపే పేద కారి్మకులను అవమానిస్తారా? అని విశ్వాస్ సారంగ్ నిప్పులు చెరిగారు. -
పసిడి పైపైకే..
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో పసిడి, వెండి ధరలు రాకెట్లలాగా దూసుకెళ్తున్నాయి. గత దీపావళి నుంచి చూస్తే పసిడి దాదాపు 63 శాతం, వెండి అంతకు మించి 72 శాతం స్థాయిలో రాబడులిచ్చాయి. గత పదేళ్ల వ్యవధిలో రెండు దీపావళి పండుగల మధ్య మూడేళ్లు మినహా ఏడు సందర్భాల్లో ఈ రెండూ సానుకూల రాబడులనే ఇచ్చాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కొత్త సంవత్లో కూడా ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ షాపింగ్ను కొనసాగిస్తాయని అంచనాలు ఉన్నాయి. 2026 దీపావళి నాటికి అంతర్జాతీయ మార్కెట్లలో 4,500–5,000 డాలర్లకు చేరొచ్చని, దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో రూ.1,40,000 – రూ.1,50,000 స్థాయికి చేరొచ్చని నిపుణులు తెలిపారు. అటు వెండి సైతం అంతర్జాతీయంగా ఔన్సుకు (31.1 గ్రాములు) 60–70 డాలర్లకు, దేశీయంగా ఎంసీఎక్స్లో రూ. 1,80,000 – రూ. 2,00,000కు చేరొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశి్చతులు తగ్గితే తప్ప, సురక్షితమైన పెట్టుబడి సాధనాలైన పసిడి, వెండి ర్యాలీ ఇకపైనా కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ తెలిపారు. రిస్క్ ప్రొఫైల్ని బట్టి పోర్ట్ఫోలియోల్లో కనీసం 10 శాతం వాటాని పసిడి, వెండికి కేటాయించాలని పేర్కొన్నారు. -
దీపావళి స్టాక్స్ పటాకా!
కొత్త సంవత్ 2082లో కొంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మార్కెట్లు ముందుకే సాగుతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదాయాల వృద్ధి వేగం పుంజుకోవడం, మళ్లీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం మొదలు కావడం, వాణిజ్య విధానాలపై స్పష్టత, భౌగోళిక రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. దేశీయంగా పాలసీలు స్థిరంగా కొనసాగడం, భారీ పెట్టుబడులు, సానుకూల ద్రవ్యపరపతి విధానాలు మొదలైనవి కీలక చోదకాలుగా నిలుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం నెమ్మదించడం, ఆర్థిక క్రమశిక్షణ, కార్పొరేట్ల రుణభారం తగ్గడం తదితర అంశాల దన్నుతో కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చని నువామా రీసెర్చ్ అభిప్రాయపడింది. 2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఫెడ్, ఈసీబీలు వడ్డీ రేట్లను మరికాస్త తగ్గించవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం కాస్త అదుపులో ఉన్న నేపథ్యంలో దేశీయంగా ఆర్బీఐ కూడా ఇదే బాటలో పయనించవచ్చని తెలిపింది. వేల్యుయేషన్స్ సముచిత స్థాయిలో ఉన్నాయని, అయితే గణనీయంగా పెరిగిన మిడ్–స్మాల్ క్యాప్స్లో మాత్రం కన్సాలిడేషన్కి ఆస్కారం ఉందని వివరించింది. జీఎస్టీ 2.0 సరళీకరణ, ఆదాయపు పన్నుపరమైన ఊరట, పండుగల సీజన్ మొదలైన అంశాల కారణంగా వినియోగం గణనీయంగా రికవర్ అవుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్, ట్రావెల్, హోటల్స్, రిటైల్ వంటి రంగాలు మెరుగ్గా ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు, ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, తదితర రంగాలు ఆకర్షణీయంగా ఉంటాయని సెంట్రమ్ బ్రోకింగ్ తెలిపింది. నిఫ్టీ 28,500కి, సెన్సెక్స్ 95,000కు చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ఆధారిత సంస్థలు, ప్రైవేట్ బ్యాంకులు మెరుగ్గా రాణించవచ్చని ట్రేడ్జినీ సీవోవో త్రివేష్ తెలిపారు. వచ్చే ఏడాది కాలానికి వివిధ బ్రోకరేజీ సంస్థలు అందిస్తున్న స్టాక్ సిఫార్సులు సాక్షి పాఠకులకు ప్రత్యేకం! బ్రోకరేజ్: జేఎం ఫైనాన్షియల్ మారుతీ సుజుకీప్రస్తుత ధర: రూ. 16,399 టార్గెట్ ధర: రూ. 19,000 (వృద్ధి: 16%) కార్యకలాపాలు స్థిరపడే కొద్దీ విస్తరణ వ్యయాలు తగ్గుముఖం పట్టడం, ప్రోడక్టుల మేళవింపు సానుకూలంగా ఉండటం మార్జిన్లు మెరుగుపడేందుకు దోహదపడొచ్చు. ఇన్హౌస్ బ్యాటరీ ప్లాంటుతో మరిన్ని హైబ్రిడ్ వాహనాలను ప్రవేశపెట్టొచ్చు. హైబ్రిడ్ సెగ్మెంట్లో వ్యయాలు తగ్గి, లాభదాయకత పెరుగుతుంది. అయితే, తీవ్రమైన పోటీ, కొత్తగా ప్రవేశపెట్టిన ప్యాసింజర్ వాహనాలకు స్పందన అంతంతమాత్రంగానే ఉండటం వంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 1,200 టార్గెట్ ధర: రూ. 1,330 (వృద్ధి: 11%)ఆకర్షణీయమైన వేల్యుయేషన్, అసెట్ క్వాలిటీ రిస్కులు తక్కువగా ఉండటం, నిర్వహణ వ్యయాలు నెమ్మదించడం వంటివి సానుకూలాంశాలు. రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి వేగం మరింత పుంజుకోవచ్చు. నికర వడ్డీ మార్జిన్లు ఊహించిన దానికంటే క్షీణించే అవకాశాలు ప్రతికూలాంశం. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 498 టార్గెట్ ధర: రూ. 600 (వృద్ధి: 20%)వేల్యుయేషన్ మెరుగ్గా ఉండటం, ఆదాయ రికవరీ వల్ల రీ–రేటింగ్కి అవకాశం ఉంది. పసిడి ధరల పరుగు కొనసాగుతుండటమనేది ఆదాయ అంచనాల పెంపునకు, రుణాల పోర్ట్ఫోలియో మెరుగుపడేందుకు ఉపయోగపడొచ్చు. అయితే, రుణ సంబంధ వ్యయాలు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండటం కీలక రిసు్కల్లో ఒకటిగా ఉంటుంది.ఎల్అండ్టీ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 266 టార్గెట్ ధర: రూ. 300 (వృద్ధి: 13% )మాతృ సంస్థ పటిష్టంగా ఉండటం, వైవిధ్యమైన ప్రోడక్టుల పోర్ట్ఫోలియో, లోన్ బుక్లో రిటైల్ ఫైనాన్స్ వాటా 90 శాతానికి పెరగడం వంటివి సానుకూలాంశాలు. ద్వితీయార్ధంలో పండగ సీజన్ డిమాండ్తో వృద్ధి వేగం పటిష్టంగా ఉండొచ్చు. అసెట్ క్వాలిటీపరమైన రిసు్కలు మళ్లీ తలెత్తే అవకాశాలుండటం ప్రతికూలాంశాల్లో ఒకటిగా నిలవొచ్చు. అపోలో హాస్పిటల్స్ ప్రస్తుత ధర: రూ. 7,909 టార్గెట్ ధర: రూ. 9,000 (వృద్ధి: 14% )కొత్తగా 1,717 పడకలు జతకానుండటం, ఫార్మసీ ఔట్లెట్స్ సంఖ్య 8 శాతం పెరుగుదల, పోటీ సంస్థ మ్యాక్స్ హెల్త్కేర్తో పోలిస్తే డిస్కౌంటులో ట్రేడవుతుండటం మొదలైనవి పాజిటివ్ అంశాలు. పడకల సామర్థ్యం పెంపు ఊహించిన దానికన్నా నెమ్మదిగా ఉండటం, రెగ్యులేటరీ రిస్కుల్లాంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు.బ్రోకరేజ్: చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 212 టార్గెట్ ధర: రూ. 245 (వృద్ధి: 16% )టెక్నికల్గా కొన్నాళ్ల నుంచి పటిష్టమైన బేస్ ఏర్పర్చుకుంటోంది. రూ. 195–215 శ్రేణిలో తిరుగాడుతోంది. కరెక్షన్ జరిగిన ప్రతిసారి సపోర్ట్ బలపడుతోంది. 220పై నిలకడగా కొనసాగితే రూ. 245–255 వైపు ర్యాలీ చేయొచ్చు. రూ. 207–205 వరకు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా భావించవచ్చు. రూ. 195 దిగువకి పడిపోతే బలహీనపడటాన్ని సూచిస్తుంది. సిప్లా ప్రస్తుత ధర: రూ. 1,578 టార్గెట్ ధర: రూ. 1,770 (వృద్ధి: 12%) నిర్దిష్ట శ్రేణిలో కన్సాలిడేట్ అవుతూ షేరు బలపడుతున్న సంకేతాలిస్తోంది. రూ. 1,580 వద్ద తక్షణ రెసిస్టెన్స్ ఉండగా, దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా రూ. 1,770–1,850 వైపుగా వెళ్లొచ్చు. తగ్గితే రూ. 1,480 వద్ద సపోర్ట్ లభిస్తుంది. మొమెంటమ్ ఇండికేటర్ల ప్రకారం చూస్తే బులి‹Ùగానే కనిపిస్తోంది. అశోక్ లేల్యాండ్ ప్రస్తుత ధర: రూ. 134 టార్గెట్ ధర: రూ. 151 (వృద్ధి: 13% )కనిష్ట స్థాయిల్లో కన్సాలిడేట్ అవుతూ, స్థిరంగా రికవర్ అవుతోంది. ప్రస్తుతం వీక్లీ చార్ట్లో బులి‹Ùగా కనిపిస్తోంది. టెక్నికల్గా రూ. 140 తక్షణ రెసిస్టెన్స్ని దాటితే మధ్య, దీర్ఘకాలికంగా రూ. 151–రూ. 158 వరకు పెరగవచ్చు. దిగువ వైపున రూ. 131 వరకు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. రూ. 126 వద్ద పటిష్టమైన మద్దతు ఉంటుంది. దానికన్నా దిగువకి పడిపోతే ర్యాలీకి స్వల్పకాలిక రిస్కులు ఉంటాయి. సెయిల్ ప్రస్తుత ధర: రూ. 129 టార్గెట్ ధర: రూ.147 (వృద్ధి: 14% )టెక్నికల్గా పటిష్టమైన బేస్ ఏర్పర్చుకున్న స్టాక్, ప్రస్తుతం నిర్ణయాత్మక బ్రేకవుట్కి సిద్ధంగా ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారీ వాల్యూమ్స్తో రూ. 138కి ఎగువన నిలకడగా క్లోజయితే, తదుపరి దశ ర్యాలీకి దారితీయొచ్చు. దిగువన రూ. 125 స్థాయి వరకు మరింతగా షేర్లను మరింతగా కొనుగోలు చేయొచ్చు. రూ. 116 వద్ద సపోర్ట్ ఉంటుంది. బీడీఎల్ ప్రస్తుత ధర: రూ. 1,540 టార్గెట్ ధర: రూ. 1,700 (వృద్ధి: 10% )ఫిబోనకీ రిట్రేస్మెంట్ లెవెల్కి 50 శాతం వద్ద కన్సాలిడేట్ అవుతోంది. ఇదే జోన్లో సపోర్ట్ లభిస్తోంది. సాధారణంగా ర్యాలీ చేసే ముందు, ఇలాంటి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. తక్షణ రెసిస్టెన్స్ రూ. 1,560 వద్ద ఉంటుంది. దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే బులిష్ ధోరణి బలపడి, సమీప భవిష్యత్తులో మరింత ర్యాలీకి దోహదపడొచ్చు. తగ్గితే, రూ. 1,440 వరకు కొనుక్కోవచ్చు. రూ. 1,380 బలమైన సపోర్ట్ జోన్గా ఉంటుంది.బ్రోకరేజ్: మిరే అసెట్ షేర్ఖాన్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర: రూ. 8,245 టార్గెట్ ధర: రూ. 9,300 (వృద్ధి: 13%) ఈ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ ఏసీలు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులను అందిస్తోంది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో ఏసీలతో పాటు కంపెనీ వాషింగ్ మెషీన్ల మార్కెట్లోకి, అటు ఎల్రక్టానిక్స్లోకి, సెమీకండక్టర్ సబ్్రస్టేట్ పీసీబీలు మొదలైన వాటిల్లోకి ప్రవేశిస్తుండటం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించుకుంటోంది. ఎల్రక్టానిక్స్పై వచ్చే అయిదేళ్లలో రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. చాలెట్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 975 టార్గెట్ ధర: రూ. 1,172 (వృద్ధి: 20%)వ్యూహాత్మక కొనుగోళ్లు, గదుల పెంపు, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వంటివి సంస్థకు సానుకూలంగా ఉండనున్నాయి. అలాగే, కమర్షియల్ బిజినెస్ వాటా పెరుగుతుండటమనేది వృద్ధికి కీలక చోదకంగా నిలవనుంది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2025 డిసెంబర్ ఆఖరు నాటికి గదుల సంఖ్యను 4,500కి పెంచుకోనుంది. కమిన్స్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 3,976 టార్గెట్ ధర: రూ. 4,500 (వృద్ధి: 13% )హై–హార్స్పవర్ (హెచ్హెచ్పీ) జెన్సెట్ల మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. పటిష్టమైన బ్రాండింగ్, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. 2025 తొలినాళ్ల నుంచి పవర్జెన్ వ్యాపారం పుంజుకుంది. డేటా సెంటర్లు, హాస్పిటల్స్, మొదలైన రంగాల నుంచి హెచ్హెచ్పీ జెన్సెట్లకు డిమాండ్ కొనసాగనుంది. ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. యూరప్, ఆప్రికా, పశ్చిమాసియాలో డిమాండ్ స్థిరంగా ఉంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ప్రస్తుత ధర: రూ. 4,880 టార్గెట్ ధర: రూ. 6,000 (వృద్ధి: 23%) ఎయిర్క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు, ఇంజిన్లు, యాక్సెసరీలు అందించే హెచ్ఏఎల్కి భారతదేశపు డిఫెన్స్ రంగంలో విశిష్టమైన స్థానం ఉంది. తయారీ సెగ్మెంట్ కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల ఆదాయ వృద్ధి మెరుగుపడొచ్చు. రూ. 1.9 లక్షల కోట్ల ఆర్డర్ బ్యాక్లాగ్ ఉంది. రాబోయే 1–2 ఏళ్లలో రూ. లక్ష కోట్ల ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. హడ్కో ప్రస్తుత ధర: రూ. 224 టార్గెట్ ధర: రూ. 260 (వృద్ధి: 16% )సామాజిక హౌసింగ్, అర్బన్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది. ప్రభుత్వాలతో పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏయూఎం వార్షికంగా 25 శాతం పైగా, లాభం 23 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. వచ్చే 18 నెలల్లో మొండిపద్దుల భారాన్ని పరిష్కరించుకోవాలని కంపెనీ నిర్దేశించుకుంది. బ్రోకరేజ్: మోతీలాల్ ఓస్వాల్ ఎస్బీఐ ప్రస్తుత ధర: రూ. 889 టార్గెట్ ధర: రూ. 1,000 (వృద్ధి: 12%)జీఎస్టీ 2.0, ఆదాయ పన్ను సంస్కరణలు, ద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు మొదలైనవి రుణ వృద్ధికి దారి తీయొచ్చని, బీఎఫ్ఎస్ఐ రంగం లాభదాయకతకు తోడ్పడవచ్చని అంచనాలు ఉన్నాయి. రిటైల్, ఎస్ఎంఈ, కార్పొరేట్ సెగ్మెంట్లవ్యాప్తంగా పటిష్టమైన కార్యకలాపాలు ఉండటం బ్యాంకుకు సానుకూలాంశం. ఎంఅండ్ఎం ప్రస్తుత ధర: రూ. 3,648 టార్గెట్ ధర: రూ. 4,091 (వృద్ధి: 12%)2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి 2030 నాటికి కంపెనీ 7 ఐసీఈ ఎస్యూవీ వాహనాలను, 5 బీఈవీలను, 5 ఎల్సీవీలను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఐసీఈ, ఈవీ సెగ్మెంట్లలో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ, కొత్త ఉత్పత్తుల దన్ను, ట్రాక్టర్ల మార్జిన్లు మెరుగుపడటం మొదలైనవి సంస్థకు కలిసి రానున్నాయి. భారత్ ఎల్రక్టానిక్స్ ప్రస్తుత ధర: రూ. 413 టార్గెట్ ధర: రూ. 490 (వృద్ధి: 19% )ఆర్మీ నుంచి రూ. 30,000 కోట్ల అనంత శస్త్ర ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి కంపెనీ, లీడ్ ఇంటిగ్రేటరుగా వ్యవహరిస్తుండటం వల్ల కంపెనీ అర్డరు బుక్ రూ. లక్ష కోట్ల స్థాయిని దాటే అవకాశముంది. ఇది, వ్యూహాత్మక డిఫెన్స్ ప్రోగ్రాంలలో కంపెనీ నాయకత్వ స్థానాన్ని తెలియజేస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్వ్యాప్తంగా అవకాశాలతో దీర్ఘకాలికంగా కంపెనీ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. స్విగ్గీ ప్రస్తుత ధర: రూ. 432 టార్గెట్ ధర: రూ. 550 (వృద్ధి: 27% )పోటీ నెమ్మదిస్తుండటం, డార్క్ స్టోర్లను విస్తరణ క్రమంగా స్థిరపడుతుండటం మొదలైన వాటి కారణంగా కంపెనీకి చెందిన ఇన్స్టామార్ట్ విభాగం త్వరలో లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ మార్పుల వల్ల వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వ్యాపార వృద్ధి, గతంలో అంచనా వేసిన 20 శాతానికన్నా మెరుగ్గా 23 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా. ఇండియన్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 735 టార్గెట్ ధర: రూ. 880 (వృద్ధి: 20% )ఆక్యుపెన్సీ, ఏఆర్ఆర్ పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా దేశీయంగా హాస్పిటాలిటీ పరిశ్రమ 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా వృద్ధి చెందనుంది. అలాగే ఎంఐసీఈ యాక్టివిటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వితీయార్ధంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైనవి కూడా కంపెనీ వృద్ధికి దోహదపడనున్నాయి. బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్ (ఏఏబీఎల్) ప్రస్తుత ధర: రూ. 1,058 టార్గెట్ ధర:రూ. 1,182 (వృద్ధి: 12% )క్రమంగా ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ వైపు మళ్లుతోంది. మధ్యప్రదేశ్లో 20–25 శాతం వరకు మార్కెట్ వాటా ఉంది. అలాగే, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఉత్తర్ప్రదేశ్ మార్కెట్లలోకి కూడా విస్తరిస్తోంది. ఇటీవలే నికోబార్ జిన్, హిల్ఫోర్ట్ విస్కీ అనే ప్రీమియం బ్రాండ్లను ప్రవేశపెట్టడంతో పాటు కొత్తగా బ్రాందీ, టెకీలాలో కూడా మరిన్ని ప్రోడక్ట్లను ప్రవేశపెట్టబోతోంది. వ్యయాలు తగ్గించుకుని, స్థిరమైన మార్జిన్లను సాధించేందుకు కసరత్తు చేస్తోంది. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: రూ. 2,011 టార్గెట్ ధర: రూ. 2,244 (వృద్ధి: 12%) ఏఆర్ పీయూ, డిజిటల్ వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏఆర్పీయూ రూ. 250గా ఉండగా, టారిఫ్ల పెంపుతో రూ. 300 సమీపానికి చేరే అవకాశం ఉంది. ఇక గూగుల్, ఒరాకిల్, యాపిల్, హ్యూస్లాంటి దిగ్గజాలతో జట్టు కట్టడం ద్వారా మొబైల్ సరీ్వసుల పరిధికి మించి ఇతర విభాగాల్లోకి ప్రవేశించడంలో కంపెనీకి తోడ్పడనుంది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్రస్తుత ధర: రూ. 541 టార్గెట్ ధర: రూ. 639 (వృద్ధి: 18% )భారతదేశపు ఇంధన పరివర్తన లక్ష్యాలతో కంపెనీకి ప్రయోజనం చేకూరనుంది. కంపెనీ ఇప్పటికే నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే 20 గిగావాట్ల స్ట్రాటెజీ 2.0 టార్గెట్ని సాధించింది. ఇప్పుడు 2030 నాటికి 30 గిగావాట్ల కెపాసిటీ, 40 గిగావాట్అవర్ స్టోరేజీని సాధించే దిశగా ముందుకెళ్తోంది. రూ. 1.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ప్రణాళికలు ఉన్నప్పటికీ పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. ఎల్అండ్టీ ప్రస్తుత ధర: రూ. 3,839 టార్గెట్ ధర: రూ. 4,243 (వృద్ధి: 11%) క్యాపిటల్ గూడ్స్ విభా గానికి చెందిన ఈ సంస్థ కు రూ. 6.1 లక్షల కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఇన్ఫ్రా, ఎనర్జీ, హైడ్రోకార్బన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ. 14.8 లక్షల కోట్ల ఆర్డర్లు కుదిరే దశలో ఉన్నాయి. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా కంపెనీ లాభదాయకత మరింత మెరుగుపడనుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 72 టార్గెట్ ధర: రూ. 88.5 (వృద్ధి: 23%)కాసా డిపాజిట్లు 26 శాతం వృద్ధి చెందాయి. దీంతో కాసా నిష్పత్తి 48 శాతానికి, క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తి 93.4 శాతానికి పెరిగాయి. నిధుల సమీకరణ వ్యయా లు తగ్గి, 2025–26 మూడో త్రైమాసికానికి మార్జిన్లు 5.7 శాతానికి చేరే అవకాశముంది. 2024–25లో రూ. 1,525 కోట్లుగా ఉన్న లాభాలు, 2026 కల్లా రూ. 4,560 కోట్లకు ఎగిసే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
గోరంత దీపం జగమంత వెలుగు
శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అణగ దొక్కి సుతల రాజ్యాధిపతిని చేసినందుకుగాను ఈ అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారనీ, శ్రీరామచంద్రుడు రావణాసురుడిని వధించి శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయాదులతో అయోధ్యకేతెంచి, పట్టాభిషిక్తుడైనదీవేళే కనుక ఈ రోజును దీపావళిగా జరుపుకుంటారని, శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై నరకుని వధించిన సందర్భంగా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారని, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలకు సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకా, పంచపాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని విజయవంతులై తిరిగి వచ్చినందుకు ఆనందంతో ప్రజలు దీపావళి జరుపుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఆదిపరాశక్తి శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించినందుకు ఆనందంతో వెలిగించిన జ్యోతులే దీపావళి అని కూడా ప్రచారంలో ఉంది. ఇవేకాక, క్షీరసాగర సమద్భూత అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడిని వరించినందుకు దేవతలు, మానవులు, అందరూ ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకుంటున్నారు అని కూడా చెప్తారు. భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి. మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. ఈ పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతోపాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి నెలలోనూ పండుగలను నిర్దేశించారు. అలా మన సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు, మానవతా విలువలకు ప్రతీకగా మారింది దీపావళి పండుగ. నేటి కాలంలో ప్రపంచ దేశాలలో ఎందరో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అమెరికాలో వైట్హౌస్లో కూడా దీపావళి నాడు దీపాలు వెలిగిస్తున్నారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ హస్త భోజనం అని, తరువాత నాగుల చవితి, నాగ పంచమి అని – ఇన్ని రోజులు పండుగ చేసుకుంటాము.దీపావళి పండుగనాడు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానమాచరించి, పితృ తర్పణాలివ్వటం, దానం చెయ్యటం, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటం, ఆకాశదీపం పెట్టటం చేస్తాం. ఆకాశదీపం పెట్టడం వల్ల దూర్రపాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు మార్గ దర్శనం చేస్తుంది.మనం ప్రతిరోజు ఉభయ సంధ్యలలోను మన ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీపాన్ని, దీపజ్యోతిని ఆరాధిస్తాం. ఏ శుభకార్యాలు చేసినా, ఏ వేడుకలు జరిగేటప్పుడు అయినా ముందుగా దీప ప్రజ్జ్వలన చేసి, అప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. వివాహాలు కూడా అగ్నిసాక్షిగా చేసుకుంటాం, అంటే దీపం, దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉంటారన్నమాట. వారు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక దీపం వెలిగించటం అన్నది అత్యంత ప్రధానమైనదని అందరికీ తెలియజేయటానికి, అందరూ దీపాలు వెలిగించేలా చేయడానికి దీపావళి పండగను మన మహర్షులు ఏర్పాటు చేశారు. దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం ఆశ్వయుజ బహుళ అమావాస్యకు ముందు మూడు రోజుల నుంచి ఇంటి ముందు దీపాలు పెట్టటం ప్రారంభిస్తాం. అలా వెలిగించడం ప్రారంభించిన ఈ దీపాలను కార్తీక మాసమంతా వెలిగిస్తాందీపాల కథపూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాçహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు, భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, ‘కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా’ అని ఆలోచించి, ‘నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి‘ అని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఇంక తనకు చావే లేదనే భ్రమతో నరకుడు లోకకంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, బ్రాహ్మణులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీ కృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకాసురుడి పీడ వదలగానే ప్రజలందరూ మంగళ వాద్యాలు మోగించి సత్యభామా శ్రీ కృష్ణులకు స్వాగతం చె΄్పారు. ఆ మంగళ ధ్వనులే నేటికీ బాణసంచా రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి.కొన్ని ప్రాంతాలలో బాణసంచా కాల్చి ఇంట్లోకి వచ్చాక, ఆడవాళ్ళందరూ కలిసి చేటలు, పళ్ళాలు వాయిస్తారు. అది దరిద్ర దేవతను తరిమి వేయటమన్నమాట. దీనిని ‘అలక్ష్మీ నిస్సరణము’ అంటారు. ఎలా జరుపు కోవాలంటే..?దీపావళి నాడు పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి, తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట. వారికి దారి కనిపించటం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇంట్లోని పెద్దవారు పిల్లలతో ఈ దివిటీను కొట్టిస్తారు. పొడుగాటి గోగు కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి, వాటిని పిల్లల చేతులకిచ్చి, వారిని వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి, ఆకాశంలో దక్షిణం వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి, నేలకు వేసి కొట్టిస్తూ, ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి‘ అని అనిపిస్తారు. ఆ తరువాత ఆ కాడలను ఒకపక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లూ చేతులు కడిగి, కళ్ళు తడిచేతితో తుడిచి, నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని, తరువాత ఆ పిల్లలచేత మిఠాయిలు తినిపిస్తారు. తరువాత ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చడం ప్రారంభిస్తారు. బాణసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక, అర్ధరాత్రి దాటాక, ఇళ్ళు వాకిళ్ళను తుడిపించుకోవాలని ధర్మశాస్త్రం చెప్తోంది.ఈసారి రికార్డ్ బ్రేక్ కావాల్సిందే!గత సంవత్సరం అక్టోబర్లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను వెలిగించి ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సెట్ చేసింది. తాజాగా...28 లక్షల దీపాలను వెలిగించి తన రికార్డ్ను తానే బ్రేక్ చేయాలనుకుంటోంది.వారణాసిలో దేవతల దీపావళిదీపావళి తరువాత పదిహేను రోజులకు వారణాసిలో దేవ దీపావళిని జరుపుకుంటారు. కార్తిక పూర్ణిమ రాత్రి గంగానది వెంబడి ఉన్న ఘాట్లు లక్షలాది దీపాలతో వెలుగుతాయి. ఆ వెలుగుల ప్రతిబింబాలు నదిలో అందమైన చిత్రాలను ఆవిష్కరిస్తాయి. గంగానదిలో స్నానం చేయడానికి దేవతలు భూమి మీదికి దిగి వచ్చిన రోజుగా ఈ రోజును జరుపుకుంటారు.దీపావళి పూట...శివాజీ కోట!దీపావళి సీజన్లో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శివాజీ పాలించిన కోటకు ప్రతిరూపంగా మట్టికోటలను తయారుచేయడం అనేది ఆచారం. ఈ కోటను నిర్మించే క్రమంలో బురదలో విత్తనాలు నాటుతారు. కోట చుట్టూ పచ్చదనం ఉండేలా చేస్తారు. రాత్రివేళల్లో ఈ మట్టి కోటపై చిన్న చిన్న దీపాలను వెలిగిస్తారు.దేవతలకు స్వాగతంజార్ఖండ్లో దీపావళి పండగ సందర్భంగా సోహ్రై వేడుకను జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా దేవతలను స్వాగతించడానికి ఘరోండాలు (మట్టి బొమ్మల ఇళ్ళు) తయారుచేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి అగరువత్తులు కాల్చుతారు. సోహ్రై వేడుకలలో పశువులకు స్నానం చేయించి పూజ లు చేస్తారు.పేడ పూసుకుని వేడుక చేసుకుంటారు!కర్నాటక, తమిళనాడు సరిహద్దులలోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకొని ‘గోరెహబ్బ’ వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా మగవాళ్లు ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఆడవాళ్లు ఒంటికి రాసుకుంటారు. ఆవుపేడలో ఔషధగుణాలు ఉన్నాయనే నమ్మకంతో ఏర్పడిన శతాబ్దాల నాటి సంప్రదాయం ఇది.– డా. సోమంచి (తంగిరాల) విశాలాక్షి. విశ్రాంత సంస్కృతాచార్య -
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన.‘ప్రతి ఇంటా దీపాలు వెలగాలి. ఆనందాలు వెల్లువలా పొంగాలి’.వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. దీపావళి అంటేనే కాంతి, వెలుగుతో పాటు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ దీపావళి పండుగ, ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలి. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుకుంటున్నా. చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు అని ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.#Deepavali— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025 -
రావణుడు... మా ఊరి అల్లుడు!
దీపావళి అంటేనే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అయితే రాజస్థాన్లోని జోద్పూర్కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండోల్లో దీపావళి రోజు దీపాలు వెలిగించడం, బాణసంచ కాల్చడం ఉండదు. నిశ్శబ్దాన్ని పాటిస్తారు. కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే స్థానిక పురాణం తెలుసుకోవాల్సిందే. దీని ప్రకారం... రావణుడి భార్య మండోదరి జన్మస్థలం మండేరే. రావణుడు మండోదరిని ఈ గ్రామంలోనే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. మండేరేకి చెందిన మౌద్గిల్ బ్రాహ్మణులు తమను తాము మండోదరి కుటుంబ వారసులుగా భావిస్తారు. అందువల్ల వారు రావణుడిని రాక్షస రాజుగా కాకుండా గౌరవనీయమైన బంధువుగా చూస్తారు! (చదవండి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!) -
కలర్ఫుల్ స్వింగ్ 'దివాలి' డ్రెస్సింగ్..!
దీపావళి అంటే ఒక పండుగ మాత్రమే కాదు.. విభిన్న రకాల సంబరాల కలగలుపు వేడుక. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం మొదలు.. క్రాకర్స్ కాల్చడం వరకూ ఈ పండుగ ఆస్వాదించదగిన ఎన్నో అనుభూతులను మనకు అందిస్తుంది. అందుకే ఈ ఫెస్టివల్లో మన లుక్స్ ద్వారా గుడ్విల్ అందుకోవాలంటే, తగిన వస్త్రధారణ తప్పనిసరి. ఇందుకోసం తరచూ బాలీవుడ్ నటీనటుల స్టైల్స్ను సిటీ యూత్ అనుసరిస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన హామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ అందిస్తున్న కొన్ని సూచనలు.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ధరించిన ఒక డ్రెస్.. ఒక టాంగీ నారింజ మిర్రర్–వర్క్ బ్లేజర్ కోర్డ్ సెట్ దీపావళి పార్టీకి సరైన ఎంపిక. ముఖ్యంగా పండుగ వేళ మెరుపులు విరజిమ్ముతూ.. అదే సమయంలో సౌకర్యవంతంగా ఉండాలనుకునేవారికి ఇవి సరైనవి. మినిమలిస్ట్ లుక్.. ఉత్తరాది ప్రేక్షకుల్ని ఉర్రూతలూంచే అనన్య పాండే దీపావళి కోసం మినిమలిజాన్ని సూచిస్తున్నారు. సున్నితమైన తెల్లటి ఎంబ్రాయిడరీతో అలంకరించిన లేత గులాబీ రంగు స్లీవ్లెస్ కుర్తాను, మ్యాచింగ్ పలాజో ప్యాంటు జత చేశారు. ఓపెన్ హెయిర్ మినిమల్ మేకప్తో, పండుగ డ్రెస్సింగ్కు ‘తక్కువలో ఎక్కువ’ విధానాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తున్నాయి. రెడ్ గ్లామ్ లుక్.. దీపావళికి మరో సిల్వర్ స్క్రీన్ క్వీన్ మౌని రాయ్ లాగా ఆల్–రెడ్ లెహంగాలో అబ్బురపరిచవచ్చు. కాంబినేషన్గా ఫుల్–స్లీవ్డ్ బ్లౌజ్, ప్రింటెడ్ బోర్డర్లతో మ్యాచింగ్ స్కర్ట్, గోల్డెన్ షిమ్మర్తో అంచులున్న కో–ఆర్డినేటింగ్ దుపట్టా ఉన్నాయి. బంగారు చోకర్ నెక్లెస్, మాంగ్ టిక్కాతో తన అద్భుతమైన ఎథి్నక్ లుక్ కంప్లీట్గా తీర్చిదిద్దుకుంది. లాంగ్ ఎథినిక్ జాకెట్లు.. పొడవాటి ఎథ్నిక్ జాకెట్లు పండుగ వార్డ్రోబ్కు చక్కదనాన్ని జోడిస్తాయి. సరళమైన కుర్తాపై అందంగా ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్ను జత చేయాలి లేదా క్యాజువల్, చిక్ ఫ్యూజన్ లుక్ కోసం క్రాప్ టాప్ స్కర్ట్తో స్టైల్ సెట్ చేసుకోవచ్చు. ఈ స్టైలిష్ లేయర్ డ్రెస్సింగ్.. ట్రెండీగా సాయంత్రపు సమావేశాలకు సౌకర్యవంతంగా ఉంటూనే సంప్రదాయాన్ని జోడిస్తుంది.సింపుల్ లాంగ్ గౌన్లు.. సొగసైన పాస్టెల్ లేదా మ్యూట్ షేడ్స్లో ఉన్న పొడవైన, తక్కువగా అలంకరించిన గౌన్లు దీపావళికి స్టైలిష్ ఎంపిక. అవి చక్కదనంపై రాజీ పడకుండా సౌకర్యంపై దృష్టి పెడతాయి. పండుగ రూపాన్ని పూర్తిగా ప్రతిబింబించాలంటే.. దీనికి దుపట్టా లేదా లైట్ జ్యువెలరీ జోడించాలి. పాతవే కొత్తగా.. ప్రస్తుత వార్డ్రోబ్ నుంచి కొన్నింటిని విడివిడిగా తీసి కలపడం ద్వారా అదనపు ఖర్చు చేయకుండా కూడా తాజా పండుగ స్టైల్ను సృష్టించవచ్చు. కొత్త పలాజోలతో పాత కుర్తీని జత చేయడం లేదా సరదాగా ఫ్యూజన్ వైబ్ కోసం జీన్స్తో భారీ దుపట్టాను కలిపేయడం.. వంటి ట్రిక్స్ ఫాలో అవ్వవచ్చు. ఇది మన డబ్బు ఆదా చేయడమే కాకుండా దుస్తులకు వ్యక్తిగత సృజనాత్మక ట్విస్ట్ను అందిస్తుంది. దేశీ డ్రీమ్.. మరీ సింపుల్గా వద్దు అనుకుంటే, అలంకరించబడిన షరారా సెట్లు రెడీగా ఉన్నాయిు. సీక్విన్స్, జెమ్స్ మెరుపులతో ఇవి లేట్–నైట్ డిన్నర్లు, రూఫ్టాప్ పార్టీలకు బెస్ట్. దీని కోసం నటి జాన్వి కపూర్ డ్రెస్ స్టైల్ పరిశీలించవచ్చు. ఆధునిక, ఆకర్షణీయమైన ట్విస్ట్ కోసం దుపట్టాను కేప్గా ధరించవచ్చు. బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది లాగా నల్ల కుర్తా స్ట్రెయిట్–ఫిట్ ప్యాంటు లుక్ కూడా బాగుంటుంది. లీనియర్ రెడ్ మోటిఫ్ డీటెయిలింగ్తో అలంకరించిన, వదులుగా ఓపెన్ జాకెట్తో పొరలుగా ధరించడం ఆధునిక సంప్రదాయాల స్టైలిష్ మిశ్రమం.వేదంగ్ రైనా లా నల్ల కుర్తా స్ట్రెయిట్ ప్యాంటులో మెరిసిపోవచ్చు, సమకాలీన పండుగ లుక్ కోసం మెరిసే నల్ల బ్లేజర్తో లుక్ను మరింత మెరిపించవచ్చు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ని గమనిస్తే.. తరచూ క్లాసిక్ సిల్హౌట్లతో సమకాలీన కట్లను మిళితం చేస్తాడు. ఇటీవలి దీపావళి లుక్లో పొట్టి కుర్తా ఎరుపు రంగు స్ట్రెయిట్ ప్యాంటు నమూనా నెహ్రూ జాకెట్తో కలిగి ఉంది ఆధునిక పండుగ డ్రెస్సింగ్కి ఇది సరైన ఉదాహరణ. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్లా చాలా సింపుల్ స్టైల్ని ఎంచుకోవచ్చు. ఆయన ధరించిన పాస్టెల్–రంగు లినెన్ కుర్తా–పైజామా సౌకర్యం, సరళమైన కాలాతీత శైలి అని చెప్పొచ్చు. -
మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!
దీపావళి అనగానే నోరూరించే వివిధ రకాల మిఠాయిలు గురొస్తాయి. టపాసులు ఎంత ఫేమస్సో.. అంతే రీతిలో స్వీట్లు ఫేమస్.. పండగ శుభాకాంక్షలతో పరిశ్రమలు, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వేత్తలు ప్రత్యేంగా ఆర్డర్ ఇచ్చి స్వీట్స్ తయారు చేయిస్తున్నారు. ఆది, సోమవారాల్లో నేరుగా వచ్చే వినియోగదారుల కోసం స్వీట్ దుకాణాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమయంలో వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. సందట్లో సడేమియా అన్నట్లు డిమాండ్ ఉన్నప్పుడే నాసిరకం ఉత్పత్తులు తయారు చేసి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతారు. రుచి, వాసన, జిగేల్ మని మెరిసే రంగుల కోసం వివిధ రకాల రసాయనాలు వినియోగించే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మిఠాయిలకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. పండగ రెండు రోజులు ఎగబడి మరీ కొంటారు. అయితే వీటిని తయారు చేసే సమయంలో ఎలాంటి పదార్థాలు వినియోగిస్తున్నారనేది తెలియదు. ఆహార భద్రత అధికారులు సైతం దీనిపై దృష్టిసారించే పరిస్థితి లేదు. దీంతో కల్తీ జరిగే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి సమయంలో మితంగా తింటే సరే.. అతిగా తిన్నామా ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. స్వీట్స్లో చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా వినియోగిస్తారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కొవ్వు పదార్థాలు గుండె జబ్బులకు దారితీయవచ్చు. పిల్లల్లో అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. వీటన్నింటికీ మించి అవసరాలకు సరిపడా పిండి వంటలను ఇంట్లోనే తయారు చేసుకుంటే మేలు. తద్వారా కల్తీ ఆహార పదార్థాలు, కలుషిత, నిల్వ ఉంచిన వాటి నుంచి జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం.. పిండి వంటల తయారీ ప్రక్రియలో నూనె, చక్కెర, రంగులు, డ్రైఫ్రూట్స్ ఎలాంటివి వినియోగిస్తున్నారో గుర్తించడం కష్టం. రుచి, వాసన, రంగు కోసం కెమికల్స్ వినియోగించే అవకాశం లేకపోలేదు. ఇవి పిల్లలు, గర్భిణులు, వృద్ధులుపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయి. కెమికల్స్, కల్తీ పదార్థాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కావచ్చు. దీర్ఘకాలంలో కేన్సర్, లివర్, కిడ్నీపై ప్రభావం చూపిస్తాయి. ఇటువంటి వాటిపై ప్రభుత్వ శాఖాపరమైన పర్యవేక్షణ ఉండాలి. తయారు చేసిన వంటకాల ప్యాక్పై వినియోగించిన పదార్థాలు, ఫ్యాట్, ఇతర వివరాలు ముద్రించాలి. – కిరణ్ కుమార్ మాదాల, ఐఎంఏ తెలంగాణ మీడియా కో–కన్వీనర్ -
బాణసంచా కాల్చడం ఎలా మొదలైందో తెలుసా..!
దీపావళి వేడుక అంటే..మోద మోగిపోవాల్సిందే.. ఆ పండుగ సంబంరం అలా ఇలా ఉండదు. టపాసులు, బాణసంచా వెలుగులు విరజిమ్ముతూ..అదిరిపడే శబ్దాలతో ఆనంద హేళిలా సాగిపోతుంది. అలాంటి వేడుకలో కాల్చే బాణసంచా కాల్చడం తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇదెలా వాడుకలోకి వచ్చింది, ఎలా మొదలైంది అంటే..ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన బాణసంచా మ్యూజియం. ఈ మ్యూజియం జపాన్ రాజధాని టోక్యో పరిధిలోని ర్యోగోకు జిల్లాలో ఉంది. ‘ర్యోగోకు హనాబి’ పేరుతో సుమిదా నది ఒడ్డున ఈ మ్యూజియం 1733 సంవత్సరంలో ఏర్పాటైంది. జపాన్లో పదహారో శతాబ్ది నుంచి బాణసంచా వాడుక మొదలైంది. పలు వేడుకల్లో జపాన్ ప్రజలు బాణసంచా కాలుస్తుంటారు. (చదవండి: ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారంటే..!) -
ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారంటే..!
దీపాల కాంతితో ధగధగ మెరిసే ఈ దీపాల పండుగ ఇష్టపడని వారుండరు. అలాంటి మిరుమిట్లు గొలిపే ఈ పండుగ.. టపాసుల మోత మోగిపోయేలా ఆనందహేలి తాండవించేలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి అలాంటి పండుగా మన దేశంలోనే పలు రాష్టాలు అత్యంత విభిన్నంగా జరుపుకుంటాయి. ఈ దీపావళి పండుగ నేపథ్యంలో ఆ విశేషాలు గురించి సవిరంగా తెలుసుకుందామా..!చీకటి దీపావళి!దీపావళి వేడుకల తర్వాత హిమాచల్ప్రదేశ్లో బుద్ది దీపావళి(చీకటి దీపావళి లేదా పాత దీపావళి) జరుపుకుంటారు. దీపావళి తర్వాత మొదటి అమావాస్య రోజు బుద్ది దీపావళి వేడుకలు మొదలవుతాయి. రాముడి రాక వార్త ఒక నెల తర్వాత మాత్రమే హిమాచల్ప్రదేశ్కు చేరిందట. అందుకే ఆలస్యంగా పండగ జరుపుకునే సంప్రదాయం మొదలైంది అంటారు.దేవరి రాత్రిఛత్తీస్ఘడ్లోని గోండు తెగలు దీపావళిని ‘దేవరి’గా జరుపుకుంటాయి. దేవరి రాత్రి గ్రామంలోని మహిళలు తలలపై ఒక కుండలో నూనె దీపాన్ని వెలిగించి శ్రావ్యంగా పాటలు పాడుతూ, ప్రతి ఇంటి తలుపు తడుతూ తమతో చేరాలని ఆ ఇంటి మహిళలను అభ్యర్థిస్తారు. బియ్యపు పిండితో చేసిన దీ΄ాలను ప్రతి ఇంటి ముందు ఉంచుతారు.ఆవులను తమపై నడిపించి..మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని బిదావాద్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. దీ΄ావళి రోజు తరువాత నేలపై పడుకొని ఆవులను తమపై నడిపించుకుంటారు. 33 కోట్ల దేవుళ్లు, దేవతలు ఆవులో కొలువై ఉన్నారని, వాటిని తమపై నడిపించుకోవడం ద్వారా దేవతల ఆశీర్వాదం దొరుకుతుందనేది భక్తుల నమ్మకం.భర్త కోసం రాత్రంతా దీపాలు...మహారాష్ట్రలో దీపావళి వేడుకలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రచారంలో ఉంది. వివాహం జరిగిన నాలుగు రోజుల తరువాత చనిపోతాడని యువ రాజుకు శాపం. విషయం తెలిసిన వధువు తన భర్త ప్రాణాలు రక్షించుకోవడం కోసం రాత్రంతా అవిశ్రాంతంగా దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది. ఆమె ప్రయత్నాల వల్ల భర్త బతుకుతాడు.శ్రీవిష్ణువు భూలోకానికి...గుజరాత్లో దీపావళి రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనేది తరతరాలుగా వస్తోంది. మహాలక్ష్మీదేవి భర్త విష్ణువు భూలోకానికి వచ్చిన గుర్తుగా మధ్యప్రదేశ్లో దీపావళి జరుపుకుంటారు. కోల్కత్తాలో దీపావళికి కాళీపూజ చేస్తారు.సోదర, సోదరీమణులు...మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో దీపావళి అనేది సోదర, సోదరీమణుల అనుబంధానికి ముడి పడి ఉన్న పండగగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత రోజు జరుపుకునే ఈ పండగను ‘యమ–ద్విత్య’ అని పిలుస్తారు. యమున తన సోదరుడు, మృత్యుదేవుడు యముడికి ఆతిథ్యం ఇచ్చిన రోజు ఇదే అని పురాణ కథలు చెబుతాయి.లక్ష దీపాల ఆగ్రా కోట అక్బర్ చక్రవర్తి పాలనలో దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. ఈ సంప్రదాయాన్ని ‘జష్నే చిరాఘన్’ అని పిలిచేవారు. లక్షలాది దీపాలతో ఆగ్రా కోట వెలిగి΄ోయేది. కోట ముందు ఉన్న మైదానంలో బాణసంచా కాల్చేవారు. -
ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..
దుష్ట ప్రవృత్తి గల నరకాసురుడిపై సత్యభామ సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నేరాలు చేసే ఎందరో నరకాసురులకు సత్యభామలుగా మారిన పోలీసు ఆ‘షీ’సర్లు చెక్ చెప్తున్నారు. నేడు నరక చతుర్దశి సందర్భంగా మహిళా పోలీస్ అధికారుల ప్రాధాన్యం గురించి... హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీలో (ఎన్పీఏ) తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల్లో 36 శాతం మహిళలే. ఎన్పీఏ చరిత్రలో ఇదో రికార్డు. దీనికిముందే ఇలాంటి అరుదైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమైంది. సెప్టెంబర్లో చోటు చేసుకున్న ఐపీఎస్ అధికారుల బదిలీతో రాష్ట్ర పోలీసు విభాగంలోని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో మకుటాలను 33.3 శాతం మహిళలే ధరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1979 వరకు మహిళా ఐపీఎస్లే లేరు. ఆ ఏడాది ఎన్పీఏలో శిక్షణ పూర్తి చేసుకున్న హైదరాబాదీ యువతి అరుణ బహుగుణ చిత్తూరు జిల్లా మదనపల్లె అదనపు ఎస్పీగా పోస్టింగ్ పొందారు. ఇది అప్పట్లో సంచలనం. ఆపై కాలక్రమంలో మహిళ ఐపీఎస్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ 2014 వరకు వీరికి సముచిత పోస్టింగ్స్ ఉండేవి కాదు. అత్యవసర సందర్భాల్లో అక్కరకు రావడానికి కమిషనరేట్కు ఒక మహిళ ఐపీఎస్కు పోస్టింగ్ ఇచ్చేవాళ్లు. మిగిలిన అధికారుల్ని అంతగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించే వారు. రానురాను ఆ సీన్ పూర్తిగా మారిపోతూ వచ్చింది. పోలీసు విభాగంలో మహిళ ఐపీఎస్ అధికారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పోస్టింగ్స్ ఇవ్వడం అనివార్యంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహిళ భద్రత విభాగం, షీ–టీమ్స్ ఏర్పాటైన తర్వాత వీటిలో అనివార్యంగా మహిళ ఐపీఎస్లకే పోస్టింగ్ ఇస్తూ వచ్చారు. కమిషనరేట్లలో డీసీపీ పోస్టులతో పాటు కొన్ని జిల్లాలకు మహిళల్ని ఎస్పీలుగా నియమించారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న మూడో వంతు హెచ్ఓడీ పోస్టులతో పాటు హైదరాబాద్, రాచకొండల్లోని డీసీపీ పోస్టుల్లో అత్యధికంగా మహిళా ఐపీఎస్లే ఉన్నారు. ఎస్సైల నుంచి డీఎస్పీల వరకు శిక్షణ ఇచ్చే తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడెమీకి అభిలాష్ బిస్త్, నేరగాళ్లలో మార్పునకు కృషి చేసే జైళ్లశాఖకు సౌమ్య మిశ్ర, రాష్ట్ర నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) చారు సిన్హా, మావోయిస్టు వ్యతిరేక నిఘా విభాగమైన బి.సుమతి, హోంగార్డ్స్ వింగ్కు స్వాతి లక్రా నేతృత్వం వహిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఈ ప్రకారం చూస్తే 15 హెచ్ఓడీ పోస్టుల్లో ఏడింటికి ఐదుగురు మహిళ ఐపీఎస్లు నేతృత్వం వహిస్తున్నట్లు లెక్క. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు శిఖా గోయల్ చీఫ్గా, అవినీతి నిరోధక శాఖకు చారు సిన్హా ఇన్చార్జ్గా ఉన్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో మహిళా పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతోపాటు ఉన్నత స్థాయిలో కూడా ఉండేవారు కారు. అయితే కాలక్రమంలో వీరి సంఖ్య కాస్త పెరిగినా... నగరంలో హఠాత్తుగా తలెత్తే పరిణామాలతోపాటు మతకలహాలను అదుపు చేయడం, వేళాపాళా లేని విధులు వీరితో సాధ్యం కాదనే భావన గతంలో ఉండేది. కాలక్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలోనూ ఒక మహిళ ఉన్నతాధికారి ఉండాలని ప్రభుత్వమూ భావించినప్పటికీ చాన్నాళ్ళ వరకు కేవలం నార్త్జోన్కు మాత్రమే మహిళ అధికారిని నియమిస్తూ వచ్చారు. ఆ జోన్కు ఉండే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సిటీ పోలీసువింగ్లో మహిళ ఉన్నతాధికారి ΄ోస్టు ఇదొక్కటే అనే భావన కొనసాగింది.ప్రస్తుతం పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. హైదరాబాద్ కమిషనరేట్లో ఏడు జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్కు ఒక్కో డీసీపీ నేతృత్వం వహిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఏడు జోన్లలో మూడింటికి మహిళ ఐపీఎస్లే డీసీపీలుగా ఉన్నారు. మధ్య మండలానికి శిల్పవల్లి, ఉత్తర మండలానికి సాధన రష్మీ పెరుమాళ్, దక్షిణ మండలానికి స్నేహ మెహ్రా డీసీపీలుగా ఉన్నారు. వీరికి తోడు పరిమళ నూతన్, పరిపాలన విభాగం సంయుక్త సీపీగా, రక్షితమూర్తి, సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ డీసీపీగా, అపూర్వ రావు– స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా, ఎన్ .శ్వేత డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ గా, డి.కవిత,సైబర్ క్రైమ్ విభాగం డీసీపీగా, లావణ్య జాదవ్– ఉమెన్ సేఫ్టీ డీసీపీగా పని చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్లోని అత్యంత కీలకమైన మాదాపూర్ జోన్కు డీసీపీగా రితిరాజ్ వ్యవహరిస్తున్నారు. ఇక రాచకొండలో మొత్తం నాలుగు జోన్లు ఉన్నాయి. వీటిలో మల్కాజ్గిరి, ఎల్బీనగర్, మహేశ్వరానికి పద్మజ రెడ్డి, అనురాధ, సునీత రెడ్డి డీసీపీలుగా ఉన్నారు. వీరిలో సునీత రెడ్డి మాత్రమే నాన్ ఐపీఎస్ అధికారి. ఈ జోనల్ డీసీపీలతోపాటు మహిళ భద్రత విభాగం, సైబర్ క్రైమ్ వింగ్స్లను ఆ‘షీ’సర్స్ నేతృత్వం వహిస్తున్నారు.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్ -
కృష్ణుడిగా సత్యభామ
‘ఒక మహిళ పురుషుడి పాత్రలో మెప్పించడం చాలా కష్టం’ అంటారు సురభి కళాకారిణి 60 ఏళ్ల పద్మజా వర్మ. ఇప్పటి వరకు కృష్ణుడి పాత్రలో వేదికలపైన 3000కు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన పద్మజా వర్మ సత్యభామగానూ మెప్పించారు. ప్రత్యేక పురస్కారాలనూ అందుకున్నారు. నేడు నరకచతుర్దశి సందర్భంగా కృష్ణుడి పాత్రలో జీవించిన పద్మజా వర్మ సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న విశేషాలు ...సురభి పద్మజ వర్మకు దాదాపు 60 ఏళ్ల నాటక రంగ అనుభవం ఉంది. కృష్ణుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తూ, కుటుంబ పోషణలో భాగమయ్యింది. గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా, కోడలిగా కుటుంబ జీవనంలోని సర్దుబాట్లను, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న విధానాన్ని మన ముందుంచారు. మగవారి మధ్యలో ఒక్కదాన్నే మహిళను ‘‘మగవేషాలంటే చాలా ఠీవిగా నిలబడాలి. హుందాగా కనిపించాలి. కిరీటం పెట్టుకొని వేసే వేషం ఏదైనా కష్టమే. అందులోనూ మహిళ పురుషుడి వేషం వేయడం పెద్ద సవాల్. ఆ సమయంలో స్టేజీపైన చుట్టూతా మగవారే. కృష్ణుడి వేషంలో నేనొక్కదాన్నే మహిళను. నటనలో ఎటువంటి జంకు కనిపించకూడదు. గొంతులో తత్తరపాటు ఉండకూడదు. కిరీటం పక్కకు జరగకూడదు, ఫ్లూట్ పట్టుకోవడంలో నేర్పు ఉండాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రెండున్నర గంటల పాటు సీనును రక్తికట్టించాలి. అదో పెద్ద టాస్క్.బాల్యం నుంచీ... మూడు నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే మా అమ్మానాన్నలు నన్ను వేదికమీదకు తీసుకెళ్లారు. శ్రీకృష్ణ లీలల్లో భాగంగా బాల కృష్ణుడి పాత్రలను ప్రదర్శించాను. మాకు చదువు అయినా, నటన అయినా కళారంగమే. పన్నెండేళ్ల తర్వాత మాయాబజార్లో శశిరేఖగా వేషాలు వేశాను. శశిరేఖగా ప్రదర్శనలో పాల్గొన్నప్పడు నా పాత్ర పూర్తయ్యాక ఒక వైపు కూర్చొని ఆ నాటక ప్రదర్శన మొత్తం చూసేదాన్ని. శశిరేఖ పాత్ర టీనేజ్ వరకే. ఆ వయసు దాటితే ఆ పాత్ర మరొకరికి ఇచ్చేస్తారు. నాకూ కొంత వయసు వచ్చాక శశిరేఖ బదులు రుక్మిణి, సత్యభామ.. ఇలా మహిళా ప్రాధాన్యత గల వేషాలే ఇచ్చారు.సత్యభామ.. మీరజాలగలరా..!కృష్ణుడి పాత్రకు దీటుగా ఉండేది సత్యభామ పాత్రే. సత్యభామ గా నటించేటప్పుడు ఆ పాత్రకు ఉన్న హావభావాలన్నీ ముఖంలో పలికించాలి. ‘మీర జాల గలడా నా యానతి... ’ అనే పాటలో నవరసాలు ఒలికించాలి. స్త్రీ పాత్రల్లోనూ మెప్పిస్తూ .. ఒక్కో దశ దాటుతున్న కొద్దీ మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మారిపోతుండటం గమనించాను.సందేహాలను జయిస్తూ... కృష్ణుడిగా మెప్పిస్తూ!ఇలాగే ఉంటే కళారంగంలో నా ప్రాధాన్యత ఏముంటుంది అని నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. ‘పురుష పాత్రలు అయితేనే మార్పు లేకుండా ఎప్పటికీ వేయచ్చు, ఎలాగా...’ అని ఆలోచించేదాన్ని. పెళ్లయ్యాక మా మామగారి సొంత నాటక కంపెనీలోనే రకరకాల మహిళా ప్రాధాన్యమున్న పాత్రలు వేశాను. ఒకరోజు కృష్ణ వేషధారి ఆరోగ్యం బాగోలేక రాలేదు. ప్రదర్శన ఉంది. ఎలా అని ఆందోళన పడుతున్న సమయంలో ‘నేను కృష్ణుడిగా వేస్తాను’ అని మా మామగారికి ధైర్యం చెప్పాను. అలా మాయాబజార్లో కృష్ణుడిగా నటించాను. అయితే, పురుషుడిలా డ్రెస్ అవ్వడం.. మామూలు విషయం కాదని ఆ రోజే తెలిసింది. కంస వధ నాటకంలో మాత్రం కొంత టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, కంస పాత్రధారి మా మామగారే. కంసుని వధించేటప్పుడు బాహాబాహి తలపడటం, గుండెల మీద కొట్టడం.. వంటివి ఉంటాయి. కానీ, నటనలో రిలేషన్ కాదు ప్రతిభనే చూపాలనుకున్నాను. అక్కణ్ణుంచి ఇక నేనే కృష్ణుడిని. అలా నేటివరకు 3000కు పైగా కృష్ణుడి పాత్రలు వేసిన ఘనత నాకు దక్కింది. నాటకాన్ని చూసిన ప్రేక్షకులు స్వయంగా కలిసి, వారి అభిమానాన్ని తెలుపుతూ ఉంటారు. సాధారణ చీరలో నన్ను చూసినవారు ‘మీరేనా కృష్ణుడు’ అని ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే, అలంకరణలో వేదికపైన కృష్ణుడిలా మరో కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉంటుంది. అప్పట్లో భయపడి కృష్ణుడి పాత్రను వదిలేసి ఉంటే.. నాటకరంగంలో నా ప్రత్యేకత అంటూ ఏమీ ఉండేది కాదు. నాకు ఈ యేడాది 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల మా పిల్లలిద్దరూ జీవితాల్లో బాగానే స్థిరపడ్డారు. ఇక నాకు బాధ్యతలేం లేవు కాబట్టి నా చివరిశ్వాస వరకు కృష్ణుడిలా నాటకరంగంలో మెప్పిస్తూనే ఉంటాను’’ అని వివరించారు కృష్ణ పాత్ర ధారి పద్మజావర్మ.– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చెడును నరికేసి... మంచిని వెలిగించి!
ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని, ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతడి పేరు మీద పండగ చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందుకంతగా సంతోషప్రదమయిందంటే.... నరకుడు అజ్ఞానానికి, పీడనకు, హింసకు ప్రతీక. నరకం అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. ఆ చెడు తన కుమారునిలో ఉందన్న కారణంగానే అతడి సంహారానికి కారణమయింది తల్లి సత్యభామ. తనలా మరే తల్లీ ఎవరి గర్భశోకానికీ కారణం కాకూడదన్న కోరికతో తన కుమారుడి పేరు శాశ్వతంగా నిలిచి పోయేలా వరం కోరుకుంది. అందుకే శ్రీకృష్ణుడు అతడి పేరు మీదుగానే భవిష్యతులో అందరూ ‘నరక చతుర్దశి’ జరుపుకుంటారని వరమిచ్చాడు.హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వల్ల భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలో పడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. ఎందుకంటే స్వయానా తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను చేసిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. నరకుడు విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు.దేవమాత అదితి కుండలాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీ కృష్ణుడు ఇతనిని ద్వంద్వ యుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు. మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూవారనే విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం వాడికో వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగలేదు. చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ రాక్షసాధముని దురంతం పరాకాష్టనందుకుంది. ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీ కృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపుబాణానికి శ్రీ కృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి నరకుణ్ణి నిలువరించింది. ఆ తర్వాత కృష్ణుడు తేరుకుని సుదర్శన చక్రం ప్రయోగించి అతడిని సంహరించాడు. అలా ఆశ్వీయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసురుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి వల్లనే సంభవించింది.తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు శ్రీ కృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారు వేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధర్మం సుప్రతిష్టమైంది.ఈ రోజు ఏం చేయాలి?ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణ చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభిముఖంగా ‘యమాయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం. యముని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం.నరక చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారు చేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పెద్దలు నమ్ముతారు. నరకచతుర్దశి మరునాడే దీపావళి. రావణుడు... మా ఊరి అల్లుడు!దీపావళి అంటేనే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అయితే రాజస్థాన్లోని జోద్పూర్కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండోల్లో దీపావళి రోజు దీపాలు వెలిగించడం, బాణసంచ కాల్చడం ఉండదు. నిశ్శబ్దాన్ని పాటిస్తారు. కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే స్థానిక పురాణం తెలుసుకోవాల్సిందే. దీని ప్రకారం... రావణుడి భార్య మండోదరి జన్మస్థలం మండేరే. రావణుడు మండోదరిని ఈ గ్రామంలోనే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. మండేరేకి చెందిన మౌద్గిల్ బ్రాహ్మణులు తమను తాము మండోదరి కుటుంబ వారసులుగా భావిస్తారు. అందువల్ల వారు రావణుడిని రాక్షస రాజుగా కాకుండా గౌరవనీయమైన బంధువుగా చూస్తారు!చీకటి దీపావళి!దీపావళి వేడుకల తర్వాత హిమాచల్ప్రదేశ్లో బుద్ది దీపావళి(చీకటి దీపావళి లేదా పాత దీపావళి) జరుపుకుంటారు. దీపావళి తర్వాత మొదటి అమావాస్య రోజు బుద్ది దీపావళి వేడుకలు మొదలవుతాయి. రాముడి రాక వార్త ఒక నెల తర్వాత మాత్రమే హిమాచల్ప్రదేశ్కు చేరిందట. అందుకే ఆలస్యంగా పండగ జరుపుకునే సంప్రదాయం మొదలైంది అంటారు.దేవరి రాత్రిఛత్తీస్ఘడ్లోని గోండు తెగలు దీపావళిని ‘దేవరి’గా జరుపుకుంటాయి. దేవరి రాత్రి గ్రామంలోని మహిళలు తలలపై ఒక కుండలో నూనె దీపాన్ని వెలిగించి శ్రావ్యంగా పాటలు పాడుతూ, ప్రతి ఇంటి తలుపు తడుతూ తమతో చేరాలని ఆ ఇంటి మహిళలను అభ్యర్థిస్తారు. బియ్యపు పిండితో చేసిన దీపాలను ప్రతి ఇంటి ముందు ఉంచుతారు.ఆవులను తమపై నడిపించి...మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని బిదావాద్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. దీపావళి రోజు తరువాత నేలపై పడుకొని ఆవులను తమపై నడిపించుకుంటారు. 33 కోట్ల దేవుళ్లు, దేవతలు ఆవులో కొలువై ఉన్నారని, వాటిని తమపై నడిపించుకోవడం ద్వారా దేవతల ఆశీర్వాదం దొరుకుతుందనేది భక్తుల నమ్మకం.భర్త కోసం రాత్రంతా దీపాలు...మహారాష్ట్రలో దీపావళి వేడుకలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రచారంలో ఉంది. వివాహం జరిగిన నాలుగు రోజుల తరువాత చనిపోతాడని యువ రాజుకు శాపం. విషయం తెలిసిన వధువు తన భర్త ప్రాణాలు రక్షించుకోవడం కోసం రాత్రంతా అవిశ్రాంతంగా దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది. ఆమె ప్రయత్నాల వల్ల భర్త బతుకుతాడు.శ్రీవిష్ణువు భూలోకానికి...గుజరాత్లో దీపావళి రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనేది తరతరాలుగా వస్తోంది. మహాలక్ష్మీదేవి భర్త విష్ణువు భూలోకానికి వచ్చిన గుర్తుగా మధ్యప్రదేశ్లో దీపావళి జరుపుకుంటారు. కోల్కత్తాలో దీపావళికి కాళీపూజ చేస్తారు.సోదర, సోదరీమణులు...మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో దీపావళి అనేది సోదర, సోదరీమణుల అనుబంధానికి ముడి పడి ఉన్న పండగగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత రోజు జరుపుకునే ఈ పండగను ‘యమ–ద్విత్య’ అని పిలుస్తారు. యమున తన సోదరుడు, మృత్యుదేవుడు యముడికి ఆతిథ్యం ఇచ్చిన రోజు ఇదే అని పురాణ కథలు చెబుతాయి.లక్ష దీపాల ఆగ్రా కోటఅక్బర్ చక్రవర్తి పాలనలో దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. ఈ సంప్రదాయాన్ని ‘జష్నే చిరాఘన్’ అని పిలిచేవారు. లక్షలాది దీపాలతో ఆగ్రా కోట వెలిగిపోయేది. కోట ముందు ఉన్న మైదానంలో బాణసంచా కాల్చేవారు. – డి.వి.ఆర్. -
గ్రీన్ క్రాకర్స్ పేరుతో మోసాలు, నకిలీవి గుర్తించాలంటే ఎలా?
వెలుగుల పండుగ అయిన దీపావళికి నగరం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే నగరంలో బాణాసంచా హడావుడి మొదలైంది. పలువురు పిల్లలు, పెద్దలు ఇప్పటికే టపాసులు కాల్చుతూ సందడి చేస్తున్నారు. అయితే అక్టోబర్ 20న దేశవ్యాప్తంగా దీపావళిని జరుపుకునేందుకు ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే నగరంలో పలు చోట్ల బాణాసంచా దుకాణాలు ఏర్పాటయ్యాయి. అయితే పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన కారణంగా ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మరోవైపు నకిలీ గ్రీన్ క్రాకర్స్ మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వీటిపై ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని పలువురు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. – సాక్షి,సిటీబ్యూరో గ్రీన్ క్రాకర్స్ పేరుతో మోసాలు.. పర్యావరణ వేత్తలు పిలుపు మేరకు కొంత మంది ప్రజలు గ్రీన్ క్రాకర్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది వ్యాపారులు గ్రీన్ క్రాకర్స్ పేరుతో నకలీ టపాలు విక్రయిస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్ పేరుతో సాధారణ క్రాకర్స్ అమ్మేస్తున్నారు. తేడా తెలియనివారు అధిక ధరలకు కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఎన్ని రకాలు? గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలు. స్వాస్, సఫల్, స్టార్. స్వాస్ క్రాకర్స్ దుమ్మును పీల్చుకుని సన్నని నీటి బిందువులను విడుదల చేస్తుంది. సఫల్ క్రాకర్స్లో సురక్షితమైన మోతాదులో అల్యూమినియం ఉంటుంది. ఇది శబ్దాన్ని తగ్గిస్తుంది. స్టార్ క్రాకర్స్లో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఉండదు. తక్కువ పొగను విడుదల చేస్తుంది. ఎలా గుర్తించాలి? అసలు గ్రీన్ క్రాకర్స్ని ఎలా గుర్తించాలి.. గ్రీన్ క్రాకర్స్, సాధారణ క్రాకర్స్ మధ్య తేడా ఏంటి? అనే సందేహం తలెత్తక మానదు. ఇవి సాధారణ క్రాకర్స్ కంటే తక్కువ పొగను, శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటిని నేషనల్ ఎన్విరాన్Œమెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఐఎస్ఆర్–ఎన్ఈఈఆర్ఐ) కనిపెట్టింది. గ్రీన్ క్రాకర్స్ 110–125 డెసిబల్స్ శబ్దాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. సాధారణ క్రాకర్స్ 160 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రతి బాణాసంచా బాక్స్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీని ఆధారంగా నకిలీనా.. నిజమైనదా గుర్తించవచ్చు. ఎన్ఈఈఆర్ఐ యాప్ని ఉపయోగించి.. ఈ కోడ్ను స్కాన్ చేయాలి. దీంతో ఆ క్రాకర్స్ ఒరిజినలా.. నకిలీవా అని తేలిపోతుంది. -
పండగవేళ దివ్యమైన కానుకలు : టాప్ ఐడియాలివిగో!
దీపావళి అంటే ఒక ఆసక్తి. ఒక అభిమానం. అంతకు మించి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ఎంతో సరదా. ఆ సరదాల పండగ అతి సమీపంలోకి వచ్చేసింది. ఇంకేం... మెరిసే లైట్లు, రంగురంగుల దీపాలు, రుచికరమైన స్వీట్లు, వివిధ రకాల చాక్లెట్లు, టన్నుల కొద్దీ బహుమతులకు ఒక్కసారిగా కాళ్లొచ్చేశాయి. సాధారణంగా దీపావళికి కుటుంబ సభ్యులు ఒకరికొకరు కానుకలు ఇచ్చుకుంటూ ఉంటారు. తమ వద్ద పని చేసే వారికి యజమానులు స్వీట్లతోపాటు కానుకలూ ఇస్తుంటారు. రెగ్యులర్ ఖాతాదారులకు దుకాణాల వారు కాంప్లిమెంటరీ కానుకలు ఇస్తారు. ఈ సంతోష సమయంలో ఎప్పుడూ ఇచ్చే స్వీట్లు, డ్రై ప్రూట్స్ కన్నా కాస్త విభిన్నమైన బహుమతి ఇస్తే బాగుంటుంది కదా... మీకేదైనా ఆలోచన వస్తే సరే.. లేదంటే మేం చెబుతున్న విధంగా బహుమతులు ఇస్తే ఎలా ఉంటుందో కాస్త ఆలోచించండి. సన్నిహితులకు, మిత్రులకు, ప్రియమైన వారికి మీ శైలిలో ప్రత్యేకమైన దీపావళి కానుకలు ఇచ్చి వారి ముఖాలలో మతాబాల వెలుగులు చూసి మురిసిపోవాలనుకుంటున్నారా? ఇవి ప్రయత్నించండి మరి! మీరు ఎంచుకునే దీపావళి బహుమతులకు సాంప్రదాయక స్పర్శను తిరిగి తీసుకురండి. లాంతరు సాంప్రదాయమైనది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పండుగ సీజన్లో, మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు వేలాడే లాంతరును బహుమతిగా ఇవ్వండి. మీరు దానిని కొన్ని స్వీట్లు లేదా డ్రై ఫ్రూట్స్తో జత చేస్తే మీ ప్రియమైన వారిని ఆకట్టుకోవడానికి ఇది బడ్జెట్లో ఉత్తమమైన దీపావళి బహుమతి అవుతుంది. దేవుని ప్రతిమలుసంప్రదాయం ప్రకారం, దీపావళి పండుగ లక్ష్మీదేవి, గణేశ విగ్రహ పూజతో ప్రారంభమవుతుంది. మీరు మీ సన్నిహితులకు పవిత్రమైన, సంప్రదాయకరమైన బహుమతి ఇవ్వాలని చూస్తున్నట్లయితే అందంగా ప్యాక్ చేసిన దేవుని విగ్రహాలు, డాలర్లు, ప్రతిమలను ప్రయత్నించవచ్చు. మీ చేతితో మీరే స్వయంగా... మంచి మనసున్న మీకు ప్రియమైన వారు కానిదెవరు? అందరికీ బహుమతులు కొనడం మీ జేబులకు భారంగా అనిపించవచ్చు. కాబట్టి, మీరే తయారు చేసుకోగలిగినప్పుడు దాని గురించి ఎందుకు చింతించాలి? అవును, మీ ప్రియమైనవారిపై శాశ్వత ముద్ర వేయడానికి చేతితో తయారు చేసిన బహుమతులు ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపిక. మీరు ప్రియుడు, స్నేహితురాలు, భర్త లేదా ప్రత్యేకమైన వాటి కోసం నిజమైన, హృదయాన్ని హత్తుకునే దీపావళి బహుమతి కోసం చూస్తున్నట్లయితే, మీరు చేతితో తయారు చేసిన పర్యావరణ అనుకూల దీపావళి బహుమతులైన దియాలు, టీలైట్ కొవ్వొత్తులు మొదలైన వాటిని లెక్కలోకి తీసుకోవచ్చు.చదవండి: ఫ్రెంచ్ సూపర్ బ్రాండ్ తొలి స్టోర్ : ఎవరీ బ్యూటీ విత్ బ్రెయిన్బహుమతి వోచర్లువారి అభిరుచి, ప్రాధాన్యతల ప్రకారం బహుమతిని ఎంచుకోవడం ఎల్లప్పుడూ కఠినమైనదే. ఏమి బహుమతిగా ఇవ్వాలో సందేహం ఉన్నప్పుడు, గిఫ్ట్ వోచర్ల కోసం వెళ్ళండి. మీ ప్రియమైన వారిని ప్రత్యేకంగా భావించేలా చేయడానికి ఉత్తమమైన, ఉపయోగకరమైన దీపావళి బహుమతులలో ఇది ఒకటి.ఇదీ చదవండి: దివాలీకి స్వీట్లు లేకపోతే ఎలా? ఈజీగా ఇలా చేసేయ్యండి!టీలైట్ కొవ్వొత్తులుదీపావళి అంటే దివ్వెలే కదా...దివ్వెలు, కొవ్వొత్తులు కాకుండా ఉత్తమ బహుమతి ఏమిటి? మార్కెట్లో వివిధ డిజైన్లు, ఆకారాలలో అనేక టీలైట్ కొవ్వొత్తులను అందించే అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. టీలైట్ కొవ్వొత్తులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మీ ప్రియమైనవారి జీవితంలో ఆశల వెలుగును నింపచ్చు.దీపావళి పూజా థాలీమీ సన్నిహిత కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దీ΄ావళి పండుగను మరింత పవిత్రంగా, దివ్యంగా చేయండి మీ ప్రేమకు చిహ్నంగా వారికి వెండి లేదా బంగారు పూత పూసిన పూజా థాలీని బహుమతిగా ఇవ్వండి. చక్కగా అలంకరించబడిన థాలీ వేడుకకు ఉత్సాహాన్ని ఇస్తుంది.కార్పొరేట్ బహుమతులుమీ ఉద్యోగులు, సహోద్యోగులు, క్లయింట్ల కృషికి వారికిచ్చే కానుకలతోపాటు ఒక మంచి ప్రశంస, వారి మనోధైర్యాన్ని పెంచడానికి, కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరచడానికీ సహాయపడుతుంది. వెండి లేదా బంగారు నాణేలు దీపావళి సమయంలో వెండి, బంగారం వంటి విలువైన లోహాలను శుభప్రదంగా భావిస్తారు. ధంతేరస్ రోజున, లోహంతో తయారు చేసిన వస్తువును కొనడం శ్రేయస్సు, అదృష్టానికి సంపదకు సంకేతంగా భావిస్తారు. దీపావళి, ధన్తేరస్ రెండింటిలోనూ మీరు ఉపయోగించగల ఉత్తమ దీపాళి బహుమతి ఆలోచనలలో ఇది ఒకటి.వివిధ రకాల చాక్లెట్లుఈ దీపావళికి, మీ ప్రియమైన వారికి వివిధ రకాల చాక్లెట్ల ప్యాక్ పంపడం ద్వారా వారి నోరు తీపి చేయండి. చాక్లెట్లు ఎవరినీ ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కావు. కాబట్టి, బహుమతిగా చాక్లెట్లను అందమైన రేపర్తో చుట్టి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయండి.సుమగంధంసహజసిద్ధమైన పూలతో తయారు చేసిన సెంటు, స్ప్రే లేదా అగరుబత్తుల ΄్యాకెట్లను కూడా బహూకరిస్తే ఆ సుమగంధంలాగే మీ స్నేహ బంధమూ పరిమళిస్తుంది. -
దివాలీకి స్వీట్లు లేకపోతే ఎలా? ఈజీగా ఇలా చేసేయ్యండి!
ముచ్చటగా అలంకరించిన లోగిళ్లు అందంగా ముస్తాబైన చిన్నా పెద్దలుఓ వైపు దీప కాంతులు మరోవైపు బాణాసంచా పేలుళ్లు ఆనందాలు విప్పారుతుండగా తియ్యని రుచులు నోరారా ఆస్వాదిస్తుంటే వేడుకంతా నట్టింట్లో కొలువుదీరినట్టే ఉంటుంది. రెట్టింపు ఆనందాలను పంచడానికి వంటిల్లు తీపి వంటకాలను సిద్ధం చేస్తూనే ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా పండగవేళ తియ్యని రుచులను సులువుగా చేసేద్దాం. ఇంటిల్లి పాదికీ ఆనందాన్ని పంచేద్దాం..సూజీ హల్వా కావలసినవి: సూజీ (బొంబాయి రవ్వ) – కప్పు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – కప్పు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; జీడిపప్పు, కిస్మిస్ – అవసరమైనంత.తయారీ: పాన్లో నెయ్యి వేడి చేసి, జీడిపప్పు, ద్రాక్ష వేయించాలి. ∙వాటిని తీసి, అదే నెయ్యిలో సూజీ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ∙మరో పాత్రలో నీరు మరిగించి, రవ్వ పోస్తూ, కలపాలి. ∙రవ్వ ఉడికిన తర్వాత పంచదార కలిపి తర్వాత యాలకుల పొడి వేసి కలపాలి. ∙చివరగా వేయించిన కాజూ, ద్రాక్ష వేసి మిక్స్ చేయాలి.గులాబ్ జామూన్కావలసినవి: రెడీమేడ్ జామూన్ మిక్స్ – కప్పు; నీళ్లుపాలు – అవసరమైనంత (జామూన్ మిక్స్ కలపడానికి); పంచదార‡ – ఒకటిం΄ావు కప్పులు; నీళ్లు – కప్పు; యాలకుల పొడి – చిటికెడు.తయారీ: ∙పంచదార, నీళ్లు కలిపి, మరిగించి సిరప్ తయారు చేయాలి. దాంట్లో చిటికెడు యాలకుల పొడి కలపాలి ∙జామూన్ మిక్స్కి కొంచెం నీళ్లు లేదా పాలు జోడించి మృదువుగా కలపాలి ∙మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ, ఉండలు చేయాలి ∙బాణలిలో నూనె పోసి వేడయ్యాక, సిద్ధంగా ఉంచుకున్న ఉండలు వేసి, వాటిని గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి ∙వేయించిన జామూన్లను వేడి సిరప్లో వేసి, రెండు గంటలు నాననివ్వాలి.రైస్ పుడ్డింగ్ / పాయసంకావలసినవి: బియ్యం – పావు కప్పు; పాలు – 3 కప్పులు; పంచదార – పావు కప్పు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; యాలకులు, కిస్మిస్ – అవసరమైనంత; నెయ్యి – టేబుల్ స్పూన్.తయారీ : బియ్యం కడిగి, కొద్దిగా ఉడికాక పాలు పోసి, మెల్లిగా మరిగించాలి. బియ్యం పూర్తిగా ఉడికాక పంచదార కలపాలి. యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపాలి.బేసిన్ లడ్డూ కావలసినవి: బేసన్ (సెనగపిండి) – కప్పు; నెయ్యి – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; యాలకుల పొడి – పావు టీ స్పూన్.తయారీ: ప్యాన్ నెయ్యి వేసి, వేడి చేయాలి. మంట బాగా తగ్గించి, దాంట్లో శనగపిండి వేసి, మెల్లగా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. చల్లారిన తర్వాత పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ, చేతులతో లడ్డూలు చేయాలి. -
ధన త్రయోదశి ఆరోగ్యమస్తు ధన ప్రాప్తిరస్తు.. ప్రాశస్త్యం ఇదీ!
నేడు ధనత్రయోదశి. సాధారణంగా ధన త్రయోదశి అనగానే బంగారం, వెండి, ఇతర గృహోపకరణాలు కొనడం అందరూ చేసేదే. అయితే ధనత్రయోదశి ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఆ కథ తెలుసుకుందాం. దేవతలు, దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్న సమయంలో ఆ క్షీరసాగరం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతే కాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. శ్రీమహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం. అందుకే, ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని.. ‘ధన త్రయోదశి’ అన్నారు.ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేక΄ోతే జీవితం గడపడం కష్టం. అందుకే.. సర్వ సంపత్ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీస్సులు అందుకుంటారు. ధనానికి అధిదేవత ‘శ్రీమహాలక్ష్మి. ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు’. అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో΄ాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఈ లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోష వేళలో చేసుకుంటే చాలా మంచిది.లక్ష్మీ కుబేర వ్రతంఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, వ్యాపార అభివృద్ధి అదే విధంగా నూతన వ్యాపారం ప్రారంభించబోయే వారు, ఉద్యోగ అభివృద్ధి కోరుకుంటున్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఆయా బాధల నుంచి విముక్తి పొంది, అన్నింటా అభివృద్ధి జరుగుతుందని పెద్దలు చెబుతారు కాబట్టి ఈ వ్రతాన్ని చేయాలనుకుంటున్న వారు అక్షయ తృతీయ రోజు, ధన త్రయోదశి రోజు, కార్తీక శుక్ల పంచమి రోజు లేదా తొమ్మిది గురువారాలు లేక శుక్రవారాలు చేసుకోవచ్చు. చదవండి : Diwali 2025 : ఈవస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం ధన్వంతరి జయంతిదేవవైద్యుడు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అంశావతారమైన ధన్వంతరి పాలసముద్రం నుంచి ఆవిర్భవించింది కూడా ధనత్రయోదశి నాడే. అందుకే ఈ పర్వదినాన చాలామంది ధన్వంతరిని కూడా పూజిస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగలేనివారు, ఆయుర్వేద వైద్య విధానం మీద నమ్మకం ఉన్న వారు శ్రీమహావిష్ణువు ప్రతిరూపమైన ధన్వంతరిని పూజించడం వల్ల ఆరోగ్యవంతు లవుతారని చెబుతారు. ధన్వంతరి చేతిలో శంఖు చక్రాలతోపాటు ఔషధ భాండం లేదా అమృత కలశం, జలగ ఉంటాయి. జలగ శరీరంలో చేరిన చెడు రక్తాన్ని పీల్చివేసి ఆరోగ్యాన్నిస్తుందని ప్రతీతి. అందుకే ధన్వంతరి చేతిలో జలూకం అంటే జలగ ఉంటుంది. నేడు శని త్రయోదశి కూడా. ధనత్రయోదశి నాడే శని త్రయోదశి కూడా రావడం చాలా విశేషం. అందువల్ల ఈ వేళపాత వస్తువులు, పాత ఆలోచనలు, పాతదనాన్ని వదిలించుకుని, కొత్త వస్తువులు కొనుగోలు చేయటం, కొత్త ఆలోచనలు చేయటం, కొత్త పనులకు శ్రీకారం చుట్టడం చాలా మంచిది.ఇదీ చదవండి: వెయిట్ లాస్లో ఈ మూడింటిని నమ్మకండి : రణబీర్ ఫిట్నెస్ కోచ్ వార్నింగ్పితృదేవతాపూజకు కూడా ధనత్రయోదశి చాలా ప్రశస్తమైనది. ధనత్రయోదశి నాడు ఇంటిలో దీపాలు వెలిగించి, మన పెద్దవారిని తలచుకోవడం వల్ల వారి ఆశీర్వాదంతో శుభం చేకూరుతుందని పండితులు చెబుతారు. ఈ శుభవేళ అందరికీ కీడు తొలగి మేలు చేకూరాలని కాంక్షిద్దాం.– డీవీఆర్ -
దీపావళి సెలవులు.. కూకట్పల్లి కిటకిట (ఫొటోలు)
-
స్టాక్ మార్కెట్ వరుస సెలవులు.. సోమవారం ట్రేడింగ్ ఉంటుందా?
దేశీయ స్టాక్మార్కెట్కు వచ్చే వారం వరుసగా వరుస సెలవులు ఉన్నాయి. దీపావళి పండుగ కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) రెండు రోజులు మూతపడనున్నాయి. అయితే వచ్చే సోమవారం అంటే అక్టోబర్ 20న మార్కెట్ ట్రేడింగ్ ఉంటుందా.. లేదా? అన్న సందేహం ఇన్వెస్టర్లలో ఉంది. ఏయే రోజుల్లో స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సెలవు ఉంటుందో ఇప్పుడు చూద్దాం..ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన స్టాక్ మార్కెట్ హాలిడే (Stock Market Holidays) క్యాలెండర్ ప్రకారం.. దీపావళి (Diwali 2025) లక్ష్మి పూజ, బలిప్రతిపదా కారణంగా అక్టోబర్ 21, 22 తేదీలలో సెలవు ఉంటుంది. ఆయాల రోజుల్లో సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు.అక్టోబర్ 20న అమావాస్య తిథి రావడంతో ఈ రోజున పలు రాష్ట్రాల్లో దీపావళి పండుగను జరుపుకోనున్నారు. కానీ భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తెరిచే ఉంటాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అక్టోబర్ 21న వ్యాపారులు, ఇన్వెస్టర్ల కోసం 'ముహూర్త్ ట్రేడింగ్' పేరుతో ఒక గంట ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 2:45 గంటల వరకు ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ జరగనుంది.2025లో రాబోయే స్టాక్ మార్కెట్ సెలవులు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన మార్కెట్ హాలిడే క్యాలెండర్ లో 2025లో మొత్తం 14 ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇంకా మిగిలిన సెలవులు కింది విధంగా ఉన్నాయి..అక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజ అక్టోబరు 22 - బలిప్రతిపాద నవంబర్ 5 - ప్రకాష్ గురుపుర్బ్ శ్రీ గురునానక్ దేవ్ డిసెంబర్ 25 - క్రిస్మస్ -
దీపావళి ఇన్సూరెన్స్ రూ.5 లకే..
దీపావళి (Diwali 2025) అంటే ఆనందాల వేడుక. కానీ విషాదానికీ అవకాశం ఉన్న పండుగ. ఏటా దీపావళికి దేశవ్యాప్తంగా ఆసుపత్రులు బాణసంచా కారణమైన ప్రమాదాలతో అధిక భారం ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కాలిన గాయాలు, కంటి గాయాలు, మంటలు మొదలైనవి.2024లో ఒక్క ఢిల్లీలోనే అగ్నిమాపక కాల్స్ 53 శాతం పెరిగాయి. బెంగళూరు, లక్నో, చండీగఢ్ లాంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. చాలా కేసుల్లో పిల్లలు, బాణాసంచా కాల్చడం చూస్తున్నవారికి కూడా ప్రమాదాలు సంభవించాయి.దీన్ని దృష్టిలో ఉంచుకొని, ‘కవర్ ష్యూర్’ (CoverSure) అనే ఇన్సూర్టెక్ సంస్థ కేవలం రూ.5కే ఫైర్క్రాకర్ ఇన్సూరెన్ (Firecracker Insurance ) ప్లాన్ను ప్రారంభించింది. బాణసంచా సంబంధిత ప్రమాదాల నుంచి రక్షణను అందించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు.ప్లాన్ ముఖ్యాంశాలు* అకాల మరణానికి కవరేజీ: రూ.50,000 వరకు* కాలిన గాయాలకు కవరేజీ: రూ.10,000 వరకు* 10 రోజుల పరిమిత కాల కవరేజీ (కొనుగోలు చేసిన తర్వాతి రోజు నుంచి)* డిజిటల్ యాక్టివేషన్– ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా, వెంటనే యాక్టివ్* కవర్ ష్యూర్ యాప్/వెబ్సైట్ ద్వారా తక్షణ కొనుగోలుఎందుకు అవసరమంటే..భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,000కి పైగా దీపావళి ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఈ సందర్భాల్లో చికిత్స ఖర్చు రూ.25,000 నుంచి రూ.1 లక్ష వరకు ఉంటోంది. చాలా మందికి సాంప్రదాయ ఆరోగ్య బీమా లేదు. దీంతో చిన్న ప్రమాదాలూ ఆర్థికంగా పెద్ద భారం కావచ్చుఈ ప్లాన్ ప్రామాణిక ఆరోగ్య/టర్మ్ పాలసీలను భర్తీ చేయదగినది కాదు కానీ వాటితో పాటు ముఖ్యంగా పండుగల కాలంలో అదనపు రక్షణగా పనిచేస్తుంది. బీమా తీసుకోండి.. దీపావళిని శుభంగా, సురక్షితంగా జరుపుకోండి.ఇదీ చదవండి: ఎల్ఐసీ కొత్త పాలసీలు.. జీఎస్టీ తగ్గాక వచ్చిన ప్లాన్లు ఇవే.. -
ఈ దీపావళి స్వీట్స్ కిలో ఏకంగా రూ. 1.1 లక్షలు? ఎందుకింత ఖరీదంటే..
దీపావళి పండుగంటే టపాసులు ఖర్చు కాదు.. ఈ వెరైటీ స్వీట్స్ కూడా అంతే ఖరీదు. నిజానికి లక్ష్మీ దేవి పండుగ అయినా ఈ దీపావళి రోజున బంగారం, వెండి కొంటుంటారు కొందరు. కానీ ఆ బంగారాన్నే ఆస్వాదించేలా తయరు చేస్తోంది ఈ ప్రసిద్ధ స్వీట్స్ స్టాల్. వీటిని బంగారం, వెండిపూతతో ఆస్వాదించేలా తయారు చేస్తున్నారు. ఈ తియ్యటి మిఠాయిల ఖరీదు ఎంతో తెలిస్తే గుండెల్లో టపాసులు పేలినంతం పనవ్వుతుంది. వామ్మో..! ఇంత ఖరీదా అనిపిస్తుంది. మరి ఆ కథాకమీషు ఏంటో చూసేద్దామా..!.త్యోహార్ జైపూర్ స్వీట్స్ స్టాల్ ఈ ఖరీదైన స్వీట్లను అందిస్తుంది. ముఖ్యంగా ఈ దీపావళి పండుగ సీజన్లో ఈ స్వీట్స్ మహా ఫేమస్. బంగారు ఆభరణాలను ధరించడమే కాదు నోటిలో కరిగిపోయేలా కూడా ఆస్వాదించొచ్చు అనేలా అందిస్తోంది ఈ ప్రసిద్ధ స్వీట్ షాప్. అంజలి జైన్ అనే మహిళ ఈ వెరైటీ స్వీట్లకు శ్రీకారం చుట్టింది. ఈ గోల్డ్ స్వీట్స్ సిరీస్లో అత్యంత ఖరీదైన స్వీట్ స్వర్ణ ప్రసాదంగా పిలిచే మిఠాయి. దీని ధర కిలోగ్రాముకు రూ. 1,11,000 పలుకుతుంది. చదరపు ఆకారంలో ఉండే ఈ స్వీట్ తినాలంటే అంత ఖర్చు చేయక తప్పదు. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం, రాయల్టీని అందించే స్వీట్స్ ఇవి. ఆయుర్వేదంలో స్వర్ణ భస్మం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలది అని చెబుతుంటారు. ఆ నేపథ్యంలోనే ఇలా స్వీట్స్ తయారీలో లోహాలను వినియోగిస్తున్నట్లు చెబుతోంది ఈ స్వీట్స్ సృష్టికర్త అంజలి. వీటిని ప్యాక్ చేసే బాక్స్లు సైతం అత్యంత విలక్షణంగా బంగారుపెట్టెలను తలపించేలా ఉండటం విశేషం. ఎవరీమె అంటే..చార్టర్డ్ అకౌంటెంట్(CA)గా తన కెరీర్ను ప్రారంభించి.. అనుకోకుండా పాకశాస్త్రంలోకి అడుగుప్పెట్టి తన క్రియేటివిటీకి పదును పెట్టింది. అలా తన రుచికరమైన వంటకాలతో ప్రంపంచాన్ని జయించాలని మహమ్మారి సమయంలో ఈ రంగంలోకి అడుగు పెట్టింది. తన సీఏ నేపథ్యం ఈ స్వీట్స్ వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడిందని అంటోంది. ఇక తన ఉత్పత్తులన్నింటికి ప్రామాణికత ఉందని, సాధారణ వంటకాలకు తన సృజనాత్మకతను జోడించి విలక్షణంగా పరిచయం చేయడమే తన విజయ రహస్యమని చెబుతోంది. సంప్రదాయ వంటకాలకు ఆధునికతను జోడించి సక్సెస్ని అందుకున్నాని చెబుతోంది. ఈ స్వీట్స్లోని కొన్నింటి ఖరీదు..చాంది భస్మ్ భారత్ - ఒక్కో ముక్కకు రూ. 1,150స్వర్ణ్ భస్మ్ భారత్ - ఒక్కో ముక్కకు రూ. 1,950/ కిలోకు రూ. 85,00024 క్యారెట్ కాజు కట్లి - కిలోకు రూ. 3,50024 క్యారెట్ పిస్తా లోంజే - కిలోకు రూ. 7,00024 క్యారెట్ లడ్డూ - కిలోకు రూ. 2,500(చదవండి: ఆహా ఏమి రుచి..! నోరూరించే వివిధ రకాల వంటకాలు..) -
పండుగంతా నిండుగా..ఈ చీరకట్టులో మెరుద్దాం ఇలా..!
పండగలకు, సంప్రదాయ వేడుకలకూ నిండైన హుందాతనాన్ని తీసుకువచ్చేలా కట్టూ బొట్టు విషయంలో అతివలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ దీపావళి వేళ మరింత స్పెషల్గా కనిపించాలనుకునే వారికోసం బెంగాలీ చీరకట్టు ఆధునికతనూ అద్దుకొని కొంగొత్తగా మెరిసి΄ోతుంది. సెలబ్రిటీ లూ ముచ్చటపడే ఈ కట్టుకు వారు జోడించే హంగులు ఇవి... పండగలు, ఇతర సంప్రదాయ వేడుకలలో బెంగాలీ స్టైల్ చీర కట్టును దేశవ్యాప్తంగా మహిళలు ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఉత్తేజాన్ని కలిగించే ఎరుపు–తెలుపు కాంబినేషన్లో ఉండే ఈ చీర కట్టు, నుదుటన పెద్ద బిందీ, శంఖం ఆకృతిలో నెక్ డిజైన్, చీర పల్లూకున్న అందమైన డిజైన్.. ఇవన్నీ పండుగను మరింత ప్రత్యేకంగా చేస్తాయి. దుర్గాపూజల సమయాల్లో ఈ రంగు చీరలను బెంగాలీలు ప్రత్యేకంగా ధరిస్తారు. ఆ స్టైల్ కట్టును ఇప్పుడు లక్ష్మీ పూజలు, వివాహ వేడుకల సమయాల్లో ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ కట్టును మనం అనుసరించాలంటే మాత్రం ఈ సూచనలు తప్పక అవసరం.ఎంపికలో సరైన చీరపూజలు, నోములు, వ్రతాల సమయంలో ఎరుపు అంచుతో ఉన్న తెలుపు లేదా ఆఫ్–వైట్ బేస్ చీరను ఎంచుకోవాలి. అంచు ఉన్న కాటన్, పట్టు లేదా టస్సర్ చీరలు ఈ బెంగాలీ లుక్కు సరైనవి. వీటిలో మనవైన చేనేతలు కూడా ఉండవచ్చు. ఈ చీరకట్టు సౌకర్యంగా ఉండటమే కాకుండా పూజ, పండగల సమయాల్లో రోజంతా ధరించడం సులభం కూడా.కట్టుతో కట్టడిబెంగాలీ స్టైల్లో నిజమైన ఆకర్షణ దాని డ్రేపింగ్ శైలిలోనే ఉంటుంది. చీర కుచ్చిళ్ల నుంచి ఎడమ వైపుగా, పొడవాటి పల్లూను ఛాతీ మీదుగా భుజం వరకు తీసుకుంటూ వెళ్లాలి. పొడవాటి పల్లూ భాగాన్ని కుడి చేతి భుజం కిందుగా తీసి, పైకి అంచు భాగం కనిపించేలా బ్లౌజ్కు జత చేయాలి. పొడవుగా తీసుకున్న కొంగు భాగాన్ని కుడి చేత్తో ముందుకు తీసుకువచ్చి పట్టుకోవడం కూడా ఈ కట్టులో అందంగా కనిపిస్తుంది. భుజం మీదుగా తీసిన పల్లూని కొప్పుకు అటాచ్ చేసి, ఎడమ భుజం కిందుగా తీసుకురావచ్చు. ఈ కట్టు లలనల రూపాన్ని మరింత సంప్రదాయంగా మారుస్తుంది. డ్రేపింగ్ చేసేటప్పుడు, కుచ్చుల భాగం మడతలు లేకుండా సెట్ చేసి, పల్లూ చాలా తేలికగా ఉన్నట్టు చూసుకోవాలి.నగలపై ప్రత్యేక శ్రద్ధపెద్ద పెద్ద చెవి΄ోగులు, గాజులు, నెక్లెస్లు ఈ స్టైల్ చీరకట్టుకు రాయల్ టచ్ను జోడిస్తాయి. హెవీగా ఆభరణాలు అక్కర్లేదు అనుకుంటే పెద్ద చెవి΄ోగులు, గాజులు ఈ అలంకరణకు సరి΄ోతాయి.గుండ్రని వెడల్పాటి బిందీబెంగాలీ స్టైల్ డ్రేపింగ్ సంపూర్ణం కావాలంటే నుదుటన పెద్ద, గుండ్రని ఎరుపు బిందీ తప్పక ఉండాలి. ఇది పండుగల రోజుల్లో మొత్తం మేకప్ను పూర్తి చేస్తుంది. నుదుటిపై బిందీతో పాటు సిందూర్ చుక్కలను కూడా అదనంగా పెట్టడం వల్ల లుక్ మరింత మెరుగవుతుంది. ఈ లుక్కి ఎరుపు లేదా ముదురు గులాబీ రంగు బిందీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.హెయిర్ స్టైల్– మేకప్హెయిర్ స్టైల్ కోసం ఒక బన్ తయారు చేసి, దానిని మల్లె పువ్వులు లేదా ఎరుపు, తెలుపు పువ్వులతో అలంకరించవచ్చు. పువ్వులతో కాకున్నా హెయిర్ బన్కు హెయిర్ పిన్ జ్యువెలరీని జోడించడం ద్వారా అందాన్ని పెంచుకోవచ్చు. మేకప్ కోసం ఎరుపు లిప్స్టిక్, తేలికపాటి ఐ మేకప్ సరిపోతాయి. ధరించిన చీరకు మేకప్ సెట్ అవుతుందా అనేది సరి చూసుకుంటే చాలు. మెడలోనూ, చేతులకు ఎక్కువ నగల లేకుండా చూసుకుంటే చాలు. మీ రూపం ఆధునికతను అద్దుకున్న సంప్రదాయంతో కొంగొత్తగా మెరిసిపోతుంది. (చదవండి: బహుశా ఇదే చివరి దీపావళి పండుగ..! సమయం మించిపోతోంది.) -
అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?
పండుగలు, పబ్బాలు అనగానే ఇంటిని శుభ్రం చేసుకోవడం, అలంకరించుకోవడం మొదలు పూజలు, పిండివంటలు అబ్బో ప్రతీ ఇంట్లోనూ ఈ హడావిడి మామూలుగా ఉండదు. సామాన్యుల నుంచి కుబేరుల దాకా ఈ సందడి ఉంటుంది. ఇక వెలుగుల పండుగ దీపావళి అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. దీపావళి వేడుకలు, భారతదేశంలో అత్యంత ధనిక కుటుంబం అనగానే మొదటగా రిలయన్స్ అంబానీ ఫ్యామిలీ గుర్తొస్తుంది. మరి అంబానీ కుటుంబంలో వంటలు ఎవరు చేస్తారు? అసలు అక్కడ ఫుడ్ మెనూ ఎవరు ప్రిపేర్ చేస్తారు. వంటింట్లో ఎవరి ప్రాముఖ్యత ఎంత?ముంబైలోని అతి విలాసవంతమైన భవనం, ముఖేష్ అంబానీ ఉండే భవనం ‘యాంటిలియా’లో వందలాది మంది సిబ్బంది పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉంటారు. మరి అలాంటి ఇంట్లో వంటింటి పెత్తనం ఎవరిది అనేది ఇపుడు చర్చ. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ముఖేష్, నీతా దంపతులకు ముగ్గురు సంతానం, ఆకాష్,అనంత్, ఇషా. కూతురు పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్లింది. ఇక ఇద్దరు కొడుకులు, కోడళ్లతో నివసించే ఉమ్మడి కుటుంబం. అలాగే రిలయన్స్ ఫౌండర్ దివంగత ధీరూభాయ్ అంబానీ సతీమణి, ముఖేష్ తల్లి కూడా వీరితోపాటే ఉంటారు. చదవండి: Diwali 2025 : ఈవస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం!Radhika Merchant Vs Sloka Mehta ఈ ఉమ్మడి కుటుంబంలో కిచెన్ బాధ్యత ఎవరిదన్న కుతూహలం అందరిలో ఉంటుంది. పెద్ద కోడలు శ్లోక మెహతా, చిన్నకోడలు రాధికా మర్చంట్ మధ్య చాలా సఖ్యత ఉంటుందట. అంబానీ కుటుంబం శాఖాహారులు. తాజా వార్తల ప్రకారం పెద్ద కోడలు శ్లోక మెహతా రోజువారీ మెనూను నిర్ణయిస్తారు. శ్లోకకు కుటుంబ సంప్రదాయాలు ఆహార ప్రాధాన్యతలు బాగా తెలుసు. ఆమె వంట గదిని పర్యవేక్షిస్తుంది. కుటుంబం, అతిథులు, పండుగలు, విందు భోజనాలను ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. రాధిక మర్చంట్ ఇటీవల అంబానీ కుటుంబంలో చేరిన నేపథ్యంలో ఇంటి పద్ధతులను ఆచారాలను ఇపుడిపుడే అవగాహన చేసుకుంటోంది. సంప్రదాయాలను నేర్చుకుంటోంది. కుటుంబ కార్యక్రమాలతో పాటు వివిధ ప్రజా కార్యక్రమాల్లో కనిపిస్తూ ముద్దుల కోడలు అనిపించుకుంటోంది.(బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు )కాగా అంబానీలు ఆరోగ్యకరమైన, సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ముఖేష్ అంబానీ ఇంట్లో వండిన భోజనాన్ని ఇష్టపడే స్వచ్ఛమైన శాఖాహారి. క్షణాల్లో వంటకాలను తయారు చేసి, వేడిగా వడ్డించేందుకు చెఫ్లు రెడీగా అందుబాటులో ఉంటారు. దీనికితోడు అప్పుడప్పుడు హోటళ్ల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ముఖ్యంగా ఆదివారాల్లో ముంబైలోని 'మైసూర్ కేఫ్' నుంచి కూడా ఆర్డర్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్ -
దీపావళి వేళ, ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం!
దివ్యమైన దీపావళి పండగ సంబరాలను సమయం మరెంతో దూరంలో లేదు. ప్రతీ ఏడాది అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి కూడా ఒకటి. ధంతేరస్, నరక చతుర్ధశి (ఛోటీ దీపావళి), దీపావళి, యమ విదియతో దీపావళి పండుగ ముగుస్తుంది.దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని, గణపతి, కుబేరడిని విశేషంగా పూజించడం ఆనవాయితీ. దీనికి అనేక పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సత్యభామ సాయంతో శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించడం, 14 సంవత్సరాల వనవాసం నుండి రాముడు తిరిగి వచ్చిన వేళ దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటారని కూడా చెబుతారు.కొత్త బట్టలు, లక్ష్మీ, గణపతి: అయితే దీపావళి రోజు లక్ష్మీదేవితోపాటు,గణపతి ప్రతిమలను తెచ్చుకొని కొలిస్తే సిరిసంపదలకు లోటు ఉండదని నమ్మకం. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. కొత్త బట్టలు, దీప కాంతులతో పాటు దీపావళి పండుగ రోజు కొన్ని వస్తువులను తీసుకొని రావడం శుభప్రదంగా పరిగణిస్తారు. తద్వారా సంపద కలిగి శ్రేయస్సు లభిస్తుందని భావిస్తారు.ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులను కొనుగోలు చేయడం శుభప్రదమని, అంతా మంచే జరుగుతుందట.చదవండి: Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!తాబేలు: విష్ణుమూర్తికి ప్రతిరూపమైన తాబేలు ఇంట్లోకి తెచ్చుకుంటారు. ఆర్థికాభివృద్ధితోపాటు ఇంటిల్లిపాదికీ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని నమ్ముతారు.శ్రేయస్సుకు, సంపదకు సంకేతమైన కొబ్బరికాయను తెచ్చుకుంటారు. దీంతో స్వయంగా లక్ష్మీదేవి కొలువుదీరినట్టే అంటారు. ముందు రోజు తెచ్చుకున్న కొబ్బరికాయను, దీపావళి రోజున ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవికి నివేదిస్తారు. (Diwali 2025: పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే!)తులసి : ఇక తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. గాలిని శుభ్రం చేసే తులసి ఇంట్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీపావళి రోజున తులకి మొక్కను ఇంటి ముందు ప్రతిష్టించు భక్తితో పూజిస్తేఅంతా శుభం కలుగుతుంది అంటారు. దాన ధర్మాలు దీపావళి రోజు మనకు మనమే సంబరాలు చేసుకోవడం కాకుండా, పేదవారికి లేనివారికి దానాలు చేస్తే ఆరోగ్య వృద్ధి, ఆయు వృద్ధి కలుగుతుందని పెద్దలు చెబుతారు. నమ్ముతారు. కొత్తబట్టలు, ఆహార ధాన్యాలు, తెల్లని వస్త్రాలు, చీపురు, పంచదార, బెల్లం, బియ్యం దానం చేస్తే అంతాశుభాలు జరుగుతాయంటారు. నోట్ : ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు వారి వారి వ్యక్తిగత ఇష్టా ఇష్టాలమీద ఆధారపడి ఉంటాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం అందించినది మాత్రమే. -
దీపావళి ఈవెంట్లో సెలబ్రిటీలు.. ఇండస్ట్రీ అంతా ఒకేచోట (ఫొటోలు)
-
దీపావళి పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే!
దీపావళి అంటే దివ్యమైన పండుగ. వెలుగుల పండుగ. చీకట్లను పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించే జ్యోతికి మొక్కే పండగ. దీపావళి రోజు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రధానంగా ఆచారంగా పాటిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కష్టాలన్నీ తొలగిపోయి, నిత్యం తమ ఇంట లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుందని విశ్వసిస్తారు.మరి అంత విశిష్టమైన లక్ష్మీపూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీ పక్కనుండటమే అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి, భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు.ఋగ్వేదకాలంలో అదితి,రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం ‘సినీవాలి’ అనే దేవతను ‘విష్ణుపత్ని’గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు. లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదనిm, ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీదేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు.లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మమ్, దీపం సర్వతమోహరమ్, దీపేన సాధ్యతే సర్వమ్, సంధ్యా దీపం నమామ్యహమ్. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి , భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది. ఇక ఈ దీపావళి పర్వదినాన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేలా ఆచరించాల్సిన పూజా విధానం ఏంటంటే..లక్ష్మీ దేవిని వినాయకుడిని..దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి. ప్రాణ ప్రతిష్ఠ ‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే బెల్లం ముక్కను నివేదన చేస్తూ ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్ బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. కలశ స్థాపన వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి.‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతినర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాఃకలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య’ లక్ష్మీదేవిఅధాంగ పూజచంచలాయై నమః పాదౌ పూజయామిచపలాయై నమః జానునీ పూజయామిపీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామికమలవాసిన్యై నమః కటిం పూజయామిపద్మాలయాయై నమః నాభిం పూజయామిమదనమాత్రే నమః స్తనౌ పుజయామిలలితాయై నమః -భుజద్వయం పూజయామికంబ్కంఠ్యై నమః- కంఠం పూజయామిసుముఖాయై నమః- ముఖం పూజయామిశ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామిసునాసికాయై నమః నాసికం పూజయామిసునేత్రాయై నమః ణెత్రే పూజయామిరమాయై నమః కర్ణౌ పూజయామికమలాలయాయై నమః శిరః పూజయామిఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామిఈ కింది మంత్రాన్ని పఠిస్తూ దీపం వెలిగించాలిఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీంసూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకందీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవశ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి. లక్ష్మీ దేవికి తిలకాధారణ చేసి విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి, మొదలైనవి సమర్పణలు ఉంచాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్దోదక స్నానం చేయాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం మీ శక్తి కొద్ది స్తోత్రాలను చదివి, దీపం , దూపంలను సమర్పించిన అనంతరమే నైవైద్యం సమర్పించాలి. ఈ క్రింది మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి.యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదేపాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవత్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సలఅన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమతస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరిశ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.చివరిగా సాష్టాంగ నమస్కారంనమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి సంధ్యాసమయంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనె/కొబ్బరి నూనెతో దీపాలను ఇంటిముందర ఓ వరస క్రమంలో వెలిగించాలి. (Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!) -
ఈ ఏడాది దీపావళి అద్భుతమే : విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!
వినాయకచవితి, దసరా వేడుకల తరువాత చిన్నా పెద్దా అంతా ఏంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ దీపావళి (Diwali 2025). ఆశ్వీయుజ అమావాస్య నాడు వచ్చే, వెలుగు దివ్వెల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. ఈసారి గ్రహాల అద్భుతమైన కలయిక అని, చాలా ఏళ్ల తరువాత వచ్చే ఈ కలయికే ఈ దీపావళి ప్రత్యేకత అని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు.ఈ ప్రత్యేక సంయోగ సమయంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా ఫలవంతమైనదనీ, ఇంటిల్లి పాదికీ సుఖ సంతోషాలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ దీపావళి పూజకు శుభముహూర్తం, పూజ గురించి తెలుసుకుందాం.శుభముహూర్తం: అమావాస్య సోమవారం మధ్యాహ్నం 2:32 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం 4:26 గంటల వరకు ఉంటుంది. కాబట్టి, ఈ సంవత్సరం, దీపావళిని 20వ తేదీ సోమవారం జరుపుకుంటారు.లక్ష్మీదేవి, గణేశుని పూజించడానికి పవిత్రమైన సమయం మధ్యాహ్నం 2:39 నుండి అర్ధరాత్రి వరకు.పూజకు శుభ సమయంకుంభ లగ్నము మధ్యాహ్నం 2:09 నుండి మధ్యాహ్నం 3:40 వరకువృషభ లగ్నం సాయంత్రం 06:51 నుండి 08:48 వరకుసింహ లగ్నం ఉదయం 1:19 నుండి ఉదయం 3:33 వరకుగ్రహాల ప్రత్యేక కలయికదీపావళి రోజున, మూడు గ్రహాలు కలుస్తాయి. కుజుడు, సూర్యుడు , బుధుడు అందరూ కలుస్తారు. వారి మిశ్రమ ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల ప్రజలకు శుభ ఫలితాలను తెస్తుందని నమ్ముతారు. కార్తీక అమావాస్య నాడు దీపావళి పూజను స్థిరమైన లగ్నంలో చేయడం ఆచారం. చాలా మంది స్థిరమైన లగ్నంలో మహాలక్ష్మిని పూజిస్తారు. స్థిరమైన లగ్నము (వృషభ, సింహ, వృశ్చిక, కుంభ) నందు అమావాస్య రాత్రి మహాలక్ష్మిని పూజించే వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విశ్వాసం.మహాలక్ష్మి పూజ : మొదటి రోజు ధనత్రయోదశి, రెండో నరక చతుర్ధశి, మూడో రోజు దీపావళి , నాలుగో రోజు గోవర్ధన పూజ, , అయిదో రోజు భాయ్ దూజ్ ఇలా అయిదు రోజుల పాటు దీపావళి జరుపుకుంటారు. దీపావళి రోజు గణేశుడు, లక్ష్మి, ఇంద్రుడు, కుబేరుడు, సరస్వతి , కాళి మాతను పూజిస్తారు. దీపావళి రోజు సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీదేవిని విధిగా పూజిస్తారు.ఇల్లంతా దీపాలతో అలంకరించి బాణా సంచాల పేల్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. దీపావళి రోజున శ్రీయంత్ర పూజ ,ప్రతిష్ట ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నమాట శ్రీ యంత్రాన్ని ప్రతిరోజూ పూజించే ఇంట్లో లేదా సంస్థలో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని నమ్మం.ధన త్రయోదశి: అక్టోబర్ 18న ధన త్రయోదశి. ఈ రోజున బంగారం, వెండి, లేది ఇతర ఏదైనా కొత్త వస్తువు ఇంట్లోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. గోరెడు బంగారమైనా ఇంటికి తెచ్చుకుంటే తమ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భావిస్తారు.నరక చతుర్దశి : రాక్షసుడైన నరకాసురుడిని వధించిప్రజలకు సుఖ సంతోసాలను పంచిన రోజు నరక చతుర్దశిగా జరుపు కుంటారు. పొద్దున్నే తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు.దీపావళిఅసురుడు నరకుడి పీడ వదిలిన సంతోషంలో జరుపుకునే పండుగ. విద్యుద్దీప కాంతులతో గృహాలన్నీ కళకళ లాడుతాయి. లక్ష్మీపూజ చేసుకొని, బాణసంచాపేల్చి నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినందుకు చిహ్నంగా గోవర్ధన పూజను, అన్నాచెళ్లెళ్లఅనుబంధానికి ప్రతీకగా భాయి దూజ్ను జరుపుకుంటారు.అలాగే కొన్ని గోగు కర్రలతో దీపాలు వెలిగించి చిన్న పిల్లల చేత దివిటీలు కొట్టించడం ఆనవాయితీ. -
వెలుగుల పండుగ : రంగు రంగుల ప్రమిదలు రెడీ!
దీపావళి పర్వదినాన్న పురస్కరించుకుని ప్రమిదలతో పాటు బొమ్మల కొలువులు, వ్రతాలకు ఉపయోగించు కునే కుందుల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. కుమ్మరి కళాకారులు సంప్రదాయబద్ధంగా చేతులతోనే ప్రమిదలతో పాటు కుందులు తయారుచేసి చక్కని డిజైన్లకు ఆకర్షణీయమైన రంగులు వేస్తూ మార్కెట్లోకి పంపిణీ చేస్తున్నారు. అమీర్పేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక ఈ వృత్తి కళాకారులు, మహిళలు వీటి తయారీలో నిమగ్నమయ్యారు. కుందులకు, ప్రమిదలకు తగిన రంగులు అద్దుతూ ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని మార్కెట్లో విక్రయించేందుకు పలువురు వ్యాపారులు ఆర్డర్లు ఇవ్వడంతో తమకు చేతినిండా పని దొరికిందని మహిళలు చెబుతున్నారు. వీటి తయారీ కోసం ఈ కుటుంబాలన్నీ ముఖ్యంగా మహిళలు నిమగ్నమయ్యారు. ప్రతియేటా దీపావళికి రెండు నెలల ముందు నుంచే వీటి తయారీపై దృష్టి పెడతామని కుమ్మరి శ్రీను తెలిపారు. ఇదీ చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ : బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?


