వైఎస్సార్ కడప జిల్లా:
వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులపై ఫిర్యాదు
- వైఎస్సార్సీపీ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి మన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు
- వైఎస్సార్సీపీ నాయకులను పదజాలాలతో దూషించిన కూటమి నాయకురాలను వెంటనే అరెస్ట్ చేయాలి
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి - రాష్ట్రంలో రెడ్బుక్ పాలనలో రావణ కాష్టం జరుగుతున్నది. ఇండ్లను పెట్రొల్ బాంబులతో తగలబెడుతున్నారు
-.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి
జోగి రోహిత్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ
- ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రోహిత్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
- తమ ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడం లేదు
- దీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించండి
- ఇంటి వద్ద తగిన భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరిన రోహిత్
- రోహిత్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరుపనున్న హైకోర్టు
నెల్లూరు:
ఏపి రాష్ట్ర ఇమేజ్ను మంటగలిపారు:చంద్రశేఖర్ రెడ్డి
- లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు జుగుబ్సాకరమైన వ్యాఖ్యలు చేశారు
- చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని ఎన్డిడిబీ రిపోర్ట్ ఇచ్చింది
- నేటికి ఆ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ఫ్లెక్స్ లు ఏర్పాటు చేయడం ఎంత వరకు సబబు
- మాజీ మంత్రుల ఇండ్లపై కుటుంబ సభ్యులు లోపల వుండగానే దాడులకు తెగబడ్డారు
నెల్లూరు:
- నెల్లూరు వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- శ్రీవారి లడ్డూ వ్యవహారంలో అబద్దపు, అభ్యంతకర పోస్టర్లు ఏర్పాటు పై పిర్యాదు
- మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఆనం విజయకుమార్ ఆధ్వర్యంలో పిర్యాదు
కాకాణి కామెంట్స్
- రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యం ఏలుతుంది
- సీఎం, డిసిఎం లు శ్రీవారి లడ్డూ పై నిరాధారమైన ఆరోపణలు చేశారు
- ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువుల మనోభావాలు దెబ్బతీశారు
- లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వం పై నిందలు వేసే ప్రయత్నాలు చేశారు
- విజయవాడ:
మాజీ మంత్రి జోగి రమేష్ను కలిసిన ఎమ్మెల్సీ తలశిల రఘురాం - విశాఖ:
తిరుపతి లడ్డుపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చేసిన తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు.. - ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు కేకే రాజు, వరుదు కళ్యాణి, మోల్లి అప్పారావు డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్..
తిరుపతి
- మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గుండాలు దాడి నిరసిస్తూ బాలాజీ కాలనీ పూలే విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసి విభాగం ఆధ్వర్యంలో నిరసన
- రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న బిసి నాయకులు
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఏపీ రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించాలి
-గీత యాదవ్. వైఎస్సార్సీపీ,మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
అనంతపురం::
చంద్రబాబు హింసా రాజకీయాలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు నిరసనగా ఆందోళన చేపట్టారు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అరాచకాలపై నల్ల కండువాలతో నిరసన తెలిపారు వైఎస్సార్సీపీ నేతలు. ‘ చంద్రబాబు పాలన.. ఆటవిక రాజ్యం’ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అంటూ నిరసన వ్యక్తం చేశారు.
మొన్న(శనివారం), నిన్న(ఆదివారం) టీడీపీ గూండాలు రెచ్చిపోయి మరీ విధ్వంసం సృష్టించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు దిగారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేసేందుకు యత్నించారు. ఆ క్రమంలోనే అంబటి రాంబాబు ఇంటిపై రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడులకు దిగారు. జోగి రమేష్ ఇంటికి నిప్పుపెట్టారు టీడీపీ గూండాలు. పెట్రోల్ బాంబుతో ఇంటిని ధ్వంసం చేసే యత్నం చేశారు.
రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు.
వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది. దీనిపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తుందని వైఎస్సార్సీపీ మండిపడతోంది.


