Politics

బీఆర్ఎస్ ఎవరి చేతుల్లోకి వెళ్లబోతోందో తెలుసుకో కేటీఆర్: పొంగులేటి
సాక్షి, ఖమ్మం జిల్లా: జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సంగతి తెలుస్తుందంటూ కేటీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎవరి చేతుల్లోకి వెళ్లబోతుందో కేటీఆర్ తెలుసుకోవాలన్న పొంగులేటి.. రెండుసార్లు బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు‘‘మీ కుటుంబ సమస్యలను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇటీవల ఒక మహిళ ఎమ్మెల్యే ప్రమాదంలో మృతి చెందినప్పుడు జరిగిన ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నో స్థానంలో ఉందొ లెక్క పెట్టుకో....త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ పార్టీ స్థానం ఎక్కడ వుంటుందో ఆలోచించుకో. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి ఏంటో చూసుకో.. నీ దయా దాక్షిణ్యాలతో బీ ఫామ్ తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కేసీఆర్.. పాలేరు వచ్చి ముక్కు నేలకు రాసినా ఏం చేయలేక పోయాడు నువ్వెంత’’ అంటూ కేటీఆర్పై పొంగులేటి మండిపడ్డారు.

అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వంపై ఇంత తక్కువ వ్యవధిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైందని తెలిపారు. అసలు రాష్ట్రంలోప్రభుత్వం ఉందా? అన్న సందేహం ప్రజలకు కలుగుతోందన్నారు.శాసనసభలో తాము మాట్లాడేలా తగిన సమయం కేటాయించడం ఇష్టం లేకనే, వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మొత్తం సభ్యులతో కలిపి, కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే ఇచ్చే అతి తక్కువ సమయంలో ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావిస్తామని ఆయన ప్రశ్నించారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న ఆయన, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు అవసరమైన పూర్తి మెటేరియల్ సిద్ధంగా ఉందని, కానీ మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదు కాబట్టే.. సభకు హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం:రాష్ట్రంలో కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఏడు త్రైమాసికాలు పెండింగ్. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు. గత ఏడాది ఎన్నికల ముందు.. 2024 జనవరి–మార్చి మొదలు ఈ ఏడాది సెప్టెంబరు వరకు చూస్తే.. మొత్తం ఏడు క్వార్టర్లు.. అంటే దాదాపు రూ.4900 కోట్లు బకాయి. అయితే ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.900 కోట్లు మాత్రమే. అంటే ఇంకా దాదాపు లా రూ.4 వేల కోట్లు బకాయి. వసతి దీవెన గత ఏడాది రెండు దఫాలు. ఈ ఏడాది మరో దఫా పెండింగ్. అలా మొత్తం రూ.4200 కోట్లు బకాయి.వసతి దీవెన కింద మరో రూ.2,200 కోట్లు బకాయి పడ్డారు. అలా ఈ రెండు పథకాలకే రూ.6,200 కోట్లు బకాయి పడ్డారు. కాలేజీలు కూడా చేతులెత్తేసే పరిస్థితులు వచ్చాయి. స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నాశనం అయ్యింది. ట్యాబులిచ్చే కార్యక్రమం ఆగిపోయింది. సీబీఎస్ఈని రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది. స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు పని చేయకపోవడం కూడా ఆగిపోయింది. ఇంకా పిల్లలకు ఇచ్చే చిక్కీలు కూడా ఆపేశారు. ఇక వైద్య రంగం పరిస్థితి చూస్తే మరింత ఘోరంగా ఉంది. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీని ఆపేశారు. ఆరోగ్య శ్రీకి రూ.3500 కోట్లకు పైగా బకాయి పడ్డారు. దీంతో పథకంలో వైద్యం చేయలేమని ఆస్పత్రుల్లో బోర్డులు పెట్టేస్తున్నారు. ఇంకా ఆరోగ్య ఆసరా కింద రూ.600 కోట్ల బకాయి పడ్డారు.ఇవీ మెడికల్ కాలేజీల ప్రయోజనాలు:మన ప్రభుత్వంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఏడు కాలేజీలు పూర్తి చేశాం. ఒక మెడికల్ కాలేజీ అనేది కేవలం కాలేజీ మాత్రమే కాదు. దాంతో టీచింగ్ హాస్పిటల్ ఉంటుంది. మంచి వైద్య సేవలందుతాయి. అది ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు నడపకపోతే.. ఆయా రంగాల్లో ప్రై వేటు దోపిడిని అరికట్టగలుగుతారా? అందుకే ఎక్కడైనా, వాటిని ప్రభుత్వం తప్పనిసరిగా నిర్వహిస్తుంది.మనం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ పనులు మొదలుపెట్టాం. దాని వల్ల అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలందుతాయి. ఒక మెడికల్ కాలేజీ ఉంటే, సీనియర్ వైద్యులు, స్పెషలిస్టులు, నర్సులు అందరూ అందుబాటులోకి వస్తారు. వైద్య సేవలందిస్తారు. అలా ప్రజలకు మంచి వైద్యం అందడమే కాకుండా, మన పిల్లలకు.. ముఖ్యంగా నిరుపేద పిల్లలకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి.వ్యవసాయ రంగం పరిస్థితి దారుణం:రైతులకు యూరియా కూడా సప్లై చేయని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మొత్తం బ్లాక్ మార్కెట్ను నడిపిస్తున్నారు. ఇంకా ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఏ పంటకు ఎంత ధర ఇవ్వాలన్న దానిపై నాడు మనం ప్రతి గ్రామంలోనూ పోస్టర్ ఇచ్చే వాళ్లం. సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రైతులకు తోడుగా నిలబడే వాళ్లం. మార్కెట్ జోక్యంతో మంచి ధరలకు పంటలు కొన్నాం. అందుకు రూ.7800 కోట్లు ఖర్చు చేశాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏమీ లేవు. ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు. అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. వ్యవసాయం చేయడానికి రైతులు భయపడుతున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ పూర్తిగా తిరోగమనమే.ఎక్కడికక్కడ దోపిడి. నీకింత.. నాకింత:శాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వ్యవస్థల్లో ఇంత లంచాలు ఎప్పుడూ చూడలేదు. ఎక్కడికక్కడ సిండికేట్లుగా మారి వసూళ్లు చేస్తున్నారు. పెదబాబుకు ఇంత, చిన బాబుకు ఇంత అని పంచుతున్నారు. లిక్కర్ను ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అక్రమంగా పర్మిట్ రూమ్లు నడుపుతున్నారు. ఉచిత ఇసుక అన్నారు. అది లేదు. ఇంకా క్వార్ట్›్జ, సిలికా.. దేన్నీ వదిలిపెట్టడం లేదు. చివరకు ఫ్లైయాష్ కూడా అమ్మేసుకుంటున్నారు.అన్నింటా విఫలమైనా నిస్సిగ్గుగా సూపర్హిట్!:అన్నింటా దారుణంగా విఫలమైనా, ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోయినా, ఇటీవల సూపర్సిక్స్.. సూపర్హిట్ పేరుతో కార్యక్రమం చేశారు. ఆ సభ సందర్భంగా ఇచ్చిన అడ్వరై్టజ్మెంట్, ఎన్నికల నాటి యాడ్తో చూస్తే పూర్తిగా మారిపోయింది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు. 50 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్ రూ.4 వేలు లేవు. పథకాలు కూడా మారిపోయాయి. ఇదీ ఈ ప్రభుత్వ నిర్వాకం.ప్రజల గొంతు వినడం ప్రభుత్వానికి ఇష్టం లేదు:అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించాలన్న తపన, ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. నాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు, టీడీపీ నుంచి వారంలోనే 5గురు మనవైపు వచ్చి కూర్చున్నారు. అలా ఇంకొందరిని లాక్కుని, చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేద్దామని చాలా మంది సలహా ఇస్తే, నేను వద్దన్నాను. విపక్షం గొంతు వినాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆమేరకు వారికి అవకాశాలు ఇచ్చాం. సభలో వారు చెప్పేది విన్నాం. కానీ, ఈరోజు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షం లేకుండా ఉండాలని కోరుతోంది. అందుకే మనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వద్దని అనుకుంటోంది. అందుకే మనల్ని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇటీవల ప్రెస్మీట్లో మూడు అంశాలపై గంటన్నర మాట్లాడాను. అలా మనకు అసెంబ్లీలో కూడా అవకాశం ఇస్తేనే, ప్రజా సమస్యలు ప్రస్తావించగలం. అలా కాకుండా ఒక ఎమ్మెల్యే మాదిరిగా కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఇస్తే, ఏం మాట్లాడగలం?ఉన్నదే ఏకైక విపక్షం.. అయినా..!:నిజానికి సభలో ఉన్నవి నాలుగే నాలుగు పార్టీలు. అందులో మూడు కూటమిగా అధికారంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఒకేఒక విపక్షం. అటు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూటమి. ఇక్కడ మనది ఒకేఒక విపక్షం. కానీ దాన్ని గుర్తించబోమని చెబుతోంది. ఎందుకంటే సభలో ప్రజల గొంతు వినడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అందుకే సభకు వెళ్లకుండా ఇక్కడ ప్రెస్మీట్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించాం.గట్టిగా నిలబడండి. నిలదీయండి:కానీ, మనకు కౌన్సిల్లో మంచి బలం ఉంది. రాజకీయంగా ఎదగడానికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు ఇది మంచి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. మిగిలింది మరో రెండున్నర ఏళ్లు మాత్రమే. మరో అసెంబ్లీ సెషన్ తర్వాత.. చూస్తుండగానే మరో ఏడాది గడుస్తుంది. కాబట్టి, మీరు కౌన్సిల్లో గట్టిగా నిలబడండి. గట్టిగా మాట్లాడండి. ప్రజా సమస్యలు లేవనెత్తండి. ప్రభుత్వాన్ని నిలదీయండి.వీటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీయండి:సూపర్ సిక్స్. సూపర్ సెవెన్ వైఫల్యం..రీ వెరిఫికేషన్ పేరిట దివ్యాంగులకు ఇబ్బందులు..పెన్షన్ కోతలు..ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన బకాయిలు..యూరియా సహా ఎరువుల కొరత, రైతుల అగచాట్లు..పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం..రైతుల ఆత్మహత్యలు..కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ..వైఎస్సార్సీపీ ఇచ్చిన ఇంటి స్థలాలు లాక్కోవడం..ఆరోగ్య శ్రీ బంద్..విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ..ప్రభుత్వంలో అవినీతి దోపిడీ..ఉద్యోగస్తుల సమస్యలు, డీఏలు, పీఆర్సీలు, ఐఆర్, సరెండర్ లీవ్స్ తదితర బకాయిలు, వారిపై వేధింపులు..పులివెందుల జడ్పీటీసీ బైపోల్లో ప్రజాస్వామ్యం ఖూనీ..అమరావతిలో తొలివిడత రైతులకు ఏమీ చేయకుండానే రెండో విడత ల్యాండ్ పూలింగ్..అసైన్డ్ అన్న పదయం తీసేయడం. మళ్లీ బినామీల పేర్లతో కొనుగోలు..రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం..15 నెలల్లోనే రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల బాదుడు..రాష్ట్ర ఆదాయానికి దారుణంగా గండి:రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. అదంతా అధికార పార్టీ నేతల జేబుల్లోకి పోతోంది. ఇసుక అమ్మకం ద్వారా మన హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాగా, ఇప్పుడు అది రావడం లేదు. మద్యం ఆదాయం మన హయాంలో ప్రభుత్వానికి వచ్చేది. కానీ, ఇప్పుడేం జరుగుతోంది?. వీళ్లే బెల్టు షాప్లు పెట్టించి, ఎక్కువ రేట్లకు అమ్మి అంతా జేబుల్లోకి వేసుకుంటున్నారు. లాటరైట్, క్వార్ట్›్జ తవ్వుకుంటున్నారు. అమ్ముకుంటున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. హార్బర్లలో వాళ్లే పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు. ప్రభుత్వానికి పైసా ఆదాయం రావడం లేదు. మండలిలో మనకు మంచి బలం ఉంది. కాబట్టి మండలి సభ్యులు పోరాట పటిమ చూపాలి. ప్రజలకోసం గట్టిగా పోరాటం చేయాలి.అధికార పక్షం.. డబుల్ యాక్షన్:అసెంబ్లీలో అధికారపక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటోంది. ‘నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా’ అన్నరీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ఇంకా.. ‘ప్రజల్ని ఏడిపించేది ప్రభుత్వమే. వారిని ఏడిపించి, మళ్లీ వారు ఏడుస్తున్నారని, వారి తరఫను తామే ఏడుస్తామంటూ ప్రభుత్వం డబుల్ రోల్ ప్లే చేస్తానంటోంది. అలా రెండు వైపులా యాక్షన్ చేస్తోంది’. నిజం చెప్పాలంటే వారు ఏడ్చినట్లు నటించిన మాత్రాన ప్రజల్లో సానుభూతి రాదు. విపక్షంగా మేము ప్రజా సమస్యలు లేవనెత్తితేనే, అందులో నిజాయితీ ఉంటుంది.నాడు చంద్రబాబు డ్రామాలు:నాడు చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదు. ఆయన్ను ఎవరూ ఏమీ అనకున్నా.. బయటకు వెళ్లి ఏడ్చాడు. నేను రికార్డులన్నీ చూశాను. మన సభ్యులు ఎవరూ ఏమీ అనలేదు. అయినా అబద్ధాలు చెప్పి, సభకు రాలేదు. అదే మనం జాయింట్ సెషన్లో గవర్నర్ అడ్రస్ సమయంలో అటెండ్ అయ్యాం. ఏటా అలా వెళ్తున్నాం. గవర్నర్ ఎదుట మన సమస్య ప్రస్తావించి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి వస్తున్నాంమెడికల్ కాలేజీలు కాపాడుకోవాలి:మెడికల్ కాలేజీలు అన్నవి తరతరాల ఆస్తి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నాడు. పైగా అందులో ఫీజులు దారుణంగా ఏకంగా రూ.57 లక్షలకు పెంచేస్తున్నాడు. ఆ కాలేజీలు తన అత్తగారి సొత్తు అన్నట్టుగా అమ్మేస్తున్నాడు. అవి ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలి. ప్రజలకు అత్యంత నష్టం కలిగిస్తున్న ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్నిరకాల మార్గాలను అన్వేషించాలి. చంద్రబాబు తన వాళ్లకు కట్టబెట్టడానికి ఏమైనా చేస్తాడు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు పొడిస్తే సహించేది లేదు

నువ్వు ఎంపీవా? కేంద్రం నుంచి రూపాయి తెచ్చావా??.. కేశినేని చిన్నిపై పేర్ని నాని సెటైర్లు
సాక్షి,విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా ఎంపీ కేశినేని చిన్ని వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ మంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. ఎంపీ చిన్ని అక్కసు, ఆక్రోశం, బాధ అన్ని వెళ్లగక్కారు. ఆయనకు ప్రజాసేవ పట్టదు.. ప్రజలు పట్టదు.. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టరు. రోజూ క్లోజింగ్ లెక్కలు చూసుకోవడం సరిపోతుంది. అందుకని రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మాట్లాడితే ఎలా.2007లో ఎండోమెంట్ కమిషన్ వాళ్ళు 130 మంది 2 లక్షలు కట్టి దేవుడు భూముల అక్షన్లో పాల్గొన్నారు. 130 మంది అక్షన్లో పాల్గొంటే నేను భూమి ఎలా కొట్టేశానో మరి చిన్ని చెప్పాలి. 130 మందిలో 30వ వ్యక్తి టీడీపీ మంత్రిగారి మనిషి ఉన్నాడు. మరి నేను కూడా ఆయన్ని కొనేసానా?. కుక్క తోక పట్టుకొని కృష్ణా నది పట్టుకొని ఈదడం కుదరదు.బెజవాడ ఎంపీ కూర్చు స్థానాన్ని అదమ స్థానానికి పడేశారు. భారత్ నుండి గొప్పగా క్రికెట్లో కప్పులు తెచ్చారని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పదవి ఇచ్చారు. భూములపై విచారణ చేపించండి.. భూములు లాక్కొండి. ఐదు ఎకరాల 30సెంట్లు వెనక్కి లాక్కోండి. అందరిపై కేసులు పెడుతున్నారు గా.. పెట్టుకోండి..బియ్యం కొట్టేసామని చెపుతున్నారు. నా కేసు ఏ పాటిదో టీడీపీ నేతలను,న్యాయవాదుల్ని అడగండి. నాకు శిక్ష వేయించాలి అనుకొంటే 25ఏళ్ళు, 50 ఏళ్ళు వెయిస్తే వేయించండి. కేజీ రూ.90 రూపాయల చొప్పున నేను కట్టాను. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం వ్యాపారం చేసేది మీరు కదా?. పెద్దిరెడ్డి మీ మేనేజర్ కాబట్టి మీ ఆఫీస్లో కూర్చొని రేషన్ బియ్యం వ్యవహారం నడుపుతున్నారు. నెలకు కోటిన్నర మీకు పెద్దిరెడ్డి ఇస్తున్నారు. ఇది మేం చెప్పింది కాదు.. మీ టీడీపీ నేతలే చెపుతున్నారు. ఇక్కడ డబ్బు కొట్టేసి హైదరాబాద్ పంపిస్తున్నారు. ఆ కొట్టుడు దగ్గరే ఏడుగురు ఎమ్మెల్యేలకు పడడం లేదు. తమ్ముడు కిషోర్ని అడ్డం పెట్టుకొని లోక్సభ నియోజకవర్గాన్ని మొత్తం లూటీ చేస్తున్నారు. ఇసుక మన దగ్గర నుండి ఖమ్మం పోతోంది. బూడిద చెన్నై కంపెనీకి ఇచ్చేశారు. నందిగామలో ఏడు రిచ్లలో ఐదు మూసేసి రెండు మాత్రమే నడుస్తున్నాయి. పదహారు టైర్ల టిప్పర్లు.. 50 టిప్పర్లు నందిగామ నుండి హైదరాబాద్ వెళ్తుంది. ఒక్కో లారీకి రూ. లక్ష 25వేలు వసూళ్లు చేస్తున్నారు.ఢిల్లి నుండి పార్లమెంట్ నుండి ఒక్క రూపాయి అయినా తెచ్చావా?. కంచికచర్ల దగ్గర ఉన్న డంప్ ఎందుకు అధికారులు పట్టుకోరు?. పట్టాబి, మీరు కలిసి గొడుగు పల్లి వెంకటరస్వామి స్థలం వేసేశారు. దేవుడు భూములు, అమ్మిన , అద్దెకు ఇచ్చిన వేలం పాట ద్వారా మాత్రమే నిర్వహించాలి.. నేరుగా ఇవ్వకూడదు. హైకోర్టు ఉత్సవాల పనులు ఆపేయాలి తీర్పు ఇస్తే పనులు అపలేదు. కోర్ట్ మాటలు కూడా లెక్కలేదు. బుడమేరు మునిగినప్పుడు కంగారు పడలేదు. న్యూ ఆర్ఆర్ పేటలో డయేరియా కట్టడికి హడావిడి లేదు. అమ్మవారి ఉత్సవాలకు మాత్రం హడావిడి..దీనివల్ల ఎవరికి లాభం లేదు.. ఎంపీ అంటే మొత్తం పీకేసి లోపల వేసుకోవొచ్చు అనే కొత్త అర్థం చెప్పాడు.కేశినేని నాని ఎంపీ పదవి గర్వంగా, హుందాగా బ్రతికాడు. నువ్వేమో బెడజవాడ ఎంపీ స్థానాన్ని అధమానికి పడేశావు.వచ్చే ఎన్నికల్లో ఏడుగురు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎంపీ సీటు ఇవ్వకుండా అపుతారు. రూ.48 కోట్లు కట్టి సిటిజన్ షిప్ కట్టి డల్లాస్లో ట్రంప్కి పోటీగా పోటీ చేయొచ్చు. ఇప్పటికైనా మంచి పనులు చేస్తే ప్రజలు అయినా అయ్యో పాపం అనుకుంటారు’ అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు పేదల ఇళ్ల పట్టాల రద్దు నిర్ణయంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: పేదల ఇళ్ల పట్టాల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల పట్టాల రద్దు చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పోస్టు చేశారు. ‘చంద్రబాబు గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.చంద్రబాబుగారూ మీ హయాంలో ఇళ్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కాని మేము వారి సొంతింటి కలను నిజం చేసేలా “పేదలందరికీ ఇళ్లు’’ కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాం. ఇందులో కొనుగోలుకే రూ.11,871 కోట్లు ఖర్చుచేశాం. మా ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే రూ.1.5లక్షల కోట్లపైమాటే. ఇంటిపట్టావిలువే ఒక్కోచోట రూ. 2.5 లక్షల నుంచి రూ.10లక్షలు - రూ.15లక్షల వరకూ ఉంది. ఇళ్లపట్టాలకోసం, ఇళ్లకోసం ధర్నాలు, ఆందోళనలు మా ఐదేళ్లకాలంలో కనిపించకపోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం. మరి చంద్రబాబుగారూ…, మీ జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా? మీరు చేయకపోగా, మేం చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారు.మా హయాంలో మేం 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్ చేయించి, మొదలుపెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాం. అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబుగారూ మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా? మా హయాంలో లబ్ధిదారులకు సిమెంటు, స్టీలు, వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం. ఈ రూపంలో ప్రతి లబ్ధిదారునికి రూ.40వేలు మేలు జరగడమే కాకుండా, దీంతోపాటు 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో రూ.15వేలు సహాయం చేశాం. మరో రూ.35వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, ఆ వడ్డీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డాం. ఈ రకంగా ప్రతి ఇంటికీ కేంద్రం ఇచ్చే రూ.1.8లక్షలు కాక, మొత్తంగా రూ.2.7లక్షల లబ్ధి చేకూర్చడమే కాకుండా, మౌలిక సదుపాయాల కొరకు మరో రూ.1లక్ష కూడా ఖర్చు చేసుకుంటూ పోయాం. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు చంద్రబాబుగారూ?చంద్రబాబుగారూ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా…, కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరకు, మురికికూపాలుగా ఉండకూడదని, నీరు, కరెంటు, డ్రైనేజీ, ఇంకుడుగుంతలు, రోడ్లు తదితర సదుపాయాలకోసం దాదాపుగా రూ.3,555 కోట్లు మా హయాంలో ఖర్చుచేశాం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా మేం చేసిన ఖర్చు దాదాపుగా రూ.35,300 కోట్లు. ఈ 16-17 నెలల కాలంలో మీరెంత ఖర్చుచేశారు?మా హయాంలో “పేదలకు ఇళ్లు’’ కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని మీరు చేయని పన్నాగంలేదు. మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారు. అమరావతిలో 50వేల పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇస్తే, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్టేలు తేవడమే కాకుండా, అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి ఇచ్చిన ఆ పట్టాలను రద్దుచేసి విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని ద్రోహం చేశారు. మరి మీరు చేసింది ద్రోహం కాదా? పేద కుటుంబాలమీద మీరు కక్ష తీర్చుకోవడం లేదా? ఇది చాలదు అన్నట్టు, ఇక మిగిలిన పట్టాల్లో ఎక్కడైతే ఇంకా ఇళ్లు మీరు బాధ్యతగా శాంక్షన్ చేయించి, కట్టించాల్సింది పోయి, అక్కడ ఇంకా ఇళ్లు కట్టలేదు కాబట్టి, వాటిని, రిజిస్టర్ అయిన ఆ పట్టాలను, మీకు హక్కులేకపోయినా వెనక్కి తీసుకుని, మీ స్కాముల కొరకు, ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కులు కడతాం అంటూ ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటుగా లేదా, చంద్రబాబుగారూ..!ఈ 16-17 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పనితీరు చూస్తే సున్నా. మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు. కాని, ఇప్పటివరకూ ఒక్క ఎకరం గుర్తించలేదు, ఒక్క ఎకరం కొనలేదు. ఏ ఒక్కరికీ పట్టాకూడా ఇవ్వలేదు. ఎవ్వరికీ ఇల్లుకూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఇచ్చినవాటిని లాక్కునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరోవైపు పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలను లాక్కుంటున్నారు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదలకొరకు అవసరమైతే దీనిపై న్యాయపోరాటాలు చేస్తాం, వారికి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్కు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. .@ncbn గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 18, 2025
Sports

Asia Cup: మా జట్టులో భారత్, పాక్ వినిపించదు.. మేమంతా ఒకే కుటుంబం
ఆసియా కప్-2025లో పాల్గొన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టులో ఆ దేశంలో పుట్టినవారు కాకుండా వలస వచ్చిన ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఐదుగురు భారత్కు చెందినవారు కాగా, మరో ఐదుగురు పాకిస్తానీలు.ఇక ఈ టోర్నీలో టీమిండియా- పాక్ జట్ల మధ్య తాజా ‘షేక్ హ్యాండ్’ వివాదం నేపథ్యంలో యూఏఈ టీమ్లో ఉన్న ఇరు దేశాల క్రికెటర్ల మధ్య సంబంధాలపై కూడా చర్చ జరిగింది. అయితే కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ ఈ మొత్తం అంశాన్ని తేలిగ్గా కొట్టిపారేశాడు. భారత్, పాక్ మధ్య ఏం జరిగినా తమకు సంబంధం లేదని, తామంతా యూఏఈ జట్టు ఆటగాళ్లం మాత్రమేనని అతడు స్పష్టం చేశాడు.ఇక వసీమ్ స్వయంగా పాకిస్తాన్లోని ముల్తాన్కు చెందిన వాడు కాగా...హైదర్ అలీ, జునైద్, రోహిద్, ఆసిఫ్ ఇతర పాకిస్తాన్ క్రికెటర్లు. భారత్కు చెందిన సిమ్రన్జీత్ సింగ్, రాహుల్ చోప్రా, హర్షిత్ కౌశిక్, ధ్రువ్ పరాశర్, అలీషాన్ షరఫు టీమ్లో కీలక సభ్యులు.‘యూఏఈ టీమ్ సభ్యులంతా ఒక కుటుంబ సభ్యుల్లాంటివాళ్లం. ఎవరూ భారతీయుడు కాదు, ఎవరూ పాకిస్తానీ కాదు. భారత్, పాక్ వివాదానికి సంబంధించి మా జట్టులో అసలు ఎలాంటి చర్చా జరగలేదు, జరగదు కూడా. మా టీమ్ సభ్యులంతా కలిసి ఎంతో క్రికెట్ ఆడాం. ఒకే కుటుంబంలాగే ఉంటూ ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం’ అని వసీమ్ వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే.. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్తో విభేదాల నేపథ్యంలో బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్కు పాక్ టీమ్ చాలా ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం యూఏఈ అప్పీల్ చేస్తే పాక్ వాకోవర్ ఇచ్చినట్లుగా ప్రకటించి యూఏఈని విజేతగా ఖరారు చేయవచ్చు. అయితే తమకు అలాంటి ఆలోచన ఏమాత్రం రాలేదని మొహమ్మద్ వసీమ్ వెల్లడించాడు. ఇక యూఏఈపై విజయంతో.. టీమిండియాతో పాటు పాక్కు సూపర్-4 దశకు అర్హత సాధించిది. గ్రూప్-ఎ నుంచి దాయాదులు తదుపరి దశకు క్వాలిఫై కాగా.. యూఏఈ, ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో యూఏఈ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.

పుణేరి పల్టన్ ‘టాప్’ షో
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో పుణేరి పల్టన్ ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకొని పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. గత రెండు మ్యాచ్ల్లో నెగ్గిన పుణేరి పల్టన్ గురువారం జరిగిన పోరులో యు ముంబాపై ఏకపక్ష విజయం సాధించింది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన పుణేరి పల్టన్ 40–22 పాయింట్ల తేడాతో యు ముంబాను చిత్తుచేసింది. పుణేరి పల్టన్ జట్టు తరఫున స్టువర్ట్ సింగ్ 8 పాయింట్లు, గుర్దీప్ 5 పాయింట్లు సాధించగా... అభినేష్, గౌరవ్ ఖత్రి చెరో 4 పాయింట్లు సాధించారు. యు ముంబా జట్టు తరఫున అమీర్ మొహమ్మద్ 6 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో యు ముంబా జట్టు 12 రెయిడ్ పాయింట్లు సాధించగా... ఫుణేరి పల్టన్ జట్టు 14 రెయిడ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే ట్యాక్లింగ్లో యు ముంబా 6 పాయింట్లకు పరిమితం కాగా... పల్టన్ 20 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడిన పుణేరి పల్టన్ 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’ ప్లేస్కు చేరింది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 45–41తో బెంగాల్ వారియర్స్పై గెలుపొందింది. జైపూర్ రైడర్లు నితిన్ 13, అలీ 12 పాయింట్లతో విజృంభించగా... వారియర్స్ తరఫున దేవాంక్ 16, మన్ప్రీత్ 10 పాయింట్లు సాధించారు. దేవాంక్కు ఇది వరుసగా ఏడో ‘సూపర్–10’ కావడం విశేషం. ఈ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా (38 మ్యాచ్ల్లో) 400 రెయిడ్ పాయింట్లు సాధించిన ప్లేయర్గా దేవాంక్ నిలిచాడు. నేడు పుణేరి పల్టన్తో హరియాణా స్టీలర్స్, తమిళ్ తలైవాస్తో తెలుగు టైటాన్స్ ఆడతాయి.

ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు వేళాయె!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)... హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)... అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)... రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్)... టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)... ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)... ఇలా అన్ని ఆటల్లో లీగ్ల హవా సాగుతున్న వేళ...కొత్తగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు కూడా వచ్చే నెలలో తెరలేవనుంది. న్యూఢిల్లీ: ప్రతిభకు పట్టం కడుతూ... ఆటకు మరింత విస్తృత ప్రచారం కల్పిస్తూ... ప్రపంచ ఆర్చరీలో భారత్ను నంబర్వన్గా నిలపడమే లక్ష్యంగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు అంకురార్పణ జరిగింది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగునున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వివరాలను గురువారం నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం ఆరు జట్లు పాల్గొననున్న ఈ లీగ్లో 48 మంది ఆర్చర్లు బరిలోకి దిగనున్నారు. వారిలో 12 మంది విదేశీయులు కాగా... మిగిలిన 36 మంది స్వదేశీ ఆర్చర్లు. ప్రపంచ నంబర్వన్ ఆర్చర్లు ఆండ్రియా బెకెర్రా (కాంపౌండ్), బ్రాడీ ఎలీసన్ (రికర్వ్) ఈ లీగ్లో భాగం కానున్నారు. భారత్ నుంచి స్టార్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, దీపిక కుమారి, అతాను దాస్, బొమ్మదేవర ధీరజ్ ఇలా పలువురు ఆర్చర్లు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్కే చెందిన చిట్టిబొమ్మ జిజ్ఞాస్, మాదాల సూర్య హంసిని, తెలంగాణ అమ్మాయి తనపర్తి చికిత కూడా ఈ లీగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ లీగ్తో భారత ఆర్చరీ ముఖచిత్రం మారిపోతుందని భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) భావిస్తోంది. ‘ఆర్చరీలో మనకు ఘన చరిత్ర ఉంది. పురాతన కాలం నుంచి మన దేశంలో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వరల్డ్కప్, వరల్డ్ చాంపియన్షిప్స్, ఆసియా చాంపియన్షిప్స్, కామన్వెల్త్ చాంపియన్షిప్స్ ఇలా ప్రతి పోటీలోనూ భారత ఆర్చర్లు పతకాలు సాధించారు. ఒలింపిక్స్లో మాత్రం పతకం ఇంకా బాకీ ఉంది. ఈ లీగ్ ద్వారా ఆ ముచ్చట కూడా తీరడం ఖాయమే’ అని ఏఏఐ కార్యదర్శి వీరేంద్ర సచ్దేవ్ అన్నారు. » ఒక్కో జట్టులో నలుగురు మహిళలు, నలుగురు పురుష ఆర్చర్ల చొప్పున 8 మంది ఉంటారు. ఇందులో ఇద్దరు విదేశీయులు, ఆరుగురు భారత ఆర్చర్లు ఉంటారు. విదేశీయుల్లో ఒకరు పురుష ఆర్చర్, మరొకరు మహిళా ఆర్చర్ ఉంటారు. » భారత ఆర్చరీ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్తో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆర్చర్లను ఎంపిక చేశారు. » కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో ఒలింపిక్ ప్రమాణాలకు తగ్గట్లు 70 మీటర్లు, 50 మీటర్లలో పోటీలు జరుగుతాయి. ఈ లీగ్ మొత్తం ప్రైజ్మనీ 2 కోట్ల రూపాయలు. » రౌండ్ రాబిన్ పద్ధతిలో రోజుకు మూడు మ్యాచ్లు (20 నిమిషాలు) నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో బాణం సంధించేందుకు 20 సెకన్ల సమయం ఇస్తుండగా... ఈ లీగ్లో 15 సెకన్లకు తగ్గించారు. » రికర్వ్ విభాగంలో మూడో ర్యాంకర్ దీపిక కుమారి, ఆంధ్రప్రదేశ్కు చెందిన ధీరజ్తో పాటు వెటరన్స్ అతాను దాస్, తరుణ్దీప్ ఉన్నారు. » కాంపౌండ్ విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ రిషభ్ యాదవ్, అభిషేక్ వర్మ, ప్రథమేశ్, ప్రియాంశ్, పర్ణీత్ కౌర్ బరిలో ఉన్నారు. ఏ జట్టులో ఎవరున్నారంటే...పృథ్వీరాజ్ యోధాస్ (ఢిల్లీ): మాటియస్ గ్రాండె, ఆండ్రియా బికెర్రా, అభిషేక్ వర్మ, గాథ, ప్రియాంశ్, శర్వరి, క్రిష్ కుమార్, ప్రాంజల్. చెరో ఆర్చర్స్ (జార్ఖండ్): మాథియస్ ఫుల్లెర్టన్, క్యాథరినా బ్యూర్, రాహుల్, ప్రీతిక ప్రదీప్, అతాను దాస్, మాదాల సూర్య హంసిని, సాహిల్ రాజేశ్, కుంకుమ్ మొహొద్. కాకతీయ నైట్స్ (తెలంగాణ): నికో వైనెర్, ఎలియా క్యానల్స్, నీరజ్, వెన్నం జ్యోతి సురేఖ, రోహిత్, అవ్నీత్, చిట్టిబొమ్మ జిజ్ఞాస్, తిషా పునియా. చోళా చీఫ్స్ (తమిళనాడు): బ్రాడీ ఎలీసన్, మీరి మారిటా, రిషభ్ యాదవ్, దీపిక కుమారి, తరుణ్దీప్ రాయ్, తనిపర్తి చికిత, పులకిత్, అన్షిక కుమారి. మైటీ మరాఠాస్ (మహారాష్ట్ర): మైక్ స్కాలెస్సర్, అలెగ్జాండ్రా వాలెన్సియా, బొమ్మదేవర ధీరజ్, పరీ్ణత్ కౌర్, అమన్ సైనీ, భజన్ కౌర్, మృణాల్ చౌహాన్, మధుర. రాజ్పుతానా రాయల్స్ (రాజస్తాన్): మెటా గాజోజ్, ఎల్లా గిబ్సన్, ప్రథమేశ్, అంకిత, ఓజస్ ప్రవీణ్, బసంతి, సచిన్ గుప్తా, స్వాతి. ఏపీఎల్ డైరెక్టర్గా అనిల్ కామినేని ఈ లీగ్కు రూపకల్పన చేసిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ కామినేని... ఏపీఎల్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ప్రపంచ అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొంటున్న ఈ లీగ్తో భారత ఆర్చర్లకు ఎంతో లాభం జరుగుతుందని అనిల్ వెల్లడించారు. ‘ప్రపంచ ఆర్చరీ సంఘంతో ఈ లీగ్ గురించి చర్చించాం. ఇకపై ప్రతీఏటా దీన్ని నిర్వహిస్తామని అందుకు తగ్గట్లు అంతర్జాతీయ షెడ్యూల్ రూపొందించాలని చెప్పాం. ప్రస్తుతం ఆర్చరీలో దక్షిణ కొరియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఆరంభ లీగ్లో పలువురు కొరియా స్టార్లు పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. అయితే ఈ లీగ్ సమయంలో వారి దేశంలో సెలెక్షన్ ట్రయల్స్ ఉన్నాయి. ఫలితంగా ఈసారి నుంచి కాకుండా వచ్చే ఏడాది కొరియా ప్లేయర్లను కూడా చూడవచ్చు’ అని అనిల్ తెలిపారు. సినీనటుడు రామ్చరణ్ ఈ లీగ్కు అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు. ప్రతిభను గుర్తించి మరింత సానబెట్టేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపకరించనుంది. ప్రపంచ ఆర్చరీలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయంగా ఈ లీగ్ రూపకల్పన చేసినట్లు డైరెక్టర్ అనిల్ కామినేని వెల్లడించారు. ఆర్చరీలో కొత్త విప్లవం తీసుకొచ్చి తద్వారా ప్రపంచంలో తిరుగులేని శక్తిగా నిలపడమే తమ ధ్యేయమని తెలిపారు. ఈ క్రమంలోనే ఆర్చరీని మరింత మందికి చేరువ చేసేందుకు రామ్చరణ్ను అంబాసిడర్గా ఎంపికచేసినట్లు వివరించారు.

వరల్డ్ X యూరప్
శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా): ప్రపంచ పురుషుల టెన్నిస్లోని మేటి ఆటగాళ్లతో ప్రతి యేటా నిర్వహించే ‘లేవర్ కప్’ టోర్నమెంట్కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో మూడు రోజులపాటు ఈ టోర్నీ జరుగుతుంది. టీమ్ యూరప్, టీమ్ వరల్డ్ జట్ల మధ్య ఈ టోర్నీని నిర్వహిస్తారు. 2017లో మొదలైన ఈ టోర్నీ 2020లో కరోనా మహమ్మారి కారణంగా జరగలేదు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఈ టోర్నీ జరగ్గా... ఐదుసార్లు టీమ్ యూరప్ (2017, 2018, 2019, 2021, 2024), రెండుసార్లు టీమ్ వరల్డ్ (2022, 2023) ‘లేవర్ కప్’ చాంపియన్గా నిలిచాయి. ఈసారి టీమ్ యూరప్ తరఫున ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), 11వ ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్), 12వ ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే), 17వ ర్యాంకర్ జాకుబ్ మెన్సిఖ్ (చెక్ రిపబ్లిక్), 22వ ర్యాంకర్ టామస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్), 25వ ర్యాంకర్ ఫ్లావియో కొ»ొల్లి (ఇటలీ) ఆడనున్నారు. టీమ్ వరల్డ్ తరఫున ప్రపంచ 5వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), 8వ ర్యాంకర్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా), 21వ ర్యాంకర్ ఫ్రాన్సిస్కో సెరున్డోలో (అర్జెంటీనా), 32వ ర్యాంకర్ అలెక్స్ మిచెల్సన్ (అమెరికా), 42వ ర్యాంకర్ జోవా ఫోన్సెకా (బ్రెజిల్), 62వ ర్యాంకర్ రిలీ ఒపెల్కా (అమెరికా), 86వ ర్యాంకర్ జెన్సన్ బ్రూక్స్బై (అమెరికా) బరిలోకి దిగుతారు. టీమ్ యూరప్ జట్టుకు ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ యానిక్ నోవా (ఫ్రాన్స్)... టీమ్ వరల్డ్ జట్టుకు అమెరికా మేటి ప్లేయర్, ఎనిమిది గ్రాండ్స్లామ్ సింగిల్స్ నెగ్గిన ఆండ్రీ అగస్సీ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.
National

విషాదం: విషవాయువులకు బలైన కార్మికులు
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఓల్డ్ పోర్టు వద్ద.. బుధవారం బార్జ్ లోపల బ్యాలస్ట్ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా ముగ్గురు పారిశుధ్య కార్మికులు మరణించారు. ట్యాంక్లోని విష వాయువును పీల్చడం వల్లనే వారు చనిపోయినట్లు అధికారులు దర్యాప్తులో తెలిపారు.ఈ ఘటనలో చనిపోయిన కార్మికులు రాజస్థాన్కు చెందిన సందీప్ కుమార్ (25), తూత్తుకుడి జిల్లాలోని పున్నకాయల్కు చెందిన జెనిసన్ థామస్ (35), తిరునెల్వేలి జిల్లాలోని ఉవరికి చెందిన సిరోన్ జార్జ్ (23)గా గుర్తించారు.ట్యాంక్లో నీరు నిలిచిపోవడం వల్ల విషపూరిత వాయువు పేరుకుపోయాయి. ట్యాంక్లోని విషవాయువులను బయటకు పంపించానికి ముందే.. ముగ్గురు వ్యక్తులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే లోపలికి ప్రవేశించారని భావిస్తున్నారు. అంతే కాకుండా పని అప్పగించడానికి ముందే.. కార్మికులకు ఎటువంటి భద్రతా సామగ్రి ఇవ్వలేదని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.మొదటి వ్యక్తి లోపలి వెళ్లిన తరువాత ఉలుకూపలుకు లేకుండా ఉండిపోయాడు. అతన్ని వెతుక్కుంటూ వెళ్లిన రెండో వ్యక్తి, రెండో వ్యక్తి కోసం వెళ్లిన మూడో వ్యక్తి.. ముగ్గురు ఈ విషవాయువుల ప్రభావానికి బలయ్యారని అధికారులు వెల్లడించారు. వారి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్ పోలీస్ స్టేషన్కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ మదన్ నేతృత్వంలోని పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.ఈ సంఘటన తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల మత్స్యకార గ్రామాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. పున్నకాయల్, అలందలై, మనప్పాడు, ఉవరి ప్రతినిధులు బార్జ్ యజమాని, కెప్టెన్, బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్కు ఒక వినతిపత్రం సమర్పించారు. అంతే కాకుండా మృతుల కుటుంబాలు.. మృతదేహాలను స్వీకరించడానికి నిరాకరించాయి. ఒక్కొక్కరికి రూ.4 కోట్లు, మొత్తం రూ.12 కోట్లు పరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. కార్మికుల రక్షణ కోసం పరికరాలను అందించడంలో కంపెనీ నిర్లక్ష్యం వహించిందని వారు ఆరోపించారు.

కుటుంబ పింఛనుకు సవతి తల్లి అనర్హురాలు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) నిబంధనల ప్రకారం పింఛను ‘బహుమతి కాదు’, సవతి తల్లిని కుటుంబ పింఛనుకు అర్హురాలిగా పరిగణించలేమని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టపరంగా, బాంధవ్యం కోణంలో చూసినప్పుడు సవతి తల్లి కన్న తల్లికి భిన్నంగా ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. తల్లి అంటే కన్నతల్లి అనే అర్థంలోనే భావించాల్సి ఉంటుందని, సవతి తల్లిని కాదని తెలిపింది. నిర్వహణ, ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ఉన్నత న్యాయస్థానం గతంలో వివిధ సందర్భాల్లో ఇచి్చన తీర్పులను కేంద్రం ప్రస్తావించింది. పింఛను ప్రయోజనాలను కోరుకునే వ్యక్తి, సంబంధిత చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం స్పష్టమైన అర్హతను నిరూపించుకోవాల్సి ఉంటుందని గురువారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. జోగి అనే ఉద్యోగి చిన్న తనంలోనే ఆరేళ్ల వయస్సు ఉండగా కన్నతల్లి చనిపోయింది. దీంతో, తండ్రి మరొకరిని వివాహం చేసుకున్నారు. సవతి తల్లి జయశ్రీ ఆయన్ను పెంచి పెద్ద చేశారు. జోగి 2008లో చనిపోయారు. ఆయనది ఆత్మహత్య అని ఐఏఎఫ్ తెలిపింది. కుటుంబ పింఛనుకు వచ్చే సరికి సవతి తల్లి అర్హురాలు కాదని ఐఏఎఫ్ స్పష్టం చేసింది. దీంతో, ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తల్లి స్థానంలో తనకు కుటుంబ పింఛను ఇవ్వాలని కోరారు. ఐఏఎఫ్ పింఛను నిబంధనలు–1961 ప్రకారం ఉద్యోగి చనిపోయిన పక్షంలో కుటుంబ పింఛనుకు..వితంతువు, చట్టబద్ధంగా వివాహం చేసుకున్న తండ్రి లేదా తల్లి, చట్టబద్ధ వారసుడైన కుమారుడు లేదా కుమార్తె అర్హులని స్పష్టం చేస్తోందని కేంద్రం వివరించింది. ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.

అన్ని మతాలనూ గౌరవిస్తా
న్యూఢిల్లీ: తాను అన్ని మతాలనూ గౌరవిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పష్టంచేశారు. విష్ణుమూర్తిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల పట్ల ఆయన గురువారం స్పందించారు. ఆరోపణలను ఖండించారు. తన వ్యాఖ్య లను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో యునె స్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఖజు రహో ఆలయ ప్రాంగణంలో ఉన్న జవేరీ టెంపుల్లో భగవాన్ విష్ణుమూర్తి వి గ్రహం దెబ్బతిన్నదని, ఆలయాన్ని పునర్ నిర్మించి, అక్కడ మరో విగ్రహాన్ని ఏర్పా టు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాకేశ్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ గవాయ్తోపాటు జస్టిస్ కె.వినో ద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ నెల 16న విచారణ చేపట్టింది. పిటిషన్ను తిరస్కరించింది. అది ప్రచార ప్రయోజన వ్యాజ్యం అంటూ ఆక్షేపించింది. విగ్రహం విషయంలో మీరు ఆరాధిస్తున్న విష్ణుమూర్తినే ఏదో ఒకటి చేయమని అడగండి అంటూ పిటిషనర్కు జస్టిస్ గవాయ్ సూచించారు. అలా చేస్తే మీరు నిజమైన విష్ణు భక్తులవుతారు అని చెప్పారు. దేవుడిని ప్రార్థించి, తర్వాత యోగా చేయండి అని పేర్కొన్నారు. శివుడికి మీరు వ్యతిరేకం కాకపోతే అక్కడే ఖజురహోలో పెద్ద శివలింగం ఉంది, దాన్ని పూజించండి అని జస్టిస్ గవాయ్ చెప్పారు. విష్ణుమూర్తి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో జనం తప్పుపట్టారు. జస్టిస్ గవాయ్కి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అండగా నిలిచారు. జస్టిస్ గవాయ్ తనకు చాలా ఏళ్లుగా తెలుసని, ఆయన అన్ని మతాల ఆధ్యాత్మిక, పవిత్ర క్షేత్రాలను దర్శిస్తుంటారని చెప్పారు. అన్ని మతాలను సమానంగా భావిస్తుంటారని తెలిపారు. భగవంతుడిని కించపర్చడం ఆయన ఉద్దేశం కాదని అన్నారు. న్యూటన్ నియమం ప్రకారం ఒక చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుందని వివరించారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో ఒక చర్యకు తప్పుడు అతి ప్రతిస్పందన ఉంటుందని పేర్కొన్నారు. జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలను వక్రీకరించడం దురదృష్టకరమని స్పష్టంచేశారు. సోషల్ మీడియా పోస్టులను జస్టిస్ వినోద్ చంద్రన్ ఖండించారు. సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా మారిందని విమర్శించారు.

భారతీయ సంస్థల అధికారుల వీసాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రమాదకరమైన ఫెంటానిల్ మాదకద్రవ్యం తయారీలో ఉపయోగించే రసాయనాల అక్రమ రవాణాతో ప్రమేయం ఉన్న భారతీయ కంపెనీల ఉన్నతాధికారులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ఉన్నతాధికారుల వీసాలను రద్దు చేసినట్లు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. ట్రంప్ పరిపాలన విధానాల్లో భాగంగా అమెరికన్లను ప్రమాదకరమైన సింథటిక్ నార్కోటిక్స్ నుండి రక్షించే ప్రయత్నంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఎంబసీ పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదలచేసింది. కంపెనీల ఎగ్జిక్యూటివ్లతోపాటు వారి కుటుంబ సభ్యులను అమెరికాకు ప్రయాణించడానికి అనర్హులుగా ప్రకటించింది. ఇప్పటికే వాళ్లలో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల అభ్యర్థనలను తిరస్కరించామని పేర్కొంది. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్లోని 221(ఐ), 212(ఎ)(2)(సీ), 214(బీ) సెక్షన్లకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఫెంటానిల్ రసాయనాల స్మగ్లింగ్ చేసే కంపెనీలకు చెందిన ఇతర ఎగ్జిక్యూటివ్లు భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేస్తే లోతైన పరిశీలన, అధ్యయనం తప్పవని యూఎస్ రాయబార కార్యాలయ ప్రతినిధి జోర్గాన్ ఆండ్రూస్ చెప్పారు.
International
NRI

గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్.. ఇదే ప్రధాన లక్ష్యం
మహిషి సంహారం కోసం ఈ లోకంలో ఉద్భవించిన హరిహర పుత్రుడు అయ్యప్పకు కేరళ సర్కారు ప్రపంచ వ్యాప్త పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. గల్ఫ్లోని అబుధాబి సహా.. వేర్వేరు దేశాల్లో ఇప్పటికే అయ్యప్ప స్వామి ఆలయాలున్నా.. అమెరికా నుంచి ఆచంట వరకు అయ్యప్ప భక్తులు ఏటా శబరిగిరీశుడిని దర్శించుకుంటున్నా.. కేరళలోని శబరి కొండపై కొలువుదీరిన అయ్యప్పను విశ్వవ్యాప్తం చేయాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)తో కలిసి సంకల్పించింది. ప్రభుత్వాలు శబరిమలను ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారంటూ ఇంతకాలం కొనసాగుతున్న అపవాదులను తుడిచిపెట్టేందుకు కేరళ సర్కారు ప్రపంచ అయ్యప్ప భక్తులను ఏకం చేస్తోంది. ఏటా మండల, మకరవిళక్కు సీజన్లలో శబరిమలకు వచ్చే భక్తుల సాధకబాధకాలను వినేందుకు తొలిసారి ‘గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్’ (global ayyappa conclave) పేరుతో భారీ సభను ఏర్పాటు చేస్తోంది. దేవుడు అంటే నమ్మకం లేని, కరడుగట్టిన కమ్యూనిస్టుగా పేరున్న కేరళ సీఎం పినరయి విజయన్ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడపడం గమనార్హం..!ఎన్నారైలు మొదలు.. సామాన్యులకూ ఆహ్వానం3 వేల మంది అయ్యప్ప భక్తులకు సరిపడేలా పంపానది తీరంలో టీడీబీ, కేరళ సర్కారు భారీ కాన్క్లేవ్కు ఏర్పాట్లు చేశాయి. భారతీయులు స్థిరపడ్డ దాదాపు అన్ని దేశాలకు చెందిన అయ్యప్ప భక్తులను ఈ వేడుకకు ఆహ్వానించాయి. ఇక సామాన్య భక్తులకు కూడా చాలా సులభంగా అవకాశం కల్పించి, పాసులను జారీ చేశాయి. శబరిమల వర్చువల్ క్యూ వెబ్సైట్ ద్వారా ఏటా ఏదో ఒక సీజన్లో అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకైతే.. సెల్ఫోన్లకు సందేశాలు పంపి మరీ ఆహ్వానించాయి. ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించి, ఐడీకార్డులను జారీ చేశాయి. అలా ఐడీకార్డులు డౌన్లోడ్ చేసుకున్న వారికి పేరుపేరునా ఫోన్ చేసి.. ‘‘మీరు తప్పకుండా వస్తున్నారు కదా? సెప్టెంబరు 20వ తేదీన మీరు ఉండాల్సిందే.. ఉదయం 8 గంటలకే రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మరిచిపోవొద్దు’’ అని కాన్క్లేవ్ తేదీని గుర్తుచేస్తున్నాయి. అయ్యప్ప ముందు అందరూ సమానమే అన్నట్లుగా.. సామాన్య భక్తులకు కూడా సభాస్థలి వద్ద ముందు వరసలో చోటు కల్పించాయి.ఇప్పుడే ఎందుకు?ఇప్పుడే ప్రభుత్వం, టీడీబీ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తులను కేటగిరీలుగా విభజించి, ఆదాయమార్గంగా మలచుకోవాలనేదే పినరయి సర్కారు ప్లాన్ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం.. ‘‘ఇది ఆరంభమే. సెక్యూలరిజాన్ని మీరే అర్థం చేసుకోవాలి. మాకు అంతా సమానమే. త్వరలో మైనారిటీలకూ గ్లోబల్ కాన్క్లేవ్ ఏర్పాటు చేస్తాం’’ అని చెబుతోంది.ఇదే ప్రధాన లక్ష్యంశబరిమల అయ్యప్ప స్వామి కీర్తిని ప్రపంచానికి చాటడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీబీ, ప్రభుత్వం చెబుతున్నాయి. అదే సమయంలో ఏటా మాసపూజలు, ఓనం, మండల, మకరవిళక్కు(మకరజ్యోతి) సీజన్లో అయ్యప్ప కొండకు వచ్చే భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే ధ్యేయమని వివరిస్తున్నాయి. అయ్యప్ప భక్త సంఘాల ప్రతినిధులు చెప్పే సమస్యలను శ్రద్ధగా విని, రాబోయే సీజన్ నుంచే వాటిని పరిష్కరించనున్నట్లు పేర్కొంటున్నాయి. శబరిమల అభివృద్ధికి ఇటీవలి బడ్జెట్లో రూ.1,300 కోట్ల కేటాయింపు మొదలు.. కేంద్రం ఆమోదించిన రోప్వే ప్రాజెక్టు, పథనంతిట్టలో కొత్త విమానాశ్రయానికి, రైల్వే మార్గానికి చేస్తున్న ఏర్పాట్లు, త్వరలో పరిచయం చేయనున్న హెలిట్యాక్సీలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు వివరించనున్నట్లు కేరళ పర్యాటక శాఖ చెబుతోంది.స్వాగతం ఇలా..ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తులకు పథనంతిట్ట జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం స్వాగతం పలుకుతుంది. శబరిమలకు దారితీసే మార్గాలు- సీతాథోడ్, పెరునాడ్, పంపా ప్రాంతాల్లో స్వాగత వేదికలను ఏర్పాటు చేసింది. కేఎస్ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో భక్తులకు వసతి సదుపాయాలను సిద్ధం చేసింది. ఆహూతులందరికీ సెప్టెంబరు 20, 21 తేదీల్లో ప్రత్యేకంగా అయ్యప్ప దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారికి హిల్ టాప్ వద్ద పార్కింగ్ సదుపాయం ఉంటుంది. పంపా వద్ద ప్రత్యేక ఆస్పత్రిని ప్రారంభించింది. ఇక పారిశుద్ధ్యం మొదలు.. తాగునీటి సదుపాయం, భోజనాలు వంటి ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తును సిద్ధం చేసింది.బాలారిష్టాలెన్నెన్నో..గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్ అనే భావన తెరపైకి వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి బాలారిష్టాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు. అయితే.. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. ఈ కార్యక్రమం రాజకీయాలకు దూరంగా ఉంటుందని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సుకుమారన్ నాయర్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ కోర్టు మెట్లెక్కారు. దీని వల్ల రాణి ఫారెస్ట్, పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్లలో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలతో కేరళ హైకోర్టు ఏకీభవించడంతో.. ఓ దశలో కార్యక్రమంపై నీలినీడలు అలుముకున్నాయి. కేరళ సర్కారు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చంటూ అనుమతి ఇవ్వడంతో.. ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.చదవండి: రూ.కోటి వ్యయంతో అతి పురాతన వైష్ణవాలయానికి పూర్వవైభవంపందళ రాజకుటుంబం దూరంగ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్కు తాము దూరంగా ఉంటున్నట్లు పందళం రాజకుటుంబం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరులో పందళ రాజమాత మృతి చెందిన నేపథ్యంలో.. ఈ నెల 27 వరకు తాము దైవదర్శనానికి రాకూడదని పందళం ప్యాలెస్ మేనేజ్మెంట్ కమిటీ వెల్లడించింది. తాము కార్యక్రమాన్ని వారం రోజులు వాయిదా వేయాలని కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించింది. దీంతో.. నీలక్కల్ను దాటి తాము పంపావైపు రాలేమని తెలిపింది.శబరిమల అభివృద్ధికి దోహదం: ఎస్.శ్రీజిత్, అదనపు డీజీపీ''గ్లోబల్ కాన్క్లేవ్ ద్వారా శబరిమల అభివృద్ధికి కీలక ముందడుగు పడుతుంది. ఇది భవిష్యత్ని ఉద్దేశించి చేపట్టిన ఓ ప్రాజెక్టు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్రంగా చర్చిస్తాం. మున్ముందు అయ్యప్ప కీర్తిని ప్రపంచానికి చాటేలా కృషి చేస్తున్నాం.''అయ్యప్ప అందరివాడు: నాగ మల్లారెడ్డి, గురుస్వామి''అయ్యప్ప ముందు అందరూ సమానమే. స్వామి దగ్గర తరతమబేధభావాలుండవు. ఆయన అందరివాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలవాడు అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.''స్వామి మహిమలెన్నెన్నో: వైవి సుబ్బారెడ్డి, గురుస్వామి(కడప)''అయ్యప్ప మహిమలు ఎన్నో.. ఎన్నెన్నో..! నమ్మినవారి కొంగు బంగారం ఆ మణికంఠుడు. ఉదాహరణకు ఎరుమేలి నుంచి పంపాకు పెద్దపాదం మార్గం(45 కిలోమీటర్లు) ఎత్తైన కొండల మీదుగా ఉంటుంది. కఠిన దీక్షలు చేసి, భక్తిప్రపత్తులతో వస్తున్న వారికి ఈ దూరం ఒక లెక్కే కాదు. అలాంటి వారు ఏ మాత్రం అలసట లేకుండా వనయాత్రను పూర్తిచేసుకుంటారు. భక్తితో కాకుండా.. బలముందనే అహంకారంతో వచ్చేవారు 2 కిలోమీటర్లు నడిచినా.. 15 కిలోమీటర్ల దూరం నడిచామా? అనే భావన కలుగుతుంది. భక్తులకు కరిమల కొండ కఠిన పరీక్షలు పెడుతుంది. వాటిని అధిగమించి, స్వామిని చేరేవారి జన్మ ధన్యం.''

పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుని ఇండియాకు వచ్చిన భారతసంతతికి చెందిన US పౌరురాలు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం సృష్టించింది. జూలైలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళ మిస్సింగ్ కేసు నమోదైన తరువాత షాకింగ్ విషయాలను పోలీసులు ప్రకటించారు.పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోఇండియాకు వచ్చింది. లూధియానాకు చెందిన ఇంగ్లాండ్కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్ (NRI) చరణ్జిత్ సింగ్ గ్రెవాల్ (75)ను వివాహం చేసుకోవాలని భావించింది. అతని ఆహ్వానం మేరకు రూపిందర్ కౌర్ పాంధేర్ (71) భారతదేశానికి వచ్చారు. అయితే సియాటిల్ నుండి ఇండియాకు వచ్చిన కొద్దిసేపటికే ఏళ్ల మహిళ హత్యకు గురైంది. అయితే ఫోన్లకు స్పందించకపోవడం, ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన పాంధేర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో జూలై 28న న్యూఢిల్లీలోని అమెరికిఆ రాయబార కార్యాలయానికి సంప్రదించారు. ఎంబసీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గ్రెవాల్ ఆమెను కిరాయి హంతకులతో హత్య చేయించాడని తేల్చారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ హత్య జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు గ్రేవాల్తో పెళ్లికి ముందు అతనికి పెద్దమొత్తంలో డబ్బును బదిలీ చేసినట్టు కూడా గుర్తించారు. రూపిందర్ అమెరికా పౌరురాలు. యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్తో పెళ్లికోసం ఇండియాకు వచ్చింది. అయితే ఆమెను తుదముట్టించాలని పథకం వేసుకున్న గ్రెవాల్ కాంట్రాక్ట్ కిల్లర్ సుఖ్జీత్ సింగ్ సోనూతో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను కిరాతంగా హత్య చేయించాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశాడని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు. తన నివాసంలోని స్టోర్రూమ్లో రూపిందర్ శరీరాన్ని కాల్చి, బూడిద చేసి లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు సంఘటనా స్థలంలో మృతరాలి ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారణ సాగుతోంది. పరారీలో ఉన్నగ్రెవాల్తో పాటు, అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు. సోను వెల్లడించిన దాని ఆధారంగా బాధితురాలి అస్థిపంజర అవశేషాలు, ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు ఈ ఘటన ఇటు భారత్తోపాటు, అటు అమెరికా, యూకే ఎన్ఆర్ఐ వర్గాల్లో ఆందోళన రేపుతోంది.

''నాకు సాయం చేయండి సార్'.. జైశంకర్కు హైదరాబాద్ యువతి అభ్యర్థన
హైదరాబాదీ యువతి భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు లేఖ రాసిందిహైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు. కొంతకాలం తరువాత హజ్ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి జైనుద్దీన్ ప్రణాళికాబద్ధంగా ఫిబ్రవరి 7, 2025న ఆమెను హైదరాబాద్కు తీసుకువచ్చాడు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఓ రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళగా, ఆమె భర్త పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలు వంటి అన్ని వస్తువులతో హోటల్ను ఖాళీ చేసి అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే హనా అహ్మద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్కు తన లేఖలో పేర్కొంది.

గోడు వింటున్నారు.. పరిష్కారం చూపుతున్నారు
మోర్తాడ్ (బాల్కొండ): కరీంనగర్కు చెందిన రాహుల్రావు ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను అక్కడ బ్లడ్ కేన్సర్కు గురయ్యాడు. అతనికి బోన్మ్యారో చికిత్స చేయాల్సి ఉంది. అతని రక్తం పంచుకుని పుట్టిన వారే తమ వారి శరీరంలో నుంచి ఎముకను ఇస్తేనే రాహుల్ బతికి బట్టకట్టగలడని వైద్యులు స్పష్టం చేశారు. రాహుల్ సోదరుడు రుతిక్రావు అందుకు సిద్ధం కావడంతో అతను లండన్ వెళ్లడానికి, వైద్య ఖర్చుల కోసం ప్రవాసీ ప్రజావాణిలో రాహుల్ తల్లి మంగ అభ్యర్థన పత్రం అందించింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్రావు సోదరుడు లండన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంతో పాటు ఖర్చు కోసం రూ.10 లక్షలను మంజూరు చేసింది. ప్రవాసీ ప్రజావాణి వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కూడా తన విచక్షణాధికారాలను ఉపయోగించి రూ.లక్ష సాయం మంజూరు చేశారు. ప్రవాసీ ప్రజావాణి (Pravasi Prajavani) ద్వారానే తమ కుటుంబానికి రూ.11 లక్షల సాయం అందిందని రాహుల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.గంగయ్యకూ విముక్తి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య 18 ఏళ్లుగా బహ్రెయిన్లో ఉండిపోయాడు. అతను ఇంటికి రావడానికి పాస్పోర్టు లేకపోవడం, పరాయి దేశంలో సాయం చేసేవారు లేకపోవడంతో గంగయ్య భార్య లక్ష్మి ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విదేశాంగ శాఖతో, బహ్రెయిన్లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడటంతో గంగయ్య ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. తాము చూస్తామో చూడమో అనుకున్న వ్యక్తి 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇంటికి చేరడానికి ప్రవాసీ ప్రజావాణి మార్గం చూపిందని గంగయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాహుల్, గంగయ్యలకే కాదు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.2024, సెప్టెంబర్ 16న హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్లో ప్రారంభించిన ప్రవాసీ ప్రజావాణితో ప్రవాసులైన తెలంగాణ వాసులకు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఏ మూలన ఉన్న వారైనా తమవారు విదేశాల్లో ఏమైనా ఇబ్బంది పడితే వారి సమస్యను ప్రవాసీ ప్రజావాణి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుండటం విశేషం. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రవాసీ ప్రజావాణిని పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు ఎన్నారై అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీఎం వినోద్కుమార్, వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ప్రవాసీ ప్రజావాణిలో పాల్గొంటూ వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఇచ్చే వినతులను స్వీకరిస్తున్నారు.ఇప్పటి వరకు వందకు పైగా కుటుంబాల వినతులకు ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపడం ఎంతో ఊరటనిచ్చే విషయం. గతంలో గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలు ఇంటికి చేరడానికి నెలల సమయం పట్టేది. ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తే అధికార యంత్రాంగం స్పందించి వారం, పది రోజుల వ్యవధిలోనే కడసారి చూపు దక్కేలా చేస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథంతో ప్రజావాసీ ప్రజావాణిని కొనసాగిస్తుండటం వలసదారుల కుటుంబాలకు ఎంతో ధీమా ఇచ్చే కార్యక్రమం అని భీంరెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో చెప్పారు. వలసదారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి ప్రవాసీ ప్రజావాణి గొప్ప నిదర్శనమని తెలిపారు. వలసదారుల జీవితాల్లో వెలుగులు వలసదారుల జీవితాల్లో ప్రవాసీ ప్రజావాణి వెలుగులు నింపుతోంది. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ప్రవాసీ ప్రజావాణిని నిర్వహించి వినతులను స్వీకరిస్తుండటం ఎంతో గొప్ప విషయం. వలస కార్మికులకు మేమున్నాం అనే ధీమాను ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. – రంగు సుధాకర్గౌడ్, ఎన్నారై, లండన్
Sakshi Originals

సెమీకండక్టర్.. ‘డబుల్’ జోరు!
భారత సెమీకండక్టర్ మార్కెట్ విలువ ప్రస్తుత సంవత్సరంలో 54.3 బిలియన్ డాలర్లకు చేరవచ్చని.. 2030 నాటికి 13.8 శాతం వార్షిక వృద్ధి రేటుతో 103.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని స్టాఫింగ్ కంపెనీ ‘క్వెస్ కార్ప్’ నివేదిక తెలిపింది. ‘ది చిప్ క్యాటలిస్ట్: ఇండియాస్ ఎమర్జింగ్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. భారీ స్థాయిలో వినియోగ మార్కెట్గా ఉన్న భారత్, ప్రపంచ సామర్థ్య కేంద్రంగా అవతరిస్తోంది.అయితే ఈ రంగం నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సెమీకండక్టర్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 80 శాతం మందికి.. 10 సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉంది. మధ్య స్థాయి, సీనియర్ రోల్స్లో నిపుణుల కొరత ఉంది. 55కుపైగా ఉన్న సెమీకండక్టర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో (జీసీసీ) 60 వేల పైచిలుకు ఇంజనీర్లు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పరిశ్రమలో 2030 నాటికి నిపుణుల సంఖ్య 4,00,000లకు చేరనుంది. తద్వారా నిపుణుల సంఖ్య విషయంలో ప్రపంచంలో యూఎస్ తర్వాత భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించనుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్

బిగ్ రిలీఫ్
దసరా, దీపావళి పండగ ఆనందాలు రెట్టింపు కానున్నాయి. ఇటీవల కేంద్రం సవరించిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబులు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గృహోపకరణాలు, ఆటో మొబైల్స్, ఎలక్ట్రానిక్ వంటి చాలా వరకు ఉత్పత్తుల ధరలు 10 శాతం మేర తగ్గనున్నాయి. గృహ నిర్మాణ భారం నుంచి ఉపశమనం కలగనుంది. దీంతో వాహనాలు, కార్లు, టీవీలు, సెల్ఫోన్లు వంటి ఉత్పత్తుల కొనుగోలుదారులు ఈనెల22 వరకు వాయిదా వేసుకుంటున్నారు. ఈ కామర్స్ సంస్థలు సైతం ఈనెల 22 తర్వాతే ఆఫర్లు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లు, ఆన్లైన్ సంస్థల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. – విశాఖ సిటీతగ్గనున్న నిత్యావసర ధరలు ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఉప్పు నుంచి పప్పు వరకు రేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో జీఎస్టీ సవరణలతో మరో వారం రోజుల్లో ఈ ధరలు దిగిరానున్నాయి. సాధారణ ప్రజలు నిత్యం వినియోగించే వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే జీఎస్టీ విధించారు. దీంతో పేస్ట్ నుంచి డ్రై ఫ్రూట్స్ వరకు ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు పన్నీర్, బ్రెడ్, వెన్న, నెయ్యి, పాస్తా, నూడుల్స్, కార్న్ఫ్లేక్స్, బిస్కెట్లు, కేకులు, స్వీట్లు వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఖరీదైన బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం వంటి వాటిపై కూడా జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గనుంది. ఇది సాధారణ ప్రజలకు భారీ ఉపశమనాన్ని అందించనుంది. వాహనాలపై 28 నుంచి 18 శాతానికి.. వాహనాల ధరలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి కేంద్రం కుదించింది. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి. సాధారణంగా దసరా, దీపావళి పండగ సీజన్లలో వాహనాలను కొనుగోలు చేయడం సెంటిమెంట్గా భావిస్తుంటారు. ఈ నెల 22వ తేదీ నుంచి బైక్లు, కార్లపై 10 శాతం వరకు ధరలు తగ్గే అవకాశాలు ఉండడంతో భారీగా వాహనకొనుగోళ్లు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బైక్, కార్ల కంపెనీలు తగ్గించిన ధరలను ప్రకటించాయి. బైక్లపై రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు, మధ్యస్థాయి కారుపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ఉండనుంది. దీంతో కొనుగోలుదారులు ఈనెల 22 తర్వాతే వాహనాలను కొనుగోలు చేసేందుకు వాయిదా వేస్తున్నారు. అయితే కొన్ని షోరూమ్లు ప్రీ బుకింగ్లకు కూడా డిస్కౌంట్ ధరలు ప్రకటించాయి. లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధించారు. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న బైక్లు, ఇతర లగ్జరీ వస్తువులపై ప్రత్యేక, అధిక స్లాబ్ వడ్డించారు. గృహ నిర్మాణ భారం నుంచి ఉపశమనం జీఎస్టీ సంస్కరణలతో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు కనిపిస్తున్నాయి. బిల్డర్లతో పాటు సొంతింటి నిర్మాణాలు చేపట్టే ప్రజలకు నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది. దీంతో ఫ్లాట్లు, ఇళ్ల ధరలు తగ్గనున్నాయి. నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్బుల్స్, టైల్స్, రంగుల ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40–45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో డెవలపర్కు 10–15 శాతం వరకు ఆదా అవుతుంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4–6 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది. ఈ–కామర్స్లో ఆఫర్ల వెల్లువ ఈ–కామర్స్ సంస్థల్లో కూడా డిస్కౌంట్ల సందడి మొదలైంది. ఈ నెల 22వ తేదీ నుంచి అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ పేర్లతో భారీ సేల్కు సిద్ధమవుతున్నాయి. ఇక మింత్రా, మీషో, షాపి వంటివి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. జీఎస్టీ సవరణలతో ఈ నెల 22వ తేదీ నుంచి అన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్ల వర్షం కురిపించనున్నాయి. ఎల్రక్టానిక్ వస్తువుల ధరలు సైతం.. జీఎస్టీ సవరణతో ఎల్రక్టానిక్ ఉపకరణాలు ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. ఇప్పటి కంటే 10 నుంచి 13 శాతం మేర ధరలు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు ఇలా అన్ని రకాల ఎల్రక్టానిక్ వస్తువుల ధరల్లో వ్యత్యాసం భారీగా ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కూడా అందుబాటు ధరల్లోకి రానున్నాయి. టీవీలపై రూ.5 వేలు నుంచి రూ.15 వేలు వరకు, మొబైల్ ఫోన్లపై రూ.2 వేలు నుంచి రూ.5 వేలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై రూ.7 వేలు నుంచి రూ.10 వేలు వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. సాధారణంగా దసరా, దీపావళి సమయాల్లో ఎల్రక్టానిక్, వస్తువులపై వ్యాపారులు ప్రత్యేక డిస్కౌంట్లు, బహుమతులు ఇస్తుంటారు. ఈ ఏడాది మాత్రం వ్యాపారుల ఆఫర్లతో పాటు కేంద్రం జీఎస్టీ రూపంలో కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది. దీంతో ప్రజలు ఈ నెల 22వ తేదీ తర్వాతే గృహోపకరణాలు, మొబైల్స్ను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు.

సరికొత్త ఆయుధం ఐరన్బీమ్
సైన్స్ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే కొత్తశకం ఆయుధాలను ఇజ్రాయెల్ ఈ తరంలోనే తీసుకొచ్చి మరోసారి ప్రపంచ రక్షణరంగాన్ని ఔరా అనిపించింది. శత్రు దేశాల యుద్ధ విమానాలపై క్షిపణులను ప్రయోగించకుండా నేరుగా లేజర్ కాంతిపుంజాన్ని ప్రయోగించి విమానాలను నేలకూల్చే వ్యవస్థను ఇజ్రాయెల్ రంగంలోకి దింపింది. అత్యంత ప్రభావవంతంగా ఇది పనిచేస్తోందని, సమరక్షేత్రంలోనూ దీని సత్తాను పరీక్షించామని ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. దీనిని ఐరన్బీమ్ అని పేరు పెట్టింది. శత్రుసేనల డ్రోన్ల దండును ఒకేసారి వందలాది చిన్నపాటి క్షిపణులతో నేలమట్టంచేసే ఐరన్డోమ్ గగనతల రక్షణ వ్యవస్థతో ఇజ్రాయెల్ ఇప్పటికే ఆధునిక తరం ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ల మోహరింపులో తన పైచేయి సాధించింది. వందలాది హమాస్ రాకెట్లను గాల్లోనే తుత్తునియలు చేసి ఈ ఐరమ్డోమ్ ఇప్పటికే తన సత్తా చాటింది. దీనికి తోడుగా ఇప్పుడు లేజర్కాంతిపుంజ సహిత ఐరన్బీమ్ వ్యవస్థను సంసిద్ధం చేశామని ఇజ్రాయెల్ రక్షణవర్గాలు ప్రకటించాయి. ఎప్పటికప్పుడు కొత్త రకం ఆయుధాలతో దేశ సైనికరక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ పటిష్టంచేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఐరన్బీమ్ ను రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ తయారుచేసింది. కేవలం రెండు డాలర్లతో మటాష్విధ్వంసం సృష్టించేందుకు నేలమీదకు దూసుకొచ్చే శత్రువుల డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు, మానవరహిత విహంగాలు, మోర్టార్లను గాల్లోనే అడ్డుకునేందుకు ఉపయోగించే సంప్రదాయక క్షిపణి నిరోధక వ్యవస్థను ఒక సందర్భంలో ఉపయోగిస్తే ఏకంగా 60,000 డాలర్లు అంటే రూ.53 లక్షలు ఖర్చవుతుంది. శత్రువుల రాకెట్లను అడ్డుకునేందుకు చిన్నపాటి రాకెట్లు, ఇతరత్రా ఆయుధాలను ప్రయోగించాల్సి రావడం వల్లే ఇంతటి ఖర్చు అవుతుంది. కానీ కొత్తగా రణరంగంలోకి దిగిన ఈ ఐరన్బీమ్ను ఒకసారి ఉపయోగిస్తే కేవలం 2 డాలర్లు మాత్రమే ఖర్చవుతుంది. మెరుపువేగంతో అమితమైన విద్యుత్ను ఉపయోగించుకుని కొత్త కాంతిపుంజాన్ని వదులుతుంది. అందుకే అత్యల్ప ఖర్చుతోనే అత్యధిక ప్రయోజనాన్ని పొందొచ్చు. సంప్రదాయక గగనతల రక్షణవ్యవస్థలో ప్రయోగించే కొన్ని చిన్నపాటి రాకెట్లు గురితప్పొచ్చు. వృథా ఖాయం. కానీ ఐరన్బీమ్ కాంతిపుంజాన్ని గురిచూసి ప్రయోగిస్తారు. కాంతిమాదిరిగా అత్యంత కచ్చితత్వంతో సరళరేఖ మాదిరి ఈ కాంతిపుంజం దూసుకుపోతుంది. దీంతో దిశ మారే అవకాశమే లేదు. ఏ పాయింట్ వద్ద కొడతామో అక్కడే విమానం, డ్రోన్, క్షిపణి ముక్కలుచెక్కలుకావడం ఖాయం. బీమ్ ప్రయోగానికి అది లక్ష్యాన్ని ఛేదించడానికి మధ్య సెకన్ల వ్యవధి కూడా పెద్దగాఉండదని ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి నాఫ్తాలీ బెన్నెట్ చెప్పారు. ఉన్న వాటితో కలుపుకుని పోతూ..ఐరన్బీమ్ను అందుబాటులోకి తెచ్చినంత మాత్రాన ఐరన్డోమ్, డేవిడ్ స్లింగ్, యారో సిస్టమ్ వంటి ఇతర గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ పక్కనబెట్టబోదు. యుద్ధ రీతి, అవసరానికి అనుగుణంగా వీటినీ మోహరిస్తుంది. అవసరమైతే ఐరన్డోమ్కు తోడుగా ఐరన్బీమ్ కదనరంగంలో రణానికి సిద్ధంకానున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖలోని పరిశోధనా భివృద్ధి విభాగం, ఇజ్రాయెల్ వాయుసేన, రఫేల్, ఎల్బిట్ సిస్టమ్స్ సంయుక్తంగా నెలల తరబడి కష్టపడి ఐరన్బీమ్ను సాకారంచేశాయి. దీనిని ఇప్పటికే దక్షిణ ఇజ్రాయెల్లో పలుమార్లు విజయవంతంగా పరీక్షించారు. రఫేల్ అడ్వాన్స్డ్ సంస్థలోని అడాప్టివ్ ఆప్టిక్స్ సాంకేతికతను సైతం ఐరన్బీమ్కు జోడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్

గతి తప్పిన జలచక్రం!
ప్రపంచ జలచక్రం గతి తప్పింది. 2024లో ఇది మరింత అస్తవ్యస్తమైంది. గత 175 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.55 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరగటంతో వాతావరణంలో అసమతుల్యత పెరిగిపోయింది. ఇటు కుంభవృష్టి, అటు కరువులు విరుచుకుపడటంతో మూడింట రెండొంతుల నదులు చుక్క నీరు లేకుండా ఎండిపోయాయి లేదా విపరీతమైన వరదలతో సతమతమయ్యాయి. అతివృష్టి, అనావృష్టి వల్ల వల్ల ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా 2024లో తీవ్రస్థాయిలో కష్టాలపాలయ్యారని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజా నివేదికలో వెల్లడించింది. – సాక్షి, సాగుబడిఅసాధారణ నీటి కష్టాల వల్ల.. ఆహార కొరత, ధరల పెరుగుదల, సంఘర్షణలు, వలసలు పెరిగాయని 41 దేశాల సమాచారాన్ని క్రోడీకరించిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజా నివేదిక వివరించింది. ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థ అయిన డబ్ల్యూఎంఓ ఏటా ప్రపంచ జల వనరులపై నివేదికను వెలువరిస్తుంటుంది. నీటి వనరులపై ప్రజలు, పాలకులు, శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేస్తుంది.కరువు కరాళ నృత్యంఅతి తీవ్రమైన నీటి సమస్యలతో ప్రపంచ జల చక్రం పూర్తిగా గతి తప్పింది. నదులు, రిజర్వాయర్లు, సరస్సులు, భూగర్భ జలాలు, హిమానీ నదాలన్నిటిలోనూ ఈ అసాధారణ స్థితిగతులు కనిపించాయి. ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాల్లో వరదలు పొటెత్తగా.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో తీవ్ర కరువు కరాళ నృత్యం చేసింది. హిమానీ నదాల్లో మంచు నిల్వలు 450 గిగా టన్నుల (ఒక గిగా టన్ను అంటే లక్ష కోట్ల కిలోలు) మేరకు అత్యధికంగా కరగటం వరుసగా ఇది మూడో సంవత్సరం. ఆకస్మిక వరదలతో పాటు దీర్ఘకాలిక నీటి అభద్రతకు ఇది దారితీస్తుంది. ఈ నీటితో 1.2 మిల్లీమీటర్ల మేరకు సముద్రాల నీటి మట్టాలు పెరిగాయి. వరుసగా ఆరో ఏడాదినీటి చక్రం అస్తవ్యస్తం కావటం ఇదే మొదటిసారి కాదు. ఇలా జరగడం వరుసగా ఆరో ఏడాది. ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, ప్రభుత్వాలకు వేల కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగింది. పంట దిగుబడులు నష్టపోయారు. ధరలు పెరిగిపోయాయి. ఆహార కొరత పెరిగింది. ఉద్రిక్తతలు పెరిగాయి. పొట్ట కూటికోసం వలస పోవాల్సిన దుస్థితి మరింతగా పెరిగింది. గత ఏడాది 40 శాతం నదుల్లో మాత్రమే.. నీటి లభ్యత ఉండాల్సినంత సాధారణంగా ఉంది. మిగతా 60 శాతం నదుల్లో అతి కరువు లేదా అతి వరద పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు తీవ్ర పరిస్థితులు నెలకొన్న విచిత్ర స్థితి ఏర్పడింది. మనదేశంలోనూ..ఉత్తర భారతంలో అతివృష్టి కారణంగా భూగర్భ జలాల్లో 2023తో పోల్చితే వృద్ధి కనిపించింది. అయితే, వాయవ్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రం కరువు నెలకొంది. భారత్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో రిజర్వాయర్లలోకి చాలా ఎక్కువ నీరు చేరింది. గంగ, గోదావరి, కృష్ణా తదితర నదులు సాధారణం కన్నా ఎక్కువగా ఉప్పొంగాయి. జూలై 30న కేరళలో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. ఇందులో 385 మంది భారతీయులు చనిపోయారు. 40 లక్షల మంది నిరాశ్రయులుఅమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది. దక్షిణ అమెరికాలో, ముఖ్యంగా అమెజాన్ బేసిన్లలో మట్టిలో తేమ బాగా తగ్గింది. సెంట్రల్ యూరప్లో అందుకు భిన్నంగా నేలలు అతి తేమగా మారాయి.» సెంట్రల్ యూరప్, రష్యా, పాకిస్తాన్లలో పెను వరదలు ముంచెత్తాయి. » ఆఫ్రికా ట్రాపికల్ జోన్లో వరదలకు 2,500 మంది చనిపోగా, 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. » దుబాయ్లో 75 ఏళ్లలో ఎన్నడూ ఎరుగనంత వర్షపాతం నమోదైంది. అస్తవ్యస్తం జలచక్రం నీరే జీవకోటికి ప్రాణాధారం. ఆర్థిక వ్యవస్థలకు నీరే ఇంధనం. పర్యావరణానికీ నీరే ప్రాణం. అయితే, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ జలచక్రం అస్తవ్యస్తమైంది. జలవనరులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఒత్తిడికి గురై విపత్తులకు కారణమవుతున్నాయి. ప్రాణాధారమైన ఆ నీరే ఉపద్రవాలకు కారణమై ప్రజల ప్రాణాలను, ఆస్తులను, జీవనోపాధులను కబళిస్తోంది. ఇది మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఇంధనం, ఆరోగ్యం, ఆర్థిక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. జలచక్రం ఎంత అస్తవ్యస్తంగా మారిపోయిందో 2024 నివేదిక మనకు తెలియజñ ప్తోంది. దీనిపై మరింత శ్రద్ధగా గణాంకాలు సేకరించాలి. జరుగుతున్నదేమిటో సరిగ్గా అంచనా వెయ్యలేకపోతే దాన్ని మార్చలేం కదా! – సెలెస్టె సాలో, ప్రధాన కార్యదర్శి, ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ)
బీహార్లో నువ్వా-నేనా?? పీపుల్ పల్స్ ఏమో ఇలా..
శర్వానంద్ దంపతులు విడిపోయారా..?
అదిరే ఫ్యాషన్ లుక్ : దాండియా ధడక్
‘బ్యూటీ’ మూవీ రివ్యూ
అల్లు అరవింద్ ఏమీ చేయరు, చివర్లో వచ్చి పేరు కొట్టేస్తారు!
మండలి చైర్మన్ పోడియం చుట్టుముట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
అదానీ స్టాక్స్లో ర్యాలీ..
గేమింగ్ చట్టం అమలు అప్పుడే: అశ్విని వైష్ణవ్
ఫుడ్ ఇంజనీర్..మిల్లెట్ బిజినెస్తో నెలకు రూ. 3 లక్షలు
ఆసియా కప్: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు
ఎట్టకేలకు ఓటీటీలోకి 'జూనియర్' సినిమా
తాత, తండ్రి, కొడుకు..‘అక్కినేని’మూడు తరాలతో నటించిన ఏకైక హీరోయిన్ ఈమే!
కొంటే ఇప్పుడు కొనండి!.. తగ్గిన గోల్డ్ రేటు
'ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తా.. నా కోసం ఆ ఒక్క పని చేసి పెట్టమని చెప్పా'
ఒక్క ఏడాదిలోనే రూ.140 కోట్ల నష్టం: మిరాయ్ నిర్మాత
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్ ఆఫర్?
ఇంకెతసేపు తయారవుతార్సార్! త్వరగా వచ్చేయండీ!
ఆసీస్ భారీ స్కోర్.. ధీటుగా బదులిస్తున్న టీమిండియా
ఈ ఒక్కదానిలో విఫలమయ్యామంటే.. మిగతా అన్నింట్లో సఫలమయ్యాం అనుకుంటారని..!
మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు
బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే
..రద్దు చేస్తారేమోననిపిస్తోంది సార్!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ఆస్తిలాభం
ఓటీటీలో సూపర్ హిట్ హారర్ సినిమా.. ఎక్కడంటే?
ఈ ర్యాపిడో అన్న జీతం 32 లక్షలు!!
భారత్కు గుడ్న్యూస్.. టారిఫ్పై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్?!
'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్
నా భర్త మరణం.. మోహన్లాల్ తన బుద్ధి చూపించాడు: నటి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
క్రైమ్

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురు బలి
భూత్పూర్: ఓ ఆటోడ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని తుల్జాభవానితండా వద్ద ఈ ఘటన జరిగింది. భూత్పూర్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ నర్సింహులు గురువారం ఉదయం ముగ్గురు ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని భూత్పూర్ వస్తున్నాడు. అదే సమయంలో హన్వాడకు చెందిన ట్రాలీ ఆటోలో భూత్పూర్ నుంచి కొత్తమొల్గరకు కూల్డ్రింక్స్ తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు తుల్జాభవానితండా వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఖిల్లాఘనపురం నుంచి వస్తున్న ఆటోలోని ప్రయాణికులు నర్సింహారెడ్డి (56), వంశీ (23), పాత్లావత్ సక్రి (34) అక్కడికక్కడే మృతిచెందగా.. ఆటో నడుపుతున్న డ్రైవర్ నర్సింహులు గాయపడ్డాడు. మరో ఆటోడ్రైవర్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడ్డ నర్సింహులును అంబులెన్స్లో జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా ఆటోడ్రైవర్ నర్సింహులు చెవులకు హెడ్ఫోన్స్ పెట్టుకుని ఆటోను నిర్లక్ష్యంగా నడిపినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాలీ ఆటోడ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెపుతున్నారు. పెద్దల పండుగకు వచ్చి వెళ్తూ.. భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఖిల్లాఘనపురంలో ఉండే చెల్లెలు పెద్దల పండుగ చే యడంతో అక్కడికి వెళ్లాడు. తిరిగి హైదరాబాద్కు వెళ్లే క్రమంలో రో డ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుమార్తెలను తీసుకురావడానికి వెళ్తూ.. ఖిల్లాఘనపురం మండలం దొంతికుంటతండాకు చెందిన పాత్లావత్ సక్రి.. జడ్చర్ల సమీపంలోని ఆశ్రమ పాఠశాల నుంచి తన ఇద్దరు కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కూలీ పనుల కోసం.. ఖిల్లాఘనపురం మండలం గట్టుకాడిపల్లి గ్రామానికి చెందిన వంశీ (23) కూలీ పనులకోసం ఆటోలో వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఖిల్లాఘనపురం ఆటో డ్రైవర్ నర్సింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.

కుమార్తెతో సహా తండ్రి ఆత్మహత్య!
కుత్బుల్లాపూర్: ఓ వ్యక్తి కుమార్తెతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్బïÙరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కాలేజీ వెనక ఉన్న చెరువులో గురువారం ఉదయం ఓ వ్యక్తి, బాలిక మృతదేహాలను గుర్తించిన స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి. విచారించగా బహదూర్పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్(50), అతని కుమార్తె దివ్య(05)గా గుర్తించారు. నాలుగేళ్లుగా అశోక్, అతడి భార్య సోనీ ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. అశోక్ వంట పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మూడేళ్ల క్రితం రోడ్డు అతడి భార్య సోనీ రోడ్డు దాటుతుండగా లారీ ఢీనడంతో ఎడమ కాలు కోల్పోయింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటోంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మూడు క్రితం అశోక్ ఆత్మహత్య చేసుకునేందుకు ఇంట్లోని గ్యాస్ సిలిండర్ లీక్ చేశాడు. దీనిని గుర్తించిన అతడి భార్య సోనీ కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆరి్పవేసినట్లు సమాచారం. ఆ మర్నాడు సాయంత్రం అశోక్ కుమార్తెను తీసుకుని ఇంటి నుండి వెళ్లిన అశోక్ కుమార్తెతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదారాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
హైదారాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత. కువైట్ నుండి వచ్చిన ప్రయాణికుల నుండి రూ. 3.36 కోట్ల విలువైన 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. ముగ్గురు నిందితులు అరెస్ట్.. (VG)

సిబ్బందిని కట్టేసి రూ. 21 కోట్లు లూటీ
విజయ్పురా (కర్ణాటక): ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు తుపాకులు, కత్తులతో సిబ్బందిని బెదిరించి ఓ బ్యాంకును లూటీ చేసి రూ.20 కోట్లకు పైగా దోచుకున్నారు. ఈ ఘటన కర్ణాటక విజయ్పురా జిల్లాలోని ఎస్బీఐకి చెందిన చాడ్చాన్ బ్రాంచ్లో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దుండగులు దోచుకున్న నగదు, బంగారు ఆభరణాల విలువ రూ. 21 కోట్లకుపైగా ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు కరెంటు ఖాతా తెరవాలంటూ బ్యాంకుకు వచ్చి మేనేజర్, క్యాషియర్, ఇతర సిబ్బందిని తుపాకులు, కత్తులతో బెదిరించారని పోలీసులు చెప్పారు. దుండగులు బ్యాంకు సిబ్బంది కాళ్లు, చేతులను కట్టేసి రూ.కోటికిపైగా నగదు, రూ.20 కోట్ల విలువైన 20 కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు నకిలీ నంబర్ ప్లేటు ఉన్న సుజుకీ ఎవా అనే కారులో వచ్చారని విజయ్పురా ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి చెప్పారు. చోరీ అనంతరం దుండగులు మహారాష్ట్రలోని పండర్పూర్ వైపు పారిపోయినట్లు తెలిపారు.
వీడియోలు


అమెరికాలో తెలంగాణ వాసి మృతి


Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్ మర్డర్


Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్


Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ


ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు


MLA Bathula Lakshma Reddy: రైతుల కోసం రెండు కోట్లు


ఆకాశానికి చిల్లుపడిందా? హైదరాబాద్ పై వరుణుడి ఉగ్రరూపం


వరుణుడి ఉగ్రరూపం.. హైదరాబాద్ ను ముంచెత్తిన వాన


Warangal: యూరియా కోసం రైతుల అవస్థలు


Komatireddy: కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు