బాలకృష్ణ, గోపీచంద్‌ల కథ కంచికి.. మేకర్స్‌ కీలక నిర్ణయం | Balakrishna and Gopichand Malineni movie now face financial trouble | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ సినిమాకు బడ్జెట్‌ కష్టాలు.. మేకర్స్‌ కీలక నిర్ణయం

Jan 3 2026 11:00 AM | Updated on Jan 3 2026 12:57 PM

Balakrishna and Gopichand Malineni movie now face financial trouble

బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రానున్న కొత్త మూవీ కథను సైడ్‌ చేశారు. అయితే, మరో కథతో షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారు.  ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో ఈ మూవీ రానుంది. మొదట హిస్టారికల్‌ యాక్షన్‌ చిత్రంగా మేకర్స్‌ అనుకున్నారు. ఈ క్రమంలో భారీ బడ్జెట్‌ అయినా సరే తెరకెక్కించాలని నిర్మాత వెంకట సతీష్‌ కిలారు పూనుకున్నారు. అందుకోసం నయనతారను హీరోయిన్‌గా రంగంలోకి దింపారు. కానీ, ఇప్పుడు ఆ లెక్కలు అన్నీ మారిపోయాయి.

ఒక భారీ చారిత్రక కథలో బాలకృష్ణను ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో చూపించనున్నట్లు  మేకర్స్‌ గతంలోనే చెప్పారు. ఆపై విజువల్‌ వండర్‌గా గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఈ మూవీ ఉంటుందని తెలిపారు. కానీ, సడెన్‌గా నిర్మాత, హీరో, దర్శకుడు అంతా కలిసి మనసు మార్చుకున్నారు.  ఈ ప్రాజెక్ట్‌ను సైడ్‌ చేసి మరో కథతో షూటింగ్‌ ప్రారంభించాలని వారు డిసైడ్ అయ్యారు. అందుకు ప్రధాన కారణం బడ్జెట్ అని తెలుస్తోంది.

ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా నిర్మించాలంటే భారీ ఖర్చుతో పాటు ఎక్కువ సమయం పడుతుంది. కనీసం రూ. 150 కోట్ల వరకు బడ్జెట్‌ అవుతుంది అని టాక్‌.. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్‌ పరిస్థితి అంత మెరుగ్గాలేదు. పైగా అఖండ-2ను పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేసినా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఆపై ఓటీటీ ఆదాయం కూడా పెద్దగా లేదు. బాలయ్య మార్కెట్‌ ప్రకారం అంత బడ్జెట్‌ వర్కౌట్‌ కాదని తెలిసి మరో కథతో సినిమా ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement