breaking news
jogi ramesh
-
చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్!
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ నెల 26లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, హోంశాఖ, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.విచారణ సందర్భంగా జోగి రమేష్ తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో దారి తప్పుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన వ్యక్తినే నిందితుడిగా అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు..‘సిట్ విచారణ ఎలా జరుగుతోంది? సీబీఐకి కేసు అప్పగించాలా?’ అనే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాలతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లైంది. -
Devineni Avinash: అక్రమ కేసులు పెట్టి జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారా?
-
జోగి రమేష్, భాస్కర్ రెడ్డి తో ములాఖత్
-
జోగి రమేష్ త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు
-
నకిలీ మద్యం కేసు.. హోంశాఖకు కొత్త టెన్షన్!
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం కేసు విషయమై హోంశాఖకు టెన్షన్ పట్టుకుంది. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.నకిలీ మద్యం కేసు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ నుంచి సీబీఐకి వెళ్తే.. టీడీపీ నాయకుల పేర్లు బయటకి వస్తాయని పచ్చ పార్టీ పెద్దలు తీవ్ర ఆలోచనలో పడినట్టు సమాచారం. మరోవైపు.. కౌంటర్ దాఖలు చేస్తే సీబీఐ విచారణ ఎందుకు వద్దు అంటున్నారు అనేది హైకోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. అయితే, నకిలీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి సీబీఐ విచారణకి ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే.దీనికి ముందు జోగి రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ‘‘నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నాం. మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు అరెస్ట్ కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదు. పోలీస్ కస్టడీలోకి వెళ్లాక... నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోంది. దీనివెనుక జోగి రమేష్ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దనరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత పిటిషనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని పేర్కొన్నారు.మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్టయ్యారని, ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు.దర్యాప్తు పక్షపాతంతో ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు ఏజీ వాదనను పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. -
బాబుకు హైకోర్టు బిగ్ షాక్.. జోగి రమేష్ దెబ్బ అదుర్స్..!
-
నకిలీ మద్యం కేసు దర్యాప్తు... ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులిస్తూ... న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోగి అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు వెసులుబాటునిస్తూ విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. దీనికిముందు జోగి రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ‘‘నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నాం. మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు అరెస్ట్ కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదు. పోలీస్ కస్టడీలోకి వెళ్లాక... నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోంది. దీనివెనుక జోగి రమేష్ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దనరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత పిటిషనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్టయ్యారని, , ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు.దర్యాప్తు పక్షపాతంతో ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు ఏజీ వాదనను పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. -
అకస్మాత్తుగా జోగి రమేష్ జైలు మార్పు..
జోగి రమేష్ అరెస్ట్.. అప్డేట్స్విజయవాడ:కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిన్న( ఆదివారం, నవంబర్ 2 వతేదీ) నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారుజోగి రమేష్ అరెస్టును ఖండించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలుమాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరికిపాటి శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి గుంజ శ్రీనివాస్, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలుఎటువంటి ఆధారాలు లేకుండా జోగి రమేష్ పై అక్రమ కేసులు పెట్టారుఇది ప్రభుత్వ పైశాచిక ఆనందంజోగి రమేష్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్నారు.మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూడా కేసులు పెడుతున్నారు.. ఇది దుర్మార్గ పాలన కాదా?ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి వేల మంది వైఎస్సార్సీపీ సైనికుల గొంతుకలు సిద్ధంగా ఉన్నాయి.నెల్లూరు జైలుకు జోగి రమేష్జైలు మార్పుతో జోగి రమేష్ కుటుంబ సభ్యుల్లో ఆందోళనవిజయవాడ నుంచి ఆకస్మాత్తుగా నెల్లూరు తరలింపునెల్లూరు జైలుకు జోగి రమేష్.. ఆయన సోదరుడు జోగి రాముజోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు.జోగి రమేష్ భార్య, కుమారులపై కేసు నమోదు చేసింది. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో వైద్య పరీక్షలకు వచ్చినపుడు జీజీహెచ్లో దౌర్జన్యం చేసి అద్దాలు పగులకొట్టినట్టు ఫిర్యాదు మాచవరం పోలీసులకు డ్యూటీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఫిర్యాదుగుణదల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా శ్రీనివాసరావు విధులు శ్రీనివాసరావు ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు ఏ1 గా జోగి రమేష్ భార్య శకుంతల దేవి , ఏ2 గా జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ , ఏ3గా జోగి రమేష్ చిన్న కుమారుడు రోహిత్లపై కేసు నమోదు నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం(నవంబర్ 2వ తేదీ) ఉదయం అక్రమంగా అరెస్టు చేసింది. కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ , ఆయన సోదరుడు జోగి రాము నివాసాల వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సిట్, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు చేరుకున్నారు.జోగి రమేష్ ఇంట్లో ఉండటంతో తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. మూడున్నర గంటలపాటు హడావుడి చేశారు. ఉదయం 8గంటలకు జోగి రమేష్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. -
జోగి రమేష్ అరెస్ట్ అంబటి రాంబాబు రియాక్షన్
-
డైవర్షన్ రాజకీయాలకు ఇది పరాకాష్ట!
ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి. ఈ విషయం తెలియని వారంటూ లేరు కానీ.. తాజా ప్రయత్నం మాత్రం పరాకాష్ట అని చెప్పక తప్పదు. రాష్ట్ర పాలన యంత్రాంగం ఘోర వైఫల్యం కారణంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మరణిస్తే.. దాన్ని కప్పిపుచ్చేందుకు, పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టుండి నకిలీ మద్యం కేసును తెరపైకి తెచ్చింది. కుట్ర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంలా వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేయించింది.వాస్తవానికి కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం పెల్లుబికేలా చేసింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఆ ఘటనతో తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడింది. అయినప్పటికీ ప్రజల ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదని కూటమి పెద్దలు అంచనాకు వచ్చారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా జరిగిన గోదావరి పుష్కరాల తొక్కిసలాట మొదలుకొని అధికారంలోకి వచ్చిన తరువాత తిరుపతి, సింహాచలం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లోనూ ఇటీవలి కాలంలో తొక్కిసలాటలు జరిగి పలువురు మరణించిన నేపథ్యంలో కాశీబుగ్గ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో దైవానికి ఏదో అపచారం జరిగిందన్న సెంటిమెంట్ ప్రజల్లో ఏర్పడుతోంది. ఇది అరిష్టం అన్న భావనకు భక్తులు వస్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో మాత్రమే కాదు.. చంద్రబాబు విపక్షంలో ఉండగా కందుకూరు, గుంటూరు సభలలో జరిగిన తొక్కిసలాటల్లోనూ ప్రాణ నష్టం జరగడం గమనార్హం.కుల, మత రాజకీయాలు నడపడంలో ఆరితేరిన తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వానికి ఈ తొక్కిసలాటల ఘటనలు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కాశీబుగ్గ ఆలయం ప్రైవేటుదని చెప్పి తప్పించుకోవాలని మంత్రులు ప్రయత్నించారు. ‘మనం నిమిత్త మాత్రులం’ అంటూ చంద్రబాబు పెదవి విరిచేసినట్లు వార్తలు వచ్చాయి. తుపానులను సైతం వెనక్కి నెట్టేయగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ల సొంతమని టీడీపీ మీడియా బిల్డప్ ఇచ్చిన రెండు రోజులకే కాశీబుగ్గ ఘటన జరిగింది. తమకు టెక్నాలజీ వెన్నతో పెట్టిన విద్యని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం ఏకాదశి రోజున ఆ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రావచ్చునన్న కనీస అవగాహన లేకపోయింది. పట్టణాల్లో ఏ వీధి దీపం ఆరిపోయినా రాజధానిలో కూర్చుని గుర్తిస్తామని చెప్పుకున్న చంద్రబాబు ఆలయ రద్దీని మాత్రం నియంత్రించలేకపోయారన్న విమర్శలు వచ్చాయి.కాశీబుగ్గలో పాండా అనే వ్యక్తి తన సొంత జాగా 12 ఎకరాలలో ఈ ఆలయం నిర్మించారట. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందీ ఆలయం. ఆ విషయం స్థానిక పోలీసులకు, అధికారులకు తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించడంపై ఉన్న శ్రద్ధ ప్రజలను కాపాడే విషయంలో లేకుండా పోయిందని విమర్శించారు.ఈ పరిస్థితుల్లో.. ప్రభుత్వ ప్రతిష్ట మరింత దెబ్బతిన్నదని భావించిన చంద్రబాబు ప్రభుత్వం వెంటనే డైవర్షన్ రాజకీయాల్లోకి దిగినట్లు కనిపిస్తోంది. ఆకస్మికంగా నకిలీ మద్యం కేసును తెరపైకి తెచ్చి మాజీ మంత్రి జోగి రమేష్ను ఆదివారం ఉదయాన్నే అరెస్ట్ చేసింది. ఎల్లో మీడియా పుణ్యమా అని కాశీబుగ్గ ఘటన కాస్తా మరుగునపడి.. ఈ అరెస్ట్ అంశం మీడియాలో ప్రముఖంగా కనిపించింది. పోలీసులు కూడా ముందస్తు విచారణ లాంటివేవీ లేకుండానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు ఈ అరెస్ట్ స్పష్టం చేస్తోంది. నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వాహకుడు జనార్దనరావు ఇచ్చిన ఒక ప్రకటన ఆధారంగా జోగిని నిర్భందించారు. జోగి దైవ సన్నిధిలో ప్రమాణం చేయడానికి అయినా సిద్దమేనని సవాల్ చేయడమే కాకుండా, ఆ ప్రకారం కనకదుర్గమ్మ గుడి వద్ద చేతిలో కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు. ఇదే పని చంద్రబాబు లేదా లోకేష్ చేయగలరా అని ప్రశ్నించారు. వీటిని వారు ఎటూ పట్టించుకోరు.ఇక్కడ చిత్రం ఏమిటంటే నకిలీ మద్యం ప్లాంట్ నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డిని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఎల్లో మీడియాలోనే వచ్చిన రిపోర్టు ప్రకారం వేలాది బెల్ట్ షాపులకు ఈ నకిలీ మద్యం సరఫరా అయింది. ఒక్క తంబళ్ళపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉన్నాయని ఈనాడు మీడియా పేర్కొంది. నకిలీ మద్యం ప్లాంట్ను పట్టుకున్న సందర్భంలోనే ఒక డైరీ దొరికిందని, అందులో ఈ మద్యం సరఫరా అయిన 78 మంది పేర్లు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఆ బెల్టు షాపుల జోలికి ఏపీ పోలీసుల మాత్రం పోలేదు. కానీ, నకిలీ మద్యం ప్లాంట్, అక్కడ ఒక పొలంలో ఉన్న మద్యం డంప్ కనుక్కున్న అధికారిని బదిలీ చేశారట. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి మద్యం తాగి మోటార్ సైకిల్ నడిపి బస్ ప్రమాదానికి కారణమయ్యారు. ఆ ఘటనలో 19 మంది మరణించారు. నకిలీ మద్యమే కారణం అని ప్రకటనలు చేసిన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 27 మందిపై కేసులు పెట్టారు. అక్కడ బెల్ట్ షాపుపై చర్య తీసుకోలేదు. ఆ షాపులలో నకిలీ మద్యం లేదని ఎక్కడా నిరూపించలేదు.రెండు రోజుల క్రితం సాక్షి టీవీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద బెల్ట్ షాపులలో అది మంచి మద్యమో, కాదో తెలియని రీతిలో విక్రయిస్తున్న వైనాన్ని సాక్ష్యాధారాలతో సహా వార్తా కథనాలను ప్రసారం చేసింది. అందులో ఒక వ్యక్తి టీడీపీ ఐడీ కార్డు వేసుకుని మరీ బెల్ట్ షాపు నడుపుతున్న వైనం బహిర్గతమైంది. ప్రభుత్వం వీటికి సమాధానం ఇవ్వలేకపోయింది. ఇబ్రహీంపట్నం వద్ద కూడా నకిలీ మద్యం డంప్ ఉందని వార్తలు వచ్చాక, అక్కడకు వెళ్లి దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టిన వ్యక్తి జోగి రమేష్. జనార్దనరావు దక్షిణాఫ్రికా నుంచి పంపిన వీడియోలో ఎక్కడా జోగి పేరు ప్రస్తావించలేదు. ఎవరితో ముందస్తు ఒప్పందం అయ్యారో కానీ, సడన్గా ఏపీకి వచ్చి ఆయన లొంగిపోయారు. ఆ క్రమంలో ఆయన మొబైల్ ఫోన్ ముంబై విమానాశ్రయంలో పోయిందని పోలీసులకు చెప్పినా, దానిని కనుక్కునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేశారో, లేదో తెలియదు. పోలీసు రిమాండ్లో ఉండగా జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం ప్లాంట్ పెట్టానని జనార్దనరావు ఇచ్చిన వీడియో ప్రకటనను బయటకు రిలీజ్ చేశారు. దానిని బట్టే ఇదంతా కుమ్మక్కు రాజకీయం అని, వైఎస్సార్సీపీ నేతను ఎలాగోలా ఇరికించి ఈ కేసును డైవర్ట్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నమని జనం అందరికీ తెలిసిపోయింది.ఇలా డైవర్షన్ చేయడంలో చంద్రబాబుకు చాలానే చరిత్ర ఉంది.. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నప్పుడు దానిని డైవర్ట్ చేయడానికి తన ఫోన్ ఎలా ట్యాప్ చేస్తారంటూ ఎదురు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఏపీలో కేసులు నమోదు చేయించడం ద్వారా అసలు అంశాన్ని డైవర్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీలోని తన సన్నిహితులతో రాజీ మంతనాలు జరిపించి కేసు లేకుండా చేసుకున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట ఘటనలో 29 మంది చనిపోయినా, ఒక్క అధికారిపై కూడా చర్య తీసుకోలేదు. పైగా సీసీటీవీ ఫుటేజీ కూడా మాయమైందన్న వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఒక కమిషన్ వేసి ఆయన తప్పేమి లేదన్నట్లు, భక్తులదే తప్పన్నట్లుగా చిత్రీకరించగలిగారని చెబుతారు. విజయవాడలో బుడమేరు వరదలతో వేలాది మంది అల్లాడుతుంటే ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల కుట్ర అంటూ వైఎస్సార్సీపీపై నెట్టే యత్నం చేశారు. మొత్తమ్మీద చంద్రబాబు ప్రభుత్వం తీరు చూస్తే ప్రజాస్వామ్యంలో కాకుండా రాచరికంలో ఉన్నామా అనిపిస్తోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత. -
కన్నీటి పర్యంతం అయిన జోగి రమేష్ భార్య.. వడ్డీతో సహా చెల్లిస్తాం...
-
విజయవాడ సబ్ జైలుకు జోగి రమేష్
-
Fake Liquor Scam Case: జోగి రమేష్కు 10 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
-
రిమాండ్ రిపోర్ట్ లో ఒక్క ఆధారం కూడా చూపించలేక పోయిన సెట్
-
బాబు కుతంత్రాలు.. పక్క ప్లాన్తో జోగి రమేష్ అరెస్ట్
-
జోగి అరెస్ట్ పై YS జగన్ ఫైర్
-
బాబు సర్కార్ ప్లాన్ అదేనా?
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్లు తేటతెల్లమైంది. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అధికారులు. నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కంటే.. అక్రమ అరెస్టులపైనే సిట్ శ్రద్ధ పెట్టినట్లు జోగి రమేష్ వ్యవహారంతో స్పష్టమవుతోంది. నాటకీయ పరిణామాల నడుమ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. ఆ సమయంలోనూ ఈ కేసు ప్రధాన నిందితుడు(ఏ1) అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన కట్టుకథనే సిట్ వల్లేవేయడం గమనార్హం. అలాగే రిమాండ్ రిపోర్టులో జనార్దన్తో నమోదు చేయించిన వాంగ్మూలాన్నే వినిపించిన అధికారులు.. రమేష్కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. జనార్దన్రావు-జోగి రమేష్కు మధ్య జరిగిన లావాదేవీలను సైతం నిరూపించలేక చతికిపలడ్డారు. జనార్దన్ పోయిందని చెబుతున్న ఫోన్ తాలుకా స్క్రీన్ షాట్లనే మళ్లీ ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అలాగే నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన శ్రీనివాస వైన్స్ ఓనర్ మహంకాళి పూర్ణ చంద్ర రావుపై ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదు కూడా. అంతేకాదు ఫేక్ లిక్కర్ డైరీలో పలువురు బడా నేతలు పేర్లున్నాయని దర్యాప్తు తొలినాళ్లలో ప్రకటించిన సిట్.. ఇప్పుడు గమ్మున ఉండిపోవడమూ పలు అనుమానాలను తావిస్తోంది. దీంతో.. సీఎం చంద్రబాబు డైరెక్షన్తోనే టీడీపీ నాయకులని తప్పించేందుకు అధికారులు నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని వైఎస్సార్సీపీ అంటోంది. పదిరోజుల రిమాండ్నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును ఏ-18 గా, ఆయన సోదరుడు జోగి రామును ఏ-19 గా ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ఆరవ ఏజెఎంఎఫ్సీ న్యాయస్థానం ఈ ఇద్దరికీ 10రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది . దీంతో ఇరువురిని విజయవాడ సబ్జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ వేసిన పిటిషన్ మంగళవారం(రేపు, నవంబర్ 12) విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: దుర్గమ్మ చెంత సత్యప్రమాణం.. బాబు, లోకేష్కు ఆ దమ్ముందా? -
ఒక్క ఆధారం ఉంటే ఒట్టు!
సాక్షి, అమరావతి: జోగి రమేష్కు వ్యతిరేకంగా సిట్ అధికారులు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా రిమాండ్ నివేదికలో చూపించలేక పోయారు. వారు బెదిరించి జనార్దనరావుతో నమోదు చేయించిన అబద్దపు వాంగ్మూలం ఆధారంగానే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. జోగి రమేష్, జనార్దనరావు మధ్య.. జోగి రమేష్, జయచంద్రారెడ్డిలమధ్య వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా చూపలేదు. అదే సమయంలో జయచంద్రారెడ్డి, జనార్దనరావు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.జయచంద్రారెడ్డికి టీడీపీ అధిష్టానానికి మధ్య రాజకీయ బంధం, అనుబంధం ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. మరి నకిలీ మద్యం మాఫియాలో పాత్రధారి అయిన జయచంద్రారెడ్డి వెనక సూత్రదారులుగా ఉన్న టీడీపీ పెద్దలపై విచారణ ఎందుకు చేపట్టలేదో సిట్ అధికారులకే తెలియాలి. ఈ రిమాండ్ నివేదికలో జోగి రమేష్ వాంగ్మూలం ఇచ్చినట్టు, ఆయన సంతకం చేసినట్టు సిట్ ప్రస్తావించక పోవడం గమనార్హం. అంటే సిట్ అధికారుల నిరాధార ప్రశ్నలతో కూడిన కుట్రను విచారణ సందర్భంగా ఆయన తిప్పికొట్టినట్టు స్పష్టమవుతుంది. అంతా కట్టుకథ అని తెలుస్తోంది.కాగా, జోగి రమేష్æ ఏ–18, జోగి రాము ఏ–19గా చూపించారు. ఈ కేసులో మరో నలుగురిని ఏ–20గా మనోజ్ కొఠారి, ఏ–21గా సుదర్శన్, ఏ–22గా సింథిల్, ఏ–23గా ప్రసాద్ను తాజాగా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం 23 మందిపై కేసు నమోదైంది. టీడీపీ పెద్దలే కర్త, కర్మ, క్రియగా సాగిన నకిలీ మద్యం మాఫియా కేసును పక్కదారి పట్టిస్తూ సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టును రూపొందించడం విస్మయ పరుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో జోగి రమేష్ను హాజరు పరిచిన నేపథ్యంలో సమర్పించిన రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను స్పష్టం చేసింది. కేసులో వాదనలు అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.⇒ జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది టీడీపీయే. ఆయనకు మద్యం దుకాణాలు మంజూరైంది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారుచేసి విక్రయించిందీ ఆ మద్యం దుకాణాల ద్వారానే. అంటే ఆయన రాజకీయ జీవితం, వ్యాపార వ్యవహారాలన్నీ టీడీపీతోనే ముడిపడ్డాయి. ఈ విషయాలన్నింటినీ సిట్ రిమాండ్ నివేదిలో పేర్కొంది. కానీ టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన సన్నిహితుడు అద్దేపల్లి జనార్దనరావు ఈ నకిలీ మద్యం దందా అంతా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చెబితే చేశారట! వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వం ఇలా బరితెగించి సిట్తో కుతంత్రాలు చేయించింది. ⇒ ఈ కేసులో ఏ1గా అద్దేపల్లి జనార్దనరావును కేంద్రబిందువుగా చేసుకుని సిట్.. జోగి రమేష్కు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని స్పష్టమవుతోంది. టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, జనార్దనరావు వ్యాపార భాగస్వాములు, సన్నిహితులని సిట్ చెబుతోంది. కానీ జనార్దనరావు.. జోగి రమేష్కు సన్నిహితుడని నమ్మించేందుకు సిట్ కట్టుకథలు అల్లింది. ⇒ జోగి రమేష్ చెబితేనే జనార్దనరావు నకిలీ మద్యం తయారీకి సిద్ధపడ్డారని సిట్ చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చెబితే ఆయన ఎందుకు చేస్తారనే కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. వారిద్దరూ (జనార్దనరావు, జయచంద్రారెడ్డి) ఎన్నో ఏళ్లుగా ఆఫ్రికాలో ఇదే తరహా నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించారని అదే నివేదికలో సిట్ పేర్కొంది. అటువంటి చరిత్ర ఉన్న జయచంద్రారెడ్డికి టీడీపీ ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్న విషయాన్ని సిట్ అధికారులు ఉద్దేశ పూర్వకంగానే పట్టించుకోలేదు. ఎందుకంటే రాష్ట్రంలో నకిలీ మద్యం దందాకు పాల్పడాలనే కుట్రతోనే ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. అందుకే ఆ అంశాన్ని సిట్ రిమాండ్ రిపోర్ట్లో పొందుపర్చలేదు.నేను ఏ తప్పూ చేయలేదున్యాయమూర్తి ఎదుట జోగి రమేష్తాను ఏ తప్పు చేయలేదని, నకిలీ మద్యం వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని జోగి రమేష్ న్యాయమూర్తి ఎదుట స్పష్టం చేశారు. పాత విషయాలను దృష్టిలో పెట్టుకుని తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆవేదన వ్యక్తంచేశారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు చనిపోవడం, తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను అరెస్టు చేశారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని, పైన దేవుడు కూడా చూస్తున్నాడన్నారు. -
జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమే
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి.. దాని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ తమ పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. బాబు డైవర్షన్ పాలిటిక్స్ హ్యాష్ ట్యాగ్తో ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ⇒ ‘చంద్రబాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ⇒ గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు.. మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. ⇒ మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అమ్మేది మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లో.. మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టు షాపులు, పరి్మట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీ వారు, అమ్మేదీ మీ వారే.. కానీ బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని. ⇒ నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతుల గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది చంద్రబాబు గారూ.. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు గారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెబితే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం!?. -
జోగి రమేష్ అక్రమ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం అక్రమంగా అరెస్టు చేసింది. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగినట్లు బట్టబయలైనా, డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ , ఆయన సోదరుడు జోగి రాము నివాసాల వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సిట్, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు చేరుకున్నారు.జోగి రమేష్ ఇంట్లో ఉండటంతో తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. మూడున్నర గంటలపాటు హడావుడి చేశారు. ఉదయం 8గంటలకు జోగి రమేష్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను పోలీస్ వ్యాన్లో బలవంతంగా ఎక్కించి, విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జోగి రమేష్ సోదరుడు రాము, జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును కూడా అరెస్టు చేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. రమేష్ ను అరెస్ట్ చేయొద్దని ఆందోళన జోగి రమేష్ ఇంటికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేస్తుండటాన్ని నిరసిస్తూ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్.. నారా వారి సారా రాజ్యం నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. ఈ దశలో పోలీసులు, నాయకుల మధ్య తీవ్ర∙వాగ్వాదం జరిగింది. ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన జోగి రమేష్ను అరెస్ట్ చేసి విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారని తెలియడంతో పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఆయన అక్రమ ఆరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, నియోజకవర్గ ఇన్చార్జులు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కైలే అనిల్కుమార్, ఉప్పాల రాము, తన్నీరు నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, పార్టీ నేతలు నాగార్జున, తిరుపతిరావు, రవిచంద్ర, అవుతు శ్రీనివాసరెడ్డి, పోతిన మహేష్ , జెడ్పీ వైస్ చైర్మన్ జి.శ్రీదేవి, కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ జి.శ్రీనివాస్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, రాత్రి జోగి రమేష్ను వైద్య పరీక్షల నిమిత్తం ఎక్సైజ్ పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్సైజ్ కార్యాలయం వద్దే ఉన్నారు. చంద్రబాబు పిచ్చకి పరాకాష్ట – జోగి రమేష్ , మాజీ మంత్రి చంద్రబాబునాయుడు నా మీద కక్ష కట్టాడని 20 రోజులుగా చెబుతున్నాను. అందులో భాగమే ఈ అక్రమ అరెస్టు. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య, బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను.. కనకదుర్గమ్మ వారి దగ్గరకు తీసుకువెళ్లాను.. ప్రమాణం చేసి చెప్పాను. అయినా చంద్రబాబునాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు దుర్మార్గానికి, పిచ్చికి ఇది పరాకాష్ట. కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మృతి చెందిన సంఘటనను డైవర్షన్ చేసేందుకు కుట్ర పన్నారు. నన్ను అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబునాయుడు, లోకేశ్.. ఖబడ్దార్.. మీకు భార్య, పిల్లలు ఉన్నారు. మీకు కుటుంబం ఉంది. నన్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. జోగి సోదరుల ఇళ్లల్లో క్లూస్ టీమ్ తనిఖీ జోగి రమేష్ , జోగి రాముల అరెస్ట్ అనంతరం వారి నివాసాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సిట్, ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీమ్ బృందాల్లోని సభ్యులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సీసీ టీవీ పుటేజీలు, హార్డ్ డిస్్కలు, సెల్ఫోన్లు, కంప్యూటర్లు పరిశీలించారు. పలు ఎల్రక్టానిక్స్ వస్తువులను రెండు బాక్సుల్లో ప్యాక్ చేసి వారితోపాటు తీసుకెళ్లారు. బీసీల ఎదుగుదల ఓర్చుకోలేకే అక్రమ అరెస్టుజోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ ఆవేదన సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘బీసీ సామాజికవర్గానికి చెందిన వాళ్లం కాబట్టి మా రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేక చంద్రబాబునాయుడు, లోకేశ్ మాపై కక్షగట్టారు. ఒక బీసీ నాయకుడు నా ఇంటి దగ్గరకు రావడమేంటని కక్ష పెంచుకొని నా భర్త జోగి రమేష్ను అణిచివేయాలని చూస్తున్నారు’ అని ఆయన సతీమణి జోగి శకుంతలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ అరెస్టు అనంతరం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో తన కొడుకు జోగి రాజీవ్ను, ఇప్పుడు తన భర్త జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పించేందుకే తన భర్త.. చంద్రబాబు ఇంటి దగ్గరకు వెళ్లారన్నారు. ఆ సమయంలో టీడీపీ నాయకులే తన భర్త కారుపై దాడి చేశారని గుర్తు చేశారు. కానీ ఆ సంఘటనను చంద్రబాబు ఇంటి మీద దాడిగా చిత్రీకరించారని ఆమె వాపోయారు. అది మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు, లోకేశ్లు పరిపాలన గాలికొదిలేసి తమ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. చంద్రబాబు నాయుడుకు మనస్సాక్షి అనేది ఉంటే కొంచెం అయినా ఆలోచించాలని హితవు పలికారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే తన భర్తను అణిచివేసేందుకు పూనుకున్నారని ఆమె మండిపడ్డారు. హక్కులను కాలరాస్తూ... రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులు తమ ఇంటి వద్ద ప్రవర్తించిన తీరు భయాందోళన కలిగించిందని జోగి శకుంతలమ్మ చెప్పారు. నిద్రపోతున్న సమయంలో ఇంటి మీదకు వచ్చి.. డోర్లు కొట్టి.. భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆందోళన వ్యక్తంచేశారు. డోర్లు తెరవకపోతే పగలకొడతాం అని వాచ్మెన్ను బెదిరించారన్నారు. తాను నిర్దోషి అని తన భర్త కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర కుటుంబ సభ్యులందరి సమక్షంలో ప్రమాణం చేశారని గుర్తు చేశారు.తన భర్త మీద ఎవరైతే నకిలీ మద్యం కేసులో అసత్య ఆరోపణలు చేస్తున్నారో వారంతా ఆయన తప్పు చేశాడని ప్రమాణం చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని ఆమె సవాల్ విసిరారు. తప్పు చేసి ఉంటే ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉంటామన్నారు. కానీ, ఏ తప్పు చేయకుండా తమ కుటుంబ సభ్యులను ఈ రకంగా హింస పెట్టడాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని, తన భర్త జోగి రమేష్ , మరిది జోగి రాము కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆమె ధీమా వ్యక్తంచేశారు. -
ఏమార్చే తంత్రం.. పక్కా కుతంత్రం
సాక్షి, అమరావతి: పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే... మంచం కోళ్లలా ముగ్గురు ఉంటారని రెండు వేళ్లు చూపించాడట వెనకటికి ఒకరు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ తీరు కూడా అంత అధ్వానంగా, అస్తవ్యస్థంగా తయారైంది. ఎన్నికల మేనిఫెస్టో ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తుంటే.. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం దాటవేసేందుకు ఎప్పటికప్పుడు డైవర్షన్ కుతంత్రాలు పన్నుతోంది. ఇందులో భాగంగానే తాజాగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ అని స్పష్టమవుతోంది. ఏమాత్రం సంబంధం లేని విషయాలను సృష్టించి, ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందనేందుకు నకిలీ మద్యం రాకెట్లో జోగి రమేశ్ను ఇరికించడమే నిదర్శనం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం శకుని తరహాలో కుయుక్తి పాచికలను మళ్లీ మళ్లీ విసురుతోంది. తాను ఏం చెప్పినా భుజానికెత్తుకునే ఎల్లో మీడియా ఉండటంతో చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం చెందడంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. మోంథా తుపానుతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు ఉద్యుక్తులవుతున్నారు. తమ చేతగానితనం మరోసారి బట్టబయలు కాగానే చంద్రబాబులోని డైవర్షన్ చంద్రముఖి వెంటనే నిద్ర లేచింది. ఫలితంగా కరకట్ట ప్యాలస్ డైరెక్షన్లో టీడీపీ వీర విధేయ పోలీసులతో కూడిన సిట్ తక్షణం రంగంలోకి దిగింది. జోగి రమేశ్ అరెస్ట్.. ఎల్లో మీడియాలో భారీగా కవరేజీ.. ప్రజల దృష్టి అటువైపు మళ్లించే పన్నాగం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే భక్తుల దుర్మరణం టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు, టీడీపీ నేతలే పాత్రధారులుగా సాగుతున్న నకిలీ మద్యం దందా కేసును ఉద్దేశ పూర్వకంగా పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం బరితెగించింది. అందుకు ఎంచుకున్న సమయం కూడా ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొమ్మిది మంది భక్తుల దుర్మరణం రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని తీవ్రంగా కలచి వేసింది. ఎంతో ప్రాశస్య్తమైన కార్తీక ఏకాదశి అదీ శనివారం రోజున వచ్చిందనే కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన కాశీబుగ్గు వేంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారన్నది అందరికీ తెలిసినా సరే ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించింది. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయక పోవడం వల్లే ఆలయంలో శనివారం తీవ్ర తొక్కిసలాట సంభవించి భక్తులు మృత్యువాత పడ్డారు. హృదయ విదారకంగా ఉన్న ఆ దృశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ వైఫల్యం బట్టబయలైంది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తుల దుర్మరణం.. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు బలి.. తాజాగా కాశీబుగ్గ దుర్ఘటనలు ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తిచూపాయి. హిందూ పండుగలకు కనీస స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ, నిర్లక్ష్య వైఖరిపై యావత్ భక్తకోటి మండిపడుతోంది. భక్తుల ప్రశ్నలకు ప్రభుత్వం శనివారం రాత్రి వరకు సరైన సమాధానం చెప్పలేకపోయింది. ఫలితంగానే డైవర్షన్ పాలిటిక్స్. తుపాను బాధిత రైతులను పట్టించుకోని ప్రభుత్వం మోంథా తుపాను దెబ్బకు రాష్ట్రంలో రైతులు కుదేలయ్యా రు. 15 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా, ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం పంటల నష్టాన్ని అంచనా వేయకుండా తుపాన్ను జయించామని బాకాలు ఊదుతుండటం విస్మయానికి గురి చేస్తోంది. క్షేత్ర స్థాయిలో రైతులను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. దెబ్బతిన్న పంటలను కొనేందుకు ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తుండటం విడ్డూరంగా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ కావాలా.. ధాన్యం కొనాలా.. ఏదో ఒకటే తేల్చుకోవాలని షరతు విధిస్తుండటం ప్రభుత్వ దుర్మార్గానికి తార్కాణం. కనీసం సంచులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆందోళనకు సిద్ధపడుతున్నారు. చంద్రబాబు లండన్ షికారు.. చినబాబు క్రికెట్ జోరు ఓ వైపు భక్తుల దుర్మరణం.. మరోవైపు తుపానుతో తీవ్రంగా నష్టపోయిన రైతుల ఆవేదన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. కానీ ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్న చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఇవేవీ పట్టించుకుండా ఉడాయించారు. చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లిపోయారు. ఆయన లండన్ పర్యటన ఎందుకు? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. వ్యక్తిగత పర్యటనా.. లేక అధికారిక పర్యటనా అన్నది స్పష్టం చేయలేదు. చంద్రబాబు వ్యక్తిగతంగానే లండన్ పర్యటనను ఆస్వాదిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. ఇక చినబాబు లోకేశ్ తీరు మరింత విస్మయానికి గురి చేసింది. ఆయన ముంబయిలో క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లిపోయారు. దుర్మరణం చెందిన భక్తుల కుటుంబాల ఆవేదననుగానీ, తీవ్రంగా నష్టపోయిన రైతుల బాధను గానీ తండ్రీ కొడుకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారన్నది పత్తా లేదు. అదీ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి. అందుకే డైవర్షన్ డ్రామా.. జోగి రమేశ్ అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో చంద్రబాబు బేంబేలెత్తారు. వెంటనే తనదైన శైలిలో డైవర్షన్ డ్రామాకు తెరతీశారు. శనివారం రాత్రి కూటమి ప్రభుత్వ పెద్దలు తమ పన్నాగానికి పదును పెట్టారు. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ను అక్రమ అరెస్టు చేయాలని సిట్ అధికారులను ఆదేశించారు. దాంతో మీడియా, ప్రజల దృష్టి అంతా ఆ వ్యవహారం వైపు మళ్లించాలన్నది ఎత్తుగడ. ప్రభుత్వ పెద్దల కుట్రకు టీడీపీ వీర విధేయ పోలీసులు వత్తాసు పలికారు. ఆదివారం తెల్లవారుజామునే విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆయన్ని బలవంతంగా అరెస్టు చేశారు. నకిలీ మద్యం వ్యవహారంతో తనకేం సంబంధమని ఆయన అడిగిన ప్రశ్నలకు పోలీసులు కనీస సమాధానం కూడా చెప్పలేకపోవడం గమనార్హం. కేవలం కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనలో ప్రభుత్వ వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ హైడ్రామా నడిపించారన్నది సుస్పష్టం. మళ్లీ మళ్లీ అదే డైవర్షన్ కుతంత్రం 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఇదే తరహాలో డైవర్షన్ డ్రామాలతోనే ప్రజల్ని మభ్యపెడుతోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని ఎవరు డిమాండ్ చేసినా.. పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యం ఎప్పుడు బయటపడినా.. రెడ్బుక్ అరాచకాలపై ప్రజాగ్రహం వెల్లువెత్తిన ప్రతిసారి.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ చేతగానితనం బటయపడగానే.. ఇలా కూటమి ప్రభుత్వ ప్రతి వైఫల్యంలోనూ వెంటనే ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరతీస్తునే ఉంది. -
అసలు సూత్రధారి టీడీపీ నేత.. అతను జోగి రమేష్ మాట వింటాడా?
-
ఇల్లు చూపించమని పిలిచి.. పోలీసుల కుట్ర బయటపెట్టిన జోగి రమేష్ PA
-
జోగి రమేష్ అరెస్ట్ పై YS జగన్ ఆగ్రహం
-
తిరుపతి లడ్డు నుండి కాశీబుగ్గ వరకు.. బాబు డైవర్షన్ పాలిటిక్స్
-
లోకేష్ కుట్రే.. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు: జోగి శకుంతల
సాక్షి, విజయవాడ: ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఏమీ లేదన్నారు ఆయన సతీమణి శకుంతల. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే జోగి రమేష్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసినా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతల సాక్షితో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన, నారా లోకేష్ కక్ష పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధిస్తున్నారు. గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఏమీ లేదు. కావాలనే ఈ కేసులో పోలీసులు ఇరికించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశాం. ఇవాళ ఉదయాన్నే మా ఇంటిని వచ్చిన పోలీసులు.. తలుపులు మూసేసి దౌర్జన్యంగా వ్యవహరించారు. పైన దేవుడు ఉన్నాడు.. అందరికీ కుటుంబాలు ఉన్నాయి. దేవుడు అన్నీ చూసుకుంటాడు. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ మాట్లాడుతూ..‘పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి. మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సహా ఆయన సోదరుడు జోగి రాము, ఆయన సహచరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
నీకు భార్య, పిల్లలు ఉన్నారు కదా.. జోగి రమేష్ అరెస్ట్ పై భార్య ఎమోషనల్..
-
అరెస్ట్ పై జోగి రమేష్ స్ట్రాంగ్ రియాక్షన్
-
చంద్రబాబు.. అంత భయమెందుకు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని..@ncbn గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్… pic.twitter.com/ros9R1o0xY— YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2025నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబుగారు.. మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబుగారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం’ అని విమర్శలు చేశారు. -
కాశీబుగ్గ ఘటన డైవర్షన్ కోసమే జోగి రమేష్ అక్రమ అరెస్ట్..
-
సీబీఐ ఎంక్వయిరీ వేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి.. బాబు ప్రభుత్వానికి జోగి రాజీవ్ ఛాలెంజ్
-
‘చంద్రబాబు సర్కార్ మరో డైవర్షన్ డ్రామా’
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్ట్ను వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్బాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు‘‘మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు. దానిపై జోగి రమేష్ చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిప ప్రమాణంపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వెఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్లు’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లేని లిక్కర్ స్కామ్లు సృష్టించారు. కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను వైఎస్సార్సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు జోగి రమేష్ కోరారు. దానిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణకు రాకముందే జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారు. కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట.. పలువురి దుర్మరణం. మోంథా తుపాన్ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం. రెండింటి నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ అరెస్ట్. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులు అరెస్ట్ లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్ను ఇరికించి అరెస్టు చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
బాబు డైవర్షన్ డ్రామా.. 18 నెలల్లో ఎన్ని కథలంటే?
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ మరో డైవర్షన్ డ్రామాకు తెరలేపింది. శ్రీకాకుళంలోని కాశీబుగ్గ తొక్కిసలాట డైవర్ట్ కోసం మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. గతంలో పలుమార్లు కూటమి సర్కార్పై ప్రజాగ్రహం వచ్చిన ప్రతీసారి బాబు డైవర్షన్ డ్రామాలకు తెరలేపారు. దీంతో, డైవర్షన్ పాలిటిక్స్లో మాస్టర్గా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని సోషల్ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు వైఫల్యం చెందినా చంద్రబాబు డైవర్షన్ డ్రామాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ప్లాన్ ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్ను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ పెద్దల ప్లాన్ ప్రకారం జోగి రమేష్ అరెస్ట్ జరిగింది. జోగి రమేష్ను అరెస్ట్ చేస్తామని మంత్రులు ఇప్పటికే చాలాసార్లు పలు మీడియా సమావేశాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ను అరెస్ట్ చేశారు. 18 నెలల కాలంలో బాబు డైవర్షన్లు..2024లో విజయవాడ వరదల్ని డైవర్ట్ చేసేందుకు బ్యారేజీని బోట్లతో ఢీకొట్టబోయారంటూ చంద్రబాబు డ్రామా.వంద రోజుల పాలన పూర్తి అయిన సమయంలో తిరుమల లడ్డు కల్తీ డ్రామా.ఉచిత గ్యాస్పై ప్రజలు ప్రశ్నిస్తున్నారనగానే రూ.14 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం.గత డిసెంబర్ తుపాను సమయంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేషన్ తనిఖీల పేరుతో హడావుడి.తిరుపతి తొక్కిసలాటకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, ఎస్పీని వదిలేసి సంబంధం లేని అధికారులపై చర్యలు.చంద్రబాబు దావోస్ పర్యటన ఫెయిల్యూర్ను డైవర్ట్ చేసేందుకు నీతి ఆయోగ్ రిపోర్టు పేరుతో నాటకాలు.ఫిబ్రవరిలో ఏపీలో రిజిస్ట్రేషన్ల బాదుడు నుంచి డైవర్ట్ కోసం వంశీ అరెస్ట్.కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయంపై దృష్టి మరల్చేందుకు పోసాని అక్రమ అరెస్ట్.ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్కు గుండుసున్నా పెట్టారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు లిక్కర్ కేసును తెర మీదకు తెచ్చారు.సింహాచలం చందనోత్సవం వైఫల్యం నుంచి తప్పించుకునేందుకు మిథున్ రెడ్డిపై కేసు. డైవర్షన్లో భాగంగా కాకాణి గోవర్థన్పై అక్రమ కేసు. ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ అరెస్ట్తో డైవర్షన్. కక్ష సాధింపులో భాగంగా..మరోవైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రశ్నలు గుప్పిస్తున్న, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు కూడా ఉన్నారు. వాళ్ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే.. మంత్రి లోకేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని, టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు. -
వైఎస్ఆర్ సీపీ నేత జోగి రమేష్ అక్రమ అరెస్ట్
-
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
జోగి రమేష్ అరెస్ట్ అప్డేట్స్.. 6వ అడిషనల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జోగి రమేష్ను హాజరు పరిచిన ఎక్సైజ్ పోలీసులుజీజీహెచ్ ఆసుపత్రిలో జోగి రమేష్, రాముకు వైద్య పరీక్షలు పూర్తి, ఆసుపత్రి నుంచి కోర్టుకు తరలింపుఆసుపత్రి వద్ద కన్నీటి పర్యంతమైన జోగి రమేష్ సతీమణి శకుంతలాదేవివైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్న పోలీసులుజీజీహెచ్ ఆసుపత్రికి భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులుపోలీసులు, ప్రభుత్వ తీరుపై వైసీపీ కార్యకర్తలు ఫైర్జోగి రమేష్కు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలువైఎస్ఆర్సిపి కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులుకాసేపట్లో జోగి రమేష్కు వైద్య పరీక్షలుజీజీహెచ్లో జోగి రమేష్, జోగి రాములకు వైద్య పరీక్షలుజోగి రమేష్ ఇంట్లో ముగిసిన సోదాలు..ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ముగిసిన APFSL EVIDENCE RESPONSE TEAM సోదాలుసీసీ కెమెరాలు , ల్యాప్ టాప్లు పరిశీలించిన ఫోరెన్సిక్ టీమ్రెండు గంటలకు పైగా కొనసాగిన తనిఖీలుజోగి రమేష్ మొబైల్స్, ఆయన సతీమణి ఫోన్, ఇద్దరు కుమారులకు చెందిన ల్యాప్ ట్యాప్లు, సీసీకెమెరా ఫుటేజ్ హార్డ్ డిస్క్ స్వాధీనంజోగి రమేష్ ఇంట్లో తనిఖీల అనంతరం జోగి రమేష్ సోదరుడు రాము ఇంటికి వెళ్లిన తనిఖీల బృందంజోగి రమేష్ సహా మరో ఇద్దరు అరెస్ట్..విజయవాడ..మాజీ మంత్రి జోగి రమేష్ సహా మరో ఇద్దరిని అక్రమ అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు.జోగి రమేష్తో పాటు అతని సోదరుడు జోగి రాము అక్రమ అరెస్ట్జోగి రమేష్ ప్రధాన అనుచరుడు అరేపల్లి రాము అరెస్ట్భవానిపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న అధికారులుమాజీ మంత్రి జోగి రమేష్ కామెంట్స్..చంద్రబాబు రాక్షసానందం పొందడానికే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.తప్పు చేయలేదని నా భార్య, పిల్లల మీద ప్రమాణం చేశాను.అయినా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేసేందుకు కుట్ర ఇది.అందుకే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ తరలింపు..మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసిన సిట్ అధికారులుజోగి రమేష్కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన సిట్విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలింపుజోగి రమేష్ సోదరుడు రామును సైతం అరెస్ట్ చేసిన పోలీసులు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆగ్రహం.జోగి రమేష్ అరెస్ట్పై వైఎస్సార్సీపీ నేతల ఆందోళనప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నిరసనజోగి రమేష్ అరెస్ట్..మాజీ మంత్రి జోగి రమేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జోగి రమేష్కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.మాజీ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్న పోలీసులుఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు. జోగి రమేష్ అరెస్ట్ను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళన. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కామెంట్స్..పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు.మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు.చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య.నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి.మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. 👉మాజీ మంత్రి జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు తెల్లవారుజామునే భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి వద్దకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. 👉మాజీ మంత్రి జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం ఓవరాక్షన్కు దిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను ఇరికించే కుట్రకు తెరలేపింది. ఏ1 జనార్థనరావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయనను ఇరికించేందుకు ప్లాన్ చేశారు. నకిలీ మద్యం మాఫియా నడిపిన టీడీపీ నేతలను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్పై అక్రమ కేసు పెట్టింది.👉అయితే, ఇప్పటికే నకిలీ మద్యం విషయంలో సీబీఐ విచారణ జరపాలని జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన వెంటనే జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకోవడం విశేషం. కాగా, ఏ1 జనార్థనరావు రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ ప్రస్తావన లేకపోవడం ఈ కేసులో కీలక పరిణామం. జనార్థనరావు జైలుకి వెళ్లాక కుట్ర పూరితంగా ఓ వీడియో విడుదల చేశారు. పోలీసుల అదుపులో ఉన్నప్పుడు వీడియో రికార్డింగ్ చేసి ఎల్లో మీడియా, టీడీపీ ఆఫీస్ ద్వారా వీడియోను బయటకు వదిలారు.👉కాగా, నకిలీ లిక్కర్ డాన్ జనార్థనరావు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జనార్థనరావుతో టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన బావమరిదికి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో టీడీపీ ఎమ్మెల్యే వసంతను జనార్థనరావు కలిశారు. జనార్థనరావు సమక్షంలోనే తంబళ్లపల్లె జయచంద్రారెడ్డికి చంద్రబాబు బీఫామ్ కూడా ఇచ్చారు. చంద్రబాబుతో ఏ1 జనార్థనరావు దిగిన ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. కాగా, నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలను తప్పించి కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ నేతలపైకి కేసు డైవర్షన్ చేసింది. సీఎం చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టిన తర్వాత జోగి రమేష్ పేరు తెరపైకి తెచ్చారు. సిట్ వేసిన వెంటనే జనార్థనరావు వీడియోను విడుదల చేశారు. ఎల్లో స్క్రిప్ట్ ప్రకారం నకిలీ లిక్కర్ విచారణ కట్టుకథను అమలు చేస్తున్నారు. ఇక, మద్యం ఫ్యాక్టరీ పెట్టిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని, ఆయన బావ మరది గిరిధర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. -
Jogi Ramesh: లోకేష్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు
-
‘చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకో’
సాక్షి,అమరావతి: చంద్రబాబు,నారా లోకేష్ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం (అక్టోబర్31) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బాహ్య ప్రపంచానికి చూపించాను.చంద్రబాబు,నారా లోకేష్ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారు. కల్తీ మద్యం కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాను. నార్కో ఆనాలసిస్ టెస్ట్కు సిద్ధమే. నేను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా కుటుంబసభ్యులతో కలిసి ప్రమాణం చేశా. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని, వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటారా? గన్నవరం ఎయిర్పోర్టులో జనార్ధన్ రావుకు రెడ్కార్పెట్ వేసి స్వాగతం పలికారు. రిమాండ్లో ఉన్న జనార్ధన్రావు వీడియోని ఎవరు విడుదల చేశారని ప్రశ్నించారు. -
చంద్రబాబూ, లోకేశ్ ప్రమాణానికి మీరు సిద్ధమా?
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని.. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ సిద్ధమా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ సవాల్ విసిరారు. పది రోజుల కిందటే సత్య ప్రమాణానికి రావాలని చంద్రబాబు, లోకేశ్ను కోరినా రాలేదని ఎద్దేవా చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేయాలని కోరినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా వారు సత్యప్రమాణానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నార్కోఎనాలసిస్, లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు.‘బెజవాడ దుర్గమ్మ, కృష్ణమ్మ సాక్షిగా చెబుతున్నా. నిబద్ధత, నిజాయితీ, నిండు మనస్సుతో చెబుతున్నా. నకిలీ మద్యం కేసులో నా ప్రమేయం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు. నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు. కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రికి జోగి రమేష్ సోమవారం కుటుంబ సమేతంగా వచ్చారు. తొలుత దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ జోగి రమేష్ తన చేతిలో కర్పూరం వెలిగించుకుని నకిలీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని సత్యప్రమాణం చేశారు. ‘నకిలీ మద్యం కేసులో ఆరోపణలు నా హృదయాన్ని గాయపరిచాయి. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నా. నాపై సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కక్షగట్టారు. ఎక్కడో జరిగిన అంశాన్ని నాకు అంటగడుతున్నారు’ అని జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి సంబంధం ఉందో ఆ మంత్రికే తెలుసు ‘ఎవడో ఇబ్రహీంపట్నంలో పుట్టినవాడు చెప్పింది విని నకిలీ మద్యం కేసులో నన్ను దోషి అంటున్నారు. కానీ రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు. నకిలీ మద్యం వ్యవహారంతో ఎవరికి సంబంధం ఉందో జనార్దనరావుకు ఎయిర్పోర్టులో రెడ్ కార్పెట్ వేసిన మంత్రికి తెలుసు. నేను తప్పు చేశానని సిట్ అధికారులు నిరూపిస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా. నన్ను రాజకీయంగా దెబ్బకొట్టండి. కానీ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవద్దు. ఎంత బెదిరించినా రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో చంద్రబాబుపై పోరాటాన్ని ఆపేది లేదు’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు -
తప్పు చేసానని నిరూపిస్తే.. చావడానికైనా సిద్ధం
-
దుర్గమ్మ సాక్షిగా జోగి రమేష్ ప్రమాణం
-
దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేష్ సత్యప్రమాణం
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నంత పని చేశారు. విజయవాడ కననదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన.. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకుని ఈ వ్యవహారంలో తనకే సంబంధం లేదని అన్నారు.నా వ్యక్తిత్వంపై నింద వేశారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూశారు. నా మనసును బాధ పెట్టారు. అందుకే కుటుంబంతో సహా వచ్చా. నేను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశా. నా కుటుంబాన్ని అవమానపరిచి నా హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకున్నా. నేను ఏ తప్పు చేయను చేయలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి బెజవాడ దుర్గమ్మ పై ప్రమాణానికి నేను సిద్ధమని నేను చెప్పాను. ఆ సవాలకు కట్టుబడి నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేశారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్ , లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధం అని అన్నారాయన. ‘‘నకిలీ మద్యం కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం చెబుతారు?. నాపై తప్పుడు ఆరోపణలు చేసినవాళ్లు సత్యప్రమాణానికి సిద్ధమా?. పోనీ.. లైడిటెక్టర్ టెస్టుకైనా వచ్చే దమ్ముందా?. కనక దుర్గమ్మ సాక్షిగా వాళ్లు నేను తప్పు చేసినట్లు నిరూపించాలి’’ అని జోగి రమేష్ మరోమారు సవాల్ విసిరారు. -
కొలికపూడి, కేశినేని చిన్ని గొడవపై జోగి రమేష్ రియాక్షన్
-
పవన్ కళ్యాణ్ సిగ్గుపడు.. జగన్ గొప్పతనం గురించి మీ అన్నను అడుగు చెప్తాడు
-
మైలవరం లోనే ఉంటా.. మీకు దమ్ముంటే.. కూటమిపై జోగి రమేష్ ఫైర్
-
నీ రాక్షసానందం కోసం ఎంతకు దిగజారిపోయావు బాబు..
-
‘లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. ఎక్కడికి రమ్మన్నా వస్తా’
హైదరాబాద్: నకిలీ మద్యం, నకిలీ సారాలో చంద్రబాబు సర్కార్ మునిగిపోయిందని విమర్శించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. ఫేక్ ప్రభుత్వం,. ఫేక్ బాబు, ఫేక్ లోకేష్.. కట్టు కథలు, పచ్చి అబద్ధాలు ఇవే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం, అక్టోబర్ 19వ తేదీ) హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘బాబు చేసిన కల్తీని వైఎస్సార్సీపీపై రుద్దే యత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం చేసే ఐవిఆర్ఎస్ కాల్స్ ను నకిలీ మద్యం కోసం టీడీపీ వాడుతుంది. నకిలీ మద్యం ఎక్కడ తయారయింది... ఎక్కడకు సరఫరా అయిందో ఎందుకు ఎంక్వరీ చేయడం లేదు.డైవర్షన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మాపై విమర్శలు చేస్తుంది. అద్దెపల్లి జనార్థన్కు రెడ్ కార్పెట్ వేసింది టీడీపీ ప్రభుత్వమే. అద్దెపల్లి జనార్థన్, టీడీపీ కుమ్మక్కయ్యాయి. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పినా ప్రభుత్వం నంచి స్పందనలేదు. జైలుకు పంపించి రాక్షసానందం పొందడం బాబుకు అలవాటు. దమ్ముంటే నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి. ప్రభుత్వం ఎక్కడికి రమ్మన్నా.. వస్తా. ఏపీలో మంచినీటి ుకుళాయిల కన్నా.. బెల్ట్ షాపులే ఎక్కువ. నారా వారి సారా పాలనను డోర్ డెలివరీ చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
నకిలీ మద్యం కేసులో ఉన్నది లోకేష్, ఎంపీ: దేవినేని అవినాష్
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్. తప్పుడు కేసులతో బీసీ నాయకుడు జోగి రమేష్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ పార్టీ నేతలే అని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.జోగి రమేష్ ను కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్(Devineni Avinash) గురువారం ఉదయం జోగి రమేష్ను(Jogi Ramesh) కలిశారు. ఈ క్రమంలో ఆయనపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. అనంతరం, దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 15 నెలలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులతో జోగి రమేష్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలను జోగి రమేష్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్కు వైఎస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ వేయాలని జోగి రమేష్ ధైర్యంగా అడిగారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ నేతలే. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్(Nara Lokesh), మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు. జయచంద్రారెడ్డి, జనార్ధన్ రావు నెలనెలా మామూళ్లు చినబాబు, వసంత కృష్ణప్రసాద్, ఎంపీ చిన్నికి పంపించారు. టీడీపీ నేతలు దొరికిపోవడంతో వైఎస్సార్సీపీపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ పెట్టిన తప్పుడు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం.పోలీసులు కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ సెక్షన్లను వైఎస్సార్సీపీ(YSRCP) నేతలపై పెడుతున్నారు. టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్ కమిషనర్ కలవలేదు. అదే టీడీపీ నుంచి చోటా మోటా నేతలు వెళితే సీపీ వారిని కలిశాడు. పోలీస్ కమిషనర్ ప్రజల కోసం పనిచేస్తున్నారా? టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారా?. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం బుద్ధా వెంకన్న ఆరాటపడుతున్నాడు. వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేస్తే పదవులు వస్తాయని బుద్ధా వెంకన్న అనుకుంటున్నాడు అని ెసెటైరికల్ కామెంట్స్ చేశారు. -
Jogi: సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న అసత్య వార్తలపై YSRCP ఫిర్యాదు
-
చంద్రబాబు, లోకేష్కు జోగి రమేష్ సవాల్
సాక్షి, విజయవాడ: తనపై వస్తున్న ఫేక్ వార్తలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆయన వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనార్థన్తో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లై డిటెక్టర్ టెస్టుకు రెడీ అని సవాల్ చేసి రెండ్రోజులవుతోంది. మళ్లీ చెబుతున్నా లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. చంద్రబాబు, లోకేష్ రెడీనా?. చంద్రబాబు మరి ఇంత దారుణంగా దిగజారిపోయాడు. రిమాండ్లో ఉన్న జనార్థన్రావుతో వీడియో రికార్డ్ చేశారు. బలహీనవర్గానికి చెందిన నన్ను జైల్లో వేయాలని చూస్తున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. ఇబ్రహీంపట్నం నడిబొడ్డున ఉండి మాట్లాడుతున్నా.. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు’’ అని జోగి రమేష్ నిప్పులు చెరిగారు. -
ఫేక్ గాళ్ల కుట్రలు.. లై డిటెక్టర్ టెస్టుకి రెడీ: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్రావుతో తనకు సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఈ విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన విషయం తనకు లేదని.. అయితే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో లై డిటెక్టర్ పరీక్షలకు కూడా తాను సిద్ధమని అన్నారాయన. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నారావారి సారాను చంద్రబాబు ఏరులై పారిస్తున్నారు. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమల్లా నడిపిస్తున్నారు. టీడీపీ నేత జనార్దన్రావుతో నేను ఎలాంటి చాటింగ్ చేయలేదు. అది నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని జోగి రమేష్ అన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ మీద కూడా ప్రమాణం చేస్తా. చంద్రబాబు ఇంట్లో కూడా ప్రమాణానికి నేను సిద్ధం. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి వస్తారా?. అవసరమైతే సత్య శోధన పరీక్ష(లై డిటెక్టర్)కు నేను సిద్ధం. నా సవాల్ను చంద్రబాబు స్వీకరిస్తారా? అని జోగి రమేష్ నిలదీశారు.నా ఫోన్ ఇస్తా చంద్రబాబు, లోకేష్ చెక్ చేస్కోండి. ఓ గౌడ కులస్థుడి మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. నీది ఓ బతుకేనా చంద్రబాబు?నా పేరు రిమాండ్ రిపోర్టులో ఉందా?.. ఫేక్ గాళ్లు కుట్రలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారాయన.ఇదీ చదవండి: బాబు డైరెక్షన్.. జనార్దన్ యాక్షన్! -
నా భార్య పిల్లలతో నీ ఇంటికి వస్తా.. నువ్వు, నీ కొడుకు సిద్ధమా..?
-
Jogi Ramesh: నాపై దాడికి ప్లాన్..!
-
జోగి రమేషే ఎందుకు? అనలిస్ట్ పాషా సంచలన నిజాలు
-
చంద్రబాబు డైరెక్షన్తోనే జనార్దనరావుతో వీడియో రికార్డింగ్
రాజమహేంద్రవరం రూరల్: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇందులో భాగంగానే ఈ కేసులో అరెస్టయి, రిమాండులో ఉన్న నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుతో వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ పేరును చెప్పిస్తూ వీడియో లీక్ చేయించారని అన్నారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.మంగళవారం రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో వేణు మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకులు వరుసగా అరెస్టవుతున్నా, సిగ్గు లేకుండా వైఎస్సార్సీపీకి ఈ బురద అంటించాలనే కుట్రతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ మిథున్రెడ్డి కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, దీంతో భయపడ్డ చంద్రబాబు దీనిని డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ పేరును తెరపైకి తీసుకువచ్చారన్నారు. హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించి ‘దీనిలో కుట్రకోణం ఉంది.దాని కోసం సిట్ వేశాను. కొత్త పాత్రలను ప్రజలకు చూపిస్తాను’ అన్నట్టుగా చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వెంటనే జనార్దనరావు వీడియో విడుదలైందన్నారు. జోగి రమేష్ చెప్తేనే తాను నకిలీ మద్యం రాకెట్ నడిపించానంటూ ఈ వీడియోలో అతడు ఆరోపించాడన్నారు. సీఎం తన అనుకూల అధికారులతో వేసిన సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగదని స్పష్టం చేశారు. ఈ సందేహాలకు బాబే జవాబు చెప్పాలి ‘జుడీషియల్ రిమాండ్లో ఉన్న జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? అంతకుముందే ఆయన తన ఫోన్ పోయిందని పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఫోన్లేని వ్యక్తి వీడియో ఎలా రికార్డ్ చేశాడు? జుడీషియల్ రిమాండ్లో ఉండే ఈ వీడియో రికార్డ్ చేశాడని భావించినా, ఆయనను విచారించే అధికారులు చుట్టూ ఉంటారు. ఆయన నిలబడి, వినమ్రతతో మాట్లాడతాడు. కానీ.. ఈ వీడియో చూస్తే ఆయన చాలా స్వేచ్ఛగా కుర్చీలో కూర్చుని ఉన్నట్టు, పక్కనుంచి ప్రాంప్టింగ్ తీసుకుంటూ మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రికార్డ్ చేసిన వీడియోగా కూడా దీనిని భావించే పరిస్థితి కనిపించడం లేదు.అందువల్ల జనార్దనరావుతో ఉద్దేశపూర్వకంగానే కావాల్సిన విధంగా చెప్పించి, వీడియో చిత్రీకరించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సందేహాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి’ అని వేణు అన్నారు. జైలులో రిమాండులో ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేసి, బయటకు విడుదల చేశారంటే, దీనికి ఏ అధికారి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జోగి రమేష్ కు జనార్దనరావు సన్నిహితుడంటూ ఓ కట్టుకథ అల్లారన్నారు. 2024లో తంబళ్లపల్లి టీడీపీ అభ్యరి్థగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు బి–ఫామ్ ఇచ్చిన సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బదులు జనార్దనరావు ఉన్నాడన్నారు.ఈ ఫొటోలు కూడా అన్ని పత్రికల్లోనూ వచ్చాయన్నారు. దీనినిబట్టి జనార్దనరావు ఎవరికి అత్యంత సన్నిహితుడో ప్రజలే అర్థం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ, భరోసా లేకపోతే అంత ధీమాగా ఒక కేసులో నిందితుడు ఆఫ్రికా నుంచి ఆవిధంగా వస్తాడా అని ప్రశ్నించారు. తొలుత ఆయన ఆఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో నకిలీ మద్యం వ్యవహారంలో ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదని చెప్పాడన్నారు. రిమాండ్కు వెళ్లిన తరువాత జనార్దనరావు మాట ఎలా మారిందని ప్రశ్నించారు. -
ఈ ప్రశ్నలకు జవాబేది?
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నకిలీ మద్యం రాకెట్ వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే విషయం బట్టబయలు కావడంతో ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే యత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు.. ఇద్దరూ కలిసిపోయి సాగిస్తున్న నాటకాలు, కుతంత్రాలే అసలు కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అందరి చూపులు.. అన్ని వేళ్లూ టీడీపీ వైపే చూపుతున్న నేపథ్యంలో పలు కీలక ప్రశ్నలకు సమాధానం కరువైంది. నకిలీ మద్యం మాఫియాపై ప్రభుత్వంగానీ, పోలీసులుగానీ సూటిగా సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రధానంగా కింది ప్రశ్నలకు పోలీసులు, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ⇒ ఏ1 జనార్దన్రావును అరెస్టు చేసి విచారించిన తరువాతే న్యాయ స్థానంలో హాజరు పరిచారు. పోలీసులు తమ విచారణలో వెల్లడైన విషయాలతో రిమాండ్ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఆ రిమాండ్ నివేదికలో ఎక్కడా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పేరును ప్రస్తావించనే లేదు. జనార్దన్రావుకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. మరి 24 గంటల తరువాత జోగి రమేష్ పేరు చెబుతూ జనార్దన్రావు వీడియో బయటకు రావడం వెనుక దాగిన గుట్టు ఏమిటి? నిజంగా జోగి రమేష్ పేరును ఆయన చెప్పి ఉంటే ఆ విషయాన్ని న్యాయ స్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలోనే వెల్లడించే వారు కదా! మరి ఆ వీడియో కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ⇒ ప్రభుత్వ ఆదేశాలతోనే ఎక్సైజ్ అధికారులు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం గోడౌన్లో సోదాలు చేసి జప్తు చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వమే చేయించిందని ఆయన గొప్పగా చెప్పుకున్నారు. కానీ జనార్దన్రావుతో చెప్పించిన వీడియోలో అందుకు పూర్తి విరుద్ధంగా ఎందుకు ఉంది? టీడీపీ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే జోగి రమేష్ ఆదేశాలతో నకిలీ మద్యాన్ని తెప్పించి.. అనంతరం ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చి దాడులు చేయించారని జనార్దన్రావుతో ఎందుకు చెప్పించారు? నకిలీ మద్యం దందాలో టీడీపీ పెద్దల పాత్రను కప్పిపుచ్చేందుకే ఈ కట్టు కథలతో అడ్డంగా దొరికారన్నది నిజం కాదా? ⇒ విదేశాలకు వెళ్లిపోతే తనకు రూ.3 కోట్లు ఇస్తామని వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఆఫర్ ఇచ్చారంటూ ఏ1 జనార్దన్రావుతో ప్రభుత్వ పెద్దలు వీడియో ద్వారా చెప్పించారు. మరి అంతలోనే ఆయన ఎందుకు ఆంధ్రప్రదేశ్కు వచ్చారు? తన తమ్ముడిని పట్టించుకోవడం లేదని మరో కట్టు కథ ఎందుకు చెబుతున్నారు? అంటే జోగి రమేష్ రూ.3 కోట్లు ఇస్తానన్నట్లు వీడియోలో ఆయన చెప్పింది పూర్తిగా అవాస్తవమే కదా.. ఈ లెక్కన ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఆయన రాష్ట్రానికి వచ్చి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవం కాదా? ⇒ ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టు చేసిన వారిని 24 గంటల్లోనే పోలీసులు కస్టడీలో విచారించేందుకు న్యాయస్థానాన్ని అనుమతి కోరారు. మరి ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్దన్రావును కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు ఎందుకు భావించడం లేదు? ⇒ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్దన్రావును విదేశాల నుంచి రాష్ట్రానికి రప్పించిన ప్రభుత్వ పెద్దలు.. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఎందుకు రాష్ట్రానికి రప్పించడం లేదు? లుక్ అవుట్ నోటీసు జారీలో తాత్సారం ఎందుకు? ఆయన అరెస్టుకు ఎందుకు యత్నించడం లేదు? ⇒ అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం యూనిట్ నుంచి నకిలీ మద్యాన్ని పాల వ్యానుల ద్వారా సరఫరా చేసినట్టు వెల్లడైంది. ఆ వ్యానులు టీడీపీ నేతలవే. ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి కూడా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక వాహనాల్లో నకిలీ మద్యాన్ని సరఫరా చేశారు. ఆ వాహనాలు ఎవరివి అన్నది పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాటిని జప్తు చేయకుండా పోలీసులను అడ్డుకుంటున్న పెద్దలు ఎవరు? ⇒ నకిలీ మద్యం దందా బయటపడిన తరువాత కూడా రాష్ట్రంలో దాదాపు 75 వేల బెల్టు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు ఎందుకు దాడులు చేయడం లేదు? బెల్ట్ దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని ఎందుకు జప్తు చేయడం లేదు? దాన్ని పరీక్షల కోసం ల్యాబ్లకు ఎందుకు పంపడం లేదు? ⇒ రాష్ట్రంలో అసలు నకిలీ మద్యమే లేదని.. మద్యం దుకాణాల్లో నకిలీ సరుకు అమ్మడమే లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరి అంతలోనే ఎందుకు ‘ఏపీ ఎక్సైజ్ యాప్’ను ప్రవేశ పెట్టారు? నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఆ యాప్పై అవగాహన కల్పించాలని ఎందుకు చెబుతున్నారు? అంటే టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అధికారికంగా అంగీకరించినట్లే కదా? ⇒ టీడీపీ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీలు, టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు, బార్లలో ఎందుకు తనిఖీలు చేయడం లేదు? అంటే నకిలీ మద్యం కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి ప్రభుత్వ పెద్దలు తప్పించుకోవాలని యతి్నస్తున్నట్లు కాదా? ⇒ నకిలీ మద్యం దందాతో ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేకపోతే డైవర్షన్ డ్రామాలు ఎందుకు? ఏ1 జనార్దనరావుతో గుర్తు తెలియని ప్రదేశంలో ఓ వీడియో షూట్ చేయించడం ఎందుకు? కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో ఆ వీడియో గురించి ఎందుకు ప్రస్తావించ లేదు? ఆ వీడియో డ్రామా బెడిసి కొట్టగానే.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి నివాసంలో సిట్ సోదాలతో హడావుడి ఎందుకు? ఇవన్నీ ఈ కేసు దర్యాప్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడలు కావా? -
డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం అవినీతి కూపంలో నిలువెల్లా కూరుకుపోయిన టీడీపీ పెద్దలు సరికొత్త డైవర్షన్ కుతంత్రాలకు పదును పెడుతున్నారు. బరి తెగించి నకిలీ మద్యం దందాకు పాల్పడిన వారే ఆ బురదను అందరికీ అంటించే కుట్రలు పన్నుతున్నారు. అందుకోసం టీడీపీ పెద్దల డైరెక్షన్లో చిత్రీకరించిన ‘పొలిటికల్ సోషియో ఫాంటసీ’ కుట్ర ఇప్పటికే బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్పై దు్రష్పచారం చేసేందుకు పన్నిన కుతంత్రం ఫలించ లేదు. దాంతో మరోసారి టీడీపీ వీర విధేయ సిట్ను రంగంలోకి దించి తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాల పేరిట హడావుడి చేయించారు. టీడీపీ సిండికేట్ కల్తీ మద్యం మాఫియా బాగోతం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ చౌకబారు ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది. తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి ద్వారా వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి ఇదంతా చేయించారంటూ తొలుత ఎల్లో మీడియా రంకెలేసింది! అయితే తమ దాడులతోనే నకిలీ మద్యం రాకెట్ బయట పడిందని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఇదంతా చేయించారంటూ జనార్ధన్రావుతో ప్రభుత్వ పెద్దలు చిలుక పలుకులు వల్లె వేయించారు. నిజానికి పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు. మరి 24 గంటల తరువాత జోగి రమేష్ పేరు చెబుతూ జనార్ధన్రావు వీడియో బయటకు రావడం వెనుక లోగుట్టు ఏమిటి? ఆ వీడియో కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా నకిలీ మద్యం పాపం వైఎస్సార్సీపీదేనని ప్రచారం చేయాలంటూ కూటమి ఎంపీలతో ఢిల్లీలో సమావేశం సందర్భంగా చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ కుట్ర అట్టర్ ఫ్లాప్ టీడీపీ పెద్దలే సూత్రధారులుగా పచ్చ సిండికేట్ సాగిస్తున్న నకిలీ మద్యం రాకెట్ కేసును పక్కదారి పట్టించేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. అడ్డంగా దొరికిపోయిన ప్రతిసారీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడే ప్రభుత్వ పెద్దలు ఈసారి మరీ చౌకబారు ఎత్తుగడ వేసి నవ్వుల పాలయ్యారు. డైవర్షన్ కుట్రలో భాగంగానే ఈ కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్రావుతో చెప్పించిన వీడియో టీడీపీ పెద్దల నేలబారు రాజకీయాన్ని బయటపెట్టింది. ఏం చెప్పాలో పోలీసులే పక్కనుంచి ప్రాంప్టింగ్ అందిస్తుండగా.. జనార్దన్రావు వల్లె వేసిన మాటలను చిన్నపిల్లలు కూడా నమ్మడం లేదన్నది స్పష్టమైంది. ఎల్లో మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో డ్రామా టీడీపీ పెద్దల దిగజారుడుతనాన్ని బయటపెట్టింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు జనార్దన్రావుతో నిబంధనలకు విరుద్ధంగా వీడియో రికార్డ్ చేయించి విడుదల చేశారన్నది నిగ్గు తేలింది. అంతేకాదు.. ములకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం మాఫియా రాష్ట్రమంతా విస్తరించిందన్నది తేటతెల్లమైంది. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్ కేవలం పాత్రధారులేనని, ఈ వ్యవస్థీకృత దోపిడీకి కర్త, కర్మ, క్రియ అంతా ప్రభుత్వ పెద్దలేనన్నది రూఢీ అయ్యింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్ ఏర్పాటు చేసిన నకిలీ మద్యం ప్లాంట్లో యంత్రాలు, క్యాన్లు (ఫైల్) సిట్ ద్వారా మరో డైవర్షన్ డ్రామా... ఏ 1 జనార్దన్రావు వీడియో డ్రామా ఎపిసోడ్ బెడిసికొట్టడంతో ప్రభుత్వ పెద్దలు వెంటనే మరో కుట్రకు పదును పెట్టారు. ఏడాదికిపైగా రెడ్బుక్ రాజ్యాంగ కుట్రలు అమలు చేస్తున్న తన సిట్ను రంగంలోకి దింపారు. వీడియో డ్రామా ద్వారా జోగి రమేష్ను లక్ష్యంగా చేసుకుని భంగపడ్డ టీడీపీ పెద్దలు.. ఈసారి సిట్ ద్వారా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిపై గురి పెట్టారు. ఐక్యరాజ్య సమితి సదస్సుల్లో పాల్గొనే భారత పార్లమెంటరీ బృందంలో సభ్యుడిగా మిథున్రెడ్డి అమెరికాలో పర్యటించేందుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానున్న తరుణంలో డైవర్షన్తో మరోసారి కుట్రలకు తెర తీశారు. మిథున్రెడ్డి కుటుంబానికి చెందిన తిరుపతి, హైదరాబాద్లలోని నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు మంగళవారం సోదాలతో హడావుడి చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధులను విచారించారు. వాస్తవానికి మద్యం విధానంపై అక్రమ కేసులో ఆయన్ను గతంలోనే అరెస్టు చేసి కస్టడీకి కూడా తీసుకుని విచారించారు. ఆ అక్రమ కేసులో సిట్ అధికారులు ఎటువంటి ఆధారాలు సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో మిథున్రెడ్డికి న్యాయస్థానం బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇక ఈ కేసులో ఆయన్నుగానీ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రతినిధులనుగానీ విచారించేందుకు ఏమీ లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. డిస్టిలరీల మాటున నకిలీ దందా.. ఆధారాలతో సహా బట్టబయలైన నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వ పెద్దలు వత్తాసు పలుకుతూ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయకుండా కట్టడి చేస్తున్నారు. అసలు నకిలీ మద్యం తయారీకి అవసరమైన ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్) ఎక్కడి నుంచి సరఫరా అయిందన్న అంశంపై పోలీసులు దృష్టి పెట్టకపోవడమే అందుకు నిదర్శనం. ఎందుకంటే.. అత్యంత ప్రమాదకరమైన ఆ స్పిరిట్ను కొనుగోలు చేసేందుకు మద్యం డిస్టిలరీలు, రసాయన పరిశ్రమలకే అనుమతి ఉంది. ఆ స్పిరిట్లో 100 శాతం ఉండే ఆల్కహాల్ను 42 శాతం లోపు తగ్గించి మనుషులు వినియోగించే మద్యాన్ని తయారు చేసే సామర్థ్యం డిస్టిలరీలకే ఉంటుంది. మరి టీడీపీ సిండికేట్ ములకలచెరువుతోపాటు అనకాపల్లి, పాలకొల్లు, ఇతర ప్రాంతాల్లో నెలకొల్పిన నకిలీ మద్యం యూనిట్లకు స్పిరిట్ ఎక్కడ నుంచి సరఫరా జరిగింది? అనేది అత్యంత కీలకంగా మారింది. అంటే.. డిస్టిలరీలే ఆ స్పిరిట్ను కొనుగోలు చేసి అక్రమంగా నకిలీ మద్యం యూనిట్లకు సరఫరా చేశాయని ఎక్సైజ్ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలకు చెందినవే. వాటిలో తనిఖీ చేసి రికార్డులు పరిశీలిస్తే మొత్తం బండారం బయటపడుతుంది. అందుకే ఆ డిస్టిలరీలవైపు కన్నెత్తి చూడవద్దని ప్రభుత్వ పెద్దలు పోలీసు, ఎక్సైజ్ శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. తద్వారా నకిలీ మద్యం మాఫియా వెనుక ఉన్న టీడీపీ బడా బాబుల బండారం బయటపడకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్నది సుస్పష్టం. నకిలీ మద్యం దందాతో అమాయకుల ప్రాణాలను హరిస్తుండటంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో టీడీపీ పెద్దలు ఇలా డైవర్షన్ డ్రామాలతో కుట్రలకు తెర తీస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనార్దన్రావు ఇంట్లో సోదాలు ఇబ్రహీంపట్నం : నకిలీ మద్యం నిందితుడు జనార్దనరావు, ఆయన సోదరుడు జగన్మోహనరావు ఇళ్లల్లో పోలీసులు మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించారు. పోలీసులను వారి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. గంటపాటు మంతనాల తర్వాత లోపలకు అనుమతించారు. మూడు గంటలపాటు పోలీసులు సోదాలు చేశారు.ఎంపీ మిథున్రెడ్డిపై మళ్లీ కక్ష సాధింపుసాక్షి, అమరావతి/తిరుపతి : మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ వేధింపులు కొనసాగిస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి కుటుంబ వ్యాపార సంస్థ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కార్యాలయాల్లో సిట్ అధికారులు మంగళవారం హల్చల్ చేశారు. హైదరాబాద్, తిరుపతిలోని ఆయన నివాసం, కార్యాలయాలకు వెళ్లిన సిట్ బృందాలు ఎంపీ మిథున్రెడ్డి కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలకు సంబంధించిన వివరాలు చెప్పాలంటూ పదే పదే అడిగినట్లు సమాచారం. తిరుపతిలోని ఎంపీ మిథున్రెడ్డి నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయన తల్లి పెద్దిరెడ్డి స్వర్ణలత వాంగ్మూలం నమోదు చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని సిట్ అధికారులు ఇప్పటికే అనేకసార్లు విచారించారు. జుడీషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని సిట్ విచారించింది. ఆయనపై అభియోగాలకు ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడి బెయిల్ మంజూరు చేసింది. కానీ ఎంపీ మిథున్ రెడ్డిపై కక్ష సాధింపుతోనే సిట్ మళ్లీ సోదాలు, విచారణ పేరుతో హడావుడి చేస్తోంది. కూటమి ప్రభుత్వ పెద్దల అండతో సాగుతున్న నకిలీ మద్యం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. అందుకే మిథున్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్పై తీర్పు ఇచ్చే సమయంలో సిట్ సోదాలు చేపట్టడం సందేహాస్పదంగా మారింది. కాగా, ఎంపీ మిథున్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాలు, విచారణపై సిట్ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇంత జరిగినా.. ‘బెల్టు’ తీయరా..? జయచంద్రారెడ్డిని అరెస్టు చేయరా?రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నకిలీ మద్యం 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే మొదలైంది. ఏడాదిన్నరగా సాగుతున్న ఈ దోపిడీపై ఎక్సైజ్ శాఖ ఉదాసీనంగా వ్యవహరించడం అసలు గుట్టును బయటపెట్టింది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో టీడీపీ సీనియర్ నేతలు ప్రాంతాలవారీ పర్యవేక్షకులుగా మారి పక్కాగా దోపిడీని వ్యవస్థీకరించిన తీరే అందుకు నిదర్శనం. ఇక ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాను రాష్ట్రానికి స్వయంగా తెచ్చింది తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, టీడీపీ నేతలు సురేంద్ర నాయుడు, అద్దేపల్లి జనార్దన్రావులే కావడం గమనార్హం. ములకలచెరువు కేంద్రంగా మొదలైన ఈ మాఫియా ఏడాదిలో రాష్ట్రం అంతటా విస్తరించడం విస్మయపరుస్తోంది. అడ్డంగా దొరికిన తరువాత ఏ1 జనార్దన్రావుతో వీడియో డ్రామాకు యత్నించడం ప్రభుత్వ పెద్దల కుట్రను బట్టబయలు చేసింది. నకిలీ మద్యం మాఫియా కుట్రదారు, అంతిమ లబ్ధిదారు టీడీపీ పెద్దలేనన్న వాస్తవాన్ని ఎంతగా దాచాలని యత్నిస్తే.. అంతగా ఆ అవినీతి బాగోతం బట్టబయలవుతోంది. జనార్దన్రావును విదేశాల నుంచి ఆగమేఘాలపై రాష్ట్రానికి రప్పించిన టీడీపీ పెద్దలు.. జయచంద్రారెడ్డిని ఎందుకు రప్పించడం లేదు? ఆయన్ను అరెస్టు చేసేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ మద్యం దందా బయటపడిన తరువాత కూడా రాష్ట్రంలో ఊరూరా విస్తరించిన దాదాపు 75 వేల బెల్టు షాపులను నిర్మూలించకపోవడం.. ప్రజల ప్రాణాలను హరిస్తూ అక్కడ విక్రయిస్తున్న నకిలీ మద్యాన్ని జప్తు చేయకపోవడం.. పరీక్షల కోసం ల్యాబ్లకు పంపకపోవటాన్ని బట్టి టీడీపీ పెద్దల అండదండలతోనే పచ్చముఠాలు నకిలీ దందాతో చెలరేగుతున్నట్లు స్పష్టమైందని పేర్కొంటున్నారు. -
‘కూటమి కల్తీ బురదను జోగి రమేష్కు పూయాలని చూస్తున్నారు’
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ నేతల నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్పై చేస్తున్న కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు ధ్వజమెత్తారు. కూటమి కత్తీ బురదను జోగి రమేష్కు పూయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) జోగి రమేష్ను వెల్లంపల్లి, మల్లాది విష్ణులు కలిశారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రప్రభుత్వం ప్రజలను కల్తీ మద్యంతో వేధిస్తోంది. 16 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది. చిత్తూరు నుంచి వెస్ట్ గోదావరి వరకూ ఎక్కడ చూసినా కల్తీ మద్యమే. టిడిపి అవినీతిని ప్రశ్నిస్తున్నారని తప్పుడు కేసులు పెడుతున్నారు. జోగి రమేష్ను ఇరికించాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ మద్యంలో టిడిపి నేతల పాత్ర ఉంది. అఫిడవిట్లోనే డిస్టిలరీలు ఉన్నాయని జయచంద్రారెడ్డి చెప్పినప్పుడు మీ కళ్లు మూసుకుపోయాయా?’ అని ప్రశ్నించారు.మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ కూటమి నేతల అసత్యాలను ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. బీసీ నేత పైన కావాలని కక్ష సాధిస్తున్నారు. కల్తీ మద్యానికి జోగి రమేష్కు ఏం సంబంధం?, జనార్ధన్ రావుతో వీడియో చేయించి జోగిరమేష్ పైన తోసేశారు. జోగి రమేష్ పై కక్షసాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కచ్చితంగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది’ అని విమర్శించారు. ‘ఎప్పటికీ చంద్రబాబుకు మంచి బుద్ధి రాదని అర్థమైంది’ -
Fake Liquor Case: జోగిరమేష్ ఉగ్రరూపం.. బాబు, లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్
-
లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
ఇబ్రహీంపట్నం: నకిలీ మద్యం కేసు పూర్తిగా తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకోవడంతో సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలపై లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని.. మరి చంద్రబాబు, లోకేశ్లు కూడా సిద్ధమా.. అని సవాల్ విసిరారు. ఇబ్రహీంపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో నిందితుడు అద్దేపల్లి జనార్దన్రావుతో తన పేరు చెప్పించడం ద్వారా చంద్రబాబు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు ఈ కేసులో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా చంద్రబాబేనని స్పష్టం చేశారు. ‘వారం రోజులుగా నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం సిట్ విచారణకు ఆదేశించారు. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. అనేలా సాగేది విచారణ కాదు. నకిలీ మద్యం రాకెట్ బట్టబయలు కావడంతో దిక్కుతోచక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపారు. ఇందులో భాగంగానే నా పేరు తీసుకొచ్చారు. ఈ కేసులో నా పాత్ర ఉంటే నేను ఏ శిక్షకైనా సిద్ధమే’ అని తెలిపారు. ఈ సందర్భంగా జోగి రమేష్ ఇంకా ఏమన్నారంటే.. రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు ‘నకిలీ లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదని నేను దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. నేను నా భార్యా బిడ్డలతో వస్తాను. చంద్రబాబు, లోకేశ్లకు దమ్ముంటే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చి ప్రమాణం చేయగలరా? పోనీ విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేస్తారా? ఈ ఛాలెంజ్కు మీరు సిద్ధమా? కల్తీ మద్యం కేసుతో నాకు ఏ రకమైన సంబంధం లేదు. నారా వారి సారాను రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నారు. ప్రతి మద్యం షాపులో, బెల్టు షాపుల్లో.. చివరకు ఇంటింటికీ రేషన్ పంపిణీలా నకిలీ మద్యాన్ని పంపిస్తున్నారు.ఇదంతా బయట పడటంతో డైవర్షన్ కోసం జనార్దన్తో వీడియో విడుదల చేయించారు. వాస్తవానికి రిమాండ్ రిపోర్టులో నా పేరు ఎక్కడా లేదు. అయినా పోలీసు కస్టడీలో ఉన్న అతనితో నా పేరు చెప్పించడం ద్వారా అత్యంత దిగజారుడు రాజకీయాలకు దిగారు. మీ దుర్మార్గాలను ఎండగడుతున్నానన్న అక్కసుతో ఈ కేసులో నన్ను అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దుష్ట ప్రయత్నం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది.గతంలో చంద్రబాబు ఇంటి దగ్గరకు నేను ప్రశ్నించడానికి బయలుదేరానని, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ నన్ను ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తామని బెదిరిస్తూనే ఉన్నారు. నెలో రెండు నెలలో నన్ను జైలులో పెట్టి మీ క్షణికానందం తీర్చుకున్నంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు. లోకేశ్.. ఎల్లకాలం అధికారంలో ఉంటామని భ్రమల్లో ఉండొద్దు. మీరు సీటు ఇచ్చి తంబళ్లపల్లెలో పోటీకి నిలబెట్టిన జయచంద్రారెడ్డే కల్తీ మద్యానికి ఆద్యుడు. తప్పుడు కేసులకు భయపడేది లేదు ఒక తప్పుడు వీడియోను సృష్టించి, నన్ను జైల్లో పెట్టడం ద్వారా మీ రాక్షసానందం తీరవచ్చు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. దమ్ముంటే ధైర్యంగా నేరుగా ఎదుర్కోండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు.. భయపడేదీ లేదు. మీ దుర్మార్గాలను ఎండగడుతూనే ఉంటాం. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు అత్యంత చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. మీ రెడ్ బుక్కు ఫైర్ పుట్టించడం ఖాయం. దమ్ముంటే నా సవాలుకు స్పందించండి.కల్తీ లిక్కర్ స్కామ్లో అక్రమ మద్యం నిల్వలను స్వయంగా నేను మీడియాకు.. ‘ఇదే నారా వారి సారా’ అని చూపిస్తే, ఈ కేసులో నిందితుడైన జనార్దన్ను అడ్డుపెట్టుకుని నా పేరు మీద వీడియో విడుదల చేయించారు. జనార్దన్తో నాకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. ఇది కేవలం చంద్రబాబు సృష్టించిన కట్టు కథ మాత్రమే. ప్రజలంతా గమనిస్తున్నారు’ అని స్పష్టం చేశారు. -
‘చంద్రబాబూ.. కృష్ణా జిల్లా నా అడ్డా.. నేను ఇక్కడే ఉంటా’
విజయవాడ: టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్న నకిలీ మద్యం కేసులో తన పేరును ఆ కేసులో నిందితుడితో చెప్పించడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కస్టడీలో ఉన్న జనార్థన్రావుతో తన పేరును చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) విజయవాడ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యా బిడ్డల సాక్షిగా ఏ తప్పూ చేయలేదని, నకిలీ మద్యం కేసుతో అసలు తనకు సంబంధమే లేదని స్పష్టం చేశారు. ఈ కథ మొత్తం చంద్రబాబుదేనని, సిట్ చీఫ్కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబే అందిస్తున్నారని మండిపడ్డారు. ‘జనార్ధన్ పిల్లల్ని వేధించి నాపై తప్పుడు కేసులు పెట్టించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పుడు కేసుల్లో ఇరికించారు.లైడిటెక్టర్ పరీక్షలకు నేను రెడీ.. చంద్రబాబు మరి నువ్వు?. నకిలీ లిక్కర్ స్కాం కేసులో నా ప్రమేయం లేదు. నాకు సంబంధం ఉందని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. నా భార్య,పిల్లలతో తిరుమలకు వస్తా. చంద్రబాబు కూడా కుటుంబంతో తిరుమలకు రావాలి. అక్కడ నేను తప్పు చేశానని నువ్వు చెబితే నేను ఏ శిక్షకైనా సిద్దమే. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జనార్ధన్తో నా పేరు చెప్పించారు. రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు. కృష్ణాజిల్లా నా అడ్డా. నేను ఇక్కడే ఉంటా. నాపై చేస్తున్న ఆరోపణల్ని మీ ఇంట్లో వాళ్లు కూడా నమ్మరు’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా -
Jogi: సుబ్బారెడ్డి అన్న జగన్ దమ్ము ఏంటో చెప్పిన వాళ్ళిద్దరికీ సన్మానం చేద్దాం
-
జోగి రమేష్ పై మరో అక్రమ కేసు
-
మాజీ మంత్రి జోగి రమేష్పై మరో అక్రమ కేసు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్పై చంద్రబాబు సర్కార్ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసులో ఏ1 టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావుకు చెందిన గోడౌన్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నిర్వహించగా.. భారీ కల్తీ మద్యం తయారీ డెన్ బయటపడింది.పచ్చ నేత కల్తీ మద్యం డెన్ను పరిశీలించిన మాజీ మంత్రి జోగి రమేష్.. టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించడంతో ఆయనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. తమ విధులకు అడ్డంకి కలిగించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఎక్సైజ్ ఎస్ఐ పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. జోగి రమేష్తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది. -
ప్రజల ప్రాణాలంటే లెక్క లేదు.. ఇది మన MLA వసంత కృష్ణ ప్రసాద్ బాగోతం
-
మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు
-
జగన్ మంచితనం గురించి చిరంజీవిని అడగండి.. పవన్ ను ఏకిపారేసిన జోగి రమేష్
-
ప్రశ్నిస్తే అణచివేస్తారా?.. మైలవరం పీఎస్ ముందు వైఎస్సార్సీపీ ధర్నా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ విభాగం అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో కోటేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. మైలవరం పోలీస్స్టేషన్కు తరలించారు.వైఎస్సార్సీపీ నేత అక్రమ అరెస్ట్పై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఆయనతో పాటు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. మైలవరం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కోటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలంటూ జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఆయన్ని మైలవరం సీఐ కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. -
Jogi: చంద్రబాబుకు వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలు చేయడం అలవాటే
-
Jogi Ramesh: అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగితే.. మహిళపై దాడి చేసిన టిడిపి గూండాలు
-
‘అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగితే దాడి చేస్తారా?’
ఎన్టీఆర్ జిల్లా: అప్పుగా ఇచ్చిన డబ్బును అడిగినందుకు మాధవి అనే మహిళపై టీడీపీ గూండాలు చేసిన దాడిని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. అప్పుగా ఇచ్చిన డబ్బలను అడిగితే దాడి చేస్తారా అంటూ నిలదీశారు. టిడిపి నేతల దాడిలో గాయపడిన మాధవిని జోగి రమేష్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ కూటమిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగితే దాడి చేస్తారా?, మాధవి పై దాడి చేసిన టిడిపి గూండాలు వరికూటి రాము , పవన్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. బాధితురాలికి న్యాయం చేయాలి. బాధితురాలికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని తెలిపారు. -
Jogi Ramesh: TDP నేతల అక్రమ బూడిద - తరలింపునకు వ్యతిరేకంగా ధర్నా
-
జోగి రమేష్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు
-
మరో ఉద్దానంగా ఇబ్రహీంపట్నం.. మా పోరాటం ఆగదు: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు హయాంలో గాలి, నీరు.. మొత్తం కలుషితం అయిపోతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మూలపాడు డంప్ నుంచి టీడీపీ నేతల బూడిద అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఆందోళన చేపట్టిన ఆయన్ని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. భవానిపురం పీఎస్ నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వస్తే ఏ సంస్థ అయిన ప్రవేట్ అవ్వాల్సిందే. బూడిద(ఫ్లై యాష్) టెండర్ ఒక వింగ్గా చేసి లోకేష్ కనుసన్నల్లో ప్రవేట్ చేసేశారు. ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు నీరు, గాలి మొత్తం కలుషితం అయ్యింది. ప్రజలు, థర్మల్ ప్లాంట్లలో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు. వెరసి.. ఇబ్రహీంపట్నం మరో ఉద్దానం గా మారింది. అందుకే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఇబ్రహీంపట్నం నుంచి అక్రమంగా బూడిద నిలువ చేసి హైదరాబాద్కి తరలిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని కోరితే.. అధికారులు మమ్మల్నే అరెస్ట్ చేస్తున్నారు. కనీసం చంద్రబాబైనా స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొంటారా?. వీటీపీఎస్లో బూడిద టెండర్లు తక్షణమే రద్దు చేయాలి. కాలుష్యం భరితంగా మారిగా గ్రామాలను ఆదుకోవాలి. మొక్కలు నాటించి.. చెట్ల సంరక్షణ కొనసాగించాలి. అక్రమ డంప్ని ప్రభుత్వం చేసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తాం అని జోగి రమేష్ అన్నారు. ఇదిలా ఉంటే.. బూడిద రాజకీయాలు ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. టీడీపీ నేతల అక్రమ బూడిద రవాణాను(Ash Mafia) అడ్డుకునేందుకు జోగి రమేష్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. బుధవారం మూలపాడులో బూడిద డంప్ను పరిశీలించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసులు మోహరింపజేసింది. మరోవైపు.. మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చిన పోలీసులు.. అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. తమను అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు మొక్కుతూ నిరసనలు తెలియజేశారు. ఈ పరిణామాలతో జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఆందోళనకు సిద్ధమైన జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమార్జన చేశారన్నది జోగి రమేష్ చెబుతోంది. అంతేకాదు అక్రమ బూడిద నిల్వలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారాయన. అయితే.. జోగి రమేష్ వ్యాఖ్యలపై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జోగి రమేష్ ఇల్లు నేలమట్టం చేస్తా అంటూ అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో అక్కడ రాజకీయ అలజడి రేగింది. -
బూడిద ద్వారా దోచుకున్న అక్రమ డబ్బు మీకా..? వసంత కృష్ణ ప్రసాద్ పై జోగి రమేష్ ఫైర్
-
Jogi Ramesh: అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవడం చేతకాక పనికిరాని మాటలు
-
గణపతి మహోత్సవాల్లో జోగి రమేష్
-
Perni Nani: ఉపఎన్నికలో ఓటుకు పదివేలు.. బాబు పాపపు సొమ్ము వద్దని ఎదురు తిరిగితే
-
Jogi Ramesh: ఇక్కడున్న YSRCP కార్యకర్తలకి మాట ఇస్తున్న..
-
పనికిమాలిన వెధవ.. గుర్తుపెట్టుకో నీకు దమ్ముంటే..
-
YSRCPలో చేరిన టీడీపీ కార్యకర్తలు
-
టీడీపీకి గుడ్బై.. వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
సాక్షి, ఇబ్రహీంపట్నం: ఏపీలో అధికార కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆత్కూరుకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 30 మంది కూటమి ప్రభుత్వ తీరుకు విసుగు చెంది ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. పటాపంచల సాంబశివరావు, పటాపంచల గోపి, గంగుల నాగరాజు, గంగుల బాలాజీ, గంగుల వెంకట్రావు, గంగుల రమేష్ తదితరులకు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ..‘కూటమి పాలన టీడీపీ నేతలకే అసంతృప్తి కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ప్రజలు ఆత్మపరిశీలనలో పడ్డారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యం. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వం చేసిన మోసాల్ని ప్రజల సమక్షంలో ఎండగడతాం. మైలవరం నియోజకవర్గంలో జూన్ నాలుగో తేదీన జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.జూన్ 4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి కూటమి ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైందన్నారు. జి.కొండూరు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ జడ రాంబాబు, ఆత్కూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగుల తిరుపతిరావు అధ్యక్షతన వైఎస్సార్సీపీలో చేరికలు శుభపరిణామమని అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది’
ఎన్టీఆర్ జిల్లా: ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పతనం మొదలైందన్నారు మైలవరం నియోజవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి జోగి రమేష్. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వివరించడానికే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 4వ తేదీన వైఎస్సార్ సీపీ చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఈరోజు(ఆదివారం) పోస్టర్ ను ఆవిష్కరించారు జోగి రమేష్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వ చేసిన మోసాల్ని ప్రజల సమక్షంలో ఎండగడతాం, మైలవరం నియోజకవర్గంలో జూన్ 04 న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. జూన్4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇచ్చిన హామీలన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది. జూన్ 04 న మైలవరం డాక్టర్ లక్కిరెడ్డి హనిమి రెడ్డి కాంప్లెక్స్ వద్ద నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీని జరుగనుంది’ అని జోగి రమేష్ తెలిపారు. -
జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్
-
జోగి రమేష్ తనయుడి వివాహ రిసెప్షన్.. నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం (ఫొటోలు)
-
జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో నూతన వధూవరులు మేఘన, జోగి రాజీవ్లకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. -
Jogi Ramesh: నన్ను అరెస్ట్ చేసి ఆనందం పొందాలని చూస్తున్నారు..
-
బాబు కుర్చీ కోసం లోకేష్, దత్తపుత్రుడి మధ్య పోటీ: జోగి రమేష్
సాక్షి, విజయవాడ: అక్రమ కేసులు పెట్టి తనను భయపెట్టలేరని కూటమి సర్కార్ను హెచ్చరించారు మాజీ మంత్రి జోగి రమేష్. నా పై అక్రమంగా కేసు పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు మాకు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాబు కుర్చీ కోసం సొంత పుత్రుడు.. దత్తపుత్రుడు పోటీపడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు.మాజీమంత్రి జోగి రమేష్ ఈరోజు సీఐడీ విచారణను హాజరయ్యారు. విచారణ అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ విచారణకు హాజరయ్యాను. నాకు తెలిసిన పూర్తి సమాచారాన్ని అధికారులకు అందించాను. టీడీపీ నేత, ఇప్పటి స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో అసభ్యకరంగా వైఎస్ జగన్ దూషించారు. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న వ్యాఖ్యలున్నాయి. ఆయన వ్యాఖ్యల పై చంద్రబాబు దగ్గరకు వెళ్లి నిరసన చేపట్టాం. మా నిరసనతోనైనా అయ్యన్న వంటి వ్యక్తులకు చంద్రబాబు బుద్ధి చెబుతారేమో అనుకున్నాను. నిరసనకు వెళితే నాపై దాడి చేశారు. నా కార్లు ధ్వంసం చేశారు. నాపై అక్రమంగా కేసు పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నారు. అక్రమ కేసులతో నన్ను భయపెట్టలేరు.నేను విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నాను. ఈ మధ్యే ఒక సర్వే వచ్చింది. ఈరోజు ఎన్నికలు పెడితే 75 మందికి డిపాజిట్లు గల్లంతైపోతాయి. కడుపునిండా అన్నం పెట్టిన జగనన్నను వదులుకుని పలావు పెడతానని చెప్పిన చంద్రబాబును నమ్మి ఓటేసినందుకు జనం బాధపడుతున్నారు. కేసులు పెట్టి మమ్మల్ని ఏం చేయగలరు?. ప్రజలు మీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 70% శాతం ప్రజలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. బూడిద, మట్టి ఇసుకను దోచుకుంటున్నారు. దోచుకోవడం కోసం ఆరాట పడుతున్నారు. చంద్రబాబు సీట్లో ఎవరు కూర్చోవాలో కొట్టుకుంటున్నారు. బాబు కుర్చీ కోసం సొంత పుత్రుడు.. దత్తపుత్రుడు పోటీపడుతున్నారు. మూడేళ్ల క్రితం ఘటనపై కేసుపెట్టి వేధించాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు మాకు లేదా?. న్యాయం, ధర్మం ఇంకా బ్రతికే ఉన్నాయి. న్యాయస్థానాల్లో కొట్లాడతాం. జగన్ ను చూసి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పది నెలల కాలంలో ఈ ప్రభుత్వ దుర్మార్గాలపై ప్రజలు విసిగిపోయారు.మంచి చేయండి.. దోచుకోవడం మానుకోండి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం. పిల్లల ఫీజులు, పేదల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. నన్ను అరెస్ట్ చేసి ఆనందం పొందాలని చూస్తున్నారు. ఎన్నాళ్లు రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతారు. ఏడాది తర్వాత రెడ్ బుక్ మడిచి ఎక్కడ పెట్టుకుంటారు. ఎల్లకాలం మీరే ఉండరు గుర్తుపెట్టుకోండి. సూపర్ సిక్స్ తో ప్రజలను మోసం చేశారు. ప్రజలకు పండుగలు లేకుండా చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. చంద్రబాబు పాలన వైఫల్యాలను ఎందుకు పత్రికల్లో రాయరు. చంద్రబాబు ఇంటికి నేను దాడికి వెళ్లలేదు. కేవలం నిరసన చేసేందుకే వెళ్లాను. మీరు మంచి పాలన ఇస్తే ప్రజలు జై కొడతారు. సీఐడీ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తాను’ అని చెప్పుకొచ్చారు. -
ఈ రోజు జగన్ సీఎంగా ఉండి ఉండుంటే.. బాబుపై నిప్పులు చెరిగిన జోగి రమేష్
-
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతలు దౌర్జన్యాలు చేసి గెలిచారు
-
కూటమి కాదు.. కుట్రల ప్రభుత్వం: జోగి రమేష్
సాక్షి,తాడేపల్లి:ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని,అరాచకాలు,అక్రమాలు,దౌర్జన్యాలు చేసి మున్సిపాలిటీల్లో పదవులు దక్కించుకున్నారని వైఎస్సార్సీపీ సీనియర్నేత మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. సోమవారం(ఫిబ్రవరి3) తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏ కార్పొరేషన్,మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి బలం లేదు.మా పార్టీ వారిని కిడ్నాప్ చేసి గెలుపొందటం సిగ్గుచేటు. మా కార్పొరేటర్లు వెళ్లే బస్సు మీద రాళ్ల దాడి చేయడం దారుణం. తిరుపతి ప్రతిష్టను దిగజార్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదు. 2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని తిట్టారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ,కేజ్రివాల్ను తిట్టారు. అసలు చంద్రబాబు ఒక మనిషేనా? ఆయనకు సిగ్గుందా? సిద్దాంతాలు,విలువలు లేని ఏకైక మనిషి చంద్రబాబు.ఐటీ రైడ్స్ నుంచి రక్షించుకోవడానికే ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.ఇది కూటమి ప్రభుత్వం కాదు,కుట్రల ప్రభుత్వం.వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారు.ఈ దాడులు,దౌర్జన్యాలపై ఈసీ స్పందించాలి. అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఈసీ అడ్డుకోవాలి’అని జోగి రమేష్ డిమాండ్ చేశారు. -
ఆరు నెలలు కాలేదు జనం నడ్డి విరగ్గొట్టారు
-
టీడీపీ సుద్దులన్నీ బీసీ నేతలకు మాత్రమేనా?
తెలుగుదేశం పార్టీ రాను రాను మరీ సంకుచితమైన రాజకీయ పార్టీగా మారిపోతోంది. రాజకీయాలన్నీ ఎన్నికల సమయానికి మాత్రమేనని ఆ తరువాత అందరూ కలిసి పని చేయాలని సుద్దులు చెప్పిన చంద్రబాబు ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా గౌడ సంఘం నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు, రాష్ట్ర మంత్రులు ఒకే వేదికను పంచుకోవడాన్ని ఆ పార్టీ నేతలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. నూజివీడులో జరిగిన ఈ కార్యక్రమానికి సొంత నియోజకవర్గం కావడంతో పార్థసారథి, లచ్చన్న మనవరాలిగా శిరీష వెళ్లారు. వైఎస్సార్సీపీ నేతలు జోగి రమేశ్ కూడా హాజరయ్యారు. అంతే.. టీడీపీ నేతలు జోగి రమేష్ వేదిక పంచుకోవడమే తప్పని, పార్ధసారథిలో వైఎస్సార్సీపీ వాసనలు పోలేదని, శిరీష తప్పు చేశారని టీడీపీ కులోన్మాదులు, లోకేష్ మెప్పుకోసం తాపత్రాయ పడుతున్న నేతలు పెద్ద ఇష్యూ చేసేశారు. అక్కడితో ఆగనూ లేదు. అదేదో పెద్ద నేరం అన్నట్లు టీడీపీ నాయకత్వం పార్ధసారథి, శిరీష్ లతో క్షమాపణ చెప్పించింది. ఎంత దారుణం! వారు కూడా తమ ఆత్మగౌరవాన్ని వదలుకుని చంద్రబాబుకు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్లకు క్షమాపణ చెప్పేశారు. అయినా సరే టీడీపీ నేతలు కొందరు పార్దసారథిని విమర్శలతో ట్రోల్ చేశారు. దీంతో ఆయన తాను ఎంత చిత్తశుద్దితో పని చేస్తున్నా టార్గెట్ బాధపడడం చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్మాదం ఈ స్థాయికి చేరిందా? అన్న ప్రశ్న వస్తుంది. దీన్ని కులోన్మాదం అనాలా? లేక ఇంకేమైనానా? బీసీ వర్గానికి చెందిన నేతలు మాత్రమే ఇలా కలవకూడదని ఏమైనా టీడీపీ ఆంక్షలు పెట్టిందా? ఎందుకంటే.. కమ్మ, కాపు, రెడ్డి తదితర అగ్రవర్ణాలలోని టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ వారితో, ఇతర పార్టీల నేతలతో కలిసి తిరిగినా, సభలలో మాట్లాడినా, వ్యాపారాలు చేసినా అభ్యంతరం వ్యక్తం కావడం లేదు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ను ఆహ్వానిస్తారా? అంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వంటి వారు విరుచుకుపడ్డారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అప్పట్లో ఆనాటి సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం చెబుతానంటూ నాటి మంత్రి జోగి రమేష్ చంద్రబాబుకు ఇంటికి వెళ్లారు. టీడీపీ నేతలు దీన్నే ఒక పెద్ద దాడిగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక జోగిపై కేసు కూడా పెట్టేశారు. అంతమాత్రాన ఆయన ఇలాంటి సభలలో పాల్గొనకూడదని అంటే దానిని ఉన్మాదం అనక ఏమంటాం? విశేషం ఏమిటంటే టీడీపీకి మద్దతు ఇచ్చే కొందరు విశ్లేషకులు కూడా చాలా పెద్ద ఘోరం జరిగిందని టీవీలలో ఇంగితం లేకుండా మాట్లాడారు. ఈనాడు పత్రిక అయితే నీచాతినీచంగా పార్థసారథి, శిరీషల ఫోటోలు వేసి ‘ఇంగితం ఉందా’ అని, కనీస ఇంగితం లేకుండా వార్త రాసింది. ఈనాడు మీడియా స్థాయి అబద్ధాలు చెబుతోందని ఇంతకాలం విమర్శించుకున్నాం కానీ.. దాని స్థాయి అట్టడుగుకు చేరిందనేందుకు ఇదో నిదర్శనంగా నిలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు. ఎన్.టిఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీలోకి రాలేదు. సినిమాలలో నటించే వారికి రాజకీయం ఏమి తెలుసు అని విమర్శలు కూడా చేశారు. కాని 1983లో టీడీపీ అధికారంలోకి రావడంతోనే బాబు పార్టీ మారిపోయారు. టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబుకు పార్టీ సభ్యత్వం ఇవ్వద్దని కొందరు సీనియర్ నేతలు అన్నా, ఎన్.టి.ఆర్. వారికేదో చెప్పి పార్టీలోకి తీసుకున్నారు. తాజా పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎన్.టి.ఆర్కు ఇంగితం లేదనుకోవాలా? పార్టీలో గ్రూపు నడిపి, చివరికి ఎన్.టి.ఆర్.పదవికే ఎసరు పెట్టిన చంద్రబాబును ఏమనాలి? ఆ సమయంలో చంద్రబాబును ఎన్.టి.ఆర్. పలురకాలుగా దూషించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. ఎన్టీఆర్కు విలువల్లేవని విమర్శించిన నోటితోనే చంద్రబాబు తాము ఆయన వారసులమని కూడా ప్రకటించుకున్నారు. ఇంగితం లేనిది ఎవరికి?ఎన్.టి.ఆర్. బతికున్నంత కాలంలో అసభ్యకరమైన కార్టూన్లూ, నగ్న కేరికేచర్లు ప్రచురించిన ఈనాడు మరణానంతరం అవసరమైనప్పుడల్లా ఆయన్ను యుగపురుషుడని కొనియాడుతూ కథనాలు రాసింది. ఇక్కడ కూడా ఇంగితం లేనిది ఎవరికి? తన రాజకీయ జీవితం మొత్తం కప్పగెంతులేసిన చంద్రబాబు ఎవరెవరిని ఎప్పుడు దూషించింది.. అదే నోటితో ఎలా పొగిడిందీ తెలియందెవరికి? అందులో ఎవరికీ ఇంగితం జ్ఞాపకం రాకపోవడమే రాజకీయ వైచిత్రి! ఇవన్నీ మరచి కేవలం జోగి రమేష్తో ఒక వేదిక పంచుకున్నందుకు పార్థసారథి, శిరీషలకు ఇంగితం లేదని ధ్వజమెత్తుతున్నారు. లచ్చన్న ఒక కుల నాయకుడా అని వీరు తెలివిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమాణం అన్ని కుల సంఘాలకూ వర్తింపజేస్తున్నారా మరి? కమ్మ కుల సంఘం మీటింగ్లో ఎన్.టి.ఆర్. విగ్రహాన్ని మాత్రమే ఎందుకు పెట్టుకుంటున్నారు? చంద్రబాబునే ఎందుకు పొగుడుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఆ కుల మీటింగ్లోకి హాజరైతే తప్పు లేదా? అంతెందుకు మాజీ మంత్రి పుల్లారావు, మరి కొందరు టీడీపీ నేతలు గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తుండే వారు అంటారు. వంగవీటి రంగ హత్య గురించి బాబుకు ముందే తెలుసన్న తీవ్ర విమర్శలతో చేగొండి హరిరామయ్య పుస్తకం రాస్తే దాని ఆవిష్కరణ సభకు టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ పక్షాల నేతలందరూ హాజరయ్యారే.... టీడీపీ అప్పుడు ఎవరితోనూ క్షమాపణ చెప్పించ లేదే! మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు వేడకులకు రష్యా వెళ్లిన వారిలో టీడీపీ వారు కూడా ఉన్నారంటారు అంతేకాదు... టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కొందరు కలిసి జూదమాడతారట. వీటికి రాని అభ్యంతరం లచ్చన్న విగ్రహావిష్కరణ సభకు వైఎస్సార్సీపీ నేత హాజరైతే వచ్చిందా? రెడ్డి జన సంఘం సభలకు కూడా వివిధ పార్టీల వారు హాజరవుతుంటారు. అంతెందుకు! లచ్చన్న మరణం తర్వాత జరిగిన ఒక కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, బీవీ రాఘవులుతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. అంటే చంద్రబాబు తప్పు చేసినట్లేనా? ఎన్నికల తర్వాత అంతా రాష్ట్రం కోసమే ఆలోచించాలని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని చంద్రబాబు తరచుగా ప్రచారం చేసేవారు.ఇప్పుడు ఇలా ఎందుకు వ్యవహరించినట్లు? అంటే తన కుమారుడు, మంత్రి లోకేష్ కేవలం అవగాహన రాహిత్యంతో పార్థసారథి, శిరీషలపై ఆగ్రహం వ్యక్తం చేస్తే, దానిని ఆమోదించి చంద్రబాబు కూడా మాట్లాడారా? తెలిసో, తెలియకో లోకేష్ మాట్లాడి ఉంటే సరిచేయాల్సిన పెద్దరికం చంద్రబాబుదే అవుతుంది కదా? అది కూడా చేయలేక పోయారంటే బాబు ఎంత నిస్సహాయంగా ఉంటున్నది అర్థం చేసుకోవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ఖజానాకు మేలు చేసే లక్ష్యంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్గా నవయుగ సంస్థను తప్పించి మెగా సంస్థను ఎంపిక చేశారు. దీన్ని చంద్రబాబుసహా పలువురు టీడీపీ నేతలు విమర్శించారు. కానీ ఇప్పుడు అదే మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డితో కలిసి చంద్రబాబు టూర్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి స్వస్థలమైన డోకిపర్రులోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చంద్రబాబు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కృష్ణారెడ్డి మంచివాడైపోయారా? మామూలుగా అయితే ఎవరూ వెళ్లవద్దని అనరు. కాని నూజివీడు ఘటన తర్వాత ఇవన్ని ప్రశ్నలు అవుతాయి. 2019 కి ముందు ఎన్ని ఘటనలు జరిగాయి. ప్రస్తుతం అలయ్ బలయ్ అంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అప్పట్లో ఎన్ని మాటలు అనుకున్నారు. మళ్లీ అదే పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు ఎంత తాపత్రయపడింది తెలుసు కదా? అలాగే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు, లోకేష్ లను ఎన్నేసి మాటలు అన్నారు. అసలు తన తల్లినే దూషించారని టీడీపీపై ఆరోపించారు. కాని ఏ ఇంగితం పెట్టుకుని మళ్లీ కలిశారని అంటే ఏమి చెబుతాం. బీజేపీతో తేడా వచ్చాక బీజేపీ అధ్యక్ష హోదాలో తిరుపతి వచ్చిన అమిత్ షాపై టీడీపీ వారు రాళ్లు వేశారు. ప్రధాని మోడీని చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు దూషించారు. దేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు, పెళ్లాన్ని ఏలుకోలేని వాడు అంటూ పరుష పదాలతో మాట్లాడిన వీరు, తర్వాత కాలంలో మోడీ అంత గొప్పవాడు లేడని చెబుతున్నారు. అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి డిల్లీలో ఎదురు చూశారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు స్వయంగా లోకేష్ డిల్లీ వెళ్లి, తన పెద్దమ్మ సాయంతో అమిత్ షాను కలిసి వచ్చారే! ఇందులో ఎవరికి ఇంగితం ఉన్నట్లు?ఎవరికి లేనట్లు? చంద్రబాబు ఎవరినైనా ఏమైనా అనవచ్చు. ఎవరితోనైనా జట్టు కట్టవచ్చు? అది గొప్పతనం. ఆయన తిడితే అంతా తిట్టాలి. ఆయన పొగిడితే అంతా పొగడాలి. ఎటు తిరిగి ఆయన చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి భజన మీడియా ఉంది కనుక ఏమి చేసినా చెల్లిపోతోంది.పార్థసారథి తండ్రి కెపి రెడ్డయ్య గతంలో కాంగ్రెస్, టీడీపీలలో పనిచేశారు. ఎంపీగా పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని కాపాడడానికి మరి కొందరితో కలిసి కాంగ్రెస్లో చేరారు. అప్పట్లో రెడ్డయ్యపై టీడీపీ వారు ఆరోపణలు చేసేవారు. అయినా రెడ్డయ్య వాటన్నిటిని ధీటుగా ఎదుర్కునేవారు. రెడ్డయ్య నోటికి అంతా భయపడే పరిస్థితి ఉండేదని చెబుతారు. ఇప్పుడు ఆయన కుమారుడు పార్థసారథి కూడా ఒకరకంగా అదే ఆత్మగౌరవ సమస్యను ఎదుర్కుంటున్నారు. కాంగ్రెస్ లోను, ఇప్పుడు టీడీపీలోను మంత్రిగా ఉన్నారు. శిరీష తండ్రి గౌతు శివాజి కూడా ఆరుసార్లు టీడీపీ ఎమ్మెల్యే. అలాంటి కుటుంబానికి చెందిన శిరీషను టీడీపీ నాయకత్వం అవమానించి క్షమాపణ కోరుతుందా?ఒకప్పుడు సమరసింహా రెడ్డి మంత్రిగా ఏదో కాకతాళీయంగా మరో మంత్రి కటారి ఈశ్వరకుమార్తో మాట్లాడుతూ బీసీలా..వంకాయలా అని అన్నారు. అది కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపింది. చంద్రబాబు నాయుడు గత టరమ్ లో బీసీ నేతలు కొందరు సచివాలయానికి వస్తే దేవాలయంవంటి ఇక్కడకు వచ్చి ప్రశ్నిస్తారా? అని మండిపడ్డారు. మరో సందర్భంలో మత్యకారులను ఉద్దేశించి తోకలు కట్ చేస్తానని అనడం వివాదాస్పదమైంది. ఈ మధ్యనే కాకినాడ సీపోర్టు యజమాని కేవీ రావు పై అభియోగాలు చేస్తూ లేఖ రాసిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా టీడీపీ కులోన్మాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కున్నారు. అవమానాలకు గురి కావల్సి వచ్చింది. టీడీపీ బీసీ నేతలు ఇలాంటి వాటిని భరిస్తుండడం విశేషం. కనీసం ధైర్యంగా తాము తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారు. మరో వైపు జగన్ బీసీలకు అత్యంత గౌరవం ఇచ్చి ఎన్నడూ లేని విధంగా వారికి నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవించారు. వారిలో ముగ్గురు పార్టీని వీడడం దురదృష్టకరం. తమను గౌరవించేవారు కావాలో, లేక అవమానించేవారు కావాలో బీసీ నేతలే నిర్ణయించుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నీకు నిజంగా దమ్ముంటే.. వసంత కృష్ణ ప్రసాద్ కి జోగి రమేష్ సవాల్
-
వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం వీరప్పన్: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: దొంగకోళ్లు పట్టేవాడికి, టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్కు తేడా లేదని.. మైలవరం నియోజకవర్గంలో సహజ వనరుల్ని లూటీ చేస్తున్నాడంటూ మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసంతకృష్ణ ప్రసాద్ను మైలవరం వీరప్పన్గా అభివర్ణించారు. మైలవరంలో బ్రాందీ షాపులు పెట్టుకున్నా వసంత కృష్ణప్రసాద్కు కమీషన్లు ఇవ్వాలి’’ అంటూ దుయ్యబట్టారు.‘‘గతంలో కృష్ణప్రసాద్ ఏడుస్తున్నాడనే నేను మైలవరానికి ఏనాడూ రాలేదు. వసంత కృష్ణప్రసాద్కు మీడియా సమక్షంలో నాతో చర్చకు వచ్చే దమ్ముందా? అంటూ జోగి రమేష్ సవాల్ విసిరారు. ‘‘పర్వతనేని ఇంటి ముందు సీటు కోసం అబ్బా కొడుకులు తిట్టుకుని, కొట్టుకున్నారు. ఎన్ని పుస్తకాలు రాసినా మీ చరిత్రకి సరిపోవు. సిగ్గుమాలిన, సంస్కారం లేని కుటుంబం మీది. వసంత కృష్ణప్రసాద్ బూడిద అక్రమాలపై పోరాడతాం’’ అని జోగి రమేష్ హెచ్చరించారు.జగన్, జోగి రమేష్ ఫోటోలు చూస్తే భయమా? బ్యానర్లు తీసేయమని అధికారులకు చెబుతున్నారు. నేను మా పార్టీ అధ్యక్షుడిని ఒప్పిస్తా.. నువ్వు కూటమికి రాజీనామా చెయ్యి. పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా మైలవరంలో పోటీచేద్దాం... సిద్ధమా?. రాబోయే ఎన్నికల్లో మైలవరం నుంచి వైఎస్సార్సీపీఅభ్యర్థిగా పోటీ చేస్తున్నా. 2027 తర్వాత కృష్ణ ప్రసాద్ చాప, దిండు సర్దుకుని వెళ్లిపోతాడు’’ అంటూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ -
చంద్రబాబు బ్యాచ్ ని రఫ్పాడించిన జోగి రమేష్
-
వారిని వదిలిపెట్టను.. జోగి రమేష్ వార్నింగ్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కేసులకు భయపడను.. నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఇబ్రహీంపట్నం గడ్డమీదే ఉన్నా.. నా మీదకు రాకుండా.. నా కుమారుడిపై కేసు పెట్టారు. ఈ రోజుతో అయిపోదని గుర్తు పెట్టుకోండి’’ మాజీ మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు. బుధవారం.. మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో.. మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరమని గుర్తుంచుకోండి. నా జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టనని తేల్చి చెప్పారు.మంచి మనసున్న నేత వైఎస్ జగన్. ఆయన చెప్పాడనే 2019లో నేను మైలవరం నుంచి పక్కకు వెళ్లా.. ఈ క్యాండెట్ చివరి వరకూ ఉండడని జగనన్నతో ఆరోజే నేను చెప్పా.. ఆయనను నమ్మించి మోసం చేసి ఎన్నికల ముందు గోడ దూకేశాడు. రావాల్సిన బిల్లులన్నీ రాగానే పార్టీ మారిపోయాడు’’ అంటూ మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై జోగి రమేష్ మండిపడ్డారు.‘‘నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్సీపీలో ఉండండి. ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదు. మా మోచేతి నీళ్లు తాగి.. ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే కారు కూతలు కూస్తున్నాడు. ఇక పై జగనన్న గురించి మాట్లాడితే తాటతీస్తాం. కేసులకు మేం భయపడం.. మా వాళ్లజోలికి వస్తే చూస్తూ ఊరుకోం’’ అని జోగి రమేష్ చెప్పారు.‘‘జనవరిలో మైలవరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించుకుందాం. కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటా. ఈ రోజు ఓడిపోయాం.. కానీ మళ్లీ వైఎస్ జగన్ని సీఎంగా చేసుకుందాం. ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత వచ్చింది. 2027లో ఎన్నికలు రాబోతున్నాయ్.. మళ్లీ గెలిచేది మనమే’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
బాబూ.. కక్ష సాధింపు ఆనందం వీడాలి: జోగి రమేష్
సాక్షి, మంగళగిరి: ఏపీలో కూటమి నేతలకు రాజకీయ విలువలు లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పాటిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.కాగా, మాజీ మంత్రి జోగి రమేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పాటిస్తున్నారు. చంద్రబాబు ఇంటికి ఎందుకు వెళ్లానో విచారణలో చెప్పాను. అయ్యన్న పాత్రుడు.. వైఎస్ జగన్పై చేసిన విమర్శలకు నిరసన చేసేందుకు వెళ్ళాను. అయితే, నాపై దాడి చేసి.. మళ్లీ నా మీదనే కేసు పెట్టారు. అధికారం ఎవరికీ శాశ్వత కాదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. ఏపీలో చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుంది. కక్ష ఉంటే నాపై తీర్చుకోవాలి. నా కొడుకుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు.కూటమి నేతలకు రాజకీయ విలువలు లేవు. హామీలు అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు చేస్తే ప్రజలు సంతోషిస్తారు. మంచి పాలన చేయాలని కానీ.. కక్ష సాధించడం సరికాదు. ఇటువంటి ఆనందాన్ని చంద్రబాబు వీడాలి. కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నా కొడుకుని అగ్రిగోల్డ్ భూముల కేసులో ఇరికించారు. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా మేము కొనుగోలు చేయలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సత్య ప్రసాద్ దగ్గరకు నేనే వచ్చి అగ్రిగోల్డ్ గురించి వివరిస్తా.లోకేష్ రెడ్ బుక్ తీస్తే ఏమి అవుతుంది?. వైఎస్సార్సీపీని అడ్డుకోవాలని చూస్తే సాధ్యం కాదు. మళ్ళీ నన్ను విచారణకు రమ్మని పిలవలేదు. 2002 నుంచి ఒకటే ఫోన్ నెంబర్ వాడుతున్నా. నేను మళ్ళీ విచారణకు రమ్మంటే వస్తాను. వారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ఇప్పుడు మీరు పరుష పదజాలం వాడితే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోండి. నాకు పార్టీ సపోర్ట్ ఉంది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధించాలని చూస్తుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తా..
-
కక్ష కట్టారు.. కేసులకు భయపడేది లేదు: జోగి రమేష్
సాక్షి, విజయవాడ: తనపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారని.. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి పీఎస్కు వచ్చిన జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. ప్రతి పశ్నకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.‘‘ప్రజలంతా సూపర్ సిక్స్ పథకాల అమలు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మాత్రం రెడ్ బుక్ అమలు చేసే పనిలో ఉన్నారు. కేసులకు భయపడేది లేదు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
అతి తెలివితేటలు వద్దు.. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం
-
YSRCP నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు
-
బాబుపై జోగిరమేష్ భార్య ఫైర్
-
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
-
టార్గెట్ జోగి రమేష్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇబ్రహీంపట్నం: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు తెరతీసింది. చట్టానికి లోబడి, నిబంధనల ప్రకారం భూమి కొనుగోలు చేసి, దానిని విక్రయించిన వ్యవహారంలో అక్రమ కేసు నమోదు చేసింది. పత్రికల్లో ప్రకటన ఇచ్చి మరీ కొనుగోలు చేసిన ఓ భూ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తూ, అక్రమ కేసు నమోదు చేశారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్తోపాటు, చిన్నాన్న వెంకటేశ్వరరావును నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాక.. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సోదాలతో పేరుతో హల్చల్ చేశారు. అనంతరం.. జోగి రాజీవ్ను ఎలాంటి నోటీసులివ్వకుండానే అదుపులోకి తీసుకుని గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోగి సతీమణి శకుంతల.. మా బిడ్డ ఏం పాపం చేశాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం.. ఏసీబీ కార్యాలయం వద్దకు జోగి రమేష్ చేరుకుని, అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. నిజానికి.. గతంలో టీడీపీ నేతలు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు జోగి రమేష్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. ఆ ఉదంతంతో చంద్రబాబు అతనిపై కక్షగట్టి ఇప్పుడు వేధింపులకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక జోగి రమేష్ తనయుని అరెస్టు వార్త తెలియగానే వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, వెలంపల్లి, దేవినేని అవినాష్, మాజీమంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు, వైఎస్సార్సీపీ శ్రేణులు గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్రమ ఆరెస్టులపై పోరాడతామని, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులన్నీంటిని ఎదుర్కొంటామని చెప్పారు. తొమ్మిది మందిపై సీఐడీ అక్రమ కేసు ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మందిపై సీఐడీ అక్రమ కేసు నమోదు చేసింది. ఇందులో జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహనరంగాదాసు, వెంకట సీతామహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేశ్, డిప్యూటీ తహశీల్దార్ విజయకుమార్, విజయవాడ రూరల్ తహశీల్దారు, నున్న సబ్రిజి్రస్టార్ ఉన్నారు. సీఐడీ కేసు విచారణలో ఉండగానే ఏసీబీ హడావిడిగా కేసు నమోదు చేయడం గమనార్హం. ఇక ఏసీబీ కార్యాలయంలో మంగళవారం దేదీప్యను విచారించారు. మరోవైపు.. గతంలో చంద్రబాబు ఇంటివద్ద నిరసన చేపట్టిన కేసులో జోగి రమే‹Ùకు మంగళవారం తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీచేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు పలువురు మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే.. అక్రమ కేసులపై పోరాటం చేస్తాంమాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడతారని, అక్రమంగా అరెస్టులు చేస్తారన్నారు. అసలు ఈ కేసులో లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? అని ప్రశ్నించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, విచారణకు పిలవకుండా జోగి రమేష్ను టార్గెట్ చేశారన్నారు. చంద్రబాబును నిలదీయకుండా వదలమన్నారు. జోగి రమేష్కు పొలం అమ్మిన వారు ముద్దాయిలు కారు.. కొనుక్కున్న వారు లేరు.. మరి అలాంటప్పుడు జోగి రమేష్ కుటుంబ సభ్యులు మాత్రమే ముద్దాయిలా? అని ప్రశ్నించారు. ఈ తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. నిజానికి అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు మనుషులే కొన్నారని నాని చెప్పారు. జోగి రమేష్ సతీమణి మాట్లాడుతూ.. అప్పటి సీఎం జగన్గారిని ఉద్దేశించి టీడీపీ నేతలు దారుణంగా మాట్లాడడంవల్లే తన భర్త నిరసన తెలపడానికి చంద్రబాబు నివాసానికి వెళ్లారని.. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా వేధిస్తారా? అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్ రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, అందుకే బీసీ అయిన జోగి రమేష్ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీమంత్రి వెలంపల్లి అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా జోగి రమేష్ కుటుంబాన్ని వేధిస్తున్నారని.. తాము పరామర్శకు రావొద్దా అని మాజీమంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. అలాగే, జోగి రమేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని.. అందుకే జగన్ ఆదేశాల మేరకు తామంతా ఇక్కడకు వచ్చామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్ చెప్పారు. 14 రోజులపాటు రిమాండ్ ఇదిలా ఉంటే.. జోగి రాజీవ్, సర్వేయర్ రమే‹Ùకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏసీబీ కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు న్యాయమూర్తి హిమబిందు ఎదుట హాజరుపర్చగా ఇరువర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి ఈనెల 23వరకు రిమాండ్ విధించారు. నిందితుని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు.మా నాన్నపై కక్ష తీర్చుకునేందుకే..నా తండ్రిపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే అక్రమ కేసులు పెట్టారు. ఈనాడులో ప్రకటన చూసే కొన్నాం.. అలాగే, ప్రకటన ఇచ్చే అమ్మాం. ఈ వ్యవహారాన్ని లీగల్గానే కోర్టులోనే తేల్చుకుంటాం. – జోగి రాజీవ్, జోగి రమేష్ తనయుడు నాపై కక్షతో నా కొడుకుపై కేసు.. మా అబ్బాయి మీద కేసు నమోదు చేయడం దుర్మార్గం. చంద్రబాబూ.. నీకు నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. అటాచ్ అయిన అగ్రిగోల్డ్ భూములు ఎవరైనా కొంటారా? కావాలనే కక్షతోనే నా కొడుకుని అరెస్టుచేశారు. ఇది బలహీనవర్గాలపైన, గౌడ కులస్తుపైన దాడిగా నేను భావిస్తున్నా. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తమ కుటుంబం తప్పుచేసినట్లు రుజువుచేస్తే ఆత్మహత్య చేసుకుంటాం. – జోగి రమేష్, మాజీమంత్రి ఇద్దరిని అరెస్టు చేశాం విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో సీఐడీ అటాచ్మెంట్లో ఉన్న అవ్వా శేషనారాయణకు చెందిన అగ్రిగోల్డ్ భూమి కొనుగోలుపై వచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం జోగి రాజీవ్, సర్వేయర్ రమే‹Ùలను అరెస్ట్చేశాం. ఇందులో ఐదుగురు నిందితులను గుర్తించాం. తదుపరి విచారణ తరువాత మిగిలిన వారిని అరెస్టుచేస్తాం. – సౌమ్యలత, ఏసీబీ అడిషనల్ ఎస్పీ -
మా 175 మందిని అరెస్ట్ చేసుకో..
-
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా టీడీపీ కక్ష సాధింపు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పథకాల అమలు చేయకుండా.. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమ్తెతారు. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుమారుడు కొన్న భూములకు దగ్గరలో కూడా లేవన్నారు.2022లో పేపర్ ప్రకటన జోగి రమేష్ ఇచ్చారు. ఆయన దగ్గర స్థలం కొన్నప్పుడు కూడా వాళ్లు కూడా పేపర్ ప్రకటన ఇచ్చారు. సీబీఐ కూడా ఎక్కడా అభ్యంతరాలు చెప్పలేదు. ఆగస్ట్ 2న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబుపై జోగి రమేష్ గట్టిగా మాట్లాడారు కాబట్టే కక్ష కడుపులో పెట్టుకొని ఆయన కొడుకుపై అక్రమ కేసులు పెట్టారు.’’ అని పేర్ని నాని మండిపడ్డారు.‘‘175 నియోజకవర్గాల్లో అందరిని జైల్లో వేసిన పోరాటం ఆపం. టీడీపీ చేసే తప్పులపై పోరాటం చేస్తాం.. 2029లో టీడీపీని కులగొట్టేందుకు కావాల్సిన పోరాటం చేస్తాం. పొలం అమ్మిన వారు ముద్దాయిలుగా లేరు.. అమ్మిన వాళ్లు చంద్రబాబు చుట్టాలయి వుంటారు. అరెస్టులు చేసి తప్ఫడు కేసులు పెట్టి మానసిక ఆనందం పొందుతున్నారు. రెడ్ బుక్లో ఎవరెవరు పేర్లు ఉన్నాయో వాళ్లను వేధిస్తున్నారు. ఒకే సంఘటనకు రెండు కేసులు పెట్టారు. మానసిన ఆనందం తాత్కాలికం..’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు. -
నా ఇంటి మీదకు వచ్చావ్.. అందుకే నా ఈ రివెంజ్..
-
కొడుకు అరెస్ట్ పై కన్నీళ్లు పెట్టుకున్న జోగి రమేష్ భార్య
-
అన్యాయంగా నా కొడుకు అరెస్ట్: జోగి రమేష్
-
జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
చంద్రబాబూ.. వంకర బుద్ధి మార్చుకో: జోగి రమేష్
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై జోగి రమేష్ నిరసన తెలిపారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ధర్నాకు దిగారు.‘‘అగ్రిగోల్డ్లో మా కుటుంబం తప్పు చేసినట్టు నిరూపిస్తే.. విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటాం. చంద్రబాబు మాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. మా కుమారుడు విదేశాల్లో చదివాడు, ఉద్యోగం చేశాడు. బలహీనవర్గాలపై దాడి ఇది.. గౌడ కులం నుంచి అంచెలంచెలుగా ఎదిగా. కోపం ఉంటే నాపై కక్ష తీర్చుకోండి. నా కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ అని జోగి రమేష్ ధ్వజమెత్తారు.చంద్రబాబూ.. నీకూ కొడుకులు ఉన్నారు.. తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదు. చంద్రబాబు వంకర బుద్ది మార్చుకోవాలి. ఇది జోగి రమేష్ మీద.. జోగి రాజీవ్పై జరిగిన దాడి కాదు.. బలహీన వర్గాలపై జరిగిన దాడి. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చండి.. డైవర్షన్ పాలిటిక్స్ వద్దు.. హామీలు నెరవేర్చి ప్రజలకి మంచి చేయండి ’’ అంటూ జోగి రమేష్ హితవుపలికారు. -
మాజీ మంత్రి జోగి రమేష్పై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ శ్రేణులపై అధికార కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా వారిపై పలు అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు గురి చేస్తోంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఇంటిలో మంగళవారం ఉదయం పోలీసులు సోదాలు చేపట్టారు. ఎందుకొచ్చారోకూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు తీరుపై జోగి రమేష్ కుటుంబ సభ్యులు, అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రెండు నెలల క్రితం జోగి రమేష్ ఇంటిపై రాళ్లతో దాడులుఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. జూన్ 16న జోగి రమేష్పై రాళ్ల దాడి చేశారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. -
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.తాజాగా, మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై జనసేన,టీడీపీ సానుభూతి పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. -
చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది ?
-
బాబు.. దోచుకుంది దాచుకునేందుకు విదేశాలకు వెళ్లావా?: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు.కాగా, మంత్రి జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడ్నుండి ఎక్కడకు వెళ్లారు?. వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లోమీడియా రాసింది. అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఎక్కడకు వెళ్లారు?. చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా మురిదిపోయింది.ఈ రహస్య పర్యటన వెనుక కారణం ఏంటి?. దోచుకున్న డబ్బుని దాచుకోవటానికి వెళ్లారా?. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు.. ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు?. అసలు ఈ పది రోజులు ఎక్కడకు వెళ్లారో ఎందుకు చెప్పటం లేదు?. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా మేము చెప్పాం. మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత?. ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలి.అవినీతిపరుడైన ఏబీ వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు అక్కున చేర్చుకున్నారు. దేవినేని ఉమా సహా అందరూ వెళ్లి అవినీతిపరుడిని సత్కరించారు. ఈరోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ దెబ్బకి టీడీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. నాలుగో తేదీన ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబుకు మూర్చ వస్తుంది. ఆ రోజున కూటమి కుదేలవుతుంది. వైఎస్సార్సీపీ శ్రేణులంతా సంబరాలకు సిద్ధం కావాలి. పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలి. సీఎం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్
-
ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
సాక్షి, విజయవాడ: ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్లో దాచడానికి వెళ్లరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరార్తో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారన్నారు జోగి రమేష్. ఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు జోగి రమేష్. పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. టీడీపీ అడ్రస్ గల్లంతు కాబోతుంది కాబట్టే చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డాడని విమర్శించారు. పురందేశ్వరి ఈసీకి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే అధికారులను మార్చారనిన్నారు.కాగా అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్చుప్గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.చదవండి: ఇట్లు ఇటలీకి -
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు
-
పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు
-
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
-
పెనమలూరులో తుఫ్యాన్
కంకిపాడు: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సమయం సమీపించే కొద్దీ పెనమలూరులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. గెలుపుపై వైఎస్సార్ సీపీలో ధీమా వ్యక్తమవుతుండగా, టీడీపీ డీలా పడుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోగి రమేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామగ్రామాన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాల లబ్ధి, అభివృద్ధి కార్యక్రమాలతో వైఎస్సార్ సీపీకి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజలంతా పారీ్టకి వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. కూటమి విధానాలు నచ్చక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పారీ్టలను వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. ప్రచారంలో బీజేపీ అంటీముట్టనట్టు ఉండటం, జనసేనలోని వర్గాలు కలిసిరాకపోవడంతో టీడీపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైంది. నాలుగోసారి నియోజకవర్గానికి ఎన్నికలు పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య కృష్ణా జిల్లాలోనే అత్యధికం. ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు తాజాగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,94,928 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,42,349 మంది, మహిళలు 1,52,577 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. నియోజకవర్గ పునరి్వభజన ప్రక్రియతో 2009లో కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాలతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పాటైంది. ఆయా మండలాలతో పాటుగా ఉయ్యూరు నగర పంచాయతీ, తాడిగడప మునిసిపాలిటీ కూడా ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నియోజక వర్గంలో ఇప్పటి వరకూ 2009, 2014, 2019లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాలుగో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ 31,448 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 11,317 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. ఈ దఫా పెనమలూరు స్థానం కోసం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్తో పాటు మరో తొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బోడె.. నీకో దండం ‘టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ వ్యవహారశైలిలో ఇప్పటికీ మార్పులేదు. కనీసం కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించడంలేదు’ అని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదెక్కడి గోల. ఆయనకో దండం. ఇష్టం లేకున్నా కొనసాగుతున్నాం అంటూ ఆ పార్టీ శ్రేణులే మధనపడుతున్న పరిస్థితి. కూటమి నేతృత్వంలో చేపడుతున్న ప్రచారానికి స్పందన అంతంత మాత్రంగా ఉంటోంది. అధికారం లేకున్నా ఐదేళ్లు ప్రజలతోనే ఉన్నానని అండగా నిలవాలని ప్రచారంలో గొప్పగా చెప్పుకొంటున్నారు. 2014 నుంచి 2019 వరకూ కేవలం కొద్ది మంది అనుయాయులను పక్కనపెట్టుకుని అందలం ఎక్కించారంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. ఇసుక విక్రయాలు, మట్టి అక్రమ వ్యాపారం, సెక్స్రాకెట్, కాల్ మనీ, బిల్డర్ల నుంచి అక్రమ వసూళ్లు వంటి అనేక ఆరోపణలు బోడె ప్రసాద్ చుట్టూ ఉచ్చులా బిగుస్తున్నాయి. స్వపక్షంలోనూ విపక్షం ఉండటం, నాయకులు కలిసినా మనసులు కలవకపోవడంతో కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బీజేపీలోని ఓ వర్గం ఇప్పటికే దూరంగా ఉంటోంది. జనసేన వర్గాలు పూర్తిగా కలిసి పనిచేయటం లేదు. సీనియర్ నాయకుడు చలసాని వెంకటేశ్వరరావు (పండు) వర్గానికి అన్యాయం జరగడంతో ఆయన కుమార్తె చలసాని స్మిత, గౌతమ్, ఆమె వర్గం టీడీపీకి షాక్ ఇచ్చింది. వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారు. స్థానికుడు అన్న ఒక్క అనుకూలం తప్ప బోడె ప్రసాద్కు మిగిలినవన్నీ ప్రతికూల అంశాలే. తొలుత సీటు ఖరారు కాక అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తాననడం, ఆఖరికి ఎన్ఆర్ఐల పుణ్యమాని సీటు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందంటూ ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఎలాగూ ఎదురుగాలి వీస్తుండటంతో ఇండెంట్ వేసి చందాలు రాబడుతూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టే పనిలో నేతలు ఉన్నారన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. జోగికి ప్రజాదరణ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి ఫిరాయించటంతో వైఎస్సార్ సీపీ అధిష్టానం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమే‹Ùకు పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పటికే జోగి రమేష్ ప్రజలకు చేరువయ్యారు. ఆయన పారీ్టలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. వైఎస్సార్ సీపీ విజయాన్ని కాంక్షిస్తూ జోగి కుటుంబం యావత్తూ ప్రచారాన్ని సాగిస్తూ ప్రజాదరణ చూరగొంటోంది. సమస్యలు విన్న వెంటనే ‘నేనున్నా.. పరిష్కరించే బాధ్యత నాది’ అని జోగి భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ విధానాలు నచ్చి, టీడీపీ, జనసేన పక్షాల్లో ఇమడలేక అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికే వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ బలోపేతంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అర్హులందరికీ అందించింది. పాలనను గ్రామస్థాయికి తీసుకొచ్చింది. వలంటీరు వ్యవస్థ ద్వారా సంక్షేమాన్ని గడపకు చేర్చి అన్ని వర్గాల సంక్షేమానికి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పాల్పడుతోంది. ఇవన్నీ జోగికి అనుకూల అంశాలు. -
ప్రజలను వెధవలు అంటారా?
పెనమలూరు: ‘రాష్ట్ర ప్రజలను వెధవలు అని కించపరుస్తారా... ఇది మీ పెత్తందారి ఆలోచనలకు నిదర్శనం...’ అని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణాజిల్లా గంగూరులోని తన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం దెబ్బతీసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ సీఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారని, రాష్ట్రానికి మళ్లీ జగనన్న సీఎం అవుతారని అనేక సర్వేలు స్పష్టంచేశాయని చెప్పారు. దీంతో టీడీపీ దిక్కుతోచక అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం రంగంలోకి వచ్చిందని, ప్రజలను డబ్బులతో ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రయత్నంలో ‘డబ్బుతో ఓట్లు కొనవచ్చు... తెలుగు ప్రజలు వెధవలు...’ అంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం చేసిన ప్రసంగాన్ని జోగి రమేష్ మీడియాకు చూపించారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి, విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకున్న తరువాత తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడటం దారుణమని, ఇది పెత్తందారుల మనస్తత్వానికి నిదర్శమని మండిపడ్డారు. కోమటి జయరాం, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలపై ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఎన్ఆర్ఐలు చంద్రబాబును నమ్మి రాజకీయాల్లో తలదూర్చి అక్రమాలకు పాల్పడితే నట్టేట ముంచుతాడని జోగి రమేష్ హెచ్చరించారు. ఎన్ఆర్ఐలు డబ్బు సంచులతో గ్రామాల్లోకి వచ్చి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే జనం తరిమికొడతారని, దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నిస్తే జైలుకు వెళతారని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో ఓడిపోయి హైదరాబాద్కు పలాయనం చిత్తగిస్తారని, ఇక ఆయన ఎన్ఆర్ఐలను ఎలా కాపాడుతారో ఆలోచించుకోవాలని సూచించారు. ఎన్ఆర్ఐలు తాము పుట్టి, పెరిగి, చదువుకున్న ప్రాంతానికి నిస్వార్థంగా సేవ చేయాలని, స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరారు. పేదలకు మేలు చేస్తున్న సీఎం జగన్కు ఎన్ఆర్ఐలు మద్దతు తెలిపితే ప్రజలందరికి మరింత మంచి జరుగుతుందని చెప్పారు. -
చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయం: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: జూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయమని అన్నారు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మత్రి జోగి రమేష్. ఎన్నికల్లో ఓడిపోయాక, బాబు అండ్ కో.. హైదరాబాద్కు పారిపోతారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్, విలువలు, విశ్వసనీయత లేని రాజకీయ అజ్ఞానులని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగితే అవహేళనగా మాట్లాడటానికి మీకు సిగ్గు లేదా అని మండిపడ్డారు. చంద్రగిరి నుంచి బాబు, భీమవరం నుంచి పవన్ ఎందుకు పారిపోయారని సూటిగా ప్రశ్నించారు. సీఎంపై దాడి జరిగితే అవహేళనగా మాట్లాడతారా?: విజయవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై దాడి జరిగితే, ఆ దాడి ఒక డ్రామా అని, పథకం ప్రకారం చేశారని చంద్రబాబు, లోకేష్లు సిగ్గు లేకుండా మాట్లాడతారా?. సంస్కార హీనంగా అవహేళన చేస్తారా? మీరు అసలు మనుషులేనా? ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఇది ఐదు కోట్ల మంది ప్రజలపై జరిగిన దాడి. మరీ ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, ఇతర వర్గాల పేదలపై జరిగిన దాడిగా ప్రజలంతా చూస్తున్నారు. పేదలను నేనున్నాను.. మీకు అండగా ఉంటాను.. అంటూ ప్రతి గడపనూ ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడిని నరరూప రాక్షసులైన నారా చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అవహేళన చేశారు. వీళ్లు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయ అజ్ఞానులు. ఆ బలమైన రాయి కొంచెం కింద కంటికి తగిలి ఉంటే కన్ను పోయేది. అదే కణతకి తగిలి ఉంటే ప్రాణమే పోయేది. ఇలాంటి కోల్డ్ బ్లడెడ్ హత్యలకు పురిగొల్పిన చంద్రబాబు అండ్ కో.. ఈ రోజు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఎవరు దాడి చేశారు..దాడి చేసిన వారి వెనుక ఎవరున్నారు అనేది మొత్తం పోలీసుల విచారణలో బయటకు వస్తుంది. ముందుగానే చంద్రబాబు భుజాలు తడుముకోవడం దేనికీ? కుట్ర కోణమంతా బయటకు వస్తుంది.. చంద్రబాబు కాస్త వెయిట్ చేయాలి. అంత సంఘటన జరిగినా. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు జగనన్నకు మెండుగా ఉన్నాయి కనుక ప్రాణాపాయం తప్పింది. ఆయనకు తలకు గాయమైందని తెలియగానే కోట్లాది మంది ప్రజలు ప్రార్ధనలు చేశారు. జగనన్నపై ప్రేమ ప్రతి గడపలో కనిపించింది. జగన్కు వస్తున్న ఆదరణ చూడలేక విషనాగులు కాటువేయాలని చూస్తున్నాయి సిద్ధం సభలతో బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతుంటే విషనాగులు కాటువేయాలని చూస్తున్నాయి. జైత్రయాత్రను అడ్డుకునేందుకు, చంద్రబాబు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడు. దాడి జరగకముందు రోజే.. ముఖ్యమంత్రిపై రాళ్ళతో దాడులు చేయండి.. కొట్టండి అని బహిరంగ సభలో చెప్పాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంత సంస్కార హీనంగా మాట్లాడాడో ప్రజలంతా చూశారు. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 45 ఏళ్ల అనుభవం దేనికీ పాతిపెట్టడానికా? చంద్రబాబు సభలు పెడితే జనం రాక వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. మిమ్మల్ని చూడ్డానికి ఎవరు వస్తారు? మీ సొల్లు వినీ వినీ జనం విసుగెత్తిపోయారు. జగన్ యాత్రలో కోట్లాది మంది జనం రోడ్ల మీదకు వస్తున్నారు. అక్కచెల్లెమ్మలు, యువకులు యాత్రలో పాల్గొంటున్న తీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రామోజీ, రాధాకృష్ణా..ఆ వచ్చే ప్రజలను కళ్లు తెరిచి చూడండి. జనం రాలేదు..జనం వెళ్లిపోయారంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. పేదల పక్షాన జగనన్న ఉన్నారు. ప్రజలు చంద్రబాబును నమ్మం గాక నమ్మం అని చెప్తున్నారు. చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయింది ఎవరు బాబూ?: చంద్రబాబు పెడనలో నిన్న ఇష్టారీతిన మాట్లాడాడు. అసలు నీ నియోజకవర్గం చంద్రగిరి. నువ్వు పారిపోయింది కుప్పానికి. ఈ ఎన్నికల్లో కుప్పంలో నువ్వు ఓడిపోయి, హైదరాబాద్ పారిపోవడం ఖాయం. నీ పార్ట్నర్ గతంలో ఎక్కడ పోటీ చేశాడు? భీమవరం, గాజువాకలు వదిలి, ఇప్పుడు పిఠాపురం ఎందుకు పారిపోయాడు? పిఠాపురంలో గ్లాసు పగిలిపోతే హైదారాబాద్లో షూటింగులు చేసుకుంటాడు. చంద్రబాబు కొడుకు లోకేశ్..ఎక్కడ పోటీ చేస్తున్నాడు..? మంగళగిరి నీ సొంతమా? దమ్ముగా, ధైర్యంగా ఉన్నాం. జగనన్న సైనికుల్లా ఉన్నాం..ఆయన వెంటే నడుస్తాం. ఆయన్ను ఎవరైనా ఏదన్నా అంటే మీ చెమడాలు వలుస్తాం. జగన్ ఏం చేశారని మీరు అంతగా కడుపుమంటను ప్రదర్శిస్తున్నారో చంద్రబాబు, పవన్లు చెప్పాలి. మీకు చేతగానిది ఐదేళ్లలో ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపించారు. జగన్ మా బిడ్డ, మా పెద్ద కొడుకు అని ప్రజలు చెబుతున్నారు. మాకు ఇళ్లు కట్టిస్తున్నాడు..మా పిల్లల్ని చదివిస్తున్నాడు..మా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాడని ప్రజలు గడపగడపలో చెబుతున్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి-సంస్కరణలు చూసి, దేశమంతా ఏపీౖవైపు చూస్తుంది. దిక్కు మాలిన చంద్రబాబు రేపు..దిక్కు లేని వాడు అవ్వబోతున్నాడు. మే 13న పోలింగ్ స్టేషన్ కు ఎప్పుడు వెళదామా.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు మోసగాళ్లు.ఢిల్లీ వెళ్లి బీజేపీతో కలిశారు. కొత్తేముంది..2014లోనూ మీరు ముగ్గురేగా పోటీ చేసింది. గెలిచిన తర్వాత ముగ్గురూ తిట్టుకుని.. మూడు ముక్కలయ్యారు. పవన్ కల్యాణ్ను చంద్రబాబు ఇతను పెద్ద పుడింగా..ఇతని వల్ల మేం గెలిచామా? అని తిట్టారు. చంద్రబాబేమో, మోడీని, వారి కుటుంబ సభ్యులందరినీ తిట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మీరు కలుస్తారు? సిగ్గుందా? జూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం: మీరు బంగాళాఖాతంలో కలపడం కాదు..రేపు ఫలితాల తర్వాత టీడీపీ, జనసేన పార్టీల అడ్రస్ గల్లంతు కాబోతుంది. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కల్యాణ్..ఇద్దరూ ఓడిపోయి హైదరాబాద్ పారిపోబోతున్నారు. మనసు పెట్టి ప్రజల మనసులు గెలుచుకున్న నాయకుడు జగన్ గారు. 3648 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల సంకల్పాన్ని మేనిఫెస్టో చేసుకుని ముందుకెళ్లారు. ఆ మేనిఫెస్టో ప్రతి గడపకు చేరింది కాబట్టే వారు జగన్ గారిని ప్రతి గుండెలో పెట్టుకున్నారు. చంద్రబాబు ఖతం అయిపోబోతున్నాడు. టీడీపీ వారికి చెప్తున్నా. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయం. ఆ విషయం తెలుసుకుని చాలా మంది ఆ రెండు పార్టీల నుంచి మావైపు వచ్చారు. ఇప్పుడు జనసేన, టీడీపీ కాళీ అయిపోతున్నాయి. మిగిలిన వారికి కూడా చెప్తున్నా.. జగనన్న వెంట నడవండి. ప్రజా సేవలో మమేకం కండి. జగన్ పార్టీ చూడడం లేదు..మతం, కులం ఏమీ చూడటం లేదు. చంద్రబాబును నమ్మొద్దు..అతను పెద్ద మోసకారి. పార్టీ పెట్టిన వ్యక్తినే పైకి పంపించిన ఘనుడు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ను కూడా వెన్నుపోటు పొడిచాడు. అతని సినిమాలు ఆడనివ్వకుండా చేశాడు. చంద్రబాబును ప్రజలు బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పాటికే సర్వేలన్నీ చెప్తున్నాయి. జగన్ గారిది వన్సైడ్ వార్ అని స్పష్టంగా చెప్తున్నారు. వైఎస్సార్సీపీ 175కి 175 స్థానాల్లో విజయఢంకా మోగించబోతోంది. -
కుప్పంలో బాబు, పిఠాపురంలో పవన్ అడ్రస్ గల్లంతే
-
సీఎం జగన్ పై దాడి...జోగి రమేష్ ఆగ్రహం
-
ఆ విషయం బాబుకు తెలుసు కాబట్టే బీజేపీతో పాట్లు
-
విలువలు లేని దుర్మార్గుడు చంద్రబాబు
కంకిపాడు: రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని దుర్మార్గుడు, మోసగాడు చంద్రబాబు అని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. మామకు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో సీఎం అయ్యారన్నారు. సూట్కేస్లకు సీట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జోగి రమేశ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఉయ్యూరు ప్రజాగళం సభలో చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాబు రోడ్షోకు, ఉయ్యూరు సభకు జనం నుంచి ఏ మాత్రం స్పందన లేదన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో, పొర్లాడతాడో, తెగతెంపులు చేసుకుంటాడో, కాళ్ల బేరానికి వెళ్లి కాళ్లు పట్టుకుంటాడో తెలియదని ఎద్దేవా చేశారు. పనికిమాలిన రాజకీయాలు చేసే ఘనత ఆయనకే సొంతమన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడటం కాదని, కనీసం కుప్పంలో అయినా ఎమ్మెల్యేగా గెలవటం కోసం ఆరాటపడుతున్నారన్నారు. అయితే కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు. వెన్నుపోటు రాజకీయాలపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. యూత్ కాంగ్రెస్ నేతగా, వంగవీటి మోహన రంగా అనుచరుడిగా రాజకీయంగా ఎదిగానన్నారు. వైఎస్సార్ మనసు గెలుచుకున్నానని, జగనన్న పక్కన చోటు దక్కించుకున్నానని తెలిపారు. చంద్రబాబులాగా దొడ్డి దారిలో తాను ఏ పదవీ పొందలేదన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి పెనమలూరు సీటు ఆశిస్తే అడ్డంగా మోసం చేసి నూజివీడు పంపలేదా? అని నిలదీశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన బీసీ నేత కొనకళ్ల నారాయణకు కనీసం సీటు కూడా ఇవ్వకుండా మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. బోడె ప్రసాద్ ఇక్కడ గెలవలేడని, కాల్మనీ, సెక్స్ రాకెట్ అభియోగాలు ఉన్నాయని పక్కనపెడితే ఆయన కుటుంబం అంతా కన్నీరుమున్నీరుగా ఏడ్చింది చంద్రబాబు వల్ల కాదా? అని మండిపడ్డారు. మైలవరం సీటు రూ.100 కోట్లకు చంద్రబాబు అమ్ముకున్నాడని దేవినేని ఉమా విమర్శించలేదా? అని ప్రశ్నించారు. మోసపూరిత, వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబని నిప్పులు చెరిగారు -
చంద్రబాబుకు జోగి రమేష్ సవాల్
-
పెనమలూరులో మళ్లీ వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరవేస్తాం
-
పవన్ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ ఫైర్
-
పవన్ కు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్
-
బీసీ డిక్లరేషన్ పేరిట బాబు, పవన్ మరో మోసం
సాక్షి, అమరావతి: బీసీ డిక్లరేషన్ అబద్ధాల వీరులు చంద్రబాబు, పవన్కళ్యాణ్ మరో మోసానికి తెర తీశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు–బ్యాక్ బోన్ క్లాసులనే వైఎస్సార్సీపీని కాపీ కొట్టారని ధ్వజమెత్తారు. ఈ మేరకు వారిద్దరూ మంగళవారం ప్రకటన జారీ చేశారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల ముందు ఏలూరు డిక్లరేషన్లో చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా బీసీలకు 143 వాగ్దానాలిచ్చిన టీడీపీ అందులో ఒకటి కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు 50 ఏళ్లకే పెన్షన్, బీసీ సబ్ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు సహా పలు కల్లబొల్లి హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ వర్గం ప్రజలు బాబు, పవన్ను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్కు ఎలాంటి విలువ లేదన్నారు. 40 ఏళ్ల బాబు రాజకీయ జీవితంలో బీసీల్ని బాగా వాడుకుని చివరికి కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెల కులాలుగా అవమానించే సంస్కృతి నుంచి బయటపడలేదన్నారు. రూ.2.55 లక్షల కోట్ల జమ గడచిన 57 నెలల పాలనలో తమ ప్రభుత్వం డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు జమ చేసిందని మంత్రులు చెల్లుబోయిన, జోగి రమేష్ గుర్తు చేశారు. అందులో బీసీలకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.1.71 లక్షల కోట్ల మేర మేలు చేశామన్నారు. బాబు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల మేర మేలు చేస్తామంటున్నారని, ఈ లెక్కన పరిశీలిస్తే తమ ప్రభుత్వం చేసిన దానికంటే రూ.25 వేల కోట్లు తక్కువే చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. 2014లో బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తానని, చివరకు రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి బాబు దగా చేశారన్నారు. నిరుపేదలైన బీసీల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య, ఇళ్ల పట్టాలు పంపిణీపై కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. బీసీలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందన్న ఘనుడు బాబు అన్నారు. బీసీ అక్కచెల్లెమ్మలకు ఈ రోజు ఇస్తున్న చేయూత వంటి పథకం 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన బాబు ఏ ఒక్క రోజైనా అమలు చేశారా అని నిలదీశారు. -
సామాజిక న్యాయం చేసి చూపించిన ఘనత సీఎం జగన్దే: జోగి రమేష్
-
ఐప్యాక్కి పీకేకు సంబంధం లేదు: మంత్రి జోగి రమేష్
సాక్షి, విజయవాడ: ఒక పీకే(పవన్ కల్యాణ్) అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే(ప్రశాంత్ కిషోర్) వచ్చాడంటూ.. మంత్రి జోగి రమేష్ విసుర్లు విసిరారు. తాజాగా ఏపీ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మంత్రి జోగి రమేష్ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రశాంత్ కిషోర్కి అసలు ఆంధ్రాలో టీమ్ ఉందా?.. అతను సర్వేలెప్పుడు చేశాడు?. ఐ ప్యాక్ కి ప్రశాంత్ కిషోర్ కి సంబంధం లేదు. ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు ఆయనేవో రెండు మాటలు మాట్లాడాడు. ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది?. ప్రశాంత్ కిషోర్ ని ఎవరూ పట్టించుకోరు. టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్నే పీకే చదువుతున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. .. ‘చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఎంతంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరని.. జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నార’ని మంత్రి జోగి రమేష్ అన్నారు. -
‘చంద్రబాబు ఫ్యూచర్ భువనేశ్వరి ముందే కనిపెట్టేశారు’
సాక్షి, విజయవాడ: భువనేశ్వరి ఆమె మనసులో మాట బయటపెట్టారని, రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును అసహ్యించుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. భువనేశ్వరి ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షను ఆమె గమనించారని మంత్రి వ్యాఖ్యానించారు. భువనేశ్వరి సరదాగా చెప్పిన మాట కాదు.. ఆమె మనసులో ఉన్న భావనే బయటపెట్టారు. 35 ఏళ్ల నుంచి కుప్పానికి చంద్రబాబు ఏం చేయలేదు. చంద్రబాబు కుప్పానికీ పనికిరాడు. రాష్ట్రానికీ పనికిరాడని సొంత భార్యే చెప్పేసింది. సిద్ధాంతం, విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 175 స్థానాల్లో టీడీపీని నిలబెట్టలేని అసమర్ధుడయ్యాడు. టీడీపీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశాడు. పవన్కు 50, 60 పంచాలి.. మరో పార్టీకి ఇంకొన్ని పంచాలనే ఆలోచనలో ఉన్నాడు. చంద్రబాబు దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇవన్నీ గమనించారు కాబట్టే చంద్రబాబును పక్కకు తోసేయాలని భువనేశ్వరి ఆలోచన’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ పనికిరాడు.. ఎన్టీఆర్ కూతురుగా తానే బెటర్ అని భువనేశ్వరి భావిస్తున్నట్లున్నారు. చంద్రబాబు ఓడిపోతున్నాడని భువనేశ్వరి ముందే కనిపెట్టారు. ఎన్టీఆర్ కూతురుగా తనకైనా ఓట్లేస్తారని భువనేశ్వరి అనుకుంటున్నారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం’’ అని జోగి రమేష్ చెప్పారు. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
మంగళగిరిలో లోకేష్ ని మడతపెట్టి.. మంత్రి జోగి రమేష్ పంచులే పంచులు
-
‘మంగళగిరిలో లోకేష్ను మడత పెట్టేస్తాం’
గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సీటులో నారా లోకేష్ పోటీ చేయటం దారుణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జోగి రమేష్ బుధవారం మంగళగిరి వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ లోకేష్ను మడత పెట్టేస్తుందని అన్నారు. వైఎస్సాఆర్సీపీ దెబ్బకు లోకేష్ పారిపోతాడని అన్నారు. మంగళగిరి అని పలకటమే చేతకాని లోకేష్ మంగళగిరిలో పోటీ చేయటమా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి రకరకాల వేషాలలో దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలునిచ్చారు. సీఎం జగన్కు అండగా ఉండాలి.. అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకురావాలని ఎంతోమంది మేధావులు ఆలోచన చేశారని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే మేధావుల ఆలోచనలనకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకొచ్చారు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని.. ఆయనకు అందరూ అండగా ఉండాలని అన్నారు. బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు పేదలకు దేవుడని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లోనే సామాజిక న్యాయం అమలవుతుందని తెలిపారు. మంగళగిరిలో బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అగ్రవర్ణాల సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి మంగళగిరి సీటును బీసీలు కేటాయించారని అన్నారు. వైఎస్సార్సీపీ మరోసారి గెలిపించుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. దొంగల ముఠా.. పచ్చ మీడియా చెప్పే విషయాలను రాసే కథనాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. -
చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరులో నాపై పోటీ చేసే దమ్ముందా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. కంకిపాడులో పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సర్వేలు కూడా చేయించుకున్నాడని, ఎవరు పోటీ చేసినా గెలిసేది తానేనన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్ను ఎదుర్కోలేరు. ప్రతిపక్షాలను కృష్ణా నదిలో కలిపేస్తామన్నారు. ‘‘ప్రజల గుండెల్లో జగన్ నిలిచిపోయారు. ఢిల్లీలో కాంగ్రెస్ పీఠాన్ని వణికించిన ధీరుడు సీఎం జగన్. ఆయనపై సోనియా, రాహుల్ కుట్రలు పన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు. కాంగ్రెస్ ముందుపోటు పొడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలుస్తాం. పెనమలూరు గడ్డ వైఎస్సార్సీపీ అడ్డా’’ అని మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: షర్మిలకు ఏ అన్యాయం చేశామో.. ఆమె చెప్పాలి: సజ్జల -
ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం: మంత్రి జోగి రమేష్
-
ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం: మంత్రి జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్: ఎక్కడి నుంచైనా తాను పోటీకి సిద్ధమని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సీఎం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కేశినేని నాని నిజం తెలుసుకొని, సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్సీపీలో చేరారని తెలిపారు. నందిగామలో జగనన్న వాకింగ్ ట్రాక్ను మంత్రి జోగి రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, తదితర నేతలు పాల్గొన్నారు. సుమారు రూ. కోటి రూపాయల వ్యయంతో 700 మీటర్ల వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేశినేని నానికి వైఎస్ జగన్పై అభిమానం ఉన్నా..చంద్రబాబు తిట్టమని చెప్పడం వల్లే సీఎంపై విమర్శలు చేశారని మండిపడ్డారు. నానికి విజయవాడ ఎంపీ స్థానం కేటాయించినట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకోబోతుందని పేర్కొన్నారు. పెనమలూరులో ప్రత్యర్థిగా పార్థసారథి అయినా, చంద్రబాబు అయినా తన పోటీ అక్కడి నుంచే ఉంటుందని స్పష్టం చేశారు. -
ఎన్నికలకు ముందే బాబు, పవన్ అస్త్ర సన్యాసం
సాక్షి, అమరాతి: ప్రజల్లో గుర్తింపు లేని చంద్రబాబు, ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపులేని పవన్ కళ్యాణ్.. వారిద్దరూ కలిసి వైఎస్సార్సీపీని ఏం చేయగలరని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ము జనసేనకు ఉందా అని పవన్ను నిలదీశారు. ఓటమికి కారణాలను ముందే వెతుక్కుంటున్నారని, ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి ఐదేళ్ళు అయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి ఖాయమని, కుప్పం ప్రజలు తరిమికొడతారని ఆయనకు తెలిసిపోయిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ను ఎదుర్కోలేమని తెలిసి ఇద్దరూ కలిసి ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్నారని అన్నారు. ఒక రోజు లక్షల ఓట్లు తొలగించారని, మరో రోజు లక్ష ఓట్లు జోడించారని ఎల్లో మీడియాతో పచ్చి అబద్ధాలు రాయిస్తున్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక ఎన్నికల కమిషన్కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. అసలు 175 నియోజకవర్గాలలో పోటీ చేయటానికి టీడీపీ, జనసేనకు అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ... దళితులను అక్కున చేర్చుకున్న నేత సీఎం జగన్ అని అన్నారు. చంద్రబాబు దళితులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు మాత్రమే చేస్తారని, చేసే మేలేమీ ఉండదని విమర్శించారు. దళితులపై పవన్ ఆరోపణలు సరికాదన్నారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ముందుగానే దొంగ ఓట్లు అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, రాజశేఖర్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు
-
జనసేనకు ఎలక్షన్ కమిషన్ దగ్గర గుర్తింపు లేదు: జోగి రమేష్
-
‘బాబూ.. ఆ సీటు అమ్ముకున్నావా? లేదా..?’
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబును బీసీలెవ్వరూ నమ్మరని, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. నిన్నటి దాకా తన సొంత సామాజికవర్గం తప్ప మిగతా సామాజిక వర్గాల వారందర్నీ చంద్రబాబు హీనంగా, చులకనగా చూశాడు. ఇప్పుడేమో రేపోమాపో ఎన్నికలగానే మళ్లీ ఆయన వేషం మార్చాడంటూ మంత్రి దుయ్యబట్టారు. పెడనలోని మార్కెట్ యార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. బీసీలపై చంద్రబాబు దొంగ ప్రేమ: మీ తోకలు కత్తిరిస్తాం.. అంతుచూస్తానంటూ.. బీసీల్ని బెదిరించిన ఈ చంద్రబాబు మళ్లీ ఇప్పుడు బీసీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు. ఈ రోజు జయహో బీసీ పేరిట పార్టీ కార్యక్రమం పెట్టుకుని అందులో ఆయనతో పాటు అచ్చెన్నాయుడు, బండారు సత్యన్నారాయణ, ఇంకా కొంతమంది బీసీలకేదో చేసినట్టు పెద్దపెద్దగా రంకేలేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు బీసీల విషయంలో ఎంతగా పశ్చాతాప్తం పడ్డా.. వాళ్ల మాటల్ని బీసీలు నమ్మరు గాక నమ్మరు. బీసీలకు పెద్దన్నగా జగన్కు ఆదరణ: అణగారిన వర్గాలు, బడుగు, బలహీనవర్గాల్ని గుర్తించి వారిని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తెచ్చి అక్కునజేర్చుకుని బీసీలకు పెద్దన్నగా నిలిచిన సీఎం జగన్. అందుకే, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలంతా జగనన్న పట్ల ఆదరణ చూపుతూ మళ్లీ మా సీఎం నువ్వేనన్నా అని అంటున్నారు. 75 సంవత్సరాల దేశ చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిలబెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే.. ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని చెప్పుకోవాలి. గర్వంగా చెప్పుకుంటున్నాం... కేబినెట్లో 25 మంది మంత్రులుంటే.. అందులో 17 మందిని నాతో సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులిచ్చి గౌరవించిన ఘనత మన ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతోంది. 9 రాజ్యసభ స్థానాల్లో 4 స్థానాల్ని బలహీనవర్గాలకు కట్టబెట్టి బీసీల్ని అగ్రస్థానంలో నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకులు మా జగనన్న అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎస్సీల రాజ్యసభ్య సీటును అమ్ముకున్న నీచుడు చంద్రబాబు: చంద్రబాబు రాజ్యాంగ పదవుల నియామకంలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపుసోదరులందరినీ మోసం చేశాడు. ఎస్సీ సామాజికవర్గానికి రాజ్యసభ స్థానం కేటాయిస్తామని.. తెలుగుదేశం పార్టీ సీనియర్గా ఉన్న వర్ల రామయ్య గారికి కబురు పంపితే.. పాపం, ఆయన భారీ ర్యాలీగా విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వచ్చేలోగానే.. ఆ రాజ్యసభ సీటును నీ సామాజికవర్గానికి చెందిన కనకమేడల రవీంద్రనాథ్కుమార్కు అమ్ముకున్నావా..లేదా..? అనేది చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ చేస్తున్నాను. మోసానికి కేరాఫ్ చంద్రబాబు: చంద్రబాబు పేరు చెబితే మోసం గుర్తుకొస్తుంది. సుదీర్ఘ కాలం రాజకీయం అనుభవం ఉందని చెప్పుకుంటున్న ఆయన 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క అక్కచెల్లెమ్మల ఖాతాల్లోనైనా ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి జమ చేశాడా..?. డ్వాక్రా అక్కచెల్లమ్మలకు రుణమాఫీ అని చెప్పి చేతులెత్తిపోయాడు. ఆయన ఎగొట్టిన రుణమాఫీని వైఎస్ జగన్ వచ్చాక అమలు చేసిన పరిస్థితి మీ అందరూ గుర్తుచేసుకోవాలి. అదే విధంగా రైతుల్ని కూడా రుణమాఫీ పేరిట నిలువునా ముంచిన వ్యక్తి చంద్రబాబు. ఆయన పాదం పెడితేనే పచ్చని పంటలు కూడా నిలువెల్లా మాడిమసైపోతాయి. చంద్రబాబు ఉంటే కరువు.. కరువంటే కేరాఫ్ చంద్రబాబు అనేది గుర్తు. మానవత్వమే జగనన్న కులం: అదే మన జగనన్న అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి నేటి వరకు అంటే 2019 నుంచి ఇప్పటి దాకా ప్రతీ అక్కచెల్లెమ్మలు, రైతులు, అవ్వాతాతలు, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వసంక్షేమం ఎంత జమ అయిందో అందరూ లెక్కగట్టండి. కులం, మతం, రాజకీయం, ప్రాంతం చూడకుండా మన జగనన్న ఇప్పటికీ డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సొమ్ము అక్షరాలా రూ.2.41 లక్షల కోట్లు. జగనన్న మనసున్న మనిషి. మానవత్వమే ఆయన కులం. కనుకే, ఈరోజు అన్ని సామాజికవర్గాల అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతులు, యువత ఆయన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్కళ్యాణ్ అప్పట్లో ఏం చేశాడు..?: గతంలో చంద్రబాబు నెరవేర్చని హామీలను ఏనాడైనా ప్రశ్నించావా పవన్కళ్యాణ్..?. గతంలో మీరిద్దరూ కలిసే పోటీ చేశారు కదా..? ఇళ్ల స్థలం లేని అక్కచెల్లెమ్మలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఆనాడు హామీలు ఇచ్చారు. మరి, ఆ హామీలు నెరవేర్చారా? దానిపై ఏనాడైనా నీ దత్తదండ్రి చంద్రబాబును నువ్వు ప్రశ్నించావా..?. రైతు రుణమాఫీ అంటూ రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచితే.. ఆ పాపంలో నువ్వు కూడా భాగస్వామిగా ఉండలేదా..?. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేశామని ఎందుకు చేయలేదని చంద్రబాబును ఎప్పుడైనా పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? గ్రామగ్రామాన జగన్ మార్కు ఇది: చంద్రబాబుది దద్దమ్మ పాలన అని పిల్లోడు కూడా చెబుతున్నాడు. అదే మా జగనన్న ముఖ్యమంత్రిగా తన మార్క్ను గ్రామగ్రామాన చూపించారు. ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్ జగన్నన్న మార్క్ కనపడుతుంది. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, నాడు–నేడు ద్వారా రూపురేఖలు మారిన స్కూల్స్, 108, 104.. ఇలా సీఎం జగన్ ముద్ర ప్రతి గ్రామంలో స్పష్టంగా కనపడుతుంది. మరి, రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ ఉందో చూపించండి. అందరం ఏకతాటిపైకొచ్చి బాబు, పవన్లను చిత్తుగా ఓడిస్తాం: చంద్రబాబు అధికార హయాంలో ప్రజల ఖాతాల్లో ఎందుకు ఒక్క రూపాయి కూడా జమచేయలేకపోయాడని అందరూ ఆలోచన చేయాలి. అదే ప్రభుత్వం.. అదే బడ్జెట్. మరి, మా ప్రభుత్వం పేదలకిచ్చిన సొమ్మంతా గత పాలకులు ఏం చేశారు..? అంటే, వాళ్లు దోచేసుకున్నారు.. పంచుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సంక్షేమ లబ్ధిని లెక్కగట్టి.. చంద్రబాబు దవడ పగిలేటట్టు రేపటి ఎన్నికల్లో ఆయనకు అందరూ బుద్ధిచెప్పాలి. ఈ రోజు ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులంతా ఏకతాటిపైకొచ్చి చంద్రబాబు, పవన్కళ్యాణ్లను చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయం. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడైనా ఉందా ?
-
చంద్రబాబు కోసం పవన్ ఏ గడ్డయినా తింటారు: మంత్రి జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు ప్రధాని మోదీకి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లేఖ రాయటంపై మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఆ లేఖలో సీబీఐతో పాటు ఈడీ ఎంక్వైరీ చేయాలని పవన్ కల్యాణ్ కోరారు. అసలు జనసేన అధ్యక్షుడు ఏ ఆధారాలతో లేఖ రాశారని జోగి రమేశ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలపై వివరాలను వెల్లడించారు. 30.65 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్లలో స్కాం జరిగిందంటూ ప్రధానికి లేఖ రాయటం సరికాదు. ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ రాసిన 13 అంశాలపై మీడియా ద్వారా పూర్తి వివరాలతో సమాధానాన్ని పంపిస్తున్నానని జోగి రమేశ్ తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. అంతా ఆన్లైన్ పేమెంట్లు. మరి, అవినీతికి ఆస్కారం ఎక్కడ పవన్?, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కల్యాణ్కు ఇళ్లు ఉందా? ఆధార్ కార్డు ఉందా? డోర్ నెంబర్ ఉందా? కనీసం ఓటు అయినా ఉందా? ఎంత దుర్మార్గులు మీరు. పచ్చి దుర్మార్గుడు అయిన చంద్రబాబు తాబేదారు పవన్ కల్యాణ్ ఏ గడ్డి అయినా కరవటానికి సిద్ధపడతాడు. 75 ఏళ్ల దేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగనటువంటి అభివృద్ధి, సంక్షేమం నాలుగేళ్ల ఎనిమిది నెలల్లో ఇంత అభివృద్ధి జరుగుతోంది. జగనన్న ముఖ్యమంత్రి కాగానే.. పాదయాత్రలో కష్టాలు, కన్నీళ్లు పడ్డ అక్కచెల్లెమ్మలు, నిరుపేదలు గూడులేక నిరాశ్రయులుగా ఉన్న వారికి సీఎం జగన్ అడ్రస్ ఇచ్చారు. ఎప్పటి నుంచో కలలుగా మిగిలిపోయిన 30.65 లక్షల పేదింటి అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. అక్కచెల్లెమ్మలకు పట్టాలు ఇవ్వటంతో పాటు ఇప్పటికే వారిలో 21.75 లక్షల మందికి గృహ నిర్మాణం చేపట్టారు. కొన్ని లక్షల అక్కచెల్లెమ్మలు గృహ ప్రవేశాలు చేసుకుని జయహో జగనన్న అని నినదిస్తున్నారు. మరి, ఇందులో స్కాం జరుగుతోందా? ఇంటి నిర్మాణానికి చేతికి డబ్బులు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కటీ ఆన్లైన్ పేమెంట్ జరుగుతోంది. బుర్ర లేకుండా స్కాం అని పవన్ కల్యాణ్ అనటం ఏమిటి? ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియకుండా పేదల గృహాల మీద స్కాం అని లేఖ రాయటమా? గతంలో చంద్రబాబు నెరవేర్చని హామీలను ఏనాడైనా ప్రశ్నించావా పవన్ గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ కలిసే పోటీ చేశారు. ఇళ్ల స్థలం లేని అక్కచెల్లెమ్మలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఆనాడు హామీలు ఇచ్చారు. మరి, ఆ హామీలు నెరవేర్చారా? దానిపై ఏనాడైనా చంద్రబాబును పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? రైతు రుణమాఫీ అంటూ రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచాడు. ఆ పాపంలో భాగస్వామిగా ఉన్న పవన్ ఏనాడైనా ప్రశ్నించాడా? డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేశామని ఎందుకు చేయలేదని చంద్రబాబును ఎప్పుడైనా పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. దానిపైన చంద్రబాబును ఏనాడైనా పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు ఇళ్లస్థలాలు ఇవ్వలేని దద్దమ్మ. కానీ ఈనాడు సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా, ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇంత మంచి చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్ సెల్యూట్ చేయకుండా స్కాం జరుగుతోందంటూ లేఖలు రాయటం ఏమిటి? రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా సీఎం జగన్ మార్క్ కనిపిస్తుంది. మరి, చంద్రబాబు తన మార్క్ చూపించగలడా?,చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్లు కోరుకున్న గ్రామానికి వెళ్దాం. వారి మార్క్ ఏ ఒక్కటి ఉన్నా చెప్పండి. ఈరోజున రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్ జగన్ మార్క్ కనపడుతుంది. ఇదిగో.. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, నాడు-నేడు ద్వారా రూపురేఖలు మారిన స్కూల్స్, 108, 104.. ఇలా సీఎం జగన్ ముద్ర ప్రతి గ్రామంలో స్పష్టంగా కనపడుతుంది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించటమే కాదు.. చూపిస్తున్నారు. కుప్పంలో ఏ గ్రామానికి అయినా వెళ్దాం. అంతెందుకు నారావారిపల్లెకు వెళ్లినా జగనన్న మార్క్ కనపడుతుంది. మరి, రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ ఉందో చూపించండి. ఇంత కడుపు మంట మీకు ఎందుకు రా బాబూ. రాష్ట్రంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ.... జయహో జగనన్న అంటుంటే.. కడుపుమంట, కడుపు ఉబ్బరంతో ప్రతిపక్ష నాయకులు ఉడికి పోతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదలపై ప్రతిపక్షాలు ఎందుకు విషం చిమ్ముతున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఎక్కడికంటే అక్కడకి పోదాం. ప్రజలను అడుగుదాం. ఎవరు మేలు చేశారో ప్రజలే చెబుతారు. ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో ఎయిర్పోర్టు కడతారంట. కుప్పంలో ఎయిర్పోర్టా? 14 ఏళ్లలో సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశావు చంద్రబాబు. కుప్పంలో పంటలు పండిస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముతారంట. కనీసం కుప్పం ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు చంద్రబాబు ఇవ్వలేదు. ఆర్డీఓ ఆఫీసు తెచ్చుకోలేదు. రెవిన్యూ డివిజనల్ ఆఫీసు జగన్ గారు కుప్పం ప్రజలకు ఇచ్చారు. పేద ప్రజలు ఇళ్లు కట్టుకుని సంతోషంగా ఉన్నా విషం కక్కుతున్నారు. పవన్ కల్యాణ్ లేఖపై చర్చకు సిద్ధం. పవన్ కల్యాణ్ సిద్ధమా? పవన్ కల్యాణ్ లేఖలో ప్రతి అంశం మీద చర్చించటానికి సిద్ధంగా ఉన్నాను. చర్చకు పవన్ కల్యాణ్ రావాలి. ఎక్కడైనా ఒక్క రూపాయి తేడా ఉందో చూపించండి. ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్రానికి రావటం హోటల్లో పడుకోవటం. ఒక గంట కార్యకర్తలతో మాట్లాడి.. 23 గంటలు పడుకోవటం పవన్ కల్యాణ్ చేస్తున్నారు. కాకినాడ చుట్టుప్రక్కల అభివృద్ధి ఎలా జరుగుతుందో వెళ్లి చూడు పవన్ కల్యాణ్. నేడు 17వేలకు పై చిలుకు జగనన్న కాలనీలు కడుతున్నాం. కట్టేవి ఇళ్లు కాదు. ఊళ్లకు ఊళ్లే వేగంగా శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. పేదల హృదయాల్లో చిరస్థాయిల్లో నిలబడాలని కోరుకుంటున్నాడు కాబట్టే.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. రూ.2.50 లక్షల కోట్లు డీబీటీ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందించారు. ప్రతి ఇంటిలో ఆనందం.. ప్రతి గ్రామంలో అభివృద్ధిని సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. ఇంతకన్నా ఏమి కావాలి? కళ్లు కుట్టి.. కడుపు మంటతో పచ్చ రోగుల్లా.. ప్రధానికి లేఖలు రాస్తున్నారు. పేదల ఇళ్లపై కాదు.. చంద్రబాబు అవినీతిపై ప్రధానికి లేఖ రాయి పవన్ పవన్ కల్యాణ్ లేఖ రాయాల్సింది గృహ నిర్మాణాల మీద కాదు.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం మీదనో.. చంద్రబాబు మీద జరిగిన ఐటీ రైడ్స్ మీదనో లేఖలు రాయాలి. త్వరలో మేం కూడా చంద్రబాబు అవినీతి మీదన లేఖ రాయబోతున్నాం. చంద్రబాబు దోచేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్కు ఎంత ముట్టింది? పవన్ కల్యాణ్కు ఏ విధంగా మనీలాండరింగ్ జరిగింది. ఎంత ప్యాకేజీ తీసుకున్నాడో లేఖ రాస్తాం. చంద్రబాబు హయాంలో ఐటీ, ఈడీ రైడ్స్ చేస్తే తప్పు. పవన్ దృష్టిలో చంద్రబాబు నోట్లో వేలు పెడితే కొరకలేని వాడు. చంద్రబాబు అవినీతిపై పవన్ లేఖలు రాయడు. ఎందుకు అంటే.. చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నాడు కాబట్టి. గతంలో గ్యాస్కు నెలకు రూ.100 సబ్సిడీ అని రూ.7200 చంద్రబాబు ఎగ్గొట్టాడు. రేపో మాపో ఎన్నికలకు వెళ్తాం. చంద్రబాబు, పవన్ చేసే దుర్మార్గాలు ప్రజలకు తెలియవా? ఇద్దరు కలసి సూపర్ 6 అని మేనిఫెస్టో పెడతారంట. సీఎం కాకముందు ప్రజలు అది ఇస్తా.. ఇది ఇస్తా అని చెబుతారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఫ్రీగా బస్సు ఎందుకు ఇవ్వలేదు. గ్యాస్ బండ్లు ఎందుకు ఇవ్వలేదు. 2014లో గ్యాస్ సిలిండర్కు నెలకు రూ.100లు చొప్పన ఐదేళ్లకు రూ.7200 ఇస్తానని చెప్పి నయాపైసా అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వేయలేదు. ఇవాళ గ్యాస్ సిలిండర్లు అంటే అక్కచెల్లెమ్మలు నమ్ముతారా? ఆ గ్యాస్ సిలిండర్లతోనే మిమ్మల్ని కొడతారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయం ప్రతిపక్ష పార్టీలు పొత్తులు.. ఎంతమందితో పెట్టుకున్నా.. వైఎస్ఆర్సీపీని ఇంచు కూడా కదిపించలేరు. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ విజయదుందిభి మోగించబోతోంది. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇళ్ల స్థలాలుపై వివరాలు ఇవిగో పవన్.. ప్రభుత్వ ఎంత ఇచ్చామో, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎంత భూమి కొనుగోలు చేశామో వివరాలు పంపిస్తున్నాము. ఎక్కడా కూడా నయాపైసా తేడా ఉండదు. పేపర్, పెన్ను ఉందని ఇంగ్లీషులో నాలుగు మాటలు రాసి ప్రధాని మోడీకి పంపించటం కాదు. ప్రధాని మోడీని ఏమి అడగాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ ఇవ్వమని అడగాలి. కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో టీడీపీతో లింకులు. గృహ నిర్మాణానికి ఇస్తున్న డబ్బులు సరిపోవట్లేదు. ఇంకా పెంచమని మోడీని పవన్ కల్యాణ్ అడిగితే ప్రజలు హర్షిస్తారు. గృహాలు కట్టుకుని సంతోషంగా ఉన్న పేదింటి అక్కచెల్లెమ్మలపై కడుపు మంట ఎందుకు? గృహాలు, ఇళ్ల స్థలాల వివరాలను పవన్ కల్యాణ్కు పంపిస్తున్నాం. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక సాధికార యాత్ర చూసిన తరువాత చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చంద్రబాబు పార్టీలో ఏ ఒక్క బీసీలు మిగల్లేదు. గత ఎన్నికల ముందు కూడా జయహో బీసీ అని రాజమండ్రిలో చంద్రబాబు సభ పెట్టాడు. అది అట్లర్ ప్లాఫ్ అయిపోయింది. ఈరోజు బీసీలు ఎవ్వరూ టీడీపీలో లేరు. చంద్రబాబు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా.. ఎన్ని పనికిమాలిన వాగ్ధానాలు చేసినా టీడీపీని బీసీలు ఎవ్వరూ నమ్మరు. ఒకప్పుడు బీసీలు టీడీపీని నిలబెడితే వారిని చంద్రబాబు తన్ని తరిమేశారు. నేడు బీసీలు అంతా సీఎం జగన్ వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం కావటం ఖాయం. ఇదీ చదవండి: 2023 సుభిక్షం.. సంతోషం -
చంద్రబాబు పొత్తులు..ఏకిపారేసిన మంత్రి జోగి రమేష్
-
మేనిఫెస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా?: జోగి రమేష్ సవాల్
సాక్షి, తాడేపల్లి: తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టిందని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ దివాళా తీసిందని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదనీ తెలుసని ఎద్దేవా చేశారు. పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వైస్సార్సీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 99.5% హామీలను అమలు చేసిన నేత సీఎం జగన్మోహన్రెడ్డి అని చెప్పిన జోగి రమేష్.. దీనిని తాము నిరూపిస్తామని తెలిపారు. మేనిఫస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. టీడీపీ 2014 నాటి మేనిఫెస్టో, వైఎస్సార్సీపీ 2019 నాటి మేనిఫెస్టో మీద చర్చకు రాగలరా?అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని తెలిపారు. మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టే ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్ళి మళ్ళీ ఓట్లు అడగగలుగుతున్నామన్నారు. చరిత్రలో ఎవరైనా ఎన్నికల తర్వాత ఇలా ఇంటికి వెళ్ళి అమలు చేసిన కార్యక్రమాల గురించి చెప్పారా? అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబులాగా మేనిఫెస్టోని నెట్ నుంచి తొలగించలేదని దుయ్యబట్టారు. మేనిఫెస్టోని చించి శనక్కాయల పొట్లాలుగా మార్చలేదని మండిపడ్డారు. 2014లో మేనిఫెస్టోని అమలు చేయలేదు కాబట్టే చంద్రబాబును జనం చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. ‘అసలు చంద్రబాబుకు ఏపీతో ఏం పని?. ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉందా?. ఇల్లు, డోర్ నెంబర్ ఉందా?. ఇలాంటి అడ్రస్ లేని వ్యక్తులు మా గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి. రైతులు, డ్రాక్రా మహిళలకు రుణమాఫీ పేరుతో దారుణంగా మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు. అలాంటి మోసకారి, దుర్మార్గుడు అయినందునే చంద్రబాబుకు ఈ గతి పట్టింది. 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్న జగన్ లాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా?. అసలు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా?. ‘చంద్రబాబు దిక్కుమాలిన మేనిఫెస్టోని అసలు ఎవరైనా నమ్ముతారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోకాళ్ల మీద నడిచినా ఆ పాపం పోదు. మళ్ళీ ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణమని అంటున్నారు. మేము ఎలాంటి ప్రకటనా చేయకపోయినా మాపై ఆరోపణలు చేస్తున్నారు. రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్, లోకేష్ ఉండేది, తినేది హైదరాబాదులో. అక్కడ కూర్చుని ఏపీలో రాజకీయాలు చేయటం ఏంటి?. ఈ ఎన్నికల తర్వాత వారు ఈవైపు ఇక కన్నెత్తి కూడా చూడరు’ అని జోగి రమేష్ విమర్శించారు. చదవండి: అర్హులకే నంది అవార్డులు.. ఎవరికీ అన్యాయం జరగదు: పోసాని -
ఇద్దరు పీకేలు...పీకేది ఏమీ లేదు..
-
ఓట్ల నమోదులో టీడీపీ ఓవరాక్షన్.. ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర సంఘం ప్రతినిధులను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. ఈసీ ప్రతినిధులను జోగి రమేష్, పేర్ని నాని, కొఠారు అబ్బయ్య చౌదరి కలిశారు. ఈ సందర్బంగా ఓట్ల నమోదులో టీడీపీ చేస్తున్న అవకతవకలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేశారు. అనంతరం, మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో ఓట్ల నమోదులో టీడీపీ చేస్తున్న అవకతవకలపై ఫిర్యాదు చేశాం. తెలంగాణలో ఓట్లు ఉన్న వాళ్ళకి ఇక్కడ తొలగించాలని కోరాం. అక్కడ ఓటు హక్కు వినియోగించి మళ్ళీ ఇక్కడ ఓటు నమోదుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది. డబుల్ ఎంట్రీ క్రిమినల్ చర్య. దీని కోసం హైదరాబాద్లో టీడీపీ క్యాంపెయిన్ చేస్తోంది. దానిపై ఫిర్యాదు చేశాం. రాష్ట్ర యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు మానేసి ఎన్నికల ఫిర్యాదుల్లోనే ఉండాలని టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేస్తోంది. కోనేరు సురేష్ అనే వ్యక్తి ఈ తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాం. కోనేరు సురేష్ తప్పుడు ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆశ్చార్యపోయారు. మై పార్టీ డ్యాష్ బోర్డ్ అనే యాప్లో ఓటర్ లిస్టులో ఫోటోలు, అడ్రస్, కులం అన్ని వివరాలు ఉన్నాయి. దానిపై చర్యలు తీసుకోవాలని కోరాం. టీడీపీ సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం వ్యవహారంపై ఫిర్యాదు చేశాం. టీడీపీ-జనసేన కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఫిర్యాదు చేశాం. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికెళ్లి ప్రలోభాలకు గురి చేస్తుందని ఫిర్యాదు ఇచ్చాం. టీడీపీ మేనిఫెస్టో ప్రచారంతో చంద్రబాబు సంతకంతో లెటర్లు ఇస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. 2019లో ఓటర్ జాబితాలో ఉన్న ఓట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఫేక్ ఓట్లను నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దొంగే దొంగ అన్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు’ అని సైటెర్లు వేశారు.


