YS Jagan Mohan Reddy
-
మీ పాలనలో విద్యారంగం బ్రష్టుపట్టిపోయింది
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యావ్యవస్థే ఇలా ఉంటే మిగిలిన రంగాలను ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలంటించారు. టెన్త్ పరీక్షల నిర్వహణలో చంద్రబాబు, లోకేశ్ పూర్తిగా ఫెయిలయ్యారని వైఎస్ జగన్ మండిపడ్డారు. పదో తరగతి మూల్యాంకనంలో జరిగిన తప్పులను వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా తూర్పారబట్టారు. ఈ మేరకు నాలుగు పాయింట్లతో కూడిన సందేశాన్ని ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమని నిలదీశారంటే..విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకూ కష్టాలేచంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిలయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణతిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?6.14 లక్షల మంది విద్యార్థులు రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు.. ఘోరంగా విఫలమై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పుల కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబూ.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా? అనేక సంస్కరణలను దెబ్బతీశారుమన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను అధికారంలోకి వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు–నేడు, గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు. లోకేశ్ సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలిచంద్రబాబూ.. మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేశ్ మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను -
బాబుగారూ.. ‘టెన్త్’లో మీరు, మీ కొడుకు ఫెయిల్: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యా వ్యవస్థే ఇలా ఉంటే మిగతా వాటిని ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) చురకలంటించారు. ఈ మేరకు నాలుగు పాయింట్లతో కూడిన సందేశాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్(Nara Lokesh) టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని(10th Papers Valuation) కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.సుమారు 6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1.@ncbn గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2025 .. చంద్రబాబుగారూ(Chandrababu Gaaru) దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు.చంద్రబాబుగారూ… మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీ టెన్త్ ఫలితాలు సరైనవేనా? -
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు
-
రియల్ లైఫ్లోనూ ఆయన హీరోనే: సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, గుంటూరు: అల్లూరి సీతారామరాజు పేరు చెబితే జనాలకు మదిలో మెదిలే రూపం సూపర్ స్టార్ కృష్ణగారిదేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. ఇవాళ(మే 31) కృష్ణ జయంతి(Krishna Birth Anniversary) సందర్భంగా నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారాయన.సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణగారు(Super Star Krishna Gaaru) హీరోగా నిలిచారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్గా, స్టూడియో అధినేతగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అల్లూరి పేరు చెబితే.. మనకు కృష్ణాగారే మదిలో మెదులుతారు. రాజకీయాల్లోనూ రాణించారు. నిర్మాతలు, కార్మికుల కష్టాల్లో అండగా నిలిచి పెద్ద మనసును చాటుకున్నారు. నాన్నగారికి(వైఎస్సార్) అత్యంత ఆప్తులు అయిన కృష్ణ గారి జయంతి సందర్భంగా నివాళులు అంటూ జగన్ పోస్ట్లో పేర్కొన్నారు. -
బాబు కవరింగ్ భలే!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరంతా అదోటైపు!. ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడతారో.. దూషణలకు దిగుతారో ఆయనకే తెలియనట్లు ఉంటుంది వ్యవహారం. కావాలంటే తాజా మహానాడును ఉదాహరణగా తీసుకోండి. ‘ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులను ఏరివేస్తా’ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏంటో.. దానికి రాష్ట్ర రాజకీయాలకు సంబంధం ఏమిటో ఆయనకే తెలియాలి!. రాసిచ్చిన స్క్రిప్ట్లేమైనా చదువుతారేమో తెలియదు కానీ.. బాబు గారి ప్రసంగాలు వినేవారికి బీపీ పెరిగిపోవడమైతే గ్యారెంటీ!.2019 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వదలుకుని ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తున్న రోజులవి. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదన్న గట్టి నమ్మకంతో చెలరేగి పోయారు బాబుగారు!. దేశ ప్రధానిని పట్టుకుని ఉగ్రవాది అన్నారు. ముస్లింలను బతకనివ్వడన్నారు.. అవినీతిపరుడన్నాడు.. ఇంకా ఏమేమో అనేశాడు! భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఏమి ఏలుతాడని ప్రశ్నించారు. ప్రధానిని ఉగ్రవాది అనడమేమిటా? అని అప్పట్లో అందరం బాధపడ్డాం. ఆ మాటకొస్తే మోదీ కూడా బాబు మాటలకు ధీటైన సమాధానమే ఇచ్చారు. అది వేరే సంగతి. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ ఇక అస్సలు కలవలేవని అందరూ అనుకున్నారు. కానీ, ఐదేళ్లు గడిచేసరికి ఆ దూషణలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. రెండు పార్టీలూ మళ్లీ కలిసిపోయాయి. రాజకీయమంటే ఇంత నిస్సిగ్గుగా చేస్తారా? అని అందరూ అనుకునేలా చేశాయి. అప్పటిదాకా తిట్టిన బాబు నోరే పొత్తు కుదిరాక ఇంద్రుడు, చంద్రుడని ప్రశంసల రాగం ఎత్తుకుంది. మోదీ కూడా తన వంతుగా చంద్రబాబును భుజానికైతే ఎత్తుకున్నాడు!.ఈ సంగతి అలా ఉంచితే, చంద్రబాబు ఇప్పుడు ఉగ్రభాష వాడుతున్నారు. కాకపోతే ఈ సారి ఆయన గళమెత్తింది.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పైనే. పోటీదారు కనుక ఏవైనా విమర్శలు చేయవచ్చు. అందులోనూ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయం ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు లేదంటే.. ప్రజల అసంతృప్తి పెరిగి పరిస్థితులు జగన్కు అనుకూలంగా మారుతున్నాయన్న కోపమూ కారణం కావచ్చు. అయితే మాట్లాడే మాటలకు కొంత విచక్షణ ఉండాలి. జగన్ ఆర్థిక ఉగ్రవాది అనేందుకు ఆయనకున్న ఆధారమేమిటి?.2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పుల గురించి చంద్రబాబు ఎన్ని మాటలు మార్చారు?. ఒకసారేమో రూ.14 లక్షల కోట్లని.. ఇంకోసారి రూ.పది లక్షలు అని ఊరూరా అబద్ధాలు ప్రచారం చేసింది ఈయనే. కానీ, తాజా బడ్జెట్లో ఈ లెక్క కేవలం రూ.ఆరు లక్షల కోట్లేనని స్పష్టమైంది కదా?. ఈ మొత్తంలోనూ తాను గతంలో చేసిన అప్పులూ ఉన్నాయన్న విషయం కూడా చెప్పకపోవడం మోసం చేసినట్టే కదా?. జగన్ ముఖ్యమంత్రిగా సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే.. చంద్రబాబు ఏడాది కాలంలోనే లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేశారు కదా?. దీన్ని కదా అనాల్సింది ఆర్థిక ఉగ్రవాదం అని?. జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం ఉగ్రవాదం అవుతుందా?. ఒకటి అర మాత్రమే అమలు చేసి అడిగిన వారిపై నోరేసుకోవడం ఉగ్రవాదం అవుతుందా?.చంద్రబాబు తన ప్రసంగంలో ఇంకో మాటా అన్నారు.. ఒకసారి గెలవడం.. ఒకసారి ఓడటం ఉండకూడదట. అలా అయితే అభివృద్ది జరగదట.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కూడా వక్కాణించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం కావాలి.. ప్రభుత్వంలో ఉన్న వారిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయాలి.. ప్రజలను రెచ్చగొట్టాలి. హింసను సైతం ప్రేరేపించాలి.. అభాండాలు వేయాలి.. కార్యకర్తలను కేసులు పెట్టించుకోవాలని కూడా అంటారు. అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం వద్దు.. నియంతృత్వం కావాలి. తనను వ్యతిరేకించే పార్టీలను, మీడియాను అణచివేయాలి. ఏం చేసినా, చేయకపోయినా అంతా అభివృద్ది చేసేసినట్లు బాజా వాయించుకోవాలి. గతంలో ‘జయము, జయము చంద్రన్న’ అంటూ, లేక ఇప్పుడు ‘చంద్రబాబూ నువ్వే కావాలి’ అంటూ సినీ ఫక్కీలో పాటలు పాడించుకోవాలి. ఒక పార్టీనే అధికారంలో ఉండాలంటే ఆ స్థాయిలో పని కూడా చేయాలి కదా?.వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేస్తున్నారని గమనించి, అంతకు మూడురెట్లు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయల విలువైన సంక్షేమం ఇస్తానని, అసత్య వాగ్ధానాలు చేసి, అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకపోయినా ఇచ్చేసినట్లు దబాయించినా జనం ఓట్లు వేయాలన్నది చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబు మామ ఎన్టీఆర్ను తోసేసి గద్దెనెక్కిన తరువాత ఎన్ని సార్లు వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారో అందరికీ తెలుసు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు పాలనే సక్రమంగా ఉండి ఉంటే ఇన్ని రకాల పొత్తులు అవసరమై ఉండేవా? అన్నది ఆయన ఆలోచించుకోవాలి.అభివృద్ది అన్నది నిరంతర ప్రక్రియ. కానీ, తాను లేకపోతే అభివృద్ది ఉండదని ప్రజలకు చెప్పడం అంటే అతిశయోక్తులు చెప్పడమే. హైదరాబాద్ తానే అభివృద్ది చేశానని ఈ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయిన 21 ఏళ్ల తర్వాత కూడా చెబుతున్నారంటే ఏమనాలి!. హైటెక్ సిటీ భవనం ఒక్క దానిని కట్టి ఆ ప్రాంతం అంతా తానే కట్టేశానని చెప్పగలిగిన సమర్థత ఆయనది. నిజానికి హైదరాబాద్ పడమటి ప్రాంతంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్ధన రెడ్డి ప్రభుత్వమే. అంతకుముందు ఎన్టీ రామారావు హయాంలో మెహిదీపట్నం మీదుగా బీహెచ్ఈఎల్ వరకు హైదరాబాద్ రింగ్ రోడ్డు వేశారు. ఆ రోడ్డు పక్కన పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయి. అయినా అంతా తన ఘనతని ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలైనవి వచ్చాయి. కేసీఆర్ పాలన సమయంలో పలు వంతెనలు, కొత్త ఐటి కంపెనీలు వచ్చాయి.ఏపీలో టీడీపీ పాలనకు, వైఎస్సార్సీపీ పాలనకు ఉన్న తేడాను కేస్ స్టడీ చేయాలని చంద్రబాబు అనడం బాగానే ఉంది. ఎన్నికల మేనిఫెస్టోతో పోల్చుతారా? లేక చంద్రబాబు, జగన్ టైమ్లలో తెచ్చిన అప్పులతో పోల్చుతారా?. జగన్ తీసుకు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటిని ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పోల్చుతారా?. జగన్ తెచ్చిన ఓడరేవులు, గ్రామ, గ్రామానా జగన్ నిర్మించిన భవనాలు, చంద్రబాబు టైమ్తో పోల్చుతారా?. విద్య, వైద్య రంగాలు ఎవరి కాలంలో ఎలా ఉన్నాయో పోల్చుతారా?. ప్రజల ఇళ్ల వద్దకు సేవలు అందించడంలో కూడా పోల్చవచ్చు!. సెకీతో చౌకగా రూ.2.49లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న జగన్ పాలనను, అధిక ధరకు రూ.4.60లకు కొనుగోలు చేసిన చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చుతారా?. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల వ్యయాన్ని కూడా కేస్ స్టడీగా తీసుకుంటే బాగానే ఉంటుంది.నీటిపారుదల రంగంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ హయంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా కేస్ స్టడీ చేయవచ్చు. ఇక్కడ ఒక్క సంగతి చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఇప్పటికి సుమారు 15 ఏళ్లు పాలన పూర్తి చేశారు. కానీ, వైఎస్సార్ ఐదేళ్లు, జగన్ మరో ఐదేళ్లు పాలన చేశారు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కేస్ స్టడీ చేస్తే నిజంగానే మంచి పరిశోధనే అవుతుంది. చంద్రబాబు వాదనలలోని డొల్లతనం, ఎన్ని రకాలుగా ఆయన మాటలు మార్చింది. ఆయన టైమ్లో జరిగిన అవినీతి, స్కామ్లు అన్ని విషయాలు బయటకు వస్తే ఆయనకే అప్రతిష్ట అవుతుంది.జనం ఎవరూ అడగరు కనుక మహానాడులో ఏవో ఉపన్యాసాలు చెప్పి, అవే నిజాలని ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తే అది ఎల్లకాలం సాధ్యం కాకపోవచ్చు. చివరిగా ఒక మాట. ఈ మహానాడు జరిగిన తీరు ఎలా ఉన్నా ఎల్లో మీడియా మహానాడులో నాలుగు లక్షల మందికి మహా భోజనం అని ప్రచారం చేసింది. అది కూడా సరిగా జరగలేదని, చాలామంది భోజనం దొరక్క ఇబ్బంది పడ్డారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇలా కవరింగ్ ఇచ్చుకున్నారన్న మాట. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘నవ’ మోసాలు
అవనిగడ్డ: జీవో 117ని రద్దు చేయకుండా రెక్టిఫికేషన్ పేరుతో పాఠశాలల సంఖ్యను తొమ్మిది రకాలుగా మార్చడాన్ని ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న చేతలకు పొంతన లేని తీరుపై వారు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యమమే సరైన మార్గమని, లేకపోతే భవిష్యత్ లేదని ఉపాధ్యాయులంతా ఏకమవుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉద్యమబాటకు సై అంటున్నారు. నాటి లోకేశ్ వీడియో వైరల్ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ మాట్లాడిన వీడియోని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. గౌరవ శ్రీనారా లోకేశ్ గారు ఎన్నికలకు ముందు..అంటూ ఇంగ్లిష్, తెలుగు మీడియం ఆప్షన్పై మాట్లాడిన వీడియో ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే తెలుగు, ఇంగ్లిష్ మీడియంపై ఆనాడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు? ఇప్పుడెలా స్పందిస్తున్నారనే వీడియో సైతం అందరి గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. సంతకాలతో మంత్రి లోకేశ్కు లేఖలుఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) యూనియన్ నేతలు ఒకడుగు ముందుకేసి 9 అంశాలపై సంతకాలు చేసిన లేఖలను మంత్రి నారా లోకేశ్కు మెయిల్స్, వాట్సాప్ల ద్వారా పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉపాధ్యాయుల వాట్సాప్ లేఖ సీఎస్పురం(పామూరు): ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారాలోశ్కు ప్రకాశం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తులశ్పంపారు. అన్ని గ్రామాల్లో 1 నుంచి 5 తరగతులకు ప్రాథమిక పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలంటూ పలు అంశాలపై ఏకరువుపెడుతూ వాట్సాప్ చేశారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్గిష్ మాద్యమాలను కొనసాగించాలని కోరారు. ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులు, ఉన్నతపాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలంటూ వాట్సాప్ ద్వారా మంత్రికి వినతులు పంపినట్లు ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.నాయబ్రసూల్, సీఎస్పురం మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాసులు, జె.ఎస్.ఆనంద్బాబు పేర్కొన్నారు. ఆ తొమ్మిది అంశాలివే1. ప్రతి గ్రామంలో ప్రతిపాదిత ఫౌండేషన్ స్కూల్ స్ధానంలో 1 నుంచి 5 తరగతులుండేలా ప్రాథమిక పాఠశాలలు విధిగా కొనసాగించాలి. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. 2. విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం కోసం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలను కొనసాగించాలి. మైనారిటీ భాషల మాధ్యమాలను కొనసాగించాలి. 3. ఎస్జీటీలకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. 4. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది విద్యార్థులు దాటితే 5 ప్లస్ 1 ఉపాధ్యాయులను నియమించాలి.5. ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులను విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలి. 6. ప్రతిపాదిత ప్రభుత్వ ఉత్తర్వు 21లో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పడనున్న 40 పీరియడ్ల భారాన్ని 32 పీరియడ్లకు మించకుండా చూడాలి. 7. ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. 8. క్లస్టర్లలో ఉపాధ్యాయులు మిగులు చూపించకుండా వారిని విద్యార్థుల సంఖ్యను బట్టి అవరోహణ క్రమం (ఎక్కువ నుంచి తక్కువ స్థాయి)లో పాఠశాలలకు కేటాయించాలి. 9. పెరిగిన జనాభా మేరకు మునిసిపాలిటీ, కార్పొరేషన్, నూతనంగా వెలిసిన ఆవాసాలతో నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలి. -
ఎరువులా.. ఇస్తామన్నామా!?
సాక్షి, అమరావతి: రైతు సేవా కేంద్రాల ద్వారా (ఇదివరకటి ఆర్బీకేలు) ఎరువుల సరఫరాకు టీడీపీ కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. గతేడాది అరకొరగా కేటాయింపులు జరిపిన మార్క్ఫెడ్, ఈ ఏడాది పూర్తిగా నిలిపి వేసే దిశగా అడుగులు వేస్తోంది. కారణం బఫర్ స్టాక్ స్కీమ్ కింద ఎరువుల నిల్వ కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ మూలకూ సరిపోక పోవడమే కారణమని చెబుతున్నారు. సాగు ఉత్పాదకాలు, సంక్షేమ ఫలాలు గ్రామ స్థాయిలో రైతుల ముంగిట అందించడమే కాదు.. రైతు సేవలన్నీ అన్నదాతల చెంతకు చేర్చడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఎరువుల సరఫరాకు ఏపీ మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన బఫర్ స్టాక్ స్కీమ్ కింద ఎరువులను మార్క్ఫెడ్ గోడౌన్లలో నిల్వ చేసి, సొసైటీల ద్వారా సరఫరా చేసేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సొసైటీలతో పాటు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఎరువులను గ్రామ స్థాయిలో సరఫరాకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా రవాణా, లోడింగ్, అన్లోడింగ్ చార్జీల కింద బస్తాకు రూ.20 నుంచి రూ.50 వరకు రైతులకు ఆదా అయ్యేది. ఇలా నాలుగేళ్లలో దాదాపు రూ.60 కోట్లకు పైగా ఆదా అయ్యింది. గ్రామ స్థాయిలో నిల్వ చేసేందుకు రవాణా, లోడింగ్, అన్లోడింగ్ హ్యాండ్లింగ్ చార్జీల కింద ఏటా రూ.80 కోట్లకు పైగా ఖర్చయ్యేది. ఈ భారాన్ని మొత్తం వైఎస్ జగన్ ప్రభుత్వం భరించేది.ఏవీ నిధులు? » ఏటా 1.50 లక్షల టన్నులు మార్క్ఫెడ్ ద్వారా బఫర్ స్టాక్ కింద నిల్వ చేసే వారు. డిమాండ్ను బట్టి సొసైటీలు, ఆర్బీకేలకు వీటిని సరఫరా చేసేవారు. గతేడాది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల సరఫరాలో నియంత్రణ లేకపోవడంతో రైతులు అదునులో ఎరువులు దొరక్క అవస్థలు పడ్డారు. ఈ ఏడాదైనా ముందస్తు ప్రణాళికతో సిద్ధమయ్యారా అంటే అదీ లేదు. » ప్రస్తుతం గ్రామ స్థాయిలో 63 వేల టన్నుల నిల్వలున్నాయని ప్రభుత్వం చెబుతున్నా, ఒక్క ఆర్ఎస్కేలో ఒక్క బస్తా కూడా నిల్వ లేని దుస్థితి ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి మార్క్ఫెడ్ ద్వారా 2 లక్షల టన్నులను బఫర్ స్టాక్ కింద నిల్వ చేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అందుకు తగినట్టుగా నిధులు కేటాయించలేదు. » కనీసం రూ.100 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే బడ్జెట్లో రూ.40 కోట్లే కేటాయించారు. మిగిలిన రూ.60 కోట్ల కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపినా, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కేటాయించిన రూ.40 కోట్లూ ఇప్పటి వరకు విడుదల కాలేదు. మార్క్ఫెడ్కు రూ.250 కోట్ల బకాయిలపైనా ప్రభుత్వం మాట్లాడడం లేదు.నాడు కంపెనీల నుంచి నేరుగా ఆర్బీకేలకు..» వైఎస్ జగన్ ప్రభుత్వంలో దేశంలో మరెక్కడా లేని విధంగా ఆర్బీకేల ద్వారా ఎరువుల అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్యంతో 10,611 ఆర్బీకేలకు లైసెన్సులు జారీ చేశారు. పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు కంపెనీల నుంచే నేరుగా ఆర్బీకేలకు సరఫరాకు ఏర్పాట్లు చేశారు. పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమలు చేయగా, సమయంతోపాటు రవాణా, హ్యాండ్లింగ్ చార్జీలు చాలా వరకు తగ్గాయి. గతంలో సొసైటీలకు ప్రాధాన్యం ఇస్తూనే ఆర్బీకేలకు ఏటా నిల్వలు పెంచుకుంటూ వెళ్లేవారు.» ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనాలుగేళ్లలో 34.11 లక్షల మంది రైతులకు 13.31 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేశారు. ఫలితంగా లోడింగ్, అన్లోడింగ్, రవాణా చార్జీల రూపంలో ప్రతి రైతుకు బస్తాకు రూ.20–30 చొప్పున ఆదా అయ్యింది. 2024 –25 సీజన్లోనూ 10 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల ద్వారా సరఫరాకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.» అయితే సీజన్ ప్రారంభంలోనే పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా ఎరువుల సరఫరాను కుదించింది. ఫలితంగా గడిచిన ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి 50 టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడింది. -
అథ్లెట్ యర్రాజీ జ్యోతికి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్
-
జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్
-
ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం గెలుచుకున్న జ్యోతి యర్రాజీకి హృదయపూర్వక అభినందనలు. మీ గెలుపు భారత్, ఆంధ్రప్రదేశ్కు గర్వ కారణం’ అని పేర్కొన్నారు. Heartiest congratulations to @JyothiYarraji on winning the Gold in Women’s 100m Hurdles at the 26th Asian Athletics Championships in Gumi, South Korea! A proud moment for both India and Andhra Pradesh. Wishing you many more accolades ahead!#AAC2025 pic.twitter.com/IlVI79is5d— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025 -
జోగి రమేష్ తనయుడి వివాహ రిసెప్షన్.. నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం (ఫొటోలు)
-
జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో నూతన వధూవరులు మేఘన, జోగి రాజీవ్లకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. -
మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి
-
వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..
-
వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. వారధి వద్ద వృద్ధురాలిని బస్సు ఢీకొనడంతో రెండు కాళ్లకి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో శిశువిహార్ నుంచి తాడేపల్లి తిరిగి వస్తున్న వైఎస్ జగన్.. ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు.వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించే బాధ్యతను ఎమ్మెల్సీ అరుణ్కు ఆయన అప్పగించారు. ఎమ్మెల్సీ అరుణ్.. 108కు పలుమార్లు ఫోన్ చేసినా కానీ సిబ్బంది స్పందించలేదు. దీంతో ఎమ్మెల్సీ అరుణ్.. అటు వైపుగా వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్లో వృద్ధురాలిని విజయవాడ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించేంతవరకూ ఎమ్మెల్సీ అరుణ్ అక్కడే ఉన్నారు. -
వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. నిర్మలా శిశు భవన్కు వైఎస్ జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: నేడు దివంగత మహానేత వైఎస్సార్ తండ్రి, దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.వైఎస్ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీసమేతంగా వైఎస్ జగన్ గురువారం.. విజయవాడలోని నిర్మల శిశు భవన్కు విచ్చేశారు. ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్, భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సోదరి వైఎస్ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు.. పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్సార్సీపీ పార్టీశ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు.మరోవైపు.. పులివెందులలో రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో వైఎస్ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.తన తాత వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. శిశు భవన్లో దివ్యంగ చిన్నారులతో గడిపిన వీడియో, ఫోటోలను ఎక్స్లో షేర్ చేశారు. Cherishing and honouring the 100th anniversary of my late grandfather's memory. pic.twitter.com/CS6IyD08pi— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025 -
మహానాడు పెద్ద డ్రామా: వైఎస్ జగన్
-
ఎన్నికల హామీలు.. మేనిఫెస్టో అమలే హీరోయిజం: వైఎస్ జగన్
మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లకు పైగా కోవిడ్తో ఇబ్బందులు ఎదురైనా సాకులు చెప్పలేదు. మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదు. ⇒ మా పాలనలో ప్రతి ఇంటికీ మంచి చేశాం.. అది ప్రతి ఇంట్లో ఇంకా బతికే ఉంది ⇒ ఇవాళ్టికీ ప్రతి గడపకూ మా కార్యకర్తలు, నేతలు తలెత్తుకుని గర్వంగా వెళ్లగలరు.. ప్రజల ఆశీర్వాదం పొందగలరు ⇒ కోవిడ్ విపత్తులోనూ సాకులు వెతుక్కోకుండా ప్రతి హామీని నెరవేర్చాం.. ⇒ ప్రశ్నించే గొంతులను నొక్కేసేందుకే రెడ్బుక్ బెదిరింపులు.. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యంసాక్షి, అమరావతి: మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. తెలుగు డ్రామా పార్టీ (టీడీపీ) కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడులో సీఎం చంద్రబాబు ఫోజులిస్తూ.. బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. హీరోయిజం అంటే.. కడప జిల్లాలో మహానాడు నిర్వహించడం కాదు..! హీరోయిజం అంటే.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం అని చంద్రబాబుకు చురకలంటించారు. ‘‘సత్తా అంటే కడపలో మహానాడు నిర్వహించడం కాదు.. ఆ కార్యక్రమంలో జగన్ను తిట్టడం హీరోయిజం ఎలా అవుతుంది?’’ అని నిలదీశారు. ‘ఇదిగో మా మేనిఫెస్టో.. వీటిని నెరవేర్చామని రాష్ట్రంలో ఏ ఇంటికైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలను పంపి ఆశీర్వాదం కోరే ధైర్యం ఉందా చంద్రబాబూ? గడప గడపకూ తిరిగే సాహసం చేయగలరా?’ అని సూటిగా ప్రశ్నించారు. ఇవాళ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్లినా మాకు ఇవ్వాల్సిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్లు, అన్నదాతా సుఖీభవ, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని చిన్న పిల్లలు, చిన్నమ్మలు, అత్తమ్మలు, రైతన్నలు, నిరుద్యోగులు నిలదీస్తారని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ సాకులు వెతుక్కోకుండా చిత్తశుద్ధితో 99 శాతం హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. ఇవాళ్టికీ తమ పార్టీ కార్యకర్తలకు రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి మేం వైఎస్సార్సీపీ వాళ్లం అని తలెత్తుకుని గర్వంగా చెప్పే ధైర్యం ఉందని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలు, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిమాణాలపై చర్చించి పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ బతికే ఉంది..ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి బతికే ఉంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి తర్వాత పగలు రాక తప్పదు. రెండు ప్రభుత్వాల మధ్య తేడాను ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. చిన్న హామీలనూ ఎగ్గొట్టారు..చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదు. కడపలో మహిళలు చంద్రబాబు ఎప్పుడు ఉచిత బస్సు అని చెబుతారా..! విశాఖ వెళ్లి వద్దామా..! అని ఎదురు చూస్తున్నారు. మరో చిన్న హామీ ఉచిత గ్యాస్. కనీసం ఆ గ్యాస్ సిలిండర్లు కూడా సరిగా ఇవ్వలేకపోయారు. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు..ఈరోజు రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, కలియగ రాజకీయాలు ఎలా ఉన్నాయో సాక్షులుగా ఉన్న మీరే నా కన్నా బాగా చెబుతారు. రాజకీయాల్లో విలువలుండాలి. విశ్వసనీయతకు అర్ధం తెలుసుండాలి. అప్పుడే రాజకీయ వ్యవస్ధలో తులసి మొక్కలా నిలబడతాం. చంద్రబాబు తన పాలనలో రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు సహా అనేక పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులను చంద్రబాబు తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద గెలిపించుకునే పరిస్థితి లేకపోయినా.. వారంతా వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులని తెలిసినా.. ముఖ్యమంత్రిగా తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిసినా.. తానే దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు ఇది నిదర్శనం.కోవిడ్ ఇబ్బందుల్లోనూ..అప్పుడు మన ప్రభుత్వం జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే.. కొద్ది నెలలకే మార్చి కల్లా కోవిడ్ను చూశాం. రాష్ట్ర చరిత్రలో అలాంటి విపత్తు ఎప్పుడూ చూడలేదు. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. మరోవైపు అనుకోని ఖర్చులు పెరిగాయి. అన్ని రకాలుగా ఇబ్బందికర పరిస్థితులున్నా ఏ రోజూ సాకులు చెప్పలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కన పెట్టలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. సీఎంవో మొదలు ప్రతి కార్యాలయంలోనూ హామీలను డిస్ప్లే చేశాం. ప్రతి రోజూ వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకున్నాం. అలా మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99 శాతం హామీలను అమలు చేసిన పాలన వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. పాలన ఎలా ఉండాలో చూపాం..అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం కాబట్టే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం. 86 నుంచి 88 శాతం స్ధానాలను మనమే గెలిచాం. దాదాపు 120 చోట్ల క్లీన్ స్వీప్ చేయగా తాడిపత్రి, దర్శి రెండు చోట్ల మాత్రమే మనకు తక్కువ వచ్చాయి. తాడిపత్రిలో వాళ్లకు 18, మనకు 16 రావడంతో మన ఎమ్మెల్యే వాళ్లను లాగుదామన్నారు. కానీ నేను స్వయంగా మన ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేయించి అక్కడ ఎన్నిక సవ్యంగా జరిపించా. వైఎస్సార్ సీపీ హయాంలో అంతగా ప్రజాస్వామ్యానికి కట్టుబడ్డాం. ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా ఉన్న ముఖ్యమంత్రి స్ధానంలో వ్యక్తి పాలన ఎలా చేయాలో చూపించాం. మీ అందరికీ హ్యాట్సాఫ్..ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలు చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా ఇదే చేయమని తన ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో.. విలువలు, విశ్వసనీయత అనే పదానికి అర్థం చెబుతూ మన పార్టీలో చిన్న పదవుల్లో ఉన్నవారైనా.. ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తికి గట్టి గుణపాఠం నేర్పారు. రాజకీయాలంటే నీ మాదిరిగా కాదు.. మమ్మల్ని చూసి నేర్చుకో..! అని చంద్రబాబుకు గుణపాఠం చెప్పారు. అందుకు మీ అందరికీ నా హ్యాట్సాఫ్.విద్య, వైద్యం, వ్యవసాయం నిర్వీర్యం...⇒ ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. ఇంగ్లీషు మీడియం పడకేసింది. గోరుముద్ద నాసిరకంగా మారి తినలేని పరిస్థితిలో ఉంది. మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఇప్పిస్తూ ఒక పీరియడ్గా ఏర్పాటు చేస్తే వీళ్లు వస్తూనే దాన్ని ఎత్తేశారు. సీబీఎస్ఈ, నాడు–నేడు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు.. అన్నీ ఆగిపోయాయి. అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేదు. ఏడాది కావస్తోంది. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజులు సున్నా. మన హయాంలో క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. ఇవాళ ఫీజులు గురించి పట్టించుకునే నాథుడు లేడు. పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు మానిపిస్తున్న దుస్థితి నెలకొంది. ⇒ ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 1,000 ప్రొసీజర్లను మన హయాంలో 3,000కు తీసుకుని పోయి ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాం. గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అందుబాటులోకి తెచ్చాం. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. అలాంటి పాలన మనం అందిస్తే.. ఇవాళ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.300 కోట్లు చొప్పున ఏడాదిగా దాదాపు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పేషెంట్లను చూడటం ఆపేశారు. ఇవాళ పేదలు వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారు.⇒ ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్బీకేలు, ఈ–క్రాపింగ్, ఉచిత పంటల బీమాను గాలికి వదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ కింద సీజన్ ముగిసేలోగా రైతులకు తోడుగా నిలిచి సాయం చేసే కార్యక్రమం నిలిచిపోయింది. ఏడాదిగా రైతు భరోసా ఎగ్గొట్టారు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు లభించడం లేదు. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) మాత్రమే కాదు.. జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.10 వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో, పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా ఇవాళ రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. రైతుల కష్టం దళారీల పాలవుతోంది.వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా నిలదీస్తారు..ఇవాళ టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్లినా వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి వీళ్లు చెప్పిన మాటలు ఇవాళ్టికీ ప్రజలకు గుర్తున్నాయి. అందుకే వాళ్లు ఏ ఇంటికైనా వెళ్లి ఆశీర్వదించమని కోరితే.. చిన్న పిల్లల నుంచి ప్రశ్నించడం మొదలవుతుంది. తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు అడుగుతారు. అదే ఇంట్లో నుంచి వాళ్ల అమ్మ, చిన్నమ్మ వచ్చి ఆడబిడ్డ నిధి కింద నాకు ఇస్తామన్న రూ.18 వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తారు. 50 ఏళ్లకు పెన్షన్ అన్నావ్.. మరి మా రూ.48 వేల సంగతేంటని ఆ తల్లుల అమ్మలు, అత్తలు నిలదీస్తారు. కండువా కప్పుకున్న ప్రతి రైతూ ఎన్నికలప్పుడు మాకు అన్నదాతా సుఖీభవ కింద రూ.26 వేలు ఇస్తానన్నావ్.. వాటి సంగతేంటని ప్రశ్నిస్తారు. అదే ఇంట్లో నుంచి ఉద్యోగం కోసం వేచి చూస్తున్న 20 ఏళ్ల యువకుడు నిరుద్యోగ భృతి కింద నాకు ఇస్తానన్న రూ.36 వేలు పరిస్థితి ఏమిటని నిలదీస్తాడు.వడ్డీతో సహా చెల్లిస్తాం...మన హయాంలో నిర్వహించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ద్వారా సమస్యలు చెప్పి ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వారే! నాడు ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. స్పందనలో అత్యధికంగా ఫిర్యాదులు చేసిందీ వాళ్లే. కానీ ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీతో సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు. రాష్ట్రం కూడా బాగు పడుతుంది.జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీటఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నాడు మనం అధికారంలోకి వస్తూనే కోవిడ్ వచ్చింది. రెండేళ్లు పూర్తిగా ప్రజల ఆరోగ్యం, వారికి మంచి చేయడంపైనే దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. ఈసారి జగన్ 2.0లో అలా ఉండదు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు.. కార్యకర్తలకూ ప్రాధాన్యం ఉంటుంది. కార్యకర్తలు అన్నింటికన్నా పైస్థాయిలో ఉంటారు. ఆ విధంగా వారి బాగోగులన్నీ చూసుకుంటాం.వారెక్కడున్నా చట్టం ముందు నిలబెడతాం..ఇప్పుడు మన పార్టీ కార్యకర్తల ప్రతి కష్టం, వారికి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నా. మీ అందరికీ ఒకటే చెబుతున్నా. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో వారి పేర్లు రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం. చేసిన వాళ్లే కాదు... వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించిన వారినీ వదిలిపెట్టం. వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానికి వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు నిర్వర్తించడానికే యూనిఫాం ఇచ్చారు. ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే అక్రమ కేసులు..రాష్ట్రంలో లా ఆండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు పాలనా వైఫల్యాలు, అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు.. ఆ గొంతు వినపడకుండా భయోత్పాతం సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవరిదో తెలుసు. చంపిన వాళ్లు ఎవరో కూడా తెలుసు. టీడీపీలో గ్రూపు తగాదాలే దీనికి కారణమని ఎస్పీ స్వయంగా చెప్పారు. కానీ రెండు రోజుల తర్వాత మన పార్టీ ఇన్ఛార్జ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టారు. మరోవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని అరెస్టు చేసేందుకు ఏ మాత్రం బేస్లేని పాత కేసు బయటకు తీశారు. గతంలో ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే అదే అధికారులతో తప్పుడు ఫిర్యాదు చేయించి, తప్పుడు సెక్షన్లతో కేసు పెట్టి అరెస్టు చేశారు. 2023లో టీడీపీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటన విషయంలో ఇప్పుడు 127వ ముద్దాయి కింద మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే మీద కేసు పెట్టారు. ఇలా చట్టం, రాజ్యాంగం దారుణ ఉల్లంఘనకు గురవుతోంది. గతంలో జరిగిన ఘటనల్లో మనవాళ్లను ఇరికించి జైల్లో పెట్టే కార్యక్రమం రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతోంది.3 లక్షల ఉద్యోగాలు ఊడగొట్టారుఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గమూ చంద్రబాబు ప్రభుత్వంపై సంతృప్తిగా లేదు. చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగమూ రాకపోగా ఉన్న వాటినే ఊడగొడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తూనే 2.6 లక్షల మంది వలంటీర్లు, 15 వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు, 9,800 రేషన్ వాహనాల (ఎండీయూ) మీద ఆధారపడ్డ 20 వేల మందితో కలిపి మొత్తంగా 3 లక్షల ఉద్యోగాలను ఊడగొట్టారు. మనం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఉద్యోగస్తుల్లో విషం నింపి, ఇవాళ వారినీ మోసం చేశాడు. వారికి మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చిన పాపాన పోలేదు. వేతనాల సవరణ (పీఆర్సీ) ప్రస్తావన లేదు. మూడు డీఏలు పెండింగ్. అందుకే ఇవాళ ఉద్యోగులు చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామా అని తల పట్టుకుంటున్నారు.విచ్చలవిడిగా అవినీతిమరోవైపు ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియా, సిలికా, క్వార్జ్ట్ అక్రమ తవ్వకాలు, రాజధాని పనులు.. ఇలా దేన్నీ వదల కుండా దోచేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో స్కామ్లు చేస్తున్నారు. ఇలాంటివి మన హయాంలో లేవు కాబట్టే బటన్ నొక్కి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)తో రూ.2.73 లక్షల కోట్లు ప్రజలకు పారదర్శకంగా అందించాం. ఆరోజు జగన్ చేశాడు... ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే కారణం ఇదే! నేను ఆశపడింది ఒక్కటే... నా మరణం తర్వాత కూడా ప్రతి ఇంట్లో బతికే ఉండాలని ఆశ పడ్డా. అందుకే ఎక్కడా రాజీ పడలేదు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నా. ఇవాళ చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కడం లేదంటే.. ప్రతి దాంట్లోనూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం చేస్తున్నాడు కాబట్టే. అందుకే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 13 శాతం ఆదాయాలు పెరిగితే.. మనకు కేవలం 3 శాతమే పెరిగాయి. అలా ఎందుకు జరుగుతోందంటే.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం టీడీపీ గజదొంగల ముఠా జేబుల్లోకి పోతోంది. ఏ మంచి చేయని, అన్నీ అబద్ధాలు, మోసాలు చేసిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారికి డిపాజిట్లు రాని పరిస్థితులు ఖాయం. -
ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్
-
సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు
-
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్
-
కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...
-
Ys Jagan: దమ్ముంటే ఆ ఒక్కటి చేసి చూపించు..!
-
కౌన్సిలర్లను భయపెట్టి.. ఇదీ ఒక రాజకీయమా బాబూ
-
రాసిపెట్టుకోండి.. రిటర్న్ గిఫ్ట్లు ఇద్దాం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని, తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలూ సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీలో.. వైఎస్సార్సీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రస్తావిస్తూనే కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న అధికారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలవుతోంది. తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరులో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవ్వరిదో తెలుసు, చంపిన వాళ్లు ఎవ్వరో తెలుసు. టీడీపీలో గ్రూపుల తగాదాలే దీనికి కారణమని స్వయంగా ఎస్పీ చెప్పారు. ఇప్పుడు మన పార్టీ ఇన్ఛార్జి పిన్నెల్లిమీద కేసులు పెట్టారు. ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే.. తప్పుడు కేసు, తప్పుడు సెక్షన్లు పెట్టి మాజీ మంత్రిని కాకాణిని అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై ఘటన విషయంలో ఇప్పుడు ఆర్కేమీద కేసు పెడుతున్నారు.ఈ మధ్యకాలంలో అనేక దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. చట్టం, రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతోంది అని అన్నారాయన. రిటర్న్ గిఫ్ట్ తప్పదుఈ సారి 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తల బాగోగులను చూసుకుంటాం. కార్యకర్తలకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నాం. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీ సమా రిటర్న్ గిఫ్ట్(return Gifts)లు ఇస్తాం. చేసినవాళ్లే కాదు, వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించనవారినికూడా సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్డ్ అయినా సరే చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానిక వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు చేయడానికి వీరికి యూనిఫాం ఇచ్చింది’’ అని జగన్ అన్నారు.ఇదీ చదవండి: తెలుగు డ్రామా పార్టీ.. మహానాడుపై జగన్ సెటైర్లు -
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీలో బాబు సర్కార్ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారాయన.టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.... జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. కానీ, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని జగన్ అన్నారు... చంద్రబాబు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్ఈ, టోఫెల్, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్మెంట్ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి... ఆరోగ్య శ్రీనికూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు. రైతు బతుకు దళారీ పాలయ్యింది:.. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్లు, రేషన్ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్సీ లేదు. మూడు డీఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, రాజధాని పనులు.. లిక్కర్ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. జగన్ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని జగన్ అన్నారు.క్లిక్ చేయండి: మహానాడులో చంద్రబాబు మహానటన -
Tadepalle: ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ కీలక భేటీ
-
చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదని, కానీ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన హయాంలో.. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99శాతం హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం.కానీ, చంద్రబాబుది(Chandrababu) దౌర్భాగ్యపు పాలన. తాను ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలొగ్గక విలువలు చాటారు. అందుకు మీ అందరికీ హ్యాట్సాఫ్ చెప్తున్నా.ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. వైఎస్సార్సీపీ(YSRCP)కి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి పలానా వైఎస్సార్సీపీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉంది. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా?. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు’’ అని జగన్ అన్నారు. ఇదీ చదవండి: నారావారి ఏఐ తిప్పలు, ఎన్టీఆర్ ఉండి ఉంటేనా.. -
కొండా రాజీవ్ ను పరామర్శించిన వైఎస్ జగన్
-
ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
-
తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులను ఆహ్వానించారు. వారితోపాటు ఆయా జిల్లాల వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. -
చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు బహిరంగంగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తున్నదో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కారు తీరును తీవ్రస్థాయిలో ఎండగడుతూ మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.తెనాలిలో యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ.. ‘‘చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి... దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల హక్కులను గౌరవించకుండా ‘రెడ్బుక్ రాజ్యాంగం’ అమలు చేస్తోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. యువకులపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి ‘తెనాలిలో దళిత, మైనారిటీ యువకులు చేబ్రోలు జాన్ విక్టర్, దోమా రాకేశ్, షేక్ బాబూలాల్ అలియాస్ కరీముల్లాపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. బాధితులను నడి రోడ్డుపై కూర్చోబెట్టి, అరికాళ్ల మీద లాఠీలతో దారుణంగా కొట్టారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్.. బాధితుల కాళ్లను తొక్కిపట్టగా, మరొక సర్కిల్ ఇన్స్పెక్టర్ లాఠీలతో దాడి చేశారు. మిగిలినవారు ఈ దాడిని వీడియో తీశారు. లాఠీలు విరిగిపోతే నవ్వుతూ కొత్తవి అందజేశారు. వీడియో వైరల్ అయ్యాకే విషయం వెలుగులోకి... ఘోర ఘటనపై మాట్లాడడానికి కూడా ధైర్యం లేక స్థానికులు భయంతో నెలపాటు మౌనంగా ఉన్నారు. వీడియో వైరల్ అయ్యాకే దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎంతటి భయానక వాతావరణం నెలకొందో ఈ ఉదంతం చెబుతోంది. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇలాంటి ఎన్నో దారుణ, అమానవీయ దాడులు జరుగుతున్నాయి. భయంతో ప్రజలు నోరు విప్పలేని పరిస్థితులు ఉండటం వల్ల వెలుగులోకి రావడం లేదు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, అక్రమ కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఇలాంటి పరిస్థితులు ప్రజల్లో ప్రభుత్వం పట్ల, చట్టబద్ధ పాలన పట్ల విశ్వాసం సన్నగిల్లేటట్లు చేస్తున్నాయి. రాజ్యాంగం కేవలం కాగితంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది మానవ హక్కులను కాలరాసే చర్య... తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల దాడి మానవ హక్కులను కాలరాసే చర్య. రాజ్యాంగ విలువల మీద నేరుగా దాడి చేయడమే. పోలీసులు న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలను సమరి్పంచాలే తప్ప... వాళ్లే న్యాయమూర్తులుగా వ్యవహరించి, శిక్షించే పని చేపట్టకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలను కొట్టడం, హింసించడానికి చోటే లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ దాడులకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అవే గొప్పలు.. అదే విద్వేషం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చేసిందేమీ లేకపోవడంతో సీఎం చంద్రబాబు.. ప్రగల్భాలు, ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై విషం కక్కడానికే సమయమంతా వెచ్చించారు. మహానాడు తొలి రోజు అంతా ఆత్మస్తుతి.. పరనిందగా సాగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగడుగునా విద్వేష రాజకీయాల్లో మునిగి తేలుతున్న తెలుగుదేశం పార్టీ.. కడప వేదికగా నిర్వహిస్తున్న మహానాడులోనూ అదే పంథాను కొనసాగించింది. సూపర్ సిక్స్ హామీలు సహా గత ఎన్నికలప్పుడు ఇచ్చిన వందలాది హామీల్లో ఒక్క దాన్ని అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తుండడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని లేనివి ఉన్నట్లు మహానాడులో చిత్రీకరించారు. చంద్రబాబు ప్రసంగం మొత్తం తన గొప్పలు, జగన్ పాలనపై విషం కక్కడానికే సరిపోయింది. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచి ఇప్పుడు సూపర్ సిక్స్ శాసనాలంటూ వాటి పేర్లనే మార్చి.. ఆయన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్తో చెప్పించారు. గత హామీల తీరులో ఈ సూపర్ సిక్స్ శాసనాల ద్వారా యువత, మహిళలు, పేదలు, ఇతర వర్గాలన్నింటినీ పైకి తీసుకువస్తామని ఇప్పుడు ప్రకటించారు. ఇచ్చిన హామీలకే దిక్కు లేని పరిస్థితుల్లో ఈ కొత్త శాసనాలేంటని టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఎక్కడైనా ప్రజల కోసం పథకాలు, విధానాలు, కార్యక్రమాలు రూపొందించడం ఆనవాయితీ. అయితే చంద్రబాబు సారథ్యంలో లోకేశ్ శాసనాలంటూ సరికొత్త పద ప్రయోగంతో ముందుకు రావడం మరోమారు జనాన్ని మభ్యపెట్టి, మాయ చేయడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాసనం అంటే ఎవరిని శాసిస్తారు.. ఏమని శాసిస్తారోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత ప్రభుత్వం అంటూ అదే పనిగా విషంచంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలంతా గత ప్రభు త్వం, జగన్ ప్రభుత్వం అంటూ మహానాడులోనూ జపం చేస్తూనే ఉన్నారు. అప్పుడేదో జరిగిపోయిందని చెప్పడం ద్వారా ప్రజల్ని తన పాలన గురించి ఆలోచించకుండా చేయాలన్నదే చంద్రబాబు అండ్ కో వ్యూహమని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇంకా గత ప్రభుత్వం లెక్కలు తీస్తున్నామని, ఇంకా కొత్త విచారణలు జరపాల్సివస్తుందేమోనని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి ఇక రాష్ట్రానికి తాను చేసేదేమీ లేదని, ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడం, వారిని అన్యాయంగా కేసుల్లో ఇరికించి చిత్రహింసలు పెట్టడానికే కుతంత్రాలు పన్నుతున్నట్లు అర్థమవుతోంది. పార్టీ కార్యకర్తల మనసుల్లో విద్వేషం నింపి వారిని పగతో రగిలేలా చేయడం కోసమే గత ప్రభుత్వంపై అభాండాలు మోపడాన్ని చంద్రబాబు ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకుని దాన్ని మహానాడులోనూ కొనసాగించారు. ఇందులో భాగంగా తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ప్రసంగించడం గమనార్హం. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని సీఎం ఎలా చెబుతారని ప్రజలు మండిపడుతున్నారు.తండ్రీ కొడుకులపై పొగడ్తలు ఎన్టీఆర్ హయాంలో సంస్కరణలు అమలు చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీని అభివృద్ధి చేశామని, 2014–19లో ఇరగదీశామని ఇంకా పాత కథలు చెప్పుకోవడానికే చంద్రబాబు సహా నేతలంతా ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు పార్టీ నేతలంతా చంద్రబాబును, ఆయన కొడుకు, మంత్రి లోకేశ్ను పొగడటానికే పోటీపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలతో ముంచెత్తారు. చాలా మంది నేతలు భూ ప్రపంచంలో చంద్రబాబు, లోకేశ్ అంత గొప్ప వారు ఎవరూ లేరన్న రీతిలో కీర్తించారు.‘మహా’కష్టాలు» నేలకూలిన కటౌట్లు.. పరుగులు తీసిన కార్యకర్తలు» మధ్యాహ్న భోజనాల దగ్గర తోపులాట » పార్టీ శ్రేణులు లేక బోసిపోయిన ప్రాంగణం » నిర్వాహకులపై బాబు సీరియస్ » మీడియాపై లోకేశ్ ఆంక్షలు సాక్షి ప్రతినిధి, కడప/కడప రూరల్: తెలుగుదేశం పార్టీ మహానాడు టీడీపీ కార్యకర్తలకు మహా కష్టాలు తెచ్చిపెట్టింది. మహానాడు సందర్భంగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు గాలికి నేలకొరిగాయి. దీంతో చాలా మంది తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కటౌట్లు పడటంతో పార్కింగ్ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి. కటౌట్ల కారణంగా ఇప్పటికే ఇద్దరు వీఆర్వోలు గాయపడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన చోట తోపులాట జరిగింది. కొంత మంది ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప నగరంలోకి వెళ్లి ఆకలి తీర్చుకున్నారు. ‘ఏమి ఏర్పాట్లో.. ఏమి కమిటీలో.. కనిపిస్తూనే ఉంది’ అని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. కాగా, మధ్యాహ్నం భోజన సమయానికి మహానాడు ప్రాంగణం సగం ఖాళీ కాగా, సాయంత్రానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో చంద్రబాబు నిర్వాహకులపై సీరియస్ అయినట్లు సమాచారం. చివరగా మాట్లాడిన చంద్రబాబు.. చివరి వరకూ ఉండాలని, దీనిని బుధవారం నుంచైనా పాటించాలని కోరడం గమనార్హం. మధ్యాహ్నం మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం ఇచ్చారు. లోకేశ్ అక్కడికి రాగానే.. కెమెరాలు ఆఫ్ చేయాలంటూ ఆదేశించారు. ఎవరైనా కెమెరా ఆన్ చేస్తే లాక్కొవాలంటూ పోలీసులకు సూచించారు. ఫొటోలు కూడా తీయనివ్వలేదు. మంత్రి లోకేశ్ మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్చాట్ నిర్వహించి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా మహానాడు పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ అధికారులకు డ్యూటీలు వేశారు. జిల్లా సర్వోన్నతాధికారి డ్యూటీ పాస్లు ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు ఎల్లో ట్యాగు తగలించుకొని కనిపించారు. కాగా, మహానాడుకు ముందే కరోనా పాజిటివ్ కేసులు రిమ్స్లో నమోదు అయితే, అబ్బే అలాంటిదేమీ లేదని జిల్లా వైద్యాధికారి ప్రకటించారు. -
చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?: వైఎస్ జగన్
తాడేపల్లి: తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై ఏపీ పోలీసులు థర్డ్ ప్రయోగించడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఎలా ఉల్లంఘిస్తుందో అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ వేదికగా ఆ యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. పోలీసులకు అపరిమిత అధికారాన్ని వినియోగించుకునే అవకాశాన్ని ఇచ్చి భారత రాజ్యాంగాన్ని బహిరంగంగానే ఉల్లంఘిస్తోంది. చట్ట పరంగా పాలనను సాగించడానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. మానవ హక్కులను వారి రక్షణను గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యధేచ్ఛగా అమలు చేస్తుంది. పోలీసులు చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలతో సహా ప్రతి పౌరుడి హక్కులను కాలరాస్తున్నారు. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులైన జాన్ విక్టర్, రాకేష్, షేక్ బాబులాల్లను పోలీసు అధికారులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. నడిరోడ్డుపై కూర్చోపెట్టి పట్టపగలే అరికాళ్లపై లాఠీలతో కొట్టారు. ఒక సిఐ వారి కాళ్లను తన కాలితో అదిమి పెట్టగా, మరొక అధికారి వారిని కొట్టారు మిగతా పోలీసులు పక్కనే ఉండి ఆ దారుణాన్ని చిత్రీకరించారు. పైగా లాఠీలు విరిగితే కొత్తవి అందించారు. నెల క్రితం ఈ సంఘటన జరిగినా ఈ విషయంపై మాట్లాడటానికి కూడా జనం భయ పడ్డారు. ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ మరోసారి తెలిసింది. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు అనేకం రాష్ట్రంలో జరిగాయి. ఏపీలో ఒక భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్య పునాదులనే అపహాస్యం చేస్తున్నారు. ఈ సంఘటన మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించటమే. ఇది రాజ్యాంగ విలువలపై ప్రత్యక్షంగా జరిగిన దాడి. ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు కోర్టుల దృష్టికి తీసుకుని వెళ్లాలి.అంతేగానీ ఇలా బహిరంగంగా దాడి చేయటానికి ప్రజాస్వామ్యం అంగీకరించదు. భారత రాజ్యాంగాన్ని బాబు సర్కారు బహిరంగంగానే ఉల్లంఘించి అరాచక పాలన సాగిస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. జరగిన ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ట్యాగ్ చేశారు వైఎస్ జగన్.The @ncbn-led government in Andhra Pradesh is openly violating the Indian Constitution by allowing police to exercise unchecked power. Rather than upholding the rule of law, the state is being run under a harsh “Red Book Constitution” that disregards the rights and protections… pic.twitter.com/zqvwxWXolJ— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2025 చదవండి: దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ ‘బూటు’ దెబ్బ -
‘పద్మ’ పురస్కార గ్రహీతలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: 'పద్మ’ పురస్కార గ్రహీతలకు వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. తమ రంగాల్లో విశిష్ట సేవలందించి పద్మ అవార్డులు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డులు స్వీకరించిన మంద కృష్ణమాదిగ, కేఎల్ కృష్ణ, వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖిలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇవాళ పద్మ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి భవన్లో ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహితలకు పద్మ పురస్కారాలను అందజేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే, ఏపీ నుంచి వి.రాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. -
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి,తాడేపల్లి : రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మండపేట, మదనపల్లె మున్సిపాలిటీలతో పాటు గొల్లప్రోలు నగర పంచాయతీ, పెనుకొండ మండల నేతలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లను ఆహ్వానించారు. వారితోపాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. -
గడ్కరీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. దేశానికి సేవ చేయటంలో మీకు మంచి ఆరోగ్యం, నిరంతర శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Warm birthday wishes to the Hon’ble Union Minister Shri @nitin_gadkari ji. Wishing you good health and continued strength in your service to the nation.— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2025 -
గోదావరిలో యువకుల గల్లంతుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
YS Jagan: పొదిలి పర్యటన వాయిదా
సాక్షి, ప్రకాశం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పొదిలి పర్యటన వాయిదా పడింది. రేపు(బుధవారం, మే 28) ఆయన అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే.. భారీ వర్షాల నేపథ్యంతో పొదిలి పర్యటన(Podili Tour) వాయిదా పడిందని వైఎస్సార్సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వెల్లడించింది. కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.ఇదీ చదవండి: కోనసీమ విషాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి -
కోనసీమలో విషాదం.. వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
తాడేపల్లి: గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతవడంతో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచి్చన వారిలో 11మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీస్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఎనిమిది మంది మునిగిపోయారు.కాకినాడకు చెందిన సబ్బిత క్రాంతి మాన్యూల్ (19), సబ్బిత పాల్ మాన్యూల్ (18), తాతపూడి నితీష్ (19), ఎలుపర్తి సాయి (18), మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (18) గల్లంతయ్యారు. ఒకరిని కాపాడబోయి వరుసగా.. కె.గంగవరం మండలం శేరిలంకలో పోలిశెట్టి నాగరాజు, చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమ జ్యోతి ఓణీ ఫంక్షన్ జరిగింది. ఇందుకోసం ఇక్కడకొచ్చిన 11 మంది యువకులు భోజనాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరిని చూసేందుకు వెళ్లారు. స్నానానికి దిగారు. వీరిలో స్థానికంగా నివాసముంటున్న ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు. అతనిని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురూ వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యంకాలేదు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే గట్టు మీదకు చేరారు. వీరిలో కాకినాడకు చెండిన డి.కరుణ్కుమార్ ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు.గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు వారే.. విషయం తెలుసుకున్న కె.గంగవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని నాటు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితంలేదు. అధికారుల బృందాలతోపాటు స్థానికులు గౌతమీ గట్టు వెంబడి గాలించారు. రాత్రి సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లా యంత్రాంగం రప్పించింది. పడవలపై ఫ్లడ్లైట్లు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు యువకులే. యువకుల కుటుంబ సభ్యులు çఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కలెక్టర్ ఆర్. మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి, ఎస్పీ బి.కృష్ణారావు గాలింపును పర్యవేక్షించారు.గ్రామస్తుల ఆగ్రహం.. ఎనిమిది మంది యువకులు గల్లంతైనా గాలింపు చర్యలు చేపట్టడంలో పోలీసులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఘటన జరిగితే రాత్రి ఏడు గంటల వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించకపోవడంపై మండిపడ్డారు. కలెక్టర్, జేసీలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సకాలంలో రాకుంటే గల్లంతైన యువకుల ఆచూకీని ఎలా తెలుసుకుంటారని నిలదీశారు. -
కాకాణికి 14 రోజుల రిమాండ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఉన్న రుస్తుం మైన్స్లో తవ్వకాలకు సంబంధించి కాకాణిపై అక్రమ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ఆదివారం అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం గూడూరు అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. వెంకటగిరి జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్.విష్ణువర్మ ఈ కోర్టుకు ఇన్చార్జిగా ఉన్నారు. ఈ క్రమంలో వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 14 రోజుల పాటు కాకాణికి రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఉన్న సెంట్రల్ జైలుకు తరలించారు.రెండు గంటల పాటు వాదోపవాదాలురుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగిందందటూ నమోదు చేసిన కేసు అక్రమం అని కాకాణి గోవర్ధన్రెడ్డి తరఫు న్యాయవాదులు రోజారెడ్డి, ఉమామహేశ్వరరావు తమ వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్ట్లో లోపాలున్నాయని, అరెస్ట్ సమయంలో కాకాణి కుటుంబసభ్యులకు తెలియజేయలేదని వివిధ లోపాలను ఎత్తిచూపారు. అనారోగ్య సమస్యల కారణంగా కాకాణికి స్పెషల్ కేటగిరీ కింద సదుపాయాలు కల్పించాలని కోరారు. దీంతో మానవతా దృకృథంలో ఆయా సౌకర్యాలు కల్పించాలని న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతోపాటు వారానికి రెండుసార్లు కాకాణి తరఫు న్యాయవాదులు రోజారెడ్డి, ఉమామహేశ్వరరావు జైల్లో ఆయనను కలిసేందుకు అవకాశం కల్పించారు.–రుస్తుం మైన్స్లో తవ్వకాలపై ఈ ఏడాది ఫిబ్రవరి 16 జిల్లా ఇన్చార్జి మైనింగ్ డీడీ బాలాజీనాయక్ ద్వారా అధికార టీడీపీ నేతలు పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఈ అక్రమ కేసులో.. ముగ్గురు నిందితులను చేర్చారు. వారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. అయితే, రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా పోలీసులు మార్చి 28న ఆ ఎఫ్ఐఆర్కు కొనసాగింపుగా రిమాండ్ నివేదిక ద్వారా ఏ4గా మాజీ మంత్రి కాకాణిని చేర్చారు. అన్నా.. నేనున్నా.. అధైర్యపడొద్దు–కాకాణికి ఫోన్లో వైఎస్ జగన్ భరోసా–బెయిల్పై ఆరా తీసిన వైఎస్సార్సీపీ అధినేతవెంకటగిరి(సైదాపురం): అక్రమ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ‘‘నేనున్నాను’’ అని భరోసా ఇచ్చారు. కాకాణిని సోమవారం వెంకటగిరి కోర్టుకు తీసుకురావడంతో ఆయనకు బెయిల్ విషయమై వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీ గురుమూర్తితో ఫోన్ ద్వారా ఆరా తీశారు.కోర్టు దగ్గర ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి ఫోన్ ద్వారా కాకాణితో మాట్లాడారు. ‘‘అన్నా.. నీకు అండగా నేనున్నా.. నీవు అధైర్య పడొద్దు.. న్యాయం గెలుస్తుంది.. నీవు నిష్కళంకుడిగా బయటకు వస్తావు’’ అంటూ వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. మూడు గంటల వ్యవధిలో కాకాణితో రెండుసార్లు ఫోన్లో మాట్లాడారు. కాకాణి కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. రిమాండ్ విధించిన విషయమై కూడా వైఎస్ జగన్కు స్థానిక నేతలు సమాచారం ఇచ్చారు. సోమవారం వెంకటగిరిలో జరిగిన పరిణామాలన్నిటినీ వైఎస్ జగన్కు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వివరించారు. -
నవ రాయ్పూర్ దారిలో అమరావతి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మే 22న నిర్వహించిన ప్రెస్ మీట్లో అమరావతి పేరుతో జరుగు తున్న ఆర్థిక దోపిడీని ఆధా రాలతో సహా వివరించారు. ఇప్పటి వరకూ రాజధానిగా ఎటువంటి చట్టబద్ధత లేని అమరావతి పేరుతో చంద్రబాబు సుమారు రూ. ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు. దీని నిర్మాణానికి ఒక్క పైసా కూడా అవసరం లేదనీ, ఇదో సెల్ఫ్ ఫైనాన్స్స ప్రాజెక్టు అంటూ ఒకవైపు ప్రచారం చేస్తూనే మరో వైపు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు, జర్మన్ బ్యాంకు నుంచి రూ. 5 వేల కోట్లు, సీఆర్డీఏ బాండ్ల జారీ ద్వారా 21 వేల కోట్లు అప్పులు చేసి అమరావతికి ఖర్చు చేస్తున్నారు. ఏడాది బడ్జెట్లో అమరావతి కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించారు. దీనికి తోడు అమరావతి కోసం మరో 50 వేల ఎకరాలు సమీకరించబోతు న్నామనీ, దానికి మరో రూ. 77 వేల కోట్లు అవసర మవుతాయనీ ఆర్థిక సంఘానికి తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది, పన్నుల రాబడులు తగ్గాయి. ఏడాది కాలంలోనే లక్షా 50 వేల కోట్ల రూపాయల రుణాలు చేసి దేశంలోనే అప్పుల్లో అగ్రస్థానంలో ఏపీని నిలిపారు బాబు. అమరా వతిలో ఇప్పటికీ భూ సమీకరణ పూర్తి చేయలేక పోయారు. రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారంటూ ఇప్పటికీ తప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఇంకా 20 శాతం మంది రైతులు తమ భూములను సీఆర్డీఏకు అప్పగించి రిటర్నబుల్ ప్లాట్స్ పొందలేదు. రాష్ట్రం ఏమైపోయినా సరే తాము మాత్రం అమరావతిపై లక్షల కోట్లు కుమ్మరిస్తామంటున్నారు.ఒక రాజధాని నగరాన్ని నిర్మించడం ఎంత కష్టమో ‘అటల్ నగర్– నవ రాయ్పూర్’ను చూస్తే అర్థమవుతుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2006 నుంచి 20 వేల ఎకరాల్లో ఈ నగరాన్ని నిర్మించడానికి ఆప సోపాలు పడుతోంది. 41 గ్రామాల నుంచి సేకరించిన ఈ భూమిలో నిర్మాణాలు ప్రారంభించి 19 ఏళ్లయినా ఇప్పటికీ నగర నిర్మాణం పూర్తి కాలేదు. చంద్రబాబు మాత్రం లక్ష ఎకరాల్లో మహా నగరం నిర్మిస్తానంటూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అటల్ నగర్ నిర్మాణ విషయంలో ఎంతో ఆర్భాటం చేసింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ అనీ, దేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ఆరో నగరమనీ, దేశంలో మొదటి జీరో వాటర్ డిశ్చార్జ్ సిటీ అనీ, 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తామనీ ప్రచారం చేశారు. చిన్న పిల్లలకు ఉచితంగా చికిత్స అందించే దేశంలోని అతిపెద్ద శ్రీసత్యసాయి సంజీవిని ఆస్పత్రి, ప్రపంచంలో నాల్గో అతి పెద్ద క్రికెట్ స్టేడియం, నాలుగు జాతీయ విద్యా సంస్థలు, పది కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్ పోర్ట్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్, జెమ్స్ అండ్ జ్యూయలరీ సెంటర్, జూ, సఫారీ, గోల్ఫ్ విలేజ్, మ్యూజియం, బొటానికల్ గార్డెన్ , ఫిల్మ్ సిటీ, 5 స్టార్ హోటల్స్ ఏర్పాటు చేశారు. ఇన్ని ఏర్పాటు చేశామని చెబు తున్నప్పటికీ ఇది ఒక ఘోస్ట్ సిటీగా మారింది. 5.36 లక్షల జనాభా అవసరాల కోసం నిర్మించిన ఈ నగరంలో ప్రస్తుతం రెండు లక్షల 50 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. నగర జనాభా 5.36 లక్షలకు చేరాలంటే 2031 వరకూ వేచి చూడాల్సిందే అంటున్నారు నయా రాయ్పూర్ డెవలప్మెంట్ అధారిటీ అధికారులు.ఎంత ప్రచారం చేసినా, ఎన్ని సదుపాయాలు కల్పించినా, అనేక రాయితీలు ప్రకటించినా నవ రాయ్పూర్కు పెట్టుబడులు రావడం లేదు, ఉపాధి కల్పన లేదు. ప్రజలు కూడా ఇక్కడ స్థిరపడటానికి ఆసక్తి చూపడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదు. 2022–23 లెక్కల ప్రకారం విజయవాడ, గుంటూరు నగరాల జీడీపీ విలువ రూ. 1,467 కోట్లు కాగా, విశాఖపట్నం జీడీపీ విలువ రూ.1,867 కోట్లు. వేలాది కోట్ల వ్యయంతో నిర్మించిన నవరాయ్పూర్ జీడీపీ కేవలం రూ. 270 కోట్లు. పక్కనే ఉన్న రాయ్పూర్ జీడీపీ రూ. 750 కోట్లు. నగర నిర్మాణం పేరుతో చేసిన అప్పులు తీర్చడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తంటాలు పడుతోంది.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల 16వ ఫైనాన్స్ కమిషన్ సభ్యులను కలిసి రూ.4,131 కోట్లు ప్రత్యేక గ్రాంట్గా ఇవ్వాలని కోరారు. నూతన నగరాలను నిర్మించాలనుకునే వారికి ఇది ఒక హెచ్చరిక. నగర నిర్మాణాల ద్వారా సంపదను సృíష్టించవచ్చని చంద్ర బాబు అంటున్నారు. ఇది నిజం కాదని నవ రాయ్ పూర్ రుజువు చేస్తోంది. అంతే కాదు, చైనాలో కొత్తగా నిర్మించిన అనేక నగరాలు, మలేషియా నిర్మించిన ఫారెస్ట్ సిటీ, పరిపాలనా నగరం ‘పుత్రజయ’ కూడా నిర్మానుష్య నగరాలుగా మారాయి. ఈ నగరాలు సంపద సృష్టించకపోగా అప్పులు, నిరర్థక ఆస్తులు మిగి ల్చాయి. ఇదే పరిస్థితి అమరావతికి ఏర్పడినా ఆశ్చర్య పోనక్కర లేదు!వి.వి.ఆర్. కృష్ణంరాజువ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ప్రెసిడెంట్ ‘ 89859 41411 -
ఈనెల 28న పొదిలికి వైఎస్ జగన్ వస్తున్నారు: అన్నా రాంబాబు
-
పవన్ ప్రకటన.. బలమా? లేక భయమా?
‘‘ఒక్కసారి మంత్రి పదవి ఇచ్చి చూడు గణనాథ’’ అని ఓ పాట ఉంది. ఇప్పుడు ఈ పాటను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటారా?. ఆయన ఇప్పుడు తన పదవిని ప్రజాసేవకంటే తన అహంకార ప్రదర్శనకు, వ్యక్తులు, సినీ పరిశ్రమను బెదిరించేందుకే ఎక్కువగా వాడుతున్నట్లు స్పష్టమవుతోంది. కానీ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఆయన స్వయానా ముఖ్యమంత్రి కాదు. ఉప ముఖ్యమంత్రి మాత్రమే. రెండోది.. సినిమాటోగ్రఫీ ఆయన పరిధిలోకి రాదు. కాకపోతే ఆ శాఖ జనసేనకే చెందిన కందుల దుర్గేశ్ది. అంటే.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకుని తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులను హెచ్చరించారన్నమాట. ఈ అభ్యంతరకరమైన పని చేస్తున్నప్పుడు కూడా గత ప్రభుత్వం ఏదో సినీ పరిశ్రమను వేధించిందన్న అబద్ధాలను ప్రకటనలో జొప్పించారు. సినీ పరిశ్రమ వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవలేదన్నది ఆయన అభ్యంతరాల్లో ఒకటి. నిజానికి.. పరిశ్రమలో పలువురు ప్రముఖులతో (Cine Industry Biggies) చంద్రబాబుకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. వారి సేవలను టీడీపీ బాగానే వాడుకుంటోంది. కానీ కొందరు కీలకమైన వ్యక్తులు పవన్ను మాత్రమే కలసివెళ్లారు. అయినా ఆయనలో ఏదో అసంతృప్తి! కృతజ్ఞత చూపడం లేదని ఇంకో మాట అన్నారు పవన్. ఇది అడిగి సన్మానం చేయించుకున్నట్లుగా ఉంది! తనకు తెలియకుండా ఎవరూ సినిమాలు తీయరాదన్నది పవన్ ఉద్దేశమా? లేక సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా తన చెప్పు చేతలలో ఉండాలని కోరుకుంటున్నారా? ఏది ఏమైనా... సినీ పరిశ్రమ మొత్తాన్ని బెదిరిస్తూ పవన్ బహిరంగ ప్రకటన జారీ చేయడం వారిని అవమానించడమే!. 👉వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా సినీ పరిశ్రమ తన వద్దకు వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సహా అందరినీ సాదరంగా ఆహ్వానించి, చర్చలు జరిపి, వారి కోర్కెలు తీర్చడానికి ప్రయత్నించారు. ఇప్పుడు పవన్ మాత్రం థియేటర్లలో సదుపాయాలు తనిఖీ చేస్తాం.. టిక్కెట్ రేట్ల పెంపుదల గురించి ఎవరూ తమ వద్దకు వ్యక్తులుగా రావద్దు.. ధరలు పెంచాక దానికి తగ్టట్లే ఆదాయం ప్రభుత్వానికి వస్తోందా? లేదా? అన్నది చూస్తాం.. అంటూ బెదిరిస్తున్నారు. ఏది కరెక్ట్? పైగా.. పవన్ ఏ అధికారంతో ఇలాంటి ప్రకటనలు చేశారు? ప్రభుత్వ విధానాన్ని ఆయన చెప్పి ఉంటే.. వచ్చే నెలలో విడుదల కానున్న ఆయన సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)కు సంబంధించి రేట్ల పెంపుదల వ్యక్తిగతంగా కోరకుండా ఉంటారా?. ఇకపై ఆయా సినిమా విభాగాలతోనే మాట్లాడతామని పవన్ చెప్పిన మాట తనకు, తన సినిమాలకు కూడా వర్తిస్తుందా? లేదా?. తన సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా చేస్తున్నారా?. థియేటర్ల వారు, డిస్ట్రిబ్యూటర్లు పర్సెంటేజ్ పద్దతి పెట్టాలని, అద్దె ప్రాతిపదికన అయితే తమకు నష్టం వస్తోందని అంటున్నారు. అందులో హేతుబద్దత ఎంత? సమస్యలుంటే పరిష్కరించాలి కాని ఎవరినో దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ ఎందుకు ఈ రకంగా ప్రకటనలు చేస్తున్నారు? సినిమా జయాపజయాలపై ఆందోళనతోనా?. 👉వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని ఇప్పటికే పవన్ కల్యాణ్ సినిమా ఫ్లాఫ్ అన్నారు. రాజకీయం, సినిమా కలిసినప్పుడు సహజంగానే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీని నోటికి వచ్చినట్లు దూషించి, పలు ఆరోపణలు గుప్పించినప్పుడు వారు చూస్తూ ఉండలేరు కదా!. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పుకోవాలి. మంత్రిగా ఉంటూ పూర్తిస్థాయిలో సినిమాల్లో నటిస్తున్న వ్యక్తి ఒక్క పవన్ కల్యాణే!. కొన్నేళ్ల క్రితమే భారీ అడ్వాన్స్ లు తీసుకుని కొన్ని సినిమాలు చేయడానికి ఆయన ఒప్పుకున్నారట. కానీ పవన్ ధోరణితో ఆ నిర్మాతలు నిస్సహాయంగా మిగిలిపోయారని అంటారు. కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టిన నిర్మాతలు.. పవన్ రాజకీయాల కోసం ఏళ్ల తరబడి షూటింగ్లు చేయకుండా ఉండిపోవాల్సి రావడంతో వారు గగ్గోలు పెడుతూ ఉండొచ్చు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతం అవుతుండొచ్చు. వీటికి తోడు.. ఇటీవల సినిమా ఫంక్షన్లలో రాజకీయ ఉపన్యాసాలు జరుగుతుండడం.. దానిపై విమర్శలు, బాయ్కాట్ పిలుపులు వస్తుండడంతో నిర్మాతలూ నష్టపోయారు. ఆ మధ్య నటుడు పృథ్వీ వ్యాఖ్యలతో మరో నటుడి సినిమా ఆర్థికంగా నష్టపోయింది. తాజాగా భైరవం సినిమా డైరెక్టర్ వైఎస్సార్సీపీని పరోక్షంగా విమర్శిస్తూ.. పవన్ను పొగుడుతూ చేసిన వ్యాఖ్య కూడా ఆ సినిమాపై వ్యతిరేక ప్రభావం చూపించేలా ఉంది. నిజానికి పార్టీలకు, కులాలకు అతీతంగా ఉండవలసిన సినిమా రంగం వివాదాస్పద వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నారనిపిస్తోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపనతో.. సినిమాలు, రాజకీయం కలసిపోవడం ప్రారంభమైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పతాక స్థాయికి చేరిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశంతో కలిసిన తర్వాత అది మరింత చికాకుగా మారింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రాల్లో నటించారు. అవి అంతగా సక్సెస్ కాలేదు. కానీ ప్రతిపక్షంలో ఉండగా నటించిన మేజర్ చంద్రకాంత్ సూపర్ హిట్! అధికారాన్ని అనుభవిస్తున్న పవన్కూ ఈ భయం (Pawan Cinema Fear) కూడా పట్టుకుని ఉండాలి!!.ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ పనితీరు అంత సంతృప్తికరంగా లేదని చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన రేటింగ్ చెబుతోంది. ఇప్పుడు సినిమాలు బాగా నడిస్తే ఫర్వాలేదు. లేదంటే తన విలువ బాగా తగ్గే అవకాశం ఉంది. పవన్ ఎంత విధేయుడిగా ఉన్నా.. టీడీపీ వారు ఎక్కువమంది ఈయన వైఫల్యాన్నే కోరుకుంటూ ఉంటారు. అలాగైతేనే పవన్ తమకు అణగిమణగి ఉంటారన్నది వారి ఆలోచన. పవన్ దూషణల కారణంగా వైఎస్సార్సీపీ వాళ్లు ఆయన సినిమాను ఆదరించడం కష్టమే. బహుశా పవన్ను ఈ భయాలన్నీ వెంటాడుతున్నాయేమో!. ఈ దశలో సినిమా థియేటర్ల బంద్ చేస్తామని హెచ్చరించడం వెనుక ఏదో ఉందని భావించినట్లు ఉన్నారు. వెంటనే తన పార్టీకి చెందిన మంత్రి దుర్గేశ్తో ఒక ఆదేశం ఇప్పించారు. ఈ బంద్ పిలుపు వెనుక ఎవరు ఉన్నారో? కనిపెట్టాలని ఆయన హోంశాఖను కోరారట. బహుశా ఇలా బెదిరింపు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నాం. అక్కడితో ఆగకుండా పవన్ కల్యాణ్ తొందరపడి ఒక భారీ ప్రకటన జారీ చేశారు. ఎవరిమీద కోపం ఉందో నేరుగా చెప్పలేదు కానీ... పరోక్షంగా కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. 👉ప్రముఖ నిర్మాత ఆయన బంధువైన అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, దిల్ రాజు వంటి కొద్ది మంది చేతిలోనే అత్యధిక థియేటర్లు ఉన్నాయని చెబుతారు. అల్లు అరవింద్, ఆయన కుమారుడు అల్లు అర్జున్లతో పవన్కు అంత మంచి సంబంధాలు లేవన్న చర్చ కూడా ఉంది. అందువల్లే భయపడో? మరే కారణమో తెలియదు కాని అరవింద్ ఒక్కరే పవన్ కల్యాణ్కు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. తనకు ఇప్పుడు థియేటర్లు లేవని చెప్పు కోవచ్చు కాని, పవన్ సినిమా విడుదలకు ముందు బంద్ అంటూ దుస్సాహసం చేస్తారా? అని ప్రశ్నించారు. ఇది మరో నటనగా కనిపిస్తుంది. సినీ రంగంపై ఆధిపత్యం కలిగిన ఈ ముగ్గురు, నలుగురు థియేటర్లను లీజ్ కు తీసుకుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ ఈ లీజు అంశాలను కూడా ప్రస్తావించి వారు పన్నులు కడుతున్నారా? లేదా? థియేటర్లలో సదుపాయాలు ఉన్నాయా? లేదా? తదితర అంశాలను తనిఖీ చేయాలని ఆదేశించారట. ఇంత బహిరంగంగా సినిమా వారిని అదే రంగానికి చెందిన మంత్రి బెదిరించడం ఇప్పుడే చూస్తున్నాం. అంటే పవన్ తన సినిమా విడుదల టైమ్లో ఈ వివాదం రాకపోతే.. థియేటర్లు పన్ను కట్టకపోయినా, సదుపాయాలు కల్పించకపోయినా, తినుబండారాలు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మినా ఫర్వాలేదన్న మాట!. 👉వైఎస్ జగన్(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్లో ‘‘సినిమా వాళ్ల గురించి మాట్లాడడానికి, రేట్లు నిర్ణయించడానికి, మా ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకోవడానికి అనుతించకపోవడానికి నువ్వు ఎవరికి?’’ అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్... ఇప్పుడు వాటన్నిటినపై తనకే అధికారం ఉన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారు?. గతంలో బ్లాక్ టిక్కెట్ల విక్రయం లేకుండా చూడడాన్ని కూడా ఆక్షేపించించడం విడ్డూరమే అనిపిస్తోంది. ప్రస్తుతం కౌంటర్లలో టిక్కెట్లు ఎంతకు అమ్ముతున్నారో కూడా చూడాలని అధికారులకు ఈయన చెప్పారట. పవన్ మరో విచిత్రమైన వాదన చేస్తున్నారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా కోసం ఆయన ఆలోచన చేస్తున్నారట. దాన్ని కూడా పట్టించుకోకుండా సినిమా వారు తనకు బంద్ అంటూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారట. నిజానికి సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడం అంత తేలిక కాకపోవచ్చు. ఎందుకంటే ఇదేమీ రెగ్యులర్గా పనిచేసే రంగం కాదు. పర్మెనెంట్ స్టాఫ్ కూడా ఉండరు. వీరి రెమ్యునరేషన్లపై ఎవరి కంట్రోల్ ఉండదు. పరిశ్రమ హోదా ఇస్తే ప్రభుత్వం నుంచి తమకు కావల్సినవారికి నిధులు ఇచ్చుకోవచ్చని ఎవరైనా చెప్పారేమో తెలియదు. ఏపీలో షూటింగ్ చేస్తే రాయితీలు ఇస్తామని జగన్ చెబితే తప్పని ప్రచారం చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్దికి ఏమీ చేయకపోగా.. వారి అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం ఏమిటో?. బంద్ ఆలోచన చేయడం లేదని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ ప్రకటించినా, పవన్లో ఏదో ఆందోళన ఉన్నట్లే కనిపిస్తోంది. అందుకే అధికార దుర్వినియోగం చేస్తున్నారా?. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు
-
పవన్ నోట.. పూటకో మాట..
పవన్ కళ్యాణ్కు రాజకీయం అబ్బకపోయినా దాన్నుంచి లాభాన్ని ఎలా పిండుకోవాలో మాత్రం బాగానే తెలుసు. అంటే పూటను బట్టి మాటను.. రోజును బట్టి అభిప్రాయం మార్చుకోవడంలో చంద్రబాబుకన్నా నాలుగైదు ఆకులు ఎక్కువే చదివేసారు పవన్. తనకు కులం మతం లేదని చెప్పే పవన్ మర్నాడే తాను యేసును నమ్ముతానని, తన బిడ్డలకు బాప్టిజం ఇప్పించానని చెబుతారు.తనకు కులం లేదని చెప్పిన మరుక్షణమే తనకు కాపులంతా మద్దతుగా ఉండాలని డిమాండ్ చేస్తారు. గతంలో ఎన్నోసార్లు తన పరపతిని ఇమేజీని తెలుగుదేశానికి తాకట్టు పెడితే టీడీపీ నాయకులు.. కార్యకర్తలు తన తల్లిని తిట్టారని ఆవేదన చెందుతారు. ఆ తరువాతి ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ చంక ఎక్కుతారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చి ఆంధ్రులను చిన్నచూపు చూసే ఢిల్లీ బీజేపీకి తాను ఎన్నడూ మోకరిల్లేది లేదని హుంకరిస్తారు.. ఆ తరువాత మళ్ళీ ఢిల్లీ వెళ్లి పెద్దల ముందు సాగిలపడతారు. తనను తెలుగుదేశం పార్టీ వాడుకుని వదిలేస్తుంది ఎన్నోమార్లు వగచే పవన్ మళ్ళీ ఆ టీడీపీ మోచేతి నీళ్లు తాగుతున్నారు.. ఇప్పుడు కూడా తనలో స్ల్పిట్ పర్సనాలిటీ ఉన్నట్లు మరోమారు రుజువుచేసుకున్నారువైయస్ జగన్ హయాంలో పవన్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ.. పనిలోపనిగా సినిమా ఇండస్ట్రీకి సైతం గార్డుగా ఊహించుకునేవారు. ఎవరైనా సినిమా ఇండస్ట్రీ వైపు చూస్తే ఊరుకునేది లేదని.. ఆ వ్యవస్థ ఇక స్వయంచాలితం అని.. దాని వ్యాపారం.. సినిమాలు.. అనుమతులు.. టిక్కెట్ రేట్ల పెంపు వంటి వాటి అంశాలమీద ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదని.. అసలు ఎవరైనా సినిమా వ్యాపారం జోలికి వస్తే ఊరుకోనని బీరాలు పలికారు. అంటే సినిమా టిక్కెట్ల ధరలు నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరు?. అంతా ఇండస్ట్రీ పెద్దల ఇష్టానుసారం జరగాలి తప్ప మధ్యలో ప్రభుత్వం ఎందుకు అనేది అయన ఉద్దేశ్యం.. పైగా నటులు ఎవరూ ప్రభుత్వ పెద్దలను నాటి సీఎం వైఎస్ జగన్ను కలవాల్సిన అవసరం లేదన్నది ఆయన ఉద్దేశ్యంగా ఉండేది.ప్రైవేట్ పెట్టుబడి తోటి నిర్మాతలు సినిమా చేస్తా ఉంటే, గవర్నమెంట్ ఎలా కంట్రోల్ చేస్తది??పరిశ్రమ పైన ఎందుకు నీకు అంత పగ?? ఎందుకు వాళ్లని బెదిరిస్తున్నావ్?? @PawanKalyan https://t.co/liTLIto3N3 pic.twitter.com/pvl62CyAwT— Monster🇮🇳 (@varmamaster7) May 24, 2025ఇపుడు అయన అధికారంలో ఉన్నారు.. చంద్రబాబు కేబినెట్లో నంబర్ టూ పాత్రలో.. డిప్యూటీ సీఎంగా పదవిలో ఉండేసరికి తనకు మళ్ళీ ఇండస్ట్రీనే గుర్తొచ్చింది. అసలు తాము ఎన్నికల్లో గెలిచాక తెలుగు సినిమా పెద్దలు.. నటులు.. నిర్మాతలు చంద్రబాబును కలవడానికి ఎందుకు రాలేదని పవన్ బాధపడిపోయారు. తన రాజకీయ యజమాని తరఫున వకాల్తా పుచ్చుకుని ఆయన ఇండస్ట్రీ పెద్దలను ప్రశ్నించారు.. అసలు మీకు కృతజ్ఞత ఉందా?. ఎన్నికల్లో గెలిచాక మీరు వచ్చి బాబును కలవాలని తెలియదా?. సినీ పరిశ్రమకు టీడీపీ ఎంతో చేసింది.. అలాంటిది మీరంతా వచ్చి చంద్రబాబును కలిసి మోకరిల్లాలని తెలియకపోతే ఎలా .. అంటూ ఏదేదో మాట్లాడారు. అంటే వైఎస్ జగన్ సీఎంగా ఉన్నపుడు మాత్రం సినీ పరిశ్రమ స్వతంత్రంగా ఉండాలి.. చంద్రబాబు గెలిస్తే మాత్రం వారంతా వచ్చి కలవాలి. మొత్తానికి రాజకీయం బాగా నేర్చి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నాడు పవన్.. పూటకోమాట అంటూ ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు -సిమ్మాదిరప్పన్న. -
ఈ పదవి నాకు ఇచ్చినందుకు జగనన్నకు ధన్యవాదాలు
-
మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
-
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన మంత్రులు
సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 28న పొదిలిలో పొగాకు బోర్డును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మంత్రుల హడావుడి మొదలైంది. వైఎస్ జగన్ దెబ్బకు మంత్రులు దిగొచ్చారు. పొగాకు రైతులతో మార్టూరులో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పలువురు రైతులతో మాట్లాడారు. 28 లోపు పొగాకు కొనుగోలు జరపాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలుఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఆశ ఎక్కువ .. పంట పండించక ముందు ఆలోచించాలి. పండించాక నష్టపోయామని బాధపడకూడదంటూ వ్యాఖ్యానించారు. మార్కెట్ లో పంట అమ్మకాలను పసిగట్టి పంటలు వేసుకోవాలంటూ రైతులకు ఉచిత సలహా ఇచ్చారు.కాగా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిరప, వరి, కంది, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను నష్టాలబాట పట్టించిందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. జిల్లాలో పొగాకు రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. వేలం కేంద్రానికి వెళ్లి పొగాకు అమ్ముడుపోక బేళ్లను వెనక్కు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీన వైఎస్ జగన్ పొదిలి వేలం కేంద్రానికి రానున్నారు. -
YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!
-
వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. లారీ-కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి’ అని అన్నారు. -
ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్
-
పచ్చ మీడియా పరిస్థితి.. మింగలేక.. కక్కలేక!
ఆంధ్రప్రదేశ్లో పచ్చమీడియా ఎప్పుడో దిగజారి పోయింది!. ఆ పతనం గురించి ఈరోజు ఇంకోసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలేకరుల సమావేశం పెట్టి.. 2014-19 మధ్య, ఏడాదిగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుంభకోణాలను, మద్యం దందాను ఆధారాలతోపాటు ఎండగడితే.. కూటమి ప్రభుత్వం కానీ.. దాన్ని మోస్తున్న పచ్చమీడియా కానీ సరైన సమాధానమే ఇవ్వలేకపోయింది!. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏదో జరిగిపోయిందంటూ హడావుడి మాత్రం మళ్లీ తలకెత్తుకుంది!. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విలేకరుల సమావేశంలో చేసిన ఆరోపణలకు ఈ మీడియా నేరుగా సమాధానం ఇవ్వలేక చతికిలపడింది. మరీ ముఖ్యంగా మద్యం దందా గురించి!.తాజాగా ఈనాడులో వచ్చిన కథనం చూస్తే, ఏపీ సీఐడీ వద్ద జగన్ హయాంలో జరిగినట్లు చెబుతున్న స్కామ్లకు సంబంధించి రుజువులేవీ లేనట్టు ఇట్టే అర్థమైపోతుంది. ఆ విషయం నేరుగా చెప్పలేక ‘వేల కోట్లు దోచేసి, ఆధారాలు చెరిపేసి..’ అంటూ ఓ అడ్డగోలు కథ చెప్పుకొచ్చింది ఆ పత్రిక!. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరక్కుండా కుట్ర పన్నారని, ఫోరెన్సిక్ రికవరికి కూడా వీల్లేకుండా చెరిపి వేశారని ఈ కథనం సారాంశం. వైఎస్సార్సీపీ మద్యం ముఠా 375 పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లకు సమానమైన డేటాను నాశనం చేసిందని, ఫలితంగా దర్యాప్తునకు తీవ్ర అవరోధాలు ఎదురైనా సిట్ వాటిని అధిగమించిందని చెప్పుకొచ్చారు. ఏమన్నా అర్థం ఉందా! అసలు కేసు ఏమిటి? డేటా ఎందుకు ఉంటుంది?. ఉత్పత్తిదారుల నుంచి సరఫరా అయ్యే మద్యానికి సంబంధించిన డేటా కంప్యూటర్లలో నమోదవుతాయి. ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. కానీ కూటమి పెద్దలకు అది సరిపోలేదట. తప్పుడు కేసులతో అరెస్ట్ చేసిన వారి వద్ద కూడా సమాచారం ఏదీ దొరికి ఉండదు. దీంతో ఈ కొత్త కహానిని సృష్టించింది కూటమి!.రికార్డులన్నీ లభ్యమై ఉంటే కుంభకోణం మూలాలు మరిన్ని వెలుగులోకి వచ్చేవంటోంది ఆ పత్రిక. ఏతావాతా అర్థమయ్యేది ఏంటి? సీఐడీ కేసు ఓ కట్టుకథ అని! ఎల్లో మీడియా సాయంతో జగన్, వైఎస్సార్సీపీలపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం అని!. అసలు ఈ మద్యం కుంభకోణం కేసు ఎలా మొదలైంది? ఎవరో దారిన పోయే వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వెంటనే స్పందించి విచారణకు ఆదేశించడం.. ఏసీబీ ఆ వెంటనే రికార్డు సమయంలో ఏదో కనిపెట్టినట్లు నివేదిక ఇవ్వడం చకచక జరిగిపోయాయి. ఆ వెంటనే సీఐడీ రంగంలోకి దిగింది. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయడం.. వారితో బలవంతంగా ఏదో చెప్పించడం.. దాని ఆధారంగా మరికొందరి అరెస్ట్.. ఇలా సాగిపోయింది కేసు విచారణ. ఇక ఎల్లో మీడియా పాత్ర మొదలైంది కూడా ఇక్కడే. విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మరో విశ్రాంత అధికారి కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు తరువాత ఇక జగన్ అరెస్టే మిగిలిందంటూ ఊదరగొట్టింది.మద్యం కుంభకోణం లాభాలు విదేశాలకు తరలిపోయాయని ఒకసారి, బంగారం కొన్నారని రెండో రోజు.. ఆస్తులు కొన్నారని ఇంకోసారి, సంచుల్లో నగదు తరలించారని ఆ మరుసటి రోజు.. ఇలా రోజుకో రకమైన కథనాలు రాసుకుంటూ.. ఆఖరకు ఆధారాల్లేకుండా చేశారని ఏడుస్తోంది ఈనాడు! అసలు కుంభకోణమే లేనప్పుడు.. ఆధారాలెక్కడి నుంచి వస్తాయి? జగన్ హయాంలో ఏదో జరిగిందన్న అనుమానం ప్రజల్లో నాటడమే ఎల్లో మీడియా లక్ష్యమని దీంతో మరోసారి స్పష్టమైపోయింది. లేదంటే.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిన చంద్రబాబు వైఫల్యాన్ని, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పచ్చ పత్రిక ఈ కుట్రకు తెరతీసి ఉండాలి. పచ్చ మీడియా పోకడలను మొదటి నుంచి నిశితంగా పరిశీలించడమే కాకుండా.. ఎప్పటికప్పుడు వాటిని ఆధారాలతోసహా ఎండగడుతూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం కుంభకోణం లోతుపాతులను, అసలు కర్తలెవరు అన్నది రుజువులతో సహా ప్రజలకు వివరించారు. ఈ కేసులోనే చంద్రబాబు బెయిల్పై ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 2014-15లో కేబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అంగీకారం లేకుండా, మద్యంపై ఉన్న ప్రివిలేజ్ ఫీజ్ చంద్రబాబు రద్దు చేసిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఫలితంగా అప్పట్లో మద్యం విక్రయాలు పెరిగినా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిందని, ఇందులో అవినీతి ఉన్న సంగతిపై కేసు వచ్చిందని ఆయన వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే క్రమంలో మొత్తం టీడీపీ నేతలే వాటిని కైవసం చేసుకున్నారని, ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారని, గతంలో ఎన్నడూ లేని నాసిరకం బ్రాండ్లు అమ్ముతున్నారని జగన్ సోదాహరణంగా వివరించారు. ఇక అనధికార పర్మిట్ రూము వేల కొద్ది బెల్ట్షాపులు, ఎమ్మార్పీకి మించి వసూళ్లు జరుగుతున్నాయని, ఇది అసలు మద్యం స్కామ్ అని జగన్ స్పష్టం చేశారు. తాము చేసిన కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు తన హయాంలో ఏదో జరిగిపోయిందని చంద్రబాబు అండ్ కో ఓ భేతాళ కథ సృష్టించారని తెలిపారు.జగన్ ఆరోపణలపై ప్రభుత్వ పరంగా ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదు. జగన్ను విమర్శించేందుకు కొందరు టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టినా నిర్దిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. షాపులు ప్రభుత్వం నడిపితే స్కాం జరుగుతుందా? ప్రైవేటు వారికి అప్పగిస్తేనా? అన్న జగన్ ప్రశ్నకు నిశ్శబ్ధమే సమాధానం అవుతోంది. మద్యం రేట్లు పెంచి, డిమాండ్ తగ్గిస్తే డిస్టిలరీలు ముడుపులు ఇస్తాయా? లేక మద్యం రేట్లు తగ్గించి డిమాండ్ పెంచితే ముడుపులు వస్తాయా? అన్న ప్రశ్నకు కూడా జవాబు లేదు. తాను కానీ, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎక్కడైనా ఫైళ్లపై సంతకాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అని కూడా జగన్ నిలదీశారు. ఆ అధికారులకు ఎక్సైజ్ శాఖతో సంబంధమే లేనప్పుడు వారెలా బాధ్యులవుతారని ప్రశ్నించారు.టీడీపీ హయాంలో జరిగిన మద్యం స్కాం గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు వారికి మద్దతిచ్చే ఎల్లోమీడియా ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు. ఎదురుదాడి ద్వారానే తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి భిన్నంగా జగన్ చంద్రబాబు టైమ్లో కుంభకోణం ఎలా మొదలైంది? తన హయాంలో ఆ అవకాశం ఎందుకు లేకుండా పోయిందో చాలా స్పష్టంగా వివరించారు. జగన్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం చిన్న ఆధారం దొరికినా నానా రచ్చ చేసేదన్నది నిర్వివాద అంశం. కానీ వీసమెత్తు ఆధారమూ లేకపోవడంతో కొంతమందిని నిందితులుగా చేసి, బలవంతంగా వారి నుంచి వాంగ్మూలాలను తీసుకుని ఎలాగొలా జగన్ను కూడా ఇరికించాలని చంద్రబాబు సర్కార్ వ్యూహం పన్నినట్లు తేలుతోంది. కాకపోతే నిందితుల వాంగ్మూలాలు కేసుకు సాక్ష్యాలు కావని సుప్రీంకోర్టు చెప్పడంతో వీరి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్ల అయ్యింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్
-
ఎస్.. అది టిష్యూ పేపర్కు తక్కువే!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందంపై కొద్ది రోజులుగా విషం కక్కుతున్న ‘ఈనాడు’ మరో తప్పుడు కథనం అచ్చేసి అడ్డంగా దొరికిపోయిన తీరుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. సెకీ మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించడానికి.. ఏపీతో చేసుకున్న ఒప్పందమే కారణమని సదరు ఈనాడు దుష్ప్రచారంలో భాగంగా ‘సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది’ అంటూ తప్పుడు కథనం వండి వార్చింది.వాస్తవానికి 2021 డిసెంబర్1న ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది. 2023 జూన్ 13న రామేశ్వర్ప్రసాద్∙గుప్తా సెకీ సీఎండీగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన్ను కేంద్రం పదవి నుంచి తొలగిస్తే గత ప్రభుత్వ ఒప్పందంతో ఏం సంబంధం ఉంటుంది? నిజానికి గుప్తా నియామకానికి రెండేళ్ల ముందే ఈ ఒప్పందం జరిగింది. ఈ వాస్తవాన్ని తొక్కిపెట్టి కేవలం గత ప్రభుత్వం, వైఎస్ జగన్పై బురద చల్లాలనే లక్ష్యంతో గుప్తా తొలగింపునకు ఈ ఒప్పందంతో ఈనాడు నిస్సిగ్గుగా ముడి పెట్టింది. గురువారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ‘ఈనాడు’ తీరును కడిగి పారేశారు. ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఉంది. దీన్నిబట్టి ఈనాడు స్థాయి టాయిలెట్ పేపర్కు ఎక్కువ.. టిష్యూ పేపర్కు తక్కువ అనిపిస్తుంది.. అంతా మాఫియా రాజ్యం.. మీడియా అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి’ అంటూ నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలు శుక్రవారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ట్విటర్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా తదితర ప్లాట్ఫాంల ద్వారా ఒకరి నుంచి మరొకరికి పెద్ద సంఖ్యలో ఫార్వర్డ్ అయ్యాయి. ఎక్కడ నలుగురు కలిసినా ఈ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. యూనిట్ విద్యుత్ రూ.2.49తో అందించే సెకీ ఒప్పందంపై ఇంతగా విషం చిమ్ముతున్న ఈనాడు.. దాదాపు అంతకు రెట్టింపు ధర యూనిట్ రూ.4.60తో చంద్రబాబు ప్రభుత్వం యాక్సెస్ అనే ప్రైవేటు సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే మాత్రం పల్లెత్తు మాట అనలేదని చర్చించుకున్నారు. -
ఎవరి అండతో ఈ దుర్మార్గాలు చేస్తున్నారు?
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా తప్పుడు కేసులతో బరితెగించి వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు శిశుపాలుని మాదిరి పాపాలు చేస్తున్నారని, వీటిని ప్రజలు ఎంత మాత్రం క్షమించరని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఎల్లయ్య కుమారుడు హరికృష్ణ పట్ల దాచేపల్లి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంత వరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? హరికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్లో దాచి పెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేయకపోతే అతడిని ఏం చేసేవారు? ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు? ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా? చంద్రబాబూ.. రెడ్బుక్ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంత మాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం’ అని ఆ పోస్ట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
హరికృష్ణకు పోలీసుల వేధింపులపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి : హరికృష్ణకు పోలీసుల వేధింపులపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫైరయ్యారు. చంద్రబాబు సర్కారును ఎక్స్ వేదికగా ఎండగట్టారు.‘పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు?’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? చట్టాన్ని… pic.twitter.com/Zx02eOB3fz— YS Jagan Mohan Reddy (@ysjagan) May 23, 2025థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా?.స్వయంగా టీడీపీ నేత కారులో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్లో దాచిపెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేయకపోతే అతన్ని ఏం చేసేవారు?. ఎవరి ఆదేశాలతో,ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు?. ఇది రాజ్య హింస కాదా?. ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది?. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా?. చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా?. చంద్రబాబు.. రెడ్బుక్ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంతమాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగేంతవరకూ ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం’ అని వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం
-
ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లారోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కారు-లారీ ఢొకొని ఆరుగురు మృతి చెందడంపై సంతాపం తెలిపారు.దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లే సమయంలో.. దుర్ఘటన చేసుకోవడం అత్యంత బాధాకరం..ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి’ అని కోరారు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదందేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఒకటైన మహానందినిని దర్శనం చేసుకుని కారులో ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. బాధితుల కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చిందిపోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శైవక్షేత్ర దర్శనం అనంతరం మహానంది నుంచి చీరాల వెళ్తున్న ప్రయాణికుల కారు కోమరోలు మండలం తాటిచెర్లమోటు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది.రాంగ్రూట్లో వచ్చిన లారీని బాధితులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కార్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా..మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని రక్షించే ప్రయత్నించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాద తీవ్రత కారణంగా కారులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు ఘటన స్థలంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలుగజ్జల నరసింహ (33), బచ్చు సందీప్ అలియాస్ సన్నీ(30),గజ్జల బబ్లు(29), కర్రెద్దుల దివాకర్ అలియాస్ చిన్ని,గజ్జల భవాని (20)గజ్జల అంకాలుగా పోలీసులు గుర్తించారు. -
స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన YS జగన్ మోహన్ రెడ్డి
-
వామ్మో ఈనాడు.. పైత్యం పరాకాష్టకు!
ఈనాడుకు పచ్చపైత్యం పెరిగిపోతోంది!. నిస్సిగ్గుగా పాఠకులను మోసం చేసేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈనాడు కథనాలు వండి వారుస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్పై విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఈ పత్రిక యాజమాన్యం విచక్షణ కూడా కోల్పోయిందని స్పష్టమవుతోంది. జగన్ టిష్యూ పేపర్తో పోల్చినప్పటికీ ఈ పత్రిక తీరు మార్చుకోకపోగా మరింత దిగజారిపోతోంది. సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర ప్రసాద్ గుప్తాను కేంద్రం పదవి నుంచి తొలగించడానికీ.. ఆయన నియామకానికి ముందే ఆంధ్రప్రదేశ్, సెకీల మధ్య కుదిరిన ఒప్పందాలకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది ఈనాడు. యాజమాన్యాన్ని సంతోషపెట్టడానికి ఈనాడు జర్నలిస్టు బృందం రాసిన దరిద్రపు గొట్టు వార్తపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. ఈనాడు(Eenadu)ది జర్నలిజమా? బ్రోకరిజమా అని ప్రశ్నించింది. జవాబు ఇవ్వలేని ఈనాడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో దిక్కుమాలిన కథనాన్ని రాయడం ఆ పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రస్తుతం ఈనాడు పత్రిక రాసే అబద్దాల మధ్యలో ఎక్కడైనా నిజాలేమైనా ఉన్నాయా అని వెతుక్కోవలసిన పరిస్థితి. ఏపీ ఎడిషన్లో రాసే, ప్రసారం చేసే కథనాలలో అత్యధికం ఈ బాపతే. చంద్రబాబు సర్కార్కు భజన , వైఎస్సార్సీపీ, జగన్పై వ్యతిరేక కథనాలు, అసత్యాలు!. ‘‘సెకీ(SECI) ఒప్పందానికి సన్మానం జరిగింది’’..అంటూ హెడింగ్ పెట్టి ఒక వార్తను ప్రముఖంగా అచ్చేసింది. ఆ సంస్థ సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందని, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని ఈ మీడియా తేల్చింది. అందులో తన ఇష్టానుసారం జగన్ పై ఆరోపణలు గుప్పించింది. 👉వైఎస్ జగన్(YS Jgan)తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా జైలు.. పదవీ గండం తప్పదని మరోసారి నిరూపితమైనట్లు ఈనాడు ఎంతో ఘోరంగా రాసింది. తెలుగుదేశం కరపత్రిక కన్నా హీనంగా రాయడానికి ఈనాడు సిగ్గుపడలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం లు కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టిన వైనం, వారికి మద్దతుగా ఈనాడు, తదితర ఎల్లో మీడియా దుష్ప్రచారం 15 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఇదే టైమ్ లో చంద్రబాబు పై వచ్చిన కేసులు, ఆ కేసుల్లో అధికారులు సస్పెండ్ అవడమో, లేదంటే విదేశాలకు పారిపోవడమో జరిగిన ఘటనలు ఈనాడు మీడియా మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు. 👉స్కిల్ స్కామ్ లో అరెస్టు అయిన వారిలో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంస్థల ప్రతినిధులు, కొందరు ప్రభుత్వ అధికారులు ఉన్న సంగతిని కప్పిపుచ్చితే సరిపోతుందా?. చంద్రబాబు పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న విషయం ప్రజలకు తెలియదా?. ఆయన పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ రైడ్ చేసి.. రూ.రెండు వేల కోట్ల అక్రమాలు గుర్తించినట్లు ప్రకటించిన సంగతి ఎవరికి తెలియదు!. ఆ తర్వాత స్కిల్ స్కామ్ కేసులో విచారణకు రాకుండా తప్పించుకునేందుకు ఆ పీఏని హుటాహుటిన అమెరికాకు పంపించడాన్ని ఏమంటారో ఈనాడు మీడియానే చెప్పాలి. ఈ సంగతి ఇలా ఉంచితే.. సెకీ సీఎండీ గుప్తాని తొలగించడానికి కారణం ఒక టెండర్లో అనిల్ అంబానీ సంస్థ సమర్పించినవి నకిలీ డాక్యుమెంట్లు అని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దానిని విస్మరించి గతంలో సెకీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అని రాసిపడేసి ఈనాడు తన పాఠకులను మోసం చేసింది. విశేషం ఏమిటంటే.. జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకున్నప్పుడు గుప్తా ఆ సంస్థకు ఎండీనే కాదు. సెకీతో ఒప్పందం 2021 డిసెంబర్ లో కుదిరితే గుప్తా పదవిలోకి వచ్చింది 2023 జూన్లో. అలాంటప్పుడు ఇందులో ఆయన ప్రమేయం ఏమి ఉంటుంది?. అమెరికాలో దాఖలైన ఒక కేసులో గౌతమ్ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు పేర్కొన్న తీరుపై అమెరికాలోనే విమర్శలు వస్తే.. దానిని ఈనాడు భుజాన వేసుకుని జగన్ పై తప్పుడు ప్రచారానికి దిగింది. అసలు సెకీతో అదానీ సంస్థ ఒప్పందం చేసుకుంటే దానికి జగన్ ప్రభుత్వానికి ఏమి సంబంధం అంటే జవాబు చెప్పదు!. పైగా అదానీ సరఫరా చేస్తున్నట్లు.. ‘జగన్ ప్రభుత్వానికి తెలుసు’ అంటూ అడ్డగోలు వాదన. అదానీ తక్కువ ధరకు సెకీ ద్వారా విద్యుత్ ఇస్తే ఏపీ తీసుకోరాదని ఈనాడు అసలు ఎలా చెబుతుంది?. నిజంగానే ఈ విద్యుత్ను తీసుకోకపోతే అప్పుడు ఏమని రాసేవారు?. లంచాలు రావడం లేదని, తక్కువ ధరకు కరెంటు వస్తుంటే తీసుకోలేదని ఇదే మీడియా తప్పుడు రాతలు రాసేదా? లేదా?. యూనిట్ విద్యుత్ రూ.2.49లకు కొంటే లంచాలు వచ్చేటట్లయితే.. ఈనాడు రాసినట్లు లక్ష కోట్ల భారం అయితే.. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 4.60 పైసలకు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒక ప్రైవేటు కంపెనీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది కదా!. దానికి ఎంత లంచం తీసుకుని ఉండాలి? ఇప్పుడు రాష్ట్రంపై ఎన్ని లక్షల కోట్ల భారం పడి ఉండాలి?. దానిపై ఈనాడు మీడియా ఎందుకు నోరు మెదపదు. పోనీ నిజంగానే సెకీ సంస్థ అదాని నుంచి విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఏపీకి నష్టం జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదో కూడా ఈనాడు మీడియానే చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీపై చర్య తీసుకుని ఉండాలి కదా. అంటే చంద్రబాబు, మోదీ, అదానీ అంతా మంచివాళ్లే. జగన్ మాత్రమే కాదా?. 👉ఇలాంటి పిచ్చి రాతలు రాసే ఈనాడు మీడియా పరువు పోగొట్టుకుంటోంది. నిజంగానే జగన్ అప్పట్లో చెప్పినట్లు యూనిట్ రూ.2.49లకే ఏపీకి విద్యుత్ వచ్చేలా చేసినందుకు, లక్షకోట్ల రూపాయల మేర ఆదా చేసినందుకు ఆయనకు సన్మానం చేసినా తప్పేమీ లేదు. కానీ ఈనాడు సిద్దాంతం ప్రకారం ఆయనకు కాకుండా యూనిట్ విద్యుత్ రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నందుకు చంద్రబాబుకు సన్మానం చేయాలన్న మాట. జగన్ అప్పట్లో ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఈనాడు కథనంపై సాక్షి ‘‘బాబుకు ఈనాడు నిత్య సన్మానం, పాత్రికేయానికే తీరని అవమానం’’ శీర్షికన కథనాన్ని ఇచ్చింది. అలాగే వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు తదితరులు ఈనాడు మీడియా తీరుపై విరుచుకుపడ్డారు. దాంతో ఈనాడు మీడియా మరుసటి రోజు గుప్తా హయాంలోనే ఆదానీ గుట్టు వీడిందని మరో పిచ్చి వార్తను ఇచ్చింది. అందులో మాటమార్చేసి.. గుప్తా వచ్చాక అనుబంధ ఒప్పందాలు కుదిరాయంటూ ఏదేదో రాసింది. గుప్తా తొలగింపునకు ఈ అంశంతోపాటు ఇతర కారణాలు ఉన్నాయని ఇప్పుడు చెబుతోంది. సెకీ సంస్థ అదానీ ప్లాంట్ల నుంచి సరఫరా చేస్తారని తెలిపిందట. అది తప్పట. అసలు ఏపీ ప్రభుత్వానికి తక్కువ ధరకు విద్యుత్ రావడం ముఖ్యమా? కాదా?. ఏపీలో జగన్ టైమ్లో గ్రీన్ కో, తదితర సంస్థలతో పాటు అదానీ గ్రూప్ కూడా రెన్యుబుల్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరి ఇప్పుడు అదానీ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది?. అదంతా ఎందుకు.. ఈనాడు మీడియాకు దమ్ముంటే, ఏ మాత్రం నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు ప్రభుత్వంతో సెకీ ఒప్పందాన్ని రద్దు చేయించమనండి.. తక్కువ ధరకు అదానీ ఇచ్చినా అక్కర్లేదు.. మేము రూ.2.49కి కాకుండా రూ.4.60లకే విద్యుత్ కొంటామని, అదే రైట్ అని చంద్రబాబు ప్రభుత్వంతో చెప్పించమనండి!!. రామోజీరావు జీవిత చరమాంకంలో అబద్దపు తప్పుడు వార్తలతో అప్రతిష్ట పాలైతే.. ఆయన కుమారుడు కిరణ్(Eenadu MD Kiran) ఇప్పుడే ఇలాంటి తప్పుడు వార్తలతో పరువు పోగొట్టుకుంటున్నారు. వేరేవారి మీద కోపం, ద్వేషంతో ఎవరైనా తమ బట్టలూడదీసుకుని నడి బజారులో తిరుగుతారా! మా ఇష్టం! మేం తిరుగుతాం అన్నట్లుగా ఈనాడు మీడియా పిచ్చి పరాకాష్టకు చేరుతోందా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్ సీజ్ ద షిప్ పై జగన్ మాస్ ర్యాగింగ్..
-
‘స్కామ్స్టర్ బాబు’.. హ్యాష్ ట్యాగ్ రిలీజ్ చేసిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ పాలనలో జరుగుతున్న కుంభకోణాలను, కుట్రలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారు. వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో అన్ని విషయాలను వివరించారు. ఆపై స్కామ్ స్టర్ బాబు’(#ScamsterBabu) అంటూ హ్యాష్ ట్యాగ్తో చంద్రబాబు అక్రమాలు, అవినీతి, స్కాంల ఆధారాలను వైఎస్ జగన్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అక్రమాలను మరోసారి వివరించారు. ఈ సందర్భంగా.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆధారాలతో సహా వివరాలను ట్యాగ్ చేశారు. మద్యం స్కాంలోని వాస్తవాలతోపాటు పూర్తి సమాచారాన్ని తెలిపారు. కేసులోని అబద్ధాలు, కట్టు కథలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులుమేస్తున్న తీరుపై మాట్లాడారు. యథేచ్ఛగా సాగుతున్న రాజకీయ వేధింపులు, అధికార దుర్వినియోగంపై ఆధారాలను బహిర్గతం చేశారు. ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలపై పెరిగిన కక్షసాధింపుల గురించి చర్చించారు. వీటికి సంబంధించిన వివరణాత్మక ఆధారాలను ట్వీట్లో జత చేసినట్టు తెలిపారు.In today’s press meet, I addressed key issues impacting our state and people:Facts on Liquor Case – Uncovered a deep web of lies and cooked-up stories with complete factual data.Red Book Files – Exposed vendetta politics and misuse of power to silence opposition.Targeted… pic.twitter.com/b0cXzjvc7w— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2025 -
Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం
-
ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్
-
చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
న్యాయం, ధర్మానిదే అంతిమ విజయం
‘‘అంతిమంగా న్యాయం, ధర్మం ఏవైపు ఉంటే దేవుడు ఆవైపు ఉంటాడు. న్యాయం, ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ, ఇష్టమొచ్చినట్లుగా చంద్రబాబు తనపై నమోదైన కేసును కొట్టివేయించుకోవడానికి... ఇప్పుడు చేస్తున్న లిక్కర్ పాలసీని సమర్థించుకోవడానికి ఏ స్కామూ లేకపోయినా జరిగినట్లుగా చిత్రీకరించి, భేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం చేస్తే... దాంట్లో ధర్మం, న్యాయం లేనప్పుడు దేవుడు ఆశీర్వదించడు. చంద్రబాబు దుర్బుద్ధితో ఎంత చేసినా అది తాత్కాలికమే’’‘‘నేను విజయవాడలోనే ఉన్నాను. వారు రావాలనుకుంటే రావచ్చు.. ఎవరు ఆపుతున్నారు’’‘‘నీ ఇంటి దగ్గరికి బియ్యం వస్తే నువ్వు ఆనందంగా తీసుకుంటావా, లేకపోతే డీలర్ దగ్గరకి పోయి తీసుకోమంటే వారి టైమింగ్ ప్రకారం పోయి తీసుకునేందుకు ఉత్సాహం చూపుతావా. ఇదేం కొత్త కాదు కదా మనకు. డీలర్ల వ్యవస్థపై ఎందుకు వ్యతిరేకత వచ్చింది?’’‘‘ఇంటింటికీ రేషన్ డెలివరీ నిలిపివేయడంతో ఇప్పుడు బియ్యం కోసం రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే పోవాలి, ఆ రేషన్ డీలర్ తెలుగుదేశం పార్టీవాడు అయ్యుంటాడు. వైఎస్సార్సీపీ అనో ఇంకో పార్టీ అనో పోతే అతడు ఇవ్వడు. సతాయిస్తాడు. తన ఇంటికి రావాలి అంటాడు. సెల్యూట్ కొట్టాలంటాడు. అప్పుడే ఇస్తానంటాడు. ఎందుకొచ్చిన బాధలే అని వెళ్లడం మానేస్తారు. సో బియ్యం ఆటోమేటిగ్గా మిగులుతుంది. వీళ్లు చేసేది మాఫియా’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘వైఎస్సార్సీపీకి... వైఎస్ జగన్కు ఈ పోరాటాలు కొత్త కాదు. అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి... నన్ను ఇబ్బందిపెట్టి, వేధింపులకు గురిచేస్తేనే వైఎస్సార్సీపీ పుట్టింది... పెరిగింది... ప్రజల ఆశీర్వాదంతో జగన్ అనే వ్యక్తి ఎదిగాడు... ఈ పోరాటాలు మాకు కొత్తేం కాదు. తప్పుడు కేసులకు అదిరేది లేదు... బెదిరేది లేదు’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తుందని, ఎన్ని కేసులు పెట్టి అణచివేయాలని చూసినా... చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిలదీస్తూ... ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... అక్రమ కేసులపై గళమెత్తుతూ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేసేందుకు అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానాలిచ్చారు. మద్యం కేసులో మిమ్మల్ని అరెస్టు చేయడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటున్నారు కదా.. మీరేమంటారు అని అడగ్గా.. తాను విజయవాడలోనే ఉన్నానంటూ స్పందించారు. మద్యం డోర్ డెలివరీ.. ఇంటింటికీ రేషన్ రద్దు‘‘అసలు రేషన్ బియ్యం ఇంటింటికీ పంపిస్తేనే కనీసం చంద్రబాబు ప్రభుత్వం చేప్పే ఈ అక్రమాలు ఆగిపోతాయి. రేషన్ బియ్యం పంపిణీలో ఎక్కడ అక్రమాలు జరుగుతాయి? మొదట సార్టెక్స్ బియ్యాన్ని వీళ్లు ఆపేశారు. క్వాలిటీ పెంచి మేం సార్టెక్స్ బియ్యం ఇచ్చాం. దానివల్ల నూకలు తక్కువ వచ్చేవి. మధ్యస్త, సన్నకార, స్వర్ణ బియ్యాన్ని మాత్రం సేకరణ చేస్తుండేవాళ్లం. దీంతో తినేవాళ్లు ఉత్సాహం చూపేవారు. వీళ్లెవరూ ఇబ్బందిపడకుండా ఇంటి వీధి చివరికి పోయి అక్కడే డెలివరీ చేసేవారు. సాయంత్రం పూట సచివాలయం వద్ద బండి పెట్టుకుని అందుబాటులో ఉండేవారు. ఎవరైనా బియ్యం తీసుకోలేకపోతే... ఈ వెసులుబాటు వల్ల ఇంటికే వచ్చి ఇస్తున్నందున తీసుకునేవారు.డోర్ డెలివరీ అనేది ఒక సర్వీసు. ఆ సర్వీసును తీసేయడం వీళ్లు చేసిన తప్పు. ఆ తప్పును సమర్థించుకుంటూ... ఆ తప్పును అంగీకరించకుండా, దానికి ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా... దాని మీద కూడా దుర్బుద్ధితో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ల సంకుచిత రాజకీయ మనస్తత్వానికి ఇది నిదర్శనం’’ అంటూ మరో ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇంటింటికీ బియ్యం పంపిణీని నిలిపివేసి... మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.చంద్రబాబు, బినామీల భూముల ధరలు పెంచుకోవడానికే..‘‘విజయవాడ, గన్నవరం ఎయిర్పోర్టుల మధ్య 40 కిలోమీటర్ల దూరం కూడా లేదు. అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు అన్నది వర్కవుట్ కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి.. చంద్రబాబు, బినామీల భూముల ధరలు పెంచుకుని.. ప్రయోజనం పొందడానికే అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు అంటూ మాటలు చెబుతున్నారు’’ అంటూ మరో ప్రశ్నకు వైఎస్ జగన్ జవాబిచ్చారు. ‘‘కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలు ఊసే లేదు. విద్యార్థులకు ఫీజులు అందడం లేదు.పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందడం లేదు. 50 ఏళ్లకే పింఛన్లు ఇవ్వడం లేదు. హామీలు అమలు చేయడం లేదు కాబట్టి క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు. ప్రశ్నించే గొంతును నొక్కేసేందుకు రెడ్బుక్ రాజ్యాంగంతో అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్నారు’’ అంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.⇒ ‘‘మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. తనపై నమోదైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.. బెయిల్ నియమ, నిబంధలన్నీ ఉల్లంఘించిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయకూడదు?’’ అంటూ మరో ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందించారు. -
గజ దొంగల ముఠా దోపిడీ.. రాష్ట్రం అతలాకుతలం
సచివాలయం.. అసెంబ్లీ విషయానికి వస్తే ఇప్పటికే అవి ఆరు బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల భవనాల్లో ఉన్నాయి. ఇవి ఉండగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ ఆఫీసులు కడతారట. వాటి కోసం 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణాలు చేస్తారట. నిజానికి సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ భవనాలతో కలుపుకుని అంతా 12 వేల మంది వరకు ఉద్యోగులు ఉంటారు. వారు ఇప్పటికే 6 లక్షల చదరపు అడుగుల భవనాల్లో పని చేస్తున్నారు. మరి కొత్తగా 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణం ఎందుకు? అంటే, ఆ పనులు నిరంతరం జరగాలి. ఆ మేరకు కమీషన్లు రావాలి.ఇప్పటికే కట్టిన అసెంబ్లీ వ్యయం రూ.180 కోట్లు, సచివాలయ వ్యయం రూ.300 కోట్లు.. రెండూ గంగపాలైనట్లే. హైకోర్టు నిర్మాణ వ్యయం రూ.173 కోట్లు.. అలా మొత్తం రూ.600 కోట్లు వెచ్చించారు. కొత్త భవనాలు కట్టాలనుకున్నప్పుడు ఈ రూ.600 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? ఈ నిర్ణయాలు సమంజసం అని ఎలా చెబుతారు? అప్పులు తెచ్చి భవనాలు కట్టి, ప్రజలపై భారం మోపడం ఎందుకు? ఒక్కో చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఏకంగా రూ.8,900. సాధారణంగా ఒక్కో చదరపు అడుగుకు రూ.4,500 పెడితే హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోనే ఫైవ్ స్టార్ వసతులతో భారీ అపార్ట్మెంట్లు దొరుకుతాయి.హైదరాబాద్లో ఇటీవల కొత్త సచివాలయం 8.58 లక్షల చదరపు అడుగుల్లో రూ.600 కోట్లతో కట్టారు. దాంతో పాటు, హెచ్ఓడీ ఆఫీసులు కూడా తరలించారు. మరి ఇక్కడ 53.57 లక్షల చదరపు అడుగుల భవనాలు ఎందుకు? అమరావతిలో రోడ్ల నిర్మాణ వ్యయం కూడా దారుణం. ఫోర్ లేన్ల జాతీయ రహదారుల నిర్మాణం కోసం కిలోమీటరు వ్యయం రూ.11.16 కోట్ల నుంచి రూ.14.42 కోట్లు ఉంటుంది. అదే అమరావతిలో కిలోమీటరు రోడ్డుకు రూ.50 - 60 కోట్లు ఖర్చు చేస్తున్నారు.రాజధాని అమరావతికి ఇప్పటికే ఉన్న 50 వేల ఎకరాలు ఈ పెద్దమనిషికి సరిపోదట. ఇంకో 50 వేల ఎకరాలు కావాలట. ఇన్నిన్ని అప్పులు తెచ్చి, ఇన్నిన్ని స్కాములు చేసే బదులు.. విజయవాడృగుంటూరు మధ్య ఎన్హెచ్ దగ్గర్లో నాగార్జున యూనివర్సిటీలోనో, లేదంటే విజయవాడృగుంటూరు మధ్య ఓ 500 ఎకరాలు తీసుకుని నువ్వు కట్టాల్సిన బిల్డింగ్లు ఏవో కట్టు. అప్పుడు గుంటూరుృవిజయవాడ కలిసిపోతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది. ఇదే చంద్రబాబు గతంలో అమరావతిలో నిర్మాణాలు చేసి, లంచాలు తీసుకుని దొరికిన సందర్భం ఉంది. అందుకు చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు కూడా ఇచ్చింది. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఉంది. కేసు ఎదుర్కొంటున్నాడు. అయినా ఏమాత్రం జంకు, బొంకు లేకుండా మళ్లీ యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాడు. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : చంద్రబాబు, ఆయన గజ దొంగల ముఠా దోపిడీతో రాష్ట్రం అతలాకుతలమైపోతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిందని, ఓ వైపు అప్పులు విపరీతంగా పెరుగుతుంటే.. మరో వైపు ఆదాయం తగ్గిపోతోందని ఎత్తి చూపారు. ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం చంద్రబాబు గజ దొంగల ముఠా జేబుల్లోకి వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో ఎక్కడా ఏపీలో అభివృద్ధి, సంక్షేమం జాడ కనిపించ లేదన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు సంపద సృష్టిస్తా.. సంక్షేమం పంచుతానని చంద్రబాబు గొప్పగా డైలాగులు కొట్టారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏడాదిగా ప్రజలను వంచించడం.. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి బినామీలకు పంచి పెట్టడంతో సరిపోయిందన్నారు. ఇసుక నుంచి సిలికా వరకు సహజ వనరులను మింగేస్తున్నారని తూర్పారబట్టారు. కేంద్ర ప్రభుత్వ పన్నులు, పన్నేతర ఆదాయం వృద్ధి చెందుతుంటే.. ఏపీలో మాత్రం ఆశించిన స్థాయిలో రాబడి లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం శ్రీలంక అవుతుందని దుర్మార్గపు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో.. చంద్రబాబు ఒక్క ఏడాదిలోనే 41 శాతం అప్పులు చేశారని ఎత్తిచూపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాణేనికి రెండో వైపు ఇలా..» రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వివిధ అంశాలపై నాణానికి రెండో వైపున ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మన యుద్ధం కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదు. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేస్తున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి మహమ్మారిని రెండేళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా రాష్ట్రాన్ని గొప్పగా నడిపాం. అలా చేస్తూనే సంక్షేమం, అభివృద్ధి చూపాం. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. పెట్టుబడులు కూడా పెరిగాయి. » అదే చంద్రబాబు ఏడాది పాలన చూస్తే.. కాగ్ నివేదిక గమనిస్తే.. ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేనే లేదు. చంద్రబాబు పాలనంతా కూడా ఈ ఏడాది మోసాలతో సాగింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎగరగొట్టారు. రాష్ట్ర సొంత ఆదాయం (ఎస్ఓఆర్).. పన్ను, పన్నేతర ఆదాయం రెండూ గమనిస్తే ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉంది. కేవలం 3.08 శాతం మాత్రమే గ్రోత్రేట్ కనిపిస్తోంది. అందుకు కారణం ప్రజల కొనుగోలు శక్తి, పెట్టుబడులు తగ్గాయి. » ఇదే సమయంలో దేశంలో దాన్ని చూస్తే, గ్రాస్ టాక్స్ రెవెన్యూస్, నాన్ టాక్స్ రెవెన్యూస్లో ఏకంగా 13.76 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ఆదాయం రూ.36,97,545 కోట్లు. అదే గత ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ఆదాయం రూ.32,50,181 కోట్లు. మన రాష్ట్ర ఆదాయంలో అంత తక్కువ పెరుగుదలకు కారణం ఆ ఆదాయం రాష్ట్ర ఖజానాకు కాకుండా చంద్రబాబునాయుడు, ఆయన గజదొంగల ముఠా జేబుల్లోకి వెళ్లడమే.విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవినీతి » రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందని చెప్పడానికి మరో ఉదాహరణ యాక్సెస్ ఎనర్జీ వెంచర్ ఇండియా కంపెనీతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం. ఇది ఏకంగా రూ.11 వేల కోట్ల స్కామ్. యాక్సెస్ సంస్థ నుంచి 400 మెగావాట్ల పవర్, వారి పీఎల్ఎఫ్ ప్రకారం ఏడాదికి 10 కోట్ల యూనిట్లు, యూనిట్ రూ.4.60 చొప్పున కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా 210 కోట్ల యూనిట్లు కొంటున్నారు. ఒక్కో యూనిట్ ధర రూ.4.60. అదే మా హయాంలో మేము సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం యూనిట్ విద్యుత్ రూ.2.49 మాత్రమే. అంటే ఒక్కో యూనిట్కు చంద్రబాబు ప్రభుత్వంలో అదనంగా రూ.2.11 చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 210 కోట్ల యూనిట్లకు రూ.440 కోట్ల చొప్పున 25 ఏళ్లకు పడే భారం రూ.11 వేల కోట్లు. » ఇది ఇచ్చేటప్పుడు చంద్రబాబు తెలివిగా బీబీబీ (బండ్లింగ్, బ్యాంకింగ్. బ్యాలెన్సింగ్) అన్న ప్రస్తావన తెచ్చారు. అంటే 4 గంటల పీక్ అవర్ అని చెప్పి, మొత్తం 24 గంటలకు యూనిట్ రూ.4.60కి కొంటూ స్కామ్ చేస్తున్నారు. ఈ మధ్య సెకీ పలు సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ విద్యుత్ ధర కేవలం రూ.3.53 మాత్రమే. వాటిలో ఎన్టీపీసీ, రిలయెన్స్ సంస్థలు ఉన్నాయి. ఆ ధర లెక్క వేసుకున్నా రూ.1.07 ఎక్కువ ధర చెల్లిస్తున్నట్లే. ఆ విధంగా చంద్రబాబు స్కామ్లు చేస్తున్నారు. స్కామ్లలో పరాకాష్ట.. అమరావతి నిర్మాణం» స్కామ్లలో పరాకాష్ట అమరావతి పనుల్లో అవినీతి వ్యవహారం. ఆ పనులకు సంబంధించి 2018లో టెండర్ల విలువ రూ.41,170.78 కోట్లు కాగా, అందులో అప్పుడు రూ.5,587.28 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇంకా రూ.35,583 కోట్ల పనులు మిగిలాయి. వాటిని రద్దు చేసి, మిగిలిన పనుల అంచనాలు విపరీతంగా పెంచి ఇప్పుడు దోపిడీ చేస్తున్నారు. » అందుకోసం గతంలో మా ప్రభుత్వం అమలు చేసిన జుడీషియల్ రివ్యూ విధానాన్ని, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఈ స్కామ్లో తమ సదుపాయం కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకొచ్చారు. మా హయాంలో అది లేదు. కానీ, చంద్రబాబు దాన్ని తీసుకొచ్చి, టెండర్ ఇవ్వగానే 10 శాతం అడ్వాన్స్ ఇచ్చి, అందులో 8 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. ఐదు ఐకానిక్ టవర్లను ఒక్కో చదరపు అడుగు వ్యయం రూ.8,931తో నిర్మిస్తున్నారు. » సచివాలయం.. అసెంబ్లీలు ఆరు బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల భవనాల్లో ఉన్నాయి. ఇవి ఉండగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ ఆఫీసులు 53,57,389 చదరపు అడుగులతో నిర్మిస్తారట. నిజానికి సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ భవనాలతో కలుపుకుని అంతా 12 వేల మంది వరకు ఉద్యోగులు ఉంటారు. ఈ లెక్కన కొత్తగా 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణం మీ కమీషన్ల కోసం కాదా? సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ.. అన్నీ అప్పులే » అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని అందరినీ మభ్య పెడుతూ, చంద్రబాబు చేస్తున్న అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, కేఎఫ్డబ్ల్యూ (జర్మనీ) బ్యాంక్ నుంచి రూ.5 వేల కోట్లు, సీఆర్డీఏ బాండ్ల నుంచి రూ.21 వేల కోట్లు.. ఇలా ప్రస్తుతానికి రూ.52 వేల కోట్ల అప్పులు చేస్తున్నారు. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో రూ.6 వేల కోట్లు కేటాయించారు. మరి ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్?» ఇప్పటికే ఉన్న 50 వేల ఎకరాలకు సంబంధించే ఈ మధ్య ఫైనాన్స్ కమిషన్కు చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చి, రూ.77 వేల కోట్లు కావాలని అడిగారు. ఈ లెక్కన అమరావతి కోసం చేస్తున్న, చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకే అర్థమవుతుంది. ఇవి కాక మళ్లీ 50 వేల ఎకరాలు సేకరించి అమరావతిని విస్తరిస్తారట ఈ పెద్దమనిషి! అమరావతి విస్తరణకు మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నాడు. మరి ఈ పనులకు ఎన్ని లక్షల కోట్లు కావాలి? అది అయిపోయే సరికి రూ.2, 3 లక్షల కోట్ల మొత్తం ఎన్ని లక్షల కోట్లు అవుతుంది?» ఇన్నిన్ని అప్పులు తెచ్చి, ఇన్నిన్ని స్కాములు చేసే బదులు.. అయ్యా చంద్రబాబూ.. నీ సొంత లాభాలు పక్కన పెట్టి.. నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి.. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి. కావాలంటే విజయవాడ–గుంటూరు మధ్య ఎన్హెచ్ దగ్గర్లో నాగార్జున యూనివర్సిటీలోనో, లేదంటే విజయవాడ–గుంటూరు మధ్య ఓ 500 ఎకరాలు తీసుకుని నువ్వు కట్టాల్సిన బిల్డింగ్లు ఏవో కట్టు. రీజనబుల్గా ఏదో సైజ్లో అయిపోతుంది. గుంటూరు–విజయవాడ ఎప్పుడైనా కలిసిపోతాయి. » ఇప్పటికే నువ్వు చేసిన పనికి విజయవాడ, గుంటూరుల్లో రియల్ ఎస్టేట్ ఢమాలైంది. మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. మచిలీపట్నంలో పోర్టు కట్టాం. మెడికల్ కాలేజీ నిర్మించాం. విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని కడితే రేట్లు పెరుగుతాయి.అప్పుల సామ్రాట్ చంద్రబాబు» మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది రూ.67,720 కోట్ల అప్పులు చేస్తే.. ఈ పెద్దమనిషి 12 నెలల కాలంలో, ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పులు ఏకంగా రూ.81,597 కోట్లు. అది మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది చేసిన అప్పుల కన్నా 30 శాతం ఎక్కువ. ఇంకా మూల «ధన వ్యయం చూస్తే, మా హయాంలో చివరి ఏడాది ఆ మొత్తం రూ.23,330 కోట్లు కాగా, చంద్రబాబు ఏడాది పాలనలో అది కేవలం రూ.19,177 కోట్లు. అంటే మైనస్ 17.80 శాతం అన్నమాట. ఈ గణాంకాలన్నీ చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి.» చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి ఉన్న మొత్తం అప్పులు రూ.3,90,247 కోట్లు కాగా, అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ (పవర్ సెక్టార్ నాన్ గ్యారెంటీ అప్పులు సహా) అన్నీ కలిపి ఉన్న అప్పులు రూ.7,21,918 కోట్లు. అంటే మా హయాంలో చేసిన అప్పులు రూ.3,32,671 కోట్లు.» మా హయాంలో అప్పుల పెరుగుదల (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్–సీఏజీఆర్) 13.57 శాతం. అదే అంతకు ముందు రాష్ట్రం విడిపోయి 2014లో చంద్రబాబునాయుడు చేతికి అధికారం వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.1,40,717 కోట్లు కాగా, ఐదేళ్లలో ఆ మొత్తం ఏకంగా రూ.3,90,247 కోట్లకు చేరింది. అంటే చంద్రబాబు తన హయాంలో రూ.2,49,350 కోట్ల అప్పులు చేసి, ‘అప్పుల సామ్రాట్’ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన హయాంలో సీఏజీఆర్ 22.63 శాతంగా నమోదైంది. » 2019–24 మధ్య ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొత్తం రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే, చంద్రబాబు కేవలం ఈ 12 నెలల్లోనే రూ.1,37,546 కోట్ల అప్పు చేశారు. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో ఏకంగా 41 శాతం.. చంద్రబాబు ఒక్క ఏడాదిలోనే చేశాడు. అప్పుల వివరాలు ఇలా..ఎస్డీఎల్ ఇన్స్యూరెన్స్ ఇన్ ఏప్రిల్–2025 : రూ.5750 కోట్లుఎస్డీఎల్ ఇన్స్యూరెన్సెస్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే–2025 : రూ.7 వేల కోట్లుఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఏపీపీఎఫ్సీ: రూ.710 కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మార్క్ఫెడ్: రూ.6 వేల కోట్లుఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్: రూ.2 వేల కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఏపీఎండీసీ బాండ్స్: రూ.3,489 కోట్లుబారోయింగ్స్ సెక్యూర్డ్ ఫర్ అమరావతి బై ఏపీ గవర్నమెంట్ : రూ.31 వేల కోట్లు మొత్తం అప్పు : రూ.1,37,576 కోట్లు. ఇందులో ఒక్క అమరావతి నిర్మాణం కోసం చేసిన అప్పు రూ.31 వేల కోట్లు.అప్పు కోసం రాజ్యాంగ ఉల్లంఘన » చంద్రబాబు అప్పుల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్న 436 గనులపై ఉన్న హక్కులను ఏపీఎండీసీకి తీసుకొచ్చి, ఆ విలువను రూ.1.91 లక్షల కోట్లుగా వెల కట్టి, వాటిని తాకట్టు పెట్టి, బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు చేస్తున్నాడు. » రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. అలాంటిది రాష్ట్ర ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు ఇలా హక్కులు కల్పించడం రాష్ట్ర చరిత్రలో కాదు.. దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ జరిగి ఉండదు. ఇది చట్టరీత్యా నేరం. రాజ్యాంగ ఉల్లంఘనే.» ఆ విధంగా ఏపీఎండీసీ భవిష్యత్తును చంద్రబాబు అంధకారమయం చేస్తున్నాడు. ఏకంగా ఏపీఎండీసీని తాకట్టుపెట్టి అప్పులు తీసుకుని వచ్చి ఆ అప్పుల్ని డైవర్ట్ చేసుకుంటూ ఏపీఎండీసీని శాశ్వతంగా అప్పుల ఊబిలోకి నెట్టే కార్యక్రమం దగ్గరుండి చేస్తున్నాడు. అలా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద ప్రైవేట్ వ్యక్తులకు అజమాయిషీ ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏపీఎండీసీని ప్రైవేటుపరం చేసే పని చేస్తున్నారు.అసలు వీరు మనుషులేనా?ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం» మన ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నా ఈనాడు వక్రభాష్యం చెబుతోంది. ‘సెకీ’ ఒప్పందానికి సన్మానం అని కథనం. సెకీ చైర్మన్ను తొలగించడానికి కారణం, జగన్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం అట! ఏపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం డిసెంబర్ 1, 2021 కాగా, ఇప్పుడు తొలగించిన సెకీ సీఎండీ జూన్ 13, 2023లో నియమితులయ్యారు. రామేశ్వర్ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి 2023లో సీఎండీగా వచ్చారు. అంతకు రెండేళ్ల ముందు మా ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆయన్ను తీసేస్తే మా ప్రభుత్వంతో ఏం సంబంధం? ఇదెలా ఉందంటే.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఉంది. దీన్నిబట్టి ఈనాడు స్థాయి టాయిలెట్ పేపర్కు ఎక్కువ.. టిష్యూ పేపర్కు తక్కువ అనిపిస్తుంది. అసలు వీరు మనుషులేనా? అంతా మాఫియా రాజ్యం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. మీడియా అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి.» రాష్ట్రంలో స్కామ్లు దారుణంగా జరుగుతున్నా, ఎల్లో మీడియాలో అస్సలు కనిపించవు. ఉర్సా కంపెనీ. ఊరూ పేరూ లేదు. అలాంటి సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇస్తున్నారు. దానికి కేబినెట్లో క్లియర్ చేశారు. ఆ కంపెనీ యజమాని నారా లోకేశ్కు స్నేహితుడు. ఇంకా లులూ సంస్థకు మాల్ కట్టడానికి రూ.2 వేల కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇస్తున్నారు. దాన్ని ఎల్లో మీడియా చూపదు. రాయదు. ఈ రోజు రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, సిలికా, మైనింగ్, క్వార్ట్జ్ ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ. ఇసుకను మొత్తం దోచేస్తున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. మా ప్రభుత్వ హయాంలో రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. మేము దిగిపోయే ముందు వర్షాకాలం వస్తోందని 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ పెడితే, చంద్రబాబు అండ్ గ్యాంగ్ రెండు నెలల్లో మొత్తం దోచేసింది. సెకీతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ను రూ.2.49కు కొనుగోలు చేస్తూ 2021, డిసెంబర్ 1న ఒప్పందం చేసుకుంటే.. సెకీ ఎండీగా రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను 2023, జూన్ 13న కేంద్రం నియమించింది. ఈ లెక్కన సెకీతో వైఎస్సార్సీపీ కుదుర్చుకున్న ఒప్పందం వల్లే రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను ఎండీ పదవి నుంచి తొలగించిందనేది కేవలం దుష్ప్రచారం. -
మద్యం ముడుపుల డాన్ బాబే: వైఎస్ జగన్
ఒక్క అవినీతి మాత్రమే కాదు.. పాలనలో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అందుకే నెలకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు, ఆయన దొంగల ముఠా(ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) రకరకాల పనులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకం అమలు లేదు. మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ రద్దు చేశారు. మే నెల పూర్తి కావస్తున్నా చంద్రబాబు ఇస్తానన్న రైతు భరోసా రూ.26 వేలు ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున ఎగనామం. ఆడబిడ్డ నిధి రూ.18 వేలు, నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36 వేలు, 50 ఏళ్లకే ప్రతి మహిళకు రూ.48 వేలు మోసంగా మారాయి. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేదు.ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,600 కోట్లు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదు. ఇంకా మేనిఫెస్టోలో బాబు ప్రకటించిన 143 హామీల అమలు ఊసే లేదు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. ఏడాదిలోనే ప్రజలకు రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్లిచ్చారు. ‘‘మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే బలమైన కేసు నమోదైంది. తనపై నమోదైన కేసును ఇప్పుడు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బెయిల్ నియమ, నిబంధనలన్నీ ఉల్లంఘించిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయకూడదు?’’‘‘చంద్రబాబు చెప్పిన 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా నిలదీస్తూ.. రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై గళమెత్తుతూ జూన్ 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తాం. ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయ్యే రోజు సందర్భంగా సామాజికవేత్తలు, యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులను మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం’’-మీడియాతో వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి పాల్పడి ఆ కేసులో బెయిల్పై ఉన్న సీఎం చంద్రబాబు ఆ కేసు దర్యాప్తును నీరుగారుస్తూ గత ప్రభుత్వ పారదర్శక మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. 2019–24 మధ్య అసలు మద్యం స్కామ్ ఎక్కడ జరిగిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. భేతాళ కథలు సృష్టించి.. జరగని స్కామ్ను జరిగినట్లు చిత్రీకరించి.. ప్రలోభపెట్టి, బెదిరించి, భయపెట్టి లొంగదీసుకున్న వ్యక్తులతో తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని.. వాటి ఆధారంగా సంబంధం లేని వ్యక్తులపై తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించి ఒక్క ఫైలైనా సీఎంవోకు వచ్చినట్లుగానీ.. సంతకం చేసినట్లుగానీ చూపించగలరా? అంటూ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఎవరికైనా లాభాలు వచ్చేలా చేస్తే లంచాలు ఇస్తారేమోగానీ.. పన్నులు బాదేసి, పర్మిట్లు రద్దు చేసి, వారి లాభాలు తగ్గించి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచితే ఎవరైనా లంచాలు ఇస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. నిజమైన మద్యం స్కామ్స్టర్ చంద్రబాబేనని పునరుద్ఘాటించారు. 2014–19 మధ్య చంద్రబాబు మద్యం కుంభకోణానికి పాల్పడి సాక్ష్యాధారాలతో పట్టుబడ్డారని.. ఆ కేసులో ఆయన బెయిల్పై ఉన్నారని గుర్తు చేశారు. ఆ కేసును నీరుగార్చడానికే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అప్పుడు మద్యం కుంభకోణానికి పాల్పడి దోపిడీ చేసిన తరహాలోనే ఇప్పుడూ దోచేస్తున్నారని.. దాన్ని సమర్థించుకోవడానికే 2019–24 మధ్య జరగని మద్యం స్కామ్ జరిగినట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు కేసులు పెట్టి.. సంబంధం లేని వ్యక్తులను వేధిస్తున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) తీర్పు, 2014–15 మధ్య కేబినెట్ ఆమోదం లేకుండా.. ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా మద్యంపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు మూడు చోట్ల సంతకం చేసిన నోట్ ఫైలు.. 2014–19 మధ్య మద్యం అమ్మకాలు పెరిగినా ప్రభుత్వానికి ఆదాయం తగ్గడం లాంటి వాటిని సాక్ష్యాధారాలతో సహా ఎండగడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వ దుర్నీతిని కడిగి పారేశారు. చంద్రబాబు మోసాలను నిలదీస్తూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా నిలదీస్తూ.. రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై గళమెత్తుతూ జూన్ 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సందర్భంగా ప్రజలతో కలసి, ప్రజల కోసం సామాజికవేత్తలు, యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులను మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇంకా ఏమన్నారంటే.. పాలనలో ఘోర వైఫల్యం..ఒక్క అవినీతి మాత్రమే కాదు.. పాలనలో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అందుకే నెలకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు, ఆయన దొంగల ముఠా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) రకరకాల పనులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకం అమలు లేదు. మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. మే నెల పూర్తి కావస్తున్నా కూడా చంద్రబాబు ఇస్తానన్న రైతు భరోసా రూ.26 వేలు ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున ఎగనామం. ఆడబిడ్డ నిధి రూ.18 వేలు, నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36 వేలు, 50 ఏళ్లకే ప్రతి మహిళకు రూ.48 వేలు మోసంగా మారాయి. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేదు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయి ఏడాది దాటింది. రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదు. ఇంకా మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించిన 143 హామీల అమలు ఊసే లేదు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. ఏడాదిలోనే ప్రజలకు ఏకంగా రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్లిచ్చారు.లిక్కర్ స్కామ్.. ఫ్యాబ్రికేషన్..ఇలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు తనకు తెలిసిన మాస్టర్ ఆర్ట్ను బయటకు తెచ్చారు. వ్యవస్థలను నాశనం చేయడంతోపాటు ప్రశ్నించే గొంతులను నొక్కడానికి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా లిక్కర్ స్కామ్ అంటూ రాజకీయ కక్షకు దిగారు. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది? ప్రతి ఒక్కరూ ఆలోచించమని కోరుతున్నా. మీ మనస్సాక్షిని అడగండి. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యం ఎక్కువ అమ్మి, అమ్మకాలు పెంచి, దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక పన్నులు పెరిగి, అమ్మకాలు తగ్గిపోతే డిస్టిలరీలు లంచాలు ఇస్తాయా?రెండు ప్రభుత్వాలు.. మద్యం విక్రయాలుఒకసారి రెండు ప్రభుత్వాల హయాంలో మద్యం అమ్మకాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం చూస్తే.. టీడీపీ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే.. మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ హయాంలో కంటే మద్యం అమ్మకాలు తగ్గాయి. అయినా ఆదాయం ఎందుకు పెరిగిందంటే.. పన్నులు వేశాం. ఆ విధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడుపోతే మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి.2014–19 మధ్య మద్యంలో అవినీతి.. చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నట్లుగానే కొన్ని డిస్టిలరీలకు మాత్రమే మేలు చేసేలా ప్రైవేటు లిక్కర్ షాప్ల నుంచి ఇండెంట్ పెట్టించడం ద్వారా 2014–19 మధ్య కేవలం ఐదు డిస్టిలరీలే రాష్ట్రంలో 69 శాతం మద్యాన్ని సరఫరా చేశాయి. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతి ఇచ్చారు. మిగిలిన ఆరు వేర్వేరు ప్రభుత్వాల్లో అనుమతి పొందాయి. అంతేకాదు.. మద్యం సేకరణకు ఆ 20 డిస్టిలరీలను లిస్ట్ చేసింది (ఎంప్యానల్) కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మేం కొత్తగా ఏ డిస్టిలరీనీ చేర్చలేదు. కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. మా విధానం సహేతుకమని సీసీఐ తీర్పు.. చంద్రబాబు అండ్ కో కంపెనీలు మా ప్రభుత్వ మద్యం విధానంపై 2022లో కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేశాయి. ఆ పిటిషన్లో ఉన్న అంశాలన్నీ టీడీపీ వాళ్లు అప్పుడూ, ఇప్పుడూ చేస్తున్న అభియోగాలే. అందుకే అందరూ జాగ్రత్తగా చూడాలని కోరుతున్నా. ఆ అభియోగాలు ఏమిటంటే.. కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టేశారని, సప్లయ్ ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆరోపించారు. సీసీఐ ఆ అభియోగాలన్నింటిపై సుదీర్ఘ విచారణ చేపట్టి సంబంధిత రికార్డులు, సప్లయ్ ఆర్డర్లన్నింటినీ పరిశీలించి 2022 సెప్టెంబర్ 19న చారిత్రాత్మక జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకంగా ఉందని, మా ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయని, అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లు కొంటున్నారని, వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నారని తీర్పు ఇచ్చింది. సీసీఐ ఇచ్చిన తీర్పులో పేరాగ్రాఫ్ 85, 90, 95, 96, 97, 98, 101లో మొత్తం వివరాలు ఉన్నాయి. సీసీఐ జడ్జిమెంట్ కాపీలు పబ్లిక్ డొమైన్లో ఉంచుతాం. ఏం విలువ ఉంటుంది? చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి. రాజ్యసభ సభ్యుడిగా మరో మూడున్నరేళ్ల టర్మ్ ఉండగానే చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకు పదవికి రాజీనామా చేశాడు. వైఎస్సార్సీపీకి తగినంత ఎమ్మెల్యేల బలం లేదు.. మళ్లీ రాజ్యసభకు తన అభ్యరి్థని పంపించే అవకాశం ఉండదని, కూటమికి మేలు జరుగుతుందని తెలిసి కూడా ప్రలోభాలకు గురై రాజీనామా చేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్స్కు ఏం విలువ ఉంటుంది? ⇒ మరో నిందితుడిగా చెబుతున్న రాజ్ కేసిరెడ్డికి బెవరేజెస్ కార్యకలాపాలతో ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్న ఆయన ఒక వ్యాపారస్తుడు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అనేక మందిలో ఒకరు. అదీ రెండేళ్లు మాత్రమే. అది కూడా కోవిడ్ సమయంలో. ఇక విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. ఆయనకు ప్రస్తుత టీడీపీ విజయవాడ ఎంపీతో సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే టీడీపీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని, సులభంగా ప్రలోభ పెట్టవచ్చని తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా మారుస్తామన్నారు. అయితే అబద్ధం చెప్పకపోవడం వల్ల నిందితుడిగా చేర్చారని ఆయన స్వయంగా సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఇలా చేయదల్చుకుంటే ఎవరి మీదనైనా భేతాళ విక్రమార్క కథలు అల్లేసి ఏమైనా చెప్పించవచ్చు. బెవరేజెస్ కార్పొరేషన్, లిక్కర్తో ఎంపీ మిథున్రెడ్డికి ఏం సంబంధం? వాళ్ల నాన్న కనీసం ఈ శాఖ మంత్రి కూడా కాదు. అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ కె.ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి పి.కృష్ణమోహన్రెడ్డికి ఈ కేసుతో ఏం సంబంధం? మద్యానికి సంబంధించి ఒక్క ఫైలు అయినా సీఎంవోకు వచ్చినట్లు, ఒక్క సంతకం అయినా చూపించగలరా? అని సవాల్ విసురుతున్నా చంద్రబాబుకు. ధనుంజయరెడ్డి కనీసం ఎక్సైజ్ శాఖ కూడా చూసేవారు కాదు. మల్టీ నేషనల్ కంపెనీని అప్రతిష్ట పాలు చేస్తూ.. బాలాజీ గోవిందప్ప మల్టీ నేషనల్ కంపెనీ వికాట్లో హోల్టైమ్ డైరెక్టర్. 12 దేశాల్లో వాళ్లకు కార్యకలాపాలు ఉన్నాయి. ఆయన అసలు ఏపీలోనే ఉండరు. వికాట్ యూరప్ టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒకటి. చంద్రబాబు, ఈనాడు రాతలు, మాటలు చూస్తే.. ఆయనేదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చక్కబెట్టేవారని రాసుకొచ్చారు. నా పనులు చక్కబెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులు చాలామంది నాకున్నారు. అసలు వికాట్ అనేది నా కంపెనీనే కాదు. రిలయన్స్లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్ నాది అయిపోదు. నాకు ఓనర్షిప్ ఉన్న కంపెనీలు నాకు ఉంటాయి. దాంట్లో ఎంప్లాయీస్ నాకు ఉంటారు. దాంట్లో డైరెక్టర్స్ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే వాళ్లతో చేయిస్తా. నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నాది కాని కంపెనీలో డైరెక్టర్లు, బిజీగా ఉండేవాళ్లు నాకెందుకు పని చేస్తారు? ఒక మల్టీ నేషనల్ కంపెనీని అప్రతిష్ట పాలు చేస్తూ తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు, కేసులు.. వాస్తవాలు ఇలా ఉంటే అక్రమ కేసులో భయపెట్టి, బెదిరించి తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి చంద్రబాబు అరాచకంగా వ్యవహరిస్తున్నారు. బెవరేజెస్ కార్పొరేషన్లో పని చేస్తున్న సత్యప్రసాద్ ఒక సాధారణ సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి. సూపరింటెండెంట్లు పదుల సంఖ్యలో ఉంటారు. అనూష ఔట్ సోర్సింగ్లో పని చేసిన క్లరికల్ ఉద్యోగి. వాళ్లను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి ఈ ప్రభుత్వం తనను వేధిస్తోందని హైకోర్టులో మూడు సార్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఆయన్ను బెదిరించి, భయపెట్టి, లొంగదీసుకుని అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాక కేంద్ర సర్వీస్కు వెళ్లిపోవడానికి ఎన్ఓసీ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్స్కు ఏం విలువ ఉంటుంది? అసలు లంచాలు ఎప్పుడిస్తారు..?మద్యాన్ని ప్రభుత్వమే స్వయంగా అమ్మితే లంచాలు ఇస్తారా? షాపులు తగ్గించి, పర్మిట్ రూమ్లు, బెల్టు షాపులను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? లేకప్రైవేటు వ్యక్తులకు లిక్కర్ వ్యాపారం అప్పజెప్పి అడ్డగోలుగా రోజంతా అమ్మి లాభాలు గడిస్తే, డిస్టిలరీలకు ఎక్కువ ఆదాయం వస్తే లంచాలు ఇస్తారా? ఆలోచించండి. పేరుకు లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించినా తమకు కావాల్సిన వారికే షాపులు దక్కేలా చేశారు. ఇతరులు ఎవరైనా షాపులు దక్కించుకుంటే నిస్సిగ్గుగా 30 శాతం వాటా తీసుకున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. రోజంతా యథేచ్ఛగా అమ్ముతున్నారు. చివరకు డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. బెల్టుషాప్ల నిర్వహణకు వేలంపాట పాడుతున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారు. అలా వస్తున్న ఆదాయాన్ని పంచుకుంటున్నారు. అంతే కాకుండా ఏ డిస్టిలరీకి మేలు చేయాలనుకుంటే ప్రైవేటు షాపుల ప్రైవేటు సైన్యంతో ఆ డిస్టిలరీ ఉత్పత్తులకు ఇండెంట్ వేయిస్తారు. ఆ విధంగా ఆ కంపెనీకి మేలు చేస్తున్నారు. ఇది మా హయాంలో జరిగిందా? ఎక్కడైనా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మారా? మరి లంచాలు ఎవరికి ఇస్తారు? ప్రైవేటు షాపుల చేత, వీరు ఎంపిక చేసుకున్న డిస్టిలరీకి ఎక్కువ ఆర్డర్ ఇస్తే లంచాలు ఇస్తారా? లేక మా హయాంలో మాదిరిగా ప్రతి బాటిల్పై క్యూఆర్ కోడ్ పెట్టి దాన్ని అమ్మేటప్పుడు స్కాన్ చేసి ఆటోమేటిక్గా అప్లోడ్ చేసే విధానం అమలు చేశాం. ఆ డిమాండ్ మేరకు ఆయా డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చాం. అలా చేస్తే లంచాలు ఇస్తారా?స్కామ్స్టర్ చంద్రబాబేమద్యంలో అసలు స్కామ్స్టర్ ఎవరంటే చంద్రబాబే. 2014–2019 మధ్య చేసిన లిక్కర్ స్కామ్లో చంద్రబాబు బెయిల్పై లేరా? ఇది వాస్తవం కాదా? ఆ రోజు చంద్రబాబు చేసిన స్కామ్ మీరే చూడండి.. ⇒ రాష్ట్రంలో 4,380 లిక్కర్షాపుల కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియను రిగ్గింగ్ చేశారు. తన ఎమ్మెల్యేలు, మంత్రులు, బినామీలు, తన మనుషులు రిగ్గింగ్ చేసి షాపులు ఇప్పించుకున్నారు. ఈ షాపులన్నింటిని ఒక సిండికేట్ మాఫియాగా తయారు చేశారు. వీటికి పక్కనే ఇల్లీగల్గా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసి ఏకంగా 43 వేల బెల్ట్షాపులు నడిపారు. ఎక్కువ రేటుకు మద్యాన్ని అమ్మారు. అప్పుడు కూడా ఇలాగే ప్రైవేట్ షాపుల సిండికేట్ ఏర్పాటు చేసుకుని తనకు కావాల్సిన డిస్టిలరీలకు మేలు చేసే వి«ధంగా ఆర్డర్స్ చేశారు. తనకు కావాల్సిన కంపెనీలతో ఇండెంట్ ఇప్పించారు. 2015– 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఐదు కంపెనీలకే 69 శాతం ఆర్డర్స్ దక్కాయి. ⇒ కొన్ని బ్రాండ్లకు కృతిమ డిమాండ్లు సృష్టించారు. 2014 నవంబర్లో జీవో 993 ప్రకారం ఏర్పాటైన కమిటీ సిఫార్సులు బేఖాతరు చేస్తూ డిస్టిలరీల కెపాసిటీకి మించి ఉత్పత్తికి చంద్రబాబు ప్రత్యేకంగా సిఫార్సు చేశారు. తరువాత 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి ప్రైవేటు వైన్షాప్లు, బార్లకు లబ్ధి చేకూర్చారు. అందుకోసం 2015 డిసెంబర్ 11న జీవోను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన నోట్ఫైల్లో స్వయంగా చంద్రబాబే సంతకం చేశారు. క్యాబినెట్ అనుమతి లేకుండా మూడుసార్లు చంద్రబాబు సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చుతూ చంద్రబాబు సంతకం చేసిన ఫైల్ను కాగ్ కూడా తప్పుబట్టింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబుపై బలమైన కేసు నమోదైంది. చంద్రబాబు ఆ కేసులో ఇప్పుడు బెయిల్పై ఉన్నారు. దాన్ని కప్పి పుచ్చుకుంటూ ఇప్పుడు అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. తన ట్రేడ్ మార్క్ పాలసీ ప్రకారం స్కామ్లు చేస్తూ వైఎస్సార్సీపీ హయాంలో కుంభకోణం జరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ బ్రాండ్లు ఎప్పుడైనా చూశామా? ఇప్పడు చంద్రబాబు అమ్ముతున్న బ్రాండ్లు ఏమిటి? ఈ బ్రాండ్ల ఫొటోలు ఎప్పుడన్నా చూశారా? సుమో.. కేరళా మాల్ట్ ఎప్పుడన్నా చూశారా? షార్ట్ విస్కీ ఎప్పుడన్నా చూశారా? బెంగళూరు విస్కీ.. బెంగళూరు బ్రాందీ.. రాయల్ ల్యాన్సర్ విస్కీ.. ఓల్డ్ క్లబ్.. గుడ్ ఫ్రెండ్స్ అంట.. ఎప్పుడూ చూడని బ్రాండ్లు కాదా ఇవి? ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్లు ప్లేస్ చేస్తున్నారు? ఇవన్నీ ప్రైవేటు మాఫియా చేత.. తన ప్రైవేటు షాపులు.. తనకు కావాల్సిన డిస్టిలరీస్కు మేలు చేసేందుకు.. ఇండెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఊరూ పేరూ లేని బ్రాండ్లు కావాలని ఎవరన్నా అడుగుతారా? ధరలు తగ్గిస్తానని చెప్పి..చంద్రబాబు తానొస్తే ధరలు తగ్గిస్తానన్నాడు.. తగ్గించింది లేదు కానీ షాపులు తన మాఫియా చేతుల్లో పెట్టిన తర్వాత.. ప్రాసెస్ అంతా పూర్తయ్యాక వారికిచ్చే కమీషన్ పెంచాడు. ఇది స్కాం కాదా? ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. విలేకరులు గ్రామాల్లోకి వెళ్లి ఎంక్వైరీ చేయండి. ఇది స్కాం కాదా? రూ.99కే లిక్కర్ ఇస్తానని క్వాలిటీ గతంలో కంటే ఒక లెవల్ తగ్గించి అమ్ముతున్నారు. ఆ చీపెస్ట్ చీప్ లిక్కర్ కూడా పొరుగు రాష్ట్రాల్లో రూ.10 తక్కువ. అన్నీ పబ్లిక్ డొమైన్లో..చంద్రబాబు హయాంలో లిక్కర్లో దోపిడీకి సంబంధించి వివరాలు పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం. వైఎస్సార్ సీపీ హ్యాష్ ట్యాగ్.. వైఎస్సార్ సీపీ ట్విట్టర్ హ్యాండిల్లో నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లో 22 పేజీల డాక్యుమెంట్ పెడతాం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. డౌన్ లోడ్ చేసుకోండి. మద్యం అక్రమాలు, రెడ్ బుక్ మీద కూడా ఇంగ్లిష్, తెలుగు వెర్షన్ కాపీలు పెడతాం. కూటమి ప్రభుత్వ అనైతిక పర్వంచంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్ సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది. కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది.అధికారులకు వేధింపులుటీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్లు డీజీ ర్యాంకు అధికారి.. పీఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ ర్యాంక్ దళిత అధికారి సునీల్ కుమార్, అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి సంజయ్ ఐపీఎస్, సీనియర్ ఆఫీసర్, ఐజీ ర్యాంక్ కాంతిరాణా టాటా, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ విశాల్ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి ఐపీఎస్ లు, ఐపీఎస్ అధికారి పి.జాషువా వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్ అధికారి విజయ్పాల్ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్ హ్యాండిల్, నావ్యక్తి గత ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఈ సమాచారాన్ని అప్ లోడ్ చేస్తాం. మచ్చలేని అధికారులు.. ధనుంజయరెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్. రిటైర్డ్ ఐఏఎస్. పాపం ఆయన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే తీసుకొచ్చి జైల్లో పెట్టారు. కృష్ణమోహన్ అన్న కుమార్తెకు ఇటీవలే పెండ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప తన కుమార్తె పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకో అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును తీసుకొచ్చి జైల్లో పెట్టారు. సునీల్ కుమార్ డీజీ స్థాయి దళిత ఐపీఎస్ అధికారి. ఆయన్ను సస్పెండ్ చేసి హరాస్ చేస్తున్నారు. సంజయ్ అడిషనల్ డీజీ, దళిత ఆఫీసర్. ఆయన్ను సస్పెండ్ చేసి కేసులు పెట్టారు. విజయ్ పాల్ను తప్పుడు కేసులతో అరెస్టు చేశారు. కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ సీనియర్ ఐపీఎస్లు ఇద్దరినీ సస్పెండ్ చేశారు. ఐపీఎస్ అధికారి జాషువాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. రఘురామిరెడ్డి ఐజీ, ఐపీఎస్. రిషాంత్ రెడ్డి ఎస్పీ, ఐపీఎస్. వీరికి పోస్టింగులు లేవు. దాదాపు 199 మంది పోలీసు అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్లో పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా అసెంబ్లీకి దీన్ని వెల్లడించింది. నిజం చెప్పాలంటే రాష్ట్రంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. అందుకే ఐఏఎస్లే కాదు, ఐపీఎస్లు కూడా మీటింగ్ పెట్టుకోవాలి.నిప్పు రవ్వలు‘‘మా హయాంలో రెండేళ్లు కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చినా రాష్ట్రాన్ని గొప్పగా సంక్షేమం, అభివృద్ధి బాటలో నడిపాం. అదే చంద్రబాబు ఏడాది పాలన.. కాగ్ నివేదిక గమనిస్తే.. ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేనే లేదు. కేవలం 3.08 శాతం మాత్రమే గ్రోత్రేట్ కనిపిస్తోంది. ఇదే సమయంలో దేశంలో 13.76 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఆదాయం రాష్ట్ర ఖజానాకు కాకుండా చంద్రబాబు, ఆయన గజదొంగల ముఠా జేబులోకి వెళ్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు కేవలం 12 నెలల్లోనే రూ.1,37,546 కోట్ల అప్పులు చేశారు. చంద్రబాబు అప్పుల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. 436 గనులను తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు చేస్తున్నాడు. ఆ అప్పు కోసం చట్ట విరుద్ధంగా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పిస్తున్నారు. అది నేరం..’’ పారిశ్రామికవేత్తలకు బెదిరింపులుఇప్పటికే సజ్జన్ జిందాల్ను బెదరగొట్టారు. జత్వానీ గిత్వానీ అని చెప్పి అధికారులను అరెస్టు చేశారు. ఆంధ్ర అంటే నమస్కారం పెట్టి వ్యాపారం చేయొద్దని సజ్జన్ జిందాల్ చెబుతున్నాడు. అరబిందో వాళ్లు ఇప్పటికే చంద్రబాబుకి నమస్కారం పెడుతున్నారు. షిప్, సీజ్ అంటూ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు. చివరకు షిప్, బియ్యం పోయాయి. ఇప్పుడు వికాట్ మల్టీ నేషనల్ కంపెనీపై పడ్డారు. వీళ్ల ఎమ్మెల్యేలు, మంత్రుల పుణ్యమా అని కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ నమస్కారం పెడుతోంది. ఇలా పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్నారు. -
‘చంద్రబాబు సర్కార్’ అరాచకాల చిట్టా విప్పిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వ అనైతిక పర్వాన్ని నిలదీశారు.‘‘రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది...కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది’’ అని మీడియాకు వివరించారు.‘‘టీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్లు డీజే ర్యాంకు అధికారి. పీఎస్ఆర్ అంజనేయులు, డీజే ర్యాంక్ దళిత అధికారి సునీల్ కుమార్, అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి సంజయ్ ఐపీఎస్, సీనియర్ ఆఫీసర్, ఐజీ ర్యాంక్ కాంతిలాల్ రాణా, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ విశాల్ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి ఐపీఎస్ లు, ఐపీఎస్ అధికారి పి.జాషువా, వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్ అధికారి విజయ్పాల్ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్ హ్యాండిల్, నా వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఈ సమాచారాన్ని అప్ లోడ్ చేస్తాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు. -
రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..
-
లిక్కర్ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్ ధ్వజం (చిత్రాలు)
-
73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
-
సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..
-
అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది
-
సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!
-
రెడ్ బుక్ రాజ్యాంగంలో 390 మంది హత్యకు గురయ్యారు
-
హనుమాన్ జయంతి.. వైఎస్ జగన్ ట్వీట్
తాడేపల్లి: హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శక్తిమంతుడు, సమర్థుడైన కార్యసాధకుడు ఆంజనేయుడు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ. శ్రీరాముడి బంటు అయిన ఆంజనేయుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.శక్తిమంతుడు, సమర్థుడైన కార్యసాధకుడు ఆంజనేయుడు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ. శ్రీ రాముడి బంటు అయిన ఆంజనేయుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.#HanumanJayanti— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2025 -
చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు
-
జూన్ 4న వెన్నుపోటు దినం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారాయన. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని కోరారాయన.ఇదీ చదవండి: YS Jagan-నాకు పోరాటాలు కొత్త కాదు -
స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్
-
విజయసాయిలాంటి వాళ్ల స్టేట్మెంట్లకు విలువుందా?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: చంద్రబాబు మరోసారి తన మంత్ర దండం బయటకు తీశారని.. వ్యస్థలను మేనేజ్ చేస్తూ తన మోసాలను ప్రశ్నించేవారి గొంతును నొక్కేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే.. లిక్కర్ స్కాం అంటూ తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారాయన. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా?. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారా?. ఎక్కడైనా దుకాణాలు 33 శాతం తగ్గిస్తే లంచాలు ఇస్తారా?. 2019-2024 మధ్య లిక్కర్ సేల్ తగ్గింది. ఒక్క కంపెనీకి లైసెన్స్ ఇవ్వలేదు. ట్యాక్స్లు పెంచాం. కాబట్టే లిక్కర్ కంపెనీలకు లాభాలు పోలేదు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాం. అదే సమయంలో.. మద్యం తాగడం తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు చేశాం. ప్రతీ బాటిల్పై క్యూఆర్ కోడ్ పెట్టించాం.లాభాపేక్ష లేకుండా మా(వైఎస్సార్సీపీ) ప్రభుత్వం అమ్మకాలు జరిపాం... అసలు లిక్కర్ స్కాం (Jagan on Liquor Scam) ఎక్కడ జరిగింది?. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారు. కానీ, ఇప్పుడు ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఈ 12 నెలల కాలంలో లిక్కర్ సేల్ పెరిగింది. కూటమి పాలనలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వెలిశాయి. బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడం లేదు.. మద్యాన్ని చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే అవి నడుస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కొత్త కొత్త బ్రాండులను తీసుకొచ్చారాయన. గతంలో..(2014-19) తన హయాంలోనూ లిక్కర్ సేల్స్ పెంచుకుంటూ పోయారు. తద్వారా అమ్మకాలు పెరిగాయి. కాబట్టే లిక్కర్ కంపెనీలకు లాభాలు వెళ్లాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. అలాంటప్పుడు స్కాం ఎక్కడ జరిగింది?. డిస్టరీలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మా హయాంలో ఉందా?’’ అని జగన్ ప్రశ్నించారు.గతంలో లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టికి బెయిల్ మీద ఉంది నిజం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు.. లాటరీ పేరుతో రిగ్గింగ్ చేసి మద్యం షాపులు దోచుకున్నారు. ఆనాడు కూడా ప్రైవేట్ సిండికేట్కు మేలు చేశారు. తనకు కావాల్సిన కంపెనీలకే అనుమతులు ఇచ్చారు. 2015-19 మధ్య ఐదు కంపెనీలు 69 శాతం ఆర్డరులు ఇచ్చారు. తద్వారా కొన్నిబ్రాండ్లకు మాత్రమే డిమాండ్ సృష్టించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ సిండికేట్కు లబ్ధి చేకూర్చడం కోసం.. తన పాలసీని కొనసాగించడం కోసం.. ఏం స్కాం జరగకపోయినా వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. భయపెట్టి.. బెదిరించి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి.. తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు లిక్కర్ స్కాం అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు. చిన్నస్థాయి ఉద్యోగులను బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి(V. Vijayasai Reddy). వైఎస్సార్సీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని, తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఉండదని.. మూడేళ్ల టర్మ్ ఉండగానే కూటమికి, చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిసి.. ప్రలోభాలకు లొంగిపోయి తన సీటును అమ్మేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్, వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది?. లోక్సభ ఎంపీ, ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుతో ఏం సంబంధం?. ఆయన తండ్రి పెద్దిరెడ్డి కనీసం ఆ శాఖ మంత్రి కూడా కాదు. ఐఏఎస్, ఐపీఎస్లను జైళ్లో పెట్టిన చరిత్ర లేదు. సీనియర్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అరెస్ట్ చేసిన ధనుంజయ్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో కేసిరెడ్డి ఒకరు. కేసిరెడ్డికి, బేవరేజెస్ కార్పొరేషన్కు ఏం సంబంధం?. విజయవాడ టీడీపీ ఎంపీ, కేసిరెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. కేసిరెడ్డి అప్రూవర్గా మారలేదని నిందితుడిగా చేర్చారు. కావాల్సిన స్టేట్మెంట్ ఇస్తే కేసిరెడ్డిని వదిలేసేవారు. లిక్కర్ స్కాంకి సంబంధించి ఒక్క ఫైల్ అయినా సీఎంవోకి వచ్చి సంతకం అయినట్లు చూపించగలరా? అని చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా. కుట్రలు చేసి.. సంబంధం లేని వ్యక్తులనూ తెరపైకి తీసుకొచ్చి లిక్కర్ కేసులంటూ తప్పుడు కేసులు పెడుతూ.. రాజకీయ కక్షకు పాల్పడుతున్నారు. ఐపీఎస్లు సంజయ్, కాంతిలాల్ ఠాణా, జాషువా, విశాల్ గున్నీ, ధనుంజయ్, రఘురామ్ రెడ్డి ఇలా అధికారులను వేధిస్తున్నారు అని వైఎస్ జగన్ అన్నారు. -
ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..
-
అమరావతి పేరుతో దోపిడీ.. స్కాంలకు పరాకాష్ట: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏపీలో జరుగుతున్న స్కాంలకు పరాకాష్ట.. అమరావతి పేరుతో దోపిడీనేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న ఆర్థిక దోపిడీని వివరించారు. ‘‘అమరావతి పనుల కోసం 2018 లోనూ టెండర్లు పిలిచారు. నాడు ఖరారైన టెండర్ల విలువ రూ.41, 107 కోట్లు. దాదాపు 6 వేల కట్లు పనులు చేశారు. మిగిలిన రూ. 35 వేల కోట్లతో పనులు చేయాల్సి ఉంది. కానీ, ఈ టెండర్లు రద్దు చేేశారు. మిగిలిన ఆ పనుల అంచనాలు అమాంతం పెంచేశారు. ఇప్పటికే కట్టిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు కాకుండా మళ్లీ కడతారట. అంటే అన్నీ గంగపాలు చేసినట్లే!. అక్రమాలకు అడ్డు కాకూడదని.. మా హయంలో తెచ్చిన జ్యూడీషియల్ ప్రివ్యూ తీసేశారు. రివర్స్ టెండరింగ్నూ రద్దు చేశారు. మొబలైజేషన్ అడ్వాన్స్లు లేవు. కానీ, స్కాంల కోసమే మొబలైజేషన్ అడ్వాన్స్లు తెచ్చారు. అడ్వాన్స్ల పేరిట 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. 2018 ఐకానిక్ టవర్ల పేరిట టెండర్లకు పిలిచారు. మిగిలిన పనులను ఇప్పుడు నిర్మాణ వ్యయం 4,468 కోట్లు. 2018తో పోలిస్తే దాదాపు రూ.2,417 కోట్లు (105 శాతం) పైగా పెంచారు. చదరపు అడుగుకు రూ.8, 931.. అంటే ఏమైనా బంగారంతో కడుతున్నారా?మీరు సాయం చేస్తే.. పుంజుకుంటాం(ఈనాడు క్లిప్ను ప్రదర్శిస్తూ..) అంటూ చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆకాశాన్ని అంటేలా అప్పులు చేస్తున్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. సొంత లాభాలు, బినామీ ఆస్తులను పెంచుకునే పని పక్కన పెడితే.. ఇంతేసి అప్పులు చేయాల్సి ఉండదు కదా’’ వైఎస్ జగన్ సూచించారు. -
చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్
-
మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!
-
చంద్రబాబు.. అప్పుల సామ్రాట్: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మోసాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మీడియా సమావేశంలో ఎండగట్టారు. బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్ కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులను లెక్కలతో సహా వివరించారు. ‘‘ఈ 12 నెలల కాలంలోనే.. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే.. రాష్ట్ర రెవెన్యూ 3.8 శాతం మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్. మా ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేశారు. మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.ఏపీఎండీసీకి గనులు తాకట్టుపెట్టి 9 వేలకోట్లు అప్పు చేశారు. 293(1) ప్రకారం బాబు అప్పులు చేసే విధానం చట్ట విరుద్ధం. ఏపీఎండీసీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. రాష్ట్ర గనులపై ప్రైవేట్ వ్యక్తులు అజమాయిషి ఇస్తున్నారు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్
-
నాకు పోరాటాలు కొత్త కాదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గత ఏడాది కాలంగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, చంద్రబాబు పాలన అంతా అవినీతి, స్కాములు, దోపిడీ మయంగా మారిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. తాజా రాజకీయ పరిస్థితులపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద నాణేనికి రెండో వైపులా.. కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబుతోనే కాదు.. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా!.బాబు 12 నెలల పాలనలో..ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ, కాగ్ నివేదికను పరిశీలిస్తే.. అభివృద్ధి కనిపించలేదు. సంక్షేమం ఊసే లేదు. ఈ సంవత్సర కాలం అంతా మోసాలతో గడిపారు. ఏడాది పాలనలో పెట్టుబడులు తగ్గాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ఆదాయం అనేది రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. రాష్ట్ర ఆదాయమంతా బాబు గజదొంగల జేబుల్లోకి వెళ్తోంది. అదే మా హయాంలో.. కోవిడ్ విజృంభించిన సమయంలోనూ రాష్ట్రాన్ని గోప్పగా నడిపాం. అభివృద్ధి, సంక్షేమం.. ప్రజలకు మంచి పరిపాలన అందించాం.అప్పుల సామ్రాట్ బాబుఈ 12 నెలల కాలంలోనే.. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే.. రాష్ట్ర రెవెన్యూ 3.8 శాతం మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్. మా ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేశారు. మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈనాడు.. ఓ మీడియానా?ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ఓ మాఫియా రాజ్యం. సెకీకి సన్మానం అంటూ ఈనాడు నా ఫొటోలో ఓ కథనం ఇచ్చింది. 2021 డిసెంబర్లో ఏపీతో సెకీ ఒప్పందం అయితే, ఆపై రెండేళ్లకు సెకీ చైర్మన్ నియామకం జరిగింది. కానీ, సెకీకి సన్మానం అంటూ ఈనాడు తప్పుడు కథనాలు ఇచ్చింది. ఈనాడు.. టాయిలెట్ పేపర్కు ఎక్కువ.. టిష్యూ పేపర్కి తక్కువ. దున్నపోతును ఈనితే.. దూడను కట్టేసినట్లు ఉంది ఈనాడు తీరు. సిగ్గు పడాలి మీడియా అని చెప్పుకునేందుకు. పరాకాష్టకు స్కాంలురాష్ట్రంలో లిక్కర్, ఇసుక, క్వార్ట్జ్, మైనింగ్, సిలికా.. ఇలా అన్ని మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్ నుంచి రాష్ట్రానికి రూపాయి రావడం లేదు. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు. 4 గంటల పీక్ అవర్ కోసమంటూ 24 గంటలకు యూనిట్కు రూ.4.60 చొప్పున ఒప్పందం చేసుకున్నారు. మా హయంలో రూ.2.49కే విద్యుత్ కొన్నాం. విద్యుత్ కొనుగోలులో రాష్ట్ర ఖర్చు తగ్గించాం. బాబు పాలనలో విద్యుత్ కొనుగోలులోనూ పెద్ద స్కామ్ జరిగింది. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఖజానాకు గండి కొట్టారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదోగానీ.. ఉర్సా అనే సంస్థకు భూములు ఇచ్చారు. బిడ్ లేకుండా రూ.2 వేల కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇచ్చారు. స్కాంలకు పరాకాష్ట్ర అమరావతి పేరుతో దోపిడీనే.. జూన్ 4న వెన్నుపోటు డేకిందటి ఏడాది జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు ఎలాంటి హామీ నెరవేర్చలేదు. అందుకే చంద్రబాబు మోసాలకు గుర్తుగా ఆ రోజున వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటాం. కలెక్టర్లకు హామీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. బాబు ఎందుకు అరెస్ట్ కాకూడదు?రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. తనపై కేసులను చంద్రబాబు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్పై ఉంటూ అధికార దుర్వినయోగానికి పాల్పడుతున్నారు. బెయిల్ కండిషన్లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు అరెస్ట్ కాకూడదు?లిక్కర్ స్కాం పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందా? అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా.. ‘‘నాకు పోరాటాలు కొత్త కాదు. గతంలో రెండు పార్టీలు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా న్యాయమే గెలుస్తుంది. గతంలో ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా వైఎస్సార్సీపీ పుట్టింది.. పెరిగింది.. ఎదిగింది. న్యాయం, ధర్మం వైపే దేవుడు ఉంటాడు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్
-
ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్...
-
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. -
కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/తిరువూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా కూటమి నేతలు బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కలిశారు. చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకులు చేసిన దాడుల గురించి వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొందామని.. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనేక ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలబడ్డారంటూ కౌన్సిలర్లను అభినందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, తిరువూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాసు, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు, మోదుగు ప్రసాద్, ఇనపనూరి చిన్నారి, పాలం రమాదేవి, గుమ్మా వెంకటేశ్వరి, పరసా సత్యనారాయణ, వెలుగోటి విజయలక్ష్మి, షేక్ నదియా, రామవరపు మంజుల, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్, సీనియర్ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, తిరువూరు మండలాధ్యక్షుడు తాళ్లూరి నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు -
తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్ జగన్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరువూరు కౌన్సిలర్లు బుధవారం కలిశారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం గురించి వైఎస్ జగన్కు కౌన్సిలర్లు వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన తీరును పార్టీ నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందామన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందన్న వైఎస్ జగన్.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు. -
కీలక రాజకీయాంశాలపై వైఎస్ జగన్ ప్రెస్మీట్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కీలక రాజకీయ అంశాలపై ఆయన మీడియా ద్వారా ప్రజలకు సందేశం ఇస్తారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో పాటు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగినంత సమయం మైక్ ఇవ్వని పరిస్థితుల్లో తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానంటూ వైఎస్ జగన్(YS Jagan), కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తొలినాళ్లలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధికారంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను(Kutami Atrocities), ప్రతీకార రాజకీయాలను ఆయన ఎండగడుతూ వస్తున్నారు. అంతేకాదు.. గత వైఎస్సార్సీపీ హయాంలో కొనసాగిన సంక్షేమం ఆగిపోవడం, ఉద్దేశపూర్వకంగా అన్ని వర్గాల లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుండడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేయడం లాంటి.. తాజా అంశాలపైనా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: రేషన్ డెలివరీ వాహనాలపై కుట్రలెందుకు? -
Analyst Vijay babu: వాళ్లకు ఇచ్చిపడేశాడు హ్యాట్సాఫ్ నారాయణ..
-
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది: వైఎస్ జగన్
-
హామీలు నెరవేర్చలేకే రెడ్బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
మీ పాలనలో రైతులకు మేలు జరిగిందయ్యా!
సాక్షి, అమరావతి: ‘మీ పాలనలో రైతులందరికీ మేలు జరిగిందయ్యా. మీ హయాంలో రైతుల కష్టాలు తెలుసుకుని అన్నదాతకు అండగా నిలిచి.. మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎలాంటి సాయం అందకపోగా ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు. రైతులు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేయాల్సి వస్తోంది. అయినా పట్టించుకోవడం లేదయ్యా’ అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పొడగట్లపల్లికి చెందిన రైతు మెర్ల సత్యనారాయణ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట వాపోయారు.మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు మెర్ల సత్యనారాయణ మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినా తమ ప్రాంత రైతులు ఎకరాకు 55–60 బస్తాల ధాన్యం పండించారని ఆ రైతు వివరించారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులంతా నిరసనలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదని వాపోయారు.ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళ్లాల్లోనే ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి వైఎస్ జగన్ బదులిస్తూ.. అన్నదాతకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీతో రైతు సత్యనారాయణ సంతోషంతో తాను పండించిన వరి కంకులను ఆయనకు బహూకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రామచంద్రాపురం వైఎస్సార్సీపీ ఇన్చార్జి పిల్లి సూర్యప్రకాష్ కలిశారు. -
పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో మెజారిటీ లేకపోయినా పదవి కోసం దిగజారిపోతున్నారని మండిపడ్డారు. కోరం లేకుండా చేసి.. గెలిచినట్లు ప్రకటించుకున్నారని తప్పును ఎత్తి చూపారు. ఈ రోజు తిరువూరు.. నిన్న, మొన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో.. ఎక్కడైనా అదే రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఈ రోజు చేస్తున్న రాజకీయంలో కనీసం ఒక శాతం కూడా మనం చేయలేదు. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. నాడు స్థానిక ఎన్నికల్లో అన్నీ మనం గెలిచాం. కేవలం రెండు మున్సిపాలిటీల్లో ఓడిపోయాం. తాడిపత్రి మున్సిపాలిటీలో మనకు 16 మంది కౌన్సిలర్లు ఉంటే, టీడీపీకి 18 మంది ఉన్నారు. ఇద్దరిని లాగుదామని, మన ఎమ్మెల్యే అంటే, నేను వద్దన్నాను. ఎమ్మెల్యేను హౌజ్ అరెస్టు చేయించి, చైర్మన్ ఎన్నిక నిర్వహించాను. అదీ మనం చేసిన విలువలతో కూడిన రాజకీయం. ‘నాడు జగనన్నకు చెబుదాం’, ‘స్పందన’ అనే కార్యక్రమాల ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా, నేరుగా సీఎంఓ ఫాలోఅప్ చేసేది. అప్పుడు ఎక్కువ సమస్యలు టీడీపీ వారివే పరిష్కారమయ్యాయి’ అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటిస్తారా? ⇒ ఆ రోజు కులం, మతం, రాజకీయం చూడకుండా మనం పాలించాం. అదే ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అయినా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనం రాజకీయం చేస్తున్నాం. ⇒ తిరువూరులో 20 మంది కౌన్సిలర్లలో 17 మంది వైఎస్సార్సీపీ, మిగతా ముగ్గురు టీడీపీ. అయితే బలవంతంగా ఐదుగురిని లాగారు. అయినా ఆ ఎన్నికలో మనమే గెలవాలి. ఎందుకంటే మన బలం 12. టీడీపీకి కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి బలం లేకపోయినా, పదవి కోసం దారుణంగా వ్యవహరిస్తున్నారు. లేదంటే పోలీసుల సహాయంతో ఎన్నిక జరగకుండా చూస్తున్నారు. మన నాయకులను హౌజ్ అరెస్టు చేశారు. టీడీపీ వారందరినీ రోడ్ల మీదకు వదిలారు. ఈరోజు హైకోర్టులో హౌజ్ మోషన్ మూవ్ చేశాం. పోలీసు బందోబస్తు కోరాం. ⇒ నరసరావుపేటలో మొత్తం 17 గెలిచాం. కానీ వారిలో కొందరిని లాక్కున్నారు. దీంతో మనకు 13 మంది సభ్యులు ఉండగా, టీడీపీకి కేవలం ముగ్గురే ఉన్నారు. ఒకరు చనిపోయారు. కోరం లేకపోయినా గెలిచామని ప్రకటించుకున్నారు. ⇒ కారంపూడిలో మొత్తం 14 వైఎస్సార్సీపీ గెలిస్తే, ఆరుగురిని లాగారు. అయినా అక్కడ మన బలం ఎనిమిది కాగా, టీడీపీకి ఆరుగురు మాత్రమే ఉన్నారు. అయినా కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటించారు. చివరకు కుప్పం మున్సిపాలిటీ, రామకుప్పంలోనూ అదే పరిస్థితి. ⇒ రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో వైఎస్సార్సీపీ 9 గెలిస్తే, టీడీపీ 1 గెలిచింది. అయినా ఎంపీపీ ఎన్నికలో అక్రమాలు. ఒక పార్టీ మీద గెలిచినప్పుడు, వారిని లాక్కోవడం ఏమిటి? సీఎంగా ఉన్న వ్యక్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా పోలీసులను పెట్టి భయపెట్టడం ఏమిటి? మన పార్టీ నుంచి ముగ్గురిని లాక్కున్నారు. అయినా మనకు ఇంకా ఆరుగురు ఉన్నారు. మనదే మెజారిటీ. ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం. అయినా దౌర్జన్యం చేసి, కోరం లేదని చెప్పి, ఎన్నిక గెల్చే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో వైఎస్సార్సీపీ 14, టీడీపీ నాలుగు స్థానాల్లో నెగ్గింది. ఒకరిని లాక్కున్నారు. మిగతా వారు గట్టిగా నిలబడడంతో ఏం చేయలేక వదిలేశారు. ఇలా ప్రజాస్వామ్యం ఖూనీ అయిన పరిస్థితుల్లో మనం ఏకం అవుతున్నాం.వైఎస్సార్సీపీలో చేరిన విశాఖ టీడీపీ కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్సాక్షి, అమరావతి: విశాఖపట్నం 41వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మంగళవారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ వాసుపల్లి గణేశ్ పాల్గొన్నారు. -
హామీలు గాలికి.. కుట్రలు తెరపైకి..: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్, ఇతర హామీలు అమలు చేయకపోగా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని.. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రెడ్బుక్ కుట్రలతో విధ్వంసం సృష్టిస్తున్నారని, బరితెగించి యథేచ్ఛగా కేసుల మీద కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనం అయ్యాయన్నారు. అయితే ఈ అక్రమ కేసులు, అరెస్టుల పర్వానికి భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ శ్రేణులకు తేల్చి చెప్పారు. జైళ్లకు పంపినా సరే.. ‘చంద్రబాబూ.. నిన్ను ఎదుర్కొంటాం’ అని ధైర్యంగా, గట్టిగా నిలబడగలిగినప్పుడే రాష్ట్రంలో రాజకీయం చేయగలమని స్పష్టం చేశారు.ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం, శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ వన్ అని, వచ్చేది మన ప్రభుత్వమేనని, జగన్ 2.0లో కార్యకర్తలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత ⇒ ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నామో నా కంటే మీకే బాగా తెలుసు. మనం రాక్షస యుగంలో ఉన్నాం. కలియుగంలో అంటే చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలంటే.. కేసులు వేసినా భయపడకూడదు. జైళ్లకు పంపినా, చంద్రబాబూ.. నిన్ను ఎదుర్కొంటాం అని గట్టిగా అంటేనే రాజకీయాల్లో ఉండగలం. రాజకీయాలు చేయగలం. అదే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటున్న పాఠం. ఈరోజు రాజకీయాలు అలా తయారయ్యాయి. ⇒ మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏడాది తర్వాత కొంత వస్తుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు ఆయన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చాడు. జగన్ ఇచ్చినవన్నీ ఇవ్వడమే కాకుండా, ఇంకా మూడు ఎక్కువ ఇస్తానన్నాడు. కానీ, ఏదీ నిలబెట్టుకోలేదు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. అందుకే ఆయన ప్రభుత్వంపై అంత వ్యతిరేకత వచ్చింది.⇒ చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్తలు ఏ ఒక్క ఇంటికీ ధైర్యంగా పోలేరు. వారు ఏ ఇంటి తలుపు తట్టినా.. పిల్లవాడి స్థాయి నుంచి ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఇంటింటికి పోయి ఏం చెప్పారు? బాండ్లు అన్నాడు. ఇంకా ఏమేం చెప్పారు? ఇంటింటికీ వెళ్లి, చిన్న పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, అదే ఇంట్లో ఆ పిల్లల అమ్మ కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లోనే అమ్మమ్మలు కనబడితే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్ల యువకుడు కనబడితే నీకు రూ.36 వేలు అని, రైతు కనబడితే నీకు రూ.26 వేలు ఇస్తామని చెప్పారు. ఆ మాటలు ఇంకా వారిని వెంటాడుతాయి. మాట మీద నిలబడని రాజకీయ నాయకుడు సీఎం హోదాలో ఉన్నాడు. మాట ఇస్తే, దాన్ని అమలు చేయని వ్యక్తి సీఎంగా ఉన్నాడు.వ్యవస్థలన్నీ నిర్వీర్యం ⇒ రాష్రంలో విద్యా రంగం నిర్వీర్యం అయింది. ఇంగ్లిష్ మీడియం లేదు. గోరుముద్ద నామమాత్రం అయింది. నాడు–నేడు లేదు. పిల్లలకు ట్యాబ్లు లేవు. మనం అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇచ్చాం. ఇవాళ అది లేదు. నిరుపేదల ఆరోగ్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని వదిలేసింది. ఆ బిల్లులు దాదాపు రూ.3,600 కోట్లు ఇవ్వడం లేదు. ఆరోగ్య ఆసరా అమలులోనే లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక పోవడంతో వైద్యానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ⇒ ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. దళారులు వచ్చారు. ఆర్బీకే వ్యవస్థను నాశనం చేశారు. ఉచిత ఇన్సూ్యరెన్స్ లేదు. పంటనష్ట పరిహారం ఇవ్వడం లేదు.మనం బాగు చేస్తే.. బాబు చెడగొడుతున్నాడు ⇒ మనం 17 మెడికల్ కాలేజీలు కడితే, ఈరోజు వాటిని అమ్మేస్తున్నారు. ఏదైనా జిల్లాలో మెడికల్ కాలేజీ ఉంటే, అక్కడ అన్ని వైద్య సదుపాయాలు, ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నట్లు. దానివల్ల ఆ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు రోగులను మోసం చేయలేవు.⇒ మనం మూలపేట (శ్రీకాకుళం జిల్లా)తోపాటు మూడు పోర్టులు కట్టడం మొదలు పెట్టాం. వాటిలో 30 శాతం పనులు పూర్తి చేస్తే, కమీషన్ల కోసం చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నాడు.⇒ ఉత్తరాంధ్రలో ట్రైబల్ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజ్, ఐటీడీఏ పరిధిలో ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం మొదలు పెడితే, ఈ పెద్దమనిషి మొత్తం వదిలేశాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కోసం మనం భూసేకరణ చేశాం. 30 శాతం పనులు చేశాం. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ అభివృద్ధి అయినా జరిగింది అంటే కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే.⇒ చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. ఆయన ఎక్కడా మాట నిలబెట్టుకోలేదు. అలా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. అందుకే తనను ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పాలన సాగిస్తున్నాడు. అందులో భాగంగా రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. ఎవరు మాట్లాడినా, వారి గొంతు నొక్కుతున్నారు. నిలదీస్తున్న గొంతులను నలిపేస్తున్నారు.రాష్ట్రంలో తొలిసారిగా మాన్యుఫ్యాక్చర్ విట్నెస్ సృష్టిస్తుండటాన్ని చూస్తున్నాం. అంటే నేరంతో ఒక మనిషికి సంబంధం లేకపోయినా, వారికి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకుని అప్రూవర్ అంటున్నారు. ఆయనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. ఆ మనిషితో, ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు. ఈ మనిషిని అరెస్టు చేస్తున్నారు. అలా ఒక మాన్యుఫ్యాక్చర్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు. చరిత్రలో గతంలో ఏనాడూ ఇలాంటివి జరగలేదు. ఒక తప్పుడు సంప్రదాయానికి ఈ పెద్దమనిషి చంద్రబాబు ఈరోజు బీజం వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పాత కేసులు తిరగ తోడుతున్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థులు, చురుగ్గా పని చేస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులను ఇరికిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. - వైఎస్ జగన్మన ప్రభుత్వ హయాంలో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఇంటింటికీ వెళ్లగలిగాడు. మేనిఫెస్టో చూపి, జగన్ ఏం చేశాడో చూపి టిక్ పెట్టమని అడిగాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. మూడు సార్లు ప్రతి ఇంటికీ వెళ్లి, ఎన్నికల ముందు ఏమేం చేశామో చెప్పాం. వాటిని చూపాం. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేసిన పార్టీ దేశంలో ఎక్కడా లేదు. అయినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. కారణం కేవలం 10 శాతం మంది వారి మాటలు నమ్మి, మనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చున్నామంటే.. చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ప్రజలు ఫుట్బాల్ను తన్నినట్లు తంతారు. - వైఎస్ జగన్ఉధృతంగా పోరాడుదాం.. రాబోయేది మన ప్రభుత్వమే⇒ ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. మంగళగిరికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. అలాగే సుధారాణిని నెలల తరబడి శ్రీకాకుళం నుంచి అన్ని స్టేషన్లు తిప్పారు. బెయిల్ రాకుండా చూశారు. మాజీ ఎమ్మెల్యే వంశీపై 11 కేసులు పెట్టారు. ఒకదాంట్లో బెయిల్ వస్తే.. మరో కేసు.. రెండు నెలలుగా జైల్లోనే ఉంచారు. ఒక దాని తర్వాత మరో కేసు పెడుతున్నారు.⇒ ఇంకొకరు మాజీ ఎంపీ నందిగం సురేష్. దళితుడు. నెలల తరబడి జైల్లో పెట్టారు. బెయిల్ మీద బయటకు వస్తే, మరో కేసులో ఇరికించి, జైలుకు పంపారు. వాళ్ల ఇంటి దగ్గరకొచ్చి ఒక మనిషి తిట్టాడు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నిస్తే, మరో కేసు పెట్టి, జైలుకు పంపారు.⇒ ఈ రోజు ఒక తప్పుడు సంప్రదాయం మొదలు పెట్టారు. అది ఒక వృక్షమై, రెండింతలు పెరిగి, వాళ్లనే తన్నే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో గట్టిగా పోరాడుదాం. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇంకా చూస్తుండగానే మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. చీకటి తర్వాత వెలుగు తప్పదు. మనం తప్పకుండా గెలుస్తాం. అందుకే రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాడాలి. ఈలోగా గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్యమబాట పట్టి, ప్రభుత్వ తప్పులను ప్రజల్లో ఎండగట్టాలి. అందుకే ఈ సమావేశాల నిర్వహణ. ఈ ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలది చాలా గొప్ప పాత్ర.వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ వన్ ⇒ ప్రతి కార్యకర్తకు చెబుతున్నా. మీకు ఎవరు అన్యాయం చేసినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, వారి పేరు రాసుకోండి. అది ఏ బుక్ అయినా సరే. వారి పేరు మాత్రం కచ్చితంగా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం వచ్చాక, ఈరోజు మీకు అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం. ఆ మనిషి రిటైర్ అయినా, దేశం వదిలి పోయినా లాక్కొస్తాం. ఎవ్వరినీ వదిలి పెట్టం. సినిమా ఎలా చూపాలో వారికి చూపిస్తాం. మిమ్మల్ని ఎవరైనా కొట్టినా కొట్టించుకోండి. ఫరవాలేదు. నీ టైమ్ బాగుంది.. కొట్టు అనండి. ఆ తర్వాత మన టైమ్ వస్తుంది. అప్పుడు మనం కొడతాం. ఇవాళ వారు నాటుతున్న విత్తనం రేపు రెండింతలు అవుతుంది.⇒ ఈరోజు నేను మీ అన్నగా, మీ బిడ్డగా ఒకటే చెబుతున్నా. జగన్ 2.0లో పరిస్థితి ఇలా ఉండదు. పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ రోజు కార్యకర్తల కష్టాలు చూశాను. స్వయంగా చెబుతున్నాను. గతంలో మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్. దాంతో మనం యుద్ధం చేశాం. అందువల్ల అనుకున్న మేరకు కార్యకర్తలకు చేయలేకపోయాను. ఇప్పుడు చెబుతున్నాను. రేపు ఈ పరిస్థితి ఉండదు. వైఎస్సార్సీపీకి కార్యకర్తనే నంబర్ వన్. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం
-
మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..
-
YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan
-
LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం
-
రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం
-
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది: వైఎస్ జగన్
-
ప్రకాశం పంతులుకి వైఎస్ జగన్ నివాళి
-
టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: ‘స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 69వ వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సీస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, అలజంగి జోగారావు, తిప్పల నాగిరెడ్డి, మళ్ళ విజయ్ ప్రసాద్, వాసుపల్లి గణేష్, పలువురు సీనియర్ నాయకులు సైతం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు.#AndhraKesari pic.twitter.com/GjqEztDO5D— YS Jagan Mohan Reddy (@ysjagan) May 20, 2025 -
కల్తీసారా మరణాలని ఎల్లో మీడియా దుష్ప్రచారం
-
మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం: వైఎస్ జగన్
తాడేపల్లి: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి:’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.‘‘మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్ చేశాం. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16. టీడీపీ వాళ్లని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగాడు. కాని, మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్ చేయించాం. ప్రజాస్వామ్యంగా అక్కడ ఎన్నిక జరిగేలా చూశాం, కాబట్టే అక్కడ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా, చివరకు టీడీపీ వాళ్ల సమస్యలనూ తీర్చాం...జగనన్నకు చెబుదాం నంబర్కు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపాం. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించాం. ఇవాళ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నాడు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..👉స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు👉తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి పెట్టి, లాగేసుకునే ప్రయత్నంచేస్తోంది👉అయినా సరే మెజార్టీ వైయస్సార్సీపీ ఉండడంతే ఎన్నికను ఆపుతున్నారు:👉పోలీసులు వైయస్సార్సీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు, టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు👉సంఖ్యాబలం లేకపోయినా నర్సారావుపేట, కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారు👉కుప్పం మొదలుకుని ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే👉రాప్తాడులో రామగిరి ఉప ఎన్నికలో అరాచకాలకు అంతులేదు👉ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గుర్తుమీద, ఒక పార్టీ బి-ఫాం మీద గెలిచినప్పుడు, సంఖ్యాబలంలేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకూ సమంజసం👉పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు👉యలమంచిలిలో మన వాళ్లు గట్టిగా నిలబడి గెలుపును సాధించుకున్నారు👉ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేక రావాలంటే సమయం పడుతుంది👉కాని చంద్రబాబుగారి పరిపాలనలో నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది👉మనకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు👉జగన్ ఇచ్చేవన్నీ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు👉కాని వాటన్నింటినీ తుంగలో తొక్కాడు 👉కాని, మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త మనం అమలు చేసిన మేనిఫెస్టోతో ప్రతి ఇంటికీ వెళ్లాడు👉గడపగడపకూ కార్యక్రమం కింద మూడుసార్లు ప్రతి ఇంటికీ వెళ్లారు:👉99శాతం హామీలను అమలు చేసిన పార్టీ భారతదేశ చరిత్రలో వైయస్సార్సీపీ మాత్రమే👉మనం చేసిన మంచి ఎక్కడకూ పోదు👉10 శాతం ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారు👉ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ తన్నినట్టు ఈ ప్రభుత్వాన్ని తంతారు👉వైఎస్సార్సీపీ మాదిరిగా ప్రతి ఇంటికీ వెళ్లే ధైర్యం టీడీపీకి ఉందా?👉హామీల అమలుపై గట్టిగా నిలదీస్తారనే భయం వారికి ఉంది👉మాట ఇవ్వడం అంటే వెన్నుపోటు మాత్రమే అని చంద్రబాబుగారు నిరూపించారు👉పేదవాడి వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు👉ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు👉రూ.3600 కోట్లు పెండింగ్లో పెట్టారు👉ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు👉వైద్యంకోసం అప్పులు పాలు అయ్యే పరిస్థితి👉ఏ పంటకూ కనీస మద్దతు ధర రావడంలేదు👉ప్రభుత్వం రంగంలో వైయస్సార్సీపీ తీసుకొచ్చిన కాలేజీలను చంద్రబాబు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడు:👉కొత్తగా మూడు పోర్టులు నిర్మాణం ప్రారంభించాం👉శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లాం👉ఇప్పుడు ఆమూడు పోర్టులను కమీషన్లకోసం అమ్మేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు👉ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పథాన నడిపించాం👉ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు పెట్టాం👉బోగాపురం ఎయిర్పోర్టుకు గత చంద్రబాబు హయాంలో అనుమతులు లేవు, భూసేకరణ లేదు👉మనం అన్నీచేసి 30శాతం పనులు చేశాం👉రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి పనులు కేవలం వైయస్సార్సీపీ హయాంలోనే జరిగాయి👉ఈరోజు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి👉వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నాడు👉ప్రజలను వెన్నుపోటు పొడిచాడు👉ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకు వచ్చాడు👉రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు👉ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నాడు👉చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు👉తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు 👉గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు👉పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు👉ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను👉జగన్ 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది👉కోవిడ్ కారణంగా ఐదేళ్లపాలనలో అనుకున్నంతమేర సరిగ్గా చేయలేకపోయాం👉ఇవాళ మీ కష్టాలను చూస్తున్నాను 👉రేపు కచ్చితంగా వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ ఒన్👉అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి👉కొడతానంటే.. కొట్టమనండి👉కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి👉కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం👉రిటైర్డ్ అయిన వారినీ లాక్కుని వస్తాం👉దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం👉అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం👉మనకూ టైం వస్తుంది👉చంద్రబాబు నాటిని విత్తనాలు.. కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయి👉చంద్రబాబు దుర్మార్గపు పాలనవల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డవారి కథలు వింటే చాలా ఆవేదన కలుగుతోంది👉మహిళలను అని చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారు👉ఒక కేసులో బెయిల్ వస్తుంది, అది రాగానే మరో కేసు పెడుతున్నారు👉ఇలా కేసులు మీదు కేసులు పెడుతన్నారు👉వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారు👉దళితుడైన ఎంపీ నందిగం సురేష్ విషయంలోనే ఇలాగే దారుణాలు చేస్తున్నారు👉సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారు👉తనను, తన కుటుంబ సభ్యులను తిడితే, ఎందుకు తిట్టావన్నందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు👉చంద్రబాబు ఇవాళ నాటిన విత్తనం రేపు మహావృక్షం అవుతుందని మరిచిపోవద్దు👉రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా పోరాటాలు చేద్దాం👉వచ్చేది మన ప్రభుత్వమే👉మంచి రోజులు కచ్చితంగా వస్తాయి -
ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
-
నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లను ఆహ్వానించారు. వారితోపాటు ఆయా జిల్లాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. -
రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి : రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు.మంగళవారం (మే 20)న జరగనున్న ఈ సమావేశంలో రామచంద్రాపురం, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పోరేటర్లు పాల్గొననున్నారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు సహా అనేక అంశాలపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
ఎల్లో మీడియా శోకాలు పెడుతోంది. అరచి గీపెట్టి మరీ రోదిస్తోంది. దాని బాధల్లా ఒకటే.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నా సాక్షి మీడియా దాన్ని తక్కువగా చేసి రాసిందీ అని! జగన్ ప్రభుత్వంలో కంటే ఆదాయం ఇప్పుడు ఎక్కువే ఉంటే ఆ మాట నేరుగా చంద్రబాబే ఢంకా బజాయించి మరీ చెప్పుకునేవాడు. ఆయన ఆ పని చేయలేదు కానీ.. ఆయన తరఫున ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఆయనగారి పత్రికలో ఈ మధ్యే ‘సంపదపై శోకాలు’ అంటూ ‘జగన్ పత్రిక రోత రాతలు’ అన్న శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది.పచ్చి అబద్ధాలతో నిండిన ఇలాంటి కథనాలు నిత్యం వండి వారుస్తున్నందుకే.. వైసీపీ నేతలు.. సామాన్యులు చాలా మంది ఈ పత్రికను చంద్రజ్యోతిగాను, బూతు పత్రికగాను విమర్శిస్తుంటారు.రాధాకృష్ణ కాని, ఆయన సంపాదక బృందం కాని ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే అందరం ఆయన కథనాలు సరైనవేనని ఒప్పేసుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే... ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమి? ఆ తరువాత ఏడాది కాలంలో ఆయన చేసిందేమిటి? ‘‘అప్పులు చేయబోను’’, ‘‘సంపద సృష్టి నాకు తెలుసు’’, ‘‘సూపర్ సిక్స్తోపాటు ఎన్నికల హామీలన్నీ అమలు చేసి చూపిస్తా’’ అని ఎన్నికల ముందుకు ఒకటికి పదిసార్లు హామీ ఇచ్చిన ఆ పెద్దమనిషి అధికారంలోకి వచ్చిన తరువాత.. ‘‘గల్లా పెట్టె ఖాళీగా కనబడుస్తా ఉంది’’, ‘‘అప్పులు పుట్టడం లేదు’’ ‘‘సంపద సృష్టించే మార్గముంటే చెవిలో చెప్పండి’’. ‘‘అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేయలేను’’ అని ప్లేటు ఫిరాయించిన విషయం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలే. రాధాకృష్ణ భాషలో వీటిని శోకాలు అంటారా? లేదా? ఆయన రాసినట్లే చంద్రబాబు హయాంలో ఆదాయం ఎక్కువ ఉందని కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు చంద్రబాబు ఖజానా ఖాళీగా కనబడుతోంది అని ఎందుకు అన్నట్టు? పైగా.. అప్పుల కోసం ఏకంగా ఖజానానే తనఖా పెట్టి చరిత్ర సృష్టించడం ఎందుకు? అప్పులు పుట్టడం లేదన్న బాబు మాట కూడా నిజమే అయితే ఏడాది కాలంలో రూ.1.5 లక్షల కోట్ల రుణం చేసిన రికార్డు మాటేమిటి? జగన్ హయాంలో ఆదాయం తక్కువగా ఉందనుకున్నా.. సంక్షేమ పథకాలన్నీ ఐదేళ్లూ చక్కగా అమలు చేశారు కదా? దానికి సమాధానం ఏమిటి? ఓడరేవులు, మెడికల్ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, పాఠశాలల్లో ‘నాడు-నేడు’’ ఇలా బోలెడంత అభివృద్ధినికి ప్రజల కళ్లముందే నిలిపారు కదా? అయినా సరే.. జగన్ ఎప్పుడు బీద అరుపులు అరవలేదే? ఒకపక్క చంద్రబాబేమో ఖజానా ఖాళీ అంటారు.. ఇంకోపక్క రాధాకృష్ణ ఆదాయం భేష్ అంటారు. ఏది నిజం? ఈ ప్రశ్నకు సమాధానం కాగ్ లెక్కల్లో వెతుకుదాం.. జగన్ పాలన చివరి ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడులు మొత్తం సుమారు రూ.1.74 లక్షల కోట్లు. ఆ తరువాత చంద్రబాబు (Chandrababu) పాలనలో తొలి ఏడాది (2024-2025) రూ.1.68 లక్షల కోట్లు! అయితే... ఆంధ్రజ్యోతి 2014-15కు సంబంధించిన రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం 2023-24లో ఇవ్వడం వల్ల జగన్ హయాంలోని ఆదాయం ఎక్కువగా కనిపిస్తోందని అంటోంది. ఇదే నిజం అనుకుందాం. అప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా రాబట్టడంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించినట్లే అవుతుంది కదా? ఐదేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా పది వేల కోట్ల రూపాయల మొత్తం కూడా కేంద్రం నుంచి రాబట్టుకోలేని అసహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నట్లు రాధాకృష్ణ ఒప్పుకున్నట్లేనా? జగన్ ప్రభుత్వం 12వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాబట్టుకుందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. ఇది కూడా జగన్ గొప్పదనమే అవుతుంది కదా! ఈ స్థాయిలో కేంద్రం నుంచి చంద్రబాబు నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఈ రెండింటినీ మినహాయిస్తే జగన్ హయాం చివరి ఏడాది వచ్చిన రాబడి రూ.1.61 లక్షల కోట్లేనని, చంద్రబాబు తన తొలి ఏడాదిలో ఆదాయం రూ.1.68 లక్షల కోట్లు అని ఈ పత్రిక తెలిపింది.అలాంటప్పుడు చంద్రబాబు పదే, పదే ఎందుకు డబ్బులు లేవని వాపోతున్నారు? రూ.1.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేశారు? జగన్ టైమ్ నాటికన్నా పదివేల కోట్లు ఎక్కువగా పన్ను ఆదాయం చంద్రబాబు ప్రభుత్వం పొందిందని ఎల్లో మీడియా చెబుతోంది. ఇదే నిజమైతే బాబు బీద అరుపుల మతలబు ఏమిటి? జీఎస్టీ వసూళ్లు రూ.2850 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.3900 కోట్లు, కేంద్ర పన్నుల వాట రూ.ఐదు వేల కోట్ల మేర ఎక్కువ వచ్చిందని ఈ పత్రిక రాసింది. ఇంత భారీ ఎత్తున ఆదాయం వచ్చినా ఎందుకు ఒక్క స్కీమ్ అమలు చేయడం లేదు?జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.9542 కోట్లు వచ్చినట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనలో తొలి ఏడాది ఈ మొత్తం రూ.8837 కోట్లే! దీని అర్థం బాబు హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గినట్లే కదా? అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం మొదలైన వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. జగన్ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ, ద్రవ్య లోటులు రెండూ సుమారు రూ.20 వేల కోట్లు ఎక్కువన్నది కూడా వాస్తవమే కదా? రాధాకృష్ణ ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నించి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉంది. ఆయన రాసింది వాస్తవమైతే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నట్లు అవుతుంది. పైగా ఆదాయం బాగున్నా.. రూ.1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఖజానా ఖాళీ అన్న చంద్రబాబు మాటలు నిజమైతే ఈ జాకీ పత్రిక రాసింది అవాస్తవమని అంగీకరించవలసి ఉంటుంది. ఏతావాతా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకాలకు చంద్రబాబు సర్కారే బద్నాం అయ్యింది. కూటమి ప్రభుత్వానికి భజన చేద్దామని అనుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాసి చంద్రబాబునే డిఫెన్స్ లో నెట్టేసినట్లయింది. ఆ విషయం అర్థమైందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
విత్తు.. సర్కారు ప్రణాళిక చిత్తు
గతంలో ఈపాటికే విత్తనాలిచ్చారునాకు నాలుగెకరాలు సొంత భూమి ఉంది. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వేరుశనగ సాగు చేస్తున్నా. గతంలో ఈ పాటికే విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు. విత్తనాలు పంపిణీ కూడా పూర్తయ్యేది. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. విత్తనాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పే నాథుడు లేడు. బయట మార్కెట్లో కొందామంటే ధరలు మండిపోతున్నాయి. పైగా నాణ్యమైనవి దొరుకుతాయో లేదో తెలియడం లేదు. – బోయ ఓబులేసు, ఉదిరిపికొండ, కూడేరు మండలం, అనంతపురం జిల్లా⇒ ఇతని పేరు బొంతల హరీష్. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లె గ్రామం. సొంతంగా మూడెకరాలు, కౌలుకు రెండెకరాలు.. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నాడు. 15 ఏళ్లుగా వేరుశనగ పంట వేస్తున్నాడు. ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనం కావాలి. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.12 వేలకు పైగానే ఉంది. ఐదెకరాలకు రూ.60 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితి ఇతనికి లేదు. గత ఖరీఫ్లో మే మొదటి వారంలోనే విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇచ్చారు. గతేడాది ఈపాటికే విత్తుకోవడం పూర్తయింది.పంట ఏపుగా ఎదిగినా కోతకొచ్చే సమయానికి వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఐదెకరాలకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. రూ.60 వేలకుపైగా నష్టపోయాడు. రబీలో పంట వేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వర్షాలు పడుతుండడంతో అదును దాటిపోకుండా విత్తుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లినా రిజి్రస్టేషన్ చేసుకోవడం లేదని, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరి పరిస్థితి ఈ విధంగానే ఉంది.సాక్షి, అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. అదును సమయంలో వారికి పెట్టుబడి సాయం అందించకపోగా, సబ్సిడీ విత్తనాలు సైతం ఇవ్వకుండా కష్టాలపాలు చేస్తోంది. మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్నా, విత్తన సరఫరా మొదలు కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీకి గతేడాది మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది సబ్సిడీ విత్తన పంపిణీలోనూ రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాదాపు ఆరు రకాల సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపి వేయడమే కాకుండా, మిగిలిన సబ్సిడీ విత్తనాల పంపిణీలోనూ అడ్డగోలుగా కోత పెట్టింది. గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ విత్తన సరఫరా చేయలేమని ఓ వైపు కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది సబ్సిడీ విత్తనాలు రైతులకు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తప్పు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఏటా వ్యవసాయ సీజన్కు ముందే తొలి విడత పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఎవరికి ఏ మేరకు విత్తనం కావాలో ముందుగానే ఆర్డర్ తీసుకుని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పెట్టుబడి సాయం రూ.13,500 కాకుండా ఏకంగా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం తమను మభ్యపెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సబ్సిడీ విత్తనం లేదు.. పెట్టుబడి సాయమూ లేదని ఊరూరా అన్నదాతలు బావురుమంటున్నారు. ఇంకా ఖరారు కాని సబ్సిడీలు ⇒ ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 40% సబ్సిడీపై వేరుశనగ, 30% సబ్సిడీపై పెసర, మినుము, కంది, 50% సబ్సిడీపై కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి చిరుధాన్యపు విత్తనాలను సరఫరా చేస్తుంటారు. ⇒ వరి విత్తనాలను మాత్రం జాతీయ ఆహార ధాన్యాల భద్రతా పథకం అమలయ్యే జిల్లాల్లో కిలోకి రూ.10, ఇతర జిల్లాల్లో రూ.5 చొప్పున రాయితీతో సరఫరా చేస్తారు. ఏజెన్సీ జిల్లాలో మాత్రం 90% సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్ధేశించిన సాగు లక్ష్యాలకనుగుణంగా జిల్లాల వారీగా ఇండెంట్ సేకరిస్తారు. ⇒ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ఉత్పత్తి అయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన విత్తనాల కోసం టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఇలా సేకరించిన విత్తనాలను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లలో సర్టీఫై చేసి, సీజన్కు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రైతులకు అందుబాటులో ఉంచేవారు. సాధారణంగా ఏటా ఏప్రిల్లో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ పూర్తి చేసేవారు. ⇒ షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేసేవారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క ఏడాది ఒక్కరంటే ఒక్క రైతు కూడా తమకు విత్తనం సకాలంలో అందలేదన్న మాట విని్పంచకుండా సరఫరా చేశారు. ఈ ఏడాది అదును ముంచుకొస్తున్నప్పటికీ విత్తన పంపిణీ షెడ్యూల్ కాదు కదా.. కనీసం సబ్సిడీలను కూడా ఖరారు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు. సబ్సిడీ విత్తనంలో అడ్డగోలుగా కోత ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తుగా చేసిన ఏర్పాట్ల ఫలితంగా 2024–25 ఖరీఫ్లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు అందుబాటులో ఉండింది. వరి 2.29 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 3.16 లక్షల క్వింటాళ్లు, 94 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 15 వేల క్వింటాళ్ల అపరాల విత్తనాలను సీజన్కు ముందుగానే సర్టీఫై చేసి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచగలిగారు. ⇒ ప్రస్తుత ఖరీఫ్–2025 సీజన్ కోసం జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం తొలుత 6,31,952 క్వింటాళ్ల విత్తనం అవసరమని ఏపీ సీడ్స్ అంచనా వేసింది. ప్రధానంగా 2.37 లక్షల క్వింటాళ్ల వరి, 2.95 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 12 వేల క్వింటాళ్ల కందులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సబ్సిడీ విత్తనాన్ని కుదించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కేవలం 5.18 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. ⇒ ఇందులో 2.15 క్వింటాళ్ల విత్తనం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా, మిగిలిన విత్తనాన్ని టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. చివరికి 4.65 లక్షల క్వింటాళ్లకు మించి అమ్మకాలు ఉండవన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా గతంలో దాదాపు 16 రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేవారు. అలాంటిది ఈ ఏడాది 10 రకాలకే పరిమితం చేశారు. ఈ లెక్కన 3 లక్షల క్వింటాళ్లకు మించి విత్తనాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.⇒ పిల్లిపెసర సహా సామెలు, ఊదలు, అలసందలు, రాజ్మా, ఉలవల సరఫరా నిలిపివేశారు. మిగిలిన వాటికి కూడా అడ్డగోలుగా కోత వేశారు. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగ పంట కోసం గతంలో ఏటా దాదాపు 3.80 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనం అందుబాటులో ఉంచేవారు. అలాంటిది ఈ ఏడాది తొలుత 2.95 లక్షల క్వింటాళ్లు అవసరమని అంచనా వేయగా, ఆ తర్వాత ప్రభుత్వాదేశాలతో 1.95 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేయడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం ⇒ గతంలో ఏటా క్రమం తప్పకుండా సీజన్కు ముందుగానే టెండర్ల ద్వారా విత్తనాలకు అవసరమైన మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించడమే కాకుండా ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలకు విడుదల చేసేవారు. దీంతో గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏనాడు విత్తన సరఫరాలో ఎలాంటి ఆటంకం ఏర్పడ లేదు. 2024–25 ఖరీఫ్ సీజన్లో 6.63 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయగా, అందుకు సంబంధించిన సబ్సిడీ రూ.328.75 కోట్లు ప్రభుత్వం కంపెనీలకు చెల్లించలేదు.⇒ ఖరీఫ్ సీజన్కు సంబంధించి రూ.213.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలుగా ఈ మేరకు పలుమార్లు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలు.. వేరుశనగ, వరి, శనగ, ఉలవలు, రాజ్మా తదితర విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన 12 కంపెనీలు గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ ఈ ఏడాది విత్తన సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో యంత్రాంగం ఉంది.⇒ అతికష్టమ్మీద ఒత్తిడి తీసుకురాగా జీలుగు.. జనుము (పచ్చిరొట్ట) విత్తనాలు కేవలం 23 వేల క్వింటాళ్లు (25%) జిల్లాలకు సరఫరా చేయగలిగారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఈ పాటికే ప్రారంభం కావాల్సిన వేరుశనగ విత్తనం పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. మిగిలిన విత్తనాల పంపిణీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ⇒ ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ చేతకాని తనం వల్ల నకిలీ విత్తనాలు రాజ్యమేలాయి. ఖరీఫ్లో ఎక్కువగా సాగయ్యే మిరప, పత్తి విత్తనాల్లో నకిలీలకు చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 40 కంపెనీలతో ఒప్పందం చేసుకుని, కల్తీలకు ఆస్కారం లేని రీతిలో రైతులు కోరుకున్న కంపెనీలకు చెందిన నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. గత సీజన్ నుంచి నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది.విత్తనోత్పత్తికీ రాంరాం ⇒ సాధారణంగా సాగు విస్తీర్ణంలో 30 శాతం విస్తీర్ణానికి అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఆ మేరకు అవసరమైన విత్తనం కోసం రబీ సీజన్లో జిల్లాల వారీగా గుర్తించిన రైతులకు విత్తనోత్పత్తి పథకం కింద 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని ఇచ్చి విత్తన సాగును ప్రోత్సహిస్తారు. మరొకవైపు ఏపీ సీడ్స్లో వాటాదారులుగా ఉన్న రైతులకు బ్రీడర్స్, ఫౌండేషన్ సీడ్స్ ఇచ్చి వారి ద్వారా విత్తనోత్పత్తి చేసి, ఆ విత్తనాన్ని ఖరీఫ్ సీజన్లో రైతుల డిమాండ్ మేరకు సేకరిస్తారు. ⇒ సాధారణంగా ఏపీ సీడ్స్ సరఫరా చేసే విత్తనంలో 50 శాతం ఈ విధంగా సేకరిస్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే విత్తనం ఉత్పత్తి చేస్తారో ఆ రైతుల నుంచే ఈ–క్రాప్ ప్రామాణికంగా సేకరించేవారు. నిర్ధేశిత గడువులోగా వారికి బహిరంగ మార్కెట్ ధర కంటే 20–30 శాతం అదనంగా చెల్లించేవారు. ఈ వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో సైతం ప్రదర్శించేవారు. ⇒ దీంతో విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా ఏపీ సీడ్స్కు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గడిచిన ఖరీఫ్లో విత్తనోత్పత్తి చేసే రైతుల నుంచి సేకరించిన విత్తనాలకు సంబంధించిన బకాయిలు దాదాపు 9 నెలలు గడిచినా చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రైతులెవ్వరూ తమ విత్తనాన్ని ఏపీ సీడ్స్కు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. బహిరంగ మార్కెట్ ధరలకే అమ్ముకుంటున్నారు. దీంతో ఏపీ సీడ్స్ పూర్తిగా టెండర్ల ద్వారానే విత్తనం సేకరించాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే పెదవి విరుపు⇒ విత్తన పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అధికార పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాసిన లేఖే నిదర్శనం. ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 3 లక్షల క్వింటాళ్ల విత్తనం అందించారని ఆమె గుర్తు చేశారు. అలాంటిది ఖరీఫ్–2025 సీజన్కు కనీసం 2 లక్షల క్వింటాళ్ల విత్తనం తక్కువ కాకుండా కేటాయించాల్సి ఉండగా, కేవలం 1.10 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టడం దారుణం అన్నారు. వ్యవసాయ శాఖ కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే కేటాయించడం విస్మయానికి గురి చేస్తోందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? సబ్సిడీపై వేరుశనక్కాయల విత్తనాల గురించి సచివాలయానికి వెళ్లి అడిగితే తమకు ఆదేశాలు రాలేదంటున్నారు. పదెకరాల్లో సేద్యం చేసుకున్నా.. వర్షాలు పడుతున్నాయి.. త్వరలో విత్తుకోవాల్సి ఉందని చెప్పినా వినిపించుకునే వారే లేరు. మాది రైతు ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం అంటున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? రైతు సేవా కేంద్రాల్లో మా పేర్లు కూడా నమోదు చేసుకోకపోవడం దారుణం. దీంతో విత్తనాలు అధిక ధరకు బయట కొనుక్కోవాల్సి వస్తోంది. – మునిరెడ్డి, బొందిమడుగుల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా అన్ని విధాలుగా మోసం చేల్లో దుక్కి దున్నాం. ఇంత వరకు శనగ విత్తనాలు రాలేదు. సచివాలయంలో అడిగితే మాకు పై నుంచి ఆర్డర్స్ రాలేదంటున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈపాటికే శనక్కాయల విత్తనాలు ఇచ్చేది. కానీ ఈ ఏడాది ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. అదును దాటిపోతుంది. ఇంకెప్పుడు విత్తుకోవాలి? పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. రైతులను అన్ని విధాలుగా ముంచేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 90 శాతం సబ్సిడీపై శనక్కాయల విత్తనం ఇవ్వాలి. – రమణారెడ్డి, పొడరాగపల్లి, ముదిగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా కౌలురైతులకు నూరు శాతం సబ్సిడీతో సర్టీఫైడ్ విత్తనాలివ్వాలిఏపీ కౌలురైతుల సంఘం డిమాండ్ సాక్షి, అమరావతి: కౌలురైతులకు నాణ్యమైన, సర్టీఫై చేసిన విత్తనాలను నూరు శాతం సబ్సిడీపై అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘం ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రైవేట్ మార్కెట్లో విత్తనాల ధరలు విపరీతంగా పెంచేశారని, పైగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాల్లో నాణ్యత ఉండటం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది సీజన్కు ముందు విత్తనాలను సిద్ధం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
సాక్షి, అమరావతి: తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ.దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండాపోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.పోలీస్స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు... ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి : భారత్ మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈరోజు (మే18 వ తేదీ) హెచ్డీ దేవెగౌడ 92వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. దేవెగౌడ నాయకత్వం భవిష్యత్తు తరాలకు, దేశ సేవకు స్పూర్తిదాయకంగా నిలవాలన్నారు వైఎస్ జగన్. On the occasion of the 92nd birthday of Shri @H_D_Devegowda Ji, former Prime Minister of India ,I extend my heartfelt wishes to him for a healthy and joyful year ahead. May his wisdom and leadership continue to guide us in the service of our Nation.— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
పాతబస్తీ అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: పాతబస్తీ అగ్నిప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన అత్యంత బాధాకారం. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.Shocked to hear about the fire incident at Gulzar House, Hyderabad. My heart felt condolences to the bereaved families who have lost their loved ones. Praying for healing and speedy recovery of those injured in this unfortunate incident.#GulzarHouse#Hyderabad— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025చార్మినార్ గుల్జార్హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 6.15గంటలకు షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎనిమిది మంది చిన్నారులతో సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు వేసవి సెలవుల కోసం ఇక్కడికి వచ్చినట్లు సమాచారంమరోవైపు, ప్రమాదంపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాల్ని వివరించారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఎంట్రన్స్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఇటీవల ఇంటిని చెక్క ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. షార్ట్సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలకు చెక్క మొత్తం కాలి మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని నాగిరెడ్డి తెలిపారు. -
రాసుకో చంద్రబాబు.. ఒకే ఒక్కడు వైఎస్ జగన్
-
దటీజ్ ది ‘పవర్’ ఆఫ్ జగన్
సాక్షి, అమరావతి: సమర్థుడైన నాయకుడి పాలనలో వ్యవస్థలు ఎంతగా అభివృద్ధి చెందుతాయన్నది చెప్పడానికి ఇదొక నిదర్శనం. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు, తీసుకువచ్చిన వినూత్న విధానాల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కం) నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి.ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపింది. కానీ, గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో మొత్తం రూ.4,434.51 కోట్ల నిర్వహణ ఖర్చులు ఆదా అయ్యేలా చేసింది. ఈ మేరకు డిస్కంలు దాఖలు చేసిన ట్రూ డౌన్ పిటిషన్ల వివరాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తన వెబ్సైట్ ద్వారా వెల్లడించింది.డిస్కంల మిగులు ఇలా.. 2019–20 నుంచి 2023–24 వరకూ ఏపీఈపీడీసీఎల్ నిర్వహణా వ్యయాల ఆదా రూ.1,974.75 కోట్లు ఏపీసీపీడీసీఎల్ 2020–21 నుంచి 2023–24 వరకూ వ్యయ ఆదా రూ.1,400 కోట్లు. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లు. ఇందులో కొంత మొత్తాలను 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు సర్దుబాటు చేసుకున్నాయి. అంటే వాటి రెవెన్యూ గ్యాప్ను భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. ఈ విధంగా ఏపీఈపీడీసీఎల్ రూ.1,800 కోట్లు కలపగా, మిగిలిన రూ.174.75 కోట్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా ఏపీసీపీడీసీఎల్లో రూ.478.91 కోట్లు ఇప్పటికే 2024–25 ఏఆర్ఆర్లో కలిపారు. ఇంకా రూ.921.09 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం రూ.1,095.84 కోట్లు ప్రజలకు తిరిగి ఇచ్చేయాలా... లేక మరో ఏఆర్ఆర్లో సర్దుబాటు చేయాలా.. అనేది ఏపీఈఆర్సీ నిర్ణయిస్తుంది.ట్రాన్స్కో ఆదా ఇది.. 2019–20 నుంచి 2023–24 మధ్య ఏపీ ట్రాన్స్కో విద్యుత్ లైన్లను వినియోగించుకోవడంలోనూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) రూ.1,059.76 కోట్లు మిగిల్చాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ ప్రసార వ్యవస్థ వినియోగానికి ఏపీఈఆర్సీ అనుమతించిన టారిఫ్ కంటే తక్కువగా డిస్కంలు వినియోగించాయి. ఇది ఏపీఈపీడీసీఎల్లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్లో రూ. 247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్ఆర్లో సర్దుబాటు చేశారు. ఈ లెక్కన గత ప్రభుత్వ చర్యల కారణంగా కూటమి ప్రభుత్వంపై రూ.4,434.51 కోట్ల భారం తగ్గింది.దక్షిణ డిస్కంలో భిన్నం.. కానీ.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) మాత్రం రూ.3,346 కోట్ల ట్రూ అప్ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీని అనుమతి కోరింది. ఇందులోనూ 2024–25 ఏఆర్ఆర్లో రూ.2వేల కోట్లు సర్దుబాటు చేసేశారు. అంటే అప్పటికి డిస్కంకు ఆ మేరకు లాభం చేకూరినట్టే. ఇక మిగిలింది రూ.1,346 కోట్లు. డిస్కం దాఖలు చేసిన వడ్డీలను ఏపీఈఆర్సీ యథాతథంగా ఆమోదించదు. అందువల్ల ఈ ట్రూ అప్ కూడా తగ్గే అవకాశం ఉందని ఏపీఈఆర్సీ వెల్లడించింది. -
బాబుకు ఈనాడు నిత్య సన్మానం పాత్రికేయానికి తీరని అవమానం
సాక్షి, అమరావతి: ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండన్న చందంగా తయారైంది ఎల్లో మీడియా. ప్రజలు ఏమనుకుంటారన్న సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు కోసం ఎంతగా బరితెగించడానికైనా సై అంటోంది. వలువలూడదీసుకుని పచ్చి అబద్ధాలను అచ్చేస్తోంది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ను 30 ఏళ్ల పాటు హక్కుగా అందించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ–సెకీ)తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విషం చిమ్ముతూనే ఉంది. ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వరకు అన్ని విధాలుగా ఆమోదం లభించింది. అయినా గత ప్రభుత్వంపై బుదర జల్లాలి.. జగన్పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం గక్కాలి.. అనే అజెండాతో అర్థం లేని ఆరోపణలు చేస్తూ టీడీపీ కరపత్రం ఈనాడు, ఎల్లో మీడియా అసత్య కథనాలను వండివారుస్తూనే ఉంది. తాజాగా సెకీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను కేంద్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించడాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో ముడిపెట్టి ఈనాడు పచ్చి అబద్ధాలతో శనివారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది.ఎప్పుడో 2021లో జరిగిన ఒప్పందానికి 2023లో సీఎండీగా చేరిన అధికారికి సంబంధం ఏమిటనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దిగజారుడు రాతలతో తన నైజాన్ని చాటుకుంది. ‘సెకీ’తో ఒప్పందం కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆరి్ధక భారం పడుతుందని, అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎఎస్టీఎస్)ల నుంచి మినహాయింపు లభించదని ఇప్పటికే అనేక సార్లు అసత్య కథనాలను రాసి భంగపడ్డ టీడీపీ కరపత్రం ఇప్పుడు అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చాలని చూస్తోంది. యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్ను అందించే సెకీ ఒప్పందంపై ఇంతగా విషం చిమ్ముతున్న ఈనాడు.. అంతకు దాదాపు రెట్టింపు ధర యూనిట్ రూ.4.60తో చంద్రబాబు ప్రభుత్వం యాక్సిస్ అనే ప్రైవేటు సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే మాత్రం కళ్లున్న గుడ్డి వాడిలా నటిస్తోంది. ముడుపులకు ఆస్కారం ఎక్కడ? ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత చూసి, యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్ను అందిస్తామంటూ 2021 సెపె్టంబర్ 15న సెకీ లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాల (కమర్షియల్ ఆపరేషన్ డేట్)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచి్చందని ఆ లేఖలో సెకీ స్పష్టంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాంటి చార్జీలు వర్తించవని లేఖలో వివరంగా చెప్పింది. రెండు నెలల సుదీర్ఘ చర్చలు, సమగ్ర అధ్యయనం తర్వాత సెకీతో గత ప్రభుత్వం, డిస్కంలు మధ్య త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. రాష్ట్ర మంత్రి మండలితో పాటు ఏపీఈఆర్సీ ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే ఈ ఒప్పందం జరిగింది. ⇒ సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. ఈ ధర అప్పటికి ఎనీ్టపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ప్రస్తుతం చంద్రబాబు కుదుర్చుకున్న రూ.4.60 కన్నా రూ.2.11 తక్కువ. ⇒ ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్కు సగటున రూ.5.10 ఖర్చు అవుతోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్లు సెకీ విద్యుత్ వల్ల ఆదా అవుతుంది. కానీ ఈ ఒప్పందంలో ముడుపుల వ్యవహారం వల్లే సెకీ సీఎండీని కేంద్రం తప్పించిందంటూ ఈనాడు వక్ర భాష్యం చెప్పింది. ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేటు సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా..? ఇంత చిన్న లాజిక్ కూడా ఈనాడుకు తెలియదా? ⇒ అదీకాక 2021లో ఒప్పందం జరిగినప్పుడు గుప్తా సెకీ సీఎండీనే కాదు. ఆయన ఆ పదవి చేపట్టిందే 2023 జూన్లో. ఈనెల 10న ఆయ న్ను పదవి నుంచి తొలగించారు. అంటే సెకీ ఒప్పందం జరిగినప్పుడు ఆయన పదవిలోనే లేరు. అలాంటిది ఆ ఒప్పందంతో ఆయనకు ఎలా ముడిపెడతారనే కనీస జ్ఞానం కూడా టీడీపీ కరపత్రానికి లేకుండా పోయిందని విద్యుత్ రంగ నిపుణులు విస్తుపోతున్నారు. బురదజల్లడమే పని⇒ ఈ ఒప్పందంలో రైతుల పట్ల జగన్కు నిబద్ధత తప్ప స్వప్రయోజనం అనేది మచ్చుకైనా కనిపించదు. అయితే ఈ ఒప్పందంలో ఏ మాత్రం ప్రమేయం లేని అదానీ నుంచి లంచాలందాయంటూ గత ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దానికి జగన్కు ముడిపెట్టి అత్యుత్సాహంతో విష ప్రచారం చేస్తూ.. పుంఖానుపుంఖాలుగా అసత్యాలు వండి వార్చింది టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు. ⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని భయపడుతున్న ఈనాడు.. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్దాన్ని ప్రచారం చేస్తోంది. దానికి అనుబంధంగానే సెకీ చైర్మన్ తొలగింపునూ ఈ ఒప్పందానికి ముడి పెడుతూ కుట్రలు పన్నుతోంది. దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా చిత్రీకరిస్తోంది. ⇒ గతేడాది నవంబర్లో గౌతమ్ అదానీ, ఇతర కార్యనిర్వాహకులపై లంచం తీసుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగం మోపినప్పుడు, వాటికి ఎలాంటి ఆధారాలు లేనందున సెకీ ఆ ఆరోపణలపై ఎలాంటి విచారణ చేపట్టదని గుప్తా ప్రకటించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఖండించారు. గతేడాది నవంబర్ 6న, నకిలీ పత్రాలను సమరి్పంచారనే ఆరోపణలతో రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యు బిఇఎస్ఎస్ను మూడు సంవత్సరాల పాటు టెండర్లలో పాల్గొనకుండా సెకీ నిషేధించింది. ⇒ కానీ ఢిల్లీ హైకోర్టు ఆదేశం తర్వాత ఆ నిషేధాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది మేలో, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యు సన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్తో 25 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (సీపీఏ)పై సెకీ సంతకం చేసింది. దీనికి తప్పుడు ధృవపత్రాలను సృష్టించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతోనే కేంద్రం నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న గుప్తాను ఉన్నపళంగా తొలగించిందంటూ జాతీయ మీడియా ఇప్పటికే అనేక కథనాల్లో వెల్లడించింది. ఈ వాస్తవాన్ని ఈనాడు నిస్సిగ్గుగా దాస్తోంది. అది జర్నలిజమా? లేక బ్రోకరిజమా? ఈనాడుపై వైఎస్సార్సీపీ మండిపాటు‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈనాడు పత్రిక చేస్తున్న అసత్యాలను ఖండిస్తూ ‘ఎక్స్’లో ఆ పార్టీ ఈ మేరకు పోస్టు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2021 డిసెంబర్లో జరిగిందని, 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తాను నియమించారని తెలిపింది. అలాంటప్పుడు ఏపీ–సెకీ ఒప్పందానికి ఏం సంబంధం ఉంటుందని ఆ పార్టీ ప్రశ్నించింది.‘సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాక ముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణల నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా ఐదారు రోజుల క్రితమే జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ నిస్సిగ్గుగా ఎల్లో పత్రిక ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. ఈనాడుకు ధైర్యం ఉంటే సెకీతో ఒప్పందాన్ని రద్దు చేయమని మీ గ్యాంగ్ లీడర్ చంద్రబాబుకు చెప్పు. ఈనాడులో రూ.1.90కే యూనిట్ సౌర విద్యుత్ వస్తుందని రాశారు. మరలాంటప్పుడు మొన్న యాక్సిస్తో రూ.4.60కి కొనుగోలు చేస్తూ ఎందుకు ఒప్పందం చేసుకున్నావని దమ్ముంటే చంద్రబాబును ప్రశ్నించు. లేదా తప్పుడు రాతలు రాసినందుకు ప్రజల్ని క్షమాపణలు కోరాలి’ అంటూ ఈనాడు రాసిన ఫేక్ న్యూస్ కథనాన్ని జత చేసి, శనివారం ఎక్స్ పోస్ట్లో వైఎస్సార్సీపీ నిలదీసింది. -
మరోసారి బయటపడ్డ ఈనాడు పచ్చి అబద్ధాలు
-
మాట నిలబెట్టుకున్న జగన్.. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల చెక్
-
వైఎస్ జగన్ @గన్నవరం ఎయిర్ పోర్ట్
-
YSR జిల్లాలో ఐదుగురు చిన్నారుల మృతిపై జగన్ దిగ్భ్రాంతి
-
చెరువులో మునిగి ఐదుగురు పిల్లలు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లాలో ఈతకు వెళ్ళి ఐదుగురు చిన్నారులు మృతిచెందడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వాన్ని కోరారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్ ఇంటికి అతడి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి వచ్చారు. వేసవి సెలవులు కావటంతో ఈత కొట్టాలని భావించి ఐదుగురు పిల్లలు చెరువులోకి దిగారు. ఈ క్రమంలో చెరువులో ఈతకు దిగి చరణ్ (15), పార్థు (12), హర్ష (12), దీక్షిత్ (12), తరుణ్ యాదవ్ (10) నీటిలో మునిగిపోయి మృతిచెందారు. చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లారు.పిల్లల బట్టలు ఒడ్డున ఉండటం.. చుట్టూ ఎక్కడా పిల్లల జాడ కనిపించపోవడంతో చెరువులో పిల్లలు గల్లంతైనట్టు తెలుసుకుని గాలించారు. సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ శివప్రసాద్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. -
జగన్ ప్రభంజనం చూసి సోనియా గాంధే భయపడింది.. ఇక బాబెంత!
-
దారి వెంట నీరాజనం..‘జై జగన్’ అంటూ నినాదాలు (ఫొటోలు)
-
అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, పుట్టపర్తి : ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 8న జమ్మూకశ్మీర్ లో శత్రుమూకలను చెండాడుతూ వీరమరణం పొందిన అగి్నవీర్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిలను ఓదార్చారు. మురళి పోరాటాన్ని దేశం గర్విస్తోందని వైఎస్ జగన్ కొనియాడారు. మంగళవారం ఉదయం బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్నారు. మురళీనాయక్ ఇంట్లోకి వైఎస్ జగన్ రాగానే.. జవాన్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురై బోరున విలపించారు. జగన్ రాకతో కల్లితండా జనసంద్రంలా మారింది. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కల్లితండా.. కన్నీరు మున్నీరు.. నాలుగైదు రోజులుగా దిగమింగుకున్న బాధను వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో ఒక్కసారిగా భావోద్వేగంతో వ్యక్తపరిచారు. విధి నిర్వహణలో మురళీ నాయక్ త్యాగాన్ని దేశం గరి్వంచినా.. కన్నతల్లి కంట కన్నీరు మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అభిమానులు జాతీయ జెండాలతో తరలివచ్చారు. గోరంట్ల – పుట్టపర్తి మెయిన్ రోడ్డు నుంచి కిలోమీటరు దూరం ఉన్న కల్లితండాకు వచ్చేందుకు గంటకుపైగా సమయం పట్టింది. గత సర్కారు సంప్రదాయమే.. దేశ రక్షణలో అమరులైన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సాయం చేయాలని మొదట ప్రతిపాదన తీసుకొచ్చి.. అమలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించడంపై వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. మార్మోగిన ‘జై జవాన్’ నినాదం.. కల్లితండాలోకి వైఎస్ జగన్ ప్రవేశించినప్పటి నుంచి ‘జై జవాన్’ నినాదం మార్మోగింది. ‘భారత్ మాతాకీ జై.. మురళీ నాయక్ అమర్ రహే’ అంటూ అభిమానులు జాతీయ జెండాలతో నినాదాలు చేశారు. మురళీనాయక్ కుటుంబాన్ని మద్దతుగా నిలిచిన వారందరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. మురళి కుటుంబానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి జనం రాక.. వైఎస్ జగన్ కల్లితండా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. మురళీ నాయక్కు ఘన నివాళులర్పించారు. తరలివచ్చిన నేతలు.. వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, అనంతపుర జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అత్తార్ చాంద్బాషా, నియోజకవర్గ సమన్వయకర్తలు ఈరలక్కప్ప (మడకశిర), టీఎన్ దీపిక (హిందూపురం), మక్బుల్ (కదిరి), మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, నాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి, మాదినేని ఉమామహేశ్వరనాయుడు, మహాలక్ష్మి శ్రీనివాసులు, కోగటం విజయ భాస్కర్రెడ్డి తదితరులు ఉన్నారు.‘‘జగనన్నా.. వచ్చావా.. మురళీ ఎక్కడ అన్నా. నువ్వయినా మా బిడ్డ మురళీని వెంట తెస్తావనుకున్నా’’ – వైఎస్ జగన్ పరామర్శించగానే బోరున విలపిస్తూ మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయి ఆక్రందన ‘‘మురళీ.. పైకి లేచి సెల్యూట్ చేయి.. నీ కోసం జగన్ సర్ వచ్చాడు. మన ఇంటికే జగన్ సర్ వచ్చాడు మురళీ. లే మురళీ.. లేచి సెల్యూట్ చేయి మురళీ’’ – వైఎస్ జగన్ను చూడగానే మురళీ నాయక్ తండ్రి శ్రీరాం నాయక్ భావోద్వేగం‘‘మురళీ నాయక్ను అయితే తేలేను తల్లీ.. నీ బిడ్డ పోరాటం వృథా కాదు. ఎంతోమందికి రక్షణగా నిలిచి.. చిన్న వయసులోనే ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మురళీ త్యాగానికి రుణపడి ఉంటాం’’ – మురళీ నాయక్ తల్లిదండ్రులతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి‘జై జవాన్’ నినాదం మార్మోగింది. కుగ్రామం కల్లితండాలో జనసునామీ పోటెత్తింది. అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం రాగా... అభిమాన గణం వెంట నడిచి జవాన్కు అశ్రు నివాళులర్పించింది. -
మురళి నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా
-
మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటాం: వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్లో ఈనెల 8న పాకిస్తాన్తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ వయసులో చిన్నవాడే అయినప్పటికీ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. యావత్ భారత్ గర్వపడేలా వీరోచితంగా పోరాడి.. దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించిన వీరుడన్నారు. మంగళవారం మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఉదయం బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన మురళీనాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకున్నారు. మురళీనాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్ సార్ వచ్చారు.. లేచి సెల్యూట్ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్ నాయక్ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.మురళీ కుటుంబానికి రూ.25 లక్షల సాయంకల్లి తండాలో వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. మురళీ నాయక్ త్యాగానికి వెల కట్టలేమని చెప్పారు. దేశం కోసం పోరాడుతూ.. తన ప్రాణ త్యాగంతో మిగిలిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు రక్షణ ఇచ్చారన్నారు. యావత్ భారత్ దృష్టిని ఆకర్షించిన మురళీని మన మధ్యలోకి తేలేం కానీ.. ఆయన త్యాగానికి రుణపడి ఉంటామన్నారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. దేశం కోసం పోరాడుతూ.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేసే సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మురళీ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించడం పట్ల అభినందించారు.దారి పొడవునా స్వాగతంకర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి కొడికొండ చెక్పోస్టు, కోడూరు, పాల సముద్రం, గుమ్మయ్యగారిపల్లి, కల్లి తండా వరకు దారి పొడవునా ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. దేశ సరిహద్దులో వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, పార్టీ శ్రేణులు భారీసంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. జాతీయ జెండాలతో చిన్నారులు మార్గం మధ్యలో స్వాగతం పలికారు. వాహనంపై నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. -
మహిళలకు వైఎస్ జగన్ చేసిన మేలు ఎవరూ చేయలేదు
సాక్షి, అమరావతి: మహిళలకు దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంత మేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలు తనతో పాటు అడుగులు వేయాలని, నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని వైఎస్ జగన్ నమ్మారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం వైపు దేశం మొత్తం తిరిగిచూసిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ. కూటమి పాలనలో మహిళలని కూడా చూడకుండా కేసులు పెడుతున్నారని, ప్రభుత్వంలో ఉన్నవారి ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. సంయమనం, క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉంటుందనే సందేశం ఇవ్వాలని సూచించారు. పార్టీ ఇతర అనుబంధ సంఘాల తరహాలోనే మహిళా విభాగం కూడా జిల్లా స్థాయిలో సమావేశం కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి నిర్దేశించారు.జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని కలుపుకొంటూ ముందుకెళ్లాలన్నారు. పనిచేసే క్రమంలో అడ్డంకులు సహజమని, పార్టీలోని నాయకుల సహకారంతో వాటిని తొలగించుకోవాలని సూచించారు. అపోహలతో పార్టీకి దూరమైన వర్గాలకు మళ్లీ దగ్గర కావాలని చెప్పారు. ఈ కష్ట కాలంలోనూ పార్టీలో పది పదవులకు వందమంది పోటీకి వస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏ పార్టీలోనూ ఇలా జరగదని, వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చెక్కుచెదరకపోగా మరింత పెరిగింది అనేందుకు నిదర్శనం ఇదేనని వివరించారు. మహిళలను నిలువునా మోసం చేసిన కూటమి: వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వం మహిళలను నిలువునా మోసం చేసిందని వరుదు కళ్యాణి అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు సంక్షేమం కింద ఒక్క రూపాయి కూడా అందడం లేదని, మహిళా లోకం కుమిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు జగనన్న పాలనలో జరిగిన లబ్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని, సమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అంటే గంజాయి, బెల్ట్ షాప్లు, పర్మిట్ రూమ్లు, పేకాట క్లబ్లు, డ్రగ్స్, మహిళలపై అఘాయిత్యాలు అని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలకు బదులు సూపర్ స్కామ్స్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుట్రలకు, ప్రజా నాయకుడైన జగనన్నకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు నడుంబిగించాలి మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో నారా వారి నరకాసుర పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అవమానాలు, అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, వేధింపులు ఇవే సూపర్ సిక్స్ అని అన్నారు. వైఎస్సార్సీపీలోని ప్రతి మహిళా సత్యభామలా మారి ఈ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మహిళా లోకాన్నే మోసం చేసిందన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ మహిళా నేతలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారన్నారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... వైఎస్ జగన్ ఐదేళ్లూ పరిపాలన మీదే దృష్టిపెట్టారని, మేనిఫెస్టోలో చెప్పినవాటితో పాటు, చెప్పని హామీలనూ నెరవేర్చారని అన్నారు. ఎమ్మెల్సీ కల్పలత మాట్లాడుతూ... కూటమి నాయకుడి మనసులో మెదిలితే చాలు మన మీద తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. సమావేశంలో అనుబంధ విభాగాల ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్లు, మేయర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీ మాజీ చైర్ పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు. -
YS Jagan: వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం
-
మురళీ ఎక్కడ ఉన్నావ్.. జగన్ సార్ వచ్చాడు సెల్యూట్ చెయ్
-
వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ (ఫోటోలు)
-
మురళీ నాయక్ కుటుంబానికి జగన్ ఆర్థిక సాయం..
-
వీర జవాన్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం: వైఎస్ జగన్
శ్రీసత్యసాయి జిల్లా: వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం ఆయన గోరంట్ల మండలం కల్లితండాలో వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం అని.. ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు.జవాను చనిపోతే రూ. 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
Jawan Murali Naik Family: వైఎస్ జగన్ పరామర్శ
-
పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదం నలుగురు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
బాగేపల్లి టోల్ గేట్ వద్ద వైఎస్ జగన్ కు ఘనస్వాగతం
-
పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద బొలెరో ట్రక్ - లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. వారంతా మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
వీరజవాన్ కుటుంబానికి నేడు వైఎస్ జగన్ పరామర్శ
-
వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం..పరామర్శ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి మనమంతా రుణపడి ఉంటాం. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీనాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తాం. మురళీ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా గంటలకు కల్లితండాకు చేరుకున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించిన వైఎస్ జగన్.. అనంతరం తిరుగు పయనమయ్యారు. -
వీరజవాన్ కుటుంబానికి నేడు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, పుట్టపర్తి: జమ్మూ కశ్మీర్లో ఆపరేషన్ సిందూర్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించనున్నారు.ఆయన బెంగళూరు నుంచి ఉదయం 11.30 గంటలకు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకుంటారు. మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిను పరామర్శించి, తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.