సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపునిచ్చింది. రేపు తెల్లవారు జామున హుటాహుటిన ఢిల్లీకి రాంచందర్ సహా ప్రజా ప్రతినిధులు బయలుదేరనున్నారు. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎంపీలు.. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు.
రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు టీబీజేపీ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కీలక భేటీ కానున్నారు. ఇవాళ నితిన్ నబీన్ను కలిసిన పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ అభయ్ పాటిల్ నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, నేతల మధ్య సమన్వయం, ఇటీవల హైకమాండ్ ఆదేశాల అమలు సహా కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది.


