Politics
లోకేష్ టైం ఇవ్వలేదు.. నిరాశగా వెనుదిరిగిన కొలికపూడి
సాక్షి,అమరావతి: టీడీపీలో కొలికపూడి వర్సెస్ చిన్ని రచ్చ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి,చిన్ని హాజరయ్యారు. నివేదికను క్రమశిక్షణ కమిటీకి కొలికపూడి అందించారు. పార్టీ పదవుల అమ్మకాలపై కొలికపూడి ఫిర్యాదు చేశారు.తిరువూరు సీటు కోసం చిన్నికి ఇచ్చిన రూ.5 కోట్ల వివరాలను అందించారు. చిన్ని పీఏ అక్రమాలపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ను కలిసేందుకు కొలికపూడి ప్రయత్నించారు. అందుకు లోకేష్ టైం ఇవ్వకపోవడంతో కొలికపూడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.గత నెల అక్టోబర్లో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా గురువారం పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు.2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపింది. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. టీడీపీలో కోవర్టులున్నారు: టీడీపీలో కోవర్టులు ఉన్నారని..ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచ్చి పోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు.‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వార్నింగ్లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు.ఇలా ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కామెంట్స్తో టీడీపీలో పాలిటిక్స్ రచ్చ పీక్ స్టేజీకి చేరింది. ఈ క్రమంలో కొలికపూడి,కేశినేని చిన్న ఇద్దరూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో కొలికపూడి నారాలోకేష్ను కలిసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తదుపురి భవిష్యత్ కార్యచరణపై కొలికపూడి దృష్టిసారించినట్లు తిరువూరు పొలిటికల్ సర్కిళ్ల చర్చ కొనసాగుతోంది.
చంద్రబాబు.. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు. రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా? అని ప్రశ్నించారు. కాశీబుగ్గ ఘటనపై ప్రభుత్వానికి బాధ్యత లేదా?. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో ఏడాలో కూడా అర్ధం కావడం లేదంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదు. ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వ విధానం బాధాకరంగా ఉంది. తుపాను పంట నష్టంపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదు. వైఎస్సార్సీపీ హయాంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాం. గిట్టుబాట ధర, సబ్సిడీ ఇచ్చాం. అది మా ప్రభుత్వ విధానం. ఇప్పుడు పంట ఇన్సూరెన్స్ రైతే కట్టాలనే నిబంధన తీసుకొచ్చారు. అన్ని రకాల పంటల రైతులు నష్టపోయారు. సీఎం, మంత్రులు మాటలు చెప్తున్నారు.. చేతల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటి వరకూ పంట నష్టంపై ప్రకటన చేయలేదు.రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు. రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా?. రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు కదా?. రైతులు కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు. రైతులకు వైఎస్సార్, జగన్ హయాంలో మంచి జరిగింది. రైతులకు మంచి చేయడం మానేసి విమర్శలు చేస్తే ఎలా?. జగన్ రైతుల దగ్గరకు వెళ్లారు.. సమస్యలు తెలుసుకున్నారు. ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్ధం కావడం లేదు. ఈ 18 నెలల కాలంలో ఏ జిల్లాకు రైతులకు ఎంత మేలు చేశారో ప్రభుత్వం ప్రకటించాలి. ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ వివరాలు వెల్లడించండి. ఈ ప్రభుత్వం రైతులపట్ల అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నా.. ఆక్షేపన చేస్తున్నా. రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలనేది మా విధానం. కూటమి విధానం రైతులే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. వ్యవసాయం, విద్య, వైద్యం మాకు ప్రధానం. ఏ వర్గానికి ఏమీ వద్దు అనేది కూటమి విధానం. వైద్య విద్యను అమ్మేస్తామనడం కరెక్ట్ కాదు. విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత.కాశీబుగ్గపై బాధ్యత లేదా?కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగితే అది ప్రైవేట్ ఆలయం అంటున్నారు.. ఇవేం మాటలు. ఎక్కడైనా జనం ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా?. ఎక్కువ మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి అంచనా.. బాధ్యత లేదా?. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి ఘటనలు జరుగుతాయి. సీఎం అంటే అందరికీ ముఖ్యమంత్రే. తిరుపతి, సింహాచలం ఘటన నుంచి ప్రభుత్వం ఏం నేర్చుకుంది?. ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి. రైతులు, వైద్యం, విద్య, భక్తులు ఏ అంశంలో కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.కూటమి ప్రభుత్వ పాలన వలన ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ప్రజల సమస్యలు తెలుసుకోడానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు. కళ్లతో చూసి పని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఏదైనా జరిగితే వైఎస్సార్సీపీ వాళ్లని ఎలా ఇరికించాలా అని ప్రభుత్వం పని చేస్తుంది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కాశీబుగ్గ ఘటనకు కారణాలు ఏమిటి? ఎవరు బాధ్యులు ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం కేసుపై..నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. లేదా టీడీపీ నేత జయచంద్రా రెడ్డికి సంబంధం లేదని చెప్పండి. నన్ను అడిగితే జోగి రమేష్కు సంబంధం లేదని చెప్తా?. ఎప్పుడు ప్రజా సమస్యలు.. ప్రభుత్వ వైఫల్యం బయటపడినా ఏదో ఒక డైవర్షన్ తీసుకొస్తారు.. గతంలో డ్రగ్స్ కేసులో టీడీపీ వాళ్లను ఎందుకు వదిలేశారు. టీడీపీ ఎంపీ మనిషి డ్రగ్స్ కేసులో ఉంటే ఎందుకు వదిలేశారు?. డ్రగ్స్ అంశంలో గతంలో సీబీఐకి లేఖ రాశాను. భోగాపురం విమానాశ్రయానికి మేమే ల్యాండ్ పూలింగ్ చేసాం. శంకుస్థాపన చేసిన రోజే మొదటి ఫ్లైట్ రాక కోసం టార్గెట్ పెట్టుకున్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ మాట్లాడితే భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీకి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధం లేదు. మీరు చేయాల్సింది అది కాదు. ఎయిర్ పోర్టుకు అప్రోచ్ రోడ్స్ తేవాలి. చుట్టుపక్కల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి’ అని హితవు పలికారు.
టీడీపీ ఎంపీ చిన్నికి మద్దెల దరువు..
ఏదోలా చంద్రబాబు.. లోకేష్ల ఆశీస్సులతో టిక్కెట్ తెచ్చుకుని ఎంపీగా అయితే గెలిచాడు కానీ గెలిచిన నాటి నుంచి సుఖం లేదు నిద్ర లేదు ప్రశాంతత లేదు అన్నట్లుగా తయారైంది కేశినేని చిన్ని (శివనాథ్) పరిస్థితి. ఎటు చూసినా ఆయన గౌరవం తగ్గించే పరిణామాలు జరుగుతున్నాయి తప్ప ఆయన్ను తన పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా గౌరవంగా చూడడం లేదు. ఇదేలా ఉంటుండగానే తన సొంత అన్న మాజీ ఎంపీ కేసినేని నాని ఏకంగా తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఫిర్యాదు చేయడం చిన్నికి మరింత పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఏకంగా తనపై ధ్వజం ఎత్తడం రూ.ఐదు కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చానని చెప్పడం దీంతోపాటు.. గంజాయి, లిక్కర్, మైనింగ్ వంటి ఇతరత్రా అక్రమ వ్యాపారాలన్నీ తన అనుచరులే చేస్తున్నారని చెప్పడం వంటి పరిణామాలు పార్టీలో కేశినేని చిన్ని పరపతిని గణనీయంగా తగ్గించాయి. అసలు చిన్ని ఎవరు అంటే పేకాట డెన్ నడిపే పెద్ద జూదరి అంటూ పోలికపూడి శ్రీనివాస్ చేసిన కామెంట్ చిన్ని గౌరవాన్ని నేలమట్టం చేసింది.తెలుగుదేశం పార్టీలో లోకేష్, చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం కలిగిన విజయవాడ ఎంపీ, కమ్మ సామాజికవర్గానికి చెందిన కేశినేని చిన్నిని పొలిటికల్ గా టచ్ చేయాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. కానీ చిన్నిని పూచికపుల్ల మాదిరి తీసిపారేసిన కొలికపూడి పార్టీలో సంచలనం రేపారు. దీంతో ఇద్దరినీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరుకావాలి ఆదేశించిన అధిష్టానం మంగళవారం సాయంత్రం ఆ ఇద్దరి నుంచి వివరణలు వాంగ్మూలాలు తీసుకుని బయటకు పంపించింది. అయితే ఆ ఇద్దరు కూడా తాము పార్టీకి విధేయులం అని.. తమకు పార్టీ ఒక దేవాలయం అయితే చంద్రబాబు.. లోకేష్ తమపాలిట దేవుళ్ళు అంటూ ఒకే స్క్రిప్ట్ చదవడంతో క్రమశిక్షణ సంఘం ఇదెక్కడి కోరస్ రా దేవుడా అని తలపట్టుకుంది.ఇదిలా ఉండగా చిన్నిపై సొంత అన్న, మాజీ ఎంపీ నాని తుపాకీ ఎక్కుబెట్టారు. చిన్నికి చెందిన కంపెనీలు పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాయని మనీ తీవ్రమైన ఆర్థిక నేరాలు వెనుక చిన్ని హస్తం ఉందని ఆరోపిస్తూ నాని ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఆర్థిక నేరాలన్నింటిపైన విస్తృతంగా దర్యాప్తు చేసి చిన్ని ప్రమేయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని నాని చేసిన ఫిర్యాదు ఇప్పుడు తెలుగుదేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. తనపై సొంత అన్నయ్య ఇలా ఫిర్యాదు చేయాలని చిన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని ఏమీ చేయలేని పరిస్థితి.. దీంతో అటు కొలికపూడి శ్రీనివాస్ ఇటు సొంత అన్న నాని ఒకేసారి ఎటాక్ చేయడంతో ఎంపీ శివనాథ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.-సిమ్మాదిరప్పన్న.
ఇది సర్కారా? రౌడీ దర్బారా..? : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే మహోన్నత లక్ష్యంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుంగలో తొక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి లక్షలాది విద్యార్థులకు ఉన్నత విద్య పొందే హక్కు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ అంధకారం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సోమాజిగూడలో భారీ రోడ్షోలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం రేవంత్రెడ్డి రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు కట్టకుండా విజిలెన్స్ దాడులతో కాలేజీలను బెదిరిస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్కు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు డీఏ, పీఆర్సీలు లేవు. రిటైరైనవారు, ఉద్యోగులు, విద్యార్థులను బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్రెడ్డీ? తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లోంచి పది శాతం కటింగ్ అన్నారు కదా! పెన్షనర్లు నీ తల్లిదండ్రుల్లాంటి వారేకదా.. నీ జీతంలోంచి కోత పెట్టాలా? ఇంతమందిని వేధించి ఏం సాధిస్తావు? మీరు నడుపుతున్నది సర్కారా లేక రౌడీ దర్బారా?’అని దుయ్యబట్డారు. మీరే న్యాయమూర్తులు ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆషామాషీ ఎన్నిక కాదు. పదేళ్ల బీఆర్ఎస్ అభివృద్ధికి, రెండేళ్ల కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్న పోటీ. ఇది బీఆర్ఎస్ వికాసానికి, కాంగ్రెస్ విధ్వంసానికి, సంక్షేమానికి– సంక్షోభానికి మధ్య జరుగుతున్న పోటీ. ఎవరి పాలన బాగుంటే వారికి ఓటెయ్యండి. 4 కోట్ల మంది 4 లక్షల ఓటర్ల వైపు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో సరైన వారినే గెలిపించండి. మీరే న్యాయనిర్ణేతలు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడున్న జనరేటర్లు, ఇన్వర్టర్లు, నీటికోసం ధర్నాల వంటి సమస్యల్ని ఒక్కటొక్కటిగా పరిష్కరించాం. అందరినీ అమ్మలా అక్కున చేర్చుకునే హైదరాబాద్లో కార్మీకులకు పని కల్పించాం. పదిలక్షలకు పెరిగిన ఐటీ ఉద్యోగులతోపాటే రియల్ ఎస్టేట్, వివిధ వ్యాపారాలు పెరిగాయి. శాంతి భద్రతల సమస్యల్లేకుండా నగరాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర్ది. మడిలో ఉండే రైతును, బడిలో ఉండే టీచర్ను, గుడిలో ఉండే పూజారిని, చర్చిలో ఉండే పాస్టర్ను, మసీదులో ఉండే ఇమాంను ఇలా.. సబ్బండ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది. కేసీఆర్, కేటీఆర్ల రెండు ఉద్యోగాలు ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికలకు ముందు రాహుల్గాంధీ ఇచ్చిన హామీ నెరవేర్చనందున ఇప్పుడు నిరుద్యోగులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు’అని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 420 హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయకుండా అన్నివర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత నీటి పథకం కూడా ఎత్తివేసి వేలకువేల బిల్లులు ఇస్తుందని అన్నారు. హైడ్రా పేదలపైనే ప్రతాపం చూపుతుందని.. మంత్రులు, పెద్దల జోలికి పోదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ కావాలని తెలిపారు.
Sports
అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండి: టీమిండియా దిగ్గజం
విశ్వ విజేతగా అవతరించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ట్రోఫీని ముద్దాడిన హర్మన్ సేన విజయాన్ని భారతావని ఉత్సవంగా జరుపుకొంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ (ICC Women's World Cup) టోర్నమెంట్లో.. 2005, 2017లో రన్నరప్తోనే సరిపెట్టుకున్న భారత్.. ఈసారి మాత్రం ఆఖరి గండాన్ని అధిగమించింది.గావస్కర్ వ్యాఖ్యలు వైరల్నవీ ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా (Ind Beat SA)ను 52 పరుగుల తేడాతో ఓడించి.. జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే.. టీమిండియా దిగ్గజం, 1983 వరల్డ్కప్ విజేత సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండాస్పోర్ట్స్స్టార్కి రాసిన కాలమ్లో.. ‘‘కొంతమంది భారత పురుషుల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్కప్- 1983 విజయాన్ని.. తాజాగా అమ్మాయిలు చాంపియన్గా నిలవడంతో పోలుస్తున్నారు. అయితే, 1983 ఎడిషన్ కంటే ముందు మెన్స్ టీమ్ ఒక్కసారి కూడా గ్రూప్ దశను దాటలేదు.నాకౌట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాకు అప్పుడు అస్సలు తెలియవు. అలాంటిది మేము తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండా విజేతలుగా నిలిచాము.అందుకే అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండిఅయితే మన మహిళా జట్టు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడింది. తర్వాత ఇలా అద్భుతమైన విజయంతో విజేతగా నిలిచింది’’ అని గావస్కర్.. తమ విజయాన్ని అమ్మాయిలతో పోల్చవద్దని స్పష్టం చేశాడు.అదే విధంగా.. ‘‘83లో టీమిండియా సాధించిన విజయం భారత క్రికెట్ రూపురేఖలు మార్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రికెట్ వైపు నడిపించేలా చేసింది. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత క్రికెట్ మరో స్థాయికి చేరుకుంది.ఇప్పుడు భారత జట్టులో కేవలం మెట్రో నగరాల నుంచి వచ్చినవారే కాకుండా.. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు. కాగా నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.సమిష్టి కృషితోఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలి వర్మ (87) గట్టి పునాది వేయగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ (58), వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (34) ఇన్నింగ్స్ నిర్మించారు. జెమీమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20) స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. అయితే, మంధాన, షఫాలి దీప్తి, రిచా రాణించడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు స్కోరు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. షఫాలి వర్మ రెండు, నల్లపురెడ్డి శ్రీ చరణి ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సఫారీ జట్టులో ఓపెనర్, కెప్టెన్ లారా వొల్వర్ట్ (101) శతకంతో పోరాడగా.. మిగతా వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.మరో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (23), సూనే లూస్ (25) అనిరె డెర్క్సెన (35) ఓ మోస్తరుగా రాణించారు. అయితే, భారత బౌలర్ల విజృంభణ ముందు నిలవలేకపోయిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో కేవలం 246 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 52 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. సరికొత్త చాంపియన్గా అవతరించింది.చదవండి: అందుకే అర్ష్దీప్ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా డీకే.. పూర్తి వివరాలు
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్కు భారత్ తమ జట్టును ప్రకటించింది. హాంకాంగ్లో నవంబరు 6 నుంచి 9 వరకు మోంగ్ కాక్ వేదికగా జరిగే ఈ పొట్టి టోర్నీలో భారత్కు.. మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సారథ్యం వహించనున్నాడు.డీకేతో పాటు రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్లు హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్లో పాల్గొననున్నారు. అదే విధంగా.. దేశీ వెటరన్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) కూడా ఈ టోర్నీలో భాగం కానున్నాడు.ఆరు ఓవర్ల పాటు ఆట కాగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో.. ఒక్కో టీమ్లో ఆరుగురు సభ్యులు (మాజీ క్రికెటర్లు) ఉంటారు. ఆరు ఓవర్ల పాటు ఆట సాగుతుంది. ఇక ఈ షార్టెస్ట్ క్రికెట్ ఈవెంట్లో 2005లో టైటిల్ గెలిచిన భారత్.. రెండుసార్లు రన్నరప్తో సరిపెట్టుకుంది.అయితే, గతేడాది రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలో కనీసం ఫైనల్ కూడా చేరలేదు టీమిండియా. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త సారథిగా డీకే రావడం విశేషం. కాగా తాజా ఎడిషన్లో పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి.పన్నెండు జట్లు ఇవేభారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, నేపాల్, ఇంగ్లండ్, యూఏఈ, కువైట్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ (చైనా) ఈసారి టోర్నీలో భాగం కానున్నాయి. పూల్- ‘ఎ’ నుంచి సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్, నేపాల్.. పూల్- ‘బి’ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ యూఏఈ.. పూల్- ‘సి’ నుంచి ఇండియా, పాకిస్తాన్, కువైట్... పూల్- ‘డి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ పోటీపడతాయి.హాంకాంగ్ సిక్సెస్-2025లో పాల్గొనే జట్ల వివరాలుభారత్దినేశ్ కార్తిక్ (కెప్టెన్), రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచల్.ఆస్ట్రేలియాఅలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హోబ్సన్, క్రిస్ గ్రీన్, విల్ బొసిస్టొ, ఆండ్యూ టై.ఇంగ్లండ్జో డెన్లీ (కెప్టెన్), జేమ్స్ కోల్స్, ఈథన్ బ్రూక్స్, టోబీ అల్బర్ట్, జార్జ్ హిల్ డాన్ మౌస్లే, టామ అస్పిన్వాల్.బంగ్లాదేశ్అక్బర్ అలీ (కెప్టెన్) అబు హైదర్ రోని, జిషాన్ ఆలం, మొహమ్మధ్ సైఫుద్దీన్, మొసాడెక్ హొసేన్, రకీబుల్ హసన్, టొఫేల్ అహ్మద్.యూఏఈకౌశిక్ హర్షిత్ (కెప్టెన్), ఖలీద్ షా, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ సాగిర్ ఖాన్, నిలాన్ష్ కేస్వాని, రెజిత్ కురుంగొడె, జాహిద్ అలీ.కువైట్యాసిన్ పటేల్ (కెప్టెన్), ఉస్మాన్ పటేల్, మీట్ భవ్సార్, బిలాల్ తాహిర్, రవిజ సాండరువాన్, అద్నాన్ ఇద్రీస్, మొహమద్ షఫీక్.నేపాల్శరద్ వేసావ్కర్ (కెప్టెన్), సందీప్ జోరా, లోకేశ్ బామ్, బాసిర్ అహ్మద్, ఆదిల్ ఆలం, రషీద్ ఖాన్, రూపేశ్ సింగ్.శ్రీలంకలాహిరు మధుషాంక (కెప్టెన్), ధనంజయ లక్షణ్, తనుక దబారే, నిమేశ్ విముక్తి, లాహిరు సమారకూన్, థారిందు రత్నాయక, సచిత జయతిలకె.సౌతాఫ్రికాజోర్డాన్ మోరిస్ (కెప్టెన్), అబ్దుల్లా బయోమి, ఈథన్ కన్నింగ్హామ్, బులెలొ దూబే, కషీఫ్ జోసెఫ్, బ్లేక్ సింప్సన్, జోరిచ్ వాన్ షాల్వేక్.హాంకాంగ్యాసిమ్ ముర్తజా (కెప్టెన్), బాబర్ హయత్, అన్షుమాన్ రథ్, ఐజాజ్ ఖాన్, నిజాకత్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్, నస్రుల్లా రాణా.అఫ్గనిస్తాన్గుల్బదిన్ నైబ్ (కెప్టెన్), ఇక్రామ్ అలిఖిల్, కరీం జన్మత్, షరాఫుద్దీన్ ఆష్రఫ్, ఫర్మానుల్లా సఫీ, ఐజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, సెదీకుల్లా పచా.పాకిస్తాన్అబ్బాస్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఖవాజా మొహమద్ నఫాయ్, మాజ్ సదాకత్, మొహమద్ షాజాద్, సాద్ మసూద్ షాహిద్ అజీజ్.చదవండి: యాషెస్ తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
అందుకే అర్ష్దీప్ను తప్పించాం: టీమిండియా కోచ్
ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20 మ్యాచ్లలో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)కు మొండిచేయే ఎదురైంది. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో వందకు పైగా వికెట్లు తీసి.. భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్న అర్ష్కు.. యాజమాన్యం తుదిజట్టులో చోటు ఇవ్వలేదు.అర్ష్దీప్ను కాదని.. హర్షిత్ రాణా (Harshit Rana)కు ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) హర్షిత్ కోసం అర్ష్ను బలిచేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. సత్తా చాటిన అర్ష్ఈ నేపథ్యంలో ఆసీస్ (IND vs AUS)తో జరిగిన మూడో టీ20లో ఎట్టకేలకు అర్ష్ను యాజమాన్యం ఆడించింది. వరుసగా రెండు మ్యాచ్లలోనూ బెంచ్కే పరిమితమైన ఈ లెఫ్టార్మ్ పేసర్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. 35 పరుగులు ఇచ్చిన అర్ష్దీప్.. ట్రావిస్ హెడ్ (6), జోష్ ఇంగ్లిస్ (11), మార్కస్ స్టొయినిస్ (64) రూపంలో మూడు కీలక వికెట్లు తీసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తొలి మ్యాచ్లలో అర్ష్దీప్ను బెంచ్కే పరిమితం చేయడంపై ప్రశ్న ఎదురైంది.అతడు వరల్డ్క్లాస్ బౌలర్.. అర్థం చేసుకున్నాడుఇందుకు బదులిస్తూ.. ‘‘అర్ష్దీప్ అనుభవజ్ఞుడైన బౌలర్. మేము వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని అతడు అర్థం చేసుకున్నాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలుసుకున్నాడు.అతడు వరల్డ్క్లాస్ బౌలర్. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీయగల నైపుణ్యం గల ఆటగాడు. అతడి విలువ మాకు తెలుసు. అయితే, ఈ పర్యటనలో మాకు వివిధ కాంబినేషన్లు అవసరం. దీని వల్ల కొంత మంది ఆటగాళ్లకు నిరాశ తప్పకపోవచ్చు.అయితే, సెలక్షన్ విషయం ఆటగాళ్ల చేతుల్లో ఉండదు. ఇందుకు గల కారణాలు మాత్రం వారు అర్థం చేసుకోగలరు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని దృష్టిలో పెట్టుకుని మేము ఆటగాళ్లను మరింత శ్రమించేలా చేస్తున్నాం. ఎప్పుడు జట్టులోకి వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా సంసిద్ధం చేస్తున్నాం.కొన్నిసార్లు కొందరికి నిరాశ తప్పదుఒత్తిడిలోనూ రాణించేలా తీర్చిదిద్దుతున్నాం. మా ఆటగాళ్ల నైపుణ్యాలపై మాకు ఎటువంటి సందేహాలు లేవు. అయితే, కాంబినేషన్ల కోసం ప్రయత్నిస్తున్నపుడు కొన్నిసార్లు కొందరికి నిరాశ తప్పదు’’ అని 41 ఏళ్ల మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.చదవండి: ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి
రాణించిన హోప్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
ఐదు టీ20లు, మూడు టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేల సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (నవంబర్ 5) తొలి టీ20 జరుగుతుంది. అక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్కు దిగింది.రాణించిన హోప్విండీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్లో బ్రాండన్ కింగ్ (3), ఐదో ఓవర్లో అలిక్ అథనాజ్ (16), ఎనిమిదో ఓవర్లో అకీమ్ అగస్టీ (2) ఔటయ్యారు. ఈ దశలో కెప్టెన్ షాయ్ హోప్ (39 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (28), రోవ్మన్ పావెల్ (33) సాయంతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగలిగింది. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు రొమారియో షెపర్డ్ బౌండరీలు బాదాడు.సత్తా చాటిన బౌలర్లుఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్లు సత్తా చాటారు. సాంట్నర్ మినహా అందరూ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీశారు. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్ తలో 2 వికెట్లు తీయగా.. జేమీసన్, నీషమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తుది జట్లు..వెస్టిండీస్: షాయ్ హోప్ (కెప్టెన్), అలిక్ అథనాజ్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీమ్ అగస్టీ, రోవ్మన్ పావెల్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హొసేన్, జేడన్ సీల్స్న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్వెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీచదవండి: బంగ్లాదేశ్ కెప్టెన్గా దేశవాలీ స్టార్
National
యూపీలో రైలు ప్రమాదం.. భక్తులు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో విషాదకర ఘటన వెలుగుచూసింది. రైలు పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. వివరాల ప్రకారం..మీర్జాపూర్లోని చునర్ రైలు స్టేషన్లో ప్రయాణీకులను రైలు ఢీకొట్టింది. ప్రయాగ్రాజ్ నుంచి వచ్చిన భక్తులు రైలు ఆగిన వెంటనే ప్లాట్ఫామ్ ఉన్న వైపు కాకుండా పట్టాలు ఉన్న వైపునకు దిగారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న రైలు.. పట్టాలు దాటుతున్న భక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు తెలిసింది. ప్రమాద కారణంగా రైల్వేస్టేషన్లో పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి సహాయక చర్యలకు ఆదేశించారు. Aleast six killed at Chunar Railway Station in Mirzapur on Wednesday morning, when several pilgrims were run over by the Kalka Express while crossing the railway tracks. The victims were on their way to Varanasi to take part in Kartik Purnima festivities. pic.twitter.com/df6PZSCmw5— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) November 5, 2025ఇదిలా ఉండగా.. వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. నిన్న ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ గూడ్సు రైలును ప్రయాణికుల రైలు వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రైలు కోర్బా జిల్లాలోని గెవరా నుంచి బిలాస్పుర్కు వెళ్తుండగా.. గటోరా- బిలాస్పుర్ స్టేషన్ మార్గమధ్యంలో ప్రమాదం చోటుచేసుకుంది.🚨 Mirzapur Accident | Tragic Incident in Chunar on Kartik Purnima — 4 Devotees Killed After Being Hit by Train While Crossing Railway Tracks Tribute 📷 #Mirzapur #Chunar #KartikPurnima #UttarPradesh #TrainAccident #BreakingNews #IndiaNews https://t.co/SKsHmX4r07 pic.twitter.com/i3crPQq0Hz— Indian Observer (@ag_Journalist) November 5, 2025ఘటనా స్థలంలో రైల్వేశాఖ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రయాణికుల రైలు రెడ్ సిగ్నల్ను దాటి ముందుకు వెళ్లడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష సాయం అందించనున్నట్లు తెలిపింది.
కుల రాజకీయాలే.. పొలిటికల్ పార్టీలకు ఇంధనం..!
కుల వ్యవస్థ..! ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని ట్యాగ్ భారత్కు మాత్రమే సొంతం..! ఇంకా చెప్పాలంటే.. భారత్లో ఓ వ్యక్తి పుట్టగానే.. అతనికి కులం అనే ట్యాగ్ని తగిలించేస్తారు..! కన్ను తెరిస్తే కులం.. కన్ను మూస్తే కులం.. జీవితమంతా కులం కులం కులం..! ఆ కులమే ఇప్పుడు రాజకీయాలకు మూలాధారమైంది. ముఖ్యంగా బిహార్ లాంటి కడు పేద రాష్ట్రాల్లో రాజకీయాలను సైతం కులం మాత్రమే శాసిస్తోంది. బిహార్ వెనకబాటుకు కారణం నిరుద్యోగితో.. పరిశ్రమల లేమి కారణం కాదు..! కేవలం కుల రాజకీయాలే ఆ రాష్ట్ర పరిస్థితికి కారణమనేది నిర్వివాదాంశం..! ప్రజలు కులాల వారీగా చీలిపోవడమే ఆ రాష్ట్ర ఆర్థిక దుస్థితికి కారణం..! ‘ధనమేరా అన్నిటికీ మూలం’ అని ఓ సినీ కవి అన్నాడు.. బిహార్లో మాత్రం ‘కులమేరా అన్నిటికీ మూలం’ అనే పరిస్థితులు ఉన్నాయి. కులగణన పేరుతో సర్వే నిర్వహించి చూపించిన తొట్టతొలి రాష్ట్రం కూడా బిహారే..! ఇక్కడ ప్రజలు కులం పేరుతో విడిపోతారు. రాజకీయనాయకులు కులం అనే అంశాన్ని ఓటు బ్యాంకుగా మలచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. బిహార్లో కులం అనేది ఒక పదం కాదు.. ప్రజల మధ్య ఒక గోడ. ఈ కులం ట్యాగ్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతే.. మరికొందరికి అవకాశాలను మూసివేస్తోంది. భారతదేశంలోనే కుల రాజకీయాలు అత్యంత ప్రభావం చూపే రాష్ట్రం బిహార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.2023లో బిహార్ కులగణన తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రాష్ట్ర జనాభా 13 కోట్లు అయితే.. వీరిలో అత్యంత వెనుకబడిన వర్గాలు(EBC) 36%, ఇతర వెనుకబడిన వర్గాలు(OBC) 27%, ఎస్సీ ఎస్టీలు 19%, ముస్లింలు 17%, అగ్రవర్ణాలుగా ఉన్న బ్రాహ్మణులు, రాజ్పూత్లు, భూమిహార్లు, బనియాలు 15% ఉన్నట్లు తేలింది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. బిహార్లో ప్రతీ 10 మంది ఓటర్లలో 8 మంది వెనకబడిన వర్గాలకు చెందినవారే..! ఇప్పుడు ఊహించండి.. కులం ఓ బలమైన గోడగా ఉన్న బిహార్లో ఎన్నికలు ఎలా ఉంటాయో..? అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా.. నాయకుడు అయినా.. కులం అనే పజిల్ని అర్థం చేసుకోకపోతే.. విజయం కాదు కదా.. విజయపుటంచులను చేరడం కూడా అసాధ్యమే..! అందుకే.. బిహార్లో ప్రతి రాజకీయ నాయకుడి ప్రసంగం, ప్రతి కూటమి, అభ్యర్థులకు ఇచ్చే ప్రతి టికెట్ కుల సమీకరణల చుట్టే తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..!కలసికట్టుగా ఉన్నారా??బిహార్లో ఓబీసీలంతా కలసి కట్టుగా ఉన్నారా? ఈ ప్రశ్నకు ఇదమిత్థంగా కూడా అవుననే సమాధానం చెప్పలేం. ఈబీసీల్లోనే 125 వేర్వేరు సమూహాలున్నాయి. దళితులు పాస్వాన్, ముసహార్, చమార్లుగా చీలిపోయారు. ఓబీసీలు కూడా యాదవ, కుర్మీ, కోయిరీ, ఈబీసీలుగా విడిపోయారు. వీరంతా వేర్వేరు రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారిపోయారు. బిహార్లో కులాలంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాదిరిగా సామాజిక గుర్తింపు కాదు..! రాజకీయ ఆయుధం మాత్రమే!. ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు? ఎవరు గెలవాలి? ఎవరిని ఓడించాలి? అన్నదాన్ని కూడా ఇక్కడ కులమే నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రతి ఎన్నిక.. ప్రతి కూటమి.. ప్రతి నినాదం కుల గణాంకాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ‘ఈ ప్రభుత్వం ఏం చేసింది?’ అనే ప్రశ్న ఉత్పన్నమైతే.. బిహార్లో మాత్రం.. ‘ఈ ప్రభుత్వం ఏ కులానికి చెందినది?’ అనే ప్రశ్న వినిపిస్తుంది. భారత్లో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతున్నా.. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యానికి మన దేశం కేంద్ర బిందువు అయినా.. బిహార్లో మాత్రం కులమే అత్యంత శక్తిమంతమైన రాజకీయ పార్టీగా ఉంది.90వ దశకం నుంచి..బిహార్ కుల వ్యవస్థను.. కులాధిపత్యాన్ని అర్థం చేసుకోవాలంటే.. 90వ దశకానికి, అంటే.. మండల్ కమిషన్ యుగానికి వెళ్లాల్సిందే..! అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఒక్క నిర్ణయంతో భారత రాజకీయాల డీఎన్ఏ మారిపోయినట్లయింది. వెనకబడిన వర్గాల కోసం ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించగానే.. ఓ విప్లవానికి కేంద్ర బిందువుగా బిహార్ మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ అణగారిన వర్గాల స్వరంగా ఎదిగారు. ఆయన తన రాజకీయ సామ్రాజ్యాన్ని ‘ఎం-వై సమీకరణం’.. అంటే ముస్లింలు, యాదవులతో నిర్మించారు. ఆ తర్వాత నితీశ్ కుమార్ వచ్చారు. ఆయన కుర్మీలు, ఇతర అత్యంత వెనకబడిన వర్గాల తరఫున మాట్లాడారు. 2023లో కులగణన చేయించింది కూడా ఆయన సర్కారే. కేంద్రం కులగణనను వ్యతిరేకిస్తే.. ఆయన స్వతంత్రంగా సర్వే నిర్వహించారు. దాంతో.. బిహార్లో ‘కుల గుర్తింపుల యుద్ధం’ మరింత ముదిరింది.కులాల వారీగా పార్టీలుబిహార్లో రాజకీయ పార్టీలు కులాల వారీగా ఉన్నాయి. కులగణనతో వచ్చిన లెక్కల ప్రకారం బిహార్ ఎన్నికల్లో ఎవరూ.. ఏ పార్టీ ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కూడా కుల సమీకరణాలతో ముడిపడి ఉంటుంది. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ యాదవులు, ముస్లిం ఓటు బ్యాంకుతో ముందుకు వెళ్తోంది. జనతాదళ్ (యూ) కుర్మీలు, ఈబీసీలపై ఆధారపడుతోంది. బీజేపీ అయితే.. అగ్రవర్ణాలు, పట్టణ ప్రాంతాల్లోని హిందువులపై ఆధారపడి ఉంది. అంటే.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా.. బిహార్లో మాత్రం రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను కాకుండా.. కులాలను నమ్ముకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల విశ్లేషకులు కూడా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థి కులాన్ని బట్టి గెలుపోటములను విశ్లేషిస్తారు. అంటే.. ఓటర్లు కూడా కులం ఆధారంగానే ఓట్లు వేస్తారే తప్ప.. పార్టీల సిద్ధాంతాలను బట్టి కాదని స్పష్టమవుతోంది. అంటే.. గ్రామంలో పరిస్థితులు.. బడుల్లో టీచర్ల నియామకాలు, భూవివాదాల పరిష్కారం వంటి అంశాలు కాకుండా.. తమ కులస్థుడు ఎమ్మెల్యే అయితే.. తమ మాట వింటాడనే భావన ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. బిహార్లో రాజకీయ నాయకులు, పార్టీలు నియోజకవర్గాల వారీగా కులాల మ్యాప్ను అధ్యయనం చేయడం పరిపాటిగా మారింది. ఏ కులం వారు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటారు? ఏ అభ్యర్థి అయితే ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలడు? అనే లెక్కలను సమతుల్యంగా ఉండేలా చూసుకుంటూ.. కూటములు కట్టడం ఆనవాయితీగా మారింది. ఈ విషయంలో కాస్త తెలివిగా ఆలోచించే నితీశ్కుమార్ తరచూ కూటములను మార్చడం వెనక కుల సమీకరణాలే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన అయితే ఆర్జేడీ.. లేదే బీజేపీ అన్నట్లుగా మిత్రపక్షాలను మార్చేస్తుంటారు. అంటే.. బిహార్లో సిద్ధాంతాలను కాకుండా.. కుల సమీకరణాలను నమ్ముకోవాలనే విషయాన్ని ఆయన చక్కగా ఒంటబట్టించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ప్రతీ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక కుల గణాంకాల చుట్టే తిరుగుతుండడం గమనార్హం..! అంటే.. అభ్యర్థి ప్రజాసేవకుడా? ప్రజలకు మంచి సేవ చేస్తూ.. పాలనను అందిస్తాడా? అనే విషయాన్ని పక్కనబెట్టి.. అతని కులం ఏది అనేదే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తోంది.ఆ నియోజకవర్గాల్లో మార్పు..!కుల రాజకీయాల వ్యవహారం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తగ్గుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పట్నా, గయా, ముజఫర్పూర్ వంటి పట్టణాల్లో కొత్త ఓటర్లు తమ పంథాను మార్చుకున్నట్లు వివరిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో అక్షరాస్యత పెరగడం, యువ ఓటర్లు బిహార్ వెలుపల చదువుకున్న వారు కావడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో 40% యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెల్లడం కూడా ఈ మార్పునకు కారణమంటున్నారు. ఢిల్లీలో, తమిళనాడులో రోజుకూలీలుగా.. ముంబైలో రిక్షావాలాలా.. సూరత్లోని కర్మాగారాల్లో కార్మికులుగా పనిచేస్తున్న యువత.. మార్పును కోరుకుంటోందని స్పష్టమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. బిహార్ వెలుపల ఉన్నంత కాలం వారు కుల ఛట్రం నుంచి బయట ఉన్నా.. తిరిగి రాష్ట్రానికి వచ్చేసరికి వెనక్కి వెళ్లే ప్రమాదం కూడా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. కులం అనేది బిహార్ వెలుపల అదృశ్యమైనా.. రాష్ట్రంలోకి వచ్చేసరికి తిరిగి పుంజుకుంటుందన్నట్లే..! అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ వర్గం.. ఇప్పుడు కులాలుగా విడిపోతుందా? సిద్ధాంతాలకు లోబడి ఓట్లు వేస్తుందా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి.మార్పునకు నాంది పలుకుతున్న మహిళలు.. బిహార్ మహిళలు మాత్రం కులం విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లు తాజా పరిణామాలు, గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. నితీశ్ కుమార్ సర్కారు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది. మద్య నిషేధాన్ని అమలు చేసింది. దీని ఫలితంగా మహిళలు మాత్రం స్వతంత్రంగా ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ఈ సారి మార్పు కనిపించే అవకాశాలుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2020 ఎన్నికల్లోనూ మహిళల ఓటింగ్ 60 శాతాన్ని దాటింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు కులం కోసం కాకుండా.. భద్రత, విద్య, సమాజంలో గౌరవం కల్పించే అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా బిహార్ ఓటర్లు కులాల వలయంలో చిక్కుకుని, ఓటుహక్కును వినియోగించుకుంటారా? అభివృద్ధి గురించి ఆలోచిస్తారా? విద్యావంతులు, యువత, మహిళలు, వలస కార్మికులు మార్పును తీసుకొస్తారా? ఈవీఎం బటన్ నొక్కడానికి ముందు ఒక ఆలోచన.. నొక్కేప్పుడు కులం ఆలోచనతో మళ్లీ వెనక్కి వెళ్తారా? కుల రాజకీయాలకు కేంద్ర బిందువు అని బిహార్కు ఉన్న అపవాదును తొలగిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే..! దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాయండి. - హెచ్.కమలాపతిరావు
రోడ్డు ప్రమాదంలో రియాల్టీ షో డ్యాన్సర్ దుర్మరణం
బెంగళూరు: రియాలిటీ షోలలో తన పెర్ఫామెన్స్తో పేరు తెచ్చుకున్న ప్రముఖ డ్యాన్సర్ సుధీంద్ర (30) మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కొత్త కారు కొనుగోలు చేసిన సుధీంద్ర, ఈ ఆనందాన్ని తన సోదరుడితో పంచుకునేందుకు వెడుతుండగా బెంగళూరు నగర శివార్లలోని నెలమంగళలోని పెమ్మనహళ్లి సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన కుటుంబం సభ్యులు విచారంలో మునిగిపోయారు.‘డాన్స్ షో’తో సహా కన్నడ రియాలిటీ షోలతో పేరుతెచ్చుకున్న సుధీంద్ర,కర్ణాటకలోని త్యామగోండ్లు గ్రామానికి చెందిన వాడు. డోబ్స్పేటలో ఒక పాఠశాలను కూడా నడుపుతూ ప్రజాదారణ పొందాడు. సోమవారం కొత్త కారును కొనుగోలు చేశాడు. అనంతరం పెమ్మనహళ్లిలోని సోదరుడికి ఇంటికి బయలుదేరాడు. ప్రయాణం మధ్యలో, కారులో సాంకేతిక లోపం ఏర్పడింది, దీనితో డ్యాన్సర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి తనిఖీ చేస్తుండగా, అటునుంచి వస్తున్న ట్రక్కు అతణ్ని బలంగా ఢీట్టింది. దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.#Accident near #Bengaluru 36-year-old dancer Sudheendra died near Nelamangala after a truck rammed into him. He had stopped to inspect his new car that developed a snag. He was on his way to his brother’s house to show the car when the mishap occurred.@timesofindia pic.twitter.com/DyeIROeWuL— TOI Bengaluru (@TOIBengaluru) November 4, 2025 సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట సంచలనగా మారింది. ఇది ప్రమాదం కాదు, హత్య అనే ఆరోపణలు వినిపించాయి. టక్కు వేగంగా లేదనీ, కావాలనే ఢికొట్టినట్టు కనిపిస్తోందని, లేదంటే డ్రైవర్ తాగి ఉన్నాడా? నిద్ర మత్తులో ఉన్నాడా? అనే అనుమానాలు వెల్లువెత్తాయి. ఏం జరిగింది అనేది పోలీసుల విచారణలో తేలనుంది. మరోవైపు కేసు నమోదు చేసిన డోబ్స్పేట పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అరెస్టు చేశారు.
బీదర్లో ఘోర ప్రమాదం.. తెలంగాణవాసులు మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్లో బుధవారం ఉదయం డీటీడీసీ కొరియర్ వ్యాను, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారికి ఆసుపత్రికి తరలించారు. మృతులు నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం.
International
NRI
ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (American Telugu Association ATA) అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -SAI తో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మిల్వాకీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత, మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు. డీన్ , ప్రొఫెసర్ అరోరా.. విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థుల భద్రత మరియు సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు చేశారు. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి, ప్రముఖ అటార్నీ ప్రశాంతి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు చేశారు. ఇమిగ్రేషన్ విషయంలో చేయవలసినవి, చేయకూడనవి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు.అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచు కోవాలి వంటి అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకి రెడ్డి, కె.కె. రెడ్డి వివరించారు. అలాగే కిరణ్ పాశం జూమ్ కాల్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్స్ పోలిరెడ్డి గంట, చంద్ర మౌళి సరస్వతి, ఆట విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్స్ తో పాటు నిఖిల, కీర్తిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఆటా మిల్వాకీ టీమ్ మరియు SAI సహకారంతో నిర్వహించిన ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్గా నిలిచింది. విద్యార్థుల అవగాహన, ఆత్మవిశ్వాసం, భద్రత వంటి అంశాల్లో బలమైన పునాది వేస్తూ.. ఇటువంటి కార్యక్రమం ఆటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శకంగా, ప్రేరణగా ఆటా నిలబడుతుందనడంలో సందేహం లేదు.
బహ్రెయిన్లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్లో మృతి చెందిన జగిత్యాల జిల్లా మెటుపల్లి కి చెందిన శ్రీపాద నరేష్ మృతదేహం అతిశీతల శవాగారంలో మగ్గుతోంది. భౌతికకాయాన్ని భారత్కు పంపించడం చేయడం సాధ్యం కాదని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేయడంతో... బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారుతదుపరి చర్యలకు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట సంజయ్, మంగళవారం ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించి మృతుడి సోదరుడు ఆనంద్ తో కలిసి నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) ను సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహరేన్ లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి అక్కడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహ్రెయిన్ వెళ్ళి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్ లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి
ముగ్గురు కళాశాల డ్రాపౌట్లు 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి ప్రవేశించారు. తద్వారా మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ రికార్డును చెరిపేశారు. ఫోర్బ్స్ ప్రకారం, మెర్కోర్ (Mercor )అనే AI-ఆధారిత రిక్రూటింగ్స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురుస్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా,ప్రపంచంలోనే అతి చిన్న బిలియనీర్లుగా నిలిచారు. ఈ ముగ్గురూ, స్వయంకృషితో బిలయనీర్లుగా ఎదిగారు. వీరిలో హిరేమత్ భారతీయసంతతికి చెందినవాడు కావడం విశేషం. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మెర్కోర్ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 88,560.68 కోట్లకు (10 బిలియన్ డాలర్లు)గా ఉంది. 350 మిలియన్ల డాలర్ల తాజా నిధులతో కంపెనీ వాల్యుయేషన్ ఈ స్థాయికి ఎగిసింది. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లుగా ఈ ముగ్గురూ నిలిచారు. మెర్కోర్ సీఈవో బ్రెండన్ ఫుడీ, CTO ఆదర్శ్ హిరేమత్ , బోర్డు చైర్మన్ సూర్య మిధా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు.ఈ ముగ్గురి ప్రయాణంకాలిఫోర్నియాలోని శాన్జోస్లోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ బోయిస్ స్కూలు నుంచే మొదలైంది.అక్కడ డిబేట్ టీమ్లో టాప్ మెంబర్స్గా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంవత్సరంలో మూడు మేజర్ పాలసీ డిబేట్ టోర్నమెంట్స్ గెలుచు కున్న తొలి వ్యక్తులు.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలో మెర్కోర్పై పూర్తి సమయం దృష్టి పెట్టడానికి చదువును విడిచి పెట్టాల్సి వచ్చింది. మెర్కోర్లో పని చేయకపోతే, రెండు నెలల క్రితమే పట్టభద్రుడయ్యేవాడినని, ఇంతలోనే తన జీవితం 180-డిగ్రీల యు-టర్న్ తీసుకుందని పేర్కొన్నాడు. అలాగే సూర్య మిధా జార్జ్టౌన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చదువుతున్న సమయంలోనే బ్రెండన్ ఫుడీని కలిశాడు. దీంతో హిరేమత్తో పాటు మిధా, ఫుడీ ఇద్దరూ తమ చదువును వదిలేశారు. అలా వారి అభిరుచులు కలిసి, నైపుణ్యాన్ని మేళవించి మెర్కోర్ నాంది పలికింది. ప్రపంచ రికార్డుకు దారి తీసింది.
అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావుకి అరుదైన గౌరవం
ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావు కావేటిని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. అంతర్జాతీయ న్యాయ సేవల్లో విశేష కృషి చేసినందుకు గాను డా. శ్రీనివాస్ రావు కావేటికి ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ ఇంటర్నేషనల్ కౌన్సెల్ లీడర్షిప్ ఇన్ ది యూఎస్ ఆఫ్ 2025’ అవార్డు దక్కింది. ‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ డా. శ్రీనివాస్ రావు కావేటికి ఈ అవార్డును అందించింది.‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ అందించిన ఈ గౌరవం, భారతీయ చట్టాలను అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలతో సమన్వయం చేయడంలో డా. కావేటి చేసిన అసాధారణ కృషికి దక్కిన గుర్తింపు అని చెప్పవచ్చు. అంతర్జాతీయ న్యాయ సేవలలో కావేటి లా సంస్థ ఎంతో పేరొందింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా అడుగుపెట్టిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు ఆ తర్వాత ఆస్ట్రేలియా, యూకే, అమెరికా వంటి దేశాలలో సొలిసిటర్గా, నోటరీ పబ్లిక్గా సేవలందించారు.ఆయన స్థాపించిన కావేటి లా ఫర్మ్.. అమెరికా, భారతదేశం, యూకే, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో సేవలందిస్తోంది. కార్పొరేట్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, బిజినెస్ ఇమ్మిగ్రేషన్ వంటి కీలక రంగాలలో సరిహద్దులు దాటి క్లయింట్లకు సేవలను అందిస్తోంది. ఒకే గొడుగు కింద స్థానిక, అంతర్జాతీయ న్యాయ సేవలను అందించడం ఈ సంస్థ ప్రత్యేకత. నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు న్యాయ విద్యతో పాటు ఎంబీఏ, జర్నలిజంలో మాస్టర్స్ పట్టాలను కూడా పొందారు. న్యాయ విద్యార్థులకు, చార్టర్డ్ అకౌంటెన్సీ అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తూ గ్లోబల్ ఎడ్యుకేటర్గా కూడా ఆయన గుర్తింపు పొందారు.(చదవండి: ఘనంగా 'ఆటా' 19 మహాసభలు కిక్ ఆఫ్ వేడుడ
Sakshi Originals
వృత్తి, వ్యక్తిగత జీవితంలో సమతుల్యత ఉందా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ విధులు, పని–వ్యక్తిగత జీవితాల మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యతను సాధించడం కీలకంగా మారింది. వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంతోపాటు జీవన నాణ్యతను ఎంత వరకు సమతౌల్యంగా ఉండేలా చూస్తున్నారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. సంప్రదాయ ‘పని–జీవిత సమతౌల్యత’విధానాల మాదిరిగా కాకుండా ‘జీవితం–పని సమతుల్యత’సాధన అనే అంశానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. మెరుగైన జీవనశైలితో జీవితానికి మొదటగా, పని లేదా విధులకు ఆ తర్వాత ప్రాధాన్యతనివ్వడం కొంతకాలంగా ఓ నూతన ధోరణిగా ప్రచారంలోకి వచి్చంది. సంతోషకరమైన జీవితం గడుపుతూ పనిపై ఆధిపత్యం చెలాయించకుండా చూడటాన్ని ప్రభావపూరితమైన వర్క్–లైఫ్ బ్యాలెన్స్గా అంచనా వేస్తున్నారు. చాలా దేశాల్లో ఎక్కువ పని గంటలు, అసమతౌల్య ఆహారం గుండెపోటు, ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఇదీ అధ్యయనం...గ్లోబల్ హెచ్ఆర్ సంస్థ ‘రిమోట్’ఏటా ప్రపంచంలోని అత్యధిక జీడీపీ ఆధారిత 60 దేశాలను సర్వే చేస్తోంది. ఆయా దేశాల్లో చట్టబద్ధమైన చెల్లింపు సెలవులు, ప్రభుత్వ సెలవులు, అనారోగ్య సెలవులు, ప్రసూతి సెలవులు, కనీస వేతనం, ఆరోగ్య సంరక్షణ, సంతోష సూచిక, వారంలో పని గంటలు, ప్రజాభద్రత, ‘ఎల్జీబీటీక్యూ ప్లస్’హక్కులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. ప్రజలు నాణ్యమైన జీవితాన్ని గడపడానికి, విధుల్లో పని చేయడానికి ఎలాంటి పరిస్థితులు వీలు కల్పిస్తాయో, ఏవి వెనుకబడి ఉన్నాయో అంచనా వేసి ర్యాంకులు ఇస్తోంది. అయితే బలమైన విధానాల కారణంగా ఉద్యోగుల శ్రేయస్సులో చిన్న ఆర్థిక వ్యవస్థలు తరచూ పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగ్గా ఉంటాయని నివేదిక పేర్కొంది. ఈ ఏడాదికిగాను హెచ్ఆర్ సంస్థ విడుదల చేసిన నివేదికలో అమెరికా సహా అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు టాప్–10లో స్థానం లభించలేదు.యూఎస్ ర్యాంక్ 60లో 59...మొత్తం 60 దేశాల్లో గ్లోబల్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్–2025 పేరుతో నిర్వహించిన అధ్యయనంలో భారత్ 42వ ర్యాంకుతో అమెరికా కంటే చాలా ముందుంది. అగ్రరాజ్యం అమెరికా మాత్రం 59వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆధునిక, డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటారు. అమెరికా వంటి దేశాల్లో ప్రజలు పగలు, రాత్రి పని చేస్తారు. అయితే పని–జీవిత సమతౌల్యత అమెరికన్లకు ప్రధాన సమస్యగా మారింది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఉద్యోగులు తక్కువ వేతనంతో కూడిన సెలవులు, తక్కువ కనీస వేతనం పొందుతున్నట్లు వెల్లడైంది. భారత్లో ఉద్యోగులు 35 రోజుల వేతనంతో కూడిన సెలవులను పొందుతున్నారు. పేలవమైన ఆరోగ్య సంరక్షణ, పరిమిత అనారోగ్య సెలవులు, సుదీర్ఘ పనిగంటలు మాత్రం భారత ఉద్యోగులకు సవాళ్లుగా నిలుస్తున్నాయి.న్యూజిలాండ్కు టాప్ ర్యాంక్...ఈ నివేదికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడి ఉద్యోగులు మంచి వేతనంతో కూడిన సెలవులు, ప్రసూతి సెలవులను పొందుతున్నారు. దీంతో వారి ఉద్యోగ జీవితం ఉత్తమంగా ఉంది. వారికి 32 రోజుల వేతనంతో కూడిన సెలవు లభిస్తోంది. అనారోగ్య సెలవు తీసుకుంటే జీతంలో కోత విధింపు లేదు. 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా అక్కడి ఉద్యోగులకు గంటకు సగటు జీతం మెరుగ్గా చెల్లిస్తున్నారు.నివేదికలోని టాప్–10 దేశాలివే...ర్యాంకు దేశం 1 న్యూజిలాండ్2 ఐర్లాండ్3 బెల్జియం4 జర్మనీ5 నార్వే6 డెన్మార్క్7 కెనడా8 ఆస్ట్రేలియా9 స్పెయిన్10 ఫిన్లాండ్
లోకల్ గ్యాంగ్ హాలీవుడ్ రేంజ్ చోరీ
అది పారిస్లోని ప్రపంచంలోనే అత్యధికులు సందర్శించే మ్యూజియం.. కళలు, చరిత్రకు ప్రతీకగా నిలిచే లూవ్రె మ్యూజియం. అలాంటి చోట గత నెలలో జరిగిన 88 మిలియన్ యూరోలు (సుమారు రూ. 760 కోట్లు) విలువైన ఆభరణాల చోరీ యా వత్ ఫ్రాన్స్ను, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ అత్యంత నాటకీయమైన దోపిడీకి పాల్పడింది.. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠా కాదని, సాధారణ చిల్లర దొంగలని పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకటించడం విస్మయపరిచింది. సినిమాను తలపించే దొంగతనం దోపిడీ జరిగిన తీరు చూస్తే, అది పక్కా ప్రొఫెషనల్స్ పనే అని అంతా భావించారు. ఎందుకంటే, ఆ రోజు ఉదయం 9.30 గంటలకు, మ్యూజియాన్ని సందర్శకుల కోసం తెరిచిన కొద్దిసేపటికే దొంగలు లోపలికి చొరబడ్డారు. లిఫ్ట్తో ఎంట్రీ నలుగురు దొంగలు దొంగిలించిన మెకానికల్ లిఫ్ట్ వాహనం సాయంతో మ్యూజియం బాల్కనీకి చేరుకున్నారు. 4 నిమిషాల్లో క్లీన్ స్వీప్ అక్కడి నుంచి నేరుగా ’గ్యాలరీ డి అపోలో’లోకి దూరి, డిస్క్ కట్టర్ ఉపయోగించి ప్రదర్శన షో కేసులను పగలగొట్టారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో అత్యంత విలువైన 8 నగలను దోచుకున్నారు. స్కూటర్లపై పరారీఉదయం 9.38 గంటలకు దొంగలు బయట సిద్ధంగా ఉంచిన రెండు స్కూటర్లపై పరారై, ఆ తర్వాత కార్లలోకి మారి పారిపోయారు. ఈ హడావిడిలో దొంగలు దొంగిలించిన ఒక కిరీటాన్ని మాత్రం కింద పడేసి వెళ్లారు. మిగతా ఏడు నగలు ఇప్పటికీ దొరకలేదు. నలుగురు పట్టివేత అరెస్ట్ అయిన నలుగురిలో.. ముగ్గురు పురుషులు, ఒక మహిళ పారిస్కు ఉత్తరాన ఉన్న పేద ప్రాంతమైన సీన్–సెయింట్–డెనిస్లో నివసించే స్థానికులేనని పారిస్ ప్రాసిక్యూటర్ లారె బెకో స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరు పురుషులు గతంలో కూడా అనేక దొంగతనం కేసుల్లో శిక్ష అనుభవించినట్టు పోలీసుల రికార్డుల్లో ఉంది. వీరు వృత్తిపరమైన చిల్లర నేరగాళ్లే తప్ప, అంతర్జాతీయ మాఫియా ముఠాలకు చెందిన వారు కారు. వీరిలో ఒక జంట మాత్రం తమకు ఈ దొంగతనంతో సంబంధం లేదని వాదిస్తోంది. అరెస్టయిన ఇద్దరు పురుషులు మాత్రం.. తమ ప్రమేయాన్ని పాక్షికంగా అంగీకరించారు. ఈ నలుగురు కాక, ఈ దొంగతనాన్ని అమలు చేసిన ఒక వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. చారిత్రక నగలు చోరీ చేసిన ఆభరణాలలో.. ఎంప్రెస్ యూజీనీ (నెపోలియన్ ఐఐఐ భార్య) ధరించిన బంగారు కిరీటం, మేరీ–లూయిస్ నెక్లెస్, చెవిపోగులు వంటి అత్యంత చారిత్రక విలువైన వస్తువులు ఉన్నాయి. దొంగిలించిన వస్తువులు ఇప్పటికే విదేశాలకు తరలిపోయి ఉండవచ్చని ఆందోళన చెందుతున్నప్పటికీ.. వాటిని భద్రంగా తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న ఆశాభావాన్ని ప్రాసిక్యూటర్ వ్యక్తం చేశారు. ఈ సంఘటన తర్వాత, ఫ్రాన్స్ దేశంలోని ఇతర సాంస్కృతిక సంస్థల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాక, లూవ్రె మ్యూజియం నిర్వాహకులు.. తమ విలువైన ఆభరణాలలో కొన్నింటిని మరింత భద్రత కోసం బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్కు తరలించారు. ఏదేమైనా, ಲచోరీల చరిత్రలో, ఈ సైన్–సెయింట్–డెనిస్ గ్యాంగ్ తమ ’మెకానికల్ లిఫ్ట్’, ’స్కూటర్ ఎస్కేప్’ స్టయిల్తో ఒక నవ్వుల పేజీని లిఖించింది! – సాక్షి, నేషనల్ డెస్క్
తేజస్వీకి ప్రతిష్ట.. నితీశ్కు పరీక్ష!
పట్నా గద్దె కోసం జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం రసకందాయంలో పడింది. ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని సర్వ శక్తులు ఒడ్డుతుండగా, విపక్షాల ‘మహాగఠ్బంధన్’ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ‘ఉద్యోగాల హామీ’తో దూసుకెళ్తున్నారు. ఈ మహా సంగ్రామంలో కీలక నియోజకవర్గాలు రాష్ట్ర భవిష్యత్తును శాసించనున్నాయి. ఇవి కేవలం అభ్యర్థుల గెలు పోటములను మాత్రమే కాదు తేజస్వీ ప్రతిష్టకు, నితీశ్ కుమార్ ఆత్మగౌరవానికి అసలైన అగ్ని పరీక్షగా నిలుస్తున్నాయి. ఈ 14 కీలక స్థానాల ను ఓసారి పరిశీలిద్దాం. ఈ ఎన్నికల్లో కొందరు అగ్రనే తల భవితవ్యం కొన్ని ప్రత్యేక నియో జకవర్గాలతో ముడిపడి ఉంది. వారి గెలుపు కంటే, వారి ప్రభావం ఎంతమేరకు ఉందనేది ఇక్కడ కీలకం.1.రాఘోపూర్: ఈ నియోజకవర్గం తేజస్వీ యాదవ్కు కంచుకోట. గత పదేళ్లుగా ఈయన ఇక్కడి నుంచే భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. దీంతో ఈసారి మెజారిటీ ఎంత? అనే చర్చ సైతం ఇప్పటికే మొదలైంది. ఇక్కడ యాదవ–ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకే. అయితే ఈసారి మెజారిటీ తగ్గొచ్చనే ప్రచారం మొదలైంది. 2020 ఎన్నికల్లో తేజస్వీతో తలపడిన బీజేపీ కీలకనేత సతీష్ కుమార్ యాదవ్ ఈసారి సైతం బరిలో దిగి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈసారి ముచ్చటగా మూడోసారి తేజస్వీ గెలిచినా మెజారిటీ తగ్గితే అది తేజíస్వీకి ఇబ్బందే. 2. నలంద: ఇది ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సొంత జిల్లా. నలంద ఆయన రాజకీయాలకు కేంద్ర స్థానం కూడా. ఇది ఆయన సామాజిక వర్గమైన కుర్మీ జనాభా అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ జేడీయూ అభ్యర్థి, మంత్రి శ్రవణ్ కుమార్ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. ఆయనను మహాగఠ్బంధన్ అభ్యర్థి, కాంగ్రెస్ నాయకుడు కౌశలేంద్ర కుమార్ ఢీకొంటున్నారు. నితీశ్ నేరుగా పోటీ చేయకపోయినా, ఇక్కడ జేడీయూ గెలుపు అనేది సీఎం నితీశ్కు అత్యంత ప్రతిష్టాత్మకం. 3. జముయ్: లోక్జనశక్తి( ఎల్జేపీ– రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రాథినిధ్యంవహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో ఈ జముయ్ శాసనసభ నియోజకవర్గం ఉంది. ఇక్కడ పాశ్వాన్(దళిత) వర్గం ఓట్లు కీలకం. అధికార ఎన్డీఏ కూటమిలో సీఎం నితీశ్ కుమార్తో విభేదాల తర్వాత కూటమిలో చిరాగ్కు ఏ స్థాయిలో పరపతి ఉందనేది ఈ స్థానంలో గెలుపుతో తేలిపోనుంది. ఎన్డీఏ తరపున అంతర్జాతీయ షూటర్, బీజేపీ నేత శ్రేయసి సింగ్ మరోసారి పోటీలో నిలబడ్డారు. ఆర్జేడీ నుంచి షంషాద్ ఆలం బరిలో ఉన్నారు. నితీశ్పై కోపంతో చిరాగ్ సొంత కూటమి అభ్యర్థిని ఓడిస్తారా? లేదంటే మిత్రధర్మం పాటించి తమ ఓట్లు కూడా బీజేపీకి పడేలా చేస్తారా? చూడాలి!4. హసన్పూర్: లాలూ కుటుంబం లేకుండా.. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 2020లో ఈస్థానం నుంచి గెలిచారు. అయితే ఈసారి హసన్పూర్లో సమీకరణాలు పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తేజ్ప్రతాప్ను ఆర్జేడీ నుంచి బహిష్కరించడం, ఆర్జేడీ కొత్తగా మాలా పుష్పంను బరిలోకి దించడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడ తేజ్ ప్రతాప్తో సంబంధంలేకుండా ఆర్జేడీ ఏ మేరకు విజయతీరాలను చేరుకుంటుందనేది ఆసక్తికరం. 5. కిషన్గంజ్: రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరమైన పోరు కిషన్గంజ్లో జరుగుతోంది. ఇక్కడ జనాభాలో దాదాపు 70 శాతం మంది ముస్లింలే. ‘లౌకిక’ ఓటు అనేది ఇక్కడ ప్రధానం. ఇక్కడ పోరు ఎన్డీఏ–మహాగఠ్బంధన్ మధ్య కాదు. మహాగఠ్బంధన్–ఎంఐఎం మధ్యే పోరులా ఉంది. 2020లో కాంగ్రెస్ అభ్యర్థి ఇజాహరుల్ హుస్సేన్ స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఈసారి మహాగఠ్బంధన్కూటమి తరఫున కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ పోటీచేస్తున్నారు. ఎన్డీఏ తరఫున బీజేపీ నేత స్వీటీ సింగ్, ఎంఐఎం తరఫున షామ్స్ ఆగాజ్ పోటీ పడుతున్నారు. ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చితే 2020లో మాదిరిగానే బీజేపీ అనూహ్యంగా లబ్ధి పొందే అవకాశముంది.6.ఆరా: కుల సమీకరణాల యుద్ధభూమి భోజ్పూర్ ప్రాంతంలోని ఆరా నియోజకవర్గంలోనూ కుల రాజకీయాలు చాలా ఎక్కువ. ఇక్కడ చాన్నాళ్లుగా ఎన్డీఏ తరఫున రాజ్పుత్లు, ఆర్జేడీ తరఫున యాదవ్లు పోటీపడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గం(ఈబీసీ) ఓటర్లు ఇక్కడ ‘కింగ్మేకర్’గా మారనున్నారు.7.అగియావ్ (ఎస్సీ): అగియావ్ (ఎస్సీ) నియోజకవర్గం సీపీఐ–ఎంఎల్(లిబరేషన్) పార్టీకి కంచుకోట. 2020లో ఇక్కడ మనోజ్ మంజిల్ గెలిచారు. దళిత, పేద, భూమిలేని కార్మికులే ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తారు. ఈసారి మహాగఠ్బంధన్కూటమి తరఫున సీపీఎం నేత శివప్రకాశ్ రంజన్ పోటీ చేస్తుండగా ఎన్డీఏ తరఫున బీజేపీ నాయకుడు మహేష్ పాశ్వాన్ నిలబడ్డారు. 8. ముంగేర్: భూమిహార్ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం ముంగేర్. సాంప్రదాయంగా ఎన్డీఏకు మద్దతిచ్చే ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు తేజస్వీయాదవ్ ‘ఏ టు జెడ్’ నినాదమిచ్చారు. ఇక్కడ ఎన్డీఏ తరఫున బీజేపీ నేత కుమార్ ప్రణయ్ బరిలో నిల్చున్నారు. ఆర్జేడీ తరఫున ముఖేష్ యాదవ్ రంగంలోకి దిగారు. ఎంఐఎం అభ్యర్థి హసన్ సైతం ముందడుగు వేయడంతో ఇక్కడ త్రిముఖపోరు అనివార్యమైంది. 9. పట్నా సాహిబ్: రాజధానిలోని పట్నా సాహిబ్ నియోజకవర్గం బీజేపీకి దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఇక్కడ వైశ్యులుసహా అగ్ర వర్ణాల ఓట్లు అధికం. మోదీ ఛరిష్మా, జాతీయవాదం ఇక్క డ చాలా బలంగా పనిచేస్తాయి. 2020లో బీజేపీ నాయకుడు నంద్ కిషోర్ యాదవ్ ఘన విజయం సాధించారు. అయినాసరే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ను మార్చేసి రత్నేష్ కుష్వాహాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. మహాగఠ్బంధన్ కూటమి నుంచి కాంగ్రెస్ నేత శశాంత్ శేఖర్ పోటీ చేస్తున్నారు. 10. గయా టౌన్: మగధ్ రాజధాని గయా టౌన్ కూడా బీజేపీకి మరో బలమైన కేంద్రం. ఇక్కడ వైశ్య, అగ్రవర్ణాల ఓట్లు కీలకం. బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ఇక్కడ మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ తరపున మోహన్ శ్రీవాస్తవ బరిలో ఉన్నారు.11. ఝంఝార్పూర్: మిథిలాంచల్లోని ఝంఝార్పూర్ నితీశ్ కుమార్ అత్యంత వెనుకబడిన తరగతుల ఓటు బ్యాంకుకు అసలైన పరీక్ష. 2020లో ఇక్కడ బీజేపీ గెలిచింది. ఈసారి కూడా ఎన్డీఏ తరఫున బీజేపీ నేత, మంత్రి నితీశ్ మిశ్రా బరిలో ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ఓడితే, అది నితీశ్ తన ప్రధాన ఓటు బ్యాంక్పై పట్టు కోల్పోతున్నారనడానికి సంకేతం.12. భాగల్పూర్: ‘సిల్క్ సిటీ’ భాగల్పూర్లో కాంగ్రెస్ ’స్ట్రైక్ రేట్’ పరీక్షకు నిలుస్తోంది. 2020లో మహాగఠ్బంధన్ ఓటమికి కాంగ్రెస్ పేలవ ప్రదర్శన ఒక కారణం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ శర్మ (కాంగ్రెస్)ను, 2020లో స్వల్ప తేడాతో ఓడిపోయిన బీజేపీ నాయకుడు రోహిత్ పాండే ఢీకొట్టనున్నారు. ఆర్జేడీ ఓట్లు కాంగ్రెస్కు బదిలీ కావడం ఇక్కడ కీలకం.13. పూర్ణియా: సీమాంచల్ రాజధాని పూర్ణియాలో మిశ్రమ జనాభా ఉంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం–యాదవ్ సమీకరణాలు పనిచేస్తాయి. వీరితోపాటు ఈబీసీ ఓటర్ల మద్దతు కూడగడితేనే అభ్యర్థి గెలుపు సాధ్యం. 14. బెట్టియా: పశ్చిమ చంపారన్లో ‘చెరకు బెల్ట్’గా పేరొందిన బెట్టియా నియోజకవర్గంలో రైతుల తీర్పు కీలకం కానుంది. చెరకు చెల్లింపుల్లో జాప్యం వంటి సమస్యలు ఇక్కడ ప్రధాన ప్రచారాస్త్రాలు. ఇక్కడ బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవితో కాంగ్రెస్ అభ్యర్థి వాసి అహ్మద్ పోటీ పడుతున్నారు.
పేరు వీఐపీ.. ‘ఇండియా’లో వీవీఐపీ
బిహార్ రాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విపక్షాల ‘ఇండియా’ కూటమిలో చర్చల తర్వాత ఒక చిన్న పార్టీకి చెందిన నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్న నిర్ణయం యావత్ దేశాన్ని అతని వైపు చూసేలా చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) సహా ఇతర కమ్యూనిస్టు పార్టీలు ‘ఇండియా’ కూటమిలో ఉన్నప్పటికీ 44 ఏళ్ల యువనేతను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మునుపటి ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లో గెలిచి ప్రస్తుతం 15 సీట్లలో మాత్రమే పోటీపడుతున్న పార్టీ నేత ఇప్పుడు ‘ఇండియా’ కూటమి ప్రచార కార్యాక్రమాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఆయనే వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముఖేశ్ సహానీ. మల్లా (మత్య్సకార) వర్గానికి చెందిన సహానీ ప్రస్తుతం మిథిలాంచల్, సీమాంచల్ సహా అనేక ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ‘మల్లా’లే అత్యంత కీలకం.. బిహార్లో మల్లా వర్గం వాళ్లు ప్రధానంగా పడవ నడిపడం, చేపలు పట్టడం వృత్తిలో కొనసాగుతారు. వీరినే నిషాద్, కేవత్ అని కూడా పిలుస్తారు. మిథిలాంచల్, సీమాంచల్, ముజఫర్పూర్, దర్భంగా, సుపాల్, వైశాలి, సీతామర్హి, షెయోహర్, కిషన్గంజ్, సహర్సా, ఖగారియా, తూర్పు చంపారన్, పశి్చమ చంపారన్ జిల్లాల్లో ఈ వర్గం మత్స్యకారులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. జనాభాలో వీరు ఐదారు శాతం దాకా ఉంటారు. అత్యత వెనుకబడిన కులాల (ఈబీసీ) సమూహంలో వీరు అతి ముఖ్యమైన ఓటు బ్యాంక్గా ఎదిగారు. ముజఫర్పూర్ వంటి కొన్ని జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ వర్గం నేతలే ఎంపీలుగా గెలుస్తున్నారు. కీలక నేత జై నారాయణ్ ప్రసాద్ సైతం ఈ వర్గంవారు. ఆయన తర్వాత ఆ స్థాయిలో పేరు, పలుకుబడి సాధించింది ముఖేశ్ సహానీ మాత్రమే. సహానీ తనను తాను ‘మల్లా కుమారుడు’గా ప్రకటించుకొని ఈ వర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. సేల్స్మ్యాన్ నుంచి నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థి దాకా.. 1981లో దర్భంగా>లో ఒక మత్స్యకారుల కుటుంబంలో ముఖేష్ సహానీ జన్మించారు. ‘సన్ ఆఫ్ మల్లా’ అనే పేరుతో కొత్త క్రేజ్ సంపాదించుకున్నారు. 19 ఏళ్ల వయసులో బిహార్ను విడిచిపెట్టి, ముంబైలో సేల్స్మ్యాన్గా పనిచేశాడు. అనంతరం బాలీవుడ్లోకి సెట్ డిజైనర్గా అడుగుపెట్టాడు. షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్, సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ వంటి హిట్ చిత్రాలకు పనిచేశాడు . ముంబైలో ముఖేష్ సినీ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నడిపాడు. 2013లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, బిహార్æ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న, దివంగత కర్పూరీ ఠాకూర్ వంటి ప్రముఖుల నుండి ప్రేరణ పొందారు. బిహార్ జనాభాలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉన్న అత్యంత వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కోసం పోరాడటానికి సహానీ తిరిగి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. రాజకీయ కారణాలతో బీజేపీని వదిలి 2015లో నిషాద్ వికాస్ సంఘ్ను స్థాపించారు. ఇదే తర్వాత 2018లో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీగా రూపాంతరం చెందింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖేశ్ సమానీ నాటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు మద్దతు ఇచ్చాడు. కానీ తర్వాత అతనితో విడిపోయాడు. మల్లా సమాజానికి రిజర్వేషన్లు, సౌకర్యాలు ఇస్తానని హామీ ఇచ్చి తర్వాత మోసం చేశారని ఆరోపణలు గుప్పిస్తూ నితీశ్ నుంచి తెగతెంపులు చేసుకున్నారు. కొంత కాలానికి మళ్లీ ఎన్డీఏలో చేరిన ఆయన ఆ ఎన్నికల్లో 11 సీట్లలో పోటీ చేసి 4 సీట్లలో గెలిచారు. స్వయంగా సహానీ ఓటమిని చవిచూసినప్పటికీ నితీష్ కుమార్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఒక ఏడాది తర్వాత ఆయన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా, మరో ముగ్గురు బీజేపీలో చేరారు. తర్వాత ఈయన 2024లో ఇండియా కూటమిలో చేరారు. కూటమిలో తనకు 40 స్థానాలు ఇవ్వాలని కోరినప్పటికీ అది సాధ్యపడకపోవడంతో 15 సీట్లు కేటాయించింది. అయితే ఆయన వర్గానికి ఉన్న ప్రాధాన్యత దష్ట్యా ఆయన్ను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.50–60 నియోజకవర్గాలపై ప్రభావంఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన అనంతరం సహానీ తన దూకుడు పెంచారు. తనను రాజకీయంగా అణచివేసిన నితీశ్ కుమార్, బీజేపీలే లక్ష్యంగా ఆయన ప్రచారం సాగుతోంది. కేవలం 15 సీట్లలో పోటీ చేస్తున్న ఒక పార్టీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవిని ‘ఆఫర్’చేయడం వెనుక ‘ఇండియా’ కూటమి పక్కా వ్యూహం కనిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆర్జేడీకి సంప్రదాయబద్ధంగా ఉన్న ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంక్ (సుమారు 31 శాతం)కు అదనంగా, నితీశ్ కుమార్కు వెన్నెముకగా ఉన్న ఈబీసీ (అత్యంత వెనుకబడిన తరగతులు) ఓటు బ్యాంకును చీల్చడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యం. రాష్ట్ర జనాభాలో 36% ఉన్న ఈబీసీలలో, 5–6% ఉన్న నిషాద్ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ద్వారా, ఈబీసీలందరికీ ‘ఇండియా’ కూటమి బలమైన సందేశం పంపింది. సహానీ పోటీ చేస్తున్న 15 స్థానాల కంటే, ఆయన తన సామాజిక వర్గం బలంగా ఉన్న మిథిలాంచల్, సీమాంచల్, చంపారన్ ప్రాంతాల్లోని సుమారు 50–60 నియోజకవర్గాలపై చూపే ప్రభావమే కీలకం. ఆయన తన నిషాద్ ఓట్లను ‘ఇండియా’ కూటమి అభ్యర్థులకు బదిలీ చేయగలిగితే, అది ఎన్డీఏ, ముఖ్యంగా జేడీ(యూ) కోటను బద్దలు కొట్టగలదు. అందుకే ‘వీఐపీ’నేతగా ఉన్న సహానీ, ఇప్పుడు బిహార్ ఎన్నికల రాజకీయాల్లో ‘వీవీఐపీ’గా మారి, మొత్తం ఫలితాన్నే శాసించే కీలక నేతగా ఆవిర్భవించారు.
జనవరి 1 నుంచి ఆ పాన్ కార్డులు చెల్లవు..!
అంతరిక్షంలో వంట.. అదేలా!
హీరోలకే నా సలహా.. రెమ్యునరేషన్ తగ్గించండి: విష్ణు విశాల్
భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్గా అతడే
రామ్ చరణ్,ఎన్టీఆర్ బాటలోనే రామ్.. మిగిలిన వాళ్ళు?
సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన.. షమీకి స్థానం ఉందా?
కేసీఆర్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?: కేటీఆర్
హైదరాబాద్: జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై దారుణం
నీళ్ల బాటిల్ రూ.100.. కాఫీ రూ.700.. సుప్రీంకోర్టు సీరియస్
వైట్ కాలర్ జాబ్స్ తగ్గాయ్.. ఐటీ ఉద్యోగాలైతే..
మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖలు ఇవే
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
సచిన్, లక్ష్మణ్, రోహిత్ వచ్చారు.. మీరెక్కడా సార్?
బంగారం ధరలు మళ్లీ రివర్స్.. ఒక్క గ్రాము..
బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్న 'ప్రభాస్'..!
బిగ్బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
కావ్య మారన్ సంచలన నిర్ణయం..
బిగ్రిలీఫ్: ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..
అంబానీ ఇంట్లో కనిపించని ఏసీ: యాంటిలియాలో ఎందుకిలా?
పాపం సౌతాఫ్రికా.. ఓడినా మనసులు గెలుచుకుంది..!
అలా చేస్తే మరి ఇలా ఎండనకా,వాననకా తిరగడం ఎందుకు సార్! ఇంట్లో కూర్చుంటే పోలా!
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
ఫ్యామిలీలో కొత్త మెంబర్.. బుల్లితెర జంట పోస్ట్
ఈ రాశి వారికి ఉద్యోగయోగం.. వ్యాపార వృద్ధి
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
సాక్షి కార్టూన్ 05-11-2025
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా: ఏఐతో వాత!
ఐసీసీ మహిళల ప్రపంచకప్ విజేత భారత్
ఇంకా చురుగ్గా పని చేయించడానికట!
ఆల్రెడీ సీఎం అయ్యారుగా! ఇక నా ఓటు నీకెందుకని వెళ్లిపోతున్నాడ్నార్!
క్రైమ్
భార్య పీక నొక్కి హత్య
తూర్పు గోదావరి జిల్లా: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. మద్యంకు బానిసైన భర్త వేధింపులు ఆఖరికి అతనే యముడై భార్య ప్రాణాలు తీసిన విషాద ఘటన యానాంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం స్ధానిక బళ్లావారివీధిలో నివాసం ఉంటున్న పెమ్మాడి దీనా(26)ను ఆమె భర్త పెమ్మాడి నాని సోమవారం రాత్రి పీక నొక్కి హత్య చేశాడని ఎస్సైలు పునీత్రాజ్, శేరు నూకరాజు తెలిపారు. గుత్తెనదీవికి చెందిన పెమ్మాడి నానితో దీనాకు వివాహం అయ్యింది. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. అయితే కొన్నాళ్లు కాపురం సజావుగా సాగిన అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. యానాం సబ్కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. భర్త నాని సరిగా పనికి వెళ్లకుండా, మద్యం తాగుతూ తిరుగుతుండేవాడని దీంతో విరక్తి చెందిన భార్య దీనా నాలుగు నెలల క్రితం యానాంలో బల్లావారివీధిలో గృహం అద్దెకు తీసుకుని విడిగా ఉంటోందన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న ఆమె కుటుంబ పోషణకు టైలరింగ్ చేసేంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త నాని కొద్ది రోజుల క్రితం దీనా ఉంటున్న ఇంటికి వచ్చి తాను బాగా చూసుకుంటానని, నీవు లేకుండా ఉండలేనని ఆమెను నమ్మించాడు. మళ్లీ మద్యం తాగి వచ్చి భార్యను కొట్టడమే కాక ఆమె పట్ల అనుమానం వ్యక్తం చేసి వేధింపులకు గురి చేసేవాడు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి భోజనం చేశాడు. అనంతరం తీవ్రంగా కొట్టి పీకనొక్కి చంపేసి అనంతరం ఆమె మృతదేహాన్ని నిద్రపోతున్న ఆరేళ్ల పాప వద్ద ఉంచి అతను పరారయ్యాడు. మంగళవారం ఉదయాన్నే నిద్ర లేచిన పాప పక్కనే ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి స్థానికులకు తెలపగా వారు యానాం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ వరదరాజన్ ఆదేశాల మేరకు ఎస్సై పుష్పరాజ్ ఆధ్వర్యంలో రెండు బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్కు సమాచారం అందించినట్లు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో కిడ్నాప్ కలకలం
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లి వద్ద కిడ్నాప్ కలకలం రేపుతుంది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ ఘటనపై కూతురు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక.. వెల్గటూర్ మండలం రాజక్క పల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇక, పెద్దలను ఎదిరించి ఈ ఏడాది జూలై 27న ప్రియాంకా, రాకేష్ వివాహం చేసుకున్నారు.అయితే, రాకేష్ దళితుడైన కారణంగా ప్రియాంకా తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని వ్యతిరేకించారు.. అలాగే, ప్రియాంక కడుపుతో ఉండగా హాస్పిటల్లో చూపిస్తామని నమ్మించిన తల్లిదండ్రులు.. హాస్పిటల్కి చూపించి తిరుగు ప్రయాణంలో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికుల సహాయంతో ప్రియాంక తప్పించుకుంది. ఈ విషయంపై తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులతో తనకు తన భర్త రాకేష్కు ప్రాణహాని ఉందని కంప్లైంట్లో తెలిపింది. ఈ ఘటనపై ప్రియాంకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రోడ్డు ప్రమాదంలో రియాల్టీ షో డ్యాన్సర్ దుర్మరణం
బెంగళూరు: రియాలిటీ షోలలో తన పెర్ఫామెన్స్తో పేరు తెచ్చుకున్న ప్రముఖ డ్యాన్సర్ సుధీంద్ర (30) మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కొత్త కారు కొనుగోలు చేసిన సుధీంద్ర, ఈ ఆనందాన్ని తన సోదరుడితో పంచుకునేందుకు వెడుతుండగా బెంగళూరు నగర శివార్లలోని నెలమంగళలోని పెమ్మనహళ్లి సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన కుటుంబం సభ్యులు విచారంలో మునిగిపోయారు.‘డాన్స్ షో’తో సహా కన్నడ రియాలిటీ షోలతో పేరుతెచ్చుకున్న సుధీంద్ర,కర్ణాటకలోని త్యామగోండ్లు గ్రామానికి చెందిన వాడు. డోబ్స్పేటలో ఒక పాఠశాలను కూడా నడుపుతూ ప్రజాదారణ పొందాడు. సోమవారం కొత్త కారును కొనుగోలు చేశాడు. అనంతరం పెమ్మనహళ్లిలోని సోదరుడికి ఇంటికి బయలుదేరాడు. ప్రయాణం మధ్యలో, కారులో సాంకేతిక లోపం ఏర్పడింది, దీనితో డ్యాన్సర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి తనిఖీ చేస్తుండగా, అటునుంచి వస్తున్న ట్రక్కు అతణ్ని బలంగా ఢీట్టింది. దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.#Accident near #Bengaluru 36-year-old dancer Sudheendra died near Nelamangala after a truck rammed into him. He had stopped to inspect his new car that developed a snag. He was on his way to his brother’s house to show the car when the mishap occurred.@timesofindia pic.twitter.com/DyeIROeWuL— TOI Bengaluru (@TOIBengaluru) November 4, 2025 సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట సంచలనగా మారింది. ఇది ప్రమాదం కాదు, హత్య అనే ఆరోపణలు వినిపించాయి. టక్కు వేగంగా లేదనీ, కావాలనే ఢికొట్టినట్టు కనిపిస్తోందని, లేదంటే డ్రైవర్ తాగి ఉన్నాడా? నిద్ర మత్తులో ఉన్నాడా? అనే అనుమానాలు వెల్లువెత్తాయి. ఏం జరిగింది అనేది పోలీసుల విచారణలో తేలనుంది. మరోవైపు కేసు నమోదు చేసిన డోబ్స్పేట పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అరెస్టు చేశారు.
ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేయించిన మొదటి భార్య.!
అంబర్పేట: అంబర్పేట పరిధిలోని డీడీ కాలనీలో గత నెల 29న జరిగిన కిడ్నాప్ కేసును పోలీసుల ఛేదించారు. బాధితుడి మొదటి భార్యే కిడ్నాప్నకు సూత్రధారి అని తేల్చారు. ఈమేరకు మంగళవారం ఈస్ట్జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ హరిష్కుమార్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. డీడీ కాలనీలో నివాసం ఉండే మంత్రి శ్యామ్ను అక్టోబరు 29న కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై శ్యామ్ రెండో భార్య ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ వ్యవహారం ఇలా... శ్యామ్కు అమెరికాలో మాధవీలత అనే యువతితో వివాహం, అక్కడే విడాకులు జరిగాయి. వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఇద్దరు నగరానికి విచ్చేసి విడివిడిగా ఉంటున్నారు. శ్యామ్ అలీగా పేరు మార్చుకుని ఫాతమా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా ఇటీవల శ్యామ్ బంజారాహిల్స్లో తనకు వారసత్వంగా వచి్చన ఆస్తిని సుమారు రూ.20 కోట్లకు విక్రయించాడు. అందులో తనకు వాటా కావాలని మాధవీలత భావించి కిడ్నాప్నకు ప్రణాళిక వేసింది. ఈ మేరకు తనకు పరిచయం ఉన్న పటేల్నగర్కు చెందిన దుర్గావినయ్ను సంప్రదించింది. దుర్గా వినయ్ రామ్నగర్లో నివసించే స్నేహితుడు కట్టా దుర్గాప్రసాద్ అలియాస్ సాయి సాయంతో కిడ్నాప్కు పథకం రచించారు. ఈమేరకు మొదట కూకట్పల్లికి చెందిన ప్రీతి, మలక్పేటకు చెందిన సరితలను బాధితుడు శ్యామ్ నివసిస్తున్న అపార్ట్మెంట్లోని ఎదురు ఫ్లాట్లో అద్దెకు దించి అతని కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. అనంతరం ఈ నెల 29న కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యానగర్కు చెందిన కాటమోని పురుషోత్తం, పురానాఫూల్కు చెందిన సందోలు నరే కుమార్, ఆగాపురాకు చెందిన పవన్కుమార్, మంగళ్హాట్కు చెందిన నారాయణ రిషికేష్, పటేల్నగర్కు చెందిన పిల్లి వినయ్లతో కలిసి శ్యామ్ను కిడ్నాప్ చేశారు. పోలీసులకు తెలిసిందని... శ్యామ్ కిడ్నాప్పై పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలిసి నిందితులు మొదట కిడ్నాప్నకు వినియోగించిన కారును చర్లపల్లిలో వదిలి వేరే వాహనంలో వెళ్లారు. అనంతరం మొదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. రూ.30 లక్షలు డిమాండ్ చేయడంతో శ్యామ్ అతని స్నేహితుడు రఘునాథ్రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు అడగడంతో పాటు కిడ్నాప్ అయినట్లు సమచారం ఇచ్చారు. అప్పటికే పోలీసులు ముమ్మరంగా గాలిస్తుడడంతో కిడ్నాపర్లు విజయవాడకు వెళ్లారు. ఈ విషయాన్ని ఎలా ముగించాలని కిడ్నాపర్లు మాధవీలతను సంప్రదించగా ఆమె సరిగ్గా స్పందించలేదు. దీంతో బాధితుడు తానే డబ్బులు ఇస్తానని కిడ్నాపర్లను నమ్మించి బంజారాహిల్స్లోని ఓ బ్యాంకుకు తీసుకువెళ్లాడు. అక్కడ శ్యామ్ కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని పోలీసుల చెంతకు చేరి జరిగింది వివరించాడు. దీంతో కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, 8 సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు.
వీడియోలు
పాపంపేట భూముల కబ్జాపై సీబీఐ విచారణ జరపాలి: తోపుదుర్తి
కార్తీక పౌర్ణమి.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
నరకదారులు.. వందలాది మంది...
ఉపఎన్నికల ప్రచారంలో మారుమోగుతున్న KCR పేరు
TV5 మూర్తిపై కేసు నమోదు
చేవెళ్ల ప్రమాదం.. కుటుంబ సభ్యుల ఆవేదన
Chevella Incident: తల్లిదండ్రులను కోల్పోయి గుక్కపెట్టి ఏడుస్తున్న పిల్లలు
Chevella: బస్సు ప్రమాద కారణాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
Chevella: చెవి నొప్పి అని తీసుకొచ్చా మా నాన్న చనిపోయాడు
