breaking news
YS Jagan Mohan Reddy
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్
-
BR నాయుడు రాసలీలలు.. వైఎస్ జగన్ రియాక్షన్
-
వైఎస్ జగన్ @గన్నవరం ఎయిర్ పోర్ట్
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
వైఎస్ జగన్ విశాఖ పర్యటన అప్డేట్స్.. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసిన మాజీ సీఎం వైఎస్ జగన్ఇటీవల వివాహం జరిగిన వాసుపల్లి సాకేత్, శ్రావణి దంపతులను ఆశీర్వదించిన వైఎస్ జగన్అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుఅరకు వ్యాలీ తుంగల్గూడ గ్రామంలోని రాధాక్రిష్ణ ఆలయంలో వివాహా వేడుకవివాహ వేడుకలో నూతన వధూవరులు అశ్వని, చాణక్యలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైఎస్ జగన్ వైఎస్ జగన్కు స్వాగతం అరకు చేరుకున్న వైఎస్ జగన్అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరు కానున్న వైఎస్ జగన్.గిరిజన సాంప్రదాయ దింసా నృత్యంతో వైఎస్ జగన్కు స్వాగతం పలకనున్న మహిళలు..👉విశాఖ బయలుదేరిన వైఎస్ జగన్. 👉వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్కు హాజరవుతారు.👉గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం, విశాఖ నుంచి హెలికాప్టర్లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.👉మధ్యాహ్నం అరకు నుంచి హెలికాప్టర్లో తిరిగి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్నగర్కు చేరుకుని అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చిన్న కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు. -
మీకు సిగ్గనిపించడం లేదా..? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
చిన్నారులకు వైఎస్ జగన్ అన్నప్రాసన
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల కోరిక మేరకు ఇద్దరు చిన్నారులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నప్రాసన చేశారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట 18వ వార్డు మెంబర్ చిట్లూరి వెంకటేష్, లక్ష్మీ చంద్రిక దంపతులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు.వారి విజ్ఞప్తి మేరకు వారి కుమారుడు ఆర్యన్కు వైఎస్ జగన్ అన్నప్రాసన చేసి, ఆశీస్సులు అందజేశారు. అలాగే నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం కార్యదర్శి శ్రావ్య రెడ్డి, జీవన్ రెడ్డి దంపతుల కోరిక మేరకు వారి కుమారుడు శ్రియాన్ రెడ్డికి వైఎస్ జగన్ అన్నప్రాసన చేసి, ఆశీస్సులు అందజేశారు. దీంతో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డీనేటర్స్ నియామకం
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని ఆ పార్టీ రీజినల్ కో–ఆర్డీనేటర్స్గా నియమించారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం జాబితా విడుదల చేసింది. -
హామీలు అమలు చేయాలని అడిగితే తప్పా..?
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై చంద్రబాబు సర్కారు ప్రదర్శించిన దమనకాండ అత్యంత హేయమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ‘ఛలో విజయవాడ’కు తరలివచ్చిన అంగన్వాడీ మహిళలను నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు. ఈ మేరకు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ మొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలని కూడా చూడకుండా వారిపై లాఠీఛార్జీ.. పోలీసుల చేత బలప్రయోగం.. ఎక్కడికక్కడ నిర్బంధం.. వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే... ఈరోజు ఉదయం చర్చలకు పిలుస్తామని చెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఎగరగొట్టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక్క అంగన్వాడీలకే కాదు.. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుగారూ.. మీరు తక్షణం అంగన్వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని, వారికిచి్చన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా!! -
ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా?: చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, అమరావతి: అంగన్ వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టుపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైరయ్యారు. ఇచ్చిన హామీలను అమలు చేయమంటే అరెస్టు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. వెంటనే అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పేలా అవుతుందని నిలదీశారు. రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ, మొక్కూ లేదని నిలదీయడం నేరం అవుతుందా? అని ప్రశ్నించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయమని ట్వీట్ చేశారు. మహిళలని చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేస్తూ, పోలీసుల చేత బలప్రయోగంచేస్తూ, ఎక్కడికక్కడ వారిని నిర్బంధించి, వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారని వెఎస్ జగన్ మండిపడ్డారు.ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా?వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, ఈ ఉదయం చర్చలకు పిలుస్తామనిచెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఎగ్గొట్టి పచ్చి మోసాలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ఒక్క అంగన్వాడీలకే కాదు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబూ.. మీరు తక్షణం అంగన్వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని.. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వైఎస్ జగన్ ప్రశ్నించారు. .@ncbn గారూ.. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ, మొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలని…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 3, 2026 -
వైఎస్ జగన్ను కలిసిన మల్లు భట్టి విక్రమార్క
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి భట్టి విక్రమార్క ఈరోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) వైఎస్ జగన్ నివాసానికి వెళ్లారు. దీనిలో భాగంగా తన కుటుంబ సన్నిహితుడు విక్రమార్కకు వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు.అనంతరం తన కుమారుడి వివాహానికి సంబంధించి విషయాన్ని వైఎస్ జగన్కు తెలియజేశారు. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ జగన్కు అందించారు భట్టి విక్రమార్క. -
రేపటి నుంచి వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4న బుధవారం విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం అరకు చేరుకుని తంగుల్గూడాలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.అనంతరం విశాఖ చేరుకుని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్తారు. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఈ నెల 5న గురువారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. -
యుద్ధ నేపథ్యంలో ప్రవాసాంధ్రుల రక్షణ కోరుతూ YS జగన్ ట్వీట్
-
ప్రవాసాంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి: వైఎస్ జగన్
తాడేపల్లి: అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ల యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణమే సురక్షితంగా తీసుకురావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రవాసాంధ్రుల రక్షణ అంశానికి సంబంధించి వైఎస్ జగన్ ప్రకటన చేశారు.‘ఏపీకి చెందిన వేలాదిమంది గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి. యుద్ధం వల్ల అనిశ్చితి నెలకొనడంతో పాటు భద్రత కొరవడింది. పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు వల్ల చాలామంది ఎక్కడికక్కడి చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ ఇక్కడకి తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపాలి. కేంద్రంతో ఏపీ ప్రభుత్వం సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. ఆంధ్రుల భద్రత, సురక్షిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. సంక్షోభ సమయం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. అక్కడి వారి పరిస్థితిని ఎప్పడికప్పుడు, వారి కుటుంబాలకు తెలియజేసే విధంగా ఇక్కడ ప్రత్యేక కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసి, హెల్ప్లైన్ నెంబర్లు కూడా అందుబాటులోకి తేవాలి’ అని వైఎస్ జగన్ సూచించారు. -
‘2029లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం’
సాక్షి,గుంటూరు: 2029లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని ఆదివారం కొడాలి నాని, ఇతర వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు.అనంతరం, కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ‘కూటమి బెదిరింపులకు వైఎస్సార్సీపీ శ్రేణులు భయపడరు. కూటమి ప్రభుత్వం అంబటి కుటుంబసభ్యుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టీడీపీ నేతలు కావాలనే అంబటి రాంబాబును రెచ్చగొట్టారు.అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పిన టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు.పోలీసుల సమక్షంలో అంబటి ఇంటిపై దాడి జరిగింది. లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్సీపీ భయపడదు. 2029లో వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం’అని స్పష్టం చేశారు. -
ఎంకే స్టాలిన్కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి, తాడేపల్లి: తమిళనాడు సీఎం స్టాలిన్కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Warm birthday greetings to Thiru @mkstalin Avargal. Wishing you good health and continued happiness.— YS Jagan Mohan Reddy (@ysjagan) March 1, 2026 -
భారీ విస్ఫోటనం.. మాటలకందని విషాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం సంభవించింది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 11 మంది కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు. సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు. పైగా మల్లిశాలలో జాతర కోసం సిద్ధమైన మందు గుండును కూడా ఇక్కడున్న గోడౌన్లోనే నిల్వ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అందరూ భోజనాలకు బయటకు వచ్చారు. 1.30 గంటలకంతా భోజనం ముగించుకున్న కూలీల్లో 30–40 మంది తిరిగి ఆ నాలుగు షెడ్లలోకి వెళ్లి పనిలో నిమగ్నం అయ్యారు. మరికొందరు బయటే సేద తీరారు. ఇంకొందరు సమీపంలోనే ఊరు ఉండటంతో భోజనానికి ఇంటికెళ్లి తిరిగి వస్తున్నారు. వేట్లపాలెం వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు పేద్ద శబ్దం.. ఎగిరిపడ్డ దేహాలుమధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. శరీరాలు గుర్తు పట్టలేని రీతిలో చిధ్రమైపోయాయి. కొందరి తలా, మొండెం, కాళ్లు, చేతులు వేర్వేరు ప్రాంతాల్లో, సమీపంలోని పంట కాలువలు, పచ్చని వరి పొలాల్లో దూరంగా పడ్డాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. సంఘటన ప్రాంతమంతా మృతులు, క్షతగాత్రుల బంధువుల ఆర్తనాదాలతో హృదయ విదారకరంగా మారింది. భీతావహ దృశ్యంపేలుడు ధాటికి ఘటన స్థలి ఎటుచూసినా మంటల్లో కాలిపోయిన కూలీల మృతదేహాలతో భయానక వాతావరణం కనిపించింది. ఆ సమయంలో పనిలో ఉన్నవారెవరు, ఎంత మంది మృతి చెందారు, ఎవరు మిగిలి ఉన్నారనేది తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. చుటు్టపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు. పేలుడు ధాటికి సంఘటన స్థలానికి రెండు కిలోమీటర్ల దూరాన సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డులో ఉన్న గూడపర్తిలోని ఇళ్లల్లో ఉన్న వారు భూకంపం వచ్చినట్టు భయపడి బయటకు పరుగులు తీశారు. ఇంటిపై ఉన్న ఇనుప రేకుల నుంచి సైతం శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. వేట్లపాలెం, గూడపర్తి, పెదబ్రహ్మదేవం, జి.మేడిపాడు గ్రామాలకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాగా, మృతదేహాలను సేకరించేందుకు స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. కాలువలు, చేలల్లో గాలింపు చేపట్టి నుజ్జునుజ్జు అయిన శరీర భాగాలను సేకరించి ఒక చోటకు చేర్చారు. ఏది ఎవరి అవయవమో గుర్తించలేక కొన్నింటిని మూటలు కట్టారు. ఇలా అన్ని మృతదేహాలను, మూటలను అతి కష్టం మీద సామర్లకోట ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా బాణసంచా నాణ్యత కోసం అధిక మోతాదులో సల్ఫర్, సూరేకారం కూరడం వల్లే ఒత్తిడికి గురై విస్ఫోటనం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది 11 మంది క్షతగాత్రులు వీరేసప్పా సత్య వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, కాతేటి శ్రీను, చిటికెల లక్ష్మి, దర్శిపర్తి రాజు, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, పల్లాపాటి వేద శ్రీను, దర్శిపాటి లోవరాజు, పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్, వేట్లపాలేనికి చెందిన పచ్చిగళ్ల నూకరాజు తీవ్రంగా గాయపడ్డారు. 70 శాతం కాలిన గాయాలతో వీరు కాకినాడ జీజీహెచ్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు .20 మంది మృతులు వీరేవేట్లపాలేనికి చెందిన గంధి మంగ (43), వల్లూరి రవి (35), కడింపల్లి కృపమ్మ, గంపల మంగ, గంపల నాగరాజు, బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గొడతా నాని (26), సంకుమళ్ల రాఘవ (50), ఫైర్క్స్ యజమాని అర్జున్ తండ్రి అడబాల శ్రీనివాసరావు (55), దుర్గానగర్కు చెందిన తుంపల లోవ (38), నూకెళ్ల దేవి (45), జొన్నలదొడ్డికి చెందిన చింతల రమణ (60), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని (44), గొడత మహేష్ (41), గొడత వీర వెంకట రమణ (48), కడింపల్లి ధనరాజు (55), కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి నాని (38), యేడిద సంపత్ కుమార్ (25), పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన మాకర రాఘవమ్మ (55) మృతి చెందారు.ఫైరింజన్లు వెళ్లలేక... పెరిగిన ప్రమాద తీవ్రతసంఘటన స్థలానికి సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు నుంచి వెళ్లాలంటే సింగిల్ రోడ్డు. అది చాలా ఇరుకుగా ఉండటంతో ఆ సమయానికి అంబులెన్సులు చేరుకోలేకపోయాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. విస్ఫోటనం తీవ్ర స్థాయిలో ఉండటం, రెండు గంటల పాటు పేలుళ్లు కొనసాగడంతో స్థానికులు కూడా ఘటన స్థలి దగ్గరి వరకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. చివరకు ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడకు ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేదు. వరి పొలాలు బురద మయంగా ఉండటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగా జీజీహెచ్లో క్షతగ్రాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అంతకు ముందు హోం మంత్రి అనిత సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనపై సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరు చంద్రశేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్పై కేసు నమోదు చేశారు. శ్మశానంలా మారిన ప్రమాద స్థలం వద్ద గుమిగూడిన వేట్లపాలెం ప్రాంత ప్రజలు నా మనసును కలచివేసింది సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి, పలువురు మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా? లేదా? అన్నదానిపై పరిశీలన చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ‘ఎక్స్’లోనూ పోస్టు చేశారు. -
అవినీతి ఊబిలో ఏపీ పాలన!
ఊపిరాడనివ్వని అవినీతి కంపు నేడు ఆంధ్రావనిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. పాలనా యంత్రాంగం లంచాల మత్తులో జోగుతున్నదని కూటమి నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. చిన్నాచితకా పనులు కూడా చేతులు తడపందే కావడం లేదని లోకవాణి కోడై కూస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, కాణీ ఖర్చు లేకుండా ప్రభుత్వ సేవలను ఇంటికి చేర్చిన సచివాలయ వ్యవస్థ ఇప్పుడు కోమాలోకి జారి పోయింది. రెండున్నర లక్షల మంది వలంటీర్లను నమ్మించి గొంతులు కోసింది కూటమి ప్రభుత్వం. సర్వేల పేరుతో పనిభారం పెంచి సచివాలయ సిబ్బందిని ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారు. ఉద్యోగాలు వదిలేసి పారిపోయేలా ప్రేరేపిస్తు న్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో వారి ఆత్మహత్యలు, అకాల మరణాలు రికార్డయ్యాయి.నిస్సంకోచంగా, యథేచ్ఛగా, బరితెగించి సాగుతున్న లంచ గొండి దర్బార్లకు ప్రజాప్రతినిధులే గాడ్ఫాదర్లుగా వ్యవహ రించడం సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నది. కీలక శాఖల్లో పనిచేసే అధికారులను ఏరికోరి నియమించుకొని వారి నుంచి నెలవారీ వాటాలను ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారన్న వార్తలు పదేపదే వినవస్తున్నాయి. అందుకు సంబంధించి కొందరు అధికారుల ఆడియోలు కూడా అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహార శైలితో ప్రజాప్రతినిధులే స్వయంగా ఉద్యోగస్వామ్యాన్ని అనినీతి మేత కోసం ఉసిగొల్పు తున్నారు. ఈ పని చేస్తున్న సదరు ప్రజాప్రతినిధులకు నదురూ లేదు... బెదురూ లేదు. ‘ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా?’ అన్న సామెతను వారు శిరోధార్యంగా స్వీకరిస్తున్నారు.‘ఉద్యోగాల కల్పన’ అనే దేవతావస్త్రం పేరు చెబుతూ ఉర్సా, లుల్లూ అండ్ అదర్స్కు ఖరీదైన భూముల్ని కట్టబెడు తున్న ప్రభుత్వ పెద్దల దూకుడు నుంచి ప్రజాప్రతినిధులు స్ఫూర్తి పొందుతున్నారు. పెద్దల కనుసన్నల్లోనే నడుస్తున్న కల్తీ మద్యం కార్ఖానాల నుంచి పారుతున్న కరెన్సీ చూసి ఉత్తేజం పొందుతున్నారు. అధినాయకుడు తమ బంధుత్వాలను గౌరవించి వేలకోట్ల విలువైన భూముల్ని చుట్టబెట్టడం క్షేత్రస్థాయి నాయకత్వాన్ని పులకింపజేస్తున్నది. సొంత పాల కంపెనీ, దాని అనుబంధ సంస్థల లాభాల కోసం దేవదేవుడినే రాజకీయాల్లోకి లాగగలిగిన ఆ లాఘవం జూనియర్ నాయకులకు నిజంగా ఒక పాఠ్యాంశమే!పై స్థాయి నుంచి పొంగిపారిన స్ఫూర్తిని కింది స్థాయి కూడా అందిపుచ్చుకోవడంతో అవినీతి ప్రవాహం రాష్ట్ర మంతటా కట్టలు తెంచుకున్నది. దాని ఫలితమే కల్తీ పాల చావులు, కలుషిత జలాల మరణాలు, కృత్రిమ మద్యపు మరణ మృదంగం! పోషక బలాన్నిచ్చే పాలే కాటేస్తాయని ఎప్పుడైనా ఊహించామా? ప్రాణావసరమైన మంచినీళ్లే ప్రాణాలు తీస్తా యని కలగన్నామా? పాలూ, నీళ్లే కాదు. నేడు ఆంధ్ర రాష్ట్రంలో తింటున్నదీ, తాగుతున్నదీ సమస్తం కల్తీయేనని పాలక కూటమి నేతలే చెబుతున్నారు. గుంటూరు జిల్లా ‘జనసేన’ అధ్యక్షుని వీడియో ఒకటి ఈ మధ్యనే సంచలనం సృష్టించింది. ‘‘ఉద్యోగులు భయంకరంగా లంచాలు వసూలు చేస్తున్నారు. ఊహించని స్థాయిలో అవినీతి పెరిగింది. పాస్బుక్కులో పొరపాట్లు సరిదిద్దడానికి కూడా వేల రూపాయలు సమర్పించుకోవలసి వస్తున్నది. చిరంజీవి ఠాగూర్ సినిమాను మించి ఇవాళ ఆంధ్ర ప్రదేశ్లో లంచావతారాలున్నాయి. అవినీతి అధికారుల నుంచి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పడానికి సిగ్గేస్తు న్నది. అసలీ రాష్ట్రంలో కల్తీ లేకుండా ఏదైనా తింటున్నామని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలమా?’’ పాలక కూటమి లోని ఓ పార్టీ జిల్లా స్థాయి అధ్యక్షుని మాటలివి!రాజకీయ నాయకులు – అధికారులు లంచాల కోసం కుమ్మక్కు కావడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ తినేదీ తాగేదీ సమస్తం కల్తీ అయిందనే అభిప్రాయం జన సామాన్యంలో బలపడింది. అదే అభిప్రాయాన్ని జనసేన నాయకుడు బహిరంగంగా ప్రకటించారు. పైస్థాయిలో అవినీతి ఉండకపోతే కింది స్థాయిలో ఇంత బరితెగింపు ఉండేది కాదు. అవినీతి వాటాల ఫలితంగా పాలనా యంత్రాంగంలో జవాబుదారీతనం అట కెక్కింది. ప్రభుత్వ పాలన పూర్తిగా పట్టాలు తప్పింది. శాంతి– భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి దనిపిస్తుంది. రక్షక భటులు పొలిటికల్ పోలీసింగ్కు మాత్రమే పరిమితం కావడంతో సంఘ విద్రోహ శక్తులు చెలరేగు తున్నాయి. ఈ శక్తులకు రాజకీయ నాయకత్వం అండ దండిగా లభిస్తున్నది.‘పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో...’ అంటూ మురిసిపోయాడు ఒక కవి. ఆ భవితవ్యాన్ని పసితనంలోనే మసి చేస్తున్న కీచకసేనల పదఘట్టనలు పలుచోట్ల వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలో ఓ మైనర్ దళిత బాలికను బెదిరించి 14 మంది యువకులు కొన్ని నెలలపాటు అత్యాచారాలు చేసిన ఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. తండ్రి లేని ఆ బాలిక బయటికి చెబితే చంపేస్తారన్న భయంతో నోరు మెదపలేకపోయింది. బయటపడిన తర్వాత కూడా అధికార పార్టీ మద్దతుదారులైన నిందితులను పట్టుకోవడానికి చట్టం తటపటాయించింది. కర్నూలు జిల్లాలో చిన్నారి బాలికలను బెదిరించి మద్యం తాగించి పాలక పార్టీ యువకులు అత్యా చారాలు చేసి వీడియోలు కూడా తీశారు. చిన్నారులపై జరిగిన ఇటువంటి అత్యాచారాలే డజన్కు పైగా ఇప్పటివరకు వెలుగు చూశాయి. అత్యాచారాలు సగటున రెండు రోజులకొకటి జరుగుతున్నాయని అధికారిక గణాంకాలే చెబు తున్నాయి.హత్యలైతే సగటున రోజుకొకటి. రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, రెడ్ బుక్ అరాచకాలు నేడు జగమెరిగిన సత్యాలు. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని బాబు సర్కార్ ఎత్తివేసింది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కోరుకున్న చోటుకి, కోరుకున్న సమయంలో డ్రగ్స్, మద్యం డోర్ డెలివరీ చేసే విధానం అమల్లో ఉందట! డబ్బులు వెదజల్లితే జరగని పాడు పని ఏదీ లేదని చెప్పుకుంటున్నారు. పైనున్న అధినేతల స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకూ ఈ దురవస్థకు అందరూ బాధ్యులే. తిలాపాపం తలా పిడికెడు! నిరాటంకంగా సాగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, భూదందాలు, అవినీతి, అసాంఘిక కార్యక్రమాలు దాచేస్తే దాగేవి కాదు. అందుకని వాటిని అంగీకరిస్తూనే అందుకు బాధ్యతను అధికార యంత్రాంగంపైనో, కొందరు ప్రజాప్రతినిధులపైనో నెట్టేయడానికి యెల్లో మీడియా పడరాని పాట్లు పడుతున్నది. అధినేత హెచ్చరించినా అనుచరులు దారికి రావడం లేదంటూ వాపోతున్నది. అసలు అధినేత సుద్దపూసైతే కదా! ఎవరైనా దారిలోకి వచ్చేది.ఆవు పాలు, గేదె పాలే కాదు... రాష్ట్రంలో ‘మిక్సీ పాలు’ అనే మాట కూడా బాగా పాపులరైంది. అంటే పాలే లేకుండా పాలను తయారు చేయడమన్నమాట! పాల తయారీకి రసాయ నాలను ఉపయోగించడమన్నది విచ్చలవిడిగా జరుగుతున్నదనీ, అవి మోతాదు మించడం వల్లనే రాజమండ్రి దుర్ఘటన జరిగిందనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. అధికార యంత్రాంగం చిత్తశుద్ధి చూపెడితే వీటిని నియంత్రించడం అసాధ్యమేమీ కాదు. కానీ, వ్యవస్థీకృతమైన అవినీతి అందుకు అవకాశమివ్వదు. ఐదుగురు ప్రాణాలు కోల్పోవడానికీ, పలువురు అస్వస్థతకు గురి కావడానికీ ఈ వ్యవస్థీకృత అవినీతే కారణం. మంచినీటి పైపులైన్లు మురుగు నీటితో కలుషితమై, డయేరియా ప్రబలి శ్రీకాకుళంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా ఆందోళన కలిగించింది. రెండొందల మంది వరకు అస్వస్థులయ్యారు. ఇటువంటి దుర్ఘటనలను నివారించే ప్రయత్నం చేయకపోగా ఈ విషాద తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కల్తీ పాలు, కలుషిత నీటి విషాద ఘటనలపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘మీ నిర్లక్ష్యంతో ఇంకెంత మంది ప్రాణాలు తీస్తార’ని ఆయన ‘ఎక్స్’లో ప్రశ్నించారు. పరిపాలనపై ముఖ్యమంత్రి పట్టుకోల్పోవడం వల్లనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరో పించారు. కలుషిత నీరు, ఆహారం కారణంగా పలుమార్లు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో వందలాది మంది అస్వస్థులయ్యారు. కురుపాంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోయిన విషయాన్ని, రాష్ట్రవ్యాప్తంగా 900 మందికి పైగా అస్వస్థులైన సంగతిని కూడా జగన్ ప్రస్తావించారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడానికి కారణం రాజకీయ నాయకులు – కొందరు అధికారుల అవినీతి మిలాఖతే!విచ్చలవిడి అవినీతి కారణంగా పాలనా యంత్రాంగానికి పక్షవాతం సోకినా, పైకి మాత్రం బాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదనే భజనను యెల్లో మీడియా యథాశక్తి కొనసాగిస్తూనే ఉన్నది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసి డర్ తానేనంటూ సెల్ఫ్ ప్రమోషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అభివృద్ధి పేరుతో తన ఖాతాలో వేసుకున్న చాలా కార్యక్రమాలు ‘క్రెడిట్ చోరీ’ ద్వారా జగన్ ఖాతాలోంచి తెచ్చుకున్నవేనని జనానికి కూడా బాగా అర్థమైంది. రాష్ట్రం అభివృద్ధి పథంలో కాదు తిరోగమనంలో ఉన్నదని పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తే నిరూపిస్తున్నది. ‘కాగ్’ లెక్కల ప్రకారమే రాష్ట్ర జీఎస్టీ రాబడి నానాటికీ తగ్గుతున్నది. ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీల్లో అత్యంత ముఖ్యమైన, అధిక వ్యయమయ్యే రెండు పథకాలను (నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి) పూర్తిగా ఎగవేసి మిగతా వాటిని అరకొరగా అమలుచేసి... ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేశారని పదేపదే చెప్పుకోవడం ముఖ్యమంత్రికే చెల్లింది. అత్యున్నత స్థాయిలో జరుగుతున్న అవినీతి కారణంగా పాలనా యంత్రాంగంలో అవినీతి పెచ్చ రిల్లింది. ప్రజాపాలన పడకేసింది. కనీసావసరాల కోసం,వైద్యం కోసం, మెరుగైన విద్య కోసం పేద ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. లేని అభివృద్ధి పేరుతో భజన బృందం చేస్తున్న కృత్రిమ సందడిలో వారి ఆర్తనాదాలు వినిపించక పోవచ్చు. కానీ సరైన సమయంలో అవి దీర్ఘశ్రుతితో శంఖా రావమై వినపడవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వేట్లపాలెం అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
-
రెడ్ బుక్ లో జగన్ పేరు..! అంబటి మాస్ రియాక్షన్
-
వేట్లపాలెం అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై ఆవేదన వ్య క్తం చేశారు వైఎస్ జగన్.‘వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలి’ అని వైఎస్ జగన్ సూచించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలి. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 28, 2026 కాకినాడ: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం -
ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి..? కల్తీ పాలు, కలుషిత నీటిపై జగన్ ఫైర్
-
ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి?
సాక్షి, అమరావతి : ఏపీలో పాలు, నీళ్లు కల్తీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంత మంది ప్రాణాలు పోవాలంటూ చంద్రబాబు సర్కార్ను ప్రశ్నించారు. ‘ఎవరైనా బతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయి. పలుచోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైన ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడు పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దంపడుతున్నాయి. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా, మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు, రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ స్వార్థ ప్రయోజనాలు ఆశించి పనిచేస్తూ.. ప్రజారోగ్యం, ప్రజా రక్షణ వంటి వాటికి పూర్తిగా మంగళం పాడుతున్నారు. హాస్టళ్ల పరిస్థితిని ఎండగట్టిన జాతీయ మీడియా కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 16 మంది విద్యారి్థనులు డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఇదే పాఠశాలలో గతంలో కలుషిత నీటి కారణంగా పచ్చ కామెర్లతో ఇద్దరు బాలికలు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. అంత దారుణంగా ఘటనలు చోటు చేసుకున్నా, సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఆ విధంగా వ్యవస్థ దారుణంగా విఫలం కాగా, మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గత 14 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రతవల్ల వ్యాధుల వంటి ఘటనలు దాదాపు 25 చోటు చేసుకున్నాయి. వాటివల్ల 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించింది. పూర్తిగా కొరవడిన పరిశుభ్రత, కలుషిత నీరు, ఆహారం, హాస్టళ్లలో దారుణ పరిస్థితులను జాతీయ మీడియా కూడా ఎండగట్టింది. ఐదుగురు మృతి.. 200 మంది ఆస్పత్రుల పాలు రాష్ట్రంలో గడిచిన 18 నెలల్లో చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో పెద్దఎత్తున డయేరియా ప్రబలింది. ఫలితంగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రత అందుకు ప్రధాన కారణాలు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం, లెక్కలు కావు. ప్రభుత్వ నిర్లక్ష్యం, హాస్టళ్లపై పూర్తిగా కొరవడిన పర్యవేక్షణ, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యల్లో వైఫల్యానికి అద్దంపడుతున్నాయి. గత వారం పరిస్థితి మరింత దారుణంగా మారింది. శ్రీకాకుళంలో కలుషిత నీటి కారణంగా తీవ్ర డయేరియా వ్యాప్తి చెందింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారు. అతిసారం, ఇన్ఫెక్షన్లతో పలు కుటుంబాలు తల్లడిల్లాయి. ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్ష, సురక్షిత నీటి సరఫరా కోసం తగిన మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వేగంగా స్పందించి, నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో వైఫల్యాన్ని స్పష్టంగా చూపాయి. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం.. రాజమహేంద్రవరం ఘటనే సాక్ష్యం రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాల కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో వివిధ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. ఇంకా మరెందరో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. పోషణ ఇవ్వాల్సిన పాలు చివరకు మరణానికి కారణమయ్యాయి. ఇది ఏదో ఒక చిన్నపాటి లోపం కాదు. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం, దానికి సంబంధించిన యంత్రాంగాల వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర లేచి, నిజాయితీగా పరిస్థితిని సమీక్షించాలి. ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించాలి. వాటన్నింటినీ సరిచేయాలి. వాటి ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన వీడాలి. సురక్షిత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలుచేయాలి. వీటన్నింటిపై చిత్తశుద్ధితో పని చేయాలి. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏవో అద్భుతాలు కోరుకోవడం లేదు. ఇంకా మరిన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం మేల్కొని, తగిన చర్యలు చేపట్టాలని మాత్రమే ప్రజలంతా ఆశిస్తున్నారు. Hello India,People of Andhra Pradesh are dying after drinking milk and water. What should be, the most basic necessities of life, have turned into sources of fear. Under the TDP-led coalition government and Chief Minister @ncbn, repeated outbreaks of diarrhoea and food… pic.twitter.com/YaOts9IUcB— YS Jagan Mohan Reddy (@ysjagan) February 27, 2026 -
అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూత.. వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సౌందర్ రాజన్ దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ సేవలో అంకితభావంతో పనిచేశారని.. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు.సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారన్న వైఎస్ జగన్.. సౌందరరాజన్ మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ అన్నారు. -
బాధితులను పరామర్శించడమే నేరమా? వైఎస్ జగన్ పాలన చూసి నేర్చుకోండి
-
‘సెకీ’కి సెల్యూట్!
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు (విద్యుత్ షెడ్యూలింగ్, ఆఫ్ టేక్ ప్రారంభం) ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇది చాలా ఉపయోగకర ఒప్పందమని ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) చేసిన సూచనపై సానుకూలంగా స్పందించింది. తద్వారా ఇన్నాళ్లూ చంద్రబాబు అండ్ కో ‘సెకీ’ ఒప్పందంపై చేసిందంతా విష ప్రచారమేనని తేటతెల్లమైంది. 2021 డిసెంబర్ 1న కుదిరిన పవర్ సేల్ అగ్రిమెంట్ (పీఎస్ఏ) ప్రకారం ఈ విద్యుత్ సరఫరా జరుగుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ (కనెక్టివిటీ ఆపరేషనలైజేషన్) పూర్తయిన అనంతరం విద్యుత్ తీసుకునే ప్రక్రియ (షెడ్యూలింగ్) ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రక్రియలో ఏపీపీసీసీతోపాటు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, ఏపీఆర్ఏపీఎల్, ఏపీఎస్ఎల్డీసీ సంస్థలు ఎస్ఈసీఐ, సీటీయూఐఎల్, ఆర్ఎల్డీసీలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పీఎస్ఏ నిబంధనలకు అనుగుణంగా వాణిజ్య లావాదేవీలు (కమర్షియల్ సెటిల్మెంట్) నిర్వహించాలని సూచించింది. దీర్ఘకాలిక విద్యుత్ వినియోగం కోసం జనరల్ నెట్వర్క్ యాక్సెస్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ(జిఎన్ఏ–ఆర్ఈ) వెసులుబాటును పొందాలని కూడా స్పష్టం చేసింది. అలాగే, ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం విద్యుత్ స్వీకరణ జరుగుతుందని, ఏపీ సరిహద్దు వరకు ఇంటర్ స్టేట్ ట్రాన్స్విుషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్–అంతర్రాష్ట్ర ప్రసారం) చార్జీలు, నష్టాలపై రాష్ట్రానికి ఎలాంటి బాధ్యతా ఉండదని తెలిపింది. ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపుతో యూనిట్ రూ.2.49కి సౌర విద్యుత్ సరఫరా చేస్తామంటూ గతప్రభుత్వానికి సెకీ రాసిన లేఖ అదీ విజన్ అంటే.. » రైతులు పడుతున్న అవస్థలను చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, వారికి ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలని సంకల్పించారు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్లపాటు రోజుకు 9 గంటల చొప్పున పగటిపూటే ఇవ్వాలని దృఢంగా భావించారు. దానికి తగ్గట్టుగానే ముందుచూపుతో ఆలోచించి సౌర విద్యుత్ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వ్యవసాయానికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారు. » అదే సమయంలో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు (ఐఎస్టీఎస్) మినహాయించి, యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్ను సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే యూనిట్ రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. » ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ ఆమోదించింది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్విుషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుందని ఒప్పందంలో స్పష్టంగా ఉంది. అయినా ఈ ఒప్పందం వల్ల ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు ఉండదని అప్పట్లో చంద్రబాబు అదే పనిగా దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియా ఆయనకు వంత పాడుతూ పుంఖానుపుంఖాలుగా తప్పుడు కథనాలు ప్రచురించింది. » కానీ అవన్నీ అవాస్తవాలని ఒప్పుకుంటూ.. ఇప్పుడు అదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు, నష్టాలు సెకీ విద్యుత్కు వర్తించవని అధికారికంగా స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లూ వారు చేసిందంతా అసత్య ప్రచారమని వారే అంగీకరించినట్లయింది. -
Nellore: కొత్త జంటకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు (ఫొటోలు)
-
నెల్లూరు జిల్లా పర్యటనకు YS జగన్
-
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత కొండూరు అజయ్ రెడ్డి (రైల్వే కోడూరు) కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ క్రమంలో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు సిద్దు సుష్మా, ప్రతుల్య రెడ్డిలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వారిద్దరికీ వివాహ శుభాకాంక్షలు తెలిపారు.ఇక, అంతకుముందు.. వైఎస్ జగన్ నెల్లూరుకు చేరుకున్న సందర్బంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. దీంతో, భారీ జనసందోహానికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. -
అధైర్య పడొద్దు.. నేనున్నా.. టీడీపీ అరాచకాలపై ప్రజలకు జగన్ భరోసా
-
నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన నెల్లూరుకు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు. -
టన్నుల్లో చంద్రబాబు అబద్ధాలు.. వెలిగొండలో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: మరో ‘క్రెడిట్’ చోరీకి సిద్ధమైన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మార్కాపురం సభ వేదికగా వెలి‘కొండంత’ అసత్యాలు వల్లె వేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో తానే శంకుస్థాపన చేశానని.. 2014–19 మధ్య పనులను పరుగులు పెట్టించానని.. కానీ 2019–24 మధ్య పనులు మూలన పడ్డాయని తనకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలు చెప్పుకొచ్చారు. నిజానికి 1996 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వెలిగొండ పనులకు చేసిన వ్యయం అక్షరాలా రూ.పది లక్షలు మాత్రమే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసిందే. ఇక 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పనుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లు దోచిపెట్టింది. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు) వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో కడిగిపారేయడమే అందుకు తార్కాణం. అలాంటి అవినీతి బాగోతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి రోజుకు సగటున 10 మీటర్ల పొడవున సొరంగం తవ్వేందుకు టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.68.44 కోట్లను ఇచ్చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కానీ మరమ్మతులు చేయకపోవడం వల్ల టీబీఎంలు రోజుకు సగటున ఒకటి రెండు మీటర్ల పొడవున కూడా సొరంగాలను తవ్విన దాఖలాలు లేకపోవడం గమనార్హం..! ఇక సొరంగాలను నల్లమలసాగర్ను అనుసంధానం చేసే ఫీడర్ కెనాల్లో చేసిన పనులూ నాసిరకమే. 2017.. 2018.. 2019.. ఇలా వెలిగొండను పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు చంద్రబాబు ముహూర్తాలు మార్చుకుంటూ వచ్చారు. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి అధిక ధరలకు మరో కాంట్రాక్టర్కు కట్టబెట్టారు. అనంతరం కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆక్షేపించడం గమనార్హం. గతేడాది కురిసిన వర్షాలకు ఫీడర్ కెనాల్ బలహీనంగా ఉన్న చోట్ల కోతకు గురవడంతో ఇప్పుడు దానికి రిటైనింగ్ వాల్, కాంక్రీట్ లైనింగ్ పనులకు రూ.456 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఆ పనులను తనకు అత్యంత సన్నిహితుడైన గన్నమనేని దొరయ్యకు చెందిన జీడీఆర్ ప్రాజెక్ట్స్కు కట్టబెట్టారు. రూ.992 కోట్లతో పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఆగస్టులోనే నల్లమలసాగర్కు కృష్ణా జలాలుదశాబ్దాల స్వప్నం వెలిగొండ సాకారమైందని.. శ్రీశైలం నుంచి జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్కు చేరడంతో తమ కష్టాలు కడతేరుతాయనుకున్న ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం అడియాశలు చేసింది. ఈ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను (ఆసియాలోనే అతి పొడవైనవి) రికార్డు సమయంలో నాటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించింది. రూ.992 కోట్లు వ్యయం చేసి పునరావాసం కల్పించింది. 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. కేవలం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే దుగ్ధతోనే నల్లమలసాగర్ నిర్వాసిత కుటుంబాలకు 21 నెలలుగా పునరావాసం కల్పించకుండా చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తోందని సాగు నీటి నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2024–25లో 1,439 టీఎంసీలు, 2025–26లో 1,936.79 టీఎంసీల ప్రవాహం రాగా.. ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 2024–25లో 848.96 టీఎంసీలు, 2025–26లో 1,652.12 టీఎంసీలు కలిశాయని గుర్తు చేస్తున్నారు. అదే చంద్రబాబు సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే 2024–25తోపాటు 2025–26లోనూ కృష్ణా వరదను ఒడిసి పట్టి నల్లమలసాగర్కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూరికార్డు వేగంతో జంట సొరంగాలు పూర్తి» వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్సీపీ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను వైఎస్ జగన్ 2021లోనే పూర్తి చేయించారు. » రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్ జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి, టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను కాంట్రాక్టర్కు అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్ కూడా పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేసి రికార్డు సమయంలో 7.685 కి.మీల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తి చేశారు. శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్ జగన్ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. » ఇక 2014–19లో టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమల సాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్ క్లియర్ చేశారు. 2019–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేయించింది. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది.‘కొండంత’ కలను సాకారం చేసిన వైఎస్సార్..» శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీల పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీళ్లు అందించాలని 1993–94లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు.» జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమల సాగర్తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా 21.8 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్, తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు» మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 27న పనులకు శ్రీకారం చుట్టారు. -
28 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు దేశంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ పంపిణీని ఈ నెల 28న దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 3.45 లక్షలమంది బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల శాఖ సమాచారం ప్రకారం అత్యధికంగా కర్నూలు జిల్లాలో 23,957 మంది, అత్యల్పంగా పోలవరం జిల్లాలో 2,777 మంది బాలికలు ఉన్నారు. 1,683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 0.5 ఎంఎల్ వ్యాక్సిన్ను ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. సుమారు మూడు నెలలు జరిగే వ్యాక్సిన్ డ్రైవ్కు తొలివిడత కింద కేంద్రం నుంచి 1,90,890 డోసుల వ్యాక్సిన్ వెయిల్స్ రాష్ట్రానికి చేరుకున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చే ముందు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి అని నిబంధన ఉంది. పీహెచ్సీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ పంపిణీ వివరాలను యూవిన్ డిజిటల్ పోర్టల్లో నమోదు చేస్తారు. వైఎస్ జగన్ హయాంలో కీలక ముందడుగు రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే కీలక ముందడుగు పడింది. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను తెచ్చారు. క్యాన్సర్ను ప్రారంభదశలోనే గుర్తించి ప్రాణాపాయాన్ని తప్పించడంతో పాటు, చికిత్స వ్యయాలకు అడ్డుకట్ట వేసేదిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగా సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి అప్పట్లో శ్రీకారం చుట్టారు. పైలెట్ ప్రాజెక్టుగా పలు జిల్లాల్లో స్క్రీనింగ్ కూడా చేశారు. 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టేందుకు విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రితో ఎంవోయూ కుదుర్చుకుని వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే గ్రామాల్లో వైద్యసేవలు అందించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, వైద్యులకు శిక్షణనిచ్చారు. సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించడానికి సర్వం సన్నద్ధం చేసిన సమయంలోనే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో స్క్రీనింగ్ వాయిదా పడింది. ఎన్నికల తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (సీడీ–ఎన్సీడీ–3.0) సర్వేలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అంటూ హడావుడి చేసింది. స్క్రీనింగ్ నిర్వహణలో ఘోరంగా విఫలం అయింది. వైద్యశాఖ తప్పులతడకగా స్క్రీనింగ్ చేపట్టడంతో మరోమారు స్క్రీనింగ్ చేయాల్సి వచ్చింది. -
అధైర్య పడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే
సాక్షి ప్రతినిధి కడప : ‘ఎవరూ అధైర్య పడొద్దు.. మంచి రోజులు వస్తాయి.. సమస్యలు శాశ్వతం కాదు.. వచ్చేది మన ప్రభుత్వమే.. అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో మమేకమయ్యారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ.. బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని.. అకారణంగా దాడులు చేస్తోందని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. అందుకు ఆయన స్పందిస్తూ ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని, హింసాత్మక రాజకీయాలకు పాల్పడటం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్ట కాలంలో కార్యకర్తలకు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. అశేష జనసందోహానికి అభివాదం చేస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమస్యలు వింటూ.. ధైర్యం చెబుతూ.. వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు వైఎస్ జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు విన్న ఆయన స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఒక్క మేలు కూడా జరగలేదని వచ్చిన వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధ పడుతున్న దివంగత వైఎస్ రాజారెడ్డి సోదరి కమలమ్మను ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సింగిల్ విండో మాజీ చైర్మన్ ఈశ్వరయ్యను కూడా ఆయన నివాసంలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రత్యేక పూజలువేంపల్లె మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ (శ్రీ పార్వతీ దేవి సమేత మహా నందీశ్వర స్వామి), కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి హోమాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామి వారికి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి పెంపొందుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందని తెలిపారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని, శ్రీ నందీశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. -
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగింది. భాకరాపురంలో క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు.ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు.ఆపన్నులకు అండగా..వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.దీంతో పాటు పులివెందుల పర్యటనలో అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ రాజారెడ్డి సోదరి కమలమ్మను ఆమె ఉంటున్న జీసస్ ఛారిటీస్కు వెళ్ళి వైఎస్ జగన్ పరామర్శించారు, కమలమ్మ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న సింగిల్ విండో మాజీ ఛైర్మన్ ఈశ్వరయ్యను కూడా ఆయన నివాసంలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. -
రేపు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు( ఫిబ్రవరి 26, గురువారం) నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు వైఎస్సార్ కడప పులివెందుల భాకరాపురం నివాసం నుంచి బయలుదేరి 8.50 గంటలకు హెలిప్యాడ్కు చేరుకుంటారు.9 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. 10.10 గంటలకు రోడ్డు మార్గంలో గొలగమూడి రోడ్డులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కు 10.20 గంటలకు చేరుకుంటారు. స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్ కొండూరు అజయ్రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరుగు పయనమవుతారు. -
హోమంలో పాల్గొన్న జగన్
-
కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్ జగన్ కు వేద పండితుల ఆశీర్వచనం
-
నందిపల్లిలో వైఎస్ జగన్ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)
-
Exclusive Visuals: నందిపల్లి నందీశ్వరాలయం..
-
జగన్ పర్యటనలో వెల్లువెత్తిన ప్రజాభిమానం
-
నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు..
-
జగన్ ను చూసేందుకు పరుగులు తీసిన జనం
-
వై.ఎస్ రాజా రెడ్డి సోదరి కమలమ్మను పరామర్శించిన వైఎస్ జగన్
-
Watch Live: నందిపల్లె లో నందీశ్వర ఆలయం ప్రారంభోత్సవం
-
నందీశ్వర ఆలయంలో హోమం, ప్రత్యేక పూజల్లో వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల: దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని.. భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. పులివెందులలో రెండో రోజు పర్యటన సందర్బంగా వైఎస్ జగన్.. నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల నేపథ్యంలో సంప్రదాయ దుస్తులు ధరించి, స్వామివారికి భక్తి శ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుంది’ అని అన్నారు. ఈ క్రమంలోనే నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిని, కమిటీ సభ్యులను అభినందిస్తూ ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నందీశ్వర స్వామివారి కృపాకటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. నేనున్నా.. భయపడకండి..
-
బెడిసికొట్టిన బాబు కపట నాటకం
-
‘అన్నదాత సుఖీభవ’లో కోత
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలులో రైతులను నిలువునా మోసంచేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం హయాంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద లబ్దిపొందిన రైతులతో పోలిస్తే భారీగా కోత పెట్టింది. ఈ విషయం శాసనసభ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో బట్టబయలైంది. పైగా తొలి ఏడాది ‘అన్నదాత సుఖీభవ’ను ఎగ్గొట్టడమే కాకుండా... రెండో ఏడాది రెండు విడతల్లో రూ.5వేల చొప్పున మాత్రమే చెల్లించింది. మూడో విడత అసలు ఇవ్వకుండానే నిధులు విడుదల చేసినట్టు ప్రకటించడం విస్మయాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చివరి ఏడాది 2023–24లో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద 53.18 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించిందని ఈ ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 46.86 లక్షలకు తగ్గినట్లు ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానంతో తేటతెల్లమైంది. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు బి.విరూపాక్షి, ఆకేపాటి అమరనాథ్రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాపై అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు దఫాల్లో రూ.4,685.84 కోట్లు మాత్రమే చెల్లించగా, శాసనసభకు ఇచ్చిన సమాధానంలో మాత్రం రూ.8,862.89 కోట్లు ఇచ్చినట్లు పేర్కొనడం గమనార్హం. ఒక్కో రైతుకు రూ.30వేలు ఎగనామం ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ‘అన్నదాత సుఖీభవ’ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది అన్నదాత సుఖీభవ ఊసే ఎత్తలేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయాలని నిలదీయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో ఏడాది అన్నదాత సుఖీభవను అమలు చేశారు. అది కూడా రాష్ట్ర వాటా రూ.14 వేలు, పీఎం కిసాన్ కింద మరో రూ.6 వేలు కలిపి రూ.20 వేలు.. అంటూ చంద్రబాబు మాట మార్చారు. అయితే, గత ప్రభుత్వం హయాంలో లబ్ధి పొందిన రైతుల సంఖ్యతో పోలిస్తే 6.32 లక్షల మందికిపైగా రైతులను తగ్గించి అరకొరగా రెండు విడతల్లో రూ.5వేలు చొప్పున కేవలం రూ.4,685.84 కోట్లు మాత్రమే ఇచ్చింది. మొత్తంగా రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.30 వేలు చొప్పున చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మూడో విడత ఎప్పుడు జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మాత్రం రాష్ట్రం వాటా రూ.4,685.84 కోట్లు, కేంద్రం వాటా రూ.4,177.05 కోట్లు కలిపి రూ.8,862.89 కోట్లు విడుదల చేసినట్టు అసెంబ్లీలో సమాధానం ఇవ్వడం విస్తుగొలుపుతోంది. -
వైఎస్ జగన్ పేరు చెప్పాలని రఘురామ టార్చర్!
సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు తనపై బనాయించిన అక్రమ కేసులో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పాలని తనపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన వాస్తవాలను బహిర్గతం చేశారు. రఘురామకృష్ణరాజు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని.. ఆయన ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఫోన్కు మెస్సేజ్ చేశారని వెల్లడించారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి, పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పకపోతే నిన్ను నిందితుడిగా చేరుస్తాం..’ అని ఆ మెస్సేజ్లో బెదిరించారని పేర్కొన్నారు. అవాస్తవాలను చెప్పేందుకు సమ్మతించకపోవడం వల్లే తనపై అక్రమ కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. రఘురామకృష్ణరాజు కాల్ డేటా తీస్తే అవన్నీ బయటపడతాయని, చాలామందిని ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్నది వెల్లడవుతుందన్నారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు చూపిస్తానని ప్రకటించారు. ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ దామోదర్ తన తల్లి పట్ల అసభ్యంగా, అవమానకరంగా వ్యవహరించారని సునీల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎస్టీగా పుట్టడమే నేను చేసిన నేరమా..? చిన్న కులాల వారు కష్టపడి చదివి ఐపీఎస్ లాంటి ఉన్నత స్థానాలకు చేరితే జీర్ణించుకోలేరా?..’ అని సునీల్ నాయక్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం బిహార్లో అగ్నిమాపక శాఖ, హోంగార్డ్స్ విభాగం ఐజీగా ఉన్న సునీల్ నాయక్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు పట్నాలో సోమవారం హల్చల్ చేసిన విషయం విదితమే. గతంలో డిప్యూటేషన్పై ఏపీలో పనిచేసిన సునీల్ నాయక్పై అక్రమంగా బనాయించిన కేసులో కనీసం అరెస్టు వారెంట్, కేసు డైరీ లేకుండా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు యత్నించారు. అయితే ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ఏపీ పోలీసుల అరాచకాన్ని బిహార్ పోలీసులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఏపీ పోలీసులు అవమాన భారంతో తిరుగుముఖం పట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తనపట్ల వ్యవహరించిన తీరుపై సునీల్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఎక్స్ ఖాతాలో మంగళవారం సంచలన పోస్టు పెట్టారు. అందులో ఏమన్నారంటే.. » ఎస్టీగా పుట్టడమే నేను చేసిన నేరమా..? గిరిజన లంబాడి కుటుంబంలో పుట్టి చెన్నై ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యా. చిన్న కులాల వాళ్లు ఉన్నత స్థానంలో ఉంటే జీరి్ణంచుకోలేరా..? రఘురామకృష్ణరాజు కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు. 2021లో జరిగినట్లు చెబుతున్న సంఘటనపై 2024లో కేసు నమోదు చేశారు. అందులో నా పాత్ర ఏమాత్రం లేకపోయినా ఇరికించారు. » హెచ్డీఎఫ్సీ బ్యాంకు మహిళా మేనేజర్ను అడ్డు పెట్టుకుని ఆయన (ఎస్పీ దామోదర్) ఎన్నో భూ దందాలకు పాల్పడితే ఇప్పటికీ విచారణ లేదు. ఇసుక, గ్రానైట్, మైనింగ్ దందాలకు పాల్పడితే విచారణ లేదు. ధోతీ కార్యక్రమం నిర్వహించి రూ.4 కోట్లు విలువైన బంగారం, బహుమతులు పొందితే నేటికీ విచారణ లేదు. కానీ లంబాడీ కులంలో పుట్టిన నేను ఐపీఎస్ అధికారిని కావడమే నేను చేసిన నేరమా..? అందుకే నాపై అక్రమ కేసు పెట్టారా? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఐడీ చీఫ్ పీవీ సునీల్కుమార్ పేర్లు చెప్పమని ఎంతోమంది నాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నాతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డులు, ఇతర ఆధారాలన్నీ నా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. తగిన సమయంలో ఆ ఆధారాలన్నీ బయటపెడతా. లంబాడీ కులంలో పుట్టిన నాకు మాట్లాడే హక్కు ఉండదనే అహంకారంతో వారు అలా వ్యవహరించారు. » పట్నాలో నా నివాసంలోకి అక్రమంగా ప్రవేశించిన ఏపీ పోలీసు అధికారి (ఎస్పీ దామోదర్) నిబంధనలకు విరుద్ధంగా, దురుసుగా వ్యవహరించారు. తన దగ్గర బాడీ కెమెరా ఉందంటూ మా ఇంట్లో అల్లరి చేశారు. ఆయనతో వచ్చిన పోలీసు అధికారులు నా తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అవమానపరిచారు. నా తల్లిని అవమానించిన అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతా. -
ధైర్యంగా ఉండండి..: వైఎస్ జగన్
సాక్షి కడప ప్రతినిధి: మంచి రోజులు ముందున్నాయని, అందరూ ధైర్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను కలిసి కష్టాలు చెప్పుకున్న వారికి భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాలతో నష్టపోయిన వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్ రాకతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల కోలాహలంగా మారింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పులివెందులకు చేరుకున్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. నేరుగా తన క్యాంపు కార్యాలయానికి విచ్చేసి మూడు గంటలకు పైగా ప్రజలతో మమేకమై మాట్లాడారు. క్యాంపు కార్యాలయంలో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. కార్యకర్తల కష్టసుఖాలు ఆరా తీస్తూ.. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితుల కష్టాన్ని వింటూ.. నేనున్నానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. తర్వాత ఇంటి వద్ద వేచి ఉన్న నాయకులతోనూ చర్చించారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరునా పలకరించడమే కాక ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కొంత మంది యువకులు జగన్ను దగ్గరి నుంచి చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని అభిమానంతో ముందుకు రాగా, వారి కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూ వారితో మాట్లాడారు.వైఎస్ జగన్ను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు కార్యాలయం వద్ద జన సందోహంవైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు భారీగా తరలివచ్చారు. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ఆవరణమంతా జన సంద్రంగా మారింది. పార్టీ అభిమానులు, కేడర్తోపాటు యువత, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ తరలి రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. యువకులు వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తించారు. వైఎస్ జగన్ వాహనంపై నుంచి అందరికీ అభివాదం చేస్తూ.. కరచాలనం చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ ముందుకు కదిలారు. కాగా, పార్టీనేతలు తదితరులు వైఎస్ జగన్ను కలిశారు. -
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి చెందడంతో పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. ‘తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ..ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. వెంటిలేటర్పై ఉన్న రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షణ చేయాలి.ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యం కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ది చెబుతారు. మృతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన (ఫోటోలు)
-
పులివెందుల చేరుకున్న జగన్
-
పులివెందులలో వైఎస్ జగన్
పులివెందుల(వైఎస్సార్ జిల్లా): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 24వ తేదీ) వైఎస్ జగన్ పులివెందులకు బయల్దేరి వెళ్లారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకోనున్నారు. పులివెందులలోని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.25వ తేదీ ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. -
జగన్ చేతుల మీదుగా రేపే నందీశ్వరాలయం ఓపెనింగ్
-
జీవో 746,747 జగన్ ప్రశ్నకు పలాయనం.. దొరికిన చంద్రబాబు
-
అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం
సాక్షి, అమరావతి: తిరుమల ఏడు కొండలు జీవో రద్దు హామీపై చంద్రబాబు అడ్డంగా దొరికేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం చిత్తగించి అభాసుపాలయ్యారు. వైఎస్ జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు దాటవేశారు.జీవోలు 746, 747 రద్దు చేస్తానంటూ గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధించే జీవోను రద్దు చేస్తానని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. అయితే, సభలో తాను చేసిన ఆ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించలేదు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను వైఎస్ జగన్ ఇటీవలే ప్రదర్శించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నైజం బట్టబయలైంది. -
YS జగన్ పులివెందుల టూర్ షెడ్యూల్ ఇదే
-
నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం పైన పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.25వ తేదీ ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. -
పులివెందులలో YS జగన్ ప్రజా దర్బార్
-
కల్తీ పాల మరణాలపై YS జగన్ రియాక్షన్
-
రేపటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపటి(మంగళవారం) నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండి ప్రజదర్బార్ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రేపు(మంగళవారం) పులివెందుల చేరుకున్నారు. ఈ క్రమంలో పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్లో పాల్గొంటారు. అలాగే, ఎల్లుండి(బుధవారం) వేంపల్లి మండలం నందిపల్లికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. నందిపల్లిలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. అనంతరం, మధ్యాహ్నం పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్కు వైఎస్ జగన్ హాజరు అవతారు. -
కల్తీ పాల ఘటన.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘ కల్తీ పాలు తాగి ఇప్పటికే నలుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురి కావడం విచారకరం. ఆహార భద్రతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిండి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి, బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని సూచించారు. అలాగే, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
జగన్ వర్సెస్ డర్టీ డజన్!
ఒక లక్ష్యం, దాన్ని సాధించడానికి అనుసరించే మార్గం... ఈ రెంటినీ చెట్టూ, విత్తుతో పోల్చారు మహాత్మాగాంధీ. మంచి విత్తు నాటితే ఆరోగ్యకరమైన చెట్టు ఎదుగుతుంది. విషపూరిత విత్తనం నాటితే ఆ చెట్టూ విషపు కాతే కాస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ ప్రధాన లక్ష్యమైనా అధికార సాధనే కావచ్చు. దాన్ని సాధించే ప్రయత్నం కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి. అడ్డదారిలో అధికారాన్ని అందుకునే ప్రయత్నాలను సహిస్తే కుక్క మూతి పిందెల పాలన చవిచూడవలసిన పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పుడీ దౌర్భాగ్యానికి ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద ఉదాహరణ ఇంకేదీ లేదు!అప్పటివరకూ తాము బండబూతులు తిట్టిన రాజకీయపక్ష నేతల చరణకమలాలనే కళ్లకద్దుకొని అవకాశవాద కూటమిని ఏర్పాటు చేసుకున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అంతటితో ఆగలేదు. అమలు చేయడం సాధ్యం కాదని తెలిసికూడా మోస పూరిత హామీలతో ‘సూపర్సిక్స్’ మేనిఫెస్టో ప్రకటించడం, ప్రజలను నమ్మించడం కోసం వీధివీధినా, గడపగడపనా గారడీ విద్యలు ప్రదర్శించడం కూడా తెలిసిన విషయాలే. వీటికంటే ఇంకో అతి భయంకరమైన విషయం కూడా ఉన్నదనే ఆరోపణలు, సహేతుకమైన అనుమానాలు క్రమక్రమంగా వెలుగు చూస్తున్నాయి.ఓట్ల పండుగ నాటి నిశిరాత్రి చీకటిలో ప్రజాస్వామ్యంపై క్రూరమైన అత్యాచారం జరిగిందనడానికి తార్కికమైన ఆధారా లను ఎన్నికల సంఘం సమాచార స్రవంతిలో నుంచే విశ్లేషకులు వెలికి తీస్తున్నారు. పోలింగ్ రోజు ప్రకటించిన ఓట్ల శాతం కంటే ఆ తర్వాత అసాధారణంగా ఓట్ల శాతం పెరగడంలోని అసంగతత్వాన్ని ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్డీ) అనే స్వచ్ఛంద సంస్థ అప్పుడే ప్రశ్నించింది. ఈ ఓట్ల తేడా అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 12.5 శాతంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉండటాన్ని గురించి కూడా ప్రశ్నించింది. అంతేకాదు, మరో స్వచ్ఛంద సంస్థ ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్’ (ఏడీఆర్)తో కలిసి ఢిల్లీలో ఒక సెమినార్ను కూడా నిర్వహించి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.‘ఓట్ చోరీ’ అనే పేరుతో అడపాదడపా ప్రతిపక్ష పాత్ర పోషించే రాహుల్ గాంధీ కూడా వీఎఫ్డీ సమాచారంతో ఒకటి రెండుసార్లు హడావిడి చేశారు. అయితే ఆయన ‘పోరాటం’ నుంచి ఏపీని మాత్రం మినహాయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్ గాంధీకి బలమైన బంధం ఉన్న కారణంగానే ఆయన ఓట్ చోరీ ఉద్యమంలోంచి ఏపీని డిలీట్ చేసి ఉంటారనే బలమైన అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువైన బీజేపీ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే కాంగ్రెస్ అధినేతతో చుట్టరికం కొనసాగిస్తూ అవకాశవాదాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన వ్యక్తి చంద్రబాబు.వీఎఫ్డీ వెలికి తీసిన పోలింగ్ నాటి విడ్డూరాలపై ప్రముఖ రాజకీయ–ఆర్థిక వ్యవహారాల నిపుణుడు పరకాల ప్రభాకర్ మరింత లోతైన అధ్యయనం చేశారు. ఆయన పరిశీలనలో వెల్లడైన దిగ్భ్రాంతికరమైన అంశాలతో ‘ది వైర్’ అనే స్వతంత్ర వెబ్సైట్కు ఒక వ్యాసం రాశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వ్యాసాన్ని బలపరిచే విధంగా ప్రఖ్యాత జర్నలిస్ట్ కరణ్ థాపర్ అదే వెబ్సైట్ కోసం పరకాల ప్రభాకర్ను ఇంటర్వ్యూ చేశారు. తాను ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనల్లోంచి తీసుకున్న సమాచారం ఆధారంగానే ఆనాటి ఎన్నికల విజయం సందేహాస్పదమైనదనే నిర్ధారణకు వచ్చినట్లు ప్రభాకర్ చెప్పారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘా నికి లేఖ రాసినప్పటికీ అక్కడ నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదని ఆయన వెల్లడించారు.పరకాల ప్రభాకర్ విశ్లేషించిన విషయాలు ఇలా ఉన్నాయి. 2024 మే 13వ తేదీన ఏపీలోని 25 లోక్సభ స్థానాలకు, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పది గంటల వ్యవధిలో 68.04 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. 6 గంటలకు పోలింగ్ గడువు ముగిసింది. ఈ లోపల అంటే 5 గంటల 59 నిమిషాలు, అంతకంటే ముందే పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో క్యూలైన్లో నిలబడిన వారికి స్లిప్పులు ఇచ్చి ఓటు ఓసే అవకాశాన్ని కల్పిస్తారు. రాత్రి 8 గంటల వరకు 68.12 శాతానికి పోలింగ్ పెరిగిందని ఈసీ ప్రకటించింది. ఇది 0.08 శాతం పెరుగుదల! ఓట్ల సంఖ్యలో చూస్తే 33,064 ఓట్లు. సాధారణంగా రాత్రి 8 గంటల తర్వాత ప్రకటించిన ఓట్ల శాతం దాదాపుగా ఫైనల్గా ఉంటుంది. మహా అయితే ఒకటీ, అర శాతం ఓట్ల పెరుగుదలతో మరుసటి రోజు ప్రకటించేవాళ్లు. కానీ, ఐదూ, ఎనిమిది గంటల మధ్య మహా మందకొడిగా అతి స్వల్పంగా ఓట్లు నమోదైనప్పటికీ ఇంకా పోలింగ్ కొనసాగుతున్నదని ఈసీ ప్రకటించింది.రాత్రి 11.45 నిమిషాల వరకు ఓట్ల శాతం 76.50 శాతానికి పెరిగినట్టు చెప్పారు. అంటే, 8.38 శాతం. 34,63,767 ఓట్లు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లో ఉన్నప్పుడు 8 గంటల లోపల ఓట్లు వేయకుండా ఏ ముహూర్తం కోసం ఎదురుచూసి ఒకేసారి ఎగబడ్డారో ఎన్నికల సంఘం వివరించలేదు. ఇంకా విడ్డూరమేమిటంటే ఆ తర్వాత కూడా 3,500 పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులు తీరి ఉన్నారట! ఒక్కో నియోజక వర్గానికి 20 బూత్ల చొప్పున లెక్క వేసుకొని ఓటర్లు బారులుతీరి నిలబడ్డారనుకోవాలి. ఈ బూత్లలో చివరి ఓటు 2 గంటలకు రికార్డయిందట! రెండు గంటల 15 నిమిషాల వ్యవధిలో 17,19,482 మంది ఓటేశారట! ఈ ఓటర్లందరూ సాయంత్రం 6 గంటలలోపే పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఉండాలి. ఆ తర్వాత అనుమతించరు కనుక!ఆ లెక్కన చివరి ఓటర్లు ఒకపూట ఉపవాసాన్ని పాటిస్తూ లఘుశంక కూడా తీర్చుకోకుండా 8 గంటలపాటు నడిరాత్రివేళ నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి వీరి వివరాలనూ, ఫొటోలనూ విడుదల చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించేందుకు ఎన్నికల సంఘం ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. చివరి రెండు గంటల పదిహేను నిమిషాల పాటు పోలింగ్ జరిగిన 3500 పోలింగ్ బూత్లలో సగటున 491 ఓట్లు పోలయ్యాయి. మొత్తం అన్ని బూత్లలో చూసుకుంటే సగటున 892 ఓట్లు పడ్డాయి. ఈ బూత్లలో నాలుగు వందల మంది ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.45 నిమిషాల మధ్యన ఓటు హక్కు వినియోగించుకుని 16 గంటల 45 నిమిషాల వ్యవధిలో ఓట్లు వేస్తే, 491 మంది మాత్రం నడిరేయి దాటిన తర్వాత రెండు గంటల పదిహేను నిమిషాల్లోనే ఓటేశారు. ఈ గారడీ లెక్కల్ని చూసిన తర్వాత కూడా ఎన్నికలు సక్రమంగానే జరిగాయని విశ్వసిద్దామా?సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పది రోజుల్లోనే వీవీ ప్యాట్లను ఎందుకు ధ్వంసం చేసినట్టు? ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటలదాకా, 11.45 వరకు, కొన్నిచోట్ల రాత్రి 2 గంటల వరకూ పని చేసినా కూడా వోటింగ్ మిషన్ల బ్యాటరీ కౌంటింగ్ రోజున 90 నుంచి 99 శాతంగా ఎందుకు మిగిలినట్టు? ఈ సందేహాలపై స్పందించకుండా ఎన్నికల సంఘం ఎందుకు మడి కట్టుకున్నట్టు? భారత ప్రజాస్వామ్యానికి అతి ప్రమాదకర మైన మంత్రాంగం ఏదో ఆనాటి అర్ధరాత్రి ప్రధానంగా ఏపీలోనే కేంద్రీకృతమై నడిచిందనడానికి ఇవన్నీ ఆధారాలు.ఈ మంత్రాంగానికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరై నప్పటికీ లబ్ధిదారులు మాత్రం ఏపీ కూటమి పార్టీలే! ఆ విషయం కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాత పోలైన 51,83,249 ఓట్లను 175 నియోజక వర్గాల నడుమ సమానంగా విభజిస్తే ఒక్కో సీటుకు 29,618 ఓట్లవుతాయి. ఇంతకంటే తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ దాదాపు 80 సీట్లను కోల్పోయింది. వీటికి తోడు గెలిచిన సీట్లు 11. అన్ని నియోజక వర్గాల్లో ఇలా సమాన విభజన జరిగి ఉండకపోవచ్చు. అగ్ర నాయకులకు భారీ మెజారిటీల కోసం కొన్నిచోట్ల ఎక్కువ ఓట్లు, బాగా నమ్మకమున్న సీట్లలో తక్కువ ఓట్లు పడి ఉండ వచ్చు. సీట్లు తక్కువైనా సరే, స్ట్రయిక్ రేట్ ఎక్కువ వుండా లనుకున్న సీట్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండవచ్చు. మొత్తంగా ఈ గణాంకాలు చెప్పేదేమిటంటే కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నట్టుగా వారికి ప్రజలు చరిత్రాత్మకమైన విజయాన్ని కట్టబెట్టలేదనీ, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తిరస్కరించలేదనీ! సందేహాలు నివృత్తి చేసే బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించుకోవడం అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తున్నది.తాము ఓటమిని రుద్దినప్పటికీ జనంలో జగన్ మోహన్రెడ్డి బలంగానే ఉంటాడన్న అంచనాతోనే అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే కూటమి సర్కార్ ఒక త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో పాయింట్ నెంబర్ వన్ – జగన్ మోహన్రెడ్డి వ్యక్తిత్వ హననం. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఆటోమేటిక్గా పార్టీ బలహీనపడుతుందని ఈ వ్యూహం. ఆయన పార్టీ పెట్టిన తొలిరోజు నుంచి గడచిన పదిహేనేళ్లుగా దీన్ని అమలు చేస్తూనే ఉన్నారు. రెండో అంశం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. దీని ద్వారా పార్టీ నాయకత్వం, కార్యకర్తల నైతికబలాన్ని దెబ్బతీసే ప్రణాళిక. ఈ ఇరవై మాసాల్లో రెండు డజన్ల మంది పార్టీ అభిమానులు రాజకీయ హత్యలకు గురయ్యారు. కీలక నాయ కులతో సహా అనేక డజన్ల మంది జైళ్లకు వెళ్లారు. అనేకమంది పోలీసుల టార్చర్కు గురయ్యారు. వందలాది మంది అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారు. ‘సాక్షి’ మీడియా సైతం నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నది.ఇక మూడో అస్త్రం – మతాన్నీ, దేవుడినీ రాజకీయ అవస రాలకు వాడుకొని మెజారిటీ ఓటర్లను జగన్కు దూరం చేయాలనే దిక్కుమాలిన ఎత్తుగడ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలకు సరఫరా చేస్తూ అక్కడి నాణ్యతా పరీక్షలో విఫలమై వెనక్కు వెళ్లిన నెయ్యి ట్యాంకర్లను మళ్లీ రప్పించి వాటి శాంపిళ్ల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి వాడారని చేసిన అతి తెలివి ప్రచారం నెమ్మదిగా జనానికి అర్థమైంది. టీటీడీకి స్వయంగా నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఉన్నదనే సంగతి తెలిసినా, ఆ పరీక్షలో నెగ్గితేనే ట్యాంకర్లను అనుమతిస్తారని తెలిసినా రాజకీయ ప్రయోజనం కోసం పవిత్రమైన తిరుమల లడ్డూను వివాదా స్పదం చేశారు. మరీ దారుణంగా పంది కొవ్వు కలిసిందనే నీతిబాహ్య ప్రచారానికి పాల్పడ్డారు. వ్యూహం బెడిసికొట్టింది. బాణం ఎదురు తిరిగి ముఖ్యమంత్రి ‘హెరిటేజ్’ కాంపౌండ్లోకే వెళ్లింది. ఇంకేయే విషయాలు బయటపడతాయో చూడాలి. దైవదూషణ ఫలితం మామూలుగా ఉండదు కదా! ముంబైలో కూడా ఏవో ‘హెరిటేజ్’ పేలుళ్లు వినబడుతున్నాయి.జగన్ మీద ఈ త్రిముఖ వ్యూహ దుష్ప్రచారంలో మూడు కూటమి పార్టీలు, ఒక పెంపుడు కాంగ్రెస్, నాలుగు ఛానెళ్లు,రెండు పత్రికలు, ఒక పెయిడ్ సోషల్ మీడియా, ఒక పేటీఎమ్ విశ్లేషణ బృందం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ పన్నెండు శక్తుల దాడులను జగన్మోహన్ రెడ్డి నిబ్బరంగా ఎదుర్కొంటున్న తీరు వైసీపీలో నూతనోత్తేజాన్ని నింపుతున్నది. రెండు గంటలైనా సరే, అంతకంటే ఎక్కువైనా సరే! ఎక్కడా అలసట లేకుండా తొట్రుపడకుండా డాక్యుమెంటరీ సాక్ష్యాలతో కూటమి కుట్రలను ఆయన తుత్తునియలు చేయగలుగుతున్నారు. మొన్న ఒక్కరోజే త్రిముఖ వ్యూహపు పన్నాగాలతో పాటు బడ్జెట్ డొల్లతనాన్ని, మేనిఫెస్టో మోసాన్ని ఆయన ఎండగట్టారు. ఈమధ్య లడ్డూ బాణం ఎదురు తిరిగిన తర్వాత యావత్తు మంత్రిమండలి కొలువు తీరి ఏర్పాటుచేసిన మీడియా సమా వేశంలో కనిపించిన విషణ్ణవదనాలను, ఆత్మవిశ్వాసంతో కూడిన జగన్ ప్రెస్మీట్లతో జనం పోల్చి చూస్తున్నారు. ఈ పోలిక చాలు... రాష్ట్ర రాజకీయాలు ఏ దిశలో పరుగు తీస్తున్నాయో తెలుసుకోవడానికి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వెరీ షేమ్.. కాంగ్రెస్ నేతలపై జగన్ ఫైర్
-
Bengaluru: నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
సాక్షి, బెంగళూరు: ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం (రాజమహేంద్రవరం) కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. బెంగళూరులోని ది లీలా భారతీయ సిటీ(తిరుమేనహళ్ళి)లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు నాగ ఉమా యజ్ఙిత, యశ్వంత్లను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. -
ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఏఐ సమ్మిట్లో నిన్న(శుక్రవారం, ఫిబ్రవరి 20) యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరు మనందరినీ సిగ్గుపడేలా చేసిందంటూ ట్వీట్ చేశారు. ‘‘అసలు మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి?. ఎవరూ మన దేశాన్ని ఎప్పుడూ కించపరచకూడదు. మన మధ్య రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా.. ప్రపంచం ముందు అందరం ఐక్యంగా ఉండాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.కాగా, ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) ఇంపాక్ట్ సదస్సులో ఎగ్జిబిషన్ హాల్ నంబర్–5 వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడం కలకలం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. హఠాత్తుగా టీ–షర్టులు విప్పేసి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఆయా టీ–షర్టులపై ముద్రించి ఉన్నాయి.Yesterday at the AI Summit, the Youth Congress made us all feel ashamed. Where is our politics heading! No one should ever demean our country. Whatever our political differences may be, we should always present a united face to the world.— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు కూడా ఉన్నాయి. ‘ఎప్స్టీన్స్ ఫైల్స్’, ‘మోదీ రాజీపడ్డారు’అనే వాక్యాలు కూడా ముద్రించారు. నిరసన తెలియజేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను సదస్సుకు హాజరైన కొందరు ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. -
మేకపాటి గౌతమ్ని స్మరించుకున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్థంతి నేడు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. తన మిత్రుడు మేకపాటి గౌతమ్ని స్మరించుకున్నారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘మన స్నేహం, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఒక స్నేహితుడిగా, సోదరుడిగా గుర్తుండిపోతారు’ అంటూ పోస్టు చేశారు. I will always cherish the fond memories of our friendship and camaraderie, dear Goutham. A friend and brother, you will always be remembered. pic.twitter.com/7IQQejf8gS— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026 -
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం.— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026 -
Vijayawada : జగన్ని కలిసిన బ్రహ్మానందం
-
నన్ను రాత్రి 2 గంటలకు నిద్రలేపి ఇద్దరు కానిస్టేబుల్ లు వచ్చి సంచలన నిజాలు బయటపెట్టిన అంబటి
-
జగనన్న బయట అడుగుపెడితే .. అనితకు చెంపచెళ్లుమనిపించిన వరుదు కళ్యాణి
-
వైఎస్ జగన్ను కలిసిన ప్రముఖ నటుడు బ్రహ్మానందం
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కలిశారు. గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బ్రహ్మానందాన్ని వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. కొంత సమయం పాటు సరదాగా మాట్లాడుకున్న వారిద్దరూ కలిసి ఫోటో దిగారు. View this post on Instagram A post shared by Ysrcpchief (@ysrcpchief) -
జగన్ ను కలిసిన అంబటి రాంబాబు
-
పబ్లిసిటీ పీక్.. పెర్ఫామెన్స్ వీక్.. ఏపీ బడ్జెట్ పై YS జగన్ రియాక్షన్
-
వైఎస్ జగన్ను కలిసిన అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో వైఎస్ జగన్ను కలిసి అంబటి మాట్లాడారు. అయితే, అక్రమ కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబు.. గురువారం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ వంటి అంశాలను వైఎస్ జగన్కు వివరించారు. ఈ క్రమంలో తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో అంబటితో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. -
TTD డిస్ క్వాలిఫై చేసిన ఇందాపూర్ కి.. 3 నెలల్లోనే అర్హత కల్పించిన చంద్రబాబు
-
చంద్రబాబుదే కల్తీ పాపం.. కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, వినియోగించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్
సూపర్ సిక్స్లో అతి ముఖ్యమైన హామీ.. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానన్నారు. దీనికి ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను వంచించారు. 50 ఏళ్లకే పింఛన్ అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేశారు. ఇలా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లలో మూడు ప్రధాన హామీలకు ఈ మూడు బడ్జెట్లలో అతీగతి లేదు. సున్నా బడ్జెట్. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా చూపిస్తూ చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్.. అంటూ ఏ రకంగా సంబరాలు చేసుకోమని చెబుతాడు? మీరే చెప్పండి. ఇది ధర్మమేనా.. న్యాయమేనా? అలాగే స్త్రీ శక్తి అంటూ ఉచిత బస్సు పథకానికి పేరు పెట్టారు. అమ్మవారు పేరు పెట్టి మోసం చేయగలిగే వ్యక్తి ఈ ప్రంపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే.ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు. కొత్త వాటికి కనీసం దరఖాస్తులు తీసుకోవడం లేదు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.50 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అదే మా హయాంలో ఆర్నెల్లకోసారి ఏటా జూన్, డిసెంబర్లలో అర్హులను గుర్తించి కొత్త పింఛన్లు ఇచ్చేవాళ్లం. కానీ ఈరోజు పరిస్థితి రివర్స్ అయ్యింది. 2014లో చంద్ర బాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 39 లక్షల పింఛన్లు ఉంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2024 మార్చి నాటికి 66 లక్షల పింఛన్లకు పెంచగలిగాం. కానీ చంద్రబాబు వచ్చిన రెండేళ్లకే 66 లక్షల నుంచి 60 లక్షలకు ఆ సంఖ్య తగ్గిపోయింది.చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అన్నీ మానవ తప్పిదాలే (మ్యాన్మేడ్ బ్లండర్స్). ఆయన సృష్టించిన ఈ సంక్షోభం వల్ల ఒక పద్దతి ప్రకారం ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమై పోయింది. ఈ క్రాప్ లేకుండా పోయింది. పద్దతి ప్రకారం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ఉచిత పంటల బీమాను తీసేశారు. ఏ ఒక్క రైతుకూ గిట్టుబాటు ధర లేదు. మా హయాంలో కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా రైతులను చేయిపట్టి నడిపించాం. ఈ క్రాప్ ద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమాను అమలు చేశాం. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేవాళ్లం. పైగా పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ అర్హుల జాబితాలను ఆర్బీకేలలో ప్రదర్శించే వాళ్లం. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న చంద్రబాబు ప్రజలకు ఏమైనా లబ్ధి చేకూరుస్తున్నారా అంటే ఏమీ లేదు. ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంతా మోసమే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులే ఇందుకు నిదర్శనం. మరో వైపు చేస్తున్న అప్పులన్నీ దోచుకో.. పంచుకో.. తినుకో.. అన్నట్టుగా కాజేస్తున్నారే తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు నీటి మీద రాతలు, మోసాలు కాకూడదన్నారు. మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలని చేసి చూపించామని చెప్పారు. కోవిడ్ లాంటి మహా సంక్షోభం ఉన్నప్పటికీ మనసా, వాచా, కర్మణా ఇచ్చిన హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక పవిత్రతను తీసుకొచ్చామని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘మేనిఫెస్టో అమలులో తొలిసారి సంస్కరణలు తీసుకొచ్చాం. ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల దగ్గరకు గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్లగలిగేలా చేశాం. కానీ చంద్రబాబు మేనిఫెస్టోకు ఇచ్చే విలువ ఏమిటో తెలుసా? గడిచిన రెండు బడ్జెట్లు, ఈ ఏడాది ప్రవేశ పెట్టిన మూడో బడ్జెట్లో కేటాయింపుల ద్వారా మేనిఫెస్టో అంటే తనకు ఎప్పటికీ ఒక చిత్తు కాగితమే అని రుజువు చేశాడు’ అని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాండ్లు పంచి పెట్టి మరీ వంచించారు » నిజంగా ఎన్నికలకు ముందు ఈ పెద్దమనిషి ఇంటింటికి వెళ్లి తానిచ్చిన హామీల అమలు కోసం ఏకంగా బాండ్లు పంచిపెట్టాడు. ప్రతి ఇంటికి ఏ పథకం కింద ఎంత వస్తుందో లెక్కలు గట్టి మరీ చూపించి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ప్రతీ కుటుంబాన్ని మోసగిస్తున్నాడు. సూపర్ 6.. సూపర్ 7 హామీలతో పాటు మేనిఫెస్టోలో వాళ్లిచ్చిన హామీలను వాళ్ల కరపత్రికలో ఏ విధంగా ప్రకటనలు ఇచ్చుకున్నారో మీరే చూడండి. ఈ మాఫియా ముఠా అంతా కలిసి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో చెప్పడానికి ఈ ప్రకటనలే నిదర్శనం. » ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువగళం పేరిట ప్రతి నెలా ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల ఆరి్థక సాయం. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, పాఠశాలకు వెళేŠాల్ల పిల్లలున్న తల్లులకు.. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ప్రతీ పిల్లాడికి రూ.15 వేలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా తానిచ్చిన హామీలకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి బాండ్లు ఇచ్చారు. (వీడియో ప్రదర్శించి చూపారు). నిత్య మోసగాడు.. నిత్య వంచకుడు » సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను కరపత్రాల రూపంలో పంచి పెట్టడమే కాదు.. తమ భజన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకున్నారు. ఈ పథకాలకు ఈ మూడు బడ్జెట్లలో ఏ మేరకు నిధులు కేటాయించారు.. ఏ మేరకు ఖర్చు చేశారో చెప్పమని చంద్రబాబును అడుగుతున్నా. యువగళం పేరిట ప్రతి నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున ఇస్తానన్న నిరుద్యోగ భృతి కోసం ఈ మూడు బడ్జెట్లలో కించిత్ ప్రస్తావన ఎక్కడైనా ఉందా? » నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలి. ఇందుకు ఈ మూడేళ్లలో బడ్జెట్లో రూ.21,600 కోట్లు కేటాయించాలి. కానీ తొలి రెండు బడ్జెట్లలో కేటాయించింది సున్నా.. ఈ మూడో బడ్జెట్లో ఇచ్చిందీ సున్నా. ఏడాదికి రూ.36 వేలు చొప్పున ఈ మూడేళ్లలో రూ.1.08 లక్షల చొప్పున ప్రతీ నిరుద్యోగికి బాకీ పడ్డాడు. నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇవ్వడం, చెత్త బుట్టలో వేయడం ఇదేమీ తొలిసారి కాదు.. 1999, 2014 ఎన్నికల మేనిఫెస్టోలలో కూడా కన్పిస్తుంది. ఇలా ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో ఈ హామీతో ఓట్లు వేయించుకోవడం, నిస్సిగ్గుగా ఎగ్గొట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. అందుకే యువత పట్ల చంద్రబాబు నిత్య మోసగాడు, నిత్య వంచకుడు. బాండ్లపై ఇదీ వాళ్ల ప్రతిజ్ఞ ఇంటింటికీ పంపిణీ చేసిన బాండ్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలు, పైగా ప్రతిజ్ఞ.. ఏమని చేశారో తెలుసా? (మాజీ మంత్రి కురసాల కన్నబాబు చదివి విన్పించారు)బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ.. ‘చంద్రబాబు అనే నేను.. రాష్ట్ర ప్రజలు నా పై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్కు గ్యారంటీగా ఉండే వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్రాభివృద్ధికి, ఉన్నతికి పునరంకితమవుతా’. ‘పవన్ కల్యాణ్ అనే నేను.. రాష్ట్ర ప్రజలు మా సమష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ–జనసేన పార్టీలు సంయుక్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్కు గ్యారంటీగా ఉండే వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, సహృదయంతో, సమన్వయంతో, సహకారంతో సమిష్టిగా కృషి చేస్తాను.’ప్రతి నెలా 25 వేల పింఛన్లు కట్» మిగిలిన పథకాల అమలు తీరు కూడా అరకొరే. ప్రతి నెలా పింఛన్ల పంపిణీనే చూడండి. చంద్రబాబు పబ్లిక్ మీటింగ్లు పెడుతూ ప్రతి నెలా పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రతి మీటింగ్కు 25 వేల పింఛన్లు కట్ చేస్తున్నాడు. 2024 ఎన్నికల నాటికి అంటే మార్చి నాటికి రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 66,34,372 కాగా, 2026 ఫిబ్రవరిలో 60,96,108 మందికి ఫించన్లు ఇచ్చారు. అంటే ఏకంగా 5,38,634 మందికి పింఛన్లు కట్ చేశాడు. » ఇంకా ఆశ్చర్యమేమిటంటే ఫిబ్రవరిలో ఇచ్చిన పింఛన్లకు ఇచ్చిన సొమ్ము రూ.2,632 కోట్లు. ఈ లెక్కన ఈ ఏడాది బడ్జెట్లో 12 నెలలకు రూ.31,554 కోట్లు కేటాయించాలి కదా.. కానీ కేవలం రూ.27,719 కోట్లు మాత్రమే పెట్టారు. ఈ లెక్కన ఈ మొత్తం 53,50,115 పింఛన్లకు మాత్రమే సరిపోతుంది. అంటే ఈ ఏడాది మరో 7,45,993 పింఛన్లు కట్ చేయడానికి సిద్దపడినట్లు చంద్రబాబు చెప్పకనే చెబుతున్నాడు.తల్లికి వందనం కాదు.. తల్లికి వంచన » తల్లికి వందనం పథకాన్ని కాస్తా తల్లికి వంచన పథకంగా మార్చేశారు. బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్నారు. రాష్ట్రంలో యూడీఐఎస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.15 వేల చొప్పున రూ.13,112 కోట్లు ఖర్చు అవుతుంది. » 2024–25లో ఈ పథకానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2025–26లో రెండో ఏడాది బడ్జెట్లో రూ.8,349 కోట్లు మాత్రమే కేటాయించారు. పైగా యూడైస్ డేటా ప్రకారం 20 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేశాడు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. తాజాగా బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో రూ.9,668 కోట్లు ఖర్చు చేస్తామని చూపించారు. కానీ కేటాయించింది మాత్రం రూ.8,456 కోట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది కూడా భారీగా పిల్లలకు కోత పడుతుందని చెప్పకనే చెప్పారు. ఉచిత గ్యాస్.. ఉచిత బస్సు అంతా మోసం » కడప నుంచి వైజాగ్కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆరీ్టసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశాడు. » రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. » సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ చిన్న హామీ. ఇక్కడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు. వీటికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలెండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలెండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. అన్నదాత సుఖీభవ పేరిట అన్నదాతలకు టోకరా » ప్రతి రైతు కుటుంబానికి పీఎం కిసాన్ (కేంద్రం ఇచ్చేది) కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు స్పష్టంగా చెప్పాడు. (వీడియో ప్రదర్శించారు). » ఈ లెక్కన 2023లో మా హయాంలో లబ్ధి పొందిన 53.58 లక్షల మందికి లెక్కిస్తే ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఏడాదికి రూ.10,717 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లు కలిపి గతేడాది రూ.40 వేల చొప్పున ఇవ్వాలి. కానీ అప్పుడొక రూ.5 వేలు, అప్పుడొక రూ.5 వేలు చొప్పున రూ.10వేలు ఇచ్చాడు. అంటే రూ.30 వేలు ఎగరగొట్టాడు. » వైఎస్సార్సీపీ హయాంలో 53.58 లక్షల మందికి రైతులకు ఇస్తే, చంద్రబాబు హయాంలో 46.85 లక్షల మందికి రూ.4,685 కోట్లు మాత్రమే ఇచ్చాడు. అంటే ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టాడు. పైగా ఈ పథకం కింద రూ.6,309 కోట్లు ఇచ్చేశామని అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఏడాదికి రూ.10,717 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.21,434 కోట్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది కేవలం రూ.4,685 కోట్లు. » అంటే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే రైతులకు ఈ రెండేళ్లకే రూ.16,749 కోట్లు బాకీ పడ్డారు. ప్రతి రైతుకు రూ.30 వేలు బాకాయి పడ్డాడు. కౌలు రైతులకైతే మొండి చేయి చూపించారు. మూడు బడ్జెట్లలో కూడా జీరో. మా హయాంలో రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున కౌలు రైతులకు ఇచ్చి ఆదుకున్నాం. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు పట్టాలివ్వడమే కాకుండా రైతు భరోసా కూడా ఇచ్చాం. ఇప్పుడు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు మూడు బడ్జెట్లలోనూ సున్నా. ఉచిత పంటల బీమాకు మంగళం » చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 17 సార్లు తుపానులు, అల్పపీడనాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు పుణ్యమా అని ఉచిత పంటల బీమా పథకం అటకెక్కింది. » పంటల బీమా కోసం 2024–25లో బడ్జెట్లో పెట్టింది రూ.60 లక్షలు.. ఖర్చు చేసింది సున్నా. 2025–26లో రూ.1,023 కోట్లు.. రైతులకు ఇచ్చిన పరిహారం సున్నా. ఈఏడాది బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.250 కోట్లు. » 2023–24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో ప్రభుత్వం కట్టాల్సిన రూ.834 కోట్లు ప్రీమియం బకాయిలు కట్టక పోవడంతో రైతులు రూ.1,324 కోట్ల మేర బీమా పరిహారాన్ని నష్టపోయారు. 2023–24 రబీలో ప్రీమియం సొమ్ములు కట్టిందా అంటే అదీలేదు. 2023–24, 2024–25 వ్యవసాయ సీజన్లకు సంబంధించి సుమారు రూ.3,500 కోట్ల మేర రైతులు నష్ట పోయారు. కిందా మీద పడి ప్రీమియం చెల్లించిన రైతులు సైతం రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన తమ వాటా ప్రీమియం కట్టకపోవడం వల్ల నష్టపోవాల్సి వచ్చింది. » వైఎస్సార్సీపీ హయాంలో రైతుల తరఫున కూడా ఏటా వారు చెల్లించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఐదేళల్లో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల బీమా లబ్ధి చేకూర్చాం. ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కూడా రైతులు ఇలానే ఇబ్బంది పడుతున్నారు. 2025–26లో మోంథా, దిత్వా తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2025–26 బడ్జెట్లో ఇన్పుట్ సబ్సిడీ కోసం కేటాయించింది సున్నా. రైతులకు ఇచ్చింది సున్నా. గతేడాది మోంథా తుపాను వల్ల 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే దాన్ని 4 లక్షల ఎకరాలకు కుదించారు. మొత్తంగా రూ.900 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. ధరల స్థిరీకరణ నిధి పేరిట దగా » చంద్రబాబు హయాంలో ఏ ఒక్క పంటకు ఏ ఒక్క రైతుకు గిట్టుబాటు ధర దక్కిన పాపాన పోలేదు. కనీసం మద్దతు ధర కూడా దక్కడం లేదు. ధాన్యం క్వింటాకు మద్దతు ధర రూ.2,369 కాగా, ప్రతి రైతు.. క్వింటా రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు మద్దతు ధర దక్కేలా చేయడమే కాదు.. గన్నీ బ్యాగ్, రవాణ, లేబర్ ద్వారా ప్రతి ఎకరాకు, ప్రతి క్వింటాకు అదనంగా రూ.252 చొప్పున మేలు జరిగేలా చేశాం. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.961 కోట్ల ధాన్యం బకాయిలను మేము అధికారంలోకి వచ్చాక చెల్లించాం. » ఈ ప్రభుత్వం దారుణంగా రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. ఇప్పుడు శనగకు కనీస మద్దతు ధర రూ.5,875 కాగా, రూ.5 వేలకు అమ్ముకుంటున్నారు. మా హయాంలో రూ.8 వేల ధర లభించేలా చేసి రైతులకు మేలు చేశాం. » ధరల స్థిరీకరణ నిధి కోసం 2024–25లో రూ.300 కోట్లు కేటాయించి, ఖర్చు చేసింది మాత్రం రూ.50.28 కోట్లే. 2025–26లో రూ.300 కోట్లు.. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్లలో రూ.340 కోట్లు ఖర్చు చేసినట్టుగా చూపిస్తున్నారు. నిజంగా ఖర్చు చేశారో లేదా ఆ దేవుడికే తెలియాలి. 2026–27 బడ్జెట్లో పెట్టింది రూ.500 కోట్లు.. కానీ మా హయాంలో రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఐదేళ్లలో రూ.7,756 కోట్లు ఖర్చు పెట్టాం. మార్కెట్లో పోటీ తీసుకొచ్చి రైతులకు మద్దతు ధర దక్కేలా మేలు చేశాం. ఆర్బీకేలు, ఏం యాప్ ద్వారా ధరలను పర్యవేక్షించే వాళ్లం. చంద్రబాబు సష్టించిన సంక్షోభమే» చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అన్నీ మానవ తప్పిదాలే (మ్యాన్మేడ్ బ్లండర్స్). అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇవ్వాల్సిన రూ.40 వేలకు గానూ రూ.30 వేలు ఎగ్గొట్టారు. 2025లో చంద్రబాబు లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వమే ప్రకటించింది. నమోదు కానీ మరణాలు ఇంకెన్ని ఉన్నాయో చెప్పలేం.» దురదృష్టవశాత్తు ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు గతంలో రూ.2 లక్షలున్న పరిహారాన్ని మా హయాంలో రూ.7 లక్షలకు పెంచి ఆ రైతు కుటుంబాలకు అండగా నిలిచాం. ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొంటే.. మరుసటి రోజే కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ నేరుగా ఆ రైతు కుటుంబం వద్దకు వెళ్లేవారు. విచారణ జరిపి 48 గంటల్లోనే ఆ కుటుంబం చేతిలో రూ.7 లక్షలు చెక్ పెట్టేవాళ్లు. ఇలా మా హయాంలో 1,323 రైతు కుటుంబాలను ఆదుకున్నాం. అంతేకాదు చంద్రబాబు హయాంలో 474 రైతు కుటుంబాలకు కూడా రూ.5 లక్షల చొప్పున పరిహారం మేము ఇచ్చాం.ప్రతి అక్కా చెల్లెమ్మకు రూ.54 వేలు బాకీ » సూపర్ సిక్స్లో మరో అతి ముఖ్యమైన హామీ.. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. » వీరికి నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ప్రతి ఏటా రూ.32,400 కోట్లు చొప్పున బడ్జెట్లో కేటాయించాలి. ఈ పథకం కింద మొదటి రెండు బడ్జెట్లలో ఈ అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది సున్నా. మూడో బడ్జెట్లోనూ ఇచ్చేది సున్నా. మూడేళ్లకు కలిపి అక్కచెల్లెమ్మలకు బాకీపడ్డ సొమ్ము అక్షరాలా రూ.97,200 కోట్లు. ఈ స్కీమ్ కింద ఈ మూడేళ్లలో అక్కచెల్లెమ్మలకు రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు.50 ఏళ్లకే పింఛన్ అంటూ వంచన సూపర్ సిక్స్లో ఇచ్చిన మరో హామీ 50 ఏళ్లకే పింఛన్. ప్రతి నెలా రూ.4 వేలంటూ హామీ ఇచ్చారు. అంటే సంవత్సరానికి ఒక్కొక్కరికి రూ.48 వేలు ఇవ్వాలి. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. వాళ్లకు నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లవుతుంది. ఈ లెక్కన మూడేళ్లలో రూ.28,800 కోట్లు కేటాయించాలి. కానీ మూడు బడ్జెట్లలో కేటాయించింది సున్నా.» ప్రతి ఒక్కరికి నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.48 వేలు. అంటే మూడేళ్లకు రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. -
త్రిశంకుస్వర్గంలో ఉన్నత విద్య
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పిల్లల చదువులపై చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలపై స్పష్టత లేకుండా చేసి చదువులను త్రిశంకు స్వర్గంలో పెట్టారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ను ఒక త్రైమాసికం ముగిసిన వెంటనే మరో త్రైమాసికంలో తల్లుల ఖాతాల్లో వేసేవాళ్లం. 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో నిధులు విడుదల చేసేవాళ్లం. అయితే 2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది.మే 13 పోలింగ్ జరిగింది. అంతే, అక్కడితో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఏడాది మార్చి నాటికి 9 త్రైమాసికాలకు విద్యా దీవెనకు రూ.6,300 కోట్లు చెల్లించాలి. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన కింద రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. ఎన్నికల పుణ్యంతో అది కూడా ఆగిపోయింది. 2024–2025 ఏప్రిల్ వరకు కలిపి రూ.2,200 కోట్లు వసతి దీవెన చెల్లించాలి. విద్యా దీవెన, వసతి దీవెన కలిపితే రూ.8,500 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,771 కోట్లు మాత్రమే విడుదల చేశారు.ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోందని మరో రూ.1,200 కోట్లకు బీఆర్వోలు ఇచ్చారు. బీఆర్వో ఇచ్చిన వెంటనే పేమెంట్ ఇచ్చినట్టు కాదు. కాలేజీల ఖాతాల్లో కేవలం రూ.300 కోట్లు మాత్రమే పడ్డాయి. అంటే రెండేళ్లలో బాబు ఇచ్చింది రూ.2,071 కోట్లే. ఇంకా రూ.6,428 కోట్లు బాకీ పడ్డారు’ అని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రూ.35,209 కోట్లతో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు ⇒ అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించి 10 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు తన మేనిఫెస్టోలో పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మూడు బడ్జెట్లలోనూ గజం స్థలం కొనడానికి పైసా కేటాయించ లేదు. ఒక్కరికి కూడా సెంటు భూమి పట్టా ఇవ్వలేదు. ⇒ పైగా మా హయాంలో 10 లక్షల ఇళ్లు పూర్తి చేసిన తర్వాత మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉంటే, వాటిని కూడా తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నాడు. 2024–25లో రూ.4,012 కోట్లు బడ్జెట్ పెట్టి రూ.1,548 కోట్లు ఖర్చు చేశారు. 2025–26లో రూ.6,300 కోట్లు (రివైజ్డ్ అంచనాలు) పెడితే రూ.1,928 కోట్లు ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారు గానీ, వాస్తంగా ఖర్చు చేసింది రూ.200 కోట్లు మాత్రమే. ⇒ వైఎస్సార్సీపీ హయాంలో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు ఖర్చు పెట్టి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశాం. నాడు–నేడుకు ఉరి ⇒ ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా మేము దేశంలోనే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తే దానికి చంద్రబాబు ఉరి వేశారు. తొలి విడతలో 15,713 స్కూళ్లలో పనులు చేస్తే, రెండో విడతలో 22,312 స్కూళ్లలో దాదాపు పూర్తి చేసే దశకు తీసుకొచ్చాం. నాడు–నేడుకు రూ.8,524 కోట్లు మా ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశామని చంద్రబాబు ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. ⇒ మరో రూ.4–5 వేల కోట్లు ఖర్చు పెడితే నాడు–నేడు పనులు అయిపోతాయి. కానీ, చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని మూలన పడేశారు. ఆయన సుపుత్రుడి శాఖలో నాడు–నేడు కోసం 2024–25లో రూ.285 కోట్లు ఖర్చు చేస్తే, 2025–26లో రూ.1,500 కోట్లు కేటాయించి రూ.259 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు గానీ, ఎంత ఖర్చు చేస్తారో చూడాలి. ⇒ ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్సీ, ఐబీ, టోఫెల్ నిలిపివేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం, ట్యాబులు, నాడు–నేడు ఎగిరిపోయాయి. సబ్జెక్టు టీచర్ విధానానికి మంగళం పాడేశారు. గోరుముద్ద పిల్లలు తినకుండా చేస్తున్నారు. కలుషిత నీరు తాగి, నాణ్యత లేని ఆహారం తిని 900 మంది పిల్లలు ఆస్పత్రుల్లో చేరారని జాతీయ పత్రికల్లోనూ వార్తలొస్తున్నాయి. ఇంత దారుణంగా విద్యా రంగాన్ని నడుపుతున్నారు.ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు రూ.330 కోట్లు చొప్పున ఏడాదికి రూ.4 వేల కోట్లు వ్యయం చేయాలి. 2024–25, 2025–26 రెండేళ్లకు రూ.8 వేల కోట్లు వెచ్చించాలి్సన చోట చంద్రబాబు 2024–25లో రూ.2,259 కోట్లు, 2025–26లో రివైజ్డ్ అంచనాలు ప్రకారం రూ.3 వేల కోట్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ, నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ మాత్రం రూ.2,600 కోట్లే ఇచ్చినట్టు చెబుతోంది. ఇంకా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3,141 కోట్ల బకాయిలు పెట్టింది. 2026–27లో రూ.4 వేల కోట్లతో కలిపితే మొత్తం రూ.7,200 కోట్లు ఆర్యోశ్రీకి అవసరం. వీళ్ల బడ్జెట్ చూస్తే పేదలను బతికించేలా కనిపించట్లేదు. 2026–27 విద్యా సంవత్సరంలో నాలుగు త్రైమాసికాలకు (త్రైమాసికానికి రూ.700 కోట్లు) రూ.2,800 కోట్లతో పాటు వచ్చే ఏప్రిల్లో వసతి దీవెనకు రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వ్యయం చేయాలి. దీనికి రూ.6,428 కోట్ల బకాయిలు కలిపితే రూ.10,328 కోట్లు నిధులు కావాల్సి ఉంది. అయితే బడ్జెట్లో పెట్టింది మాత్రం రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలాగైతే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? అసలు చదివే పరిస్థితి ఉంటుందా?వైఎస్సార్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా భూముల కొనుగోలు కోసం రూ.11,871 కోట్లు, ఇళ్ల నిర్మాణాలకు రూ.20,338 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు ఖర్చు పెట్టి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశాం. ఇదే విషయంపై సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో లోక్సభ సమావేశాల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. – వైఎస్ జగన్మహిళలకు రుణ పరపతిలో క్షీణత ⇒ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి మూడు బడ్జెట్లలో అతీగతి లేదు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించి ఇవ్వకపోగా.. ఇంతకు ముందు ఇచ్చేది కూడా ఆపేశారు. వైఎస్సార్సీపీ హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత ద్వారా 26,98,931 మందికి రూ.19,189 కోట్లు, ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు, కాపు నేస్తం కింద 3,58,613 మందికి రూ.2,029 కోట్లు, ఈబీసీ నేస్తం కింద 4,95,269 మందికి రూ.1,876 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ⇒ స్త్రీలను శక్తిమంతులను చేసేలా వారి సాధికారత కోసం వైఎస్సార్సీపీ హయాంలో చర్యలు చేపట్టాం. మేము అక్కచెల్లెమ్మల బాగు కోసం పరితపించి వారిని నిలబెట్టే కార్యక్రమం చేస్తే, చంద్రబాబు ప్రభుత్వంలో విచిత్రంగా పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది. నాబార్డ్ డేటా చూస్తే.. 2023–24లో మహిళలకు రూ.49,626 కోట్లు పొదుపు రుణాలు ఉంటే, చంద్రబాబు హయాంలో 2025–26 పది నెలల్లో (డిసెంబర్ వరకు) రూ.30,698 కోట్లకు పడిపోయింది. దానికి ముందు ఏడాది 2024–25లో రూ.41 వేలుగా ఉంది. మహిళలకు బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడంతో పరపతి తగ్గిపోతోంది.స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామంటూ చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీఉద్యోగులకు పైసా జీతం పెరగలేదు ⇒ చంద్రబాబు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు. మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. మూడు బడ్జెట్లు పెట్టినా ఉద్యోగులకు ఒక్క పైసా జీతం పెరగలేదు. గతంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇచ్చాం. ఆ తర్వాత పీఆర్సీ కమిషన్ వేసి చైర్మన్ను నియమిస్తే వీళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చైర్మన్ను తీసేశారు. ⇒ ఆయన త్వరగా రిపోర్టు ఇస్తే వెంటనే జీతాలు పెంచాలనే భయంతో, ఒకవైపు ఐఆర్ ఇవ్వకుండా మరో వైపున పీఆర్సీ చైర్మన్ తొలగించి, కొత్త పీఆర్సీని నియమించకుండా ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఇప్పటికీ నాలుగు డీఏలు పెండింగ్, ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, ఒకటో తేదీ జీతాల ముచ్చట ఒక నెలతోనే అయిపోయింది. ⇒ జీపీఎఫ్, ఏపీజీఎస్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవుల కింద దాదాపు రూ.35 వేల కోట్లు ఉద్యోగులకు బకాయిలు పడ్డారు. 2024–25లో ఉద్యోగుల జీతాలు రూ.62,806 కోట్లు అయితే, 2025–26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రూ.61,111 కోట్లు. అంటే జీతాలు పెరగాల్సింది పోయి తగ్గాయి. కొద్దో గొప్పో ఉద్యోగులు రిటైర్ అయ్యి ఉంటారు. హెచ్ఆర్ఏ 2024–25లో రూ.4,614 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.4,600 కోట్లకు తగ్గింది. మెడికల్ రీయింబర్స్మెంట్ రూ.124 కోట్ల నుంచి రూ.121 కోట్లకు పడిపోయింది. అలవెన్సులు, ఈఎల్, ఎస్టీసీ, ఓవర్టైమ్ అలవెన్స్లు రూ.2,415 కోట్లు అయితే ఇప్పుడు రూ.1,316 కోట్లకు క్షీణించింది. ఉద్యోగుల బేసిక్ పే రూ.35,671 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.35,345 కోట్లుగా మాత్రమే ఉంది. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, ఐఆర్, అలవెన్స్ చెల్లింపు తదితరాలపై మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు.. -
అంకెలతో మోసం.. ప్రతి అడుగులో పతనం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అవే పచ్చి అబద్ధాలు.. తప్పుడు లెక్కలు.. చంద్రబాబు భజన.. బడ్జెట్ అంతా మోస మే..! అని టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్ల ద్వారా రాష్ట్రానికి, ప్రజల కు చంద్రబాబు చేసిన మంచి ఎక్కడా కనిపించద ని.. అంతా మోసమేనని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్, సెవెన్ హామీలను అమలు చేయలేక.. అట్టర్ ప్లాప్ అయినా, సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘మోసానికి షర్టు, ఫ్యాంట్ వేస్తే అది చంద్రబాబు. అబద్ధాలకు రెక్కలు కడితే అవి చంద్ర బాబు మాటలు’’ అని విమర్శించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో అంకెల గారడీ, ప్రజలను మోసగిస్తున్న తీరును నిలదీశారు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో పొందుపరిచిన గణాంకాలను ఉటంకిస్తూ బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాల్లో తప్పుడు లెక్కలను ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..ఫ్యాబ్రికేటెడ్ అంకెలతో డప్పు..ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడిచి వంచిస్తూ చంద్రబాబు ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టింది. తాను ఇస్తానన్న సూపర్ సిక్స్, సెవెన్, మ్యానిఫెస్టో హామీలు గాలికి ఎగిరిపోయాయి. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. రాష్ట్ర ప్రగతి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతాయి.. వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం గడప కూడా దాటని పరిస్థితి కని పిస్తుంది. చంద్రబాబు పాలనంతా పబ్లిసిటీ పీక్, ఫెర్మామెన్స్ వీక్. 2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు (జీఎస్డీపీ) 11.75 శాతంగా చంద్రబాబు చెప్పుకొస్తారు. దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 9.8% మాత్రమేనని.. దేశం కంటే రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతోందంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారు. ఇక 2025–26 రాష్ట్ర జీఎస్డీపీ గ్రోత్రేటు 10.75 శాతంగా తన ఆఫీసులో కూర్చుని అంకెలు రాసుకుంటారు. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8 శాతమేనని.. దేశం కంటే ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తోందంటూ తన డబ్బా తానే మోగించడం మొద లుపెడతారు. ఫ్యాబ్రికేటెడ్ (మోసపూరిత) అంకెలతో తన డప్పు తానే కొట్టుకోవడం మనకంతా కనిపిస్తూనే ఉంది. అసమర్థ ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా?రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటులో ఉంది అంటే.. రాష్ట్రంలోని అన్ని రంగాలు పురోగతి సాధిస్తున్నాయని అర్థం. వ్యవసాయం, తయారీ, సేవలు రంగాలు వేగంగా పరిగెడుతున్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఆ లెక్కలు నిజమే అయితే.. జీఎస్డీపీ ఆ విధంగా పెరిగి ఉంటే అది ప్రజల తలసరి ఆదాయంలో కూడా ప్రతిబింబించాలి కదా? అదే రీతిలో తలసరి ఆదాయం పెరిగి ఉండాలి కదా? తలసరి ఆదాయం నిజంగానే పెరిగి ఉంటే.. తద్వారా ప్రజల కొనుగోళ్ల శక్తి కూడా పెరిగి ఉండాలి కదా? తద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయాలు కూడా పెరిగి ఉండాలి కదా? ఇదంతా ఒక సైకిల్! మరి వాస్తవంగా ఇది జరిగిందా..? అని ఒకసారి పరిశీలిస్తే.. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలి సంవత్సరం 2024–25లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,19,927 కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పారు. కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ.94,937 కోట్లు మాత్రమే. ఆశ్చర్యం ఏమిటంటే.. 2023–24 వైఎస్సార్సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.93,084 కోట్లతో పోలిస్తే.. పెరుగుదల కేవలం 1.99 శాతం మాత్రమే. అంటే బడ్జెట్లో చంద్రబాబు లెక్కలేసిన రూ.1,19,927 కోట్లు గాలికి ఎగిరిపోయాయి. ఇక 2025–26లో కూడా వాస్తవంగా రూ.94,937 కోట్లు వచ్చినట్లు కనిపిస్తుంటే.. బడ్జెట్ గారడీతో రాష్ట్ర సొంత ఆదాయాలు రూ.1,27,703 కోట్లుగా చంద్రబాబు చూపించారు. కానీ.. పది నెలలకు సంబంధించి కాగ్ విడుదల చేసిన డేటా చూస్తే 2025–26లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.75,964 కోట్లు మాత్రమే వచ్చింది. అదే అంతకుముందు పది నెలల కాలానికి (2024–25) వచ్చింది రూ.72,864 కోట్లు. అంటే.. పెరుగుదల కేవలం 4.25 శాతం మాత్రమే. పది నెలల కాలానికి రూ.75,964 కోట్ల ఆదాయం వస్తే.. బడ్జెట్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఏకంగా రూ.1,27,703 కోట్లు వస్తుందని చూపించారు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా వాస్తవాలు చెప్పకుండా.. ఇంకా మోసం చేస్తూ దాన్ని రూ.1,12,349 కోట్లుగా సవరించారు. అంటే.. మిగిలిన రెండు నెలల కాలంలో ఏకంగా రూ.36,385 కోట్ల మేర ఆదాయాలు వస్తాయని గారడీ లెక్కలు చూపించారు. 2025–26లో రాష్ట సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున రూ.7,596 కోట్లే. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే ఈ ఏడాది మొత్తం మీద రూ.95,000 కోట్లు వస్తే గగనం. కానీ ఈ పెద్ద మనిషి మళ్లీ 2026–27లో రాష్ట్ర సొంత ఆదాయాలు ఏకంగా రూ.1,37,320 కోట్లు వస్తాయని చూపిస్తున్నారు. అంటే రాష్ట్ర సొంత ఆదాయంలో దాదాపు 45 శాతం పెరుగుదల!! అది సాధ్యమేనా? గత బడ్జెట్లో కూడా ఇలాగే చూపిస్తే వచ్చిన వృద్ధి రేటు కేవలం 3.4 శాతమే. దేశంలో చిట్ట చివరి నుంచి రెండో స్థానం..నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) మొదటి తొమ్మిది నెలలు రాష్ట్ర సొంత పన్నుల ఆదాయాలను మా ప్రభుత్వ హయాంలో 2023–24 తొమ్మిది నెలల ఆదాయాలతో పోలిస్తే సగటు వృద్ధిరేటు 1.97 శాతం మాత్రమే. ఈమధ్య కాగ్ 23 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను విడుదల చేసింది. ఈ రెండేళ్లలో సొంత పన్నుల ఆదాయాల వృద్ధిని పరిశీలిస్తే సగటున 1.97 శాతంతో మన రాష్ట్రం దేశంలో 23 రాష్ట్రాల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. బాబు అసమర్థత ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా? -
ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
-
దేవుడితో పెట్టుకున్నాడు చుక్కలు చూస్తున్నాడు
-
Tirumala : రెండు కాదు ఏడు కొండలే.. అసలు నిజాలు బయటపెట్టిన జగన్
-
జగనన్న కాలనీల కోసం.. అక్కచెల్లెమ్మలకు ఏకంగా 35,210 కోట్లు ఇచ్చాం
-
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఉరి.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇక దేవుడికే తెలియాలి
-
ఏమయ్యా అచ్చెన్న.. 6,309 కోట్లు ఇచ్చావా ..? సిగ్గుందా కొంచెమైనా..!
-
YS Jagan: ఒక్క 2025 లోనే 2685 మంది రైతులు ఆత్మహత్య
-
ఉద్యోగులకు భారీ మోసం.. రెండేళ్లుగా జీతాలు పెరగలేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదన్నారు. పాఠశాలల్లో నాడు-నేడును గాలికి వదిలేయడంతో కలుషిత నీరు తాగి 900 మంతి పిల్లలు ఆసుపత్రుల్లో చేరారని తెలిపారు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి తగ్గిందని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.4000 కోట్లు అవసరం. రెండేళ్లలో ఆర్యోగ్రశ్రీకి రూ.3,141 కోట్లు బకాయిలు పడ్డారు. మేము పీఆర్సీ చైర్మన్ను నియమిస్తే.. బాబు తీసేశారు. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్.. ఐఆర్, పీఆర్సీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.35వేలు బకాయి పడ్డారని అన్నారు. ఏపీలో ప్రభుత్వ సూల్స్లో నాడు-నేడుకు చంద్రబాబు ఉరేశారు. స్కూల్స్లో నాడు-నేడు కింద మేము రూ.8,524 కోట్లు ఖర్చు చేశాం. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం 2024-25లో ఖర్చు చేసింది రూ.285 కోట్లు మాత్రమే. 2025-26లో బాబు ఖర్చు చేసింది రూ.259 కోట్లు మాత్రమే ఉంది. నాడు-నేడును గాలికి వదిలేయడంతో కలుషిత నీరు తాగి 900 మంతి పిల్లలు ఆసుపత్రుల్లో చేరారు. జాతీయ మీడియా ఈ కథనాలను ప్రచురించింది.మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నాడు. రూ.3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతామన్నాడు. ఇప్పుడు వడ్డీలేని రుణాల ప్రస్తావనే లేదు. మా హయాంలో వైఎస్సార్ ఆసరా కింద రూ.25,570 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.2229 కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం కింద రూ.1876 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత కింద రూ.19,198 కోట్లు ఇచ్చాం. మేము లక్షలాది అక్కాచెల్లమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. 21లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేశాం. ఇళ్ల నిర్మాణం కోసం రూ.35210 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి తగ్గింది. మా హయాంలో పొదుపు సంఘాల రుణాలు 49,926 కోట్లకు పోతే.. చంద్రబాబు హయాంలో 30,698 కోట్లకు పడిపోయింది’ అని చెప్పుకొచ్చారు. -
బాబు మీటింగ్ అంటే.. 25000 పెన్షన్లు కట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్దారులను భారీగా తొలగిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కొత్త పెన్షన్లకు దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదన్నారు. అలాగే, ఈ ఏడాది కూడా తల్లికివందనం పథకంలో భారీగా కోత విధించబోతున్నారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. యువగళం పేరుతో నిరుద్యోగ యువతను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. 20 లక్షల మందికి లక్షా 44వేల కోట్లు బాకీ పడ్డారు. సూపర్ ఫ్లాప్ సినిమా చూపిస్తూ.. బాబు హిట్ అంటున్నాడు. చంద్రబాబు ప్రతీ మీటింగ్కు 25వేల పెన్షన్లు కట్. మా ప్రభుత్వంలో మేము 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. బాబు ప్రభుత్వంలో 18 నెలల్లోనే 5,38,636 పెన్షన్లు కట్ చేశారు. ఈ ఏడాది 7,45,993 పెన్షన్లు కట్ చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త పెన్షన్లకు దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ఇప్పటికే రెండు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు అప్డేట్ అయ్యేవి. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఉండేవి. 2024 నాటికి మేము 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇచ్చాం.తల్లికివందనంలో మోసమే.. యూడీఐఎస్ఈ డేటా ప్రకారం మేము దిగిపోయే నాటికి ప్రభుత్వ స్కూల్స్లో 87,41,885 మంది పిల్లలున్నారు. ప్రతీ పిల్లాడికి చంద్రబాబు 15000 చొప్పున ఇస్తానన్నాడు. బడ్జెట్ ప్రకారమే రూ.13,112 కోట్లు ఇవ్వాలి. 2024-25లో తల్లికి వందనం పూర్తిగా ఎగ్గొట్టారు. 2025-26లో కొందరికే ఇచ్చారు. అది కూడా పూర్తిగా కాదు. ఇప్పటి బడ్జెట్లో రూ.8456 కోట్లు మాత్రమే తల్లికి వందనానికి చూపించారు. అంటే ఈ ఏడాది కూడా భారీగా కోత విధించబోతున్నారు.మహిళలకు వంచనే..మహిళకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు?. మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అందులో కూడా షరతులు పెట్టారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లలో సూపర్ 6, సూపర్ 7పై కించిత్ ప్రస్తావనలేదు. యువగళం పేరుతో నిరుద్యోగ యువతను మభ్యపెట్టారు. ఇలా హామీల పేరుతో ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు. అలా మోసం చేసిన వారిలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అని ఎద్దేవా చేశారు.రైతులకు 20వేలు ఎక్కడ?ఎన్నికల సమయంలో ప్రతీ రైతుకు చంద్రబాబు రూ.20వేలు ఇస్తానన్నాడు. కేంద్రం ఇచ్చింది కాకుండా రూ.20వేలు ఇస్తానని చెప్పాడు. 2024-25లో పూర్తిగా ఎగ్గొట్టాడు. రెండేళ్లకు కలిసి 40వేలకు బదులుగా రూ.పది వేలే ఇచ్చాడు. మా ప్రభుత్వ హయాంలో 53,58,000 మందికి రైతుభరోసా ఇస్తే చంద్రబాబు మాత్రం ఏడు లక్షల మంది రైతులకు కట్ చేశాడు. ఏడాదికి రూ.10,717 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లకు కలిపి 21431 కోట్లకు గాను ఇచ్చింది 4000 వేల కోట్లు మాత్రమే. ప్రతీ రైతుకు చంద్రబాబు 30వేలకు పైగా బాకీ పడ్డాడు. మేము కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇచ్చాం. పట్టాలిచ్చి మరీ గిరిజనులకు రైతుభరోసా ఇచ్చాం’ అని వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఎంఎస్పీ లేదు...ఉచిత పంటల బీమాతో మేము రైతులకు తోడుగా ఉన్నాం. చంద్రబాబు మాత్రం 2024-25 బడ్జెట్లో 60 లక్షలే పెట్టారు. 2025-26లో 1023 కోట్లు పెట్టారు. ఇచ్చింది మాత్రం సున్నా. 2026-27 బడ్జెట్లో రూ.250 కోట్లు మాత్రమే పెట్టారు. ఐదేళ్ల కాలంలో మేము 7802 కోట్లు ప్రీమియం కట్టాం. రైతులపై మేము ఎలాంటి భారం పడనివ్వలేదు. మోంథా తుపానులో 10 లక్షల ఎకరాలు నష్టపోతే చంద్రబాబు మాత్రం నాలుగు లక్షల ఎకరాలే చూపించారు. బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఎంఎస్పీ లేదు. మేము గతంలో ఆర్బీకేలతో రైతులకు తోడుగా నిలబడ్డాం. ఆర్బీకేలతో మేము ఎప్పటికప్పుడు పంటను కొనుగోలు చేశాం. 21 రోజులలోపే రైతుకు డబ్బు జమ చేసే వాళ్లం. ధరల స్థిరీకరణ కోసం మేము రూ.7756 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు మాత్రం 900 కోట్లే బడ్జెట్లో పెట్టారు. దానిలో ఎంత ఖర్చు పెట్టారు అనేది దేవుడికే తెలియాలి. ఆర్బీకే, ఈక్రాప్ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. దళారీ వ్యవస్థను తీసుకొచ్చి రైతుల పొట్ట కొడుతున్నారు. చంద్రబాబు లెక్కల ప్రకారం.. 2025లో 393 మంది రైతులు, 2472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కాకుండా రికార్డుల్లో నమోదు కాని ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయి. -
50 ఏళ్లకే పెన్షన్.. అవ్వను పట్టుకోని ఫోటో దిగి..! జగన్ మాస్ ర్యాగింగ్
-
ఇంటింటికీ వెళ్లి..! రెండు బాండ్లు.. రెండు ఫోటోలు.. 6 గ్యారెంటీలపై జగన్ సెటైర్లు
-
బాబు అప్పుల చిట్టా..! ఆధారాలతో బట్టబయలు చేసిన జగన్
-
నిరుద్యోగులకు 3000, మహిళలకు 1500.. బడ్జెట్లో సున్నా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికలకు ముందు బాండ్లు ఇచ్చి మరీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ప్రతీ మహిళలకు నెలకు 1500 ఏమైంది? అని ప్రశ్నించారు. అప్పులు తెచ్చిన డబ్బు అంతా ఎక్కడికి పోతుంది?. సూపర్ సిక్స్ సక్సెస్ అని ఎలా చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. పథకానికి అమ్మవారి పేరు పెట్టి మహిళల్ని మోసం చేసి ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను నెరవేర్చలేదు. సూపర్ సిక్స్ సూపర్ అని గోబెల్స్ ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. బాబు పాలనలో ప్రతీ అంశంలోనూ మోసమే కనిపిస్తుంది. మోసానికి ప్యాంట్, షర్టు వేస్తే అది చంద్రబాబు. బాధ్యత గల పదవిలో ఉండి బాబు అబద్ధాలు ఆడుతున్నారు. ప్రతీ దాంట్లో చంద్రబాబు మోసాలే కనిపిస్తున్నాయి. అప్పుల్లో చంద్రబాబుది ఆల్టైమ్ రికార్డు. కానీ, ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు లేవు. ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్టుగా బాబు పాలన ఉంది. కోవిడ్ వంటి సంక్షోభం లోనూ మేము మేనిఫెస్టో అమలు చేశాం. మా మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చాం. చంద్రబాబుకు మాత్రం మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం. ఎన్నికలకు ముందు బాండ్లు ఇచ్చి మరీ ప్రజలను మోసం చేశారు. అప్పులు తెచ్చిన డబ్బు అంతా ఎక్కడికి పోతుంది?. ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికీ నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే చేయలేదు. నెలకు 3000 చొప్పున ఏడాదికి 36000 ఇస్తామన్నారు. కానీ, మూడు బడ్జెట్లో పెట్టింది మాత్రం సున్నా. నిరుద్యోగులకు రూ.21,600 కోట్లు బకాయి పడ్డారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం ఇదే తొలిసారి కాదు. ప్రతీ మహిళలకు నెలకు 1500 ఇస్తానన్నాడు.. ఏమైంది? అని ప్రశ్నించారు. 18-60ఏళ్ల లోపు మహిళలు కోటి 80 లక్షల మంది ఉన్నారు. ఈ మూడేళ్లలో మహిళలకు 97వేల 200 కోట్లు బకాయి పడ్డారు. ఇప్పటి వరకు ప్రతీ మహిళకు రూ.54వేలు చంద్రబాబు బకాయి ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. 2014 కల్లా అప్పులు రూ.లక్షా 47వేల 717 కోట్లు. చంద్రబాబు దిగిపోయే నాటికి మూడు లక్షల 90వేల 247 కోట్లు. మేము ఐదేళ్లలో చేసిన అప్పులు మూడు లక్షల 31వేల 671 కోట్లు. కానీ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో చేసిన అప్పులు మూడు లక్షల 17వేల 448 కోట్లు. కూటమి అప్పులను చంద్రబాబు పారదర్శకంగా చూపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు 35వేల కోట్లు బకాయిలున్నాయి. జీతాలు పెంచకుండా ఉద్యోగులతో గేమ్ ఆడుతున్నారు’ అంటూ విమర్శలు చేశారు. -
కొలంబో పోయి మ్యాచ్ చూడాలా? టీవీలో కనపడదా?
-
దేశంలోనే 22 స్థానంలో ఏపీ... దూసుకుపోతుంది అంటా..! ఎవరి చెవిలో పువ్వు
-
పబ్లిసిటీ పీక్.. పెర్ఫామెన్స్ వీక్..! ఏపీ బడ్జెట్పై YS జగన్ రియాక్షన్
-
లోకేష్.. జల్సాల కోసం ప్రత్యేక విమానాలా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ జల్సాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని అన్నారు. క్రికెట్ మ్యాచ్ చూడటానికి మంత్రి లోకేష్.. కొలంబోకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే వీరు మాత్రం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబుకు ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్. మంత్రి నారా లోకేష్కు కూడా ప్రత్యేక విమానం, హెలికాప్టర్. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూడా ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్. సీఎం కొడుకు లోకేష్ ఒకపూట విజయవాడలో ఉంటే మరోపూట హైదరాబాద్లో ఉంటాడు. క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లాడు. ఉదయమే మళ్లీ విజయవాడకు వచ్చాడు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు.చంద్రబాబు తీరు కుక్క తోక వంకర లాంటిది. దేశంలో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఎవరైనా జల్సాలు చేశారా?. టీవీల్లో చూస్తే మ్యాచ్ కనపడదా?. నేను కూడా టీవీలోనే మ్యాచ్ చూశాను. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం డబ్బులను వృథా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం రాష్ట్రం దూసుకుపోతోందని చెబుతున్నారు. చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్ధాలే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఏపీ బడ్జెట్లో తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మూడు బడ్జెట్ల్లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. స్టేట్ రెవెన్యూ పురోగతిలో దేశంలో 23 రాష్ట్రాల్లో ఏపీ 22వ స్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు అని ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు.. ప్రజలకు కూడా వరుసగా వెన్నుపోటు పొడుస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ కూడా గాలికి ఎగిరిపోయాయి. చంద్రబాబు పబ్లిసిటీ పీక్.. పర్ఫామెన్స్ వీక్. తప్పుడు లెక్కలతో తన డప్పు తాను కొట్టుకుంటున్నాడు. గ్రోత్ రేట్ పెరిగితే.. తలసరి ఆదాయం కూడా పెరగాలి కదా?. తలసరి ఆదాయం పెరిగితే కొనుగోళ్లు కూడా పెరిగుండాలి కదా?. కొనుగోలు శక్తి పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా పెరగాలి కదా?. 2024-25లో లక్షా 19వేల 927 కోట్లు ఆదాయం వస్తుందన్నారు. కానీ, వచ్చిన ఆదాయం 94వేల 937 కోట్లు మాత్రమే. పది నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ.75వేల 964 కోట్లు. పెరుగుదల కేవలం 4.25 శాతం మాత్రమే. చంద్రబాబు చెప్పేవన్నీ గారడీ లెక్కలే. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుంది. చంద్రబాబు మూడు బడ్జెట్ల్లో ప్రజలకు చేసిందేమిటి?. 2026-27కు లక్షా 37వేల 320 కోట్లు ఆదాయం వస్తుందంటున్నారు. ఇప్పటి కన్నా 45 శాతం అధికంగా చూపిస్తున్నారు. ఇది సాధ్యమా?. స్టేట్ రెవెన్యూ పురోగతిలో ఏపీ 22వ స్థానంలో ఉంది. దేశంలో చివరి నుంచి రెండో స్థానంలో ఏపీ ఉంది. చంద్రబాబు అసమర్థతకు ఇది నిదర్శనం. ఆదాయంలో కేంద్రం పురోగతి 9.64 శాతం ఉంటే ఏపీ పురోగతి మాత్రం 1.97 శాతం మాత్రమే. జీడీపీ, జీఎస్డీపీపై చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలే. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడం లేదు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తగ్గుతున్నాయి. రాష్ట్ర ఆదాయాలు బాబు అండ్ కో జేబుల్లోకి వెళ్తున్నాయి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
Watch Live: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
నేడు తాడేపల్లిలో YS జగన్ ప్రెస్ మీట్
-
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమా వేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉంది. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రేపు(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉంది. -
ఇవాళ అద్భుతమైన రోజు.. క్రైస్తవులు, ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
తలసిల రఘురాం తండ్రికి వైఎస్ జగన్ నివాళులు
-
క్రైస్తవులు, ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి,సాక్షి: క్రైస్తవులు, ముస్లింలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. క్రైస్తవులకు ఆరాధ్యమైన లెంట్, ముస్లింల పవిత్ర రంజాన్ నెల ఈరోజే ప్రారంభం కావటంపై హర్షం. ఈరోజు అద్భుతమైన ఆధ్యాత్మిక సమానత్వానికి ఇది నిదర్శనం. అందరూ సుఖ సంతోషాలు వర్ధిల్లాలి. ఉపవాసాలు, ప్రార్ధనలు, దానధర్మాలతో పండుగలను జరుపుకోవాలి’ అని పేర్కొన్నారు. Today marks a beautiful spiritual coincidence as our Christian brothers & sisters begin the holy season of #Lent and our Muslim brothers & sisters begin the sacred month of #Ramadan.May this period of fasting, prayer, and self-reflection bring peace, health, and prosperity to…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2026 -
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ని పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి,విజయవాడ : ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇవాళ ఉదయం రఘురామ్ తండ్రి చంద్రశేఖరరావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ స్వయంగా తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లి, ఆయన తండ్రి చంద్రశేఖరరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం రఘురామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
తలశిల రఘురాం తండ్రి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తండ్రి తలశిల చంద్రశేఖరరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం వైఎస్ జగన్.. విజయవాడ గొల్లపూడిలోని తలశిల రఘురామ్ నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఇకనైనా కళ్లు తెరువు..! చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
చంద్రబాబూ ఇకనైనా మేలుకో! : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘మదనపల్లె పరిధిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిపి, ఆపై హత్యచేసి, నీటి డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా?’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు కాపాడలేకపోయారని నిలదీశారు. ఇకనైనా మేలుకుని తక్షణమే శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టి మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించి.. వారి ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. ‘నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక, వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నెలో మూడేళ్ల బాలిక, తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి లైంగిక దాడికి గురై, ఆపై హత్యకు గురయ్యారు. ఇలా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బాలికలు, మహిళలపై ఎన్నో దారుణమైన ఘటనలు జరిగాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనలను తేలిగ్గా తీసుకుందనేది వాస్తవమన్నారు. ఎల్లో మీడియాలో హడావుడి ప్రకటనలు చేయడం, అనంతరం ఆ విషయాన్ని వదిలేయడం సహజంగా మారిందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించిన వారు మాజీ మంత్రులైనా వారి ఇళ్లమీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించి, ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నాలు చేయించడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంపై చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. శాంతిభద్రతలపై హోం మంత్రి బాధ్యత వహించరని, చంద్రబాబు కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ.. అందరి శాఖల్లో వేలుపెడతారని విమర్శించారు. ఏ మంత్రీ దేనికీ బాధ్యత వహించరన్నారు. ‘ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవారి పనిగా మారిపోయింది. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారు?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘చంద్రబాబు సృష్టించిన పొలిటికల్ గవర్నెన్స్తో, రెడ్బుక్ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది? మీ పాలనా వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? ప్రతిరోజూ భయంతో బతకాలా? పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్స్టేషన్కు వెళ్తే, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఓ టీడీపీ నాయకుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేస్తే కేసు కట్టి అరెస్టు చేయాల్సిన పోలీసులు మూడు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి, చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపైనే హత్యాయత్నం కేసు పెట్టి జైళ్లకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారని వెల్లడించారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.Shame on you, @ncbn garu!మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గు చేటు కాదా. బాలిక కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారు? నంద్యాల జిల్లా… pic.twitter.com/QcR3jyWo0I— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2026 -
JEE టాపర్స్ కు YS జగన్ అభినందనలు
-
జేఈఈ టాపర్స్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: జేఈఈ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించి టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కఠినమైన పోటీ పరీక్ష అయిన జేఈఈలో ప్రతిభ కనబరిచి ఉన్నత ర్యాంకులు సాధించడం విద్యార్థుల ప్రతిభ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా వారికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ, వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర యువత ఇలాగే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు -
KCRకు YS జగన్ జన్మదిన శుభాకాంక్షలు
-
కేసీఆర్కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి,తాడేపల్లి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartiest birthday greetings to former CM Telangana, Shri K. Chandrashekar Rao Garu. Praying for your health, peace, and long life. pic.twitter.com/KLHCpcZEGx— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2026 -
తిరుమల పవిత్రతను పెంచిన YS జగన్
-
ఐలాపురం వెంకయ్య మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఇలాపురం వెంకయ్య మృతపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఐలాపురం వెంకయ్య ప్రజలకు, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక సమాజానికే తీరని లోటన్నారు. వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని కోరుకుంటూ, వెంకయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇలాపురం వెంకయ్య.. ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, శనివారం (ఫిబ్రవరి 14)న మరణించారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలో ఆయన వ్యాపార, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. -
సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా YS జగన్ నివాళులు
-
సేవాలాల్ మహారాజ్కి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: సేవాలాల్ మహారాజ్కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/Ri9SX9FW7V— YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2026 -
మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ.. పరమభక్తికి నిదర్శనం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్టాగరిష్టతను చాటుతాయి’ అని వైఎస్ జగన్ అన్నారు.ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామివారి ఆలయం కొలువై ఉన్న పవిత్ర ప్రదేశం మన రాష్ట్రమని అభివరి్ణంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన, పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.‘‘నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. ‘‘ఆ మల్లికార్జునుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ!’’ అని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆ మల్లికార్జునుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.ఓం నమః శివాయ !#Mahashivratri— YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2026 -
'భృతి' లేదు.. గతి లేదు
దేశానికి ఆయువుపట్టు యువశక్తి. ఏపీలో ఉండే యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తా. పరిశ్రమలు తెస్తా. ఉద్యోగాలు ఇస్తా. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఇప్పుడు చెప్పండి యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏదీ? మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏదీ?.. – మే 28, 2023న రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడులో చంద్రబాబు దగాకోరు మాటలుటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తికావస్తోంది. ముచ్చటగా మూడో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పరిశ్రమలూ తేలేదు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. జాబ్ క్యాలెండర్ అడ్రస్సే లేదు. నోటిఫికేషన్లకు అసలే దిక్కులేదు. ‘‘ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను.’’ – 2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో మంత్రి నారా లోకేశ్ బీరాలుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు మరోసారి నిరుద్యోగ యువతను నిండా ముంచేసింది. ముచ్చటగా మూడో బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపించింది. ఎన్నికల సమయంలో అధికార పీఠం కోసం నిరుద్యోగ యువతను నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు నయ వంచనకు గురి చేశారు. ఆయువుపట్టుపై దెబ్బకొట్టారు. తాజాగా 2026–27 బడ్జెట్లోనూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ‘సూపర్ సిక్స్లో.. బాబుమార్క్’ దగాకోరు రాజకీయాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మూడు వార్షిక బడ్జెట్లలోనూ నిరుద్యోగుల ఊసే లేకుండా చేశారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని అటకెక్కించేశారు. రెండేళ్ల చంద్రబాబు సర్కారు ఒక్కో నిరుద్యోగికి ఏడాదికి రూ.36 వేల చొప్పున రెండేళ్లలో రూ.72 వేలు ఇవ్వకుండా మోసం చేసింది. ఇలా 20 లక్షల మందికి చూస్తే దాదాపు రెండేళ్లలో రూ.14,400 కోట్లు బకాయిపడింది. ఈ ఏడాది బడ్జెట్లో అసలు నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడంతో మరో రూ.7,200 కోట్ల చెల్లింపులకు ఎగనామం పెట్టింది. అంటే, చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు రూ.21,600 కోట్లు ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డారని స్పష్టమవుతోంది.ఇంకెంతకాలం ఈ మోసం బాబూ!2014 ఎన్నికల ముందు నిరుద్యోగులను బుట్టలో వేసుకుని రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్లకుపైగా ఆ ఊసే ఎత్తేలేదు. 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినా.. పైసా కూడా ఖర్చు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను తొలుత 12 లక్షలు అని చెప్పి, చివరికి 2.10 లక్షల మందే అర్హులన్నారు. తీరా 1.62 లక్షల మందికే ఇస్తామని, ఈ–కెవైసీ లింక్ పెట్టారు. చివరకు అందులోనూ కొంత మందికే నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మొత్తానికి బరితెగించి ఇవ్వను పొమ్మని నిరుద్యోగులను బెదిరిస్తున్నారు. బాబు పాలనలో ఉద్యోగాల భర్తీ ఊసే లేదుబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై వివాదాలు సృష్టించడం, వాటిని అడ్డంపెట్టుకుని భర్తీ నిలిపివేయడం పరిపాటి. ఈసారీ అదే సూత్రాన్ని సర్కారు పాటిస్తోంది. గతంలో జారీ అయిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న దాదాపు 10 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోంది. దాదాపు 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి 2024 డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇచ్చిన నోటఫికేషన్లలో 19 నోటిఫికేషన్ల ఫలితాలు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇప్పటికే ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్లో పోస్టులు భర్తీ చేయకుండా, ఆయా శాఖల్లో కేడర్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోకుండా 150 పోస్టులు, మరో 4,300 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగాల విప్లవం » వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల విప్లవం సృష్టించారు. » గ్రామ/వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టి 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు కొత్తగా కల్పించారు. 2.66 లక్షల వలంటీర్లను గత ప్రభుత్వంలో నియమించారు. » ఆప్కాస్ ద్వారా 96వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. » ఆర్టీసీ విలీనం ద్వారా 58వేల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేశారు. » మొత్తం ఐదేళ్లలో 6,31,310 ఉద్యోగాలిచ్చారు. » చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వేలో పేర్కొన్న ప్రకారమే.. లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1.02 లక్షల మందికి , ఎంఎస్ఎంఈ రంగంలో 32,79,970 మందికి వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టంగా ఉంది. » గవర్నమెంట్, లార్డ్ అండ్ మెగా, ఎంఎంఎస్ఈ సెక్టార్లో 40,13,552 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. -
ప్రజలందరిపై పరమశివుడి అనుగ్రహం ఉండాలి
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ.. పరమభక్తికి నిదర్శనం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్టాగరిష్టతను చాటుతాయి’ అని వైఎస్ జగన్ అన్నారు. 'ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామివారి ఆలయం కొలువై ఉన్న పవిత్ర ప్రదేశం మన రాష్ట్రమని అభివరి్ణంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన, పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. -
ఎనిమిది లక్షల పింఛన్లకు కోత?
సాక్షి, అమరావతి: బాబు సర్కార్ బడ్జెట్ ప్రకారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది లక్షల పింఛన్లకు కోత పడే పరిస్థితి నెలకొంది. గత 20 నెలలుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పింఛన్ల పథకానికీ ప్రభుత్వం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం దీనికి కారణం. 2026 ఫిబ్రవరిలో ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు రూ.2,632.04 కోట్లు (రూ. 2,724.09 కోట్లు పంపిణీ చేస్తామని ముందు ప్రకటించింది) పంపిణీ చేసింది. ఈ లెక్కన ఏడాదికి రూ. 31,584 కోట్లు నిధుల అవసరం ఉంటుంది. తాజా బడ్జెట్లో కేవలం 27,719 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే అవసరానికన్నా 4 వేల కోట్లు తక్కువ. దీంతో ఇప్పుడు పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య ఇకపై 8 లక్షలు తగ్గితేనే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 50 ఏళ్లకే పింఛన్.. ‘హామీకే సరి’ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన ‘50 ఏళ్లకే పింఛన్’ హామీ.. కేవలం ప్రకటనలకే పరిమితమని బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 60 ఏళ్లు దాటిన వారు వృద్ధాప్య పింఛన్లకు అర్హులు. అయితే చంద్రబాబు ఎన్నికల ముందు ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు అన్న హమీని ప్రకటించారు. తాజా కేటాయింపులు చూస్తే ఈ హామీ అమలు లేనట్లేనని తేలిపోయింది. కొత్త పింఛన్లకు ఆన్లైన్ ప్రక్రియ నిలిపివేత» చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 20 నెలల్లో 60 ఏళ్లు నిండిన నిరుపేదలకు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు కాకపోగా, కనీసం పింఛన్కు దరఖాస్తు చేసుకునే అవకాశమూ లేకుండా పోయింది.» కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నిలిచిపోయింది. » గత జగన్ ప్రభుత్వ హయాంలో అర్హులు ఏడాదిలో ఏ రోజైన తమ ఊరిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. » ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆ సేవలు నిలిచిపోయాయి. సచివాలయాల్లో గానీ, మండల కార్యాలయాల్లో గానీ నేరుగా దరఖాస్తు అందజేయాలన్నా వీలుకాని పరిస్థితి. » 2024 జనవరి ఆరంభంలోనూ అప్పటి ప్రభుత్వం అర్హులైన అవ్వాతాతలకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. » ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వరకు సైతం ఆన్లైన్ వెబ్పోర్టల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త పింఛన్ల మంజూరు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. » అప్పట్లో ప్రభుత్వానికి అందిన రెండున్నర లక్షల మంది పింఛన్ దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికే ఐదున్నర లక్షల పింఛన్లు కోతవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం వాటిలో ఇప్పటికే ఐదున్నర లక్షలకు పైగా కోతవేసింది. జగన్ ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్ధిదారులు పింఛన్ పొందారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ఈ సంఖ్య ప్రతి నెలా తగ్గుతూనే ఉంది. ఈ ఫిబ్రవరిలో పంపిణీ జరిగిన 60.19 లక్షలు చూస్తే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏకంగా ఐదున్నర లక్షల దాకా పింఛన్ల సంఖ్య తగ్గిపోయినట్టు అర్థమవుతోంది. లక్ష వరకు దివ్యాంగుల పింఛన్లు కోత పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘రీ వెరిఫికేషన్’ నిర్వహిస్తోందన్న విమర్శలున్నాయి. -
అణగారిన వర్గాల ఆశలకు ప్రతీక దామోదరం సంజీవయ్య : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: అణగారిన వర్గాల ఆశలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ..‘పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆశలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/BLmsad1bHQ— YS Jagan Mohan Reddy (@ysjagan) February 14, 2026 -
20 నెలల్లో కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దగా అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. కొత్తవి ఇవ్వక పోగా, ఉన్న పింఛన్లలో కూడా కోత విధిస్తున్న తీరును తప్పు పట్టిన ప్రతిపక్షంపై దారుణంగా విరుచుకు పడిన చంద్రబాబు కూటమి.. చివరకు దిగొచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల్లో కొత్తవారికి ఒక్కరికి కూడా పింఛను మంజూరు చేయలేదని అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే శుక్రవారం శాసన సభలో వెల్లడించారు. అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు మాట్లాడుతూ కొత్తగా పింఛన్లు ఇవ్వడంలేదని, దీనివల్ల క్షేత్రస్థాయిలో బాధితులు నిలదీస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుండబద్దలు కొట్టారు. త్వరగా కొత్త పింఛన్లు ఇవ్వాలని కోరారు. మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, సంప్రదాయ చర్మకారుల్లో పింఛన్ పొందుతూ మరణించిన వారి భార్యలకు వెంటనే పింఛన్ ఇవ్వాలని నవంబర్ 2024న స్పౌజ్ ఆప్షన్ ఇచ్చామని మంత్రి చెప్పగా.. ఎక్కడా ఇది అమలు కావడంలేదని సభ్యులు స్పష్టం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వడానికి వెళ్లినప్పుడు పింఛన్ రాని వారి నుంచి దాడి ఎక్కువగా ఉంటోందని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు చెప్పారు. ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 2024 సెప్టెంబర్కు ముందు భర్తలను కోల్పోయిన మహిళలు పింఛన్ రావట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజాదర్బార్ వినతుల్లో ఎక్కువగా ఇవే వస్తున్నాయన్నారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఆర్టీజీఎస్ ద్వారా సర్వే చేస్తే 3 లక్షల మంది గతంలో పింఛన్ తీసుకున్న వ్యక్తులు చనిపోతే వారి భార్యలకు పింఛన్ రావట్లేదని తేలిందని అన్నారు. వీరిలో 1.10 లక్షల మంది అర్హులుగా గుర్తించామని, త్వరలోనే వారికి పింఛన్లు మంజూరుకు చర్యలు చేపడతామన్నారు.భూ సమస్యల అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పొద్దుఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ సంబంధిత అర్జీలు లక్షల్లో పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు అధికార పార్టీ సభ్యులు ధ్వజమెత్తారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పడం సరికాదని ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రజలు సమస్యలు పరిష్కారం కాక చెప్పులరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. భూ వివాదాలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రెవెన్యూ సిబ్బంది కుమ్మకై భూములు కబ్జా చేసి వేరే వాళ్లకు మ్యూటేషన్లు చేస్తున్నారని, సర్వేల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. అర్జీల పరిష్కారానికి ఓ విధానమంటూ లేదని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 14.42 లక్షల ఫిర్యాదులొస్తే వాటిలో 8.90 లక్షలు రెవెన్యూకు సంబంధించినవేనని మంత్రి అనగాని బదులిచ్చారు. రికార్డులు ట్యాంపరింగ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నందున సీఎం సమక్షంలో రాష్ట్రస్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తే కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. సరైన సదుపాయాలు లేక మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని, దీనికి చెక్ పెట్టేందుకు తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రశ్నోత్తరాలలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.. గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రతి 10–15 కిలోమీటర్లకు ఫిషింగ్ హార్బర్, జెట్టీ, ఫిష్ల్యాండింగ్ సెంటర్, పోర్టులలో ఏదో ఒకటి ఉంటుందని, మన రాష్ట్రంలో సువిశాల సముద్ర తీరం ఉన్నప్పటికీ ఈ తరహా సౌకర్యాలు లేవన్నారు. సామాన్యుడికి దొరికేదంతా కల్తీ ఆహారమే..ఆహారంలో కల్తీ ఎక్కువగా ఉందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. దీనిపై మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆహార కల్తీని అడ్డుకునేందుకు తమ వద్ద తగినంత సిబ్బంది లేరని చెప్పారు. 723 మంది సిబ్బందికిగాను 144 మంది మాత్రమే ఉన్నారని, 577 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.పింఛన్లను 39 లక్షల నుంచి 66.34 లక్షలకు పెంచిన వైఎస్ జగన్2019 ఎన్నికలకు నెలల ముందు కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నెలనెలా పింఛన్లు ఇచ్చింది 39 లక్షల మందికే. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెంచారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛను అందించారు. అర్హులు గ్రామ, వార్డు సచివాలయాల్లో లేదా వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు ప్రత్యేక పోర్టల్ నిరంతరం పనిచేసేది. అర్హులకు ఎప్పటికప్పుడు పింఛన్లు మంజూరు చేశారు. దీంతో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 66.34 లక్షలకు పెరిగింది. 2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పింఛన్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ నెల (ఫిబ్రవరి) 1న జరిగిన పింఛన్ల పంపిణీలో 60,96,108 మందికే ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ 20 నెలల్లో కొత్తగా ఒక్కరికి కూడా పింఛను ఇవ్వకపోగా, 5 లక్షలకు పైగా పింఛన్లు తగ్గిపోవడం గమనార్హం. కొత్త పింఛన్ల మంజూరు పూర్తిగా నిలిచిపోయింది. కనీసం అర్హులు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆన్లైన్ పోర్టల్ నిలిచిపోయింది. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలోనూ కోత విధించి, రకరకాల వైద్య పరీక్షల పేరుతో వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని హామీ ఇచ్చిన చంద్రబాబు.. దానినీ అమలు చేయకుండా ఆ వర్గాలను కూడా వంచించారు. పైపెచ్చు పింఛన్లు తగ్గింపు, కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడంపై ప్రశ్నించిన విపక్ష నేతలపై చంద్రబాబు, ఆయన కూటమి నేతలు విరుచుకు పడుతుండటం గమనార్హం. -
మంత్రి లోకేష్కు బొత్స సవాల్.. దద్దరిల్లిన మండలి..
సాక్షి, విజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు శాసన మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైఎస్సార్సీపీ సభ్యులు.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బకాయిలు ఎందుకు చెల్లించడంలేదని సభ్యులు నిలదీశారు. దీంతో, వైఎస్సార్సీపీ సభ్యులకు సమాధానం చెప్పలేక మంత్రులు నారా లోకేష్, డోలా బాల వీరాంజనేయులు ఎదురుదాడికి దిగారు.ఈ క్రమంలో మంత్రి లోకేష్.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. స్కూల్స్లో మౌళిక సదుపాయాలు లేవని.. కూటమి ప్రభుత్వంలో సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్కు దమ్ముంటే బకాయిలు ఉన్నట్టు నిరూపించాలని బొత్స సవాల్ విసిరారు. గత టీడీపీ పాలనలో పాఠశాలను పట్టించుకున్న పరిస్థితే లేదన్నారు. దీంతో, మంత్రి లోకేష సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయారు.అనంతరం, మండలిలో బొత్స మాట్లాడుతూ..‘మేం మీలాగా ఈనాడు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు చెప్పడం లేదు. విద్యావ్యవస్థను ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ మనుగడ సాగిస్తుందని ప్రజలకు విశ్వాసం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్ మెంట్ రెండు వాయిదాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. నేను రికార్డుల్లో లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నాను. సత్యదూరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు వీలైతే అధికారులను పిలిపించండి.. ఇక్కడే వాస్తవాలు తేలుతాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని ప్రైవేట్ జూనియర్స్ కాలేజీలు వచ్చాయో లెక్కలు తీయండి. కొత్తగా ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ తీసుకురాలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో 8500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలున్నాయి. ఇప్పటికి కేవలం 700 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఇంకా 7800 కోట్లు ఫీజు బకాయిలున్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఎప్పటి బకాయిలు అప్పుడే చెల్లించారు. కూటమి ప్రభుత్వంలో బకాయిలున్నాయి పేరుకుపోయాయని అన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు, నేడుతో రూపరేఖలు మార్చాం. అధునాతన స్థాయిలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వ హయాంలో మధ్యలో ఆగిపోయిన పనులు ఎక్కడివి అక్కడే ఆపివేశారు. కొత్త స్కీమ్స్ ద్వారా పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేయాలి అని డిమాండ్ చేశారు. -
మండలిని గట్టిగా వాడుకోండి.. MLCలకు జగన్ దిశానిర్దేశం
-
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, ప్రజా సమస్యలపై గొంతెత్తాలి... వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం
-
వైఎస్ జగన్పై ఈర్ష్య.. ‘సచివాలయం’ పదం తొలగింపు
సాక్షి, అమరావతి: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తెచ్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. సచివాలయం అనే పదాన్ని తొలగిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాన్ని ‘స్వర్ణ గ్రామ’గా, వార్డు సచివాలయాన్ని ‘స్వర్ణ వార్డు’గా మార్పు చేశారు. అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను సైతం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖగా మార్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్లో మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సేవలన్నింటినీ వారి ఇంటి వద్దనే అందించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును కొనసాగిస్తే వైఎస్ జగన్ గుర్తుకు వస్తారనే ఈర్ష్య తోనే చంద్రబాబు సర్కారు పేర్లను మార్చిందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చినప్పటికీ ప్రజలందరూ గ్రామ, వార్డు సచివాలయాలనే పిలుస్తారని, పేరు మార్చినంత సులభంగా ప్రజల మనసుల నుంచి ఆ ముద్రను తొలగించలేరని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారనేది రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేశాయి. చంద్రబాబు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను రద్దు చేయడం లేదా మార్పు చేయడం తప్ప ఆ పథకాలను అమలు చేయడం లేదనే విషయం ప్రజలు గుర్తించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి: వైఎస్ జగన్
ఎన్నికలప్పుడు ఇంటింటికీ ఇచ్చిన హామీలతో కూడిన బాండ్ల గురించి ప్రశ్నించే వారిపై దాడులు, తప్పుడు కేసులు.. అన్ని రంగాలూ తిరోగమనం.. విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావట్లేదు.. కూటమి ప్రభుత్వం స్కామ్ల మయంగా మారింది.. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ సాగుతోంది.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాషూ.. సూట్ కేసూ.. రాజేషు.. లోకేషు..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. గట్టిగా పోరాడాలి. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రజల తరఫున మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కౌన్సిల్ (శాసన మండలి)లో మనకు మంచి సంఖ్యా బలం ఉందని, ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ‘అందరూ యుద్ధంలో ఉన్నారు. నా కంటే మీకే ఇంకా బాగా తెలుసు. అందుకే మీరు కూడా సమర్థవంతంగా పోరాడతారు. మనకు శాసనసభలో బలం తక్కువ. అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్సీపీ మాత్రమే. అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్ష నేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా అంతే సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే, మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి, ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా, అన్నీ వివరిస్తున్నాం’ అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మండలిలో గట్టిగా నిలదీద్దాంకౌన్సిల్లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకోండి. అప్పుడే మనం గట్టిగా మాట్లాడగలం. దేనికైనా మంచి ప్రిపరేషన్ అవసరం. అవగాహన పెంచుకుంటే బాగా మాట్లాడగలుగుతాం. ఏ అంశంపై మాట్లాడినా తగిన ఆధారాలు, సాక్ష్యాలు చూపి మాట్లాడాలి. అప్పుడే మన గొంతు బలంగా పోతుంది. లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని బాబు తట్టుకోలేకపోతున్నారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని çసృష్టించి దానికి రెక్కలు కట్టారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్రెడ్డిలపై దాడులు కానీ, కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసులు.. ఇవన్నీ తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే. చివరకు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం గుళ్లలో పూజలు చేసినా, చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఒక అబద్ధం సృష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైఎస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదు. టీటీడీలో నెయ్యి సరఫరాకు ఒక పక్కా విధానంటీటీడీలో నెయ్యి సేకరణకు ఒక నిర్ధిష్టమైన పటిష్ట విధానం ఉంది. నెయ్యి తెచ్చిన ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అక్రిడేటెడ్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలి. అలా వచ్చిన ట్యాంకర్లోని నెయ్యిని మళ్లీ టీటీడీ కూడా పరీక్షిస్తుంది. ఆ రిపోర్టు కూడా పాజిటివ్గా ఉంటేనే లోపలికి పంపిస్తారు. ఇదే పద్ధతిలో నాణ్యత లేక మన హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కు పంపాం. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా 2014–19 మధ్య 15 ట్యాంకర్లు వెనక్కు పంపారు. మరి ఇలాంటి పద్ధతి ఉన్నప్పటికీ కూడా దొడ్డిదారిన రిజెక్ట్ చేసినవి, తిరిగి టీటీడీకి వచ్చాయంటే, దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? మరి వీటన్నింటినీ మన పార్టీకి, మన ప్రభుత్వ కాలానికి ఆపాదించి రోజూ బురద చల్లుతున్నారు. వాస్తవానికి సీబీఐ చార్జిషీటులో అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలే 2014–19 మధ్య కూడా నెయ్యిని సరఫరా చేశాయి. ప్రీమియర్ డెయిరీ 2016, 2017, 2018లో కూడా నెయ్యి సరఫరా చేసింది. కానీ, కేవలం మన ప్రభుత్వానికి ఆపాదించి కుట్రలు చేస్తున్నారు.హామీలన్నీ గాలికి..సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. ఇవన్నీ అమలు చేస్తామంటూ ఎన్నికలప్పుడు ఇంటింటికీ బాండ్లు ఇచ్చారు. అప్పుడు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? దారుణంగా మోసాలు చేస్తున్నారు. వాటి గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతూ పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మొత్తం వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం యూరియా కూడా దొరకని పరిస్థితి. ఉచిత పంటల బీమాను ఎత్తివేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పొదుపు సంఘాలన్నీ ఢమాల్ అంటున్నాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కూటమి ప్రభుత్వం స్కామ్ల మయంగా మారింది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని గీతమ్ వర్సిటీకి ఇచ్చేశారు. ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఇలా ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాషు.. సూట్కేసు.. రాజేష్.. లోకేష్..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. గట్టిగా పోరాడాలి. చిత్తశుద్ధితో కష్టపడి పని చేయండి. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడుస్తాయి. వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుంది. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం ఉంది.’ఈ పాపం చంద్రబాబుదే⇒ లడ్డూ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. లెంపలేసుకోవాల్సిందీ చంద్రబాబే. ఒకసారి జరిగిన తీరు చూస్తే, రాష్ట్రంలో 2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వస్తే, మే 13న పోలింగ్ జరిగింది. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైంది.⇒ జూన్ 12న మొదటి ట్యాంకర్ వచ్చింది. ఆ తర్వాత జూన్ 20, 25వ తేదీల్లో, జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లలో ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయి. ఆ తర్వాత జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్ అయింది. జూలై 23న ల్యాబ్ రిపోర్టు రావడంతో, జూలై 25న వాటిని వెనక్కు పంపించారు.⇒ అయితే అవే ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్ చేశారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లను మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబర్లో తిరిగి టీటీడీకి పంపారు. ఆ తర్వాతే సీఎం హోదాలో చంద్రబాబు లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేశారు. ⇒ వెనక్కు పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే.. జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీ కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయి. మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? ⇒ నిజానికి 2014ృ19 మధ్య ప్రీమియర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసింది. కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అంతకు ముందు సరఫరాకు సంబంధించి ప్రస్తావించడం లేదు. అసలు 2014-2019 మధ్య సరఫరా అయిన నెయ్యిపై కూడా విచారణ జరగాలి. ⇒ ఇప్పుడు చెప్పండి.. ఎవరి హయాంలో ఆ ట్యాంకర్లు వచ్చాయి? ఎవరి హయాంలో టీటీడీ వాటిని అడ్డుకుంది? ఎవరి హయాంలో నెయ్యి శాంపిళ్లు తీసుకున్నారు? వెనక్కు పంపిన ట్యాంకర్లను తిరిగి తీసుకున్నది ఎవరి హయాంలో? ఇవన్నీ కూడా టీడీపీ హయాంలోనే జరిగాయి. ఇదంతా సీబీఐ సిట్ చార్జిషీట్లోనే ఉంది. మరి దీన్నంతటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆపాదించడం దుర్మార్గం కాదా? -
మండలిలో మంచి సంఖ్యా బలం ఉంది: వైఎస్ జగన్
-
మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదు: లేళ్ల అప్పిరెడ్డి
-
Tadepalli: చిన్నారికి YS జగన్ అక్షరాభ్యాసం
-
చిన్నారికి వైఎస్ జగన్ అక్షరాభ్యాసం
సాక్షి, తాడేపల్లి: చిన్నారికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్షరాభ్యాసం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం దండు గోపాలపురం వైఎస్సార్సీపీ కార్యకర్త లెనిన్ వివేక్, కుటుంబ సభ్యులు కోరారు.తల్లిదండ్రుల కోరిక మేరకు వారి కుమారుడు భార్గవ్ ప్రకాష్కు అక్షరాభ్యాసం చేసి.. ఆశీస్సులు అందజేశారు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేసిన వివేక్ కుటుంబ సభ్యులు.. గతంలో తమ కుమార్తెకు కూడా జగన్ అన్నప్రాసన చేశారని లెనిన్ కుటుంబం గుర్తుచేసుకున్నారు. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో YS జగన్ కీలక సమావేశం
-
‘అసెంబ్లీలో మన గొంతు వినిపించకూడదని కుట్ర’
సాక్షి,తాడేపల్లి: శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మండలి సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:అందరూ యుద్దంలో ఉన్నారు. నా కంటే మీకే ఇంకా బాగా తెలుసు. అందుకే మీరు కూడా బెటర్గా పోరాడతారు. మనకు అసెంబ్లీలో బలం తక్కువ. అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్షనేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే, మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి, ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా, అన్నీ వివరిస్తున్నాం.మండలిలో బలం ఉంది కాబట్టి..:కౌన్సిల్లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకొండి. అప్పుడే మనం గట్టిగా మాట్లాడగలం. దేనికైనా మంచి ప్రిపరేషన్ అవసరం. అవగాహన పెంచుకుంటే బాగా మాట్లాడగలుగుతాం. ఏ అంశంపై మాట్లాడినా తగిన ఆధారాలు, సాక్ష్యాలు చూపి మాట్లాడాలి. అప్పుడే మన గొంతు బలంగా పోతుంది.లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు:అంబటి రాంబాబు, జోగిరమేష్ ఇళ్లపై దాడులు, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్రెడ్డిపై దాడులు కానీ, కాకాణి గోవర్థన్రెడ్డిపై అక్రమ కేసులు.. ఇవన్నీ కూడా లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే. చివరకు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం గుళ్లలో పూజలు చేసినా, చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఒక అబద్ధం సష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైయస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదు.చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబే:లడ్డూ వ్యవహారానికి సంబంధించిన పరిణామాలను ఒకసారి చూస్తే.. ఈ వ్యవహారంలో ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. లెంపలేసుకోవాల్సిందీ చంద్రబాబే. ఒకసారి జరిగిన తీరు చూస్తే, రాష్ట్రంలో మార్చి 16, 2024న ఎన్నికల కోడ్ వస్తే, మే 13న, పోలింగ్ జరిగింది. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. జూన్ 4, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైంది. జూన్ 12, 20, 25 జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లను ఏఆర్ డెయిరీ సరఫరా చేసింది. అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయి.ఆ తర్వాత జూలై 6, 12 తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్లు నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్ కావడంతో వెనక్కి పంపారు. జూలై 23న ల్యాబ్ రిపోర్టు రావడంతో, జూలై 25న నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అయితే ఆ ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్ చేశారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లు మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబరులో తిరిగి టీటీడీకి పంపారు. అలా వచ్చిన నెయ్యిని వాడారని, సీబీఐ ఛార్జ్షీట్లో కూడా రాసింది.వెనక్కి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే, జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీకూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగాయి. మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? నిజానికి 2014–19 మధ్య ప్రీమియర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసింది. కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అంతకు ముందు సరఫరాకు సంబంధించి ప్రస్తావించడం లేదు.టీటీడీలో నెయ్యి సప్లైపై ఒక పక్కా విధానం:టీటీడీలో నెయ్యి సేకరణకు టీటీడీలో ఒక పటిష్ట విధానం ఉంది. నెయ్యి తెచ్చిన ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అక్రిడిటెడ్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలి. అలా వచ్చిన ట్యాంకర్లోని నెయ్యిని మళ్లీ టీటీడీ కూడా పరీక్షిస్తుంది. ఆ రిపోర్టు కూడా పాజిటివ్గా ఉంటేనే, లోపలికి పంపిస్తారు. ఇదే పద్ధతిలో నాణ్యత లేక మన హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపాం. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా 2014–19 మధ్య 15 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మరి ఇలాంటి పద్ధతి ఉన్నప్పటికీ కూడా దొడ్డిదారిన రిజెక్ట్ చేసినవి, తిరిగి టీటీడీకి వచ్చాయంటేం, దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? మరి వీటన్నింటినీ మన పార్టీకి, మన ప్రభుత్వ కాలానికి ఆపాదించి రోజూ బురదజల్లుతున్నారు.2014–19 మధ్య కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు నెయ్యి సరఫరా:సీబీఐ ఛార్జిషీటులో అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు 2014–19 మధ్య కూడా సప్లై చేశాయి. ప్రీమియర్ డెయిరీ 2016, 2017, 2018 లో కూడా నెయ్యిని సప్లై చేసింది. కానీ, కేవలం మన ప్రభుత్వానికి ఆపాదించి కుట్రలు చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం.. స్కామ్ల మయం:మరోవైపు కూటమి ప్రభుత్వం స్కామ్ల మయంగా మారింది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమి 54 ఎకరాలు గీతమ్ వర్సిటీకి ఇచ్చేశారు. ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఎవరూ ఇలా ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాష్.. సూట్కేసు.. రాజేష్.. లోకేష్.’. ఇది బాగా వినిపిస్తోంది.ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. పోరాడాలి. చిత్తశుద్ధితో కష్టపడి పని చేయండి. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడుస్తాయి. వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుంది. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి కూడా. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం మీకు ఉందని వైఎస్ జగన్ వివరించారు. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో YS జగన్ సమావేశం
-
నేడు వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం మూడు గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ తెలిపింది. -
ఉన్నత విద్యకు ఉరి!
భారతదేశ చరిత్రలో ఇచ్చిన మాట నిలుపుకుని, హామీలు నెరవేర్చామని చెప్పుకునే వారు కొందరు.. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే అన్నీ చేసేశామని చెప్పుకునే వారు ఇంకొందరు.. ఇందులో మొదటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే, రెండో వ్యక్తి చంద్రబాబునాయుడు.. అయితే తండ్రిని మించిన తనయుడిగా మంత్రి లోకేశ్ మరో నాలుగడుగులు ముందుకేసి ఉత్తుత్తి ఆదేశాలతో ప్రజలను మభ్యపెడుతుండటం విస్తుగొలుపుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) ఇచ్చి.. అంటే బిల్లు పెట్టుకోవచ్చని ఇచ్చే అత్యంత సాధారణ ఉత్తర్వు. దీనిపై పండుగ చేసుకోండంటూ ప్రచారం చేసుకోవడం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులందరినీ తామే ఉద్దరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం లోకేశ్కే చెల్లింది. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సకాలంలో ఫీజు డబ్బులు చెల్లించడం తమ బాధ్యత అంటూ ‘ఎక్స్’ వేదికగా చాటుకోవడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్యకు ఉరితాడు బిగిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో నక్కజిత్తులు ప్రదర్శిస్తూ విద్యార్థులను నిలువునా మోసం చేస్తోంది. కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తీర్చలేక కాగితాలపై కుయుక్తులు పన్నుతోంది. ఏ ప్రభుత్వంలోనైనా సంక్షేమ పథకాలకు నిధులు ఇచ్చాకే ప్రచారం చేసుకుంటారు. కానీ, దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) ఇచ్చి, పండగ చేసుకోమని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు విద్యా శాఖ మంత్రి లోకేశ్ మాత్రమేనని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. స్వేచ్ఛగా కళాశాలలకు వెళ్లలేని దుస్థితిలో చదువు దినదిన గండంగా మారిపోయింది. ఒకవైపు ప్రభుత్వం ఫీజులు చెల్లించట్లేదు. మరోవైపు ఫీజులు కట్టకుంటే కళాశాలలు పరీక్షలు రాయనివ్వట్లేదు. ఒకవేళ ఎలాగోలా పరీక్షలు రాసినా, సర్టిఫికెట్లు విడుదల చేయట్లేదు. గత రెండేళ్లుగా ఉన్నత విద్యా రంగంలో ఇదే తంతు నడుస్తోంది. తమ బిడ్డల చదువుల కోసం ఎందరో పేదింటి తల్లులు పుస్తెలు తాకట్టుపెట్టి, ఫీజులు కట్టిన ఉదంతాలు కోకొల్లలు. ఇలాంటి తరుణంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై విద్యార్థులను, కళాశాలలను మభ్య పెడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్ని నెలల్లో ఈ విద్యా సంవత్సరం కూడా ముగుస్తుండగా.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.6,300 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో ఇచ్చింది కేవలం రూ.700 కోట్లే. ఇంకా రూ.5,600 కోట్లు బకాయిలున్నాయి. పైగా పేదింటి విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల కింద చెల్లించాల్సిన రూ.2,200 కోట్ల ఊసే ఎత్తట్లేదు. మొత్తంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యలో రూ.7,800 కోట్లు బకాయిలు ఉంటే.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం రాత్రి రూ.1,200 కోట్లు విడుదల చేయొచ్చంటూ బీఆర్వో ఇచ్చి విద్యా వ్యవస్థను ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పిందొకటి.. చేస్తున్నది మరొకటి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం మొదలు పెట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో కరోనా విలయ తాండవం చేసినప్పటికీ, సమర్థవంతంగా ఐదేళ్లూ ఈ పథకాన్ని కొనసాగిస్తే.. చంద్రబాబు మాత్రం పాతరేసేశారు. అంత్యంత పారదర్శకంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేసే విధానానికి స్వస్తి పలికి, కళాశాలల ఖాతాల్లో నేరుగా వేస్తామని నమ్మబలికారు. తీరా చూస్తే 20 నెలల పాలనలో ఉన్నత విద్యా కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద అరకొర నిధులు విదిల్చి మమ అనిపించారు. పైగా షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన నిధులను ఆపేసి, ఏడాదికి రెండుసార్లు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. ఫలితంగా రూ.7,800 కోట్ల బకాయిల కొండ దర్శనమిస్తోంది. వసతి దీవెన ఎగ్గొట్టి తీరని అన్యాయం చంద్రబాబు కర్కశ పాలన పేదింటి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి చదువుల కోసం వచ్చే విద్యార్థులు హాస్టళ్లలో జీవనం సాగిస్తుంటారు. అలాంటి విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా గత వైఎస్ జగన్ ప్రభుత్వం వసతి దీవెన పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో హాస్టల్ మెయింటెనెన్స్ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకం ఊసే ఎత్తడం లేదు. ఇప్పటిదాకా మూడు విడతలకు గాను రూ.2,200 కోట్లు బకాయిపెట్టి, విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోంది. కాగా, అధికారమే పరమావధిగా ఎన్నికలప్పుడు చంద్రబాబు.. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేసే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వరుసగా రెండు దఫాల్లోనూ ముఖం చాటేశారు. ఇప్పుడు మూడోసారి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చినా, ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మాత్రం నోరు మెదపట్లేదు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సుస్థిరత దిశగా పాలన సాగించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అప్పులు, వడ్డీల లెక్కలతో కాలం గడిపేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్సిటీలనే కాదు ప్రైవేటు విద్యా సంస్థలను సైతం నట్టేట ముంచేసే కార్యక్రమాలకు ఒడిగట్టింది. ఇప్పటికే కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. అతికష్టంపై నెట్టుకొస్తున్న దుస్థితి. ఈ క్రమంలో తప్పించుకునేందుకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ప్రైవేటు యాజమాన్యాలకు ఈ విద్యా సంవత్సరం చివరి వరకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని, అయితే అందుకయ్యే వడ్డీని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు భరించాలని ప్రతిపాదించింది. తీరా, బ్యాంకుల దగ్గరకు వెళ్లేసరికి అప్పు పుట్టక పోవడంతో ప్రభుత్వం ముఖం చాటేసింది.విశ్వవిద్యాలయాల నిధులు దారి మళ్లింపు» ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తీవ్రంగా దెబ్బ తీసింది. ప్రభుత్వ వర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోగా, వర్సిటీ నిధులను దారిమళ్లించి వాటి మనుగడపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఉన్నత విద్యా మండలితో పాటు విశ్వవిద్యాలయాల నుంచి ఏకంగా రూ.1,200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించింది. వాటిని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కు బదిలీ చేయించి, తద్వారా ఇతర అవసరాలకు వినియోగిస్తోంది. » ఉన్నత విద్యా మండలి ఖజానా నుంచి రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేసుకోవడం గమనార్హం. ఇందులో ముఖ్యంగా చినబాబు ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోవిడ్ను అధిగమించి వర్సిటీలకు నూతన జవసత్వాలు అందించే ప్రయత్నం విస్తృతంగా జరిగింది. మళ్లీ చంద్రబాబు సర్కార్ రాకతో ప్రభుత్వ వర్సిటీలకు గడ్డుకాలం దాపురించింది. నేడు అరకొర.. నాడు ఫుల్ బడ్జెట్» చంద్రబాబు ఉన్నత విద్యకు అరకొర బడ్జెట్ కేటాయించడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదు. ప్రతి విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వెచ్చించాలి. కానీ, 2025–26 బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చూపించింది. ఆ మేరకు నిధులు విడుదల చేసిందా అంటే అదీ లేదు. ఈ ఏడాది భారీగా పేరుకుపోయిన బకాయిలను తీర్చడానికి బడ్జెట్ కేటాయింపులను పెంచడంతో పాటు ఆ మేరకు విడుదల చేయాల్సి ఉంది. » వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద ప్రతి త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల చేసింది. పైగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని రూ.1,778 కోట్ల బకాయిలు సైతం చెల్లించింది. మొత్తంగా ఐదేళ్లలో రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ఇచ్చింది. జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేసింది. ఇలా మొత్తం ఐదేళ్లలో గత ప్రభుత్వం ఉన్నత విద్యపై ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్లో పరిగణనలోకి తీసుకుని మే నెలలో నిధులు విడుదల చేయాల్సి ఉండగా, మార్చిలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రెడ్బుక్పై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదా? మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపాటు సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్లు రెడ్ బుక్ రాజ్యాంగంపై పెడుతున్న శ్రద్ధ విద్యార్థులపై చూపించట్లేదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.7,800 కోట్లున్నా నిమ్మకు నీరెత్తి¯] ట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇతర శాఖల్లో వేలు పెట్టే లోకేశ్.. తన శాఖలో విద్యార్థుల కష్టాలను తీర్చలేని అసమర్థ మంత్రిగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి, తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేవారన్నారు. ఫలితంగా విద్యార్థులు హాయిగా చదువుకునే వారని గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్ ఫీజులు చెల్లించక పోవడంతో కళాశాలలు విద్యార్థులను పరీక్షలకు కూడా అనుమతించట్లేదని దుయ్యబట్టారు. విజయవాడ సమీపంలోని ఎనికేపాడులోని విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థినులను ఫీజు పెండింగ్ ఉందనే కారణంతో రీసెర్చ్ రివ్యూ మీటింగ్కు అనుమతించక పోవడం దారుణం అన్నారు.బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
శాంతిభద్రతలను కాపాడండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎదుట నినదించింది. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలూ సంతోషంగా లేరని నిప్పులు చెరిగింది. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉదయం ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. ప్రజల గొంతు వినిపించనివ్వరు.. ప్రతిపక్ష హోదా ఇవ్వరు.. రైతు సమస్యలు వినిపించనివ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే నినాదంతో కూడిన బ్యానర్లతో పాటు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ నాలుగో నంబర్ గేటు ద్వారా సభ్యులు సభలోకి వచ్చారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే ప్లకార్డును వైఎస్ జగన్ స్వయంగా పట్టుకుని లోపలకు ప్రవేశించారు. వైఎస్ జగన్ తన స్థానంలో ఆశీనులవ్వగానే సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి.. హామీలిచ్చారు.. అమలు మరిచారు.. అర్హులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం..’ అని నినదిస్తూ ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లారు. వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నప్పటికీ, గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఈ నేపథ్యంలో మార్షల్స్ పోడియం వద్దకు చేరుకుని వైఎస్సార్సీపీ సభ్యులు ముందుకు వెళ్లకుండా వలయంగా నిలబడ్డారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. -
ధైర్యంగా ఉండండి.. న్యాయ పోరాటం చేద్దాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లి (కేఎన్ పల్లి) వైఎస్సార్సీపీ స్ధానిక నాయకులు కలిశారు. టీడీపీ మూకలు బరితెగించి అర్ధరాత్రి తమ ఇళ్ళపై దాడి చేశారని, తలుపులు బద్దలు కొట్టి ధ్వంసం చేసి బంగారం, నగదు దోచుకున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.చుండూరు మండలం కొత్తనారికేళ్ళపల్లిలో వైఎస్సార్సీపీ బీసీ నేత, సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీషీటర్ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడిచేశాడని.. వైఎస్ జగన్కు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు వివరించారు. కేఎన్పల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను టార్గెట్గా చేసుకుని బాలకోటిరెడ్డి తరుచూ మారణాయుధాలతో మూకుమ్మడి దాడులు చేస్తున్నాడని, గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఉన్నా తమను కాపాడడం లేదంటూ వైఎస్ జగన్ వద్ద కేఎన్ పల్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై బాపట్ల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా తమ కుటుంబాలకు, ప్రాణాలకు రక్షణ కరువైందని, ప్రాణభయంతో కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నామన్న బాధిత కుటుంబాలు. టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం లేక, ఆత్మహత్యకు అనుమతివ్వాలని కలెక్టర్ కార్యాలయంలో కోరిన విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి నాయకులు తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ క్యాడర్ ఎవరూ భయపడొద్దని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందామని, పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని వెల్లడించారు. వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు.వైఎస్ జగన్ను కలిసిన వారిలో గాదె శివరామిరెడ్డి (మాజీ జెడ్పీటీసీ), రఘురామిరెడ్డి (చుండూరు మండల పార్టీ అధ్యక్షుడు), అంగిరేకుల నాగేశ్వరరావు, శివమ్మ, విష్ణు, ఊరుబండి కోటేశ్వరరావు, బాలాజీ నాయక్, స్వప్న, అంగిరేకుల తిరుపతమ్మ, శ్రీను, ఉయ్యూరు రవిశంకర్రెడ్డి, మోహన్రెడ్డి (వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యుడు) ఉన్నారు. -
ప్లకార్డులతో జగన్ నిరసన
-
YSRCP నేతల నిరసనలతో మారుమోగిన అసెంబ్లీ
-
వైఎస్సార్సీపీ నిరసనలతో దద్దరిల్లిన సభ
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే, గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలు, అసత్యాలు ఉన్నాయని.. కూటమి ప్రభుత్వం కావాలనే గవర్నర్తో తప్పుడు ప్రసంగం చేయిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నిస్తూ.. ప్రతిపక్ష నేతలు, వారి ఇళ్లపై జరుగుతున్న దాడులను సభ వేదికగా ఖండించారు. ఏపీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కూటమి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద నిరసనలు తెలిపారు. ఫ్లకార్డులు పట్టుకుని వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల తరపున ప్రశ్నిస్తామనే కారణంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజల తరఫున గళం విప్పేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని.. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై కచ్చితంగా గళం వినిపిస్తామన్నారు. అనంతరం, సభలో గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్దాలేనని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించడం బాధాకరమని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు.. అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం, సభ్యుల హక్కులను కాపాడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. నినాదాలు తెలిపారు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను గవర్నర్ చదువుతున్నారు. తన ప్రసంగంలో చదువుతున్నది వాస్తవమా కాదా అని కూడా గవర్నర్ చూడటం లేదు. 3.2 లక్షల కోట్లు అప్పులు చేసి ఎవరికిచ్చారు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన సాగుతోందని.. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ది లేదన్నారు. మహిళా సాధికారత కొరవడింది.. రైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పాలనా వైఫల్యాలను ఎండగడతామన్నారు. ఉద్యోగులపై ఈ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వం తెచ్చే ఒత్తిడితో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా వేధిస్తోంది. వాలంటీర్లకు హామీలిచ్చి ఈరోజు రోడ్డున పడేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మాటతప్పారు. ఉద్యోగాలిస్తామని మాయమాటలు చెప్పి యువతను మోసం చేశారు. దేశంలోనే గవర్నెన్స్లో ఏపీ అట్టడుగు స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇవన్నీ గవర్నర్ ప్రసంగంలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. అనంతరం, సభను వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. -
ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని YSRCP డిమాండ్
-
పాలన ‘కమ్మ’దనంపై స్వపక్షం పెదవివిరుపు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వెళుతున్నాయి? రాష్ట్రంలో పాలన ‘కమ్మ’గా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్య పొలిటికల్ ఆటంబాంబుగా మారింది. కూటమిలో తెలుగుదేశం పార్టీ, ఒక సామాజికవర్గం పెత్తనంపై వ్యతిరేకత పెరిగిపోయిందనేందుకు ఇదో సూచిక. ముఖ్యమంత్రి చంద్రబాబేమో.. కుమారుడు లోకేశ్కు పట్టం కట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉంటే.. పాలన అధ్వాన్నంగా మారిందన్న అంచనాలు బలపడుతున్నాయి. అదే సమయంలో టీడీపీ రాజకీయ కక్షసాధింపులు, తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చేసిన రచ్చ కూడా కూటమి భాగస్వాములు బీజేపీ, జనసేనల అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణమవుతోంది. దీన్నే ఆదినారాయణ రెడ్డి తనదైన రీతిలో బయటపెట్టారు. ఇంకొంరు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల భావన కూడా ఇదే అయినప్పటికీ ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు పట్ల విధేయతగా ఉండడంతో తగ్గి ఉంటున్నారు. టీడీపీలో నిజంగానే ఒక సామాజికవర్గం అధికారం చెలాయిస్తోందా? అవుననే అంటున్నారు చాలామంది. ఆది నారాయణ రెడ్డి ‘కమ్మ’గా ఉందన్న కామెంట్కు సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలంతా చప్పట్లు కొట్టడం కూడా ఒక సంకేతమే. కమ్మ సామాజికవర్గం నాయకత్వం ఎలా ఉన్నా.... మిగిలిన వారిని కూడా కలుపుకొనిపోవాలని ఆయన సలహా ఇచ్చారు. బీజేపీ లేనిదే టీడీపీ, జనసేనలకు ఉనికి ఉండదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదం అంశంలో ఎంతో కష్టపడి ప్రచారం చేస్తున్న కుట్ర థియరీ గాలి కూడా ఆదినారాయణ తీసేశారు. లడ్డూ అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్దే పైచేయి అని స్పష్టం చేశారు. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్లో ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆ తరువాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు మంత్రివర్గ సభ్యుడు కూడా. 2019లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీలో ఆయనకు చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరుపొందిన అనకాపల్లి ఎంపీ సీ.ఎం. రమేష్కు మధ్య వర్గపోరు కూడా సాగుతోంది. ఇదో కోణమైతే ప్రభుత్వంలో చంద్రబాబు కంటే ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ మాటకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని టీడీపీతోపాటు బీజేపీ, జనసేనల్లోనూ బలంగా నమ్ముతున్నాయి. లోకేశ్ సొంత కోటరీతో షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయా అంశాలలో అహంకార పూరితంగా ప్రవర్తిస్తూ, గిట్టని వారిపై రెడ్బుక్ ప్రయోగిస్తూ అరాచకాలు చేయిస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. ఇతర పక్షాల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. చంద్రబాబు సీనియర్ నేత, ముఖ్యమంత్రి కనుక ఆయన వద్దకు వెళ్లి ఏ సమస్య అయినా మాట్లాడవచ్చు. కాని లోకేశ్ వద్దకు వెళ్లడం మిత్రపక్షాలకు అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల రాగం ఆలపిస్తుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,ఇతర నేతలు మౌనంగా ఉంటున్నారు. తాజాగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు లడ్డూ ప్రసాదంలో కల్తీ లేదని చెప్పడం గమనించదగిందే. అలాగే బీజేపీ నేతలపై కూడా చంద్రబాబు ఒత్తిడి చేసి తనకు అనుకూలంగా మాట్లాడాలని కోరుతున్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఇంత గందరగోళం చేస్తున్నా బీజేపీ కేంద్ర పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదు.రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు మాధవ్ను తన అవసరార్థం పిలిపించుకుని లడ్డూపై ఉమ్మడి సమావేశంలో పాల్గొనేలా చేశారు. ఇవన్ని చూస్తే కూటమిలో అంత సవ్యత లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. క్రెడిట్ ఉంటే చంద్రబాబు, లోకేశ్లే తీసుకుంటున్నారని, నెగిటివ్ వచ్చినప్పుడే తాము కావల్సి వస్తున్నామని మిత్రపక్షాలలో ముఖ్యంగా బీజేపీలో ఉందట. ఆదినారాయణ రెడ్డి ఇదే సంగతిని పరోక్షంగా వెల్లడించారు. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని ఆక్షేపించారని వార్తలు వచ్చాయి. అంతకుముందు తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు తమ పార్టీ పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా అతను చేసిన కీచక పర్వం ఒక ఎత్తు అయితే, కేవలం ఒక డమ్మీగా స్థానిక టీడీపీ నేత రూపానందరెడ్డి పెత్తనంలో ఉండాల్సి రావడం కూడా గమనించవలసిన అంశం. జనసేనకు సంబంధించి కనీసం పది మంది అంతకుముందు టీడీపీలో ఉన్నవారే. చంద్రబాబు వారిని జనసేనలోకి పంపించి ఆ పార్టీ టిక్కెట్లు ఇప్పించారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ను మొదటి నుంచి బలహీనుడిగానే నిలబెట్టారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు అనేకమంది చేస్తున్న దందాలు ఉండనే ఉన్నాయి. వాటిలో జనసేన, బీజేపీలకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ఆ అసంతృప్తి కూడా ఉంది. రాష్ట్రంలో 95 శాతం మద్యం షాపులు, బెల్ట్ షాపులు టీడీపీ వారికే దక్కాయి. పైకి టీడీపీతో కలిసి ఉంటున్నప్పటికీ, ఈ సంగతులు తెలియని స్థితిలో మిత్రపక్షాలు ఉండవు కదా! అందులోను బీజేపీ జాతీయ పార్టీ.ఆ పార్టీ అండతోనే టీడీపీ గెలవగలిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఎన్నికల సంఘం కూటమికి అనుకూల నిర్ణయాలు చేయడం వంటివి ఎన్నికల సమయంలో కనిపించాయి. కేంద్రంలో ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాలను పొగుడుతూ, రాష్ట్రంలో మాత్రం తమ పెత్తనాన్ని చంద్రబాబు సాగించుకుంటున్నారన్నది బీజేపీలో ఒక అభిప్రాయంగా ఉంది.కులపరంగా చూస్తే ఎంత కాదన్నా టీడీపీని కమ్మ సామాజికవర్గం తమ సొంత పార్టీగా భావిస్తుంటుంది.మంత్రివర్గంలో వారికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. పార్టీ అధిష్టానానికి సన్నిహితంగా ఉండేవారిలో ఎక్కువ మంది ఆ వర్గంవారే అంటారు. ఇతర వర్గాల వారి మాట పెద్దగా చెల్లడం లేదన్నది రాజకీయ వర్గాలలో ఉన్న అభిప్రాయం. ఇక జనసేన పార్టీ కాపు సామాజికవర్గంపై ఎక్కువగా ఆధారపడిన పార్టీ అన్నది తెలిసిందే. ఆ వర్గాన్ని ఆకర్షించడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకోగలిగారు. అయినా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం లేదన్న విషయం అర్థమైన తర్వాత ఆ వర్గంలో అసంతృప్తి పెరుగుతోంది. దానికితోడు కాపు వర్గానికి జగన్ టైమ్లో లభించిన పథకాలు కూటమి ప్రభుత్వంలో రావడం లేదు. మాజీ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడం, ఇంటిపైకి వెళ్లి విధ్వంసకాండ సృష్టించిన వారు టీడీపీ గూండాలైనా అందులో కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు ముఖ్య పాత్ర పోషించారన్న ప్రచారం, అంబటిని దూషించిన ఒక కమ్మ సామాజికవర్గ మహిళపై కేసు పెట్టకపోవడంపై కూడా చర్చించుకుంటున్నారు. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా చంద్రబాబుతో ఉన్న బంధుత్వం కారణంగా అంబటినే తప్పుపట్టారని, అదే అంబటిని తీవ్రగా దూషించిన వారిని ఖండించలేదని, ఇది కుల ప్రభావమేనని కాపు సామాజికవర్గం భావిస్తోంది. అంబటి కుమార్తె మౌనిక మాట్లాడిన పద్దతి కూడా ఆ వర్గాన్ని ఆకట్టుకుంది. ఇక బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులు విసిరి నిప్పుపెట్టడం, అలా చేసిన టీడీపీ వారిపై చిన్న కేసులు పెట్టి సరిపెట్టడం బీసీ వర్గాలలో కూడా ఆందోళన కనిపించింది. దళిత వర్గాలపై ఈ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు గతంలో ఎప్పుడూ జరిగి ఉండవు. దాంతో ఆ వర్గంలో తీవ్ర అసమ్మతి ఉందని చెబుతున్నారు. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులపై కక్షతో తప్పుడు కేసులు పెట్టించిన తీరుతో ఆ వర్గం కూడా టీడీపీకి దూరం అవుతోందని చెబుతున్నారు. లడ్డూ ప్రసాదం వివాదాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్న తీరుపై బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా లడ్డూలో జంతుకొవ్వు, బాత్ రూమ్ కెమికల్స్ వంటివి ఉన్నాయని చంద్రబాబు, పవన్, లోకేశ్లు చెప్పడం పట్ల వారు మండిపడుతున్నారు. తమకు లడ్డూ ప్రసాదం తీసుకోవాలంటేనే బెరుకుగా ఉంటోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన వ్యాఖ్య దీనికి నిదర్శనం. పైగా టీడీపీ వాళ్లు ఫోన్ పోన్ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ను తిట్టడం, బెదిరించడం కూడా బాగా ప్రభావం చూపుతోంది. నిజానికి గత ఎన్నికల సమయంలో ఈ వర్గాలలో మెజార్టీ భాగం కూటమికే మద్దతిచ్చాయి. అయినా ప్రస్తుతం పరిస్థితి కేవలం ఒక సామాజికవర్గానికే అనుకూలంగా ఉందన్న భావన ప్రజలలో నెలకొంది. దానికి తోడు టీడీపీ పత్రికలుగా పేరొందిన మీడియా యజమానులు కూడా అదే సామాజికవర్గంగా ఉండడం, కూటమి ప్రభుత్వం చేసే అకృత్యాలకు సైతం మద్దతు ఇచ్చేలా కథనాలు రాయడం ఏపీ సమాజం గమనిస్తోంది. ఈ కారణాల రీత్యా ఆదినారాయణరెడ్డి వంటి నేతలు ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2014 టర్మ్లో కూడా టీడీపీ ఇలాగే ఆయా సామాజిక వర్గాలను దూరం చేసుకుంది. ఈసారి మరింత ముందుగానే ఆ పరిస్థితి తెచ్చుకుందన్న భావన వివిధ రాజకీయ పక్షాలలో నెలకొంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రజల గొంతుకగా ఒక్కటైన ప్రతిపక్షం!


