సాక్షి, తాడేపల్లి: రంపచోడవరం నియోజకవర్గ కేడర్తో రేపు(జూన్ 18, గురువారం) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.