breaking news
sagubadi
-
ఆదివారం వరకు రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు
ఈ నెల 20 నుంచి 24 తేదీల మధ్యకాలంలో తెలంగాణలోని రెండు జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాజేంద్రనగర్లోని పీజేటీఏయూ ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ వాతావరణ పరిశోధన విభాగం అధిపతి డాక్టర్ పి.లీలా రాణి తెలిపారు. బుధవారం నుంచి వచ్చే ఆదివారం వరకు ఉపయోగపడే వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను రైతాంగానికి ఆమె సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటికుంటలకు దూరంగా ఉండాలి. అధేవిధంగా రైతులు చెట్ల కింద నిలబడ కూడదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదని ఆమె సూచిస్తున్నారు. గత మూడు రోజుల వాతావరణం:గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 31 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. వచ్చే ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ:హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం. 20, 21 తేదీల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. 21 నుంచి 24వ తేదీ ఉదయం వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 24 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.అత్యంత భారీ వర్షాల హెచ్చరిక:20వ తేదీ: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూ΄ాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు తెలంగాణ అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.21వ తేదీ: జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.22వ తేదీ: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.23వ తేదీ: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.24వ తేదీ: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.పొలాల్లో మురుగు కాలువలు ముఖ్యంభారీవర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొంలం నుండి మురుగునీటిని వీలైనంత వరకు త్వరగా పొలం నుండి తీసివేయాలి.వచ్చే ఐదు రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.ఆరుతడి పంటల్లో ఆఖరి అంతర కృషి తరువాత ప్రతీ 2 మీటర్లకు ఒక గొడ్డు చాలు వేసుకోవాలి.నీటి ముంపునకు గురైన వర్షాధార పంటల్లో వర్షాలు ఆగిన తరువాత వీలైనంత త్వరగా అంతర కృషి చేసుకోవాలి. ఇదీ చదవండి: ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలుపశువులు జాగ్రత్తప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్ళలో కొక్కెర తెగులు సోకటానికి అనుకూలం. వీటి నివారణకు, టీకాలు వేయించాలి. గొర్రెల్లో చిటుకు, పీపీఆర్ సోకే వీలుంది ఆవులు, గేదేల్లో గొంతువాపు వ్యాధి సోకడానికి అనుకూలం. టీకాలు వేయించాలి ∙గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చెయ్యాలి. – నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా -
ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలు
దేశీయ వరి రకాలు 23 జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ( GI) గుర్తింపును సాధించింది. మన దేశంలో వరి పంట ప్రధానమైన పంట. వరి రకాన్ని సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అలాంటి రైస్ లో కేరళ ప్రాంతంలో రైస్ ఒకటి నవరా రైస్. అందుకే దీన్ని కేరళ బియ్యం లేదా ఎర్ర బియ్యంగా అని కూడా పిలుస్తారు. ఈ బియ్యం త్రేతాయుగము నాటిదని నమ్ముతారు. అలాగే గంధసాలే పొడవైన ధాన్యం రకం. ఇది కర్ణాటక, పంజాబ్ & హర్యానా (మోగ్రా, బాస్మతి)లలో ఎక్కువగా పండిస్తారు. వివిధ రకాల వరి, వాటి ప్రయోజనాలను చూద్దాం. దేశీ వరి రకాల్లో ఔషధ గుణాలు!మైసూరులో సేవ్ అవర్ రైస్, సహజ సమృద్ధ తదితర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన దేశీ వరి మేళాలో ఔషధ విలువలున్న చాలా రకాల బియ్యం రకాలను ప్రదర్శించారు. బియ్యాన్ని, విత్తనాలను కూడా విక్రయించారు. వారు చెప్పిన ఔషధ గుణాలు ఇవి...దయానా : తీవ్రమైన మధుమేహం ఉన్న వారికి ఉపయోగకరం.నవర : ‘ఇండియన్ వయాగ్రా’. నపుంసకత్వాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది.మాపిళ్లై సాంబా : శక్తిని పెంచే గుణం కలిగినది. కొత్త అల్లుళ్లకు తినిపించే ప్రత్యేక రకం బియ్యం.గంధసాలే : బిర్యానీ, పులావు కోసం సువాసనగల బియ్యం.సిద్ధసన్న : రోజువారీగా అన్నం వండుకొని తినటానికి అనుకూలం.దొడ్డా బైరా నెల్లు : పెరుగన్నానికి బాగుంటాయి. కజ్జాయ (తీపి వడలు), దోసెలు, ఇడ్లీకు అనువైనవిరాజముడి : రోజువారీ భోజనం కోసం బాగుంటాయి.దొడ్డిగా : బియ్యపు పిండితో రొట్టె, పెరుగు అన్నం చేసుకోవటానికి ఉత్తమమైనది.బర్మా బ్లాక్ : పాయసానికి అనువైనదినిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్.చదవండి: మన దేశంలో 23 రకాల దేశీయ వరి వంగడాలకు జీఐకేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా -
మన దేశంలో 23 రకాల దేశీయ వరి వంగడాలకు జీఐ
పది వేల సంవత్సరాల నాటి సుసంపన్న వ్యవసాయ వారసత్వ సంపద గల ప్రపంచ జీవవైవిధ్య కేంద్రాల్లో ఒక ముఖ్యమైనది భారతదేశం. ఈ అపురూప పాత పంటలకు అవి పుట్టి పెరిగిన స్థానిక ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉంటుంది. అక్కడి వాతావరణం, నేలల స్వభావం, ప్రజల ప్రాధాన్యతలు.. వీటన్నిటితో కూడిన ప్రత్యేక రుచి, రంగు, వాసన, పోషకాలు, ఔషధ గుణాలతో ఈ స్థానికత ముడిపడి ఉంటుంది. అటువంటి అద్భుతమైన దేశీ వరి వంగడాలను అనాదిగా ఏటేటా సాగు చేస్తూ, వాటిని పరిరక్షిస్తూ వస్తున్నది రైతులు, ఆదివాసులు. కొత్త వంగడాలు వెల్లువైన ఈ ఆధునిక కాలంలో వీటిని కాలగర్భంలో కలసిపోకుండా కాపాడుకునే పని కూడా పాత పంటల విలువ తెలిసిన వీరే తమ భుజస్కందాలపై వేసుకున్నారు. ఇటువంటి పాత పంటలను కాపాడుకోవటానికి ఒకానొక మార్గం వాటికి స్థానికతను ఆధారసహితంగా నిరూపించి తగిన చట్టపరమైన గుర్తింపు ఇవ్వటం. దాన్నే జాగ్రఫికల్ ఇండికేషన్(జీఐ) అంటాం. జీఐకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని గత వారం ఇదే సాగుబడి ప్లస్ పేజీలో చదువుకున్నాం. ఈ రోజు మన దేశంలో జీఐ గుర్తింపు పొందిన కొన్ని వారసత్వ దేశీ వరి రకాల విశిష్టతల గురించి తెలుసుకుందాం. ఈ విశిష్టమైన దేశీ వరి వంగడాల ఔషధ గుణాలు, పోషకాలు సమృద్ధిగా మనం అందుకోవాలంటే రసాయన రహిత పద్ధతుల్లో సాగు చెయ్యటం తప్పని సరి!దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పాత వరి రకాల ప్రత్యేకతను మరింతగా రక్షించడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం మరిన్ని వరి రకాలకు జీఐ గుర్తింపు ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. రైతులకు ప్రయోజనం చేకూర్చడం, వ్యవసాయ సమాజపు పురాతన సాంప్రదాయ విజ్ఞానాన్ని కాపాడటం, ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 1. టెక్కలి: జీఐ ట్యాగ్ ΄పొందిన మొట్టమొదటి ఆసియా వరి రకం. కేరళ తీర ప్రాంత జిల్లాల్లో నీటితో ఎక్కువ కాలం నిండి ఉండే చిత్తడి ప్రాంత పొలాల్లో పెరిగే సామర్థ్యం ΄ టెక్కలి రకానికి ఉంది. సేంద్రియ పద్ధతుల్లో దీన్ని సాగు చేస్తున్నారు.2. బాస్మతి: పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతులు విస్తృతంగా పండిస్తున్న బాస్మతి వరి బియ్యాన్ని దేశ విదేశాల్లో ప్రజలు ఇష్టపడి తింటుంటారు. జీఐ ట్యాగ్ ΄÷ందిన వరి రకాల్లో ఎక్కువ ప్రజాదరణకు నోచుకుంటున్నది బాస్మతి మాత్రమే అని చెప్పచ్చు. సుగంధం వెదజల్లే ΄÷డవైన గింజ కలిగిన బియ్యం. వండినప్పుడు దాని సువాసన, పొడడవాటి మెత్తటి ఆకృతికి ప్రసిద్ధి చెందింది.3. కాలానమక్: ‘బుద్ధ బియ్యం‘ అని కూడా దీనికి మరో పేరుంది. ఈ పురాతన, సుగంధ రకం పుట్టిల్లు ఉత్తరప్రదేశ్. దీన్ని శతాబ్దాలుగా హిమాలయ తీర ప్రాంతంలో సాగు చేస్తున్నారనే నమ్మిక ఉంది. దీని ప్రత్యేక సువాసన బుద్ధుని బహుమతిగా చెబుతారు.4. గోవింద్భోగ్: పశ్చిమ బెంగాల్కు చెందిన అద్భుత వరి రకం. చిన్న గింజ. మీగడ–తీపి సుగంధ బియ్యం. ఖరీఫ్ సీజన్ లో పండిస్తారు. దీన్ని సాంప్రదాయకంగా శ్రీకృష్ణుడికి నైవేద్యం కోసం ఈ బియ్యాన్ని వాడతారు.5. జోహా: అస్సాంలో, ముఖ్యంగా గారో హిల్స్లో, పండించే జోహా బియ్యం తీపి వాసనకు, రుచికి, మృదువైన ఆకృతికి ప్రసిద్ధి. ఇందులో అమైనో ఆమ్లాలు, ్ర΄ోటీన్లు అధికంగా ఉంటాయి.6. చక్–హావో: మణిపూర్కు చెందిన సువాసనతో కూడిన నల్ల బియ్యం. జిగటగా ఉంటాయి. వండినప్పుడు ఊదా రంగులోకి మారతాయి. ఇది గ్లూటెన్, విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలతో సమృద్ధమై ఉంటుంది. మణిపురి ఇళ్లలో చక్–హావో బియ్యానికి లభించే సాంస్కృతిక ప్రాముఖ్యత దాని విశిష్టతను చాటుతుంది.7. నవర: కేరళకు చెందిన ప్రసిద్ధినొందిన సాంప్రదాయ వరి రకం. ఔషధ గుణాల పుట్ట. వండుకొని తినటంతో పాటు ఆయుర్వేద చికిత్సలలోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు.8. వయనాడ్ జీరకశాల, వయనాడ్ గంధకశాల: ఇవి కేరళలోని వయనాడ్ ్ర΄ాంతం నుంచి వచ్చిన రెండు విభిన్న బియ్యం రకాలు. ప్రత్యేకమైన వాసన, రుచికి ప్రసిద్ధి చెందాయి.9. పాలక్కడన్ మట్ట: ‘రోజ్ మట్ట’ బియ్యం అని కూడా పిలుస్తారు. కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో పండిస్తారు. ఈ బియ్యానికి ఉండే ఒక రకమైన ‘మట్టి రుచి’ ప్రత్యేకమైనది. అలాగే, దాని పోషకాలతో పాటు అధిక పీచు పదార్థం వల్ల ప్రసిద్ధి చెందింది.10. అంబెమోహర్: మహారాష్ట్రలో పుట్టిన ఈ చిన్న బియ్యపు గింజలకు విలక్షణమైన మామిడి పువ్వుల మాదిరి సువాసన ఉంటుంది. సున్నితమైన ఆకృతి కూడా ఆకట్టుకుంటుంది.11. అజరా ఘన్సాల్: మహారాష్ట్రలో, ముఖ్యంగా అజరా జిల్లాలో, పండించే ఈ బియ్యం దాని తీపి వాసన, ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి చెందాయి. సువాసన, అందమైన సన్నని తనానికి సూచికగా దీనికి ‘ఘన్సాల్‘ అని పేరొచ్చింది.12. కతర్ని: బీహార్కు చెందిన కతర్ని ధాన్యపు గింజ చాలా చిన్నది. వండిన అన్నం రుచి, వాసన ప్రత్యేకమైనవి. తీపి, మృదుత్వం, సువాసనతో కూడిన కతర్ని చెయురా (అటుకుల)కు కూడా ప్రసిద్ధి చెందింది.13. తులైపంజి: పశ్చిమ బెంగాల్కు చెందిన మరొక సుగంధ బియ్యం రకం తులైపంజి. జిగట లేని, ప్రకాశవంతమైన, సన్నని ధాన్యపు రకం ఇది. చాలా కాలంపాటు సువాసనను నిలుపుకుంటుంది.14. కైపాడ్ : కేరళకు చెందిన మరో వరి రకం. తీర ప్రాంతాల్లో ఉప్పునీటితో పండించడానికి అనుగుణంగా ఉండే రకం ఇది.15. బాలాఘాట్ చిన్నోర్: మధ్యప్రదేశ్కు చెందిన ఈ రకానికి జీఐ గుర్తింపు ఉంది.16. జీరాఫూల్: ఛత్తీస్గఢ్కు చెందిన సుగంధ బియ్యపు రకం.17. బోకా చౌల్: ఒక విలక్షణమైన అస్సాం వరి రకం. దీన్ని ఉడికించకుండానే నీటిలో నానబెట్టి తినవచ్చు. వేడి నీటిలో ఉడికిస్తే వెంటనే, చల్ల నీటిలో నానబెడితే కొంచెం ఆలస్యంగా తినటానికి సిద్ధమవుతుంది.18. అండమాన్ కరెన్ ముస్లీ: అండమాన్, నికోబార్ దీవులకు చెందిన ఈ వరి రకానికి ఇటీవలే జీఐ ట్యాగ్ పొందింది.19. కోరాపుట్ కలజీర: ఇటీవలే జీఐ ట్యాగ్ పొందిన ఒడిశా సుగంధ వరి రకం.20. కలోనునియా: ఇటీవలే జీఐ ట్యాగ్ పొందిన పశ్చిమ బెంగాల్ సుగంధ వరి రకం.21. మార్చా బియ్యం : బీహార్కు చెందిన సుగంధ వరి రకం. ఇటీవలే జీఐ ట్యాగ్ పొందింది.22. ఉత్తరాఖండ్ లాల్ చావల్: ఉత్తరాఖండ్కు చెందిన ఎర్ర బియ్యపు గింజ రకం.23. ఆడమ్చిని: ఉత్తరప్రదేశ్కు చెందిన చిన్న గింజ సుగంధ వరి రకం ఇది. ఇదీ చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ!నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి,డెస్క్ -
Sagubadi: 6 నెలల్లోనే ‘నేచురల్’ ధ్రువీకరణ!
ప్రకృతి వ్యవసాయ ఆహారోత్పత్తులపై వినియోగదారులకు నమ్మకం కలిగించటం ద్వారా ఆ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ– రైతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ‘నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ సిస్టమ్’ (ఎన్ఎఫ్సీఎస్)ను ఏర్పాటు చేస్తోంది. ‘ఆర్గానిక్’ ధ్రువీకరణ కోసం ఇప్పుడున్న ‘ఎన్పీఓపీ’, ‘పీజీఎస్ ఇండియా’ సర్టిఫికేషన్ వ్యవస్థలకు అదనంగా.. దేశీ మార్కెట్ల కోసం ‘నేచురల్’ ధ్రువీకరణ వ్యవస్థ ప్రారంభమవుతోంది. సేంద్రియ ధ్రువీకరణ కోసం ఎన్పీఓపీ లేదా పీజీఎస్ సర్టిఫికేషన్ పొందడానికి అవసరమయ్యే పరివర్తన కాలం 3 ఏళ్లు. అయితే, ప్రకృతి వ్యవసాయదారులకు రిజిస్టర్ చేసుకున్న 6 నెలల్లోనే ‘నేచురల్’ సర్టిఫికేషన్ ఇవ్వనున్నారు. వెబ్పోర్టల్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా ఒంటరి రైతు లేదా కనీసం ఐదుగురు రైతులు కలిసి బృందంగా నమోదు చేసుకోవచ్చు..మన దేశంలో ‘సేంద్రియ ఆహారోత్పత్తుల’ ధ్రువీకరణకు ఇప్పటికే రెండు (ఎన్పీఓపీ, పీజీఎస్ ఇండియా) ధ్రువీకరణ వ్యవస్థలు పనిచేస్తుండగా.. ఈ పరిధిలోకి రాని ‘ప్రకృతి వ్యవసాయోత్పత్తుల’ ధ్రువీకరణ కోసం మూడో ధ్రువీకరణ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఆహార భద్రత మరియు ప్రమాణాలు (సేంద్రీయ ఆహారాలు) నిబంధనలు, 2017 ప్రకారం చట్టబద్ధంగా గుర్తింపు కలిగిన రెండు రకాలు ఉన్నాయి.. దేశ విదేశాల్లో తమ ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మాలనుకునే రైతుల కోసం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్పీఓపీ) మొదటిది. దీన్ని ‘థర్డ్ పార్టీ సర్టిఫికేషన్’ అని కూడా అంటారు. ఇది అధిక ఖర్చుతో కూడి ఉంటుంది. రెండోది: తక్కువ ఖర్చుతో ధ్రువీకరణను రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి 2011లో పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ (పీజీఎస్)–ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ వ్యవస్థ ఏర్పాటైంది. కొత్తది మూడోది: ‘నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ సిస్టమ్’(ఎన్ఎఫ్సీఎస్) పేరిట కేంద్ర వ్యవసాయ– రైతుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది. ఇది దేశీ మార్కెట్లలో ప్రకృతి వ్యవసాయోత్పత్తుల అమ్మకానికి రైతులకు ఉపయోగపడుతుంది. గత కొన్ని నెలలుగా సంబంధిత వర్గాల వారిని సంప్రదించి, సలహాలు సూచనలు తీసుకొని మార్గదర్శకాలను రూపొందించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి మారే పరివర్తన కాలం కేవలం 6 నెలలే కావటం విశేషం. ‘నేచురల్’ «ధ్రువీకరణలో ముఖ్యాంశాలు:1. ‘నేచురల్ ఫార్మింగ్’ ధ్రువీకరణ పొందాలంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి. ఈ పద్ధతుల్లో పంటలు పండించటం.. వ్యవసాయోత్పత్తులను పొలంలో గాని లేదా మరోచోటకు తీసుకెళ్లి గాని వ్యక్తిగత రైతులు/ రైతుల బృందాలు ప్రాథమిక స్థాయిలో శుద్ధి చేయటం.. విలువను జోడించటం.. ఈ మూడింటికీ ‘నేచురల్’ ధ్రువీకరణ ఇస్తారు. 2. నేచురల్ ఉత్పత్తులను ప్యాకెట్లలో నింపి, సీల్ చేసి.. ట్రేసబిలిటీ వివరాలతో కూడిన సమాచారాన్ని, లోగోను కవర్పై ముద్రించి అమ్మాలి. దీని లోగో పీజీఎస్ ఇండియా లోగోకు దగ్గరిగానే ‘పీజీఎస్–ఇండియా నేచురల్’ అని ఉంటుంది. తాజా పాలు, పెరుగు, మజ్జిగ వంటివి లూజుగా కూడా అమ్ముకోవచ్చు. 3. ప్రకృతి వ్యవసాయం పశువులతో (ప్రధానంగా స్థానిక పశుజాతులతో) అనుసంధానమై ఉంటుంది. బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం లేదా ఏదైనా ఇతర సాంప్రదాయ లేదా వినూత్న రసాయన రహిత ఉత్పాదకాలను మాత్రమే ఉపయోగించాలి. 4. ఒకటి కన్నా ఎక్కువ పంటలు కలిపి పండించటం, వర్షాకాలం ముందే పొడి మట్టిలోనే మట్టి పొరతో లేపనం చేసిన విత్తనాలను విత్తటం, పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన, సాంప్రదాయ రకాల విత్తనాలు (జన్యుమార్పిడి విత్తనాలకు అనుమతి లేదు) వాడటం, పక్క పొలానికి ప్రకృతి సేద్య పొలానికి మధ్య కొన్ని ఎత్తయిన చెట్లను పెంచటం ద్వారా రసాయన పురుగుమందుల తుంపర్లు ఈ పొలంలోని పంటలపై పడకుండా అడ్డుకోవటానికి బఫర్ జోన్లలో చెట్లు పెంచటం.. మొదలైనవి.5. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు నేల నిర్మాణాన్ని, పోషకాల స్థాయిని మెరుగుపరుస్తాయి. మట్టిలో సేంద్రియ కర్బనాన్ని మెరుగుపరుస్తాయి. తేమ నిలుపుదల, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి. పంటల వైవిధ్యతను ప్రోత్సహిస్తాయి. స్థానిక రైతుల విజ్ఞానానికి, స్థానికంగా అమల్లో ఉన్న నిర్దిష్ట సాంకేతికతల్లోని స్థానిక వ్యవసాయ–పర్యావరణ సూత్రాలను ప్రకృతి వ్యవసాయం తనలో ఇముడ్చుకుంది. 6. ఖరీఫ్, రబీ పంటల మధ్య విరామ కాలంలో కూడా పొలాన్ని ఖాళీగా ఉంచకూడదు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) పద్ధతిలో 12–25 రకాల స్థానిక విత్తనాలతో నవధాన్య పంటలు సాగు చెయ్యటం ముఖ్య విషయం. 7. పొలంలో పంటలకు ముందు పలు జాతుల పచ్చి ఎరువు పంటలను పెంచటం, సాధ్యమైనంత వరకు పొలంలోనే తయారు చేసుకున్న ఎరువులు వాడటం ముఖ్యం. 8. ప్రకృతి వ్యవసాయ ధ్రువీకరణ వ్యవస్థను ఎన్ఎఫ్సిఎస్ సర్టిఫికేషన్ కమ్ ట్రేసబిలిటీ పోర్టల్ ద్వారా నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్సీఓఎన్ఎఫ్) నిర్వహిస్తుంది. ఎన్సీఓఎన్ఎఫ్ కేంద్ర కార్యాలయం ఘజియాబాద్లో ఉండగా, ప్రాంతీయ కార్యాలయం నాగపూర్లో ఉంది. దీని పరిధిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. 9. ‘నేచురల్’ ధ్రువీకరణ ఇచ్చే క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రమాణాల అమలు, పారదర్శకత, ఏ ఉత్పత్తిని ఏ రైతు పండించారు? ఎవరు శుద్ధి చేసి ప్యాకెట్లు తయారు చేశారు? అనే విషయాలను కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమశాఖ పర్యవేక్షణలో ఎన్సీఓఎన్ఎఫ్ నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ధ్రువీకరణ సేవల కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ తనిఖీలను రీజినల్ కౌన్సెళ్ల (ఆర్సీల) ద్వారా నిర్వహిస్తుంది. 11. పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ కోసం దేశవ్యాప్తంగా 76 రీజినల్ కౌన్సెల్స్ (ఆర్సీలు) పనిచేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, స్థానిక బృందాలు, కేవీకేలు, యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన ప్రకృతి వ్యవసాయ సంస్థలు ఆర్సీలుగా వ్యవహరిస్తున్నాయి. వీటి ద్వారానే నేచురల్ సర్టిఫికేషన్ సంబంధిత పోర్టల్, యాప్లు రైతులు, బృందాలకు అందుబాటులోకి వస్తాయి. డాక్యుమెంటేషన్, ఆన్లైన్, ఆఫ్లైన్ తనిఖీలు కూడా వీటి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. 12. నేచురల్ సర్టిఫికేషన్ క్షేత్ర స్థాయిలో తనిఖీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీ/ గ్రామస్థాయిలో కనీసం 5గురితో ‘లోకల్ గ్రూప్’లను ఏర్పాటు చెయ్యాలి. వారిలో ఒకర్ని నాయకుడిగా నియమించాలి. 13, వ్యవసాయం చేస్తున్న పొలం మొత్తంలో కొంత భాగంలో మాత్రమే ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే.. ఉత్పాదకాలు, పంట దిగుబడులు కలసిపోకుండా గోదాములను రసాయనిక వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి వేర్వేరుగా ఏర్పాటు చేసుకోవాలి. యంత్ర పరికరాలను శుభ్రం చేసి వాడాలి. 14. నేచురల్ సర్టిఫికేషన్ కోసం పోర్టల్/మొబైల్ ద్వారా తమ పేరు నమోదు చేసుకునేటప్పుడు రైతు స్వీయధ్రువీకరణ సమర్పించాలి. రసాయనాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా వాడబోనని ప్రమాణం చెయ్యాలి. పశువులు వున్నాయా? అవి స్థానిక జాతులవా కాదా? జీవామృతం వంటి తానే పొలంలో తయారు చేసుకుంటున్నారా లేదా? దేశీ విత్తనాలే వాడుతున్నారా? ఎంతకాలం నుంచి అనుసరిస్తున్నారు? ఏ పంటలు పండిస్తున్నారు? వంటి విషయాలు పేర్కొనాలి. ద్రావణాలు, కషాయాలు 90% సొంతంగా తయారు చేసుకునే రైతుకు వెరీ గుడ్ రేటింగ్ ఇస్తారు. కౌలు రైతులు కౌలు ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి.సేంద్రియ vs ప్రకృతి సేద్యంసేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రెండూ రసాయనేతర వ్యవసాయ పద్ధతులే. ఈ రెండిటి మధ్య సారూప్యాలు ఉన్నప్పటికీ వ్యత్యాసాలు కూడా ఉన్నాయి.సారూప్యాలు: ఎక్కువ రకాల పంటలు సాగు చేయటం, పొలంలో పంట వ్యర్థాలను తిరిగి భూమిలో కలిపే పనులు చెయ్యటం, ప్రకృతి సహజమైన పోషక చక్రాన్ని పునరుజ్జీవింపజేయటం, పంటల మార్పిడి, బహుళ పంటల సాగు, సమర్థవంతంగా వనరుల పునర్వినియోగం.వ్యత్యాసాలు: సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో బయటి వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి తెచ్చిన సేంద్రియ, జీవసంబంధమైన ఎరువులు, ద్రావణాలు, ఖనిజాలు ఉత్పాదకాలను వాడతారు. వర్మీకంపోస్టు, దిబ్బ ఎరువు, జీవన ఎరువులు, పురుగుమందులు వంటివి వాడతారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాధ్యమైనంత వరకు పొలంలోనే తయారు చేసుకుంటారు. సాధ్యమైనంత వరకు స్థానిక జాతుల పశువుల (ముఖ్యంగా దేశీ ఆవుల) పేడ, మూత్రంతో స్వయంగా తయారు చేసుకున్న ఘనజీవామృతం, ద్రవజీవామృతం, కషాయాలు, ద్రావణాలు వాడతారు. మరీ అవసరమైతే గ్రామంలోని బయో రిసోర్స్ సెంటర్(బీఆర్సీ) నుంచి వీటిని కొనుగోలు చేస్తారు. ఏడాది పొడవునా భూమిని వత్తుగా విత్తిన పంటలతో లేదా పంట వ్యర్థాల ఆచ్ఛాదనతో కప్పి ఉంచుతారు. ఖరీఫ్, రబీ, వేసవి పంటలు పూర్తయ్యాక కూడా భూమిని ఎండబెట్టకుండా నవధాన్య పంటలు విధిగా సాగు చేస్తూ నేలకు నిరంతరం సజీవ ఆచ్ఛాదన (లైవ్ మల్చింగ్) కల్పిస్తారు. తద్వారా భూమిలోని పోషక చక్రాన్ని పునరుద్ధరిస్తారు. ‘నేచురల్’ యాప్, పోర్టల్లు ఖరీఫ్ ఆఖరి నాటికి సిద్ధం– ‘సాక్షి సాగుబడి’తో ఎన్సీఓఎన్ఎఫ్ డైరెక్టర్ డా. గగనేశ్ శర్మప్రకృతి వ్యవసాయోత్పత్తుల నాణ్యతా ధ్రువీకరణ కోసం ‘పీజీఎస్–ఇండియా నేచురల్’ పేరిట ప్రత్యేక సర్టిఫికేషన్ వ్యవస్థను త్వరలో ప్రారంభిస్తున్నామని నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్సీఓఎన్ఎఫ్) డైరెక్టర్ డా. గగనేశ్ శర్మ తెలిపారు. ప్రకృతి వ్యవసాయదారులు పేర్లు నమోదు చేసుకున్న 6 నెలల్లో సర్టిఫికేషన్ ఇస్తామని, సీనియర్ రైతులకు వెంటనే ధ్రువీకరణ ఇస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం చివరి నాటికి ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్లు అందుబాటులోకి వస్తాయన్నారు. డా. గగనేశ్ శర్మ ‘సాక్షి సాగుబడి’తో టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ కేంద్రంగా ఎన్సీఓఎన్ఎఫ్ దేశంలోని సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర దక్షిణాది రాష్ట్రాలు దీని నాగపూర్ ప్రాంతీయ కేంద్రం పరిధిలోకి వస్తాయి. సీనియర్ రైతులకు వెంటనే ధ్రువీకరణడా. గగనేశ్ శర్మ ఇంకా ఏమన్నారంటే: ‘వినియోగదారులకు సౌలభ్యకరంగా ఉండేవిధంగా నేచురల్ ఫార్మింగ్ పోర్టల్, మొబైల్ యాప్లను రూపొందిస్తున్నాం. ఈ ఖరీఫ్ పంట కాలం ముగిసే నాటికి ఇవి అందుబాటులోకి తేవటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయదారులు సులువుగా నేరుగా ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయమని రాష్ట్రప్రభుత్వాలను ఇప్పటికే కోరాం. ప్రస్తుతానికి ఆఫ్లైన్లో రైతుల పేర్ల నమోదు జరుగుతోంది. ఇప్పటికి 1,15,000 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. సేంద్రియ వ్యవసాయ ధ్రువీకరణ ‘పీజీఎస్ ఇండియా’కు ఉన్న నిబంధనలే దీనికీ వర్తిస్తాయి. అయితే, దీని ప్రమాణాలు వేరుగా ఉంటాయి. ఒక ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తమ పేరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 6 నెలల్లో నేచురల్ ధ్రువీకరణ ఇస్తాం. అయితే, 4 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ 6 నెలల పరిమితిని సడలిస్తాం. వారు ఎన్నేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు? పశువులు ఏమి ఉన్నాయి? ఎరువులు కషాయాలు వారే తయారు చేసుకుంటున్నారా? పంటల జీవవైవిధ్యాన్ని ఎంత మేరకు పాటిస్తున్నారు? వంటి విషయాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వారికి గ్రేడింగ్ ఇస్తాం. అన్నీ సంతృప్తికరంగా ఉంటే వెంటనే ధ్రువీకరణ ఇస్తాం..’ నేచురల్ ఉత్పత్తులను ఎన్సీఓఎల్ కొంటుంది‘దేశంలో 80% మంది రైతులు చిన్న కమతాలలో ప్రకృతి వ్యవసాయం చేసే వారే. వీరు పండించే పంటలో వారే చాలా వరకు వారి కుటుంబమే తింటారు. 20–30% పంటను అమ్ముతారు. ఈ మిగులు ఉత్పత్తులను కేంద్ర సహకార శాఖ ఏర్పాటు చేసిన జాతీయ సహకార సేంద్రియ లిమిటెడ్ (ఎన్సీఓఎల్) కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, దేశ ప్రజలకు విక్రయిస్తుంది. అమూల్ పాల ఉత్పత్తులను విక్రయించిన పద్ధతిలో ఇది జరుగుతుంది. మేం ఇచ్చే పీజీఎస్ నేచురల్ సర్టిఫికేషన్ ప్రాసెస్ సర్టిఫికేషన్ మాత్రమే. ప్రకృతి రైతుల ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించేందుకు బ్యాచ్ల వారీగా ఎన్సీఓఎల్ పరీక్షలు చేస్తుంది’ అని వివరించారు డా. గగనేశ్ శర్మ. -
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులివే!
తెలుగు రాష్ట్రాల్లో 20 లోపే..జీఐ గుర్తింపు పొందిన తెలంగాణ ఉత్పత్తులు: 17 ఉత్పత్తుల్లో 1 వ్యవసాయం, 1 ఆహారోత్పత్తి, 15 హస్తకళాకృతులు ఉన్నాయి. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిల్గ్రీ, నిర్మల్ బొమ్మల – క్రాఫ్ట్, నిర్మల్ ఫర్చీచర్, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, హైదరాబాద్ హలీం, చేర్యాల పెయింటింగ్స్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, సిద్ధిపేట గొల్లభామ చేనేత చీరలు, నారాయణపేట చేనేత చీరలు, బనగానపల్లె మామిడి, ఆదిలాబాద్ డోక్ర, వరంగల్ దుర్రీస్, తాండూరు కంది.2004వ సంవత్సరంలో 3 భౌగోళిక గుర్తింపులతో భారత్ జీఐ ట్యాగ్ల నమోదు ప్రారరంభ మైంది. 2024లో ఇది 643కు చేరింది. 2023–24లో అత్యధికంగా జీఐ పొందిన హస్తకళాకృతులు 85 కాగా, వ్యవసాయ ఉత్పత్తుల సంఖ్య 48. ఆహారోత్పత్తులు 19 మాత్రమే. ఆంధ్రప్రదేశ్ జీఐ ఉత్పత్తులు: 19 ఉత్పత్తుల్లో 4 వ్యవసాయం, 1 ఆహారోత్పత్తి, 11 హస్తకళాకృతులు, 3 మానుఫ్యాక్చర్డ్–నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. శ్రీకాళహస్తి కలంకారీ, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారీ, బుడితి బెల్ – బ్రాస్ క్రాఫ్ట్, ఏపీ లెదర్ పప్పెట్రీ, ఉప్పాడ జాందాని చీరలు, తిరుపతి లడ్డు, గుంటూరు సన్న మిరప, వెంకటగిరి చీరలు, బొబ్బిలి వీణ, మంగళగిరి చీరలు–వస్త్రాలు, ధర్మవరం చేనేత పట్టు చీరలు– పాపడాలు, బందరు లడ్డు, ఉదయగిరి వుడెన్ కట్లెరీ, బనగానపల్లి మామిడి, దుర్గి స్టోన్ కార్వింగ్స్, ఏటికొప్పాక బొమ్మలు, ఆళ్లగడ్డ స్టోన్ కార్వింగ్స్, అరకు వ్యాలీ అరబిక కాఫీ.643 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు2004–2024 మధ్యకాలంలో జీఐ గుర్తింపు పొందిన వాటిలో హస్తకళాకృతులు 54%, వ్యవసాయ ఉత్పత్తులు 31%, తయారీ, సహజ వస్తువులు 8%, ఆహారోత్పత్తులు 7% ఉన్నాయి. ఉత్తర భారత దేశానికి చెందిన జీఐ గుర్తింపు ఉన్న బాస్మతి బియ్యానికి అధిక ధర వస్తుంది, సాధారణ బాస్మతి బియ్యంతో పోల్చితే. అదేవిధంగా కేరళలో జీఐ గుర్తింపు ΄పొందిన దేశీ బియ్యం రకాల సాగుదారులకు అధికాదాయం వస్తోంది. మన దేశంలో గత 20 ఏళ్లలో మొత్తం 643 ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపులు పొందగా, అందులో 200 వ్యవసాయోత్పత్తులే. ఆహారోత్పత్తులు 47, హస్తకళాకృతులు 343, మానుఫ్యాక్చర్డ్, నేచురల్ గూడ్స్ 53 ఉన్నాయి. అత్యధిక జీఐలు పొందిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 74 (11.51%). ఇందులో ఎక్కువ భాగం హస్తకళాకృతులే. తమిళనాడులో జీఐ పొందిన 59 (9.18%) ఉత్పత్తుల్లో హస్తకళాకృతులు, ఆహారోత్పత్తులే ఎక్కువ. మహారాష్ట్రలో 49 (7.62%), కర్ణాటకలో 44 (6.84%), కేరళలో 35 (5.44%) వస్తువులకు 2024లో జీఐ లభించింది. గత 20 ఏళ్లలో దేశంలో 2024 నాటికి 643 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు వస్తే ఆంధ్రప్రదేశ్లో 19, తెలంగాణలో17 ఉత్పత్తులకు మాత్రమే జీఐ గుర్తింపు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 8,86,708 ఉత్పత్తులకుజీఐ2017–23 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 8,86,708 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. 2017లో అత్యధికంగా జీఐల నమోదు జరిగింది. ఆ తర్వాత కాలంలో హస్తకళాకృతులు, వైన్స్, స్పిరిట్స్, సేవలు, తదితర అన్ని విభాగాల్లోనూ తగ్గుదల నమోదైంది. అయితే, వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల సంఖ్య మాత్రం 2017–2023 మధ్య 23.9% పెరిగింది. ఈ కాలంలో జీఐ గుర్తింపు ΄÷ందిన వైన్స్, స్పిరిట్స్ 59.64% (5,28,832) ఉండగా, వ్యవసాయ ఉత్పత్తులు 3,37,008 (38.01%) ఉన్నాయి. హస్తకళాకృతులు 11,538 (1.3%) ఉన్నాయి. 2023లో అత్యధికంగా చైనా 9,785 జీఐలతో అగ్రస్థానంలో ఉండగా, అమెరికా 763తో 49వ స్థానంలో, భారత్ 530తో 52వ స్థానంలో ఉంది. నిర్వహణ : పంతంగి రాంబాబు, సాక్షి, సాగుడి డెస్క్. -
ఈ యాంటీబయాటిక్స్ తో జాగ్రత్త!
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో యాంటీమైక్రోబియల్ ఔషధాల వాడకంలో అపసవ్య ధోరణులను అరికట్టాల్సిన తరుణం ఇది. పాలు, మాంసం కోసం పశువులు, కోళ్ల పెంపకంలో.. రొయ్యలు, చేపల సాగులో లేదా ప్రాసెసింగ్ ప్రక్రియల్లో వాడేటప్పుడు జాగరూకతతో వ్యవహరించాలని ప్రభుత్వం నిర్దేశిస్తోంది. పాలు, మాంసం, గుడ్లు, తేనె ఉత్పత్తి క్రమంలో, ఆక్వా సాగులో, ప్రాసెసింగ్లో ఏ దశలోనూ 34 యాంటీబయాటిక్స్ను వాడొద్దని భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాథికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) నిర్దేశిస్తోంది. యూరోపియన్ యూనియన్ ప్రమాణాలకు అనుగుణంగా మరో 15 యాంటీబయాటిక్స్ వాడకాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిషేధించింది. ప్రజల శ్రేయస్సు, ఎగుమతులను పెంపొందించుకోవటంతో పాటు మన దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన సగానికిపైగా జనాభా జీవనోపాధులను సంరక్షించడంలోనూ యాంటీబయాటిక్స్ వాడకంపై సదవగాహన కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతకీ ఏయే యాంటీబయాటిక్ ఔషధాలపై దశలవారీగా నిషేధం విధించారో తెలుసా? చదవండి..సూక్ష్మక్రిములు సోకినప్పుడు చేసే వైద్య చికిత్సల్లో వాడే శక్తివంతమైన ఔషధాలే యాంటీబయాటిక్స్. ఇవి రెండు వైపులా పదును ఉన్న వజ్రాయుధాల్లాంటివి. వీటిని రూపొందించటం మానవాళి సాధించిన అద్భుతమైన విజయాలలో ఒకటి. సూక్ష్మక్రిములు సోకినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీబయాటిక్స్ వంటి యాంటీమైక్రోబియల్ మందులు మనుషులకు, జంతువులకు మెరుగైన జీవన పరిస్థితులకు మార్గం సుగమం చేశాయి. యంటీమైక్రోబియల్ ఔషధాలు మనుషులు, జంతువులు ఎక్కువ కాలం, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడానికి సహాయపడతాయి. అంటువ్యాధులను నివారించడానికి, నియంత్రించడానికి, చికిత్స చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, సూక్ష్మ పరాన్న జీవులు) నిరోధకతను సంతరించుకోవటంతో ఈ ప్రాణాలను రక్షించే అనేక మందులు వాటి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి.దీన్నే ‘యాంటీమైక్రోబియల్ నిరోధకత’ లేక ఏఎంఆర్ అని పిలుస్తారు. మనుషులు, జంతువుల శ్రేయస్సుకు ‘యాంటీమైక్రోబియల్ నిరోధకత’ ముప్పు పెరుగుతోంది. ఈ ముప్పు మన కాలంలోని అతిపెద్ద ప్రపంచ ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా జంతువులు, మానవ ఆరోగ్యానికి.. అలాగే ప్రపంచవ్యాప్తంగా జీవనోపాధికి, ఆహార భద్రతకు ఏఎంఆర్ ముప్పు పెరుగుతోంది.. అయితే, శుభవార్త ఏమిటంటే.. ఔషధ–నిరోధక సూక్ష్మక్రిముల ఆవిర్భావాన్ని అరికట్టడానికి పరిష్కారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ– పశువులను, కోళ్లను, రొయ్యలు, చేపలను పెంచే రైతులు, పశువైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, అన్ని దేశాల పౌరులు– ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఏఎంఆర్ను ఎదుర్కోవడానికి తమ స్థాయిలో పాటుపడటానికి అవకాశం ఉంది. మనుషులకు వాడేందుకు ప్రత్యేకించిన యాంటీబయాటిక్ ఔషధాలను ఇతరత్రా ఉపయోగాలకు అంటే పశుపోషణలో, ఆక్వా సాగులో ఉపయోగించరాదని అంతర్జాతీయ ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఏఎంఆర్ ముప్పును తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, రొయ్యలలో ఫలానా యాంటీమైక్రోబియల్/ యాంటీబయాటిక్ ఔషధాల అవశేషాలు ఉండకూడదు అని అనేక దేశాలు పట్టుబడుతున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని కంటెయినర్లను వెనక్కి తిప్పి పంపుతున్నాయి కూడా. భారతీయ ఆహారోత్పత్తుల దిగుమతిపై అమెరికా సరికొత్త అపరాధ సుంకాలు విధించిన నేపథ్యంలో ఇతర దేశాల్లో కొత్త మార్కెట్లు వెతుక్కోవలసిన పరిస్థితి మన దేశానికి ఇంతకుముందెన్నడూ లేనంతగా ఇప్పుడొచ్చింది. ఈ నేపథ్యంలో మీ దేశం నుంచి ఆహారోత్పత్తులు దిగుమతి చేసుకోవాలంటే మనుషుల కోసం రిజర్వు చేసిన 18 రకాల యాంటీబయాటిక్ ఔషధాలను జంతువులు, కోళ్లు, రొయ్యల సాగులో పెరుగుదల కోసం గానీ, చికిత్సల కోసం గానీ వాడకూడదన్నది యూరోపియన్ యూనియన్ పెట్టిన షరతు. దీంతో భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. కేంద్రీయ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిధిలోని డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు (డిటీఏబీ) 92వ సమావేశంలో మనుషుల చికిత్స కోసం యూరోపియన్ యూనియన్ రిజర్వు చేసిన 37 యాంటీమైక్రోబియల్ ఔషధాలపై చర్చించి, వీటిలో 34 యాంటీమైక్రోబియల్ ఔషధాలను నిషేధించింది. మన దేశంలో వీటి తయారీ, దిగుమతి, అమ్మకం, పంపిణీ, వినియోగాన్ని నిషేధిస్తూ డీటీఏబీ నిర్ణయం తీసుకుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు సూచించిన విధంగా మరో పదిహేను రకాలను యాంటీబయాటిక్స్ వాడకాన్ని నిషేధిస్తూ ఇటీవలే భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో నిషేధించిన వాటితో కలుపుకుంటే ఇప్పటికి మొత్తంగా నిషేధానికి గురైన యాంటీమైక్రోబియల్ మందుల జాబితా (ఈ కథనంలోని పట్టికల్లో పేర్కొన్న విధంగా) చాలానే ఉంది. ఈ నిషిద్ధ మందుల జోలికి పోకుండా ఉంటేనే మన ఆహారోత్పత్తులను విదేశాలకు ఎగుమతి చెయ్యగలుగుతాం.పశువులు, కోళ్లు, రొయ్యల సాగులో నిషిద్ధ యాంటీబయాటిక్స్ ఇవీ..భారత ఆహార భద్రత–ప్రమాణాల అథారిటీ– ఎఫ్ఎస్ఎస్ఏఐ (2024) నిషేధించినవి:ఏ రంగాలు?: మాంసం కోసం పశువుల పెంపకం, మాంసం ఉత్పత్తుల తయారీ, పాడి పశువుల పెంపకం, పాల ఉత్పత్తుల తయారీ, కోళ్ల పెంపకం, ఆక్వా సాగు, ఆక్వా ఉత్పత్తుల తయారీ రంగంలో వాడకం నిషిద్ధం. యాంటీబయాటిక్స్– 3 తరగతులు: గ్లైకోపెప్టయిడ్స్, నైట్రోఫ్యూరాన్లు/ దాని మెటాబోలైట్లు, ఫ్యూరజోలిడోన్ (ఎవోజడ్), నైట్రోఫ్యూరాజోన్ (ఎస్ఇఎం), ఫ్యూరల్టాడోన్ (ఎఎంఓజడ్), నైట్రోఫ్యూరాంటోయిన్ (ఎహెచ్డీ), నైట్రోమిడాజోల్స్.. వీటితో సహా– (ఎ) డైమెట్రిడాజోల్, (బి) రోనిడాజోల్, దాని మెటాబోలైట్ 2– హైడ్రాక్సీమీథైల్–1, –మిథైల్–3, నైట్రోమిడాజోల్(సి), ఇప్రోనిడాజోల్, దాని మెటాబోలైట్, హైడ్రాక్సీప్రోనిడాజోల్ (డి), మిట్రోనిడాజోల్, దాని మెటాబోలైట్ 3, హైడ్రాక్సీమెట్రోనిడాజోల్.యాంటీబయాటిక్స్– 5 రకాలు: కార్బడాక్స్, క్లోరంఫెనికాల్, కోలిస్టిన్ స్ట్రెప్టోమైసిన్ (దీని మెటబొలైట్ డిహైడ్రోస్ట్రెప్టోమైసిన్ సహా), సల్ఫామెథోగ్సాజోల్.కేంద్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిషేధించినవి (2019, 2025): ఏ రంగాలు?: పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, ఆహారం కోసం పెంచే ఇతర పక్షుల పెంపకంలో వాడకం నిషిద్ధం. యాంటీబయాటిక్స్– 9 తరగతులు: యూరిడోపెనిసిలిన్స్, సైడెరోఫోర్, సెఫలోస్పోరిన్స్, కార్బపెనెమ్స్, పెనెమ్స్, మోనోబాక్టమ్స్, గ్లైకోపెప్టయిడ్స్, లిపోపెప్టయిడ్స్, ఆక్సాజోలిడినోన్స్, గ్లైసిల్సైక్లిన్స్. యాంటీబయాటిక్స్– 9 రకాలు: తొమ్మిది యాంటీబయాటిక్స్ వాడకంపై 2019 నుంచి నిషేధం ఉంది. ఆహారం కోసం పెంచే జంతువుల పెంపకంలో, కోళ్ల పెంపకంలో, ఆక్వా సాగులో, పశుగ్రాస సప్లిమెంట్లలో వాడటం నిషిద్ధం. కొలిస్టిన్ వాడటంపై 2025 మార్చి నుంచి నిషేధం ఉంది. ఆహార ఉత్పత్తి కోసం పెంచే ఏ జంతువుల పెంపకంలోనూ దీన్ని వాడకూడదు. సెఫ్టోబిప్రోల్, సెఫ్టరోలిన్, ఫిడాక్సోమైసిన్, ప్లాజోమైసిన్, ఎరావాసైక్లిన్, ఓమాడాసైక్లిన్, నైట్రోఫ్యూరాన్, క్లోరాంఫెనికాల్లను జంతువుల పెంపకంలో వాడకంపై 2025 మే నుంచి నిషేధం ఉంది.కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ నిషేధించినవి (2024): ఏ రంగం?: తీరప్రాంత ఆక్వా సాగులో నిషిద్ధం.యాంటీబయాటిక్స్– 5 తరగతులు: నైట్రోఫ్యూరాన్లు.. వీటితో సహా : ఫ్యూరాల్టాడోన్, ఫ్యూరాజోలిడోన్, ఫ్యూరిల్ఫ్యూరమైడ్, నిఫుర్ప్రజైన్, నైట్రోఫ్యూరాంటోయిన్, నైట్రోఫ్యూరాజోన్, డైమెట్రిడాజోల్, మెట్రోనిడాజోల్, రోనిడాజోల్, ఇప్రోనిడాజోల్ తదితర నైట్రోమిడాజోల్స్. సల్ఫోనామైడ్ మందులు (ఆమోదించబడిన సల్ఫాడిమెథాక్సిన్, సల్ఫాబ్రోమోమెథాజిన్, సల్ఫేథాక్సిపైరిడాజిన్ తప్ప), ఫ్లూరోక్వినోలోన్స్, గ్లైకోపెప్టయిడ్స్.యాంటీబయాటిక్స్– 5 రకాలు: క్లోరాంఫెనికాల్, నియోమైసిన్, నలిడిక్సిక్ ఆసిడ్, సల్ఫామెథోక్సాజోల్, డాప్సోన్.వాణిజ్య శాఖ నిషేధించినవి (2025): రంగం: రొయ్యల సాగులో నిషిద్ధం.యాంటీబయాటిక్స్–12 తరగతులు: కార్బోజైపెనిసిల్లిన్స్, యురీడోపెనిసిల్లిన్స్, సెఫలోస్పోరిన్స్ కాంబినేషన్లు బీటాతో– లాక్టామసె ఇన్హిబిటర్స్, సెడెరోఫోర్, సెఫలోస్పోరిన్స్, కార్బపెనెమ్స్, పెనెమ్స్, మోనోబాక్టమ్స్, గ్లైకోపెప్టయిడ్స్, లిపోపెప్టయిడ్స్, ఆక్సాజోలిడినోన్స్, గ్లైసిల్సైక్లిన్స్, ఫాస్ఫోనిక్ ఆసిడ్ డెరివేటివ్లు. యాంటీబయాటిక్స్– 6 రకాలు: సెఫ్టోబిప్రోల్, సెఫ్టారోలిన్, ఫిడాక్సోమైసిన్, ప్లాజోమైసిన్, ఎరవాసైక్లిన్, ఒమడాసైక్లిన్. -
లోకార్బ్ హై/హెల్దీ ఫ్యాట్ : అవిసె గింజలు అద్భుతః
అద్భుత పంట అవిసె పంట. అవిసె గింజలను ఆంగ్లంలో ‘ఫ్లాక్స్ సీడ్స్’ అంటారు. వంట నూనె వాణిజ్య వర్గాల్లో అవిసె నూనెకు ‘లిన్ సీడ్ ఆయిల్’ అని పేరు. ఈ నూనె చాలా ఆరోగ్యదాయకం. అవిసె మొక్క కాండం నుంచి తీసే నార/పీచు (లినెన్)తో తయారైన మెత్తని వస్త్రాలకు మధ్యతరగతి, ఉన్నత వర్గాల మార్కెట్లలో దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. వీటన్నిటికీ మించి.. అవిసె గింజలు పోషకాల పుట్టలు. ఈ గింజల పిండితో చేసిన రొట్టెలు, ఇతర వంటకాలు అద్భుతపోషక విలువలతో కూడి ఉండి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ముఖ్యంగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకునే ‘లోకార్బ్ హై/హెల్దీ ఫ్యాట్’ ఆహార పద్ధతిని పాటించే వారికి గోధుమలు, చిరుధాన్యాలకు అవిసె గింజల రొట్టె అద్భుత ప్రత్యామ్నాయం!.. అవిసె పంట కొత్తదేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా అనాదిగా ఉన్నదే. అంతేకాక, ఎంతో ఆరోగ్యదాయకమైన వర్షాధార పంటే అయినా, మన ప్రజల్లో చాలా మందికి దీని గురించి అంతగా తెలియకపోవటం ఆశ్చర్యకరం!అవిసె.. ఈ పేరుతో రెండు పంటలు ఉన్నాయి. మొదటిది: సన్నగా, పొడవుగా, గోగు మొక్క మాదిరిగా పది అడుగులు పెరిగే రకం ఒకటి. దీని శాస్త్రీయ నామం ‘సెస్బానియా గ్రాండిఫ్లోరా’. ఇది తమలపాకు తోటల్లో కనిపిస్తుంది. తమలపాకు తీగలను ఈ మొక్కలకే పాకిస్తారు. ఈ చెట్టు ఎర్ర /తెల్ల పూలు, కాయలు ఔషధ గుణాలున్న తినదగినవి. చదవండి: సెలవంటే పండగ..ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బూ ఆదా ఇలా!రెండోది: ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రకం. దీని శాస్త్రీయ నామం ‘లినమ్ యుసిటాటిస్సిమం’. ఇది చిన్న పొద వంటి మొక్క. దీని కాయలు ధనియాల మాదిరిగా చిన్నగా ఉంటాయి. దాన్ని చిదిపితే లోపల కాఫీ రంగులో సన్నని, చిన్న గింజలు ఉంటాయి. అవే అవిసె గింజలు. మంచి పోషక విలువలున్నవి. ఇది నూనె గింజ పంటగా ప్రసిద్ధి. అవిసెను మానవ సంక్షేమం కోసం సహజ ఉత్పత్తులనిచ్చే విలువైన ఆర్థిక పంటగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. వాణిజ్యపరంగా ముఖ్యమైన నార/ఫైబర్, నూనెను ఉత్పత్తి చేసే మొక్కల జాతికి చెందినది. అవిసె సాగుకు సుదీర్గ చరిత్ర ఉంది. వివిధ పురాతన నాగరికతల పత్రాలను పరిశీలిస్దే ఇది అర్థమవుతోంది. అవిసె సాగు కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లినోలెనిక్ ఆమ్లం, లిగ్నాన్లు సహా బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా కలిగి ఉన్నందున అవిసె గింజలు, అవిసె నూనె గుర్తింపు పొందాయి. అవిసె నార వస్త్ర పరిశ్రమలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో గుర్తింపు ఉన్న అవిసె పంటపై పరిశోధనలు ఇటీవల ఊపందుకున్నాయి. మాలిక్యులర్ జెనెటిక్స్, బ్రీడింగ్, జెనోమిక్స్, జీనోమ్ ఎడిటింగ్ సహా అత్యాధునిక జన్యు ఇంజనీరింగ్ పద్ధతులలో పరిశోధనలు విస్తృతం అవుతున్నాయి. పరిశోధనలో పురోగతి, అవిసె సహజ ఉత్పత్తుల ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన రైతుల ఆర్ధికాభివృద్ధికి, దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహద పడవచ్చని నిపుణుల అంచనా. పది వేల ఏళ్ల క్రితం మానవులు స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయం మొదలు పెట్టిన అవిసెను వేలాది ఏళ్ల క్రితమే ఆహార (నూనె గింజ) పంటగా, పశుగ్రాస పంటగా, నార పంటగా సాగు చేయటం ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. నార కోసం పొడుగు పంట, నూనెగింజల కోసం పొట్టి రకం అవిసె పంటలు అప్పటి నుంచే ఉన్నాయి. అధిక నాణ్యతతో కూడిన వస్త్రాల నేతకు పనికొచ్చే అవెసె నార 5,700 ఏళ్ల క్రితం నుంచే వాడుకలో ఉంది. సింథటిక్ వస్త్రాల ఉత్పత్తి పెరిగినప్పటి నుంచి లినిన్ వాడకం మందగించింది. అయితే, పర్యావరణహితమైన సుస్థిర సహజ ఉత్పత్తిగా లినెన్ వస్త్రాలకు ఆదరణ ఇటీవల కాలంలో పెరుగుతోంది. వస్త్రోత్పత్తితో పాటు ఫ్లాక్స్ ఫైబర్ను ఇన్సులేషన్, కం΄ోజిట్స్, కరెన్సీ వంటి స్పెషాలిటీ పేపరు, జియో టెక్స్టైల్స్లోనూ వాడుతున్నారు. దీంతో ఈ పంటను తిరిగి విస్తృతంగా చేపట్టడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ ఇటు వంట నూనెగా అటు పారిశ్రామిక ప్రయోజనాలున్న నూనెగా ప్రసిద్ధి పొందింది. లిన్సీడ్ ఆయిల్, ఫ్లాక్స్సీడ్స్లో ఆరోగ్యాన్ని పెంపొందించే లినోలెనిక్ ఆసిడ్ (ఎఎల్ఎ), ప్రొటీన్, డైటరీ ఫైబర్తో పాటు పాలీఅన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ (పీయూఎఫ్ఏలు) పుష్కలంగా ఉన్నాయి. లిన్సీడ్ ఆయిల్కు త్వరగా తడారిపోయే స్వభావం ఉండటంతో రంగులు, ప్రింటర్స్ ఇంక్, వార్నీషులు, లైనోలియం, సబ్బులు వంటి పారిశ్రామిక ఉత్పత్తుల్లోనూ వాడుతున్నారు. ఫ్లాక్స్సీడ్స్కు పోషకవంతమైన పెంపుడు పక్షుల ఆహారంగా పేరుంది. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే.. అవిసె ఉత్పత్తులకు ఆరోగ్య దాయకమైన, పర్యావరణహితమైన వైవిధ్యభరితమైన ప్రయోజనాలు ఉన్నాయి.అడవి జాతి అవిసె పుట్టింది ఎక్కడో స్పష్టంగా తెలియదు. అయితే, మెడిటెర్రేనియన్, ఆగ్నేయాసియాల మధ్య ప్రాంతంలో పుట్టింది. తొలుత ఈజిప్టు, పాలస్తీనా, ఇజ్రాయెల్, సిరియా, తుర్కియే, జోర్దాన్ ప్రాంతంలో సాగైంది. తదనంతరం క్రమంగా ప్రపంచవ్యాప్తమైంది. తుర్కియేలో క్రీస్తు పూర్వం 6 వేల ఏళ్ల నాటి పురావస్తు అవశేషాల్లో అవిసె నార కనిపించింది. లినిన్/లైనిన్ వస్త్రంగా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తున్న ఫైబరే పత్తి కన్నా అతి ప్రాచీన పంటని పరిశోధకులు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 5 వేల ఏళ్ల క్రితం ఈజిప్టులో వస్త్రాలు, వస్తువులు, మమ్మీలకు చుట్టిన బ్యాండేజ్లలో అవెసె నార వాడారు. తదనంతర కాలంలో స్కాటాండ్, పర్షియా, భారత్, చైనా తదితర దేశాల్లో వర్తకులు అవెసె వస్త్రాలు, ఇతర ఉత్పత్తుల్ని విక్రయించారు. జర్మనీ, రష్యాల నుంచి ముడి అవిసె నారను తెప్పించి ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లండ్లలో లైనెన్ వస్త్ర పరిశ్రమలు వస్త్రాలు తయారు చేశాయి. ‘స్వచ్ఛత’కు ప్రతీకగా ఈజిప్షియన్, క్రిస్టియన్ తదితర నాగరికతల్లో దేవుళ్లు, దేవతలు అవిసె వస్త్రాలను వేసుకున్నారట. అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా లైనెన్ వస్త్రాలను వేసుకున్నారట. మధ్యయుగంలో ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియంలలో ఇంటింటికీ అవిసె వస్త్రాలు, దుప్పట్లు ఎవరికి వారు నేసుకునేవారట. ఫ్లాక్స్ స్పిన్నింగ్ యంత్రం కనుగొనటంతో దీని సాగు తామరతంపరగా విస్తరించింది. అయితే తదనంతర కాలంలో పత్తి పంట అందుబాటులోకి వచ్చాక దీని ప్రాభవం తగ్గిపోయింది. ఏతావాతా చెప్పేదేమంటే.. అవిసె పంటకు అనాదిగా ఘన కీర్తి ఉంది.ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎవో) 2021 నాటి గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 41.4 లక్షల హెక్టారలో 33.4 లక్షల టన్నుల అవిసె గింజలు పండుతున్నాయి. 2017–21 మధ్యకాలంలో సాగు విస్తీర్ణం ఆసియాలో 45.7%, యూరప్లో 30.4%, అమెరికాలో 20.2% విస్తరించి ఉంది. కజికిస్తాన్, రష్యా, కెనడా, చైనా, భారత్, అమెరికా, ఇథియోపియా, ఫ్రాన్స్, యూకేలలో లిన్సీడ్స్ సాగు విస్తారంగా జరుగుతోంది. అదేవిధంగా, ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల హెక్టార్లలో 8 మెట్రిక్ టన్నుల ఫ్లాక్స్ ఫైబర్ దిగుబడి వస్తోంది. అవిసె నారను 96.6% మేరకు యూరోపియన్ దేశాల్లోనే ఉంది. ఫ్రాన్స్, బెల్జియం, బెలారస్, రష్యా, యూకేలలో ఎక్కువ. ఆసియాలో అవిసె నార సాగు కేవలం 2% మాత్రమే. ఇందులో చైనాదే సింహభాగం. భారత్లో అవిసె నార సాగు బాగా తక్కువ. అవిసె గింజల ఉత్పత్తి గత ఐదేళ్లలో సగటున ఏటా 2.4 లక్షల హెక్టార్లలో 1.4 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు జరిగింది. అయితే, 1961–65 నాటితో (19.4 లక్షల హెక్టార్లలో 4.3 లక్షల టన్నుల ఉత్పత్తితో) పోల్చితే ఇది బాగా తక్కువ. అవిసె పంట 10–25 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతల మధ్య, 155–200 ఎం.ఎం. వార్షిక వర్షపాతం, 60–65% గాలిలో తేమ ఉన్న చోట్ల బాగా పెరుగుతుంది. మన దేశంలో అక్టోబర్ చివరి నుంచి నవంబర్ మధ్య వరకు సీతాకాలపు పంటగా ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సాగు చేస్తారు. నీరు నిలవని ఒండ్రు నేలల్లో, 5.5–6 పిహెచ్ ఉండే నేలల్లో పెరుగుతుంది. (ఎ) పూత దశలో ఉన్న అవిసె మొక్క(బి) అవిసె వంగడాల్లో వివిధ పూల రంగుల వైవిధ్యం(సి–డి) పరిపక్వ దశలో అవిసె కాయలు, విత్తనాలు(ఇ) కాండం నుంచి సేకరించిన అవిసె ఫైబర్ (లినెన్ నార) నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
ట్రీ ఆఫ్ లైఫ్
కొబ్బరిలో అద్భుతమైన ఆరోగ్యదాయక లక్షణాలున్నాయి. కొబ్బరి ఒక చక్కని ఆహారం. ఆరోగ్యదాయకమైన కొబ్బరి నీరును, అద్భుతమైన నూనెను అందించే గొప్ప పంట. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో జీవనో పాధిని అందిస్తుండటం వలన దీన్ని ‘జీవన వృక్షం (ట్రీ ఆఫ్ లైఫ్)’గా పరిగణిస్తారు. కొబ్బరి శాస్త్రీయ నామం కోకోస్ న్యూసిఫెరా ఎల్ (అరేకేసి). కొబ్బరిని ఆహారంగా, ఆథ్యాత్మిక సాధనంగా, పానీయంగా, ఔషధ విలువలున్న నూనెగా ఉపయోగపడుతోంది. పీచుగా అనేక ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలకు ముడిసరుకుగా ఉపయోగపడుతోంది. 80 కంటే ఎక్కువ దేశాల్లో సుమారు కోటి కుటుంబాలు కొబ్బరిని తమ ప్రాథమిక ఆహారంగా, ఆదాయ వనరుగా ఉపయోగించుకుంటున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా సాగు చేస్తున్న, ఉపయోగించబడే చెట్టుగా మారింది. కొబ్బరి గానుగ నూనెను వంటకు వాడటం ఇటీవల కాలంలో బాగా పెరిగిన నేపథ్యంలో వండర్ ట్రీ ఆఫ్ లైఫ్పై స్పెషల్ ఫోకస్...కొబ్బరి ఆధారిత వ్యవసాయ విధానం తరతరాలుగా అభివృద్ధి చెందిన ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధ ఉదాహరణ. కొబ్బరి చెట్లు ఇంటి పంటల్లో/తోటల్లో ముఖ్యమైన భాగాలు. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు నాటుకోవటం అనేక దేశాల్లో సుదీర్ఘ కాలపు సంప్రదాయంగా కనిపిస్తుంది. ఇంటి తోటలలోని కొబ్బరి చెట్లు ఆ కుటుంబానికి జీవనాధార వ్యవస్థగా మారాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఇలా చెబుతోంది: కొబ్బరి తదితర పంటల వైవిధ్యంతో కూడిన ఇంటి/పెరటి పంటలు రైతు కుటుంబం ప్రాథమిక అవసరాలను తీర్చటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహార భద్రత, ఆదాయ భద్రత, ఉ పాధి భద్రత కల్పిస్తుంది. ప్రతికూల వాతావరణ విపత్తులను తట్టుకునే శక్తిని ఇంటి/పెరటి పంటలు మెరుగుపరుస్తాయి. ఇందుకోసం పెరటి తోటల్లో అనేక పంటలు, పశువులు, కోళ్లు, చేపల పెంపకం కూడా కలిసి ఉంటుంది. 15వ శతాబ్దపు మళయాళ కావ్యం ‘కృషి గీత’లో కేరళలో మధ్యయుగపు పర్యావరణ అనుకూల సాగు వ్యవస్థల ప్రస్తావన ఉంది. కొబ్బరి ఆధారిత వ్యవసాయ వ్యవస్థలను ఇందులో ప్రముఖంగా పేర్కొనటం విశేషం. కొబ్బరి సేద్యంలో ఉత్తమ వ్యవసాయ పద్ధతులు...నాణ్యమైన, స్వచ్ఛమైన లేక జన్యు స్వచ్ఛత కలిగిన కొబ్బరి నారు మొక్కల పూర్తి వివరాలు తెలుసుకొని నమ్మ దగ్గ నారు మొక్కలను ఎంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యానశాఖ విభాగం వారి గుర్తింపు పొందిన నర్సరీల నుంచి సేకరించుకొని జాగ్రత్త పడాలి. సంవత్సరం అంతా పండే పంట కాబట్టి నాణ్యత విషయంలో రాజీ పడకుండా నారు మొక్కలను శ్రద్ధగా ముందు జాగ్రత్తతో సేకరించుకొని నాటుకోవాలి. పచ్చి కొబ్బరి బోండం (చౌగాట్ ఆరెంజ్ డ్వార్ఫ్ అంటే నారింజ రంగు గల ΄÷ట్టి రకం) తెగులును తట్టుకునే/తెగులును ఎదుర్కొనే (కల్ప రక్ష, కల్ప శ్రీ కల్ప శంకర) రకాలను, కురిడి కొబ్బరి రకం (లక్షద్వీప్ మైకో) మొదలైనవి మేలు.నాటేందుకు అనుకూల నేలలు...కొబ్బరి సాగులో అతి ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, వెలుతురు బాగా ప్రసరించాలి. కొబ్బరికి అనుకూలమైన నేలలను ఎంచుకుంటే గాలి, వెలుతురు ప్రసరణ బాగా జరిగి నత్రజనిని, కర్బనాన్ని, ఆక్సిజన్ను బాగా గ్రహించి పంటలు బాగా ఎదగడానికి సహకరిస్తుంది. చెట్టు ఆకుల్లో కిరణ జన్య సంయోగ క్రియ సామర్థ్యం పెరగాలంటే ఖాళీ భూముల్లో సాధ్యమైనంత వరకు మొక్క నాటడం ఉత్తమం. కేరళలో ఎక్కువగా కొబ్బరి నారు మొక్కలను వెలుతురు కోసం పెద్ద చెట్ల కింద నాటుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి, వెలుతురు ప్రసరణ సక్రమంగా అందక లేత మొక్కలు చీడ పీడల తాకిడికి తీవ్రంగా గురి అవుతూవుంటాయి. అంతేగాక ఈ చెట్లు పూత పూయడానికి ఎక్కువ కాలాన్ని వెచ్చిస్తాయి కూడా! కొబ్బరి నారు మొక్కల్ని నీరు సరిగ్గా పారని భూముల్లో నాట కూడదు. ఇలా చేయడం వల్ల ప్రారంభ దశలో పోషకాలు సరిపడక వేర్ల శ్వాసక్రియ సక్రమంగా ఉండదు. ఒక వేళ ఈ పరిస్థితులలో పెరిగినా ఎదుగుదలలో ఆటంకం ఏర్పడి కాయల దిగుబడిలో ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. లేత మొక్కలకు ఎదిగెందుకు తగిన తేమ అవసరం. అదే తరుణంలో పాదులో నీరు నిలచే పరిస్థితిని తట్టుకోలేవు. కొబ్బరి చెట్లు ఎదగడానికి ముందుగానే మంచి వెలుతురు, గాలిలోని మూలకాలు బాగా గ్రహించేందుకు సహకరించే భూసారం అవసరం. అప్పుడే మొక్కలు బాగా ఎదుగుతాయి.పంటకు కావలసిన భూభౌతిక వనరులు...నిర్థిష్టమైన నియమం ప్రకారం ఒక సెంటు భూమి(40 చదరపు మీటర్ల)లో ఒకే ఒక్క కొబ్బరి నారు మొక్కను నాటే ఏర్పాటు చేసుకోవాలి. రైతులందరు కొబ్బరి సాగును ఏక పంటగా పెంచేటపుడు అన్ని మొక్కలకు 7.5మీ. “ 7.5 మీ.లు, ΄÷ట్టి రకాల మొక్కలను 7.0మీ గీ 7.0మీ. ల ఖాళీ స్థలం ఉండే విధంగా నాటాలి. పెరటి తోటలలాగా ఎక్కువ పంటలను కలిపి పండించే సమయంలో చెట్లకు గాలి బాగా సోకే విధంగా తక్కువ మొక్కలు నాటాలి. రాజీ పడకూడదు. నాటే సమయంలో తక్కువ స్థలం కేటాయిస్తే గాలి ఆడక చెడు వాసన ప్రబలి చీడపీడలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అంతర పంటలను అనుబంధంగా పండించడం వల్ల చీడపీడల నియంత్రణ బాగా జరుగుతుంది. తోటలో పక్షులు వాలడానికి పంగ కర్రలు, సన్నని కాడ కలిగినటువంటి పూల మొక్కలను గుంపులుగా పెంచితే చీడపీడల నెదుర్కొనేలా పర్యావరణ రక్షణ సేవలు పొందవచ్చు. కొబ్బరి తోటల్లో కొమ్ము పురుగును నివారించేందుకు కొబ్బరి ఆధారిత వివిధ పంటల సాగు ఏక పంటగా కొబ్బరి చెట్ల సాగుకంటే బాగా అనుకూలంగా ఉన్నట్లు రూఢి అయ్యింది.పంట రక్షణ...నారు మొక్కల జీవక్రియ పెంచడానికి, నారు మొక్కలను నాటిన తర్వాత స్యూడోమొనాస్ను నాలుగు ఏడు, పది నెలల్లో 50 గ్రా. చొప్పున వేస్తూండాలి. మొక్కల్ని నాటేటప్పుడు 100 గ్రాముల స్యూడోమోనాస్ ΄÷డితో ద్రావణం చేసి వేరు మొక్కలను అందులో ముంచి నాటాలి. నాటిన మొక్కల హద్దుల వెంబడి గ్లైరిసీడియా మొక్కలను పెంచుతూ, వాటి ఆకులను కత్తిరించి మొక్కల పాదులలో మల్చింగ్ వేయడం వల్ల భూసారంలో మేలు చేసే సూక్ష్మజీవులే గాక సేంద్రియ పదార్థం వల్ల భూభౌతికంగా రసాయనికంగా, జీవనసంబంధమైన ఎరువులు వృద్ధి అవుతాయి. సేంద్రియ సూక్ష్మ పోషకాలు కూడా అభివృద్ధి అయి అందుబాటులో ఉంటాయి. సేంద్రియ ఎరువు తయారవుతూండడం వల్ల పంటలకు పోషకాలు (బయో ఎంజైములు) చెట్ల ఎదుగుదలకు బాగా అనుకూలిస్తాయి. బాగా మగ్గిన వర్మికంపోస్టు (10గ్రా. ఒక చెట్టుకు) లేక పశువుల ఎరువు (ఒక కిలో / చెట్టుకు) వేప చెక్క (2కిలోలు / చెట్టుకు) (ట్రైకోడెర్మా కలిపి (250 గ్రా/ చెట్టుకు) లేత కొబ్బరి మొక్కకు నాటిన తొలి దశలో ఎరువుగా ఉపయోగించుకోవాలి.జీవవ్యర్థాల పునరుత్పత్తి వినియోగం...ఏప్రిల్ – మే, సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో జనుము, జీలుగ పంటల ఆకులను పచ్చి రొట్ట ఎరువుగా చెట్టుకు 100 గ్రాములు పాదులలో వేసినట్లయితే వాతావరణ సంబంధ నత్రజని మాత్రమే గాక కాల్షియం: నత్రజని నిష్పత్తి కూడా బాగా వృద్ధి అవుతుంది. పచ్చి రొట్ట ఎరువును వేయడం వల్ల భూమి లోపలి ΄÷రలలోకి గాలి పుష్కలంగా ప్రవహించేందుకు దోహదం చేస్తుంది. వేరు వ్యవస్థ బాగా వృద్ధి అవడం, తేమ కొరత ఉన్నా కూడా మొక్కలు నిలదొక్కుకుని పెరగడం గమనించవచ్చు.చెట్లకు నీటి పారుదల చాలా క్లిష్టమైన అంశం వేసవి కాలంలో తేమ కొరతను నివారించేందుకు చెట్టుకు 200 లీటర్ల నీటిని వారానికి ఒక్కసారి అందివ్వడం అతి ముఖ్యమైన విషయం. అత్యధిక ఉత్పత్తిని సాధించేందుకు బిందు సేద్యం అందిస్తూ వినియోగించ వలసిన నీటిని పూర్తిగా ఉపయోగించడం అన్నది మరొక విధానం. వర్షాకాలంలో కూడా తగిన విధంగా నీరు ఇవ్వాలి. కోస్తా తీరంలో సముద్రజలాల పారుదలకు వీలున్నప్పుడు 500ల గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో నాణ్యమైన వేప చెక్కను, పచ్చి రొట్ట ఎరువుగా పచ్చని ఆకులను చేర్చి వేసుకోవాలి. కొబ్బరి తోటల అభివృద్ధికో పథకంకొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల కోసం రైతులకు కొబ్బరి అభివృద్ధి బోర్డు సహాయం దరఖాస్తుకు చివరి తేదీ జూలై 31ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే సాగులో ఉన్న కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగు ద్వారా ఉత్పాదకతను పెంపొందించటం కోసం కొబ్బరి బోర్డు 2025–26 సంవత్సరానికి గాను రైతులు, రైతు బృందాలు, ఉత్పత్తిదారుల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కొబ్బరి ఆధారిత పంటల వ్యవస్థ ద్వారా ఉత్పాదకత మెరుగుదలకు క్లస్టర్ ప్రాతిపదికన, బోర్డు నియమ నిబంధనలకు లోబడి రైతు భాగస్వామ్య విధానం ద్వారా ప్రస్తుత తోటల్లో ఉత్పత్తి, ఉత్పాదకతలను మెరుగుపరచడానికి కొబ్బరి బోర్డు ఆర్థిక సహాయం అందిస్తుంది. సూచించిన ఫార్మాట్లో దరఖాస్తులు / ప్రతి పాదన లు ఈ నెల 31 లోగా పం పాలి. కీలకమైన ఉత్పాదకాలు, అంతర పంటలు నాటడం, సామగ్రి, పచ్చి ఎరువు విత్తనాలు, మొక్కల రక్షణ రసాయనాలు మొదలైన వాటి ఖర్చులకు బోర్డు సహాయం వరుసగా రెండు సంవత్సరాలు అందించనుంది. కూలీల ఖర్చులు, ఇతర అద్దె సేవలు, మౌలిక సదు పాయాల అభివృద్ధి మొదలైన వాటికి ఈ పథకం వర్తించదు. ఆసక్తిగల రైతు బృందాలు 2025–07–31 ఉదయం 10.30 గంటల్లోగా అవసరమైన పత్రాలతో పాటు సూచించిన ఫార్మాట్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతులు దరఖాస్తులను స్వయంగా లేదా పోస్టు ద్వారా ఇవ్వాల్సిన చిరునామా: డిప్యూటీ డైరెక్టర్, కొబ్బరి అభివృద్ధి బోర్డు, రాష్ట్ర కార్యాలయం, డోర్ నంబర్ 54–14/5–18ఎ, రోడ్ నెం.11, భారతి నగర్, నోవోటెల్ దగ్గర, రింగ్ రోడ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా – 520008.పోషకాలమయం కొబ్బరి నూనె!కొబ్బరి నూనెను తల నూనెగానే చాలా మంది ఉపయోగిస్తుంటారు. కానీ, పోషకాల నిలయమైన కొబ్బరి నూనెను వంటకు ఉపయోగించవచ్చు. మనుషుల ఆయుప్రమాణం ఎక్కువగా ఉండే కేరళ రాష్ట్రంలో వంటకు కొబ్బరి నూనెనే విరివిగా ఉపయోగిస్తారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు సమాచారం ప్రకారం.. ఈ నూనెలోని పోషకాలు, వంటకు ఉపయోగించే విధానాల గురించి తెలు సుకుందాం.ఆరోగ్యపరమైన ప్రయోజనాలుకొబ్బరి నూనె జీర్ణశక్తిని పెంచి వ్యాధులు, ఇన్ఫెక్ష న్లకు గురికాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇందులోని శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు హాని కలిగిస్తాయనుకుంటారు. కానీ అది నిజం కాదు. శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయి. దీన్లోని లారిక్ యాసిడ్ కొలెస్ట్రాల్.. రక్తపోటు వల్ల గుండెకు హాని కలగకుండా రక్షణనిస్తుంది కొబ్బరి నూనెలోని షార్ట్ అండ్ మీడియం చైన్ ఫ్యాటీ ఆమ్లాలు శరీర అధిక బరువును తగ్గిస్తాయి. అలాగే కొబ్బరినూనె వాడటం వల్ల ΄÷ట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా ఉంటుంది కొబ్బరినూనె వాడకం వల్ల థైరాయిడ్ ఇతర ఎండోక్రైన్ గ్రంథులు సక్రమంగా పనిచేస్తాయి శరీర మెటబాలిక్ రేటును పెంచుతుంది. ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది ఈ నూనెలో ఉండే యాంటీమైక్రోబియల్ లిపిడ్స్, లారిక్ యాసిడ్, కాప్రిలిక్ యాసిడ్లు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాల్ని కలిగి ఉంటాయి. కాబట్టి కొబ్బరి నూనె వాడకం వల్ల సంబంధిత వ్యాధులు దరి చేరవు కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి కూడా కొబ్బరి నూనెకు ఉంది.కొబ్బరి నూనెను వంటల్లో ఇలా వాడాలికొబ్బరి నూనె స్మోకింగ్ పాయింట్ 350 ఫారిన్హీట్ కాబట్టి ఈ నూనెను అన్ని రకాల వంటలకూ వాడొచ్చుకేకు వంటి వంటకాల్లో వెన్నకు బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగించొచ్చు అలాంటప్పుడు వెన్న పరిమాణంలో 25% తక్కువ కొబ్బరి నూనె వాడాలి పాప్కార్న్ తయారీకి కొబ్బరినూనెను వాడొచ్చు వర్జిన్ కోకోనట్ ఆయిల్ వెన్నలా ఉంటుంది. దీన్ని బటర్ మాదిరిగా బ్రెడ్ మీద పూసుకొని తినొచ్చు స్మూదీస్, సూప్స్, సాసుల్లో కలుపుకోవచ్చు ఈ నూనెతో అన్ని రకాల కూరగాయల వేపుళ్లు వండుకోవచ్చుపప్పు తాలింపులో వాడొచ్చు. ఆధారం: భారత ప్రభుత్వ సంస్థ ‘కొబ్బరి అభివృద్ధి బోర్డు’. -
సేంద్రియ పశుపోషణపై దృష్టి
‘ఆర్గానిక్ ఆహారోత్పత్తులు అనగానే మనకు చప్పున గుర్తొచ్చేది ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు. కానీ, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు కూడా ఆర్గానిక్ బుట్టలో ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తుంది. ప్రకృతి/సేంద్రియ సేద్య పద్ధతుల్లో సాగు చేస్తున్న రైతులు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ మంది మన దేశంలో ఉన్నారు. వారు పండిస్తున్న సేంద్రియ ఆహారాన్ని దేశీయంగా వినియోగిస్తుండడంతోపాటు చాలా రకాల సేంద్రియ ఉత్పత్తులను అనేక దేశాలకు మన దేశం ఎగుమతి చేస్తోంది. అయితే, సేంద్రియ పాలు/ పాల ఉత్పత్తులు, సేంద్రియ పశు / కోడి మాంసం తదితర ఉత్పత్తుల ఎగుమతి మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేదు.సేంద్రియ పశుపోషణ, సేంద్రియ కోళ్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి విధాన రూపుకల్పన కోసం కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఆర్గానిక్ లైవ్స్టాక్ ప్రొడక్షన్, సర్టిఫికేషన్ ప్రక్రియలకు సంబంధించి విధి విధానాలు, ప్రమాణాలను రూపొందించే కృషి ఊపందుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐసీఏఆర్ అనుబంధ సంస్థ జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఎన్ ఎంఆర్ఐ) ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తోంది. ఔత్సాహిక రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో ఇటీవల ఒక సమాలోచన కార్య శాలను సైతం ఎన్ ఎంఆర్ఐ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అసలు సేంద్రియ పద్ధతుల్లో పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం అంటే ఏమిటి? రసాయనాలు వాడకుండా పశుపోషణ ఎలా? వ్యాధుల నివారణ, చికిత్సకు రసాయనా లకు ప్రత్యామ్నాయం ఏమిటి? సేంద్రియ ధ్రువీకరణ పద్ధతులేమిటి? మన బలాబలాలు, సవాళ్లేమిటి? ఇటువంటి అంశాలపై విషయ నిపుణులు ‘సాక్షి సాగుబడి’తో ఏమన్నారంటే.. పంటలు/తోటలు లేదా జంతువులు / కోళ్లను రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు, హార్మోన్లు, అల్లోపతి మందులు వంటి సింథటిక్ ఉత్పాదకాలను ఉపయోగించకుండా పెంచటాన్ని సేంద్రియ వ్యవసాయంగా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. ఈ విధంగా రసాయ నాలు, జన్యుమార్పిడి ఉత్పాదకాలు వాడకుండా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచే ఆహారోత్పత్తులకు దేశ విదేశీ మార్కెట్లలో గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. ధ్రువీకరణ ప్రమాణాలకు అనుగుణంగా పెంచిన ఆరోగ్యదాయక మైన సేంద్రియ ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లతో పాటు సేంద్రియ పాలు, మాంసం, కోడిగుడ్లు, విలువ ఆధారిత సేంద్రియ ఆహారోత్పత్తులకు అధిక సొమ్ము చెల్లించటానికి ధనిక, మధ్యతరగతి వినియోగ దారులు వెనుకాడటం లేదు. ఈ ట్రెండ్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కనిపిస్తోంది. ప్రపంచ సేంద్రియ మార్కెట్ జోరుఆర్గానిక్ పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. సేంద్రియ పాల మార్కెట్ ఏటా 6% పెరుగుతోంది. 2020లో 2 వేల కోట్ల డాలర్లుగా ఉండగా, 2026 నాటికి 3,200 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. అదేవిధంగా సేంద్రియ మాంసం ఉత్పత్తుల మార్కెట్ 7% పెరుగుతోంది. 2020లో 1,500 కోట్ల డాలర్ల నుంచి 2025 ఆఖరు నాటికి 2 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఆర్గానిక్ ఎగ్ మార్కెట్ మరింత వేగంగా 12.5% పెరుగుతోంది. 2023లో 370 కోట్ల డాలర్ల వ్యాపారం జరగ్గా 2032 నాటికి ఇది 1,070 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. 20% పెరుగుతున్న దేశీయ మార్కెట్మన దేశంలో సేంద్రియ ఆహారోత్పత్తుల మార్కెట్ ఏటా 20% పెరుగుతోంది. కోవిడ్ తర్వాత సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. అనధికారిక పద్ధతుల్లో మార్కెటింగ్ ఊపందుకుంది. ఉత్పత్తిదారు నుంచి వినియోగదారులు నేరుగా కొంటున్నారు. ప్రభుత్వం ప్రకృతి/ సేంద్రియ పంటల సాగును చాలా ఏళ్లుగా విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు సేంద్రియ పాడి పశువుల పెంపకం, సేంద్రియ గొర్రెలు/మేకల పెంపకం, సేంద్రియ కోడిగుడ్లు, కోడి మాంసం పెంపకంపై ఇప్పుడు దృష్టి సారించింది. ఎన్ పీఓపీ, పీజీఎస్ సర్టిఫికేషన్లు2023–24లో మన దేశంలో 44.75 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగు జరుగుతోంది. దీనితో పాటు 28.5 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం నుంచి సేంద్రియ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలున్న నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ పీఓపీ) సర్టిఫికేషన్ కలిగిన రైతులు 36 లక్షల టన్నుల సేంద్రియ దిగుబడులు పండించారు. దేశీయంగా అమ్ముకోవడానికి ఉద్దేశించిన పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్) సర్టిఫికేషన్ ఉన్న రైతులు 6.20 లక్షల టన్నులు పండించారు. ఈ రెండు రకాల సర్టిఫికేషన్లు పంటలతో పాటు పాలు, మాంసం, గుడ్లు, తేనె, ఆక్వా ఉత్పత్తులకు కూడా ఇస్తారు. ఎగుమతులకు అవకాశాలు2023–24లో 2,61,029 టన్నుల (వీటి ఖరీదు రూ.4,008 కోట్లు) సేంద్రియ పత్తి, నూనెగింజలు, చెరకు, ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలను భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేశాం. అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్, శ్రీలంక, స్విట్జర్లాండ్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు మనం సేంద్రియ ఉత్పత్తులు అమ్మాం. ఆయా దేశాల సేంద్రియ ప్రమాణాలకు తగిన రీతిలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్లు మన రైతులు ఉత్పత్తి చేస్తే, వాటిని ఎగుమతి చేయటం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేసియా, కెనడా దేశాల్లో సేంద్రియ మాంసం, గుడ్లు, పాలు, తేనెకు డిమాండ్ ఉంది. ఆ మార్కెట్ల ప్రత్యేక నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు మౌలిక సదుపాయాలు, ఏర్పాటు చేసే పటిష్టమైన సమగ్ర విధానంతో పాటు రైతుల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ పశుపోషణలో ఎన్ ఎస్ఓపీ ప్రమాణాలు కీలకంసేంద్రియ పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తి చెయ్యాలనుకునే రైతులు, సంస్థలు నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ ఎస్ఓపీ) ప్రమాణాలు పాటించాలి. అవి: సహజ బ్రీడింగ్ పద్ధతులను అనుసరించటం.. జంతువుల ఆరోగ్యం– సంక్షేమానికి రక్షణ చర్యలు తీసుకోవటం.. సేంద్రియంగా పండించిన దాణాను, పశుగ్రాసాలను మేపటం.. పశువులను ఒకేచోట కట్టేసి ఉంచకుండా సహజ ప్రవర్తనను వ్యక్తీకరించేలా స్వేచ్ఛనివ్వటంతో పాటు ఒత్తిడిని తగ్గించడం ముఖ్యం. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అల్లోపతి ఔషధాలు, యాంటీబయాటిక్స్, హార్మోన్లు, పెరుగుదలకు బూస్టర్లు, దాణా మిశ్రమాలు మొదలైన వాటి వాడకంపై నూటికి నూరు శాతం నిషేధం పాటించాలి. పెంచే పశువులు, జీవాల జాతుల ఎంపిక.. దాణా, ఆరోగ్య సంరక్షణ, పెంపకం, పేడ, మూత్రాల నిర్వహణ, సేంద్రియ పెంపక పద్ధతులకు మారే కాలం, షెడ్ల నిర్మాణంలో మెళకువలు, విశాలమైన స్థలం ఆవశ్యకత, ప్రతి పశువుకు గుర్తింపు చిహ్నం ఇవ్వటం, రవాణా పద్ధతులు, వధ–కోత అనంతర నిర్వహణలో నిర్దిష్ట పద్ధతులు పాటించాలి. అన్ని విషయాలపై రికార్డులు తయారు చేయటం ముఖ్యమైన విషయం. ఈ ప్రమాణాలు పాటిస్తూ సేంద్రియ పద్ధతులను అలవాటు చేసుకోవటంలో రైతులకు, విస్తరణ సిబ్బందికి అవగాహన కల్పించటం కోసం హయత్నగర్లోని ‘క్రీడా’ ప్రదర్శన క్షేత్రంలో సేంద్రియ గొర్రెల పెంపక యూనిట్ను ప్రారంభించాం. ఎన్పీఓపీ ధ్రువీకరణ ప్రమాణాలు పాటిస్తున్నాం. సేంద్రియ పశుపోషణ ద్వారా పాలు, మాంసం, సేంద్రియ కోళ్ల పెంపకంలో ఆసక్తి గల రైతులు, రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్పీఓలు), సహకార సంఘాలకు ప్రామాణిక శిక్షణ ఇస్తాం. – డాక్టర్ పి. బస్వారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్ఐ), చెంగిచర్ల, హైదరాబాద్ 040–29801672ఏ జాతులనైనా సేంద్రియంగా పెంచవచ్చువిదేశాల్లో పంటలు పండించే పొలాలు, పశువుల్ని పెంచే క్షేత్రాలు కలిసి ఉండవు. మన దేశంలో పంటలు సాగు చేసే రైతులకు పశువుల పెంపకం కూడా ఉంటుంది. ప్రకృతి/సేంద్రియ సేద్యంలో పంటలు పండించే రైతుల పొలాల్లోనే సేంద్రియంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయి. వారి సొంత పంట వ్యర్థాలను, సొంత ధాన్యాలను పశువులకు మేపటం ద్వారా నాణ్యతా ప్రమాణాలను సులువుగా ఆచరించవచ్చు. నేల–పశువు–పంట.. ఈ మూడింటి మధ్య సేంద్రియ అనుసంధానం చెయ్యాలి. ఈ విషయంలో మన దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఉన్న నైపుణ్యాలు వరంగా ఉపయోగపడతాయి. విదేశాలతో పోల్చితే రసాయనాలకు పెద్ద పీట వెయ్యని దేశం మనది. వ్యవసాయ రసాయనాలు వాడకం తక్కువగా ఉన్న కొండ/గిరిజన ప్రాంతాలపై తొలుత దృష్టిని కేంద్రీకరించి, ప్రోత్సహించాలి. దేశీ, నాటు పశువులను మాత్రమే సేంద్రియ పెంపకానికి వాడాలనేం లేదు. సంకరజాతి పశువులను నిస్సందేహంగా పెంచవచ్చు. – డాక్టర్ మహేశ్ చందర్, ప్రధాన శాస్త్రవేత్త, జాతీయ పశుపోషణ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐవీఆర్ఐ), ఇజ్జత్నగర్, ఉత్తరప్రదేశ్పశు వ్యాధులకు సంప్రదాయ ఈవీఎం చికిత్స మేలుపశు వ్యాధుల నివారణలో, చికిత్సలో యాంటీబయాటిక్ ఔషధాలను అతిగా వాడుతూ వాటికి నిరోధకత పెంచుకోవటం ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. సుసంపన్న సంప్రదాయ సిద్ధ, ఆయుర్వేద విజ్ఞానంతో కూడిన మూలికా వైద్య చికిత్స (ఎత్నో వెటర్నరీ మెడిసిన్ –ఈవీఎం)ల ద్వారా పశువ్యాధులను జయించవచ్చు. 24 ఏళ్లుగా ఈవీఎంలపై కృషి చేస్తున్నా. వీటి పనితీరు ఎంత ప్రభావశీలంగా ఉందో 9 రాష్ట్రాల్లో 25 ఎన్ డీడీబీ అనుబంధ పాడి సహకార సంఘాల్లోని రైతుల అనుభవాలే తేటతెల్లం చేస్తున్నాయి. పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి అనేక తీవ్ర జబ్బులను సైతం కొద్ది రోజుల్లో ఈవీఎం మందులతో తగ్గించవచ్చని రుజువైంది. 11.2 లక్షల కేసుల్లో 80.4% జబ్బులు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీఎంల ప్రభావశీలతను గుర్తించింది. ఈవీఎంకు ఎవిడెన్ ్స బేస్డ్ మెడిసిన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, కచ్చితంగా ఫలితాలనిచ్చే పర్యావరణ హితమైన, ఆరోగ్యదాయకమైన చికిత్సలని గుర్తించాలి.– ప్రొ. ఎన్ . పుణ్యమూర్తి, ఎన్ డీడీబీ కన్సల్టెంట్, టిఎఎన్ యువిఎఎస్ విశ్రాంత ఆచార్యులు, తంజావూరు, తమిళనాడుసమగ్ర విధానం ద్వారా రైతులకు మార్గదర్శనంప్రకృతి/సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆర్గానిక్ మాంసం, గుడ్లు, పాలు/పాల ఉత్పత్తుల పెంపకంపై కూడా దృష్టిని కేంద్రీకరించింది. సేంద్రియ మాంస ఉత్పత్తుల పెంపకం, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పారిశ్రామికవేత్తల ఆకాంక్షలతో పాటు మా అనుభవాలను జోడించి కేంద్రానికి నివేదిక పంపుతాం. సమగ్ర విధాన రూపకల్పనకు ఇది దోహదం చేస్తుంది. సేంద్రియ పశుపెంపకంపై పరిశోధనలకు, విస్తరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. అపెడాలో సేంద్రియ పశు పెంపకం ప్రోత్సాహానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చెయ్యాలి. అమూల్ వంటి నమ్మదగిన బ్రాండ్ ద్వారా విక్రయిస్తే సేంద్రియ పాలు, గుడ్లు, మాంసం అధిక ధర ఇచ్చి కొనటానికి దేశంలో ప్రజలు ఆసక్తితో ఉన్నారు. యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు సేంద్రియ పాలు, మాంసం ఎగుమతి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసక్తి గల రైతులు మమ్మల్ని సంప్రదిస్తే మార్గదర్శనం చేస్తాం. – డా. ఎస్. బి. బర్బుదే, సంచాలకులు, ఐసీఏఆర్– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్ఐ), చెంగిచర్ల, హైదరాబాద్ – పంతంగి రాంబాబు -
దేశీ వరి ‘ప్రజ్ఞ’ : బాలింతలు, గర్భవతులు, పీసీఓడీ సమస్యలకు ప్రత్యేకం
పది వేల సంవత్సరాల వ్యవసాయ సంస్కృతి వారసత్వానికి సజీవ సాక్ష్యాలు మనకున్న దేశీ వరి వంగడాలు. వరి పంట జీవవైవిధ్యానికి మూలాధారమైన ప్రాంతంగా భారతావనికి ప్రపంచవ్యాప్త గుర్తింపుంది. అనాదిగా రైతులు అనంతమైన జీవన గమనంలో తమకు తారసపడిన అపురూప సుగుణ సంపత్తి గల వరి వంగడాలను గుర్తించి, వాటిని జాగ్రత్తగా సాగు చేస్తూ, ఆ పంటలో నుంచే మేలైన పనితీరు చూపిన ధాన్యాన్ని విత్తనాలుగా ఎంపిక చేసి ఇతర రైతులతో పంచుకుంటూ ఉన్నారు. ఈ వారసత్వ వ్యవసాయక పరంపరలో నుంచి వచ్చినవి కాబట్టే వీటిని హెయిర్లూమ్ వెరైటీస్ అని హెరిటేజ్ రైస్ వెరైటీస్ అని ఆత్మగౌరవం ఉప్పొంగేలా ఇప్పటికీ పిలుచుకుంటూ ఉన్నాం. అధిక జనాభాలకు తగిన అధిక దిగుబడుల కోసమని అందుకు అనుగుణమైన అతికొద్ది రకాలను వాణిజ్యపరమైన సాగు కోసం రూపొందించు కున్నాం. అయితే, ఈ హరితవిప్లవ క్రమంలో వ్యాప్తిలోకి తెచ్చిన ఇంప్రూవ్డ్ వంగడాల్లో పోషక / ఔషధ విలువలు ఉన్నాయా లేదా అన్న గ్రహింపు లేకుండా అరవయ్యేళ్లు గడిచిపోయాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) – భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) సంయుక్తంగా రెండేళ్ల క్రితం వెల్లడించిన అధ్యయనం ప్రకారం.. గత ఏభయ్యేళ్లలో మనం విరివిగా పండిస్తున్న వరి, గోధుమ వంగడాల్లో పోషకాలు 45% తగ్గిపోయాయి. విషతుల్య పదార్థాలైన భార లోహాలు వచ్చి చేరాయి. ఇదీ చదవండి: Kullakar Rice : అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు 3 నెలల్లోనే ఫలించిన కలరసాయనిక సేద్యం, పెచ్చరిల్లిన కాలుష్యం మూలాన ఈ విషతుల్య పదార్థాలు మన ధాన్యంలోకి చేరిపోతున్నాయని తేలింది. నేలలో ఉన్న విషతుల్య పదార్ధాలను తీసుకోకుండా జాగ్రత్తపడే ‘ప్రజ్ఞ’ను ఈ ఆధునిక వంగడాలు కోల్పోవటం వల్లే బియ్యంలోకి భార లోహాలు చేరుతున్నాయని కూడా ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. మనం విస్మరించిన దేశీ వరి వంగడాలకు ప్రకృతే ఈ ‘ప్రజ’ను సమకూర్చింది. దేశీ వరితో కూడిన ఆరోగ్య జీవన విధానం ఇదే! బాలింతలు, గర్భవతులు, పిసిఓడి సమస్యలు ఉన్న వారు కుల్లాకర్ బియ్యాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యం పొందదవచ్చు లేదా ఆరోగ్య సమస్యలు తగ్గించుకునే పద్ధతులు. గర్భవతులు,పాలిచ్చే తల్లులకు సూచనలు: గర్భవతులు 3వ నెల నుంచి ఇలా చేయాలి. వెండి గిన్నెలో దేశీ ఆవు పాలను రాత్రి పూట తోడు పెట్టి పెరుగు తయారు చేసుకోవాలి. కుల్లాకర్ బియ్యంతో అన్నం వండి ఆ పెరుగుతో కలిపి ఉదయపు అల్పాహారం (బ్రేక్ఫాస్ట్)గా తినాలి. పాలు ఇచ్చే తల్లులకు కుల్లాకర్ బియ్యంతో పాల తాలికలు చేసి సాయంత్రం వేళల్లో వారంలో రెండు సార్లు పెట్టాలి. లేదా.. కుల్లాకర్ బియ్యంతో పరమాన్నం చేసి సాయంత్రం ఆహారంగా వారంలో రెండు రోజులు పెట్టాలి. కుల్లాకర్ అన్నాన్ని రోజూ మధ్యాహ్న భోజనంలో కుటుంబంలో అందరూ తినవచ్చు. కుల్లాకర్ బియ్యాన్ని 3 గంటలు నానబెట్టి, ఇత్తడి పాత్రలో ఎసరు పెట్టి అన్నం వండుకొని ప్రతి రోజూ మధ్యాహ్నం తినాలి. కనీసం 8 వారాలు అలా చేయాలి. ఇదీ చదవండి: ట్రెల్లిస్ : అవకాడో, దానిమ్మ.. ఇలా పండించవచ్చు!పీసీఓడి సమస్యలు ఉన్న మహిళలు, గర్భాశయ సమస్యలు, రుతుక్రమంలో సమస్యలు వున్న వారు కుల్లాకర్ బియ్యాన్ని ఉపయోగించే విధానాన్ని జాగ్రత్తగా గమనించి పాటించాలి. కుల్లాకర్ బియ్యంతో రాత్రి పూట అన్నం వండాలి. ఒక కప్పు బియ్యానికి 6 కప్పుల నీళ్ళు ఇత్తడిపాత్రలో పోసి ఎసరు పెట్టి వండాలి. పాతకాలం ఇత్తడి గిన్నె లేదా మట్టి పాత్రలో వండాలి. గంజి వంచాలి. ఆ గంజిని పక్కన పెట్టి, మరునాడు సాయంత్రం 4 గంటలకు తాగాలి. వండిన అన్నాన్ని ఇత్తడి పాత్ర నుంచి తీసి వేసి మట్టి పాత్ర లేదా స్టీల్ పాత్రలో వుంచి అన్నం మునిగే వరకూ నీళ్లు పోసి రాత్రంతా వుంచాలి. మరునాడు పొద్దున్నే నానిన అన్నం నుంచి నీటిని వేరు చేయాలి (ఆ నీటిని సాయంత్రం గంజి నీళ్లలో కలిపి తాగలి). నానిన అన్నానికి మజ్జిగ కలిపి దాన్ని బ్రేక్ఫాస్ట్లో తినాలి. అలా 40 రోజులు చేయాలి. ఇతర ఆహారాలు, పండ్లు, ఊరగాయలు ఏవీ కూడా దీనితో కలిపి బ్రేక్ఫాస్ట్లో తినకూడదు. రోజూ చేయలేని వారు ఇలా వారంలో కనీసం 5 రోజుల చొప్పున 8 వారాలు చేయాలి. – ఎం. సురేంద్రనాద్, దేశీ ఆహార చైతన్య ప్రచార కార్యక్రమం, సేవ్ స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్చదవండి: ఓ మహిళ పశ్చాత్తాప స్టోరీ : ‘భర్తలూ మిమ్మల్ని మీరే కాపాడుకోండయ్యా!’ -
ట్రెల్లిస్ : అవకాడో, దానిమ్మ.. ఇలా పండించవచ్చు!
ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ లేదా తీగజాతి పంటలను Y ఆకారంలో ఉండే ఇనుప ట్రెల్లిస్ పద్ధతిలో సాగు చెయ్యటం తెలిసిందే. అయితే, ఫ్రటెల్లి ఫ్రూట్స్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ (ఎఫ్పీసీ) దానిమ్మ, అవకాడో వంటి పొద పంటలను సైతం వినూత్నంగా ఈ పద్ధతిలోనే సాగు చేస్తోంది. మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్ సమీపంలో పింపాల్గోన్ బసంత్ వద్ద ఫ్రటెల్లి ఫ్రూట్స్ వ్యవసాయ క్షేత్రం ఉంది. అనంత్ బి మోర్ దీనికి చైర్మన్గా ఉన్నారు. భారతీయ ఉద్యాన తోటల సాగు రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. డ్యూక్ 7 వేరు మూలంపై గ్రాఫ్ట్ చేసిన మలుమ అవకాడో చెట్లను, భగువ రకం దానిమ్మ చెట్లను ట్రెల్లిస్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రెసిషన్ ఫార్మింగ్లో భాగంగా ట్రెల్లిస్ పద్ధతిలో ద్రాక్షతో పాటు దానిమ్మ, అవకాడో తోటలను పెంచుతున్నారు. మొక్కలు నాటేటప్పుడే శాస్త్రీయ పద్ధతిలో నేలను సిద్ధం చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ, ఆధునిక నీటి యాజమాన్య పద్ధతిని అనుసరిస్తున్నారు. కొమ్మలను ట్రెల్లిస్కు అనుగుణంగా ప్రూనింగ్ చేస్తూ పెంచుతున్నారు. కొమ్మలన్నిటికీ సూర్యరశ్మి, గాలి తగలడానికి, కాయ కోతకు, పిచికారీ చేసే ద్రావణాలు/ పురుగుమందులు చెట్టు మొత్తానికీ అందించడానికి, సమర్థవంతంగా చీడపీడలను నియంత్రించ డానికి.. ఇలా ఈ పద్ధతి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. కాయలన్నిటికీ ఎండ తగిలేలా చూడటం ద్వారా మచ్చలు లేని, నిగారింపుతో కూడిన నాణ్యమైన కాయలను పండిస్తోంది ఫ్రటెల్లి ఫ్రూట్స్ ఎఫ్పీసీ. సమస్యాత్మక వాతావరణ పరిస్థితుల్లో, భారీ వర్షాల తర్వాత కూడా ఆరోగ్యదాయకమైన దానిమ్మ పండ్ల దిగుబడి తీస్తుండటం విశేషం. ఎఫ్పీసీ సభ్యులైన రైతులకు అధిక దిగుబడులు సాధించడానికి లాభదాయకమైన, మెరుగైన సాగు పద్ధతులపై ఈ ఎఫ్పీసీ శిక్షణ ఇస్తోంది. చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!25–26 తేదీల్లో బయోచార్పై జాతీయ సదస్సుభూసారం పెంపుదలతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగించటంలో ప్రత్యేక పద్ధతుల్లో తయారు చేసే కట్టె బొగ్గు (బయోచార్) ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. అంతర్జాతీయంగా కార్బన్ క్రెడిట్స్ పొందే అవకాశం ఉండటంతో రైతులతో పాటు అనేక మంది వ్యక్తులు, వాణిజ్య సంస్థలు బయోచార్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25,26 తేదీల్లో ‘ప్రోగ్రెస్సివ్ బయోచార్ సొసైటీ, హైదరాబాద్’ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసఫ్గూడలోని ఎన్ఐ–ఎంఎస్ఎంఈ (నిమ్స్మే) ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర వివరాలకు.. సొసైటీ అకడమిక్స్ డైరెక్టర్ డా. ఎం.ఎ. ఆరిఫ్ ఖాన్ – 97018 76662. -
ఆక్వాలో కొత్త అధ్యాయం : చందువా పార
తీర ప్రాంతంలోని ఆక్వా రైతులు ఉప్పునీటిలో పెంచదగిన జలపుష్పాల జాబితా చాలా తక్కువ. ఒకటి, రెండు రకాల ఉప్పునీటి రొయ్యలే అధికంగా సాగు చేస్తారు. వీటికి జబ్బులు సోకినప్పుడు ప్రత్యామ్నాయంగా ఉప్పునీటిలో సాగు చేయటానికి పండుగప్ప తర్వాత అంతకన్నా ఖరీదైన Indian Pompano ఇండియన్ పాంపనొ (చందువా పార) చేప ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇది వేగంగా పెరుగుతుంది. రుచిగా ఉంటుంది. సాగులో రొయ్యలు, పంచుగప్ప చేపతో పోల్చితే రైతులకు రిస్క్ చాలా తక్కువ. మరణాల శాతం తక్కువ. అయితే, దీని హేచరీ అందుబాటులో లేక΄ోవటం పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు ఆ కొరత తీరింది. విశాఖపట్నంలోని భారతీయ సముద్ర చేపల పరిశోధనా సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ) ప్రాంతీయ కార్యాలయ శాస్త్రవేత్తల సుదీర్ఘ పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. సముద్రంలో పెరిగే చందువా జాతి చేపలను కోస్తాప్రాంతంలో ఉప్పునీటి చెరువుల్లో పెంచడానికి అవసరమైన కాప్టివ్ బ్రీడింగ్, సీడ్ ప్రొడక్షన్ వంటి సాంకేతికతలన్నీటినీ సిఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చెరువుల్లోనే కాదు సముద్రతీరంలోని తక్కువ లోతులో నీటిపై తేలాడే పంజరాలను ఏర్పాటు చేసి చందువా పార చేపలను సాగు చేసే మారికల్చర్ టెక్నాలజీని కూడా సీఎంఎఫ్ఆర్ఐ రూపొందించింది. విశాఖ కార్యాలయంలో ఏర్పాటైన మారికల్చర్ ప్రయోగశాలలో చందువా పారతో పాటు బొంతలు (గ్రూపర్స్), అప్పాలు చేప (జాన్స్ స్నాపర్) వంటి జాతులపై కూడా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. కోస్తా ప్రాంత ఆక్వా రైతులు వైరస్ తదితర జబ్బులు, తుపాన్లు, ఎగుమతి మార్కెట్లలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎగుమతి మార్కెట్ కోసం పెంచే రొయ్యలతోపాటు.. స్థానిక ప్రీమియం మార్కెట్ల కోసం పంట మార్పిడిగా పెంచే అధిక ధర గల చందువాపార వంటి చేపల సాగు సాంకేతికతలు అందుబాటులోకి రావటం ఆక్వా రైతులకు నిజంగా శుభవార్త. సీఎంఎఫ్ఆర్ఐ రూపొందించిన ‘చందువా పార’ చేపల సాగు పద్ధతులను సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం....చందువాపార ఆక్వాకల్చర్ రంగంలో వచ్చే కొద్ది ఏళ్లలో కొత్త అధ్యాయాన్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.) ఆర్థిక తోడ్పాటుతో బ్లూరెవెల్యూషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లోని అనేక కోస్తా ప్రాంత చెరువుల్లో చందువాపార చేపలను సీఎంఎఫ్ఆర్ఐ ప్రోత్సహించి సాగు చేయించింది. సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయంలో సీనియర్ శాస్త్రవేత్తలు శేఖర్ మేగరాజన్, రితేష్ రంజన్, బిజి జేవియర్, శుభదీప్ ఘోష్, పొన్నగంటి శివ, నరసింహులు సిద్ధు, ఆర్.పి. వెంకటేష్, ఇమెల్డా జోసెఫ్లు సంయుక్తంగా అందించిన వివరాల ప్రకారం చందువాపార సాగులో అనేక దశల్లో చేపట్టాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతుల విశేషాలు ఇలా ఉన్నాయి.చెరువును సిద్ధం చేయటం...చెరువు అంతటినీ 1.5 మీటర్ల లోతున సమతలంగా ఉండేలా రూపొందించాలి.పాత చెరువుల్లో ఈ చేపలను పెంచుతూ ఉంటే, చెరువు అడుగున పేరుకున్న వ్యర్థాలను తొలగించి, దుక్కి చెయ్యాలి. చందువాపార చేపల సాగుకు నీటి ఉదజని సూచిక (పిహెచ్) సగటున 7.5–8.5 మధ్యన ఉండాలి. మట్టి పిహెచ్ ఎంత ఉందన్న దాన్ని బట్టి చెరువును సిద్ధం చేసేటప్పుడు ఎంత సున్నం చల్లాలో ఆధారపడి ఉంటుంది.నీటి యాజమాన్యం...చెరువును సిద్ధం చేసిన తరువాత కాలువ నీటిని లేదా రిజర్వాయర్ నీటిని నేరుగా చెరువులోకి నింపవచ్చు. నీటిని నింపేముందు 100 మైక్రోమీటర్ల కన్నా తక్కువగా ఉండే ఫిల్టర్ బ్యాగ్లను విధిగా ఉపయోగించాలి. చెరువు నీటిలోకి అవాంఛనీయ చేపల పిల్లలు రాకుండా ఉండేందుకు ఈ ఫిల్టర్లు అవసరం. 10 పిపిఎం క్లోరినేషన్ ద్వారా చెరువును శుద్ధి చెయ్యాలి. నాలుగురోజుల తర్వాత క్లోరినేషన్ నీటిలో యూరియా (2.5 పిపిఎం), ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ (టిఎస్పి) (3పిపిఎం) వాడి చెరువు నీటి నాణ్యతను సరిచేయాలి. చెరువులో సేంద్రియ లేదా రసాయనిక ఎరువులు వేసుకోవటం ద్వారా ప్లవకాల (ప్లాంక్టన్)ను వృద్ధి చెయ్యాలి. ప్లాంక్టన్ చెరువు నీటిలో పెరిగితేనే నీటి నాణ్యత సరిగ్గా ఉంటుంది. చందువా పార చేలు 5 నుంచి 40 పిపిటి వరకు ఉప్పు నీటిని తట్టుకోగలవు. అయితే, 15–35 పిపిటి మధ్యలో నీటి ఉప్పదనం ఉంటే మంచి అనుకూల వాతావరణం ఉంటుంది.చేపపిల్లల రవాణా...అత్యంత శ్రద్ధతో చేపపిల్లల రవాణా చెయ్యాలి. ఈ క్రమంలో ఒత్తిడి కలిగితే చేప పిల్లలకు సూక్ష్మ క్రిములు సోకడమే కాకుండా అవి చని΄ోయే పరిస్థితి కూడా వస్తుంది. ఆక్సిజన్ సరఫరా ఉండేలా సెంటెక్స్ ట్యాంకుల్లో గానీ పాలిథిన్ బ్యాగుల్లో గానీ తీసుకెళ్లాలి. చేపపిల్లల సైజు, ప్రయాణ వ్యవధి, చేపపిల్లల సంఖ్య, రవాణా పద్ధతిని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. నర్సరీ పెంపకం : నర్సరీ పెంపకంలో ఒక మీటరుకి 200 నుండి 280 పిల్ల చేపలు తగినంత స్టాకింగ్ డెన్సిటీగా చెప్పవచ్చు. చేపలు కృత్రిమ మేతకు అలవాటుపడతాయి. అయితే మేతలో మంచి పోషక విలువలు ఉండాలి. మొదటి దశలో ప్రోటీన్ 45%, కొవ్వు శాతం 111% చొప్పున శరీర బరువులో 10%, రోజుకు 4 – 5 సార్లు మేత ఇవ్వాలి. 2–3 గ్రాములు పెరిగిన పిల్లచేపలను 30–40 గ్రాములు వచ్చే వరకు 60 నుంచి 75 రోజుల పాటు పెంచాలి. ఆ తర్వాత పెంపకపు చెరువు (గ్రో–అవుట్ చెరువు) ల్లోకి మార్చాలి. ఆక్సిజన్ స్థాయిలు 4 పిపిఎం కన్నా ఎక్కువ ఉండేలా నిర్వహిస్తే∙90–95% చేపలు పెరిగి పెద్దవుతాయి.ఎకరానికి 5 వేలు : నర్సరీలో పెంచిన చేప పిల్లలను ఎకరాకు 5000 చొప్పున పెద్ద చెరువుల్లోకి వదలాలి. ఎయిరేటర్లను చెరువు నాలుగు దిక్కులా అమర్చాలి. క్రమం తప్పకుండా ఎరువులు చల్లుతూ నీటి నాణ్యత చూసుకుంటూ ఉండాలి. అధిక ప్రోటీన్తో కూడిన నీటిపై తేలాడే (40% ప్రోటీన్ – 10% కొవ్వు పదార్ధాలు) ఆహార గుళికలను చేప పిల్లలకు ఆహారంగా ఇవ్వాలి. మేత ఇస్తున్నప్పుడు గాలివాటానికి అనుగుణంగా, మేత వృథా కాకుండా పంజరపు లోపలి వలలో ఫీడ్ మెష్ ను (1 మీటర్లు లోతు) ఏర్పాటు చెయ్యాలి. తొందరగా జీర్ణం కావడం కోసం, ప్రతి 3 గంటలకొకసారి దాణా ఇవ్వాలి. ప్రతి పదిహేను రోజులకొకసారి చేపల బరువు తూచి, వాటి ఎదుగుదల ఆధారంగా దాణాను లెక్కవేసుకోవాలి. 10 నుంచి 20 గ్రాములు ఉన్న చేప పిల్లలని క్యూబిక్ మీటరుకు 1 నుంచి∙1.25 చొప్పున చెరువులో వదిలినప్పుడు.. 5–6 నెలల్లో 500–600 గ్రాములకు, 12 నెలల వ్యవధిలో కిలో బరువుకు పెరుగుతాయని గత అనుభవాలు చెబుతున్నాయి. అయితే, 100 గ్రాము సైజులో ఉన్నప్పుడు చెరువులో వేస్తే కేవలం 7 నెలల్లోనే కిలో సైజుకు పెరుగుతాయి. చెరువు అడుగు భాగంలో ఉండే చెత్తని, బురదని ఎప్పటికప్పుడు తీసివేసి, శుభ్రపరుస్తుంటే విష వాయువుల ప్రభావం తక్కువగా ఉండి నీటి నాణ్యత మెరుగ్గా ఉంటుంది.6 రాష్ట్రాల్లో మార్కెట్లు అనువైనవి : మార్కెట్ సైజుకు పెరిగిన చందువ పార చేపలను డ్రాగ్ నెట్ వల సహాయంతో అత్యంత సులువుగా పట్టుకుని వెలికితీయవచ్చు. బయటికి తీసిన చేపలను మొత్తాన్ని వెంటనే పరిశుభ్రమైన నీటిలో కడిగి, ఐస్ ముక్కల్లో పెట్టి, తాజాగా, నాణ్యత ΄ోకుండా చూడాలి. ప్లాస్టిక్ ట్రేలలో గానీ లేదా థర్మోకోల్ పెట్టెల్లో గాని పెట్టి, ఐస్ ముక్కలు చల్లి ప్యాక్ చేస్తారు. పెద్దమొత్తంలో సాగు చేయడమే కాకుండా, స్థానిక మార్కెట్లో గిరాకీని బట్టి బ్యాచ్ పధ్ధతిలో కూడా హార్వెస్ట్ చేయవచ్చు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లు చందువా పార చేపలను విక్రయించడానికి అత్యంత అనువైనవి. ఒక ఎకరాకు 5000 పిల్లలు వేస్తే కేజీకి రూ. 325 చొప్పున (ఇది పాత ధర) రైతుకు సుమారు రూ. 2.25 లక్షలు నికర లాభం వస్తుందని అంచనా.silver pompano fingerlingsచందువా పార చేపల విశేషాలు...శాస్త్రీయ నామం: ట్రాచినోటస్ మూకలీ. కుటుంబం: కారంగిడే (జాక్స్, పాంపానోస్). పరిమాణం: 10 గ్రాములు లేదా 2 అంగుళాల పిల్లలను చెరువుల్లో వేసుకుంటే 5–6 నెలల్లో అర కిలోకి పైగా సైజుకు పెరుగుతుంది. స్వరూపం: బాగా ఎదిగిన చేపలు బంగారు నారింజ రంగులో మెరిసి΄ోతూ ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా పొట్ట దగ్గర. ఆవాసం: తీర్ర ప్రాంత సముద్ర జలాలు, నదీ ముఖ ద్వారాలలో కనిపిస్తాయి. ఆహారం: తిండిపోతు. మాంసాహారి. అయితే, పండుగప్ప చేపల మాదిరిగా తమ జాతి చిన్న చేపలను పెద్ద చేపలు తినవు.ఆక్వాకల్చర్కు అనుకూలతలు: మెరుగైన మాంసం నాణ్యత, అధిక మార్కెట్ డిమాండ్ కారణంగా సముద్ర జలాల్లోని పంజరాల్లో, కోస్తా ప్రాంత ఉప్పునీటి చెరువుల్లో సాగుకు.. ఈ రెండింటికీ అనువైనది. వ్యాధి నిరోధకత: చాలా రకాల వ్యాధులను తట్టుకోగల నిరోధక శక్తి ఉండటం దీనికి గల మరో ప్రత్యేకత. కేజ్ కల్చర్: తీరప్రాంత సముద్ర జలాల్లో కేజ్ కల్చర్ ద్వారా విజయవంతంగా సాగవుతోంది, వాణిజ్య స్థాయిలో పెంచటానికి అనువైనది. సంతానోత్పత్తి: చందువా పార చేపలు ఫిబ్రవరి–ఏప్రిల్ నెలల్లో సంతానోత్పత్తి చేస్తాయి. విత్తనోత్పత్తి: సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు భారతీయ పాంపనో చేపల సంతానాభిద్ధి, లార్వా పెంపకం, నర్సరీ పెంపకం కోసం సాంకేతికతను అభివృద్ధి చేశారు. మార్కెట్ డిమాండ్: అధిక మార్కెట్ డిమాండ్ ఉంది. మంచి దేశీయ ధర పలుకుతోంది. రైతు నుంచి కిలో రూ. 35–450 వరకు పలుకుతోంది. వాణిజ్యపరంగా లాభదాయకమైన ఆక్వాకల్చర్ చేపల జాతిగా గుర్తింపు వచ్చింది. ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు: చందువా పార చేపల్లో ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెకు చాలా ఆరోగ్యకరమైనవి. అందువల్ల హెల్దీ ఫ్యాట్ వనరుగా నిపుణులు చెబుతున్నారు. చెరువలో నీటి నాణ్యత, రంగులను మెరుగ్గా ఉంచుకోవాలంటే ప్రతి 15 రోజులకోసారి ఎరువులు వేసుకోవాలి. కన్నా పెరిగిన సైజు పిల్లలను పెంపకపు చెరువులో వేసుకుంటే ఎక్కువ శాతం బతుకుతాయి.30 గ్రాముల కన్నా పెరిగిన సైజు పిల్లలను పెంపకపు చెరువులో వేసుకుంటే ఎక్కువ శాతం బతుకుతాయి. చెరువులో ఫీడింగ్ జోన్ను ఏర్పాటు చేసుకొని మేత వేస్తూ ఉంటే మేత వృథాని అరికట్టవచ్చు. నీటి నాణ్యత బాగుండాలంటే చెరువులోని నీటి పరిమాణంలో 25% నీటిని ప్రతి నెలా మార్చాలి. ఈ పని చేస్తే ప్రొబయోటిక్స్, వాటర్ కండిషనర్ మందులు వాడకుండా నివారించుకోవచ్చు.చెరువులో రోజుకు కనీసం 10 గంటల సేపు ఎకరానికి 2–3 పెడల్ వీల్ ఎయిరేటర్లను ఉపయోగించాలి. మంచి ఆదాయం రావాలంటే ఎకరానికి 5 వేల పిల్లలను వేసుకోవటం ఉత్తమం. -
అటు ఉల్లి ఒరుగులు, ఇటు మునగ పొడి : విదేశాల్లో గిరాకీ!
ఏ పంట పండించినా రైతులకు నికరంగా ఎంత ఆదాయం వస్తోంది అన్నదాన్ని బట్టే ఆ పంట మేలైనదా కాదా అనే విషయం ఆధారపడి ఉంటుంది. రైతుకు నికరాదాయం పెరగాలంటే ఏ పంటలు పండించాలి? పొట్టపో΄సుకోవటానికి ఎంతోచ్చినా చాల్లే అని అందరూ పండించే సాధారణ పంటలు పండిస్తే లాభం లేదు. విదేశాలకు అవసరమైన పంటలేవో గ్రహించి పండించి, ఎగుమతి చెయ్యాలి. ఈ విషయంలో గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. వాళ్లు పండించి ఎగుమతి చేస్తున్నవి ఇవీ: 1. తెల్ల ఉల్లిపాయ ఒరుగులు 2. మునగ ఆకుల పొడి!తెల్ల ఉల్లిపాయల ఒరుగులు అనాదిగా ఎగుమతి అవుతున్న సరుకు కాదు. ఇటీవల కాలంలోనే దీనికి విదేశాల్లో గిరాకీ వచ్చింది. ఆ అవకాశాన్ని అందరికన్నా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది గుజరాత్ రైతులే. ఆ తర్వాత మహారాష్ట్ర. విదేశాల్లో రెస్టారెంట్లు, హోటళ్లలో తెల్ల ఉల్లిపాయల ఒరుగుల్ని వాడుతున్నారు. అమెరికా, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లో ఈ ట్రెండ్ నడుస్తోంది. తెల్ల ఉల్లి పాయలకు ఎర్ర ఉల్లి పాయల కన్నా 30% అధిక ధర ఇచ్చి వ్యాపారులు కొంటున్నారు. అందుకే ఇవి పండిస్తున్నా అంటున్నారు గుజరాత్ భావ్నగర్ జిల్లా రైతు రాహుల్. తెల్ల ఉల్లి ఒరుగులు మన దేశంలో కిలోకి రూ. 130 ధర ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 2.5–3 డాలర్లు (రూ. 215–255) పలుకుతోంది. సరుకు నాణ్యత, దేశాన్ని బట్టి ధరల్లో మార్పుంటుంది. కొనే వారుంటే పండించే వారూ ఆసక్తి చూపుతారు. అలాగే తెల్ల ఉల్లి సాగు విస్తీర్ణం పెరుగుతూ వెళ్తోంది. మొత్తం ఉల్లి సాగు విస్తీర్ణంలో 40% తెల్ల ఉల్లిదే. గత ఏడాది గుజరాత్లో 81,011 హెక్టార్లు సాగైన ఉల్లి ఈ ఏడాది 93,500 హెక్టార్లకు పెరిగింది.ఇక రెండోది మునగ ఆకుల పొడి సంగతి. ప్రపంచంలో 80% మునగ సాగుతో భారత్ ముందుంది. మునగ సాగు, ఎగుమతిలో తమిళనాడు రైతులు అగ్రగామిగా ఉన్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లో రైతులు కూడా దీనిపై దృష్టి పెడుతున్నారు. ఉదాహరణకు పంజాబ్ రైతు పంకజ్ కుమార్. తోటి రైతులంతా వరి, గోధుమ పండిస్తుంటే ఆయన మాత్రం పదేళ్ల క్రితమే 1.5 ఎకరాల్లో మునగాకు పండించటం మొదలు పెట్టి, ఇప్పుడు పదెకరాలకు విస్తరించారు. జర్మనీ తదితర దేశాల్లో మునగాకు పొడికి గిరాకీ ఉంది. అందుకే మూడేళ్ల నుంచి అధిక సాంద్రతలో మునగాకును సాగు చేస్తున్నా అంటున్నారాయన. మునగ కొద్దిపాటి నీటి వసతితోనే వేగంగా పెరిగే పంట. అయితే, 6–10 ఏళ్ల తర్వాత పంట మార్పిడి చేయటం తప్పనిసరి అంటున్నారు సీనియర్ రైతులు. ఇంతకీ, ఇతర రాష్ట్రాల్లో రైతులు ముందున్నారా? అక్కడి ప్రభుత్వాలే రైతులచేత ముందడుగు వేయిస్తున్నాయా?? అని మనం ఆలోచించుకోవాలి. మనం ముందంజలో ఉండే పంటలు చాలా ఉన్నా.. ఈ రెండు పంటల విషయంలో ఇతర రాష్ట్రాలను చూసి మనమూ నేర్చుకుంటే మేలు! -
వ్యోమగాముల కోసం.. మూన్రైస్..భూమ్మీదా ఉపయోగమే
ఏ గ్రహంపైనైనా అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకొని పెరిగే అద్భుతమైన ‘అతి మరుగుజ్జు (సూపర్ డ్వార్ఫ్)’ వంగడం సిద్ధమైంది. రోదసీలోగానీ.. చంద్రుడు, అంగారకుడి మీదగానీ.. భూమిపైన ప్రత్యేక వాతావరణంలోనూ.. ఎడారుల్లో, ఇంట్లో కూడా ఇక వరి ధాన్యం పండించుకోవచ్చు. ఇటలీ అంతరిక్ష సంస్థ (ఐఎస్ఎ), మరో మూడు ఇటాలియన్ విశ్వవిద్యాలయాలతో కలిసి ఈ అద్భుత వరి వంగడాన్ని రూపొందించింది. చంద్రుడిపై మనుషుల దీర్ఘకాల మనుగడకు అవసరమైన విలక్షణ వరి వంగడాన్ని రూపొందించాలన్న లక్ష్యంతో ‘మూన్ రైస్’ పేరిట చేపట్టిన పరిశోధనా ప్రాజెక్టు విజయవంతమైంది.2–3 అడుగులు ఎత్తు పెరిగే పొట్టి (డ్వార్ఫ్) వరి వంగడాలు మాత్రమే మనకు తెలుసు. అయితే, ఈ సరికొత్త రకం కేవలం 4 అంగుళాల (10 సెంటీమీటర్లు) ఎత్తు మాత్రమే పెరుగుతుంది. అదీకాకుండా, అధిక మాంసకృత్తులు గల ధాన్యాన్ని దిగుబడినిస్తుందట. అంతరిక్ష యాత్రల్లో పాల్గొనే వ్యోమగాములు ముందుగా వండి ప్యాక్ చేసిన ఆహారంపైనే ప్రస్తుతం ఆధారపడుతున్నారు. తాజా పదార్థాలు వారి ఆహారంలో ఉండే అవకాశం లేదు. సుదీర్ఘ కాలం అంతరిక్ష యాత్రలో గడిపే వ్యోమగాముల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందటం లేదు. భూగోళానికి మరింత ఎక్కువ దూరంలో రోదసీలో పరిశోధనలు చేపట్టాలంటే విటమిన్లు, పీచుపదార్థం అధికంగా ఉండే ఆహారాన్ని అక్కడే పండించాలి. మూన్ రైస్ పరిశోధనా ప్రాజెక్టు ఈ లక్ష్యంతోనే ప్రారంభమైంది. ఐఎస్ఏ మొక్కల జీవశాస్త్రవేత్త మార్తా డెల్ బియాంకో ఈ పరిశోధన వివరాలను ప్రకటించారు. బెల్జియంలో సుప్రసిద్ధ ‘సొసైటీ ఫర్ ఎక్స్పరిమెంటల్ బయాలజీ’ వార్షిక సమావేశంలో ఇటీవల ఆమె ప్రసంగించారు.భూమ్మీద రైతులకూ ఉపయోగమేమూన్ రైస్ ప్రాజెక్టు పరిశోధనలు అంతరిక్ష సేద్యానికి పనికొచ్చే విషయాలకు మించిన ప్రయోజనాలను అందిస్తోంది. ఇది భూమిపై ఉండే రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ‘అత్యంత సమస్యాత్మక అంతరిక్షంలో పెరగటానికి రూపొందుతున్న ఈ అతి మరుగుజ్జు వంగడం ఆర్కిటిక్, అంటార్కిటిక్ ధ్రువాలకు దగ్గరి ప్రాంతాల్లో లేదా ఎడారుల్లో లేదా తక్కువ స్థలం ఉండే ఇళ్లలో కూడా నియంత్రిత వాతావరణంలో సాగుకు కూడా ఉపయోగపడుతుంది’ అని డెల్ బియాంకో తెలిపారు. వరి మొక్కలు అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణకు ఎలా స్పందిస్తాయనే అంశంపై కూడా శాస్త్రవేత్తల బృందం పరిశోధిస్తోంది.4 ఏళ్ల 9 నెలల పరిశోధనవరి జన్యుశాస్త్రంలో పట్టున్న మిలన్ విశ్వవిద్యాలయం, పంట శరీర ధర్మశాస్త్రంలో ప్రత్యేక కృషిచేస్తున్న రోమ్ విశ్వవిద్యాలయం, అంతరిక్ష పంటలపై పరిశోధనలో ఆరితేరిన నేపుల్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలసి ఇటలీ అంతరిక్ష సంస్థ పరిశోధనలు చేస్తోంది. ‘నాలుగేళ్ల 9 నెలల క్రితం ప్రారంభించిన పరిశోధనల్లో చాలా పురోగతి ఉంది. మిలన్ విశ్వవిద్యాలయంలో కేవలం 10 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే ఉత్పరివర్తన చెందిన వరి రకాలపై పరిశోధనలు కొలిక్కివచ్చాయి. ఇది గొప్ప ప్రారంభ విజయం. పంట ఎదుగుదల, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మొక్కల నిర్మాణాన్ని మార్చగల జన్యువులను రోమ్ విశ్వవిద్యాలయం గుర్తించి మార్పులు చేసింది. ప్రాథమిక ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. అంతరిక్షంలో మాంసాన్ని పెంచలేం. అందుకని ప్రొటీన్ అధికంగా ఉండేలా ఈ వంగడాన్ని అభివృద్ధి చేస్తున్నాం’ అన్నారు డెల్ బియాంకో.తాజా ఆహారం.. మానసిక ఆరోగ్యం!తాజా ఆహారం శరీర పోషణకు మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. అంతరిక్షానికి తీసుకెళ్లిన ముందే వండిన ఆహారం కొంత కాలం బాగా నే ఉంటుంది. దీర్ఘకాలం దానిపై ఆధారపడటం సాధ్యం కాదు. అందువల్ల అక్కడే వ్యోమగాముల కళ్ల ముందు పెరిగే పంట వంగడాలను రూపొందించటం ద్వారా వారికి తాజా ఆహారంతో పాటు ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని కూడా అందించాల్సి ఉంటుంది. వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు జరిగే తప్పుల వల్ల ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టానికి కూడా దారితీయొచ్చు.హార్మోన్ మార్పుతో..‘మన దగ్గర ఇప్పటికి ఉన్న పొట్టి వంగడాలు అంతరిక్ష వ్యవసాయానికి ఉపయోగపడటం లేదు. ఇంకా తక్కువ ఎత్తు పెరిగే రకం కావాలి. వరి మొక్కలో ఎత్తును ప్రభావితం చేసే గిబ్బరెల్లిన్ అనే హార్మోన్లో మార్పు చేశాం. కానీ, అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తటం కూడా ఒక సవాలు. అక్కడ పెరిగే పంట మరీ తక్కువ ఎత్తు ఉండటం ఒక్కటే చాలదు.. మంచి ఉత్పాదకతను కూడా ఇవ్వగలగాలి. ఇలాంటి వంగడాన్ని తయారుచేయటం అనేక సవాళ్లతో కూడినది’ – మార్తా డెల్ బియాంకో, ఐఎస్ఏ మొక్కల జీవశాస్త్రవేత్తసాక్షి, స్పెషల్ డెస్క్ -
రొయ్యలకు ప్రత్యామ్నాయం ‘పాంపనో’!
పంట మార్పిడి చెయ్యటం అనేది పంట పొలాల్లో మాదిరిగానే ఆక్వా సాగులోనూ అత్యవసరమైన విషయమే. తీరప్రాంతాల్లోని ఉప్పునీటి చెరువుల్లో వనామీ తదితర ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి చేయటానికి అవకాశాలు చాలా తక్కువ. సముద్రంలో పెరిగే జలజీవులను ఉప్పు నీటి చెరువుల్లో పెంచడాన్ని మారికల్చర్ అంటారు. ఈ దిశగా కేంద్రీయ సముద్ర చేపల పరిశో«ధనా సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ), జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(ఎన్ఎఫ్డీబీ) వంటి సంస్థల శాస్త్రవేత్తలు, అధికారుల కృషి ఫలితంగా రెండు సముద్ర చేపలు ఏపీ తీరప్రాంత చెరువుల్లో సాగులోకి వచ్చాయి. ఈ కోవలో మొదటిది సీబాస్ (పండుగప్ప)కు తాజాగా సముద్ర చేప పాంపనో (చందువా పార)తోడైంది.‘చందువా జాతికి చెందినదే పాంపనో కూడా. ఒకే ముల్లు ఉంటుంది. అయితే, పాంపనో చేప ముల్లు మరింత గట్టిగా ఉంటుంది. అంతే తేడా’ అని సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మెగారాజన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 2016లో పాంపనో పిల్లల ఉత్పత్తి సాంకేతికతను రూపొందించటంతో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఆ నేపథ్యంలోనే పాంపనో సాగును కృష్ణా తదితర జిల్లాల్లో అనేక చోట్ల 2020 తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) తోడ్పాటుతో ప్రోత్సహించామని, వందెకరాల్లో సాగవుతోందన్నారు. పాంపనో చేపల రుచి హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో చేపల వినియోగదారులకు ఇప్పటికే తెలుసు. తద్వారా పాంపనో చేపలకు మంచి మార్కెట్ ఉందని డా. మెగారాజన్ అన్నారు. సముద్రంలో చందువాల సంఖ్య తగ్గిపోవటంతో పాంపనో చేపలను చెరువుల్లో పెంచటం ద్వారా ఆక్వా రైతులు ఆదాయం పొందవచ్చన్నారు. పాంపనో సీడ్ ఉత్పత్తి సాంకేతికతను ఆర్నెల్ల క్రితమే ఒక ప్రైవేటు హేచరీకి సీఎంఎఫ్ఆర్ఐ బదిలీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఏర్పాటైన ఈ హేచరీ ఇప్పటికే పాంపనో సీడ్ ఉత్పత్తి ప్రారంభించింది. ఉప్పునీటి రొయ్యల చెరువుల్లో వైట్స్పాట్ వంటి వ్యాధులు అదుపులో ఉండాలంటే పంట మార్పిడి చేయాలి. అందుకు అన్ని విధాలా అనువైనది పాంపనో చేప. ఇప్పుడు సీడ్ అందుబాటులోకి రావటంతో పాంపనో సాగు విస్తరించే అవకాశం ఉందని అన్నారాయన.మూల పొలంలో పాంపనో సాగు!శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపొలం గ్రామంలోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్డీబీ)కి చెందిన ఇంటిగ్రేటెడ్ కోస్టల్ ఆక్వాకల్చర్ ఫెసిలిటీలోని చెరువుల్లో తొలిసారి సముద్ర చేపలు పాంపనో (చందువా పార), సీబాస్ (పండుగప్ప) సాగును ప్రారంభించారు. రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి చేయడానికి 2008లో 97.45 ఎకరాల భూమిని ఎన్ఎఫ్డీబీకి ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్ల క్రితం వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించడంతో ప్రాజెక్టు తొలి దశకు అడుగు ముందుకు పడింది. నర్సరీ చెరువులు, కల్చరల్ చెరువులు, సముద్రపు నీటిని తీసుకురావడం, బయటకు పంపించడం, వడపోత వ్యవస్థలు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక చెరువులో తొలిసారి 2024 జూలైలో పాంపనో (చందువా పార) సాగు టెక్నికల్ కన్సల్టెంట్ ఆంజనేయులు ప్రారంభించారు. చేప పిల్లలను సీఎఫ్టీఆర్ఐ ద్వారా తెచ్చి, రెండు నెలలు సీడ్ ట్యాంకుల్లో పెంచి, తర్వాత పెంపకపు చెరువులోకి మార్చారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు అ«ధికారులు, శాస్త్రవేత్తల సలహాతో 25 సెంట్ల చెరువులో 3 వేల పిల్లలను విడిచి పెట్టారు. 8 నెలలు పెంచిన తరువాత గత నెల 29న 900 కిలోల పాంపనో చేపల్ని పట్టుబడి చేసి విక్రయించారు. ఇంకో 900 కిలోల చేపలు ఉన్నాయి. అధిక విస్తీర్ణంలో సాగు చేయటం లాభదాయకమేనన్నారు. పాంపనో సాగులో నష్టం వచ్చే అవకాశాలు తక్కువన్నారు. చెరువు నీటిలో పాంపనో సాగు మొదటిసారి విజయవంతం కావడంతో అధికారులు ఆంజనేయులును అభినందించారు. ప్రస్తుతం మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నారు. అధికారులు, శాస్త్రవేత్తల మార్గదర్శ కత్వంలో టెక్నికల్ కన్సల్టెంట్ కె. ఆంజనేయులు పాంపనో మొదటి చేపల సాగు జయప్రదమైంది. దీంతో ఈ ప్రాంత ఆక్వా రైతుల్లో రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సముద్ర చేపల సాగుపై ఆశలు రేకెత్తుతున్నాయి. పాంపనో సాగులో రిస్క్ తక్కువ! ఇండియన్ పాంపనో (చందువా పార) నీటిలో ఉప్పదనం 5 నుంచి 40 పిపిటి వరకు తట్టుకొని పెరుగు తుంది. ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సాగు చేయొచ్చు. పండుగప్ప పెద్ద చేపలు చిన్న చేపలను తినేస్తాయి. అయితే, పాంపనోతో ఆ సమస్య లేదు. రొయ్యలకు మాదిరిగా ప్రాణాంతక వ్యాధులు ముసురుకోవు. వ్యాధుల రిస్క్ తక్కువ. 10 గ్రా./2 అంగుళాల పిల్లలను చెరువులో వేసుకుంటే.. 5–6 నెలల్లో 500–600 గ్రా. బరువు పెరుగుతాయి. పెల్లెట్ల మేతను చక్కగా తింటాయి. రైతుకు కిలో రూ. 350–450 ధర వస్తుంది. రైతులకు మంచి నికరాదాయం వస్తుంది. పాంపనో సాగు 3 కోస్తా జిల్లాల్లో మొదలైంది. వచ్చే ఐదేళ్లలో బాగా ప్రాచుర్యంలోకొస్తుంది. – డా. మెగారాజన్ (95057 68370) సీనియర్ శాస్త్రవేత్త, ఈఎంఎఫ్ఆర్ఐ ప్రాంతీయ కార్యాలయం, విశాఖపట్నం2 కిలోల మేతకు కిలో చేపసముద్రపు జాతుల చేపలను ఉప్పునీటి చెరువుల్లో పెంచ డాని (మారికల్చర్)కి అనుభవంతో పాటు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు శ్రద్ధగా పాటించటం అవసరం. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న భూమిలో పనులు మొదలుపెట్టి అధికారులు అప్పగించిన లక్ష్యాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉంది. 25 సెంట్ల చెరువులో సాధారణంగా వెయ్యి పాంపనో పిల్లలు వేస్తారు. అయితే, అధికారులు, శాస్త్రవేత్తల సలహాతో అధిక సాంద్రతలో 3 వేల పిల్లలను పెంచాం. కిలో చేప పెరగడానికి రెండు కిలోల మేత అవసరమైంది. పిల్లలన్నీ చక్కగా పెరగటం సంతృప్తినిచ్చింది. మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నాం. మున్ముందు ఈ చేపల పిల్లలను ఉత్పత్తి చేసి ఆక్వా రైతులకు విక్రయిస్తాం. – కె.ఆంజనేయులు, టెక్నికల్ కన్సల్టెంట్, ఎన్ఎఫ్డీబీ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ ఆక్వాకల్చర్ ఫెసిలిటీ, మూలపొలం, శ్రీకాకుళం జిల్లా – పిరియ ధర్మేంద్ర, సాక్షి, సోంపేట, శ్రీకాకుళం జిల్లా -
కూరగాయ పంటల్లో నెమటోడ్ల బాధలు, నిర్వహణ ఎలా?
టమాటోలు, మిరప తోటల్లో కొన్ని మొక్కలు వాడిపోయి, రంగుమారి ఉంటాయి. ఇతర మొక్కలు బాగున్నా ఇవి పసుపుపచ్చగా వడలినట్లు ఉంటాయి. అవి కొన్నాళ్లకు చని పోతాయి. వాటిని పీకి చూస్తే వాటి వేర్లపై బుడిపెల మాదిరిగా ఉంటాయి. అలా ఉండటానికి కారణం నెమటోడ్లు. నెమటోడ్లు అంటే? మట్టిలో ఉండే నెమటోడ్లు భయంకరమైన సూక్ష్మక్రిములు. అన్ని రకాల మట్టిలో, వివిధ పంటల వేర్లలో, కలుపులో దాగివుండి కూరగాయలు, మిరప తోటలను నాశనం చేస్తుంటాయి. వీటిని నియంత్రించటం కంటే నివారించటమెంతో సులభం. రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల ప్రయోజనం కన్నా కీడు ఎక్కువ జరుగుతుంది. అందుకని వాటి నివారణ ఎలాగో తెలుసుకోవటం అవసరం. వేరుముళ్ల నెమటోడ్లు వేర్లలోకి దూరి బుడిపెలను కలిగిస్తాయి. మొక్కల వేర్ల ద్వారా పోషకాలను పీల్చుకుంటూ జీవనం సాగిస్తాయి. దీంతో నెమటోడ్లు సోకిన మొక్కలు పోషకాలు అందక మొక్క వాడి΄ోయి, ఎండిపోయి, క్రమంగా చనిపోతుంది. నెమటోడ్లు భూమిలో ఎలా ఎదుగుతాయి? నెమటోడ్లు పలు మొక్కల వేర్లలోను, మట్టిలోను జీవిస్తాయి. వీటిని సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడగలం. వేర్ల పక్కనే ఆడ నెమటోడ్ వెయ్యి గుడ్ల వరకు పెడుతుంది. గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. గుడ్ల పక్కన ఉన్న వేర్ల నుంచి అనుకూల సూచనలు రాగానే గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. వేర్లను చుట్టుకుంటాయి. ఈ చిన్న పురుగులు వేర్లను పొడిచి లోపలికి చేరి, వాటిని తిని కడుపు నింపుకుంటాయి. ఈ క్రమంలో వేర్లకు బుడిపెలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఇక మొక్కలకు ఈ వేర్ల ద్వారా పోషకాలు అందవు. దాంతో మొక్కలు కళతప్పి, వాడిపోయి, ఎండి చనిపోతాయి. నెమటోడ్లు అన్ని రకాల మట్టిలోనూ పెరుగుతాయి. చదవండి: Recirculating aquaculture system ఆధునికి చేపల సాగు మిరప, కూరగాయ మొక్కల నారును తెచ్చి నాట్లు వేసే ముందు వాటి వేర్లకు ఏమైనా బుడిపెలు ఉన్నాయా అని పరీక్షించాలి. బుడిపెలు ఉన్న మొక్కల్ని నాటకూడదు. మీ పొలం పరిసరాల్లో మొక్కలకు బుడిపెలు ఉన్నాయేమో చూసి, ఉంటే వాటిని నాశనం చెయ్యండి. మొక్కలు నాటడానికి భూమిని సిద్ధం చేసినప్పుడే పాతమొక్కల వేర్లు పూర్తిగా ఏరేసి, మట్టిని ఎండబెట్టాలి. పోయిన ఏడాది మొక్కలకు నెమటోడ్లు సోకిన చోటే పొలంలో తగలబెట్టే అలవాటు కొన్ని ప్రాంతాల రైతుల్లో ఉంది.నెమటోడ్లను తట్టుకునే ఉపాయాలేమిటి?నెమటోడ్లు సోకిన టొమాటో, మిరప, కూరగాయ పొలాల్లో పంట మార్పిడి చెయ్యటం మంచిది. ఉల్లి, తోటకూర, తులసి, నిమ్మగడ్డి, కర్రపెండలం, పశుగ్రాస పంటలకు నెమటోడ్లు సోకవని చెబుతున్నారు. కాబట్టి, ఈ పంటలు సాగు చేయవచ్చు. ఆరోగ్యకరమైన నారు పెంచుకోవటం. చేనులో, వాటి దరిదాపుల్లో నెమటోడ్ల మూలాన్ని గుర్తించి నాశనం చెయ్యటం మేలు. నెమటోడ్ నిరోధక శక్తి కలిగిన మొక్కలను తెచ్చి నాటుకొని పండించటం ఉత్తమం. ఇతర చేలల్లో నుంచి నెమటోడ్లతో కూడిన మట్టిని, మొక్కల్ని తేకుండా జాగ్రత్తపడటం అవసరం. నెమటోడ్లతో కూడిన మట్టి నాగళ్లు, ట్రాక్టర్లు, పరికరాలు, కూలీల పాదాలకు, వారి చెప్పులకు కూడా అంటుకొని ఒక పొలం నుంచి వేరే పొలంలోకి వ్యాపిస్తాయి. అందుకని శుభ్రం చేసుకున్న తర్వాతే వారిని పొలాల్లోకి రానివ్వాలి. నెమటోడ్ల నిరోధకత కలిగిన నారును, విత్తనాలను వాడాలి. నెమటోడ్లు సోకిన పొలంలో మొక్కలు పీకేసి, వాటి వేర్లన్నిటినీ ఏరి, కాల్చివేయాలి. మట్టిని తిరగేసి బాగా ఎండనివ్వాలి. ఆ తర్వాతే వేరే పంట వేసుకోవాలి. ప్రవహించే నీటి ద్వారా చేనులోకి నెమటోడ్లు రాకుండా ఉండేలా చేను సరిహద్దుల్లో నిమ్మగడ్డిని కంచె పంటగా పెంచుకోవటం మేలట. ఈ విషయాలను దక్షిణ బెనిన్ రైతుల అనుభవాలను ఉటంకిస్తూ యాక్సెస్ అగ్రికల్చర్ అనే డిజిటల్ అగ్రికల్చర్ విస్తరణ సంస్థ వీడియోను విడుదల చేసింది.చదవండి: ట్విన్స్కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్ -
RAS : ఆధునిక చేపల సాగు
ఆక్వాకల్చర్ అంటే చేపలు, రొయ్యలు ఇతర జలజీవులను పెంచటమే. ఇది ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ఆహార ఉత్పత్తి విధానం. సముద్రాలలో సహజంగా దొరికే చేపలు తగ్గిపోవటంతో ఆక్వాకల్చర్ ద్వారా మనకు అవసరమైన చేపల్ని అందిస్తున్నారు. ప్రస్తుతం మనం తినే చేపల్లో సగం కంటే ఎక్కువ ఆక్వాకల్చర్ నుంచే వస్తున్నాయి. చెరువుల నుంచి పటిష్టమైన రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్(ఆర్ఎఎస్)ల వరకు ఆక్వాకల్చర్ మనకు ఆహార భద్రతను కల్పిస్తూ ప్రకృతిని కూడా కాపాడుతుంది.ఆర్ఎఎస్ సాధారణ చెరువుల కన్నా ఎంతో అధునాతనంగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే నీటిలో 90 శాతం వరకు నీటిని శుద్ధి చేసి మళ్లీ వాడతారు. దీంతో తక్కువ నీటితో ఎక్కువ చేపలను ఉత్పత్తి చేయటం సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా నీటి వృథా చాలా తక్కువగా ఉండి, పర్యావరణానికి తోడ్పడుతుంది. ఇది భవిష్యత్తు చేపల సాగుకు ఉత్తమ మార్గం. నార్త్ యూరప్ దేశాల్లో పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఆక్వా సాగు చేయించే క్రమంలో ఆర్ఎఎస్ తొలుత ప్రారంభమైనప్పటికీ తదనంతర కాలంలో అన్ని ఖండాలకూ ఈ మెరుగైన ఆక్వాసాగు పద్ధతి విస్తరిస్తోంది. అదేవిధంగా మన దేశంలోనూ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఎస్ పద్ధతిలో చేపల సాగుకు ప్రోత్సాహం ఇస్తుండటం విశేషం. ∙చేపల సాగులో ఆధునిక పోకడ.. రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ (ఆర్ఎఎస్-Recirculating aquaculture system)చేపల సాగుకు చక్కని భవిష్యత్తుకు పర్యావరణహితమైన మార్గం ఇదిఅతి తక్కువ నీటి వనరులతో ఆక్వా సాగుతో పాటు అధిక దిగుబడికి దోహదం5 టన్నుల చేపల ఉత్పత్తి యూనిట్కు కనీస పెట్టుబడి రూ. 15–25 లక్షలుసరైన నిర్వహణ ఉంటే సంవత్సరానికి రూ. 6–8 లక్షల ఆదాయం మహిళలు, యువతకు 40%–60% వరకు ప్రధాన మంత్రి స్కీమ్ కింద సబ్సిడీలకు అవకాశం రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్(ఆర్ఎఎస్) వ్యవస్థలో అనేక భాగాలున్నాయి. ఇందులో ప్రతి భాగమూ కీలకపాత్ర పోషిస్తాయి. మొదటిది : కల్చర్ ట్యాంక్. ఇది చేపల పెంచే ప్రధాన నీటి ట్యాంకు. ఇక్కడే పెంపకం జరుగుతుంది. రెండోది : మెకానికల్ ఫిల్టర్. నీటి నుంచి తుప్పు, చెత్త వంటి ఘనపదార్థాలను తొలగిస్తుంది. మూడోది : బయో ఫిల్టర్. మంచినీటి జీవక్రియ ద్వారా విషకర నైట్రోజన్ పదార్థాలను తొలగిస్తుంది. నాలుగోది : యువి లేదా ఓజోన్ యూనిట్. నీటిలో క్రిములు, బ్యాక్టీరియా, వైరస్లను నశింప జేస్తుంది. ఐదోది : సంప్ ట్యాంక్. నీటి ఫిల్టర్ అయిన తర్వాత తాత్కాలికంగా నీటిని నిల్వచేసే ట్యాంక్. ఆరోది : పంప్. పంపు నీటిని తిరిగి ట్యాంకుకు పంపిస్తుంది. ఏడోది : ఎయిరేషన్ వ్యవస్థ. ఆక్సిజన్ను నీటిలో కలిపి చేపలకు జీవనాయువును అందించేదే ఎయిరేషన్ వ్యవస్థ.ఈ విధంగా ఆర్ఎఎస్లో ప్రతి భాగమూ కలిసి పనిచేస్తూ, ఒక సురక్షితమైన పర్యావరణ మిత్రమైన చేపల పెంపక పద్ధతిని అందిస్తాయి. చేపలు.. కల్చర్ ట్యాంకులో పెరుగుతాయి. వాటి ద్వారా నీటిలో మలినాలు ఏర్పడతాయి. ఈ నీరు ముందుగా మెకానికల్ ఫిల్టర్ ద్వారా వెళ్తుంది. చెత్తను తొలగిస్తుంది. ఆ తర్వాత ఈ నీరు బయో ఫిల్టర్లోకి ప్రవహిస్తుంది. ఈ నీటిలో ఉన్న అమ్మోనియా, నైట్రేట్ వంటి విషతుల్యమైన నైట్రోజన్ను ఖచ్చితంగా తొలగిస్తుంది. తర్వాత యువి లేదా ఓజోన్ యూనిట్కు నీరు వెళ్తుంది. ఇక్కడ నీటిలో ఉన్న సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా వంటివి నశిస్తాయి. ఇలా శుద్ధి అయిన నీరు సంప్ ట్యాంక్కు చేరుతుంది. అక్కడి నుంచి పంప్ సాయంతో మళ్లీ కల్చర్ ట్యాంకుకు నీరు వెళ్తుంది. ఈ మొత్తం వ్యవస్థలో ఎయిరేటర్ ద్వారా నీటిలోకి ఆక్సిజన్ కూడా అందజేయబడుతుంది. ఇది చేపల ఆరోగ్యానికి కీలకం.ఇదీ చదవండి: ట్విన్స్కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్ఆర్ఎఎస్లో పెంచతగిన చేపల జాతులు:తిలాపియా, ఫంగాషియాస్ సీబాస్ (పండుగప్ప) , మారెల్ ట్రౌట్.ఆర్ఎస్ చేపల సాగులో ప్రధాన నీటి ప్రమాణాలు:1. నీట కరిగిన ఆక్సిజన్ (డిజాల్వ్డ్ ఆక్సిజన్). చేపలు పెరిగే ట్యాంకులో లీటరు నీటికి 5 మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువగా ఉండాలి. ఇది చేపల శ్వాసకు అవసరం. 2. ఉష్ణోగ్రత: 25 నుంచి 30 డిగ్రీల సెల్షియస్ వరకు మెయింటెయిన్ చేస్తూ ఉండాలి. 3. ఉదజని సూచిక (పిహెచ్): 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. 4. అమ్మోనియా: ఇది లీటరు నీటికి 0.02 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉండాలి. 5. నైట్రైట్: ఇది బాగా తక్కువగా ఉండాలి. అంటే, లీటరు నీటికి 0.1 మిల్లీ గ్రాము కంటే తక్కువగా ఉండాలి. 6. టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్ (టిఎస్ఎస్): ఇది 50 మిల్లీ గ్రాముల కంటే చాలా తక్కువగా ఉండాలి. 7. కార్బన్ డయాక్సయిడ్: ఇది 10 నుంచి 15 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండాలి. ఇవన్నీ సమానంగా మెయింటెయిన్ చేసుకుంటూ ఉంటే ఆర్ఎఎస్ సిస్టం సక్రమంగా నడుస్తుంది.ఆర్ఎఎస్కు ఎదురవుతున్న సవాళ్లు:1. ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. చిన్న రైతులకు ఇది చాలా పెద్ద పెట్టుబడి అవుతుంది. 2. ఈ వ్యవస్థ నడిపించడానికి నిపుణుల అవసరం ఉంది. అంటే, శిక్షణ ΄÷ందిన వ్యక్తుల అవసరం చాలా ఎక్కువగానే ఉంది. 3. ఈ వ్యవస్థ ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ముఖ్యంగా నీటి శుద్ధి, ఆక్సిజన్ సరఫరా కోసం విద్యుత్తు కావాలి. 4. సిస్టమ్ ఫెయిల్యూర్ రిస్క్ ఎక్కువ. పంపులు, ఫిల్టర్లు పనిచేయక΄ోతే సిస్టమ్లు ఫెయిల్యూర్ అవ్వటం వల్ల రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే, చిన్న పొరపాటుకు పెద్ద నష్టం జరుగుతుందన్నమాట. కాబట్టి, ఆర్ఎఎస్ చేపల సాగు ప్రారంభించే ముందు అన్ని అంశాలనూ పరిశీలించాలి.చేపలతో పాటు కూరగాయలుఇంకా ఆక్వాపోనిక్స్ ద్వారా చేపల ఉత్పత్తితో పాటు కూరగాయల సాగు కూడా ఈ వ్యవస్థలో జరుగుతోంది. ఇదొక స్మార్ట్ వ్యవస్థ. దీంట్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధ్యమవుతుంది. ఇది ఎగుమతులకు మార్గం వేస్తుంది. మహిళలు, యువత ఆర్ఎఎస్ సాగును సులభంగానే చేపట్టి మంచి ఉపాధి పొందగలుగు తున్నారు. ఆర్ఎఎస్ కేవలం ఆధునిక చేపల చెరువు మాత్రమే కాదు. శుభ్రమైన, స్థిరమైన చేపల పెంపకానికి సంబంధించిన భవిష్యత్తు గల రంగం ఇది. నీటి పొదుపుగా వాడటం, ఆరోగ్యకరమైన చేపలను పెంచటం, ఎక్కువ దిగుబడి పొందటం.. వంటి ప్రయోజనాల రీత్యా పూర్తిగా పర్యావరణ అనుకూలమైన ఆక్వా సాగుగా ఆర్ఎఎస్ చేపల సాగును అభివర్ణించవచ్చు. ఆధునిక టెక్నాలజీ ఇప్పటి వరకు చేపల సాగు మాదిరిగా ఇది సాంప్రదాయ పద్ధతిలో చేపల పెంపకం కాదు. ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ వ్యవస్థను వాడుకునే పద్ధతి ఇది. రీసర్క్యులేటరీ ఆక్వా కల్చర్లో ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఇఓటీ) సెన్సార్లు ఉపయోగించి, నీటి గుణ, నిల్వలపై కంట్రోల్ పెరుగుతుంది. అంటే, మొబైల్ ఫోన్ ద్వారా పిహెచ్, ఆక్సిజన్, టెంపరేచర్ వంటివి మనం చెరువులకు దూరంగా ఉండి కూడా సులువుగా తెలుసుకోవచ్చు.కనీస పెట్టబడి రూ. 15 లక్షలుఒక చిన్న స్థాయి ఆర్ఎఎస్ చేపల సాగు యూనిట్ను ఏర్పాటు చేసుకోవాలంటే ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు ఇవి.. : టన్నుల సామర్థ్యంతో ఆర్ఎఎస్ యూనిట్ను ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ. 15 నుంచి 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ∙నిత్యం అయ్యే నిర్వహణ ఖర్చులు, చేపల ఆహారం, విద్యుత్తు, కూలి ఖర్చులు.. ఇలాంటివి ఉంటాయి ∙సరైన నిర్వహణ ఉంటే ఈ వ్యవస్థ ద్వారా సంవత్సరానికి రూ. 6 నుంచి 8 లక్షల ఆదాయం పొందవచ్చు. అంతేకాకుండా ఈ పెట్టుబడిని మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపే తిరిగి పొందగలుగుతారు ∙తిలాయిపియా, ఫంగాసియస్, ముర్రెల్, సీబాస్ వంటి చేపలను ఇందులో పెంచుకోవచ్చు. వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ప్రభుత్వ మద్దతుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త వెలుగుగా మారింది.ఆర్ఎఎస్ ఉపయోగాలు:ఆర్ఎఎస్ చేపల సాగు అంటే సాంకేతికతతో కూడిన భద్రతా వ్యవస్థ. ఇందులో నీటి వాడకం తక్కువగా ఉండటం వలన, అదే నీటిని మళ్లీ మళ్లీ వాడటం వల్ల నీరు పొదుపు అవుతుంది. తక్కువ వనరులతో అధిక ఉత్పాదకత సాధించవచ్చు. అంటే, తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి. వాతావరణంపై అంతగా ఆధారపడదు. కాబట్టి, ఏ కాలంలో అయినా మనం ఆర్ఎఎస్ సాగు చేసుకోవచ్చు. వ్యాధుల నియంత్రణ చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎందుకంటే, నీటి నాణ్యతా యాజమాన్యం అంతా మన చేతిలోనే ఉంటుంది. మురుగు నీరు బయటకు పోదు. ఆ విధంగా ఆర్ఎఎస్ అనేది పర్యావరణాన్ని కాపాడుతుంది. ఇది భవిష్యత్తులో మరింత విస్తరించే చేపల సాగు వ్యవస్థ. 40%–60% వరకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీఆర్ఎఎస్ చేపల సాగు తీర్ర ప్రాంతాల రైతులకు ఇప్పుడు ఉత్తమ అవకాశంగా మారింది. ఎందుకంటే, తీర్ర ప్రాంతపు మట్టి (అంటే లావా మట్టి) ఆర్ఎఎస్ స్థాపించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా ఫిష్ ఫీడ్ అందుబాటులో ఉండటం, నిపుణుల సహాయం అందుబాటులో ఉండటం వల్ల ఈ సాగు మరింత లాభదాయకంగా మారుతుంది. పిఎంఎంఎస్వై అనే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రైతులకు ప్రోత్సాహకాలు, శిక్షణ, మార్గదర్శకత అందుతున్నాయి. పెట్టుబడులపై సబ్సిడీలు 40 శాతం నుంచి 60% వరకు లభిస్తున్నాయి. ఇది యువతకు, మహిళలకు, కొత్త రైతులకు గొప్ప అవకాశం. ఈ విధంగా ఆర్ఎఎస్ సాగు తీర్ర ప్రాంతాల్లో పరిశ్రమలతో సమానంగా అభివృద్ధి చెందుతోంది. ఇది జీవనోపాధికి, ఆర్థిక అభివృద్ధికి నూతన మార్గాలు చూపుతోంది. -
హరిత యూరియా వస్తోంది!
పర్యావరణాన్ని, ప్రకృతిని కలుషితం చేస్తున్న రసాయనిక యూరియా వాడకానికి నూకలు చెల్లే రోజులు దగ్గరపడ్డాయి. శిలాజ ఇంధనాలు వాడకుండా తయారు చేసే ‘హరిత యూరియా’ సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి రానుంది. స్వీడన్లోని ‘నైట్రోక్యాప్ట్’ అనే స్టార్టప్ పూర్తిగా కాలుష్య రహిత పద్ధతిలో నత్రజని ఎరువును తయారు చేస్తోంది. అది కూడా స్వల్ప ఖర్చుతోనే. కేవలం వాతావరణంలోని నీరు, గాలితో పాటు ఒక యూనిట్ సోలార్ వంటి పునరుత్పాదక ఇంధనంతో ఏకంగా 40 వేల హెక్టార్లకు సరిపడా హరిత యూరియాను ఉత్పత్తి చేసే అద్భుత సామర్థ్యం తమ వినూత్న సాంకేతికత సొంతమని నైట్రోక్యాప్ట్ వ్యవస్థాపకుడు గస్టాఫ్ ఫోర్స్బెర్గ్ ప్రకటించారు. ఏమిటీ సాంకేతికత విశిష్టత?వాతావరణంలో మెరుపులు సహజంగా నత్రజనిని స్థిరీకరించే విధానాన్ని అనుకరిస్తూ ఈ స్టార్టప్ సరికొత్త సాంకేతికతను రూపొందించింది. గాలిలోని నత్రజని అణువులను విచ్ఛిన్నం చేయడానికి ప్లాస్మా టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా ఎరువులలో కీలకమైన భాగమైన నైట్రేట్ను ఉత్పత్తి చేయటం ఈ సాంకేతికత విశిష్టత. ఈ సాంకేతికత గాలి నుంచి గ్రహించి నేరుగా నత్రజని ఎరువును తయారు చేయటానికి ఆక్సిజన్, నీరు, పునరుత్పాదక శక్తిని మాత్రమే ఉపయోగిస్తుంది. వందేళ్లుగా సంప్రదాయ రసాయనిక ఎరువుల ఉత్పత్తి ప్రక్రియలో మాదిరిగా ఖరీదైన, కాలుష్యకారక ఇంధనాన్ని ఉపయోగించి హైడ్రోజన్ తయారు చేసే అవసరం ఈ టెక్నాలజీతో తీరిపోనుంది. నైట్రోక్యాప్ట్ రూపొందించిన పద్ధతిలో హరిత యూరియా ఉత్పత్తికి పది రెట్లు తక్కువ శక్తి సరిపోతుంది. దీన్ని సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవచ్చు. ఈ సాంకేతిక పురోగతి ఎరువుల తయారీ ప్రక్రియను పర్యావరణహితంగా మారుస్తుంది. ‘సనిఫిక్స్’ పేరిట పేటెంట్స్వీడన్కు చెందిన భౌతికశాస్త్ర శాస్త్రవేత్త గస్టాఫ్ ఫోర్స్బెర్గ్ తన మిత్రుడు పీటర్ బేలింగ్తో కలసి 2016లో నైట్రోక్యాప్ట్ స్టార్టప్ను నెలకొల్పారు. ‘సనిఫిక్స్’ పేరిట పేటెంట్ పొందిన గ్రీన్ యూరియా టెక్నాలజీని 20 మంది శాస్త్రవేత్తలతో కూడిన నైట్రోక్యాప్ బృందం ఆవిష్కరించింది. ఇందులో శ్రీలంకలో పుట్టిన యువ శాస్త్రవేత్త శంఖ ననయక్కర కూడా ఉన్నారు. స్వీడన్లోని ఉప్సల పట్టణంలోని గ్రీన్ ఇన్నోవేషన్ పార్క్లో ఏర్పాటైన చిన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాక్టర్ ద్వారా హరిత యూరియా ఉత్పత్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. హరిత యూరియాను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే 33 పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి 9 సంస్థలు ఆసక్తి చూపాయి. స్వీడన్లోని ‘వివెసియ’ సహకార సంఘం వాణిజ్యపరమైన తొలి పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులో 9 వేల మంది రైతులు సభ్యులు. హరిత నత్రజని ఎరువుతో 7.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్టాక్హోమ్లో పురస్కార ప్రదానంస్వీడన్కు చెందిన కర్ట్ బెర్గ్ఫోర్స్ ఫౌండేషన్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యావరణ పురస్కారం ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్’ను ప్రదానం చేస్తోంది. పర్యావరణహితమైన ఆహారోత్పత్తికి దోహదపడే ఆవిష్కరణలకు ఈ పురస్కారం ఇస్తారు. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని నైట్రోక్యాప్ట్ గెల్చుకుంది. జ్ఞాపికతో పాటు 20 లక్షల డాలర్ల నగదు బహుమతిని జూన్ 13న స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో నైట్రోక్యాప్ట్ వ్యవస్థాపకుడు గస్టాఫ్ ఫోర్స్బెర్గ్ అందుకున్నారు. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ పొందటంతో ఈ ఆవిష్కరణ ప్రపంచం దృష్టికి వచ్చింది. వికేంద్రీకరణకు అవకాశంయూరియా ఉత్పత్తికి భారీ పరిశ్రమను స్థాపించాల్సిన అవసరం లేదు. కాబట్టి, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల రైతులకు ఈ సాంకేతికత వరప్రసాదంగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాక, రసాయనిక ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ఉత్పాదకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అనివార్యత నుంచి ఈ సాంకేతికత విముక్తి కలిగిస్తుందని ఆశిస్తున్నారు. యూరియాను ఎక్కడో ఉత్పత్తి చేసి ఎక్కడికో తరలించాల్సిన అవసరం ఉండదు. దీని ఉత్పత్తిని వికేంద్రీకరించటానికి తగిన మాడ్యులర్ వ్యవస్థ ద్వారా నెలకొల్పే రియాక్టర్ల ద్వారా హరిత నత్రజనిని ఎక్కడికక్కడ తయారు చేసుకునేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుందట. అదే జరిగితే, అంతర్జాతీయ జియోపొలిటికల్ ఉద్రిక్తతల ప్రభావం వ్యవసాయంపై పడకుండా జాగ్రత్తపడగలుగుతాం. శిలాజ ఇంధనాలపై ఆధారపడే ఇప్పటి రసాయనిక ఎరువుల ఉత్పత్తి పరిశ్రమలో ఇది విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వాతావరణంలోకి విడుదలవుతూ భూగోళాన్ని అమితంగా వేడెక్కిస్తున్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో దాదాపు 2.7 శాతం రసాయనిక ఎరువుల పరిశ్రమ నుంచి వస్తున్నాయి. ఇందులో 50% వాటా యూరియాదే. ఎటువంటి ముడిసరుకును దిగుమతి చేసుకోనవసరం లేనందున యూరియా ఉత్పత్తిలో ఇక ఏ చిన్న దేశమైనా సంపూర్ణ స్వావలంబన సాధించడానికి ఈ ఆవిష్కరణ దోహదం చేయనుంది. ప్రపంచ దేశాల రైతులకు వరం ప్రపంచ నత్రజని ఎరువుల పరిశ్రమను అతలాకు తలం చేసే సామర్థ్యం నైట్రోక్యాప్ట్ ఆవిష్కరణకు ఉందని ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ అవార్డు ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ జ్యూరీ పేర్కొంది. ‘భూమి, నీరు, ఎరువులను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఉపయోగించడం ద్వారా మాత్రమే ప్రపంచంలోని ప్రజలందరికీ తగినంత మొత్తంలో పోషకాహారాన్ని అందించగలం. నత్రజని, భాస్వరం ఎరువులను అధిక మొత్తంలో వినియోగిస్తున్నాం. పెద్ద మొత్తంలో హరితగృహ వాయువులను విడుదల చేసే ప్రక్రియల ద్వారా నత్రజని ఎరువులు ఉత్పత్తి అవుతున్నాయి.నైట్రోక్యాప్ట్ స్టార్టప్ ఆవిష్కరణ ఈ చరిత్రను తిరగరాస్తోంది. హరిత విద్యుత్తు ఆధారిత ప్లాస్మా టెక్నాలజీతో గాలిలోని నత్రజని మూలకా లను విభజించడం ద్వారా నత్రజని ఎరువులను ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఇంధన వినియోగాన్ని ఈ సాంకేతికత పది రెట్లు తగ్గిస్తుంది. స్థానికంగా చిన్న యూనిట్లలో హరిత ఎరువులను ఉత్పత్తి చేయవచ్చు. శిలాజ ఇంధనాలను పూర్తిగా నివారిస్తుంది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచగల, నిశ్చింతగా ఉపయోగించగల నైట్రేట్ ఎరువులను ఈ సాంకేతికత అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రైతులకు ఇది వరం..’ అని జ్యూరీ పేర్కొంది.ఉద్గారాల్లేని యూరియాతో విప్లవాత్మక మార్పు నత్రజని ఎరువుల పరిశ్రమను కర్బన ఉద్గార రహితంగా మార్చటం నైట్రోక్యాప్ట్ లక్ష్యం. ప్రస్తుతం నత్రజని ఎరువు ఉత్పత్తి చేస్తున్న శిలాజ ఇంధన ఆధారిత ప్రక్రియ కథ ముగింపు దశకు చేరుకుంది. యూరియా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆహారోత్పత్తిని పెంచటానికి కూడా హరిత యూరియాతో మనం దోహదపడవచ్చు. పైలట్ ప్రాజెక్టు ద్వారా హరిత యూరియాను ఇప్పటికే ఉత్పత్తి చేస్తూ పంటలకు వాడుతున్నాం. పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించే తొలి యూనిట్కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాం. నత్రజని పరిశ్రమలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టే దశకు మా సాంకేతికతను తీసుకురావడానికి ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ మాకు చాలా ఉపయోగపడుతుంది.– గస్టాఫ్ ఫోర్స్బెర్గ్, సీఈవో, వ్యవస్థాపకుడు, నైట్రోక్యాప్ట్, స్వీడన్– పంతంగి రాంబాబు -
వ్యాపారవేత్తగా సైంటిస్టు..! ఎకరానికి రూ. లక్ష వరకూ..
ఒక శాస్త్రవేత్త వ్యాపారవేత్తగా మారి దృఢ చిత్తంతో కృషి చేసి గ్రామీణ రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచటం ఎంత వరకూ సాధ్యమనే ప్రశ్నకు కామినీ సింగ్ అనుభవాలే చక్కని జవాబు. సేంద్రియ మునగ సాగు ప్రాధాన్యతను గుర్తింపజేయటం ద్వారా ఉత్తరప్రదేశ్లోని వెయ్యికి పైగా రైతులను కార్యోన్ముఖులను చేసిన ఆమె ఏకంగా రూ. 1.75 కోట్ల మేరకు వారికి ఆర్థిక ప్రయోజనం కలిగించగలిగారు. ఈ క్రమంలో కామినీ సింగ్ కేంద్రీయ ఉప ఉష్ణమండల ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (సిఐఎస్హెచ్), సిఎస్ఐఆర్– కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ (సీమాప్) వంటి సంస్థల తోడ్పాటు తీసుకున్నారు. ఆమె ఉద్యాన పంటల సాగులో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న శాస్త్రవేత్త. సేంద్రియ వ్యవసాయంలో కూడా ఆమెకు గాఢమైన ప్రవేశం ఉంది. తన పరిశోధనా ఫలితాలను చూపుతూ వ్యవసాయంపై మనకున్న సాధారణ అభిప్రాయాన్ని సైతం మార్చేయగల సత్తా గల కార్యశీలి ఆమె. పిహెచ్డి విద్యార్థిగా ఆమె గుర్తించిన విషయం ఏమిటంటే.. పరిశోధనా ఫలితాలు గ్రామీణ స్థాయిలోని సాధారణ రైతులకు అతి తక్కువగా/అరుదుగా చేరుతున్నాయని. అంతే. 17 ఏళ్లుగా పరిశోధన శాలల్లో పరిశోధనలకే పరిమితమైన ఆమె లాబ్లను వదిలి పొలాల్లోకి దారితీశారు. పరిశోధనకు వాస్తవికతకు మధ్య వారధిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ విధంగా 2016–17లో కామినీ సింగ్ ఉత్తరప్రదేశ్ రైతులకు సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. నేల రసాయనిక ఎరువులపై ఆధారపడకుండా సేంద్రియ వ్యవసాయంలో తిరిగి జీవాన్ని సంతరించుకోవటానికి 2–3 ఏళ్లు సమయం పడుతుంది అంటారామె. అయితే, సేంద్రియ సేద్యం అనగానే ఆకర్షితులైన రైతుల్లో కూడా చాలా మంది నిజాయితీగా సేంద్రియ పద్ధతులను పాటించకపోవటం, ఫలితాలు నాసిగా రావటం ఆమె గుర్తించారు. సేంద్రియ సేద్యం వైపు రైతులను నడిపించాలన్న ఆమె సంకల్పం మాత్రం సడలలేదు. అయితే, తక్కువ ఉత్పాదకాల ఖర్చుతో అధిక దిగుబడులు ఇచ్చే పంటను గనక చెబితే రైతులుమరింత ఉత్సాహంగా ముందుకు వచ్చి చెయ్యగలుగుతారని భావించి మునగ వైపు దృష్టి సారించారు. పోషకాల గని కావటం, అనాదిగా మనకు తెలిసిన పంట కావటం, ఎరువులేవీ పెద్దగా వేయక΄ోయినా మంచి దిగుబడులిచ్చే పంట కావటంతో సేంద్రియ సేద్యానికి ఇది అనువైన పంటగా గుర్తించానంటారామె. దీంతో, శాస్త్రవేత్తగా ఉండటం కన్నా రైతులకు కూడా ఉపయోగపడే వ్యాపారవేత్తగా మారటం మేలని ఆమె నిర్ణయాన్నికొచ్చారు.గట్లపైనే శ్రీకారం2017లో లక్నోలో ఏడెకరాల భూమిలో ఆమె స్వయంగా సేంద్రియ మునగ సాగు ప్రారంభించారు. ఫలితాలు అనుకున్నదాని కన్నా బాగా వచ్చాయి. తక్కువ నీరు ఇచ్చినా స్థానిక వాతావరణానికి మునగ మంచి దిగుబడి వచ్చింది. ఈ విజయంతో ఒక వినూత్న ఉపాయాన్ని ఆమె అమల్లోకి తెచ్చారు. రైతులు తమ పొలాల్లో ఏ పంటైనా పండించండి. అయితే, గట్లపై మాత్రం మునగ మొక్కలు వెయ్యాలని సూచించారు. దీంతో చాలా మంది రైతులు ముందుకొచ్చారు. ప్రధాన పంటకు ఇబ్బంది లేకుండా చేసిన ఈ పని వల్ల ఏడాదికి రూ. 30 వేల వరకు ఆదాయం రావటంతో రైతులు సంతోషించి, మునగ సాగు చేపట్టారు. ‘నా పొలం చుట్టూతా గట్లపై 400 మునగ మొక్కలు మొదట నాటా. ఆదాయం బాగుంది. అందుకని ఇప్పుడు పది ఎకరాల్లో మునగ పంటను సాగు చేస్తున్నా’ అన్నారు లక్నో ప్రాంతానికి చెందిన రైతు షాలిక్రమ్ యాదవ్. మొదట్లో నాకు చాలా భయాలుండేవి. అయితే, కామినీ సింగ్ ప్రోత్సాహంతో ముందుకు నడిచా. ఏ రైతుకైనా పండించిన పంటను అమ్ముకోవటమే పెద్ద సమస్య. తానే స్వయంగా మునగ ఆకులను కిలో రూ. 60కి కొంటుండటంతో నాకు మార్కెటింగ్ సమస్య లేకుండా ΄ోయింది. ఈ సీజన్లో వాతావరణం అనుకూలించలేదు. 5 క్వింటాళ్ల మునగాకు పండించా. అయినా నాకు నష్టం లేదు. సేంద్రియ మునగ సాగు ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది అన్నారాయన. ఆమె కృషి ఫలించటం ప్రారంభించింది. మునగాకును రైతుల నుంచి కొని అనేక ఉత్పత్తులుగా మార్చి విక్రయించటం ఆమె ప్రారంభించారు. నెమ్మదిగా సేంద్రియ మునగాకు సాగు చేసే రైతుల సంఖ్య పెరిగింది. చిన్న బృందం కాస్తా పెద్ద నెట్వర్క్గా మారింది. రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వెయ్యి ఏభై మంది రైతులు చేరారు. వారంతా మునగ సాగు చేయటం మాత్రమే కాదు, స్థిరమైన ఆదాయాన్ని, ఆరోగ్యాన్నిచ్చే పంటను స్థిమితంగా సాగు చేయటం నేర్చుకున్నారు. డాక్టర్ మోరింగ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రూ. 9 లక్షల పెట్టుబడితో ఆమె స్థాపించిన కంపెనీ మునగ ఆకులతో 22 రకాల ఉత్పత్తులను తయారు చేసి అమ్ముతోంది. సబ్బులు, గ్రీన్ టీ, బిస్కెట్లు, పొడితో గొట్టాలు, నూనెలు, ముఖ సౌందర్యం కోసం రాసుకునే పొడులు.. వంటివెన్నిటినో తయారు చేస్తున్నారు. ఎఫ్పివో తరఫున అనేక చోట్ల విక్రయాలు ప్రారంభించటంతో ఆదాయం పెరిగింది. రూ. 9 లక్షల రుణంతో ప్రారంభించిన కంపెనీ వార్షిక టర్నోవర్ ఇప్పుడు రూ. కోటి 75 లక్షలకు చేరింది. ఖర్చులు పోగా 30% నికరాదాయం వస్తోంది. డాక్జర్ కామిని శాస్త్రీయ దృష్టికి రైతులను చైతన్యవంతులను చేసి ఆర్థికంగా తోడ్పాటునందించాలన్న సంకల్పం తోడు కావటంతో విజయం చేకూరింది. మొలక శాతం, చీడపీడల నియంత్రణ, నాణ్యత, పంటకు రక్షణ వంటి అంశాలన్నిటినీ ఆమె సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారు. తన క్షేత్రంలో ఆమె అనుసరించే సేంద్రియ పద్ధతులను చూసి రైతులు సులువుగా నేర్చుకొని అనుసరిస్తున్నారు. మంచి ఆదాయం ఉండటంతో, ఇతర పంటలు పండించే రైతులు సైతం సేంద్రియ మునగ సాగు వైపు ఆకర్షితులవుతున్నారు. కుమార్ సింగ్ అనే రైతు మలిహాబాద్΄ ప్రాంతంలో మామిడి సాగుకు ప్రసిద్ధి పొందారు. ఆయన కూడా 17 ఎకరాల్లో మునగాకు సాగు ప్రారంభించారు. మొదట్లో ఒక ఎకరం మునగ వేశా. శాస్త్రవేత్తే స్వయంగా సలహాలు ఇస్తూ ఉండటం, మంచి ఆదాయం వస్తుండడంతో 17 ఎకరాలకు విస్తరించా అన్నారు అనిల్ కుమార్ సింగ్. గతంలో వరి, గోధుమ సాగు చేస్తే నాకు రూ. 40 వేలు వచ్చేవి. ఇప్పుడు అదే బూమిలో మునగ ఆకు, కాయల సాగుతో రూ. 1.5 లక్షల ఆదాయం వస్తోంది. పెట్టిన పెట్టుబడి రూ. 30 వేలు తొలి ఏడాదే వచ్చేసింది. ఇది చూసి మిగతా రైతులు కూడా మునగ సాగులోకి వస్తున్నారు అని ఆయన వివరించారు. ‘సాధారణ పంటలు పండిస్తే ఎకరానికి రూ. పాతిక వేలు సంశయించే రైతులు మునగ సాగు చేసి, విలువ జోడించి అమ్మటం వల్ల రూ. లక్ష వరకు సంశయిస్తున్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కొత్త విధంగా పంటలు పండించటం నేర్చుకుంటే ఇంత ప్రయోజనం ఉంటుంది అంటున్నారు డాక్టర్ కామినీ సింగ్.ఆమె శాస్త్రవేత్తగా కెరియర్ను వదిలేసి వ్యాపారవేత్తగా మారాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అయితే, ఆమె కృషి ఫలించి, ఆమె స్థాపించిన కంపెనీ చక్కటి ఫలితాలనిస్తూ రైతులకు కూడా మంచి లాభాలు వస్తుండటం, మునగ సాగు 15 గ్రామాలకు విస్తరించటంతో ఆమె కుటుంబం ఇప్పుడు సంతోషిస్తున్నారు. కేవలం ఒక శాస్త్రవేత్తగా మాటలు చెప్పేలానే ఉండి΄ోకుండా, ధైర్యంగా ముందడుగు వేసి, రైతులకు మార్గదర్శకురాలిగా మారిన ఆమె కృషి నిజంగా ప్రశంసించదగినది.(చదవండి: బ్యాంకు ఉద్యోగం వదిలేసి, ఆధునిక సేద్యం : కోట్లలో ఆదాయం) -
Sagubadi: వరి సేద్యంలో.. బాతుల సేన!
వరి సాగులో బాతుల వాడకం ఇటీవలి ఆవిష్కరణ కాదు. భారత్, థాయిలాండ్ సహా అనేక ఆసియా దేశాల్లో ఇది అనాదిగా సాగుతున్న ఒక సాంప్రదాయ పద్ధతి. బాతులు తమ పొలాల్లో తిరుగుతూ ఉండటం వల్ల కలిగే బహుముఖ ప్రయోజనాలను రైతులు గ్రహించారు. సాధారణంగా వరి పంట కోసిన తర్వాత పొలాల్లో బాతులను వదులుతారు. పంట మోళ్లు, కీటకాలు, కలుపు మొక్కలన్నిటినీ బాతులు తినేస్తాయి. పురుగులు, కలుపు మొక్కలను తినడం ద్వారా ఆ తర్వాత వేసే పంటకు చీడపీడల బెడద చాలా వరకు తగ్గించడానికి బాతులు సహాయపడుతున్నట్లు కేరళతో పాటు థాయిలాండ్, వియత్నాం తదితర దేశాల్లో జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. ఆ విషయాలను కొంచెం విపులంగా తెలుసుకుందాం..!వరి సాగు చేసే రైతులు, బాతులను పెంచే రైతులకు మధ్య పరస్పరాధారిత అనుబంధానికి బాతులు దోహదం చేస్తున్నాయి. సాంప్రదాయ వ్యవసాయంలో బాతులకుప్రాధాన్యం ఉంది. పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతిలో వరి పొలాల్లో ముఖ్యంగా వరి కోతల తర్వాత బాతులు తిరుగాడుతుంటాయి. ఇలా అనేక వారాల పాటు తిరుగుతూ పురుగూ పుట్ర, కలుపు, పురుగులను తింటాయి. ఇది తదుపరి వేసే వరి పంటకు బలాన్నిస్తాయి. అంతేకాదు, జీవవైవిధ్యం ఇనుమడించడానికీ ప్రయోజనం చేకూరుస్తుంది. బాతులు తెగుళ్ళు, కలుపు మొక్కలను అదుపు చేయటడంలో సహాయపడతాయి. బాతులు పొలాల్లో తిరిగే సమయాల్లో అవి విసర్జించే రెట్ట నేలను నత్రజని తదితర సహజపోషకాలతో సారవంతం చేస్తుంది.ఈ పద్ధతి ముఖ్యంగా కేరళలోని త్రిస్సూర్ లోతట్టుప్రాంత చిత్తడి భూముల్లో కనువిందు చేస్తూ ఉంటుంది. వలస పక్షుల ఆవాసాలుగా కూడా దోహదపడే ఈ చిత్తడి నేలలు వరి వ్యవసాయానికి ప్రసిద్ధి చెందటమే కాకుండా పరిరక్షించదగిన చిత్తడి నేలలుగా రామ్సర్ అంతర్జాతీయ ఒడంబడిక గుర్తింపు పొందాయి కూడా. వరి పొలాల్లో బాతులతో కూడిన సుస్థిరమైన వ్యవసాయ పద్ధతి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతోంది:తెగుళ్లు– కలుపు నియంత్రణ: వరి పొలాల్లో కోతల తర్వాత రాలిపోయిన ధాన్యాలు, కలుపు మొక్కలు, కీటకాలను బాతులు తింటాయి. సహజంగా వీటిని అదుపు చేయటం వల్ల రసాయన పురుగుమందులు, కలుపు మందుల అవసరం తగ్గుతుంది. అదేవిధంగా, ఆ తర్వాత సీజన్లో వరి నాట్లు వేసిన తర్వాత కూడా కొద్ది కాలం పాటు బాతులు లేత వరి పొలంలోకి ప్రవేశపెడతారు. కలుపు మొక్కల్ని తినెయ్యటంతో పాటు నేలను గోళ్లతో తిరగేస్తాయి. పురుగూ పుట్ర దొరుకుతాయోమోనని వెదికే క్రమంలో ఇది జరుగుతుంది. అది కూడా పంట మొక్కల వేర్లకు గాలి తగిలేలా చేసి వాటి పెరుగుదలకు తోడ్పడతాయి. దాంతో పాటు రైతులు చల్లిన సేంద్రియ ఎరువును మట్టిలో కలపటానికి కూడా వీటి పనులు ఉపయోగపడతాయి.ఎరువు: బాతుల రెట్ట సహజ ఎరువుగా పనిచేస్తుంది. రెట్టలోని నత్రజని నేలను సుసంపన్నం చేస్తుంది.జీవవైవిధ్యం: పొలాల్లో జీవవైవిధ్యం పెరుగుతుంది. ముఖ్యంగా త్రిస్సూర్ చిత్తడి భూముల్లో వలస పక్షుల సందడికి బాతుల ప్రభావం ఉంది. ఈ విధంగా విభిన్న పర్యావరణ వ్యవస్థ విరాజిల్లుతూ ఉంటుంది.సమాజ సహకారం: బాతులు.. వరి వ్యవసాయ ప్రక్రియలో కీలక పాత్రపోషిస్తాయి.సాంప్రదాయ పద్ధతి: సమగ్ర వరి సాగు – బాతుల పెంపకం పద్ధతి కేరళలో చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయం. ఇది వ్యవసాయానికి పర్యావరణపరంగా సుస్థిరతను చేకూర్చి ప్రకృతికి చేరువ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులకుప్రాధాన్యం పెరుగుతున్న ఈ దశలో బాతులను అనుసంధానం చేయటం వల్ల వ్యవసాయం ఎలా సంపన్నమవుతుందో అందౖరూ గుర్తిస్తున్నారు.థాయిలాండ్ పొలాల్లోనూ బాతుల సేనలుథాయిలాండ్లో ఒక ప్రత్యేకమైన, సుస్థిర వ్యవసాయ పద్ధతి దృష్టిని ఆకర్షిస్తోంది. రైతులు తమ వరి పొలాలను సమర్థవంతంగా నిర్వహించడానికి బాతుల సైన్యాన్ని ఉపయోగిస్తున్నారు. వరి కోసిన తర్వాత, ఈ రెక్కలుగల కార్మికులను పొలాల్లోకి విడుదల చేస్తారు. అక్కడ మిగిలిపోయిన పురుగులు, కలుపు మొక్కలు, కుళ్ళిపోతున్న మొక్కల పదార్థాలను తింటాయి. ఈ పద్ధతి రసాయన పురుగుమందుల అవసరాన్ని తగ్గించడమే కాకుండా నేల సారాన్ని, పంట దిగుబడిని పెంచడానికి కూడా దోహదం చేస్తోందని అక్కడి రైతులు చెబుతున్నారు.వరి సాగులో బాతుల వాడకం పద్ధతి యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి పర్యావరణంపై దాని సానుకూల ప్రభావం. రసాయన పురుగుమందులు, కలుపు మందులతో చేసే పనులను బాతులతో భర్తీ చేయడం ద్వారా రైతులు అటువంటి రసాయనాల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. బాతులు సర్వభక్షకులు కావడంతో, హానికరమైన పురుగులను తినడమే కాకుండా, పొలాల్లో జీవవైవిధ్యాన్ని ్రపోత్సహించడం ద్వారా పర్యావరణ వ్యవస్థ మెరుగుదలకు కూడా దోహదం చేస్తాయి. అదనంగా, వాటి విసర్జితాలు సహజ ఎరువుగా పనిచేస్తుంది, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను చూపే కత్రిమ ఎరువుల అవసరం లేకుండా నేలను సుసంపన్నం చేస్తుంది. బాతులను వరి పొలాల్లోకి ప్రవేశపెట్టడం వల్ల అధిక దిగుబడి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నేలను కదిలించటం వల్ల నేలలోకి గాలి ప్రసరణ పెరిగి వరి మొక్కల వేర్లు అభివృద్ధిని పెంచుతుంది. ఇంకా, బాతుల ఉనికి పర్యావరణ వ్యవస్థ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇది పంటల మెరుగైన పెరుగుదలకు తోడ్పడుతుంది. కొన్ని సందర్భాల్లో, ఈ పద్ధతి ఫలితంగా రసాయన ఎరువులు లేదా పురుగుమందులు వంటి అదనపు ఉత్పాదకాల అవసరం తగ్గింది. తగ్గిన ఖర్చులు, పెరిగిన దిగుబడితో బాతుల సహాయక వ్యవసాయం చాలా మంది రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా మారుతోందని థాయ్లాండ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల పర్యావరణ ప్రయోజనాల గురించి అవగాహన పెరుగుతూనే ఉండటంతో, థాయిలాండ్లో ఎక్కువ మంది రైతులు బాతుల పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచంలోని ఇతరప్రాంతాల్లోనూ అనుసరించదగిన ఇటువంటి పర్యావరణహితమైన వ్యవసాయ పద్ధతులను ్రపోత్సహించడానికి స్థానిక సమాజం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే సంస్థలు ఆసక్తి చూపుతుండటం విశేషం. థాయ్ రైతులు తమ పొలాల్లో బాతులను చేర్చడం ద్వారా వ్యవసాయం, సహజ పర్యావరణం మధ్య సున్నితమైన సమతుల్యతను కొనసాగించడంలో సహాయపడుతున్నారు.ఇండోనేషియాలోనూ...ఇండోనేషియాలోని దక్షిణ సులవేసిలో సంచార బాతుల మందల పెంపకం కోసం వరి పొలాలను ఉపయోగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. దక్షిణ సులవేసిప్రావిన్స్లోని వరి పొలాల్లో బాతులను మేపే 3ప్రాంతాల్లో పరిశోధన చేశారు. నేల భౌతిక, రసాయన లక్షణాలు, బాతుల మేత, ్రపోటీన్ కంటెంట్ మొత్తాన్ని లెక్కించడం, బాతుల సంఖ్య తదితర అంశాలను విశ్లేషించి సానుకూల ఫలితాలు ఉన్నట్లు తేల్చారు. -
నీటి కుంటలతో కరువుపై పోరాటం
కరువుకు ప్రత్యామ్నాయపదంగా మారిన రాజస్థాన్లో పొలాల్లో నీటి కుంటలు జలసిరులను అందిస్తున్నాయి. జైపూర్ జిల్లా కుకాస్ గ్రామంలోని వాతావరణ ప్రతికూలతలను తట్టుకొని సాగు నీటి భద్రతను కల్పించే పరివర్తనాత్మక గ్రామీణ నీటి సంరక్షణ నమూనా అమల్లో ఉంది. ఈ గ్రామపరిసరాల్లోనే 50 వ్యవసాయ నీటి కుంటలు (ఫామ్ పాండ్స్)ను తవ్వారు. ఈ వర్షాకాలంలో వీటితో పది కోట్ల లీటర్ల వాన నీటిని ఒడిసిపట్టాలని గ్రామస్తులు ఆశిస్తున్నారు. ఈ నీటి కుంటలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మించారు. వానాకాలంలో వాన నీటిని ఒడిసిపట్టి, ఏడాది పొడవునా పంటలకు సాగునీటి కొరత లేకుండా చూడటం ద్వారా గ్రామీణుల జీవనోపాధులను మెరుగుపరచటమే లక్ష్యంగా ఈ ఫామ్ పాండ్లను నిర్మించారు. ఈ ఫామ్ పాండ్లను ‘కుకాస్ నమూనా’ అని పిలుస్తున్నారు.ఖరగ్పూర్ ఐఐటీ పూర్వ విద్యార్థి విప్ర గోయల్ ఈ నీటి కుంటల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. గ్రామంలో ఇప్పటికి 50 నీటి కుంటలు నిర్మించామని, మరో 25 నిర్మించబోతున్నామని ఆయన చెబుతున్నారు. వీటిలో వాన నీటిని సంరక్షిస్తే ఈ ప్రాంతంలో 50 వేల మంది ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వాన నీటిని రెండు పంటలకూ అందించే ఏర్పాటు చేసినందున తక్కువ నీటితో పండించగల పంటలు, అధికాదాయాన్నిచ్చే పంటలను శ్రద్ధగా సాగు చేసుకుంటూ స్వావలంబనతో జీవించే అవకాశం రైతులకు దక్కిందని కుకాస్ సర్పంచ్ రాధేశ్యాం మీనా సంతోషపడుతున్నారు. జైపూర్ ప్రాంతంలో హెక్టారుకు 14 నుంచి 21 లక్షల లీటర్ల వాన నీరు వృథాగా పోతోందని గోయల్ లెక్కగట్టారు. నదులు, కాలువలు లేని ఈ ప్రాంతంలో నీటి కుంటలు ఆధారపడదగినవిగా ఉన్నాయన్నారు. నిరంతరం ఫామ్ పాండ్ ద్వారా నీటి సదుపాయం ఉంటుంది కాబట్టి భూగర్భ జలాలు ఆదా అవుతాయన్నారు. గతంలో నీతి ఆయోగ్తో పనిచేసిన అనుభవం గల గోయల్ ఒక టూవీలర్ తయారీ కంపెనీ ఆర్ధిక సహకారంతో కుకాస్ గ్రామంలో వాననీటి సంరక్షణకు పామ్ పాండ్స్ నిర్మాణం చేయిస్తుండటం ప్రశంసనీయం. తన వంతు కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.కుకాస్ నమూనా ప్రత్యేకతలువానాకాలంలో వాన నీటి సంరక్షణ సామర్థ్యం: 10 కోట్ల లీటర్ల వానాకాలపు వరద నీటిని ఒడిసిపట్టుకోవాలి.ఇదీ ఫామ్ పాండ్ డిజైన్: ప్లాస్టిక్ లైనింగ్, ప్రతి రైతు పొలంలో 5% స్థలంలో 10 అడుగుల లోతు తవ్వి ఫామ్ పాండ్ నిర్మాణం, చుట్టూ పకడ్బందీగా ఇనుప కంచె నిర్మాణం.ప్రాజెక్టు పరిధి: దాస జిల్లాలో 250 నీటి కుంటల తవ్వకం ద్వారా వాననీటి సంరక్షణ ద్వారా సాగు నీటి భద్రతకు విజయవంతంగా కృషి చేసిన స్ఫూర్తితో కుకాస్ జిల్లాలో ఈ నమూనాను అమలు చేస్తున్నారు.నీటి భద్రత, వ్యవసాయానికి జరిగిన మేళ్లు...జైపూర్ జిల్లా వ్యవసాయం 99.4% మేరకు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంది. భూమిలోకి వాన నీరు ఇంకేదానికన్నా 2.22 రెట్లు బోర్ల ద్వారా తోడేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించానికి ఫామ్ పాండ్స్ను నిర్మిస్తున్నారు. ఖరీఫ్, రబీ పంటలకు నీటి అవసరాలు తీర్చటం కోసం వీటిని నిర్మిస్తున్నారు. ఏడాది పొడవునా సాగయ్యే పంటలు, తోటల సాగు, పశువుల పెంపకం, ఉద్యాన తోటల పెంపకానికి దోహదం. పంట మార్పిడిని ప్రోత్సహించటం.. ఉదా.. వేరుశనగ, బొబ్బర్లు.చదవండి: ఔషధ మొక్క.. ఆరోగ్యానికి రక్షసుస్థిరత, అభివృద్ధిపై ప్రభావంప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట దిగుబడులు తీసుకునే శక్తిని నీటి కుంటల వ్యవస్థ పెంపొందిస్తుంది. వైవిధ్యపూరితమైన జీవనోపాధులకు దోహదం చేస్తుంది. ఆహార భద్రతను కల్పిస్తుంది. పాడి పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమలు, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడానికి అవకాశాలు మెరుగుపడ్డాయి. -
మకడమియ గింజలు.. సుసంపన్న పోషక విలువలు
మకడమియ.. క్వీన్ ఆఫ్ నట్స్. మకడమియ కాయ లోపల ఉండే గింజలు డైటరీ ఫ్యాట్కు పెట్టింది పేరు. మకడమియ కాయలు పెద్ద గోళీకాయంత సైజులో ఉంటాయి. పచ్చి కాయ ఆకుపచ్చగా, ఎండుకాయ ముదురు గోధుమ రంగులో ఉంటుంది. దాని పైపొర గట్టిగా ఉంటుంది. దాన్ని పగులగొడితే లోపల వెన్న రంగు లేదా లేత గోధుమ రంగులో గింజ ఉంటుంది. అంచేత.. దీన్ని తెలుగులో ‘వెన్న గింజ’ అందాం!అవకాడోను ‘వెన్న పండు’ అంటారు. 100 గ్రాముల పండులో వెన్న రంగులో ఉండే గుజ్జు 15 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. దీని కన్నా చాలా ఎక్కువ మోతాదులో మకడమియ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. తక్కువ పిండి పదార్థం, ఎక్కువ కొవ్వు, ప్రొటీన్ను కలిగి ఉండటం దీని విశిష్టత. 100 గ్రాములు మకడమియ గింజల్లో కొవ్వు 76 గ్రాములు, మాంసకృత్తులు 8 గ్రా., పిండి పదార్థాలు 14 (పీచు 8.6 తీసేస్తే నికర పిండి పదార్థం 5.4) గ్రాములు ఉంటాయి. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ డైట్ తీసుకునే శాకాహారులకు, వీగన్ ఆహారాన్ని తీసుకునే వారికి ఆరోగ్యకరమైన కొవ్వు, మాంసకృత్తులకు మకడమియ గింజలు అద్భుతమైన వనరు. ట్రీ నట్ జాతుల్లో పేరెన్నిక గన్న మకడమియ పుట్టిల్లు ఆస్ట్రేలియా అయినప్పటికీ ఉత్పత్తిలో దక్షిణాఫ్రికా ముందుంది. కెన్యా, మలావితో పాటు అమెరికాలోని హవాయి దీవుల్లోనూ విస్తారంగా సాగవుతోంది. మన దేశంలో కర్ణాటక, తమిళనాడు ముందున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే సాగు ప్రారంభమైంది. అధిక విలువైన గింజలనిచ్చే దీర్ఘకాలిక చెట్టు మకడమియ. వాణిజ్యపరంగా కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు.మకడమియ గింజల (macadamia nuts) ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. వరల్డ్ మకడమియ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ.ఎం.ఓ.) సమాచారం ప్రకారం.. 2022లో 2,98,914 టన్నుల మకడమియ కాయల నుంచి తీసిన గింజల ఉత్పత్తి జరిగింది. 2027 నాటికి ఇది రెట్టింపవుతుందని అంచనా. 2030 నాటికి 6,60,000 మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని డబ్ల్యూ.ఎం.ఓ. ఊహిస్తోంది. ఆరోగ్యదాయకమైన నట్స్ను ఆహారంలో భాగం చేసుకుంటున్న వారి సంఖ్య ఆసియా దేశాల్లో, ముఖ్యంగా చైనా, భారత్లలో, అంతకంతకూ పెరుగుతుండటం.. ఈ దేశాల్లో ప్రజల ఆదాయాలు వేగంగా పెరుగుతుండటం, పాశ్చాత్య ఆహారపు అలవాట్లు విస్తరిస్తుండటం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వంటశాలల్లోనూ, ఆహారోత్పత్తుల పరిశ్రమల్లోనూ మకడమియ గింజల వినియోగం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.చెట్ల ఎత్తు 7 నుంచి 40 అడుగులుమకడమియ చెట్లు ఏ కాలంలో అయినా పచ్చగా ఉంటాయి. ఈ చెట్టు 2–12 మీటర్ల (7–40 అడుగులు) ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టుకు పొడవాటి పూల జడ మాదిరిగా పూలు పూచి, కాయలుగా మారతాయి. కాయలో ఒకటి లేదా రెండు గింజలు ఉంటాయి. పెద్ద సైజు కాబూలి శనగల గింజల్లాగా ఉంటాయి. కాయ పైన పెంకు చాలా గట్టిగా ఉంటుంది. ఏదైనా పదార్థం గట్టితనాన్ని కచ్చితంగా చెప్పాలంటే.. ‘విక్కర్స్ హార్డ్నెస్’ స్కోర్లో కొలుస్తారు. దీని స్కోరు 35.దీన్ని తొలిగా వాణిజ్య స్థాయిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన హవాయిలో సాగు చేశారు. ఆస్ట్రేలియా నుంచి 1880వ దశకంలో మకడమియ విత్తనాలు తీసుకెళ్లి హవాయిలో సాగు ప్రారంభించారు. తర్వాత వందేళ్ల వరకు హవాయినే అత్యధిక సాగుదారు. 2010వ దశకం నుంచి సాగు చేస్తున్న దక్షిణాఫ్రికా ఇప్పుడు అత్యధిక ఉత్పత్తిదారుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సాగువుతున్న ఆస్ట్రేలియాకు చెందిన ఆహార పంట ఇదే!రెండు వంగడాలుమకడమియ చెట్టు జాతులు నాలుగు. ఇందులో రెండు రకాలను వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. మొదటిది మకడమియ ఇంటెగ్రిఫోలియ. దీని కాయ పెంకు నున్నగా ఉంటుంది. రెండోది మకడమియ టెట్రాఫిల్లా. దీని కాయ పైపెంకు గరుకుగా ఉంటుంది. దీనికి మరింత సువాసన ఉంటుంది. కొత్త చిగుళ్లు ఎర్రగా, ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. నాటిని నాలుగేళ్లలో కాపుకొస్తుంది. పొడవాటి కంకికి పూత పూస్తుంది. గెలలుగా కాయలు కాస్తాయి. 8 ఏళ్ల చెట్టు ఏటా 18 కేజీల కాయలు కాస్తుంది. కాయల బరువుకు కొమ్మలు విరిగే పరిస్తితి కూడా ఉంటుందట. అయితే, కాయల బరువులో పైన పెంకు బరువు 72.4% పోగా 27.6% తినదగిన గింజలు వస్తాయి.దక్షిణాఫ్రియా సూటబుల్ప్రస్తుతం మకడమియ నట్స్ సాగులో దక్షిణాఫ్రికాదే ఆధిపత్యం. ఆ దేశపు వాతావరణం, సారవంతమైన నేలలు, ఆధునిక పద్ధతుల్లో సాగుకు అధిక పెట్టుబడులు పెట్టడంతో దక్షిణాఫ్రికాలోని లింపొపొ, క్వాజులు–నటల్, పుమలంగ రాష్ట్రాల్లో సాగు మకడమియ సాగు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నట్స్కు డిమాండ్ కారణంగా పెద్ద కమతాల రైతులు ఆసక్తి చూపటంతో విస్తీర్ణం త్వరితగతిన పెరిగింది. ప్రాసెసింగ్ సదుపాయాలు, ఎగుమతి వసతులకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం, చీడపీడలను తట్టుకునే నాణ్యమైన అధికోత్పత్తి వంగడాలను వాడటం దక్షిణాఫ్రికాకు కలిసి వచ్చింది. ప్రస్తుతం 60 వేల మెట్రిక్ టన్నుల మకడమియ కాయలను ఏటా ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచ మార్కెట్ సరఫరాలో ఇది 30%. ఆస్ట్రేలియాఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ఈశాన్య ప్రాంతం, క్వీన్స్లాండ్ మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో ఆది నుంచి విస్తారంగా సాగువుతోంది. అందుకే దీనికి క్వీన్స్లాండ్ నట్, బుష్ నట్, మరూచి నట్, బాపిల్ నట్ అని కూడా పిలుస్తారు. అక్కడి ఆదివాసులకు ఇదొక ముఖ్య ఆహారం. యూరోపియన్లు ఆస్ట్రేలియాకు రాక మునుపు నుంచే వారు వీటిని తింటున్నారనటానికి ఆధారాలున్నాయని చెబుతారు. పొదలా పెరిగే చెట్టుకు కాచేది కాబట్టి బుష్ నట్ అన్నారు. ఆస్ట్రేలియా 45 వేల నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల కాయలను ప్రతి ఏటా ఉత్పత్తి చేస్తోంది. పండించిన దాంట్లో నుంచి 70% వరకు జపాన్, అమెరికా, చైనాలకు ఎగుమతి చేస్తోంది.మలావిఆఫ్రికా ఖండంలో వ్యవసాయ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మలావి. గత పదేళ్లలో మకడమియ సాగు ఈ దేశంలో బాగా విస్తరించింది. ఈ దేశపు వాతావరణం, సారవంతమైన భూములు అనుకూలిస్తున్నాయి. ప్రస్తుతం ఏటా 8 వేల నుంచి 10 వేల టన్నుల వరకు ఉత్పత్తి చేస్తోంది.కెన్యామలావి మాదిరిగానే కెన్యా కూడా కాఫీ, తేయాకు పంటలకు బదులుగా మకడమియ సాగును ప్రోత్సహిస్తోంది. 6 వేల నుంచి 8 వేల మకడమియ నట్స్ను కెన్యా ఏటా పండిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రాసెసింగ్ సదుపాయాలను కూడా సమకూర్చుకుంది.హవాయిఅమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భాగమైన హవాయి దేశంలోని మిగతా రాష్ట్రాలకు వందల మైళ్ల దూరంలో ఉండే ద్వీప రాష్ట్రం. ఈ ఒక్క రాష్ట్రంలోనే మకడమియ సాగవుతోంది. 20వ దశాబ్దంలో ఇదే అత్యధికంగా పండించింది. తర్వాత కాలంలో దక్షిణాఫ్రియా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం హవాయి ఏటా 5–6 వేల మెట్రిక్ టన్నులు పండిస్తోంది. 250 కోట్ల డాలర్ల మార్కెట్ప్రపంచవ్యాప్తంగా మకడమియ గింజలకున్న ప్రస్తుత మార్కెట్ విలువ 250 కోట్ల డాలర్లు. వచ్చే పదేళ్లలో చాలా పెరుగుతుందని చెబుతున్నారు. మకడమియ పోషక విలువల గురించి ఆరోగ్య స్పృహ గల వారిలో అవగాహన పెరుగుతుండటం.. మొక్కల నుంచి వచ్చే కొలెస్ట్రాల్ లేని ఆయిల్స్కు ఆదరణ పెరుగుతుండటం.. ఆసియా, యూరప్ దేశాల్లో స్పెషాలిటీ, గౌర్మెట్ స్నాక్ మార్కెట్లు విస్తరిస్తుండటం.. పోలాంట్ బేస్డ్ డెయిరీ ప్రత్యామ్నాయాలకు ఆదరణ పెరటంతో మకడమియ గింజలతో తయారుచేసే పాలకు ప్రజాదరణ రావటం.. వంటి కారణాల వల్ల మకడమియ వాణిజ్యపరంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చదవండి: ఔషధ మొక్క.. ఆరోగ్యానికి రక్షకరువు ప్రాంతాల్లో సాగు చేసేటప్పుడు నీటి యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవటం, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల్లో మకడమియ సాగును విస్తరింపజేసే దశలో జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవటం, చిన్న–సన్నకారు రైతులకు సంబంధించి న్యాయబద్ధమైన వాణిజ్య ప్రయోజనాలు అందేలా చేయటం ద్వారా మకడమియ సాగును పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది.కమ్మటి రుచిమకడమియ గింజలకు ఇంత ప్రాచుర్యం రావటానికి కారణం అందులోని సుసంపన్నమైన పోషక విలువలతో పాటు వెన్న వంటి రూపం, రుచి, సువాసనతో గింజ రుచిగా ఉండటమే. ఈ గింజను కాయలో నుంచి వెలికితీసిన తర్వాత అలాగే తినొచ్చు లేదా వేపుకొని తినొచ్చు. చాక్లెట్లు, అనేక చిరుతిళ్లలో వాడుతున్నారు. 78% వరకు నూనె ఉంటుంది. వంటకు, సౌందర్య సాధనాల తయారీలో వాడుతున్నారు. డెయిరీ ఫ్రీ బటర్స్, స్ప్రెడ్స్ తయారీలో ఈ నూనె వాడుతున్నారు. మకడమియ ఆయిల్ను ప్రీమియం హెయిర్కేర్, స్కిన్కేర్, మసాజ్ ఉత్పత్తుల్లో వాడుతున్నారు. ఒమెగా 7 ఫ్యాటీ ఆసిడ్స్, మోయిశ్చరైజింగ్ ప్రోపర్టీస్ కారణంగా దీనికి ప్రాధాన్యం ఉంది. -
దేశీ టొమాటోల సిరి! మైసూరులో విత్తనోత్సవం
కొన్ని పంటల్లో దేశీ వంగడాల వైవిధ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. కర్ణాటకకు చెందిన వి. కాంతరాజు 27 రకాల దేశీ టొమాటో వంగడాలను సాగు చేస్తూ పరిరక్షిస్తున్నారు. అత్యంత విలక్షణమైన ఆఫ్రికా టోగో, బ్లాక్ ప్లమ్, బ్లాక్ టొమాటో వంటి విశిష్ట రకాలు కూడా ఇందులో ఉన్నాయి. టొమాటోలే కాదు అనేక పంటల దేశీ వంగడాలను సేకరించటం, వాటిని రైతులకు ఇచ్చి ఏటేటా పండిస్తూ సంరక్షించటమే పనిగా పెట్టుకుంది మైసూరుకు చెందిన సేంద్రియ రైతుల సంఘం ‘సహజ సమృద్ధ’. కాంతరాజు కూడా ఈ సంఘం సభ్యుడే. ఈ 27 రకాల టొమాటోలతో పాటు చాలా రకాల ధాన్యాలు, పప్పుధాన్యాలను సైతం ఆయన సాగు చేస్తున్నారు. దేశీ విత్తనాలతో కూడిన సమీకృత సేంద్రియ వ్యవసాయమే ఆహార, పౌష్టికాహార, ఆదాయ భద్రతను కల్పిస్తుందని కాంతరాజు అంటున్నారు. కర్ణాటక దేశీ పంటల వైవిధ్యాన్ని కళ్లారా చూడాలంటే జూలై 5,6 తేదీల్లో మైసూరులో జరిగే దేశీ విత్తనోత్సవాన్ని సందర్శించాల్సిందే! అందరూ ఆహ్వానితులే. వివరాలకు 70900 09944.బీఆర్సీలపై 4 రోజుల శిక్షణప్రకృతి వ్యవసాయంలో ఘన, ద్రవరూప ఎరువులు, ద్రావణాలు, కషాయాలు, జీవన ఎరువులు, జీవన పురుగు మందులను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చే కేంద్రాలను బయో రిసోర్స్ సెంటర్లు(బిఆర్సిలు) అంటారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకునే వ్యక్తులు, సహకార సంస్థలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాల నిర్వాహకులకు నూజివీడు సమీపంలో కొండపర్వలో ఏర్పాటైన కృష్ణసుధ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీలో జులై 1 నుంచి 4 వరకు 4 రోజుల పాటు ఆంగ్లంలో శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. బిఆర్సిలకు సంబంధించిన 10 అంశాలపై శిక్షణ ఇస్తారు. ఫీజు, రిజిస్ట్రేషన్ వివరాలకు.. 850 028 3300. -
రసాయనిక ఎరువుల్లో 60–70% వృథా!
‘నత్రజని కాలుష్యం’ భూగోళంపై జీవనాన్ని కష్టాలపాలు చేస్తోంది. రసాయనిక ఎరువుల వాడకం, బొగ్గు/పెట్రోలియం ఉత్పత్తుల వంటి శిలాజ ఇంధనాల వాడకం అంతకంతకూ పెరిగిపోతుండటమే ఇందుకు కారణం. మనుషుల పనుల వల్ల అతిగా పర్యావరణంలోకి వెలువడుతున్న నత్రజని.. ప్రకృతిలోని సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తోంది. ‘నత్రజని కాలుష్యం’ ముఖ్యంగా మూడు రకాలుగా భూగోళంపై మూడు సంక్షోభాలను కలిగిస్తోంది. దీన్నే ‘ప్లానెటరీ ట్రిపుల్ క్రైసిస్’ అంటారు. సుస్థిర పద్ధతుల్లో నత్రజని కాలుష్యాన్ని నిర్వహించే మార్గాలపై ప్రొఫెసర్ నందుల రఘురామ్ గత పాతికేళ్లుగా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనీషియేటివ్ ఎమెరిటస్ చైర్మన్గా, గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ(ద్వారాక, ఢిల్లీ)లో ప్రొఫెసర్గా డా.రఘురామ్ సేవలందిస్తున్నారు. 2017లో ప్రపంచంలోనే మొదటిగా ‘ఇండియన్ నైట్రోజన్ అసెస్మెంట్’ నివేదిక రూపొందించటంలో ఆయనది కీలకపాత్ర. దీనిపై ఐక్యరాజ్యసమితిలో అప్పట్లోనే తీర్మానం జరిగింది కూడా. డా.రఘురామ్ని ‘సాక్షి సాగుబడి’ ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. రసాయనిక ఎరువుల ‘నత్రజని కాలుష్య’ తీవ్రత ఎంతో? కారణాలేమిటో? పరిష్కారాలేమిటో? ఇప్పుడు తెలుసుకుందాం.ప్రజల ఆకలి తీర్చే క్రమంలో అధిక దిగుబడుల కోసం హరితవిప్లవంలో భాగంగా వాడటం ప్రారంభించిన రసాయనిక ఎరువులు నిజానికి పంటలకు ఉపయోగపడుతున్న దానికంటే వృథా అవుతున్నది చాలా ఎక్కువ. ముఖ్యంగా నత్రజని ఎరువుల వాడకం, వృథా ఎక్కువే. ప్రొఫెసర్ నందుల రఘురామ్ మాటల్లో చెప్పాలంటే.. ‘మన దేశంలో పొలాల్లో వేస్తున్న రసాయనిక ఎరువుల్లో 30–40% మాత్రమే పంటకు ఉపయోగపడుతున్నాయి. 60–70% వృథాగా పోతున్నాయి. నీటి కాలుష్యానికి, వాయు కాలుష్యానికి, భూతాపోన్నతికి కారణమవుతున్నాయి. జలవనరుల్లో జీవవైవిధ్యానికి తూట్లు పొడుస్తున్నాయి’ అన్నారాయన. ఇదీ చదవండి: పామూ లేదు, దోమా లేదు.. ఎక్కడో తెలుసా?6 కోట్ల టన్నుల ఎరువులుమన దేశంలో పంటల సాగు కోసం 2023–24లో 6 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా రసాయనిక ఎరువులు వాడారు. యూరియా 357.81 లక్షల టన్నులు, డిఎపి 109.73 లక్షల టన్నులు, ఎంఓపి 16.45 లక్షల టన్నులు, ఎన్పికె మిశ్రమ ఎరువులు 116.80 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ ఎరువులపై సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. లక్షన్నర కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. మరోవైపు, ఎరువుల మోతాదు పెంచుతున్నా దిగుబడులు పెరగని స్థితి నెలకొంటున్నది. రైతులు ఏటేటా అధికంగా ఎరువులు వాడకతప్పని స్థితిని ఎదుర్కొంటున్నారు. ‘ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్’నత్రజని కాలుష్య ప్రభావంతో ‘ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్’ పెచ్చరిల్లుతోంది. వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం, కాలుష్యం అనే మూడు పరస్పర అనుసంధాన సంక్షోభాలకు ఇది నేరుగా దోహదం చేస్తోంది. 1 వ్యవసాయంలో ఎరువుల వాడకం నత్రజని కాలుష్యానికి ప్రధాన మూలం. పంటలు వాడుకోలేకపోయిన అధిక నత్రజని నీటి వనరుల్లోకి వెళ్లి భూగర్భ జలాల్లోకి చేరుతోంది. 2పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం వలన నైట్రోజన్ ఆక్సైడ్లు విడుదలవుతున్నాయి. ఇది వాయు కాలుష్యం, వాతావరణ మార్పులకు దోహదం చేస్తోంది.3 శుద్ధి చేయని లేదా సరిగా శుద్ధి చేయని మురుగునీటిలో అధిక స్థాయిలో నత్రజని, ఇతర పోషకాలు ఉంటాయి, ఇవి చెరువులు, రిజర్వాయర్లు, నదులు, సముద్రాలను కలుషితం చేస్తాయి. ఈ కాలుష్యం వల్ల ఆక్సిజన్ లోపించి చేపలు, ఇతర జలచరాలు చనిపోతాయి. ఆ నీటిలో విపరీతంగా నాచు పెరిగిపోతుంది. ఇది జలచరాలకు మరణశాసనంగా మారుతుంది. ఏమి చేయవచ్చు?→ నత్రజని తదితర ఎరువులను అవసరం మేరకు తగుమాత్రంగా, సముచిత పాళ్లలో ఉపయోగించాలి. → పశువుల పేడ మూత్రాన్ని సక్రమంగా సేకరించి, వినియోగించే పద్ధతులను అమలు చేస్తే నత్రజని కాలుష్యం తగ్గుతుంది. → వ్యర్థాలను తగిన రీతిలో పునర్వినియోగించటం, వనరుల వినియోగ సామర్థ్యాన్ని ప్రోత్సహించి అధిక ఎరువుల వాడకం అవసరాన్ని తగ్గించవచ్చు. → ప్రభుత్వాలు నత్రజని ఉద్గారాలను పరిమితం చేసే పద్ధతులను ప్రోత్సహించేలా విధానాల్లో మార్పులు తేవాలి. → నత్రజని కాలుష్యాన్ని అరికట్టే క్రమంలో సమాజంలో వ్యక్తుల పాత్ర కూడా కీలకం. మాంసం వినియోగాన్ని తగ్గించటం, రసాయనాల్లేని వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, నత్రజని కాలుష్యాన్ని పరిష్కరించే విధానాల కోసం కృషి చెయ్యాలి. ఈ పోషకాలను సమర్థంగా వాడుకోలేమా?దేశంలో రోజుకు 15,000 కోట్ల లీటర్లకు పైగా మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఈ నీటిలో 65,250 మెట్రిక్ టన్నుల నత్రజని తదితర పోషకాలు ఉంటాయి. శుద్ధి చేసి ఆ పోషకాలను పునర్వినియోగించలేక ప్రతి రోజూ 55,000 మెట్రిక్ టన్నులకు పైగా పోషకాలను కోల్పోతున్నాం. మురుగు నీటిలోని పోషకాలను పూర్తిగా రీసైకిల్ చేస్తే రసాయనిక ఎరువులు 40% వరకు ఆదా అయ్యేవని ప్రొఫెసర్ రఘురామ్ అన్నారు. అదేవిధంగా, దేశంలో 20 కోట్ల పశువులున్నాయి. రోజుకు ఒక జంతువుకు 15 కిలోల పేడ వస్తుంది. అందులో 5% ఎన్పికె పోషకాలు ఉన్నాయి. వాటి పరిమాణం 1,50,000 మెట్రిక్ టన్నులు. ఇది మనం వాడే మొత్తం రసాయనిక ఎరువుల్లో 95 శాతం. దీనికి అదనంగా, రోజుకు ఒక పశువు 15–20 లీటర్ల మూత్రం పోస్తుంది. వీటిలో 3% పోషకాలు ఉంటాయి. ఆ మొత్తం 1,20,000 మెట్రిక్ టన్నులు. సక్రమంగా మూత్రాన్ని సేకరించి వాడుకోలేక చాలా కోల్పోతున్నాం. మరో మాటలో చెప్పాలంటే.. పంట పొలాలు, జనావాసాల నుంచి వెలువడే మురుగునీటిలో 3,35,000 టన్నులకు పైగా పునర్వినియోగించదగిన పోషకాలు ఉన్నాయి. ఇది మన దేశంలో రోజువారీగా వాడుతున్న ఎరువులకు రెట్టింపు ఉంటాయని డా.రఘురామ్ వివరించారు.ఎరువు 4 రోజుల్లో మాయం!పంటలకు స్థూల పోషకాలైన నత్రజని (యూరియా), ఫాస్ఫరస్, పొటాషియం/సల్ఫర్లను 4:2:1 నిష్పత్తిలో వాడాలి. ఉదా.. వరి పంటకు సీజన్కు హెక్టారుకు అన్నీ కలిపి 120 కిలోల ఎరువు వెయ్యాలని శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. అయితే, రైతులు ఈ నిష్పత్తిపై సరైన అవగాహన లేక ఈ మోతాదులను పట్టించుకోవటం లేదు. పంట పచ్చబడితే చాలన్నట్లు యూరియానే పొలాల్లో కుమ్మరిస్తున్నారని, అది కూడా పంట సీజన్లో కేవలం రెండు సార్లు మాత్రమే ఎరువులు వేస్తున్నారని ప్రొఫెసర్ రఘురామ్ అన్నారు. రసాయనిక ఎరువులను పంట 2–4 రోజుల్లోనే తీసుకోగలుగుతుంది. పంట తీసుకునేది 30–40% మాత్రమే. మిగతా 60–70% ఎరువు నీటి ద్వారా, గాలి ద్వారా వృథాగా పోతున్నది. సమర్థవంతంగా ఎరువు వినియోగించకపోవటం వల్ల సుమారు రూ. లక్ష కోట్ల ఎరువుల సబ్సిడీ వృథా అవుతోందని ప్రొ. రఘురామ్ అన్నారు. ఏ ఎరువు ఎంత పాళ్లలో వేయాలో అంతే వెయ్యాలి. తక్కువ మోతాదులో, ఎక్కువ సార్లు వేస్తే ఎక్కువగా పంటకు ఉపయోగం. వృథా తగ్గుతుంది. అప్పుడే నత్రజని కాలుష్యమూ తగ్గుతుంది అన్నారాయన. అయితే, ఎక్కువ సార్లు వేయటానికి రైతులకు ఖర్చు ఎక్కువ అవుతుంది. మంచి గిట్టుబాటు ధర దక్కినప్పుడే రైతులు ఆపని చేయగలుగుతా రన్నారు. -
Sagubadi ఎరువుల లోకం..!
రసాయనిక ఎరువులు, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, నీటిపారుదల సదుపాయాలు.. ఈ మూడింటిని ఒక ప్యాకేజీగా రైతులకు అందుబాటులోకి తెచ్చింది ‘హరిత విప్లవం’. ఆంగ్లంలో ఈ మూడిటిని కలిపి గ్రీన్ రెవెల్యూషన్ టెక్నాలజీస్ (జిఆర్టిలు) అంటారు. హరిత విప్లవ కాలంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో రైతులకు ఈ మూడే విస్తృతంగా అందుబాటులోకి రావటంతో పంట దిగుబడులు ఇబ్బడిముబ్బడి అయ్యాయి. ఏటేటా రసాయనిక ఎరువులతో పాటు పురుగుమందులు తదితర వ్యవసాయ రసాయనాల వాడకం పెరుగుతూనే ఉంది.పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు తదితర వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తిని పెంచవలసి వస్తోంది. అయితే, రసాయనిక ఎరువుల వాడకాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోవటం వల్ల పర్యావరణ సంబంధమైన సమస్యలు వస్తున్నాయి. నేలలు చౌడుబారిపోతున్నాయి. నీటి వనరులు రసాయనిక ఎరువుల అవశేషాలతో కలుషితం అవుతున్నాయన్న ఆందోళనలు సైతం పెరిగిపోతున్నాయి. అందువల్లనే పర్యావరణానికి అంతగా హాని చేయని సుస్థిర / సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇటీవల కాలంలో గతమెన్నడూ లేనంతగా ఆదరణ పొందుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ నూటికి 95 శాతం మంది రైతులు రసాయనిక ఎరువులతోనే వ్యవసాయం చేస్తున్నారు. ఇంతకీ, ఏయే దేశాల్లో పంటలకు ఎంతెంత మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతున్నారు? నత్రజని అనగానే యూరియా గుర్తొస్తుంది. పంటలకు యూరియా యేతర మార్గాల ద్వారా నత్రజని ఎంతెంత అందుతుంది? ఎరువులను ఎంతెంత వాడుతున్నారు? వీటిని శాస్త్రవేత్తలు సూచించిన దానికన్నా అనేక రెట్లు ఎక్కువ వాడుతుండటం వల్ల వస్తున్న పరిణామాలేంటి? ఇటువంటి ఆసక్తికరమైన అంశాలను పరిశీలిద్దాం.. కాసేపు రసాయనిక ఎరువుల లోకంలోకి తొంగి చూద్దాం...పంట మొక్కలు, తోటలు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్ని ఇవ్వాలంటే వాటి పెరుగుదలకు అవసరమైనంత మోతాదులో 17 రకాల పోషకాలు అవసరం. ఇవి రెండు రకాలు.. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. కర్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్.. ఈ మూడింటిని వాతావరణం నుంచి మొక్కలు గ్రహిస్తాయి. మిగతా 14 రకాలు నేల నుంచి వేర్ల ద్వారా పంటలు గ్రహిస్తాయి.చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?అదేవిధంగా ఎరువుల్లో రెండు రకాలు. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు (జీవన ఎరువులు కూడా ఈ కోవలోకే వస్తాయి). నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి స్థూల పోషకాలు. ఇవి పెద్ద పరిమాణంలో పంటలకు అవసరం. ఐరన్, జింక్, బోరాన్, మెగ్నీషియం.. వంటి సూక్ష్మపోషకాలు. ఇవి స్వల్ప పరిమాణంలో అవసరం. సాధారణంగా రసాయనిక ఎరువులు అని అంటే చాలా వరకు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అనే అర్థం. ఎన్పీకే ఎరువులని అంటుంటాం. 2024లో 19.54 కోట్ల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులను ప్రపంచవ్యాప్తంగా రైతులు పంటల సాగు కోసం ఉపయోగించారు. 2023 కన్నా ఇది కొంచెం ఎక్కువ. 2022లో 18.5 కోట్ల టన్నులు వాడారు. 2021తో పోల్చితే ఇది 7% తక్కువ. కొవిడ్ నేపథ్యంలో రసాయనిక ఎరువుల ధరలు బాగా పెరిగిపోవటంతో కొన్ని చోట్ల వాడకం తగ్గినా అది తాత్కాలిక పరాణామమేనని చెప్పాచ్చు.రసాయనిక ఎరువుల ఉత్పత్తి, ఎగుమతి యూరప్, అమెరికా ఖండాల్లో ఎక్కువ. ఐదు దేశాలు ఎరువుల ఎగుమతిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే వాడకం ఆసియాలో ఎక్కువ. భారత్ సహా ఆసియా దేశాలన్నీ రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకుంటూ వ్యవసాయానికి మద్దతు పలుకుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధ కాలంలో ఎరువుల సరఫరా తగ్గి, ధర పెరిగిపోవటం మనకు తెలుసు. ఆయా దేశాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, నేలల్లో సారం, రైతుల స్థోమత, వారు అనుసరిస్తున్న సాంకేతికత, స్థానిక ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలు వంటి అనేక పర్యావరణ, ఆర్థిక, భౌగోళిక అంశాలపై ఎరువుల వాడకం మోతాదులు, దిగుబడులు వంటివి ఆధారపడి ఉంటాయి.ఎరువుల వినియోగం 18.5 కోట్ల టన్నులుప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం (పంటలు, పశుపోషణ, ఆక్వాకల్చర్, అడవుల పెంపకం, చేపల వేటసహా) ద్వారా సమకూరే ఆదాయం 2000–2022 మధ్య కాలంలో 89 శాతం పెరిగింది. 2022లో 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో ఆసియా దేశాలదే 66%తో ప్రధాన పాత్ర. ప్రపంచ దేశాల వార్షిక ఆదాయంలో 4% మాత్రమే వ్యవసాయ రంగం నుంచి వస్తున్నప్పటికీ స్వతంత్ర ఆహారోత్పత్తి వ్యవస్థను కలిగి ఉండటం ఏ దేశానికైనా ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవటానికి అవసరమే. అందుకు ఈ రోజుకు ప్రధాన సాధనంగా రసాయనిక ఎరువులే నిలుస్తున్నాయి. ఇదీ చదవండి: పెళ్లైన 20 ఏళ్లకు.. మా ఆవిడ బెదిరిస్తోంది : కేసు అవుతుందా?ఆహార వ్యవసాయ సంస్థ (యుఎన్–ఎఫ్పిఓ) ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం.. 2022 నాటికి ప్రపంచంలో రసాయనిక ఎరువుల వార్షిక వినియోగం 18.5 కోట్ల టన్నులకు చేరింది. ఇందులో సింహభాగం 58% నత్రజని ఎరువులే. 10.8 కోట్ల టన్నుల యూరియా వాడకం జరిగింది. 4.2 కోట్ల టన్నుల ఫాస్ఫరస్ (23%), 3.5 కోట్ల టన్నుల పొటాషియం (19%) ఎరువులను రైతులు వాడారు. 2022లో రసాయనిక ఎరువుల వాడకంలో 55 శాతం వాటాతో ఆసియా ముందంజలో ఉంది. అమెరికా దేశాలు రెండోస్థానంలో, యూరప్ మూడో స్థానంలో, ఓసియానా నాలుగో స్థానంలో ఉన్నాయి. చైనా, భారత్, బ్రెజిల్, అమెరికా దేశాలు అధికంగా రసాయనిక ఎరువులు వాడుతున్నాయి. ఆసియా దేశాల్లో వాడుతున్న ఎరువుల్లో నత్రజని ఎరువుల వాటా 61–62% మేరకు ఉంది.హెక్టారుకు 130 కిలోలుహెక్టారు పొలంలో రసాయనిక ఎరువుల వాడకం 130 కిలోల మేరకు ఆసియా దేశాల్లోనే అత్యధికంగా ఉంది. అమెరికా ఖండంలో 130 కిలోలు, ఓసియానా దేశాల్లో 84 కిలోలు, యూరప్లో 64 కిలోలు, ఆఫ్రికాలో అతి తక్కువగా 22 కిలోల మేరకు రసాయనిక ఎరువులు వాడుతున్నారు. అమెరికా ఖండంలో 2000–2022 మధ్యకాలంలో వినియోగం 57% పెరిగింది. ఆసియాలో 37%, ఆఫ్రికాలో 32%, ఓసియానాలో 15% పెరగ్గా, యూరప్ దేశాల్లో 2% తగ్గింది. చెరకు, మొక్కజొన్న. గోధుమ, వరి పంటలను అత్యధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.వర్షం ద్వారా 9.8 కిలోల నత్రజని!ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పంటలకు నత్రజని అందేది యూరియా ద్వారా మాత్రమే కాదు. అందుకు అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. యుఎన్–ఎఫ్ఎఓ గణాంకాల ప్రకారం (2022).. ప్రపంచవ్యాప్తంగా సగటున హెక్టారుకు ఏడాదికి సేంద్రియ ఎరువుల ద్వారా 16.2 కిలోల నత్రజని పంటలకు అందుతోంది. రసాయనిక ఎరువుల ద్వారా అందుతోంది 64.3 కిలోలు. వర్షం/మంచు ద్వారా 9.8 కిలోల నత్రజని వాతావరణంలో నుంచి గ్రహించి సూక్ష్మజీవులు అందిస్తున్నది 25.5 కిలోలు. పంట కోతల ద్వారా (ఫలసాయం, పంట వ్యర్థాలతో కలుపుకొని) మనం భూమి నుంచి పొందుతున్న నత్రజని 65.1 కిలోలు మాత్రమే. చదవండి: 125 రోజుల పొట్టి కంది.. ఏడాదికి 3 పంటలు!అయితే, వర్షం, మంచు ద్వారా భారత్లో పొలాలకు 2022లో అందిన నత్రజని సగటున హెక్టారుకు 21.2 కిలోలు! ఇది ప్రపంచ సగటు 9.8 కిలోలతో పోల్చితే రెట్టింపు కన్నా ఎక్కువ కావటం విశేషం. 2021లో వివిధ మార్గాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా హెక్టారు భూమికి సగటున 116.9 కిలోల నత్రజని అందింది. అందులో నుంచి, పంట పండిన తర్వాత మనం పొందే ఫలసాయం ద్వారా 65.1 కిలోల నత్రజని పోగా మిగతా 51.8 కిలోల నత్రజని ప్రతి హెక్టారు భూమిలో మిగిలిందని ఎఫ్.ఎ.ఓ. లెక్కగట్టింది. 2000 సంవత్సరంలో ఇలా మిగిలింది 48.3 కిలోలు మాత్రమేనట. -
శాటిలైట్ లెక్క.. సాగు పక్కా
దేశంలో సగానికిపైగా ప్రజలకు జీవనాధారం వ్యవసాయమే. అలాంటి ప్రధాన రంగానికి సంబంధించి కచ్చితమైన గణాంకాల సేకరణ ఇన్నాళ్లూ కలగానే ఉంది. మొట్టమొదటిసారిగా శాటిలైట్ ఆధారిత అంచనాల సేకరణ ప్రారంభం కావటంతో కచ్చితత్వంతో కూడిన గణాంకాల సేకరణకు మార్గం సుగమమైంది. ఇప్పటికే పైలట్ అధ్యయనాలు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్లో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగినట్లు డిజిటల్ సర్వే గుర్తించింది. ఇది వ్యవసాయ గణాంకాల నమోదు ప్రక్రియలో పెద్ద ముందడుగు. కేంద్ర వ్యవసాయ శాఖ చొరవతో; రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సాగు లెక్కల సేకరణ, డిజిటలీకరణ ఇక పక్కాగా జరగనుంది. – సాక్షి, సాగుబడిదేశంలో వ్యవసాయ రంగంలో గణాంకాల ప్రక్రియ కొంత సంక్లిష్టంగా, సుదీర్ఘ ప్రక్రియగా ఉంది. గ్రామస్థాయిలో సిబ్బంది భూమి రికార్డు పుస్తకాల్లో సాగు విస్తీర్ణం, పంటల వివరాలను నింపుతారు. ఖరీఫ్ జూన్లో ప్రారంభమైనప్పటికీ పంట అంచనాలకు సంబంధించిన గణాంకాలు అరకొరగానే అందుతుండేవి. ఈ గణాంకాలను అనేక సార్లు సవరించేవారు. చివరికి ఎప్పటికో తుది అంచనాలు పాలకులకు అందుబాటులోకి వచ్చేవి. అయితే, శాటిలైట్ డేటాతో అనుసంధానం చేసి వ్యవసాయ గణాంకాల సేకరణను డిజిటలీకరించటంతో సెప్టెంబర్ నాటికే తొలి అంచనాలు అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయ గణాంకాల డిజిటలీకరణ దిశగా ఇది చాలా పెద్ద ముందుడుగని చెప్పుకోవచ్చు.పూర్తయిన పైలట్ అధ్యయనాలువ్యవసాయ రంగానికి సంబంధించి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా; ముందస్తు మార్కెటింగ్ సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు చేపట్టాలన్నా.. నమ్మకమైన గణాంకాల సేకరణ అత్యంత కీలకం. ఇప్పుడు ఈ సమస్యను అధిగమించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేశాయి. ‘వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే పైలట్ అధ్యయనాలు పూర్తయ్యాయి. ఫలితాలు 93–95% కచ్చితత్వంతో వచ్చాయి. గణాంకాలను మాన్యువల్గా నమోదు చేసినప్పటితో పోలిస్తే ఇది చాలా మెరుగు. అందువల్ల ఈ ఏడాది ఖరీఫ్ నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో శాటిలైట్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నాం. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో పండించారు, దిగుబడుల తొలి డిజిటల్ అంచనాలను సెప్టెంబర్ నాటికే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశాం’అని అధికార వర్గాలు చెబుతున్నాయి.2024లోనే డిజిటల్ క్రాప్ సర్వేసాధారణంగా భూమి రికార్డులు నిర్వహించే గ్రామస్థాయి సిబ్బంది (గిరిదవారీ పద్ధతి) ప్రతి ఏటా సాగయ్యే పంటల వివరాలు, విస్తీర్ణం, దిగుబడి అంచనాలు తదితర వివరాలను పుస్తకాల్లో నమోదు చేస్తూ, అనేక దఫాలు సవరిస్తూ ఉండేవారు. దాంతో అనిశ్చితి నెలకొనేది. అటువంటి అనిశ్చితికి స్వస్తి చెబుతూ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ గణాంకాల సేకరణ వ్యవస్థను మెరుగుపరిచే పనికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర వ్యవసాయ శాఖ గత ఏడాది నుంచి పంటల సాగు వివరాలపై శాటిలైట్ ఆధారిత గణాంకాల సేకరణ ప్రారంభించింది. 2024 ఖరీఫ్లో డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంటల విస్తీర్ణం, తదితర గణాంకాల డిజిటలీకరణ జరిగింది. దాదాపు కచ్చితమైన పంట అంచనాల సేకరణ సాధ్యపడింది. ఉత్తరప్రదేశ్లో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగినట్లు ఆ డిజిటల్ సర్వే గుర్తించింది. ఆ అనుభవాలతోనే ఈ ఏడాది అన్ని రాష్ట్రాల్లో డిజిటల్ పద్ధతుల్లో శాటిలైట్ ఆధారిత గణాంకాల సేకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి.కొత్త పంటల వివరాలూ..పంటల మార్పిడి గురించి, కొత్త పంటల సాగుకు సంబంధించి గణాంకాల వివరాలు గతంలో లభించేవి కాదు. సంప్రదాయకంగా సాగయ్యే వరి, మొక్కజొన్న, జొన్న వంటి 25–26 రకాల పంటల వివరాలు మాత్రమే గణాంకాల్లోకి చేరేవి. ఇప్పుడు శాటిలైట్ డేటా ఆధారంగా డిజిటల్ గణాంకాల సేకరణతో ఈ సమస్య తీరనుంది. బెర్రీస్, అవొకాడో, డ్రాగన్ఫ్రూట్, కివి వంటి కొత్తపంటల సాగును సైతం ఇప్పుడు నమోదు చేస్తున్నారని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. -
Asafoetida ఐదేళ్ల శ్రమ.. ఇంగువ పండిందోచ్!
ఇంగువ.. (Heeng or asafoetida) మన ఆహార సంస్కృతితో విడదీయరాని అనుబంధం ఉన్న సుగంధ్ర ద్రవ్యం. భారతీయ వంటకాల్లో ఇంగువకు విశిష్ట స్థానం ఉంది. ఏ వంటకంలో అయినా చిటికెడు వేస్తే చాలు. అతి తక్కువ పరిమాణంలో వినియోగించినా అత్యంత ప్రభావశీలతనుచూపే విశిష్ట ద్రవ్యం. ఇది కూడా ఒక మొక్క నుంచే వస్తుంది. వేలకొలదీ పంటల జీవ వైవిధ్యానికి ఆలవాలమైనభారతదేశంలో ఇంగువ పంట మాత్రం లేదంటేఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిజం. ప్రతి ఏటా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. 2022–23లో 1,442 టన్నుల (విలువ రూ. 1,504 కోట్లు) ఇంగువను దిగుమతి చేసుకుంటున్నాం.అయితే, సరికొత్త కబురేమిటంటే.. శీతల ఎడారుల్లో పండే ఈ పంటనుఇప్పుడు మన దేశంలోనూ పండించటం ప్రారంభించాం. భారతీయఇంగువ పంట సాగు చరిత్రలో 2025 మే 28 ఒక మైలురాయి. విదేశాల నుంచి విత్తనాలు తెప్పించి, మన దేశపు వాతావరణానికిమచ్చిక చేసుకొని, సాగు చేయటంలో విజయం సాధించినట్లు కేంద్రప్రభుత్వ సంస్థ సిఎస్ఐఆర్ అధికారికంగా ప్రకటించిన రోజిది. అన్నట్లు.. వంటకాల్లోనే కాదు, ఔషధంగానూ.. పంటలనుఆశించే తెగుళ్ల నివారణకూ ఇంగువ మందే! భారతీయ ఇంగువ పంటకుశుభారంభం జరిగిన సందర్భంగా ఆవిశేషాలేమిటో తెలుసుకుందాం.. మనం వాడుతున్న ఇంగువ శాస్త్రీయ నామం ‘ఫెరుల అస్స–ఫోటిడ’ ((Ferula assa-foetida). ఇంగువ సాధారణ వాతావరణంలో పండదు. అతిశీతల ఎడారి ప్రాంతాల్లో పండుతుంది.ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో సాగు చేయటం ప్రారంభం. బయోరిసోర్స్ సెంటర్ (ఐహెచ్బిటి)లోని శాస్త్రవేత్తలు ఐదేళ్లుశ్రమించి ఇంగువ పంటను ఎట్టకేలకు మచ్చిక చేసుకున్నారు. ఈ విషయాన్ని మే 28న ప్రకటించారు. ఐహెచ్బిటి పాలంపూర్ క్యాంపస్లో ఇంగువ విత్తనోత్పత్తి కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి డా. జితేంద్ర సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రారంభించారు. మొదటి విడత ఇంగువ మొక్కల నుంచి విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో, ఇక మన దేశంలో ఈ పంట పండించగలం అని శాస్త్రవేత్తలు ప్రకటించారు.ఫలించిన ఐదేళ్ల శ్రమఐహెచ్బిటి శాస్త్రవేత్తలు 2018లో తొలుత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల నుంచి ఇంగువ మొక్క విత్తనాలను అధికారికంగా జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్బిపిజిఆర్) ద్వారా క్వారంటైన్ వ్యవస్థ ద్వారా దిగుమతి చేసుకున్నారు. ఆ విత్తనాలను ప్రత్యేక నియంత్రిత వాతావరణంలో సాగు చేసి, వాటి ద్వారా ప్రమాదకరమైన చీడపీడలేవీ దిగుమతి కావటం లేదని నిర్థారణ అయిన తర్వాతే విత్తనాలను మన వాతావరణంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత టిష్యూకల్చర్ పద్ధతిలో ఇంగువ మొక్కలను అభివృద్ధి చేశారు. ఈ ప్రక్రియ మొత్తానికీ ఐదేళ్ల సమయం పట్టింది.ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్లో అఖిల్- జైనబ్మహాభారత కాలంలోనే... ఇంగువ ప్రస్తావన ఆయుర్వేద గ్రంథాలతోపాటు, మహాభారతం వంటి పురాతన గ్రంథాల్లోనే ఉంది. ఇంద్రియాలను, మానవ చేతనను శుద్ధి చేయటానికి ఇంగువను వాడేవారు. కడుపు నొప్పి, అజీర్తి నివారణకు.. వంటకం రుచిని పెంపొందించటం కోసం ఇంగువను ఉపయోగపడుతుందని చరక సంహిత చెబుతోంది. పిప్పాలడ సంహిత,పాణిని రచనల్లోనూ ఇంగువ ఉనికి ఉంది.–4 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకుఅతి తక్కువ వర్షపాతం పడే అతి శీతలప్రాంతాల్లో ఇంగువ మొక్క పెరుగుతుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాల్లో అనాదిగా సాగవుతోంది. నీరు నిలవని, తేమ తక్కువగా ఉండే ఇసుక నేలల్లో పెరుగుతుంది. ఏడాదికి 200 ఎం.ఎం. కన్నా తక్కువ వర్షపాతం ఉండాలి. 10–20 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నప్పుతుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది. శీతాకాలంలో –4 డిగ్రీల చలిని కూడా తట్టుకుంటుంది. అతిశీతల, అతి వేడి వాతావరణ పరిస్థితుల్లో ఇంగువ మొక్క నిద్రావస్థకు వెళ్లిపోతుంది. వాతావరణం అనుకూలించాక మళ్లీ చిగురిస్తుంది. అందుకే హిమాచల్ప్రదేశ్లోని లహాల్–స్పిటి జిల్లాల్లో ఈ పంట సాగుపై శాస్త్రవేత్తలు ఐదేళ్లుగా చేసిన ప్రయోగాలు ఫలించాయి. ఇంగువ మొక్కకు తల్లి వేరు నేలలోపలికి వేరూనుకుంటుంది. మందపాటి ఆ వేరు నుంచి, దుంప నుంచి సేకరించిన జిగురు వంటి పదార్ధాన్ని సేకరిస్తారు. దాన్ని ఎండబెట్టి, ప్రాసెస్ చేస్తే.. జిగురు పరిమాణంలో 40–64% మేరకు ఇంగువ వస్తుంది. ఔషధంగా వాడే ఇంగువ వేరు. వంటకు వాడే ఇంగువ వేరు. ఔషధంగా వాడే ఇంగువనే పంటలపై తెగుళ్ల నివారణకూ వాడుతుంటారు. ఇంగువ మొక్క పెరిగి పూత దశకు ఎదగడానికి ఐదేళ్ల సమయం పడుతుంది. చదవండి: దాదాపు 200 ఏళ్ల నాటి కండోమ్ : ఎగబడుతున్న జనం2018లో విదేశాల నుంచి తెచ్చిన విత్తనాలను క్వారంటైన్ లాంఛనాలన్నీ పూర్తి అయ్యాక 2020 అక్టోబర్ 15న మన దేశ వాతావరణంలో నాటారు. హిమాచల్ప్రదేశ్లోని లాహాల్ లోయలోని క్వారింగ్ గ్రామంలో మొదట నాటడం ద్వారా భారతీయ ఇంగువ పంట సాగు ప్రారంభం అయ్యింది. ఐహెచ్బిటి పాలంపూర్లో ఏర్పాటైన జెర్మ్ప్లాజమ్ రీసోర్స్ సెంటర్లో ఇంగువ విత్తనోత్పత్తి, శిక్షణ, ఇంగువ ఉత్పత్తి తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడే టిష్యూ కల్చర్ యూనిట్ కూడా ఏర్పాటు కావటంతో విస్తృతంగా ఇంగువ మొక్కల ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ పంట సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించడానికి జిపిఎస్ డేటా ఆధారంగా పెద్ద కసరత్తే జరిగింది. ఎకలాజికల్ నిచే మోడలింగ్ పద్ధతిలో అనువైన స్థలాలను గుర్తించటం, సాగు చేయటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. వారి ఐదేళ్ల కృషికి గుర్తింపుగా గత నెల 28న అధికారికంగా ఇంగువ పంటను మన నేలలకు అలవాటు చేసి, విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. అతిశీతల ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఇంగువ మొక్కల్ని సముద్రతలానికి 1,300 మీటర్ల ఎత్తులో ఉండే పాలంపూర్ వంటిప్రాంతాల్లో సాగు చేయటంలో విజయం సాధించటమే మనం సాధించిన ఘన విజయంగా శాస్త్రవేత్తలు సంబరంగా చెబుతున్నారు. సుసంపన్నమైన వ్యవసాయక జీవవైవిధ్యానికి ఒకానొక కేంద్ర బిందువైన భారతావని సిగలో మరో కొత్త పంట సరికొత్త ఘుమఘుమలతో చేరటం మనందరికీ సంతోషదాయకం. ఆ విధంగా హిమాచల్ రైతులు పండించే ఇంగువను మున్ముందు మనం రుచి చూడబోతున్నామన్నమాట! -
పటిష్ఠ క్వారంటైన్తోనే చెక్!
చైనా తమపై ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిందని ఇటీవల అమెరికా ప్రకటించింది. ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని చైనా నుంచి అక్రమంగా అమెరికాలోకి తీసుకువచ్చిన నేరానికి చైనా పౌరురాలు, మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు యుంకింగ్ జియాన్(33), ఆమె చైనా ప్రియుడు జున్యాంగ్ లియు(33)లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా చైనా పనిగట్టుకొని చేయిస్తున్న ‘ఆగ్రో టెర్రరిస్టు’ చర్యేనని అమెరికా ఆరోపించింది. శత్రు దేశంలో జీవ భద్రతను, వ్యవసాయ– ఆహార భద్రతను విచ్ఛిన్నం చేసే ఉగ్రవాద చర్యలను ‘ఆగ్రో టెర్రరిజం’ అని వ్యవహరిస్తారు. ఈ వార్తతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో.. అసలు ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రం పంటలకు ఎంతవరకు ప్రమాదకరం? ఒక దేశం నుంచి మరో దేశానికి ఏదైనా శిలీంధ్రాలు, వైరస్లు, సూక్ష్మజీవులు, విత్తనాలను పరిశోధనల కోసం అధికారిక అనుమతులతో తీసుకెళ్లే వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది? దాని అవసరం ఏమిటి? వంటి విషయాలను పరిశీలిద్దాం.కొత్త వాతావరణమే సమస్యఒక దేశం మరో దేశంపై ఆయుధాలతో విరుచుకుపడితే ఆ దాడి నష్టం ఏపాటిదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అదే గనక.. ఒక విధ్వంసక శిలీంధ్రాన్నో, సూక్ష్మజీవినో, వైరస్నో జీవాయుధంగా ప్రయోగిస్తే ఈ ఆగ్రో టెర్రరిస్టు చర్య వల్ల కలిగే నష్టం వెంటనే తెలియదు. కొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే, ఒక దేశంలో ఉండే శిలీంధ్రం లేదా వైరస్ వేరు దేశపు కొత్త వాతావరణ పరిస్థితుల్లోకి ప్రవేశించినప్పుడు ఆ వాతావరణం నప్పితే చెలరేగిపోవచ్చు. అక్కడి పంట పొలాల్లో విధ్వంసం సృష్టించి ఆ దేశపు ఆహారోత్పత్తి పునాదుల్నే కదిలించి, కోలుకోలేని దెబ్బ తీయవచ్చు. లేదంటే, ఆ కొత్త వాతావరణం సరిపడకపోతే తేలిపోనూవచ్చు. ఆ కొత్త వాతావరణంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమపై ఈ శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాల ప్రవర్తన తీరు ఎంత విధ్వంసకరంగా ఉంటుందన్న విషయం ఆధారపడి ఉంటుంది. అందుకే పరిశోధనల కోసం విదేశాలకు ఇలాంటివి తీసుకెళ్లాలంటే పటిష్టమైన పరీక్షలు, నియమనిబంధనలతో కూడిన క్వారంటైన్ వ్యవస్థ ఏర్పాటైంది. అదేమీ లేకుండా ఫంగస్ను పంపటం ద్వారా చైనా ‘ఆగ్రో టెర్రరిస్టు (వ్యవసాయ ఉగ్రవాద)’ చర్యకు ఒడిగట్టిందని అమెరికా మండిపడింది. ‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. ఇది పంటలకే కాదు మనుషులు, పశువుల ఆరోగ్యానికి కూడా గొడ్డలిపెట్టు. యావత్ జాతి భద్రతకే ప్రత్యక్ష ముప్పు’ వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) డైరెక్టర్ కష్ పటేల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.అన్ని దేశాల్లోనూ ఉన్నదే! ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రంను ‘కిల్లర్ ఫంగస్’ అని కూడా అభివర్ణిస్తున్నారు. ‘గ్రామినే’ కుటుంబానికి చెందిన వరి, మొక్కజొన్న, గోధుమ, బార్లీ వంటి ప్రధాన ఆహార ధాన్యపు పంటలకు కంకి దశలో సోకటం ద్వారా దిగుబడిని దెబ్బతీసి తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తుంది అయితే, ఇది ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లోనూ ఉన్న శిలీంధ్రమేనని నిపుణులు చెబుతున్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వ జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం మాజీ సంచాలకులు డాక్టర్ బలిజేపల్లి శరత్బాబు ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ.. ‘ఇది కొత్త శిలీంధ్రం కాదు. అమెరికా, భారత్, పాకిస్తాన్, చైనా సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఉనికిలో ఉంది. అనేక పంటల కంకులను ఆశించి, దిగుబడికి పెను నష్టం చేస్తుంటుంది. ఇది సోకిన ధాన్యం తింటే వికారం, వాతులు వంటి సమస్యలు వస్తాయి. అయితే, పంటలకు విధ్వంసకమైనదైనప్పటికీ ఇది ప్రాణహాని కలిగించినట్లు ఆధారాలు లేవు. నిజానికి పప్పులు, మిరపకాయలు, వేరుశనగలను ఆశించే అఫ్లోటాక్సిన్లు దీనికన్నా ప్రమాదకరం. ఒక్కోసారి కేన్సర్ కారకం కూడా కావచ్చు’ అన్నారు.దిగుమతి, ఎగుమతికి క్వారంటైన్ తప్పనిసరి!శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాలు, మొక్కలు వంటి జీవ పదార్థాలను ఒక దేశం పరిశోధనల కోసం, వ్యాపార రీత్యా అధికారికంగా ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా అంత సులువేమీ కాదు. అంతర్జాతీయ మొక్కల సంరక్షణ ఒడంబడిక (ఐపిపిసి)లో పేర్కొన్న విధంగా కఠినమైన క్వారంటైన్ నియమ నిబంధనలను రెండు దేశాలూ త్రికరణశుద్ధితో పాటించాల్సిందే.ఎగుమతి చేసే దేశం ప్రమాదం లేదని ఫైటో శానిటరీ సర్టిఫెకెట్ ఇవ్వాలి. దిగుమతి చేసుకునే దేశ ప్రభుత్వం దిగుమతి చేసుకునే సంస్థ/వ్యక్తికి ఇంపోర్ట్ పర్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకున్న తర్వాత ఒక సీజన్లో క్వారంటైన్ చట్టాల ప్రకారం ప్రయోగాలు చేసి, అందులో హానికారక చీడపీడలు ఏవీ రవాణా కావటం లేదని నిర్థారించుకున్న తర్వాతే ఆ దేశపు సహజ వాతావరణంలోకి ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. చదవండి: జాబ్స్ టియర్స్.. కొత్త మిల్లెట్ పంట!ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నీ సాధారణ వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు కూడా శానిటరీ, ఫైటో శానిటరీ నియమాలు పాటించాల్సిందే. ఈ నియమాలను అమలుచేసే పటిష్ట క్వారంటైన్ వ్యవస్థ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉంటుంది. ఎయిర్పోర్టులు, సీపోర్టుల్లో తనిఖీలు అతి కఠినంగా ఉంటాయి. అమెరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న హవాయి రాష్ట్రం నుంచి దాదాపు అన్ని రకాల పండ్లు కూరగాయలు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లడానికి నిర్దిష్టమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు డాక్టర్ శరత్బాబు.మన క్వారంటైన్ వ్యవస్థ బలహీనం చైనా నుంచి ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రాన్ని అమెరికాకు తీసుకెళ్లింది పరిశోధనల కోసమైనప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించలేదు. అనుమతులు లేవు కాబట్టే ఈ పనిని ‘వ్యవసాయ ఉగ్రవాద’ చర్యగా అమెరికా సీరియస్గా పరిగణించింది. జియోపొలిటికల్ ఉద్రిక్తతలు కూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఈ శిలీంధ్రం అన్ని దేశాల్లోనూ ఉన్న జాతే. అయినా, వేర్వేరు దేశాల్లో అనేక ఉపజాతులు ఉంటాయి. ఒక ఉపజాతి ఒక దేశంలో పెద్ద సమస్య కాకపోయినా, వేరే దేశంలోని విభిన్న వాతావరణంలోకి వెళ్లిన తర్వాత పెను విపత్తు సృష్టించవచ్చు లేదా నిద్రాణంగా ఉండిపోవచ్చు. అందుకే జీవపదార్థాలేవైనా దేశ సరిహద్దులు దాటించేటప్పుడు కఠినమైన క్వారంటైన్ పరీక్షలు చెయ్యటం తప్పనిసరి. మన దేశంలో ఈ క్వారంటైన్ వ్యవస్థ బలహీనంగా ఉంది. ఇకనైనా పటిష్టం చెయ్యాలి.– డాక్టర్ బలిజేపల్లి శరత్బాబు, అధ్యక్షులు, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మాజీ సంచాలకులు, జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం. -
కేన్సర్ను అరికట్టే ఔషధాహారం!
సాక్షి, సాగుబడి: భవిష్యత్తులో కేన్సర్ చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని రకాల బియ్యం లేదా బియ్యం తవుడుతో చేసే ఆహారాన్ని సూచించవచ్చు. అవి తింటే కేన్సర్ రాకపోవచ్చు, వచ్చినా తగ్గిపోవచ్చు. అంటే చాలా తక్కువ ఖర్చుతోనే కేన్సర్ను అరికట్టేయవచ్చు. ఆశ్చర్యంగా అనిపిస్తున్న దీన్ని సుసాధ్యం చేస్తోంది ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి). 3 రకాల ఊదా, ఎరుపు రంగు వరి బియ్యంపై పొర(తవుడు)లో కేన్సర్లను అరికట్టే ఔషధ పదార్థాన్ని వెలికితీసి, ఔషధాహారాన్ని విజయవంతంగా రూపొందించారు అక్కడి శాస్త్రవేత్తలు. కొలొరెక్టల్ కేన్సర్ (పెద్దపేగు+గుదద్వారం కేన్సర్), రొమ్ము కేన్సర్లను అరికట్టడానికి ఈ ఫుడ్ సప్లిమెంట్ దోహదపడుతుంది.కేన్సర్ కణాలపై దీని పనితీరును ‘ఇరి’ ప్రయోగశాలలో పరీక్షించి అద్భుత ఫలితాలు సాధించారు. ఈ ప్రతిష్టాత్మక పరిశోధనకు సారథ్యం వహిస్తున్న ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త, తెలుగువారైన డాక్టర్ నెసె శ్రీనివాసులు ఈ విశేషాలను టెలిఫోన్ ఇంటర్వ్యూలో ‘సాక్షి’కి వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెనుముప్పుగా పరిణమించిన కేన్సర్ మహమ్మారికి ముకుతాడు వేసే అద్భుత ‘ఔషధాహారం’ అందుబాటులోకి రానుంది. పురాతన వరి వంగడాల్లో కేన్సర్లను అరికట్టే అద్భుత ఔషధ గుణాలున్నట్లు ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. ఈ పరిశోధనలో కీలకపాత్ర పోషించింది ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నెసె శ్రీనివాసులు. ప్రస్తుతం ఈయన ఇరిలో కంజ్యూమర్ డ్రివెన్ గ్రెయిన్ క్వాలిటీ – న్యూట్రిషన్ సెంటర్ అధిపతిగా ఉన్నారు. ఈయన తల్లిది అనంతపురం. ఈయన పెరిగింది కర్ణాటకలో.3 రకాల పురాతన వరి రకాలతో..ప్రపంచవ్యాప్తంగా 1,32,000 పురాతన వరి వంగడాలున్నాయి. వీటిలో చాలా వరకు తెల్లబియ్యం రకాలే. రకరకాల రంగుల బియ్యం రకాలు 800. వీటిలో పోషకాలపై జరిపిన పరిశోధనల్లో 6 రకాల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ కేన్సర్ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నట్లు ‘ఇరి’ గుర్తించింది. ప్రస్తుత పరిశోధనలో 3 రకాలను శాస్త్రవేత్తలు వాడారు. ఫిలిప్పీన్స్ కు చెందిన ఎరుపు, ఊదా కలసిన రంగు గల ‘బాలాటినో’ రకం బియ్యం, ‘కింటుమాన్’ అనే ఎర్ర బియ్యంతో పాటు ఇండోనేíసియాకు చెందిన ఎరుపు, ఊదా కలసిన రంగుండే కేతన్ హితం’ అనే పురాతన రకాలను వాడారు. ఈ బియ్యపు తవుడులోని ఔషధ విలువలున్న పదార్థాన్ని ఉపయోగించి కేన్సర్ను అరికట్టే ఫుడ్ సప్లిమెంట్ను తయారు చేశారు. ఇది పొడి లేదా ద్రవ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.ఒక్క గ్రాము చాలు!300 గ్రాముల బియ్యం నుంచి తీసిన తవుడుతో 1 కిలో ఫుడ్ సప్లిమెంట్ను ఉత్పత్తి చేయవచ్చు. కేన్సర్ నిరోధక లక్షణాన్ని మనిషి దేహంలో కలిగించడానికి కనీసం 1 గ్రాము సరిపోతుందని డా.శ్రీనివాసులు తెలిపారు. కేన్సర్ రోగుల కణాలపై ప్రయోగశాలలో ఈ ఔషధాహారంతో నిర్వహించిన పరీక్షల్లో అద్భుత ఫలితాలు వచ్చాయి. ఈ రెండు రకాల కేన్సర్ రోగులకు ఇస్తున్న కీమోథెరపీ ఔషధం ‘డోక్సోరుబిసిన్’తో సరిసమానమైన ఫలితాలను.. ఈ ఫుడ్ సప్లిమెంట్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో దీన్ని ఎలుకలపైన, ఆ తర్వాత కేన్సర్ రోగులపైన ప్రయోగించబోతున్నామని వెల్లడించారు.సాంబమసూరిలోకి ఈ జన్యువులుఈ 3 రకాల పురాతన వరి వంగడాల్లోని కేన్సర్ నిరోధక ఔషధ గుణాలకు కారణమైన జన్యువులు ఏవో గుర్తించేందుకు ‘ఇరి’లో పరిశోధన కొనసాగుతోంది. ‘ఈ పరిశోధన పూర్తయ్యాక అధిక దిగుబడినిచ్చే మన సాంబమసూరి వరి వంగడంలోకి ఈ ఔషధ గుణాలున్న జన్యువులను జన్యు సవరణ ప్రక్రియ ద్వారా జోడిస్తాం. ఆ సరికొత్త సాంబమసూరి ముడి బియ్యాన్ని అన్నంగా వండుకొని తినొచ్చు.ఫుడ్ సప్లిమెంట్ తింటే వంద శాతం ఫలితం ఉంటుంది. వండిన అన్నం తింటే.. అందులోని కేన్సర్ నిరోధక ఔషధ గుణం 70% వరకు వంటపడుతుంది. కేన్సర్ కణాలు క్రమంగా కోలుకొని సాధారణ స్థితికి వస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాలకు ఎలాంటి హానీ జరగదని కూడా మా ప్రయోగశాలలో రూఢీ అయ్యింది. ఇది స్వల్ప ఖర్చుతో కేన్సర్ను అరికట్టే మార్గంగా ప్రపంచం ముందుకు వస్తోంది’ అని డా. శ్రీనివాసులు వివరించారు. -
ఆలూ ద బెస్ట్
ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో వందలాది కోట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజానీకానికి దైనందిన ప్రధానాహారంలో వరి, గోధుమ తర్వాత మూడో స్థానం బంగాళదుంపలదే. 66% ప్రపంచ ప్రజలు దైనందిన ఆహారంలో బంగాళదుంపలు తింటున్నారు. 2023లో 38.3 కోట్ల టన్నులు బంగాళదుంపలు పండాయి. ప్రపంచ జనాభాకు ఆహార భద్రత కల్పిస్తున్న బంగాళదుంప ప్రాధాన్యాన్ని చాటిచెప్పటానికి 2008లో అంతర్జాతీయ బంగాళదుంపల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించింది. 2024 నుంచి మే 30న అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవాన్ని సైతం నిర్వహిస్తోంది. ‘చరిత్రను నిర్మించటం, భవిష్యత్తును పోషించటం’ ఇదీ ఈ ఏడాది నినాదం.పెరులోని ఆండీస్ ప్రాంతంలో విరాజిల్లిన పురాతన ‘ఇంకా నాగరికత’కు పూచిన పుష్పంగా బంగాళదుంపలను చెబుతారు. పెరు నుంచి 16వ శతాబ్దంలో యూరప్ దేశాలకు ఈ పంట చేరింది. ఎటువంటి వాతావరణానికి ఇట్టే అలవాటైపోవటం వంటి సుగుణాల వల్ల 5 శతాబ్దాల్లోనే ప్రపంచం అంతా వ్యాపించింది. ⇒ వేల రకాల బంగాళదుంపల్లో దేని రంగు, సైజు, రుచి, పోషక విలువలు దానికే ప్రత్యేకంగా ఉంటాయి. అందువల్ల ఇదొక ముఖ్యమైన ఆహార పదార్థంగా మాత్రమే కాదు వంటింటి సృజనాత్మక సంస్కృతికి మూలాధారం అని కూడా అర్థమవుతుందని ఐరాసకు చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) చెబుతోంది.⇒ ఆహారపు అలవాట్లు మారిపోతున్న నేపథ్యంలో తాజా బంగాళదుంపలను వండుకు తినే వారి సంఖ్య తగ్గుతున్నట్లు అంచనా. అదేసమయంలో, అతిగా ప్రాసెస్ చేసిన పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తినటం మాత్రం ఎక్కువైందట. ఫలితంగా అనేక రకాల పోషకాహార లోపాలు తలెత్తుతున్నాయి. ఈ ట్రెండ్ మన దేశంలోనే కాదు ప్రపంచదేశాలన్నిటిలోనూ ఇంతేనని ఎఫ్ఎఓ తాజా నివేదిక చెబుతోంది. ⇒ బంగాళదుంపల్లో సమృద్ధిగా పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలతో పాటు బంగాళదుంపలో 80% నీరు, 15.7% పిండిపదార్ధాలు, 1.8% మాంసకృత్తులు, 1.7% పీచుపదార్థం, 0.1% కొవ్వు ఉంటాయి. ⇒ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్కర్వీ జబ్బును నివారించడంలో సహాయపడుతుంది.⇒ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్. మన గుండె, కండరాలు, నాడీ వ్యవస్థల సరైన పనితీరుకు దోహదం చేస్తుంది. ⇒ బంగాళాదుంప పైపొరలో పీచు పదార్థం ఉంటుంది. మానవ జీర్ణవ్యవస్థలో ఆహారం జీర్ణం కావడానికి ఇది అవసరం. ⇒ దేహ రక్షణకు సహజ మూలకాలైన యాంటీఆక్సిడెంట్లు దోహదం చేస్తాయి. బంగాళదుంపల్లో ఇవి పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి దన్నుగా నిలవటం ద్వారా ఆరోగ్యదాయకమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించటంలో యాంటీఆక్సిడెంట్లు తోడ్పడతాయి. ⇒ బంగాళదుంపలోని పోషక విలువ దాని రకం, వాతావరణం, నేల, సాగు పద్ధతులు, నిల్వ పరిస్థితులు, ప్రాసెసింగ్, తయారీ, వంట పద్ధతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ⇒ బంగాళదుంపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కాగలిగినవైప్పటికీ ఇవి అందరికీ సరిపడవు. ఎందుకని అంటే..? ఎంత తింటాం? ఎలా ప్రాసెస్ చేస్తాం? ఎలా వండుతాం? విలువ ఆధారిత ఆహారోత్పత్తుల్ని ఎలా తయారు చేస్తాం? వంటి అంశాలతో పాటు ఏ ఇతర ఆహార పదార్థాలతో కలిపినప్పుడు ఎంత సమతుల్యతను పాటిస్తాం అన్నదానిపై ఆధారపడి బంగాళదుంప బాగోగులు ఆధారపడి ఉంటాయని ఎఫ్ఎఓ తెలిపింది. ఏ రకం బంగాళదుంపల్లో ఏయే పోషక విలువలు ఎంతెంత?(ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) సమాచారం ప్రకారం.. 100 గ్రామాలు పచ్చి బంగాళదుంపలో గత పోషక విలువలు)బంగాళదుంపలు.. అంకెలు.. వాస్తవాలు..⇒ ప్రపంచవ్యాప్తంగా వందలాది కోట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజానీకానికి దైనందిన ప్రధానాహారంలో వరి, గోధుమ తర్వాత మూడో స్థానం బంగాళదుంపలదే. ⇒ ఇవి 5 వేల రకాలు ఉన్నాయి. బంగాళదుంపల జీవవైవిధ్యం ప్రపంచ ఆహార భద్రతకు ఒక పట్టుకొమ్మగా నిలిచింది. చిన్న, సన్నకారు రైతులకు ఇదొక ముఖ్యమైన ఆహార పంటగా మారిపోయింది. ⇒ బంగాళదుంపలకు పుట్టిల్లు పెరులోని ఆండీస్ పర్వత ప్రాంతాలు. పెరులోని కస్కో దగ్గర పోటాటో పార్క్ ఉంది. దీని విస్తర్ణం 12 వేల హెక్టార్లు. వైవిధ్యంతో కూడిన పురాతన బంగాళదుంప వంగడాల జన్యువనరులను, సంప్రదాయ విజ్ఞానాన్ని ఆదివాసులు అనాదిగా పరిరక్షిస్తున్నది ఈ ప్రాంతంలోనే. ⇒ ఆండీస్ ప్రాంతంలో విరాజిల్లిన పురాతన ‘ఇంకా నాగరికత’కు పూచిన పుష్పంగా బంగాళదుంపలను చెబుతారు. ⇒ పెరు నుంచి 16వ శతాబ్దంలో యూరప్ దేశాలకు, అక్కడి నుంచి ప్రపంచానికి వ్యాపించింది బంగాళదుంప పంట. కేవలం 5 శతాబ్దాల్లో వేగంగా విస్తరించింది. ⇒ ఐర్లాండులో 1840వ దశకంలో బంగాళదుంప పంట చీడపీడలతో తుడిచిపెట్టుకుపోవటంతో క్షామం సంబవించింది. అక్కడ ఈ పంట వంగడాల్లో వైవిధ్యతను నిలుపుకోకపోవటమే ఇందుకు కారణం. ⇒ బంగాళదుంపలు మనకు గోధుమ రంగులో ఉండేవే తెలుసు. కానీ, ఎన్నెన్నో రంగుల్లో ఉంటాయి. విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో, విభిన్న సాగు పద్ధతుల్లో, భూతాపాన్ని తట్టుకుంటూ మనగలుగుతున్న అతి ముఖ్యమైన ఆహార పంట ఇది. మారుతున్న పరిస్థితులకు తగినవిధంగా మార్పుచెందే క్రమంలో ప్రతి బంగాళదుంప వంగడానికి ప్రత్యేకమైన గుణాలు ప్రకృతిసిద్ధంగా చేకూరాయి. ⇒ 2000–2020 మధ్యకాలంలో బంగాళదుంపల సాగు విస్తీర్ణం 17% తగ్గినప్పటికీ ఉత్పత్తి 11 శాతం పెరిగింది. తక్కువ చోటులో ఎక్కువ దిగుబడి సాధించటంలో మెరుగైన వంగడాలు, సాగు పద్ధతుల్లో వచ్చిన మార్పులు దోహదం చేస్తున్నాయి.⇒ ప్రపంచవ్యాప్తంగా బంగాళదుంప వంగడాల సంరక్షణ, విత్తటం, కోత, విక్రయం తదితర ప్రక్రియల్లో గ్రామీణ మహిళలు కీలకపాత్రపోషిస్తున్నారు. ఈ పొలాల్లో మహిళల శ్రమే అధికం.బంగాళదుంపలతో ఆహారేతర ప్రయోజనాలు⇒ బంగాళదుంపలను ఆహారంగానే కాకుండా.. ఔషధతయారీ, వస్త్రోత్పత్తి, ప్లైవుడ్, పేపర్ పరిశ్రమల్లోనూ రకరకాల ప్రయోజనాల కోసం వాడుతున్నారు.⇒ బంగాళదుంప పై పొరను ఫ్యూయల్–గ్రేడ్ ఇథనాల్ ఉత్పత్తిలో వాడుతున్నారు.⇒ 100% ప్రకృతిలో కలిసిపోయే ప్లాస్టిక్ల తయారీలోనూ బంగాళదుంపలు ఉపయోగపడతాయి.⇒ గోజాతి పశువులు, పందులు వంటి పశువులకు దాణాగా బంగాళ దుంపలను పెడుతున్నారు.⇒ 8,000 ఏళ్ల క్రితం బంగాళదుంపలను తొలిసారి పెరులో సాగు చేయటం మొదలుపెట్టారు.⇒ 5.000 రకాలకు పైగా బంగాళదుంపల వంగడాలు ఉన్నాయి⇒159 దేశాల్లో బంగాళదుంపలను పండిస్తున్నారుఅతి ముఖ్యమైన పంటబంగాళదుంపల సాగు: ∙వేర్వేరు వ్యవసాయ వాతావరణ ప్రాంతాల్లో, నేలల్లో సాగు అవుతుంది. ⇒ సముద్రతలం నుంచి 4,700 మీటర్ల ఎత్తు వరకు భూముల్లో సాగవుతుంది.⇒ చిన్న, సన్నకారు రైతులకు ఆధారపడదగిన ఆదాయాన్ని అందిస్తుంది బంగాళదుంప పంట.⇒ సుసంపన్నమైన జన్యువైవిధ్యం వల్ల బంగాళదుంప వంగడాలు చీడపీడలను దీటుగా తట్టుకోగలుగుతుంది.⇒ బంగాళదుంపలను కోట్లాది మంది ప్రజలు దైనందిన ప్రధాన ఆహారంగా తింటున్నారు.ప్రపంచవ్యాప్తంగా 2022లో 37.5 కోట్ల టన్నుల బంగాళదుంపలను రైతులు పండించారు.⇒ చైనా 95.5 (టన్నులు)⇒ భారత్ 56.2⇒ ఉక్రెయిన్ 20.9⇒ రష్యా సమాఖ్య 18.9⇒ అమెరికా 17.8⇒ జర్మనీ 10.7⇒ బంగ్లాదేశ్ 10.1⇒ ఫ్రాన్స్ 8.0⇒ పాకిస్తాన్ 7.9⇒ నెదర్లాండ్స్ 6.9 ఆలూపై అపోహలు వద్దుఎవరైనా తీసుకునే ఆహారం వారి వయసు, రోజువారీగా వారి శారీరక శ్రమపై ఆధారపడి ఉండాలి. ఏదైనా మితంగా తీసుకోవాలి. బంగాళదుంప వాతం అంటూ ఉంటారు. కానీ, నిజానికి ఇది అపోహే. బంగాళదుంపలో ఎక్కువగా పిండిపదార్థాలు ఉన్నాయి. దీనితో పాటు కలిపి తీసుకునే ఇతర ఆహార పదార్థాలు మాంసకృత్తులు కలిగినవై ఉండాలి. ఉత్తరాదిలో ఏ కూర చూసినా ఆలు లేకుండా ఉండదు. అయితే, ఆలుతో పాటు కాబోలి శనగలు కూడా కలిపి వండుతారు. మన ఆహారంలో సాధారణంగా మాంసకృత్తులు లోపిస్తున్న విషయం తెలిసిందే కదా.పెద్దవాళ్లు రోజూ ఆలు తిని కూర్చుంటే పిండిపదార్థాలు ఎక్కువై నొప్పుల సమస్య వస్తుంది. పెద్దవాళ్లకు జీర్ణశక్తి తగ్గటం కూడా ఈ సమస్యకు ఒక కారణం. అదే పిల్లలైతే శారీరక కదలికలు ఎక్కువ కాబట్టి వారికి ఆ సమస్య రాదు. ఎవరైనా, తగుమాత్రంగా, సమతులాహారంలో భాగంగా తీసుకున్నప్పుడు ఏ సమస్యా ఉండదు. లేదంటే ఊబకాయానికి దారితీస్తుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ తినటం చిన్నా పెద్దా ఎవరికీ ఆరోగ్యకరం కాదు. – ఆచార్య విజయ ఖాదర్, విశ్రాంత డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ హోం సైన్స్, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
చిరుధాన్యాలను ఎలా విత్తుకుంటే మేలు...?
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)లో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తుకోవటానికి అనువైన 11 రకాల చిరుధాన్యాల విత్తనాలను విక్రయిస్తు న్నారు. జొన్నలు, పచ్చజొన్నలు ఎకరానికి 3 కిలోలు విత్తుకోవాలి. ఇతర చిరుధాన్యాలన్నీ ఎకరానికి 2 కిలోలు సరిపోతాయని, ఎకరానికి సరిపోయే విత్తనంతో బ్యాగ్లను సిద్ధం చేశామని ఐఐఎంఆర్ విత్తన విభాగం సాంకేతిక అధికారి రఘునాద్ కులకర్ణి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. వరుసలుగా విత్తుకుంటే మేలు: చిరుధాన్య పంటలను వెదజల్లటం కాకుండా వరుసలుగా విత్తుకోవటం మేలు. కూలీలతో కలుపు తీయిస్తే రైతుకు మిగిలేదేమీ ఉండదు. వరుసలుగా విత్తుకుంటే యంత్రాలతో అంతరసేద్యం చేస్తూ కలుపును నిర్మూలించుకోవచ్చు. సాధారణంగా వరుసల మధ్య 22.5 సెం.మీ. దూరం పెడతారు. రైతులు తమకు అందుబాటులో ఉన్న వీడర్ యంత్రాల వెడల్పును బట్టి సాళ మధ్య దూరాన్ని నిర్ణయించుకోవచ్చు. అవసరాన్ని బట్టి 30 సెం.మీ. / 40 సెం.మీ. / 45 సెం.మీ. వరకు కూడా సాళ్ల మధ్య దూరం పెట్టుకోవచ్చని రఘునాద్ వివరించారు. ఇదీ చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది∙జొన్న (దేశీ రకం/ హైబ్రిడ్), పచ్చజొన్న, పచ్చిగడ్డి కోసం పెంచే జొన్న ఎకరానికి 3 కిలోలు విత్తుకోవాలి. ∙సజ్జ, రాగు (కెఎంఆర్ 301), కొర్ర (సూర్యనంది), సామ (సిఎల్ఎంవి1), ఊద (డిహెచ్బిఎం93–3), వరిగ (టిఎన్ఎయు 202), అరిక (సికెఎంవి2), అండుకొర్ర (హెచ్బిఆర్2)లను ఎకరానికి 2 కిలోలు విత్తుకోవాలి. ఈ విత్తనాలు ఐఐఎంఆర్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు స్వయంగా వచ్చి కొనుక్కెళ్లాలి. ఇతర వివరాలకు.. 040–24599305. చదవండి: కేరళ రైతు శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కారం ‘విత్తన బిళ్లలు’చిరుధాన్యాల విత్తనాలు దొరికే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు: నంద్యాల (99896 25208), పెరుమామళ్లపల్లి (87906 38715)పాలెం (97050 69580)లలోని కూడా కొన్ని రకాల చిరుధాన్య పంటల విత్తనాలు అందుబాటులో ఉంటాయి.ఐఐఎంఆర్లో 11 రకాల చిరుధాన్యాల విత్తనాలు సిద్ధం -
కేరళ రైతు శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కారం ‘విత్తన బిళ్లలు’
కేరళలోని వయనాడ్ జిల్లా అంబలవాయల్కు చెందిన అజి థామస్ (AjiThomas) కూరగాయలు, అరటి, రబ్బరుతో పాటు వరిని పండిస్తారు. రైతులు తగిన ఆదాయం లేక వరి సాగు మానుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో బయో స్లర్రీతో వరి విత్తనాల ‘పెల్లెటైజేషన్’ (pelleting technique ) పద్ధతిని ఆయన అభివృద్ధి చేశారు. విత్తనం చుట్లూ మట్టిని లేపనం చేస్తే వాటిని విత్తన గుళికలు అనొచ్చు. ఇది అలా కాదు. నాలుగు పలకలుగా ఉండే పేడ తదితర పోషకాలతో కూడిన బిళ్లలో వరి విత్తనం పెంచి, నాట్లేస్తారు. కాబట్టి ‘విత్తన బిళ్లలు’ అని చెప్పుకుందాం. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేసి బయో స్లర్రీలోని సూక్ష్మజీవులు పొలం మట్టిలోని పోషకాలను విచ్ఛిన్నం చేసి వరి మొక్కలకు అందించటంతో రెట్టింపు దిగుబడి వస్తున్నదని వారు తెలిపారు. ఈ పద్ధతిలో హెక్టారుకు 5.5–6 టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని, వయనాడ్ ప్రాంతంలో సాధారణ పద్ధతిలో వచ్చే ధాన్యం దిగుబడితో పోల్చితే రెట్టింపని థామస్ తెలిపారు. కూలీల ఖర్చు 25 శాతానికి తగ్గింది. ప్రతి కుదురుకు 50–60 పిలకలు వస్తున్నాయి. కంకి పొడవు పెరిగింది. ఎకరానికి వరి విత్తనాల అవసరం 30–50 కిలోల నుంచి 2.5–5 కిలోలకు తగ్గింది. పంట 15–20 రోజులు ముందే కోతకు వస్తోందని అజి థామస్ తెలిపారు. ఇదీ చదవండి: అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీవిత్తన బిళ్లల తయారీ ఖర్చు ఎంత?హెక్టారుకు సరిపడా వరి విత్తన బిళ్లల తయారీకి 12–14 కిలోల బయో–స్లర్రీ అవసరం. దీనికి హెక్టారుకు రూ. 20 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇది సాధారణ రసాయనిక సాగు పద్ధతిలో ఎరువులు, ఇతర ఉత్పాదకాల సగటు ఖర్చు కంటే రెట్టింపు. అయినప్పటికీ, కూలీల అవసరం/ఖర్చు, విత్తనాల ఖర్చు తగ్గి ధాన్యం దిగుబడి రెట్టింపు కావటంతో ఈ పద్ధతిలో వరి సాగు లాభదాయకంగా మారిందని థామస్ వివరించారు.ఇదీ చదవండి: ‘చెదలు’తో విసిగిపోయారా? మహిళా రైతు ఐడియా! ప్రభుత్వ ప్రోత్సాహంకేరళ ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఆత్మ) ఈ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. దీంతో, ఈ పద్ధతి కేరళలో రైతుల ఆదరణ పొందుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని అజి థామస్ చెబుతున్నారు. ‘విత్తన బిళ్ల’ అంటే? తయారీ ఎలా?వరి విత్తనాలను ట్రేలలోని చిన్న చిన్న చతురస్త్రాకారపు గదుల్లో బయో స్లర్రీని నింపి, అందులో వరి విత్తనం పెట్టి, మొలకెత్తిస్తారు. ఆ తర్వాత పొలంలో నాట్లు వేసే పద్ధతి ఇది. ఆవుపేడ, పులియబెట్టిన ఆకుల ద్రావణం, పంచగవ్య, ద్రవ జీవామృతంతో పాటు సూడోమోనాస్, అజోస్పిరిల్లమ్ వంటి జీవన ఎరువులు కలిపి బయో–స్లర్రీ మిశ్రమాన్ని తయారు చేస్తారు. బల్ల మీద ఉంచిన స్టెయిన్లెస్ స్టీల్ ట్రేలో లేదా సాధారణ బోలు రబ్బరు మ్యాట్లో 1–1.5 అంగుళాల లోతు/పొడవు/వెడల్పుతో నలుచదరంగా ఉండే గుంతల్లో బయో స్లర్రీని పోసి, అందులో వరి విత్తనాలను గుచ్చుతారు. ఒక రోజులో ఆ స్లర్రీ గట్టిపడి విత్తన బిళ్లలు తయారవుతాయి. ఆ తర్వాత ట్రే నుంచి విత్తనంతో కూడిన ఆ బిళ్లలను బయటకు తీసి 12 గంటలు ఎండబెడతారు. ఆ తర్వాత వాటిపై నీరు చిలకరిస్తారు. 3 రోజుల్లో వరి మొలకలు బయటకు వచ్చి, తగినంత ఎత్తు పెరిగిన తర్వాత, ఆ బిళ్లతో కూడిన వరి నారును దమ్ము చేసిన పొలాల్లో మనుషులతో వరుసలుగా నాటుతారు. వరుసల మధ్య 25 సెం.మీ. (పది అంగుళాలు) దూరం పెడుతున్నారు. ఎకరానికి ఇట్లాంటి వరి నారు బిళ్లలు 64 వేలు అవసరమవుతాయి. ఇదే ప్యాడీ సీడ్ పెల్లెటైజేషన్ పద్ధతిచదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది -
‘చెదలు’తో విసిగిపోయారా? మహిళా రైతు ఐడియా!
చెద పురుగులు (termites) ఇళ్లలోనే కాదు, పంట పొలాల్లో కూడా సమస్యలు సృష్టిస్తుంటాయి. పంటలను ఆశిస్తూ 10 నుంచి 50% వరకు దిగుబడి నష్టం కలిగిస్తుంటాయి. రైతులు సాధారణంగా రసాయనాలు చల్లి పంట పొలాల్లో చెదలును నియంత్రించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, రసాయనాలతో పని లేకుండా సులభంగా, స్వల్ప ఖర్చుతో చెదలు సమస్యకు పరిష్కారాన్ని వెదకటంలో ఓ వృద్ధ మహిళా రైతు అసాధారణమైన విజయం సాధించారు. యూకలిప్టస్ కొమ్మలు/కట్టె ముక్కలను పొలంలోని పంటల సాళ్ల మధ్య ఉంచితే, చెద పురుగులు పక్కనే ఉన్న పంటల జోలికి వెళ్లకుండా యూకలిప్టస్ కొమ్మలనే ఆశిస్తున్నాయని ఆమె కనుగొన్నారు. సజ్జ నుంచి గోధుమ వరకు..గోధుమ చేనులో 12“12 మీటర్ల దూరంలో ఎకరానికి 32 చొప్పున స్ప్రింక్లరు ఉంటాయి. ప్రతి స్ప్రింక్లర్కు దగ్గర్లో ఒక యూకలిప్టస్ కట్టె ముక్క/ కొమ్మను ఆమె పెట్టారు. ఒక్క గోధుమ మొక్కను కూడా చెదలు ఆశించలేదు. ఒక్కో కట్టె ముక్కను వేలకొద్దీ చెద పురుగులు చుట్టుముట్టాయి. అంటే పంట వైపు నుంచి ఈ యూకలిప్టస్ కట్టెలు చెదపురుగుల దృష్టిని వంద శాతం మళ్లించాయన్న మాట. ఎకరానికి ఖర్చు కేవలం రూ. 320లు. ఈ కట్టెలను ప్రతి పంట కాలానికీ కొత్తవి వేయాల్సిన అవసరం లేదు. మూడు పంటల వరకు అవే సరిపోతున్నాయని ఆమె తెలిపారు.వ్యవసాయ విశ్వవిద్యాలయ గుర్తింపుభగవతి దేవి ఈ విషయాన్ని ఫతేపూర్ షెఖావతిలోని కేవీకే శాస్త్రవేత్తల చెప్పారు. వరుసగా నాలుగేళ్ల పాటు అనేక పంటల్లో ప్రయోగం చేసి సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు. బికనెర్లోని రాజస్థాన్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బార్లీ పంటలోనూ అద్భుత ఫలితాలు రావటంతో, రైతులందరికీ ఇది అనుసరించమని చెబుతున్నారు. తళుక్కుమన్న ఉపాయంపనులు చేస్తూనే అసాధారణంగా ఉన్న విషయాలను గమనిస్తూ ఉండటం భగవతి దేవికి అలవాటు. వంట కలపను ఇంటికి తెచ్చి పొయ్యిలో పెడుతున్న ఒక సందర్భంలో ఆమె దృష్టిని యూకలిప్టస్ కర్రలు ఆకర్షించాయి. యూకలిప్టస్ కర్ర ముక్కల పైకి మిగతా కర్రల కంటే చాలా ఎక్కువ చెదపురుగులు చేరుతున్నట్లు ఆమె గుర్తించారు. ఈ గ్రహింపు కలిగిన మరుక్షణమే ఆమె మదిలో ఒక కొత్త ఉపాయం తళుక్కున మెరిసింది. ఆలోచన వచ్చిందే తడవుగా అప్పుడు సాగులో ఉన్న సజ్జ పంటలో అమలు చేసింది. 2 నుంచి 3 అడుగుల పొడవు, 2 నుంచి 3 అంగుళాల లావు ఉన్న యూకలిప్టస్ కర్ర ముక్కలను తీసుకొని, సజ్జ పొలం అంతటా సాళ్ల మధ్యలో పెట్టింది. ఆమె అనుకున్నట్లుగానే, ఆ కర్ర ముక్కల చుట్టూ వేలకొలది చెద పురుగులు చేరి, కర్రలను కొరికి తినటం ప్రారంభించాయి. ఆశ్చర్యమేమిటంటే.. చెద పురుగులు ఇక సజ్జ మొక్కల జోలికి పోలేదు. యూకలిప్టస్ కర్ర ముక్క నుంచి 4 అంగుళాల దూరంలో ఉన్న సజ్జ మొక్కలను కూడా అవి ఆశించలేదు. అంతే. భగవతి దేవి మొహం ఆనందంతో వెలిగిపోయింది. జఠిలమైన చెదలుకు ప్రకృతిసిద్ధమైన పరిష్కారాన్ని కనుగొన్న రాజస్థాన్ వృద్ధ మహిళా రైతు యూకలిప్టస్ కర్ర ముక్కలను పొలంలో ఉంచటం ద్వారా.. చెద పురుగులు పంటలను పాడు చెయ్యకుండా కాపాడుతున్నారు. -
బలసిరి.. కొత్త వరి
పిఠాపురం: రంగు.. రుచి.. వాసన.. ఇదేదో వాణిజ్య ప్రకటన అనుకుంటే పొరపాటే. వరిలోనూ ఇటువంటి లక్షణాలున్న బియ్యం అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇటువంటి బియ్యం ఉన్నాయని చెబితే.. ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. ఇటువంటి అనేక రకాల కొత్త వంగడాలను ఇక్కడి రైతులు పండిస్తూ అందుబాటులోకి తెస్తున్నారు. అత్యధిక పోషక విలువలున్న వరి వంగడాలను ఉత్పత్తి చేయడానికి ప్రకృతి వ్యవసాయ రైతులు నడుం బిగించారు. అరుదైన వరి రకాలు గతంలో రాష్ట్రేతర ప్రాంతాల నుంచి తెచ్చే స్థానిక రైతులు.. ఇప్పుడు కాకినాడ జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు పలు రకాల వరి వంగడాలను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇక్కడ పండించిన అరుదైన వరి రకాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారి నైవేద్యానికి సైతం ఉపయోగిస్తుండడం విశేషం. ఈ అరుదైన రకాల్లో నవారా, ఇంద్రాణి, కాలపట్టి, డెహ్రాడూన్ రెడ్ రైస్, పరిమళ సన్న, బర్మా బ్లాక్, రత్నచొడి, రక్తసాలి, చింతలూరు సన్నాలు, కూజి, పాటలియా, బాస్బోగ్, కామిని బోగ్, మైసూర్ మల్లిగ, సిద్ధ సన్నాలు, కోమల్ సాల్ వంటి రకాలున్నాయి. జిల్లాలో సుమారు 25 హెక్టార్లలో 30 మంది రైతులు సేంద్రియ పద్ధతిలో అరుదైన వరి రకాలను పండిస్తున్నారు. చాలా డిమాండ్ ఉందిపన్నెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాణప్రదంగా చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో పండించిన అరుదైన రకాల ధాన్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా ఉపయోగించడానికి ఇస్తున్నాను. సాధారణ రకాల కంటే.. మంచి డిమాండ్ ఉన్న అరుదైన రకాలను సాగు చేస్తున్నాను. ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల విత్తనాలు తెచ్చి, విత్తనాభివృద్ధి చేస్తున్నాను. కేవలం విత్తనాలకు మాత్రమే వీటిని పండిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నాం. ఈ బియ్యానికి మంచి డిమాండ్ ఉండడంతో ఆదాయం బాగుంటుంది. నాతో పాటు జిల్లాలో చాలా మంది రైతులు వీటి సాగు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల రైతులూ నా వద్ద విత్తనాలు తీసుకుంటున్నారు. – అడపా వెంకటరమణ, ప్రకృతి వ్యవసాయ రైతు, భోగాపురం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా విత్తనం కోసమే పండిస్తున్నా...ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల ధాన్యాన్ని పండిస్తున్నాను. కేవలం విత్తనాల కోసం కొన్ని అరుదైన రకాలు పండిస్తున్నాను. ఎవరైనా విత్తనాలకు అడిగితే ఉచితంగా ఇస్తున్నాను. ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.ఎకరం పొలంలో పది రకాల అరుదైన రకాలను పండిస్తున్నాను. ఈ సాగంతా పాతకాల పద్ధతిలోనే చేయాలి. యంత్రాలతో సాధ్యం కాదు. – ఉల్లి సురేష్, ప్రకృతి వ్యవసాయ యువ రైతు, కొత్తపల్లి, కాకినాడ జిల్లాఅరుదైన రకాలివే.. » రక్తసాలి రక్త హీనతతో బాధపడుతున్న వారికి మంచి ఆహారం. ఈ బియ్యం తినడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. మూడు వేల ఏళ్ల నుంచి ఇది వాడుకలో ఉంది. » కూచి పట్టాలియా బాగా సన్నగా ఉంటుంది. తినడానికి బాగుంటుంది. పోషకాలు ఎక్కువ. » నవరను కింగ్ ఆఫ్ రైస్ అంటారు. ప్రస్తుతం దేశంలో లభించే బియ్యంలో అత్యంత పోషక విలువలున్న ఆహారం. సుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి ఆహారం. దీనిని రోజూ తింటే సుగర్ నార్మల్కు వస్తుంది. మోకాళ్ల నొప్పులూ తగ్గిస్తుంది. » ధూదేశ్వర్ అనే దేశీయ వరి విత్తనం. గాలులకు పడిపోని సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. ఇది తెలుపు రంగులో ఉంటుంది, బాలింతలకు శక్తినిచ్చి, తల్లులకు, పిల్లలకు అధిక పోషకాలు అందిస్తుంది. పాల వృద్ధి, పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. » ఇంద్రాణి అనేది దేశీయ వరిరకం. సువాసన ఉండే ఈ రకం పంట కాలం సుమారు 130 రోజులు. పాయసం, పులిహోర, పలావు, దద్దోజనానికి అనుకూలమైంది. » రత్నచొడి అనే దేశీయ వరి విత్తనం. తెలుపు రంగులో ఉండే సన్న రకం. పంట కాలం సుమారు 135 రోజులు. అధిక పోషక విలువలు కలిగి, కండపుష్టి, శరీర ధారుడ్యం పెంచి, మంచి పోషకాలు కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి కలిగిస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా ఇచ్చేవారు. » కుజీపటాలియా అనేది దేశీయ విత్తనం. సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. గాలులకు పడిపోదు. కొవ్వు రహిత, సోడియం లేనివి. తక్కువ కేలరీలు, గ్లూకోజ్ తక్కువగా ఉండి, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. » కేత్రీ మహరాజ్ సెంటెడ్ వెరైటీ. గింజ పొడవుగా ఉంటుంది. పంటకాలం సుమారు 130 రోజులు. పాయసం, దద్దోజనం, పులిహోర పలావులకు బాగుంటుంది. » మైసూరు మల్లిగ దేశీయ విత్తనం. తెల్లని రంగు, గాలులకు పడిపోని సన్నని గింజ. పంట కాలం సుమారు 120 రోజులు. ఎదిగే పిల్లలకు అధిక పోషకాలు, ప్రొటీన్లు అందిస్తుంది. » ఘని అనే దేశీయ వరి రకం. చిన్న గింజ. పంటకాలం సుమారు 130 రోజులు. అధిక ఫైబర్, కాల్షియం కలిగి ఉంటుంది. స్పాండిలైటిస్, మోకాళ్ల నొప్పులు తగ్గించే ఆహార ఔషధంగా గుర్తింపు పొందింది. » కుంకుమసాలి.. కుంకుమ పువ్వు, రక్తసాలి మొదలైన విత్తనాలు ఒకే కోవకు చెందిన దివ్యమైన ఔషధాలు. ఇవి రక్తంలోని మలినాలను శుభ్రం చేసి, వాత, పిత్త, కఫాలను సమపాళ్లలో ఉంచే దివ్యమైన ఆహార ఔషధాలు. -
న్యూట్రిహబ్.. ‘చిరు’ ప్రయత్నం
చిరుధాన్యాలు.. మరుగున పడిపోయిన పోషక ధాన్యాలు. కానీ జీవనశైలి వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోని ‘భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐఐఎంఆర్)’చిరుధాన్యాలను తిరిగి ప్రజల ఆహారంలోకి చేర్చేందుకు కృషి చేస్తోంది. ఆధునికులు ఇష్టపడే రెడీ టు ఈట్ ఆహారోత్పత్తులను అందుబాటులోకి తేవటానికి 9 ఏళ్ల క్రితం ‘న్యూట్రిహబ్’పేరిట టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ను నెలకొల్పింది. చిరుధాన్యాలతో చిరుతిళ్లు, అల్పాహార ఉత్పత్తులను తయారు చేసి, విక్రయించటంలో 500కు పైగా స్టార్టప్లకు న్యూట్రిహబ్ మార్గదర్శనం చేసింది. న్యూట్రిహబ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో), ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.దయాకర్రావు విశేష కృషి చేస్తూ చిరుధాన్యాలతో 110 రకాల ఆధునిక ఆహారోత్పత్తులను తయారు చేసే సాంకేతికతలను ప్రామాణీకరించారు. ‘ఈట్రైట్’పేరిట తొలి భారతీయ చిరుధాన్య ఉత్పత్తుల బ్రాండ్ను నెలకొల్పారు. ఈ నేపథ్యంలో డా.దయాకర్రావుతో ముఖాముఖి. – సాక్షి, సాగుబడిప్రశ్న: ‘న్యూట్రిహబ్’సీఈవోగా మీ ఆధ్వర్యంలో చిరుధాన్యాలను ఆహార మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు బహుముఖ కృషి జరిగింది. ఏకంగా 110 రకాల చిరుధాన్యాల ఆధునిక ఆహారోత్పత్తుల తయారీ సాంకేతికతలను ప్రామాణీకరించటం ప్రపంచంలోనే ఒక అపూర్వమైన విషయం. ఇది ఎలా సాధ్యమైంది? జవాబు: మిల్లెట్స్ సాగు విస్తీర్ణం, వినియోగం పెరగాలంటే మార్కెట్ సృష్టించాలి. చిరుధాన్యాల్లో పోషకాలు, విలువ జోడింపు, శుద్ధి, యంత్రాల అభివృద్ధి, బ్రాండింగ్, ప్రాచుర్యం కల్పించటం, విధాన నిర్ణేతలకు మౌలిక నివేదికలు అందించటం వంటి విషయాల్లో సమగ్ర దృష్టితో చేసిన కృషి ఫలించటం వల్లనే స్టార్టప్లు, ఆహార కంపెనీలు సైతం చిరుధాన్యాల ఉత్పత్తులను పెద్దఎత్తున మార్కెట్లోకి తేగలిగాయి.ప్ర: తొలి భారతీయ మిల్లెట్ బ్రాండ్ ‘ఈట్రైట్’గురించి చెబుతారా? జ: 2010లో ప్రపంచబ్యాంకు ప్రాజెక్టులో భాగంగా ఐఐఎంఆర్ సొంత బ్రాండ్ ‘ఈట్రైట్’ను ప్రారంభించి, ప్రజలకు చిరుధాన్య ఆధునిక ఆహారాలను అందుబాటులోకి తెచ్చాం. రైతులు పశుగ్రాసం కోసమే చిరుధాన్యాలు సాగు చేసే పరిస్థితుల్లో చిరుధాన్యాలకు విలువ జోడించి ఉత్పత్తులు తయారు చేసే వ్యాల్యూ చెయిన్ను రూపొందించేందుకు కృషి చేశాం. ఐటీసీతో కలసి రైతుల నుంచి చిరుధాన్యాలు కొనుగోలు చేయించి, ప్రాసెసర్లకు సరఫరా చేయించాం. మిల్లెట్ సైన్స్ ను బిల్డ్ చేసే క్రమంలో ఎన్ఐఎన్తో కలసి షుగర్పై క్లినికల్ ట్రయల్స్ చేశాం. ప్ర: జాతీయ, అంతర్జాతీయంగా ప్రజలకు వందలాది ఆధునిక చిరుధాన్య ఆహారోత్పత్తులను పరిచయం చేసిన తొలి శాస్త్రవేత్తగా మీ అనుభవాలేమిటి? జ: ఉత్తరాదిలో చిరుధాన్యాలంటే సజ్జలు మాత్రమే. మిగతా చిరుధాన్యాలను, వాటిలో పోషకాలను వారికి అవగాహన కల్పించి 500 వరకు వంటకాలను పరిచయం చేశాం. అంతర్జాతీయంగా 250 మిల్లెట్ రెసిపీలను అందించాం. జీ–20 సభల కాలంలో 150 దేశాల ఎంబసీలకు ఈ రెసిపీలను అందించాం. అమెరికన్ కాన్సులేట్ వాళ్లు ఈ రెసిపీ బుక్స్ను తిరిగి పబ్లిష్ చేసి పంపిణీ చేశారు. దుబాయ్, జర్మన్ ఎక్స్పోలలో ప్రమోషన్ చేశాం. భవిష్యత్తులో చిరుధాన్యాల ఆహార పరిశ్రమ భేషుగ్గా ఉంటుంది. ఆన్లైన్ అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ప్ర: ఏయే టెక్నాలజీలకు ఆదరణ ఎక్కువగా ఉంది? జ: రెడీ టు ఈట్ మిల్లెట్ ఉత్పత్తులు తయారు చేసే టెక్నాలజీలకు ఆదరణ బాగుంది. వాటిలో కొన్ని: న్యూట్రిబార్, చీజ్ బాల్స్, బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ (ఫ్లేక్స్, మిస్లీ), మఫిన్స్, కుకీస్, బ్రెడ్, వర్మిసెల్లి, పాస్తా, వరి బియ్యంలా కనిపించే చిరుధాన్యాల అనలాగ్ బియ్యం, మిల్లెట్ మిల్క్ (నాన్ డెయిరీ మిల్్క). ప్ర: ఈ టెక్నాలజీలలో మీకు అత్యంత కష్టం అనిపించిన, సంతృప్తినిచ్చినవి ఏవి? జ: ఉదయపు అల్పాహారంలోకి వాడే మిల్లెట్ ఫ్లేక్స్, నూడుల్స్, బ్రెడ్, మిల్లెట్ (ప్లాంట్ బేస్డ్) మిల్క్ వంటి సాంకేతికతలను అభివృద్ధి చేయటానికి అదనంగా కష్టపడ్డాం. చిరుధాన్యాలతో గ్లుటెన్ ఫ్రీగా మిల్లెట్ ప్రొడక్ట్స్ చెయ్యాలంటే బంక కోసం మైదాకు బదులు ఏమి వాడాలి.. దాని రుచి, రూపం ఎలా ఉండాలి అని పరిశోధించాం. కర్రపెండలం వాడాం. ప్లాంట్ బేస్డ్ మిల్క్ తయారు చేశాం. కర్డ్, పన్నీర్పై పనిచెయ్యాల్సి ఉంది. ‘కంపోజిట్ ఫుడ్స్’తయారీపై పరిశోధన చేస్తున్నాం. ఉదాహరణకు.. విటమిన్ డితో కూడిన మిల్లెట్ ఉత్పత్తుల కోసం మష్రూమ్స్ కలుపుతున్నాం. మిల్లెట్ ఫిష్ సాసేజ్లు తయారు చేశాం. ఇప్పటివరకు 110 టెక్నాలజీలను ప్రామాణీకరించి, వాటిని వాణిజ్యపరంగా వినియోగించుకొని ఉత్పత్తులు తయారు చేయటానికి 500 స్టార్టప్లకు, 200కుపైగా పెద్ద ఆహార కంపెనీలకు లైసెన్స్లు ఇచ్చాం. ఫ్లేకింగ్ ప్రాసెస్, పెద్ద రోటి మిషన్, చిన్న రోటి మిషన్.. ఈ మూడు టెక్నాలజీలకు పేటెంట్లు వచ్చాయి. ప్ర: మీ ఆధ్వర్యంలో 500కు పైగా స్టార్టప్లకు న్యూట్రిహబ్ ఇంక్యుబేషన్ సేవలు అందించింది. వీటిలో ఎన్నిటికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటు అందింది? వాటిలో ఎన్ని విజయం సాధించాయి? అందుకు కారణాలేమిటి? జ: చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు, అల్పాహార ఉత్పత్తులను తయారు చేసి, విక్రయించటంలో 500కు పైగా స్టార్టప్లకు న్యూట్రిహబ్ మార్గదర్శనం చేసింది. మొత్తంగా రూ.1,000 కోట్ల వరకు ఈ స్టార్టప్లు పెట్టుబడి పెట్టాయి. అర్హులైన 110 స్టార్టప్లకు ఆర్కేవీవై రఫ్తార్ పథకం కింద రూ.10.5 కోట్ల నిధులను సమకూర్చాం. 200కు పైగా ప్రముఖ కంపెనీలు కూడా న్యూట్రిహబ్ నుంచి టెక్నాలజీలను తీసుకున్నాయి. సాధారణంగా ఏ రంగంలోనైనా 90% స్టార్టప్లు లాభాల్లోకి రాకముందే మూలనపడతాయి. కానీ మిల్లెట్ స్టార్టప్లు 40–50% వరకు దేశవ్యాప్తంగా వ్యాపారం చేస్తూ చక్కగా పనిచేస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ మార్కెట్లో రెడీ టు ఈట్/ రెడీ టు కుక్ జంక్ ఫుడ్స్కు ఉన్న మార్కెట్లో 2–5 శాతం వరకు మిల్లెట్ స్టార్టప్స్ చేజిక్కించుకోగలిగాయి. ఈ ఉత్పత్తులన్నీ అతి తక్కువ ప్రాసెసింగ్తో చేసినవి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచివి. బాగా నడుస్తున్న స్టార్టప్లలో కొన్ని: ట్రూగుడ్, స్లర్ప్ ఫామ్స్, మిల్లెట్ అమ్మ, మిల్లెట్ మార్వెల్స్, మెబ్బిల్స్, దేశీ న్యూట్రి, బ్లిస్ ట్రీ, నౌరిష్ యు, మిల్లెట్ బ్యాంక్. ఆయన మార్గదర్శకత్వంలో... వ్యవసాయ ఆర్థికవేత్తగా 32 ఏళ్ల సర్వీసులో జాతీయ, అంతర్జాతీయ సమాజానికి పలు వైవిధ్యభరితమైన చిరుధాన్య ఆహార సాంకేతికతలను అందించిన శాస్త్రవేత్త డా.దయాకర్రావు. 200కు పైగా పెద్ద ఆహార పరిశ్రమలకు మిల్లెట్ ఫుడ్ టెక్నాలజీలను అందించటం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో అనుసంధానం చేయటం ద్వారా మిల్లెట్ వాల్యూ చెయిన్ను అభివృద్ధి చేయటంలో ఆయన కీలకపాత్ర నిర్వహించారు. దయాకర్రావు మార్గదర్శకత్వంలో చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు, అల్పాహార ఉత్పత్తులను తయారు చేసి, విక్రయించటంలో 500కు పైగా స్టార్టప్లకు న్యూట్రిహబ్ మార్గదర్శనం చేసింది.ప్ర: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని మిల్లెట్ స్టార్టప్లు వచ్చాయి? విజయపథంలో పయనిస్తున్న స్టార్టప్లు ఎన్ని? వాటికి కలిసొచి్చన అంశాలేమిటి? జ: స్టార్టప్లలో మనవాళ్లవే ఎక్కువ. 200 వరకు ఉంటాయి. ఇందులో సక్సెస్ఫుల్గా నడుస్తున్నవి 50 వరకు ఉంటాయి. ఐఐఎంఆర్ హైదరాబాద్లో ఉండటం, ప్రభుత్వాల ప్రోత్సాహం, ప్రజల్లో షుగర్ సమస్య పెరగడంతో ఆహార చైతన్యం ఎక్కువగా ఉండటం, స్టార్టప్ నిర్వాహకుల్లో ప్యాషన్ వంటివి కలిసొచ్చాయి. -
887 అద్భుతమైన పాత పంటలు
ప్రతికూల వాతావరణ మార్పులు వ్యవసాయానికి, ముఖ్యంగా వ్యవసాయాధార దేశమైన మనకు, పెద్ద సవాలుగా మారింది. గడచిన 16 నెలలు గతమెన్నడూ ఎరుగని రీతిలో విపరీత వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా పగలు / రాత్రి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ ఫలితంగా అనేక పంటలు సాగులో సవాళ్లు పెరిగిపోయాయి. ఈ పూర్వరంగంలో విపరీత వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడి, మంచి దిగుబడులను ఇచ్చే విత్తనాలు (క్లైమెట్ రిసైలియంట్ సీడ్స్) మన రైతులకు అందించటం వారి జీవనోపాధి/ ఆదాయ భద్రతకు, దేశానికి ఆహార భద్రతకు అత్యంత కీలకంగా నిలిచాయి.అటువంటి అపురూప దేశీ వంగడాలు, 71 రకాల పంటలకు సంబంధించిన, 887 మన దేశంలోని 15 రాష్ట్రాల్లో ఇప్పటికీ రైతుల దగ్గర ఉన్నాయని న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సిఎస్ఇ) నిర్వహించిన అధ్యయనం తేల్చింది. భేషైన పాత పంటల వంగడాలు అందుబాటులో ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కరువును, అధిక ఉష్ణోగ్రతలను, చీడపీడలను, నీటి ముంపును, పెనుగాలులను, చౌడును తట్టుకొనే గుణాలు ఈ దేశీ వంగడాలకు పుష్కలంగా ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది.విత్తన సంరక్షకులు, సామాజిక విత్తన బ్యాంకులు (కమ్యూనిటీ సీడ్ బ్యాంక్లు– సిబిఎస్లు) వీటిని ప్రతి ఏటా సాగు చేస్తూ పరిరక్షిస్తున్నాయని సిఎస్ఎ అధ్యయనంలో తేలింది. క్లైమెట్ ఛేంజ్ని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వం కమ్యూనిటీ సీడ్ బ్యాంక్లను పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తే ప్రకృతి సేద్యానికి కూడా దోహదమవుతుందని సిఎస్ఎ తెలిపింది. దేశీ వంగడాలు ఇప్పటికీ ఎప్పటికీ ఎంత ప్రాణవసరమో తెలియజెప్పడానికి ఈ అధ్యయనం వెలుగులోకి తెచ్చిన అపురూప సమాచారంతో కూడిన కథనం..విపరీత వాతావరణ పరిస్థితుల్ని దీటుగా తట్టుకొని మంచి దిగుబడులనిచ్చే వంగడాలు అని అనగానే జున్యుమార్పిడి, జన్యుసవరణ వంటి అత్యాధునిక ప్రజనన (బ్రీడింగ్) పద్ధతుల్లో తయారు చేస్తున్న సరికొత్త వంగడాలే మనల్ని ఆదకోగలవు అన్న అభి్రపాయం కలుగుతుంది. అయితే, వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకునే అపురూప దేశీ వంగడాలు (పాత పంటలు) చాలానే మన రైతుల దగ్గర అనాదిగా సాగులో ఉన్నాయని భారతీయ సుసంపన్న వ్యవసాయక వారసత్వ పటిమను ఎరిగిన వారు చెబుతున్నారు. దేశీ విత్తనాలు కొల్లలుగా ఉన్నప్పటికీ, వాటిలో ఆధారపడదగిన గణాంకాలతో కూడిన ఆధారాలనున్న పాత పంటలు ఎన్ని అనేది ఖచ్చితంగా తెలీదు.ఈ లోటు తీర్చటం కోసం న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సిఎస్ఇ) తాజాగా ఓ అధ్యయనం చేసి మంచి పని చేసింది. 71 రకాల పంటలకు సంబంధించిన 887 దేశీ వంగడాలు భేషైన పాత పంటల వంగడాలు అందుబాటులో ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే, నిజానికి వాతావరణ ప్రతికూలతల్లోనూ దిగుబడినిస్తున్న పాత పంటల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని, తాము సేకరించగలిగింది కేవలం 15 రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు, కొందరు విత్తన సంరక్షకుల వద్ద గల సమాచారాన్ని మాత్రమేనని సిఎస్ఇ ప్రకటించింది.కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అంటే?వాతావరణ మార్పు నేపథ్యంలో, ఆహార భద్రత మరియు సార్వభౌమత్వాన్ని ఆధారం చేసుకునే జీవవైవిధ్యం వేగంగా నష్టపోవడాన్ని మనం చూస్తున్నాం. తరతరాలుగా సమాజాలను పోషించిన సాంప్రదాయ పంట రకాలు మన పోలాల నుంచి, మన ఆహారం నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాతావరణ మార్పుల ముప్పు ఉన్న ప్రపంచంలో వ్యవసాయానికి, రైతులకు వెన్నుదన్నుగా నిలవడానికి అవసరమైన విత్తనాలను రక్షించడంలో కమ్యూనిటీ సీడ్ బ్యాంకులు (సిబిఎస్లు) లేదా సామాజిక విత్తన బ్యాంకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.సామాజిక విత్తన బ్యాంకులు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఒక రకమైన వికేంద్రీకృత జన్యు బ్యాంకులు. స్థానిక రైతు సంఘాలు, స్వయం సహాయక బృందాలు, లాభాపేక్షలేని సంస్థలు, మహిళలు వీటిని నిర్వహిస్తున్నారు. దేశీయ విత్తనాలను, విపరీత వాతావరణ ప్రభావాలను దీటుగా తట్టుకొని నిలిచే విత్తనాలను అనాదిగా ఏటేటా రైతుల ద్వారా సాగు చేయిస్తూ, అవి కాలగర్భంలో కలసిపోకుండా పరిరక్షించటం సామాజిక విత్తన బ్యాంకుల ప్రాథమిక ఉద్దేశ్యం. ఈ విత్తనాలను పరిరక్షించటంతో పాటు వాటి ఉపయోగాలు, ఔషధ గుణాల గురించిన సంప్రదాయ విజ్ఞానాన్ని కూడా సంరక్షించడం వీటి లక్ష్యం. ఉదాహరణకు, మన దేశంలో కరువు పరిస్థితుల్లో, ఉప్పు నీటిలో పెరిగే వరి రకాలు ఉన్నాయి. మనకు అధిక వేడిని తట్టుకునే కూరగాయల రకాలు ఉన్నాయి. ఈ వంగడాలను సంరక్షించడంలో, వాటిని రైతులకు అందుబాటులో ఉంచడంలో సామాజిక విత్తన బ్యాంకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అయితే, వాటికి ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, వాటిపై అవగాహన లేకపోవడం, ప్రభుత్వ విధానాల మద్దతు పరిమితంగా ఉండటం, ఆర్థిక సవాళ్ల కారణంగా అవి తగినంత గుర్తింపు పోందటం లేదు.దేశంలోని వివిధ రాష్ట్రాలలో సామాజిక విత్తన బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న అపారమైన వైవిధ్యాన్ని మ్యాప్ చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి సిఎస్ఇ చేసిన ఒక ప్రయత్నమే ఈ నివేదిక. శుభవార్త ఏమిటంటే, మనకు ఇప్పటికీ వ్యవసాయక సమాజాలు సంరక్షిస్తున్న సాంప్రదాయ పాత పంట రకాలు విస్తృత శ్రేణిలో ఉన్నాయి. వీటిలో ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు, తదితర రకాల పంటల విత్తనాలు ఉన్నాయి. ఈ అపురూప పాత పంట విత్తనాలను, వాటిని సంరక్షించే సంఘాలను మనం కాపాడుకోవాలి. -
టెర్రస్ గార్డెన్స్ : ఇచ్చిపుచ్చుకోవడం ఓ ట్రెండ్
నగరంలో టెర్రస్ గార్డెనింగ్(మిద్దె పంట) ఒక ట్రెండ్గా, సరికొత్త జీవనశైలిగా మారిన విషయం విధితమే. ఇందులో భాగంగానే నగరంలోని భవనాలు పచ్చదనం అల్లుకుంటున్నాయి. అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్ అనే తేడా లేకుండా అవకాశం ఉన్న ప్రతీ ఇంటిపై చిన్న తోట ఉండాలనే ఆకాంక్ష ఒక్కొక్కరి హృదయంలోనూ నాటు వేస్తోంది. ప్రస్తుతం నగరంలోని మిద్దె తోటల ప్రేమికులువర్షాకాలాన్ని స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కాస్త ముందుగానే కురవడం, ఈ తొలకరి జల్లులు వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ సందర్భంగా మొక్కలు నాటడానికి అనువైన ఈ సమయాన్ని వినియోగించుకోవడానికి విత్తన సేకరణ మొదలుపెట్టారు. -సాక్షి, సిటీబ్యూరో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా విత్తనాల సేకరణ మొదలైంది. పాత కాలపు ‘నువ్వు ఇస్తే.. నేను ఇస్తా‘ పద్ధతిలో విత్తనాల మారి్పడి జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ విత్తన మారి్పడికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ యాప్స్లో వందలు, వేల మందితో ఉన్న మిద్దెపంట గ్రూపులు ఈ విత్తన సేకరణపై దృష్టి సారించాయి. ప్రముఖ సోషల్ మీడియా గ్రూపులు వాట్సప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఈ విత్తనాల మారి్పడి సంస్కృతి మొక్కల కోసం మానవ సంబంధాలు పెరిగే సూచికగా మారాయి. ఈ గ్రూపుల సభ్యులు తమ వద్ద ఉన్న హెయిర్లూమ్ సీడ్స్, దేశీ విత్తనాలను ఇతరులకు పంచిపెడుతున్నారు. అయితే హైబ్రిడ్ విత్తనాలకు బదులుగా జెనెటిక్ డైవర్సిటీని నిలబెట్టే పద్ధతుల వైపు మొగ్గుచూపుతుండటం విశేషం. సిటీలో పచ్చదనపు స్పర్శ టెర్రస్ గార్డెనింగ్ నగరానికి కొత్త కాకపోయినా, కోవిడ్ తర్వాత ఈ సంస్కృతి విస్తృతమైంది. ఇంటింటా పిల్లలకు మొక్కల తాలూకు పరిచయం కలిగిస్తూ, విత్తనాలు నాటే పద్ధతులపై అవగాహన పెరుగుతోంది. కొన్ని గ్రూపులు ప్రత్యేకంగా కిడ్స్ సీడ్ స్వాప్ సెగ్మెంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇది పాత తరం జీవితానికి దగ్గరగా చేరే ఒక మార్గం కావడంలో సందేహం లేదు.‘‘ఇది మాకు ఆహారం కోసం మాత్రమే కాదు, మనశ్శాంతి కోసం కూడా’’ అని అంటున్నారు హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మిద్దె పంట ప్రేమికురాలు సూర్యప్రభ. శ్రమకోర్చి నాటిన విత్తనాలు తర్వాత మొలక వేసిన మొక్కను చూడటం, తన చేతులతో పండించిన కూరగాయలను ఇంట్లో వండుకోవడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిదని ఆమె పేర్కొన్నారు. మీట్స్తో పాటు అవగాహన ఈ నెలాఖరులో నగరంలోని బేగంపేటలో ఒక సీడ్ స్వాప్ మీట్ను నిర్వహించనుంది. ఇక్కడ ఎటువంటి డబ్బు లావాదేవీలు ఉండవు. ఇది పూర్తిగా మార్పిడి పద్ధతిపై ఆధారపడిన సదస్సు. దీనితో పాటు జూబ్లీహిల్స్, హిమాయత్నగర్, ఎస్ఆర్ నగర్, ఈసీఐఎల్ వంటి ప్రాంతాల్లో విత్తన మార్పిడి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు గ్రూపుల్లో ప్రణాళికలు రూపొందించారు. ఈ మీట్లో విత్తనాల మార్పిడితో పాటు విత్తన భద్రతా పద్ధతులు, కంపోస్టింగ్ టెక్నిక్స్, ఇండోర్ ప్లాంట్స్ గురించి అవగాహన, జీరో వేస్ట్ గార్డెనింగ్ వంటి అంశాలపై చిన్న చిన్న సెషన్లు కూడా నిర్వహిస్తారు. విత్తనాల మార్పిడి ద్వారా కేవలం మొక్కలు మాత్రమే కాదు, ఆత్మీయ సంబంధాలు కూడా నాటుతున్నారు. ఇంటికి అనువైన మొక్కలు ఈ వర్షాకాలంలో మిద్దె తోటల ప్రేమికులు ప్రధానంగా కూరగాయలు, పూల మొక్కలు, హెర్బ్స్ను నాటేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా గోంగూర, బీరకాయ, దోసకాయ, ముల్లంగి, మిరపకాయ, టమోటా వంటి కూరగాయలు పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జూహీ, చామంతి, గులాబీ, హిబిస్కస్ వంటి పూల మొక్కలతో పాటు తులసి, కరివేపాకు, వెల్లుల్లి కాడ, ధనియాల మొక్క, అలవేరా వంటి హెర్బ్స్ పెంచడానికి ఇష్టపడుతున్నారు. తక్కువ స్థలంలో, కంటైనర్లలో సులభంగా పెరగడం ఈ మొక్కల ప్రత్యేకత. అలాగే ఈ మొక్కల వాసన, ఆకృతి, వండినప్పుడు వచ్చే రుచి, ఆరోగ్య ప్రయోజనాలు మిద్దె తోటల ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి. -
పెరిగేది... దిగుబడా? సమస్యలా?
మొన్న మే 4న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దేశంలో మొదటి సారిగా జీనోమ్ ఎడిట్ చేసిన రెండు కొత్త వరి రకాలను విడుదల చేశారు: డీఆర్ఆర్ రైస్ 100 (కమల), పూసా డీఎస్టీ రైస్ 1. కమల రకాన్ని సాంబా మహసూరి (బీపీటీ 5204) ఆధారంగా ఐసీఏఆర్–ఐఐఆర్ఆర్ హైదరా బాద్ అభివృద్ధి చేసింది. రెండవ రకం– పూసాను ఎంటీయూ 1010 ఆధారంగా ఐసీఏఆర్–ఐఏఆర్ఐ న్యూఢిల్లీ అభివృద్ధి చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వీటి వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయి: దిగుబడిలో 19 శాతం పెరుగుదల. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో 20 శాతం తగ్గింపు. 7,500 మిలియన్ క్యూబిక్ మీటర్ల సాగునీరు ఆదా. కరువు, లవణీయత, వాతావరణ ఒత్తిళ్లను మెరుగ్గా తట్టుకోగలగడం.ఈ ప్రకటన ప్రకారం, ఈ రకాలు పంట కాలాన్ని 20 రోజులు తగ్గిస్తాయి. తద్వారా కర్బన ఉద్గారాలను, నీటి వినియోగాన్ని తగ్గిస్తాయి. అయితే, మొత్తం సమాచారం బయటపెట్టలేదు. వీటి విడుదల ఆహారానికి, ఆహార భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది కాబట్టి తెలుసుకోవడం, ప్రతిస్పందించడం ప్రజల హక్కు. ఇతర దిగుబడి సమస్యలో?దాదాపు 50 ఏండ్ల క్రితం అధిక దిగుబడి వంగడాల పేరిట హైబ్రిడ్ రకాలను విడుదల చేయడం వల్ల కొనసాగుతున్న అనర్థాలు అనేకం. ఈ రెండు వరి రకాలు వాతావరణ మార్పులను తట్టుకునేవి అనుకుందాం (ఇది ఒక సందేహాస్పద వాదనగానే కనిపిస్తుంది). మరి దిగుబడి ఎట్లా పెరుగుతుంది? వరి దిగుబడిపై ప్రభావం చూపే కారణాలలో విత్తనాలతో సహ అనేకం ఉన్నాయి– సారవంతమైన నేల, సరైన పోషకాలు, నీరు, పొలంలో ఇతర జీవాల పాత్ర, వగైరా. తీవ్ర వాతావరణ మార్పుల వల్ల పంటలకు ఉపయోగపడే ఇతర రకాల జీవులు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. వాటిలో మట్టిలో ఉండే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. తెగుళ్లు కూడా ఉన్నాయి. కేవలం వరి ధాన్యానికి వాతావరణ మార్పు ఒత్తిడిని తట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుందా? దిగుబడిని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఆ విధమైన శక్తిని సంపాదించకుంటే, వరి దిగుబడి స్థిరంగా ఉంటుందా? వరి జన్యువులో ఒకటి మార్చినంత మాత్రాన దిగుబడి పెరగదు. ప్రధానంగా, భారతదేశంలో వరి దిగుబడి సమస్య చాలా కాలంగా అనేక రూపాలలో కనిపిస్తున్నది. నిరంతరం ఒకే పంట వేయడం వల్ల, అధిక నీరు ఇవ్వడం నేల సారం పూర్తిగా పడిపోయింది. కృత్రిమ, రసాయన ఎరువులు వేయనిదే పంట రావడం లేదు. ఈ రకమైన దిగుబడి సమస్య మీద పరిశోధన చేయకుండా ఇంకేదో చేయడం సరి కాదు. వాస్తవానికి, ప్రభుత్వ సమాచారం ప్రకారమే 2025 ఏప్రిల్ 1 నాటికి వరి నిల్వలు రికార్డు స్థాయిలో 63.09 మిలియన్ టన్నులు ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యం కంటే 13.6 మిలియన్ టన్నులు అధికం. మరింత దిగుబడి పెరిగితే రైతుకు గిట్టుబాటు కాదు. ప్రభుత్వం కొనదు! మరి ఈ రెండు కొత్త వరి విత్తన రకాల ద్వారా శాస్త్రవేత్తలు ఏ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు? సరళంగా చెప్పాలంటే, శాస్త్రవేత్తల అవగాహన రైతుల సమస్యలకు భిన్నంగా ఉంటున్నది. రైతులు తక్కువ దిగుబడి గురించి ఫిర్యాదు చేయడం లేదు. అధిక సాగు ఖర్చులు, గిట్టుబాటు లేని ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ తాజా వరి రకాల విడు దలలో భారతీయ రైతులకు ఏమి అవసరమో అది కాకుండా, కంపెనీ లకు ఉపయోగపడే శాస్త్రీయ పరిశోధన పేరుతో కొత్త రకాలను నెత్తిన రుద్దుతున్న వైనం కనబడుతోంది.‘శుద్ధి’ చేయడం సాధ్యమా?ఈ వరి రకాలు ఒక కొత్త సాంకేతిక విప్లవం అని ఢంకా బజాయిస్తున్నారు. గింజలను అధికంగా ఉత్పత్తి చేసే జన్యువు పని సానుకూలం చేశాము అంటున్నారు. పోషకాలు లేదా ఇతర ‘సహాయం’ లేకుండా ఒక జన్యువు అధికంగా గింజలను సాధించగలదా? గాలిలో నుంచి సాధువు భస్మం పుట్టించినట్టు వరి గింజలోని ఒక జన్యువు అధిక దిగుబడి ఇస్తుంది అంటున్నారు. పర్యవసానాలు, దీర్ఘకాలిక పరిణామాల గురించి చెప్పడం లేదు. ఈ ఆహారం తినే మనుష్యుల మీద, జంతువుల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలియదు. విత్తనాల జన్యుక్రమం, సహజ సంపదకు కలిగే దీర్ఘకాలిక పరిణామాల గురించి అసలే తెలియదు. ఈ రకమైన విత్తనాల వల్ల సహజ, మంచి రకం విత్తనాలు కలుషితం అయితే తిరిగి వాటిని ‘శుద్ధి’ చేయడం అసాధ్యం. పరిశోధనలు, పరిశీలనలు, పరీక్షలను కొన్ని ఏళ్ల పాటు ప్రయోగశాలలో జరపాల్సి ఉండగా, కేంద్రం తొందర పడి ఈ రెండు రకాలను విడుదల చేయడంలో సార్వజనీన సంక్షేమ లక్ష్యం కనపడటం లేదు. విదేశీ ప్రైవేట్ కంపెనీల గుప్పిట్లో ఉన్న ఈ టెక్నాలజీకి ప్రభుత్వమే ముందుండి ప్రోత్సాహం ఇవ్వడం ఆశ్చర్యం కలిగి స్తున్నది. పేరుకే కేంద్ర ప్రభుత్వ సంస్థల పేర్లు ముందట పెడుతున్నా దీని వెనుక విదేశీ, లాభాపేక్ష శక్తులు ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. విత్తనాలు, జన్యు సంపదతో ఆడుకోవడానికి శాస్త్రవేత్తలకు క్రిస్పర్ (సీఆర్ఐఎస్పీఆర్) ఒక సాధనంగా మారింది. ఈ టెక్నాలజీ ఉపయోగించి ఇంకా 40 పంటల మీద పరిశోధనలు జరుగుతున్నా యని కేంద్రం ప్రకటించింది. వరి జన్యుక్రమంలో జన్యువులను తమ ఇష్టానుసారంగా తొలగించి, శాస్త్రవేత్తలు కోరుకున్న విధంగా ‘స్పంది స్తుందని’ మనకు విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అధిక దిగుబడి, వాతావరణ ఒత్తిళ్లకు తట్టుకునే శక్తి సామాజిక–ఆర్థిక లక్ష్యాలు. ఇవి ఇప్పుడు ప్రకృతిలో చొప్పించబడ్డాయి. ప్రకృతిపై ఇటువంటి పరిశోధన నిరపాయ కరమైనది కాదు. ఈ పరిశోధన వెనుక ఉన్నతమైన ఆదర్శాలు లేవు. స్వతంత్ర పర్యవేక్షణ లేకుండా ఒక కొత్త ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టి వ్యాపారం పెంచుకోవడానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఆక్షేపించదగినది. భారత ప్రభుత్వం ఈ రకం పరిశోధనలను నియంత్రించాలి, నిషేధించాలి. అంతగా అవసరం అనుకుంటే ప్రయోగశాలలకే పరిమితం చేయాలి. క్రిస్పర్ ఆధారిత జన్యుమార్పిడి పంటల మీద భారత సమాజంలో విస్తృత, బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉంది.దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
Sagubadi : పర్పుల్ వింగ్డ్ బీన్స్
చిక్కుడు పంటలో బోలెడంత వైవిధ్యం ఉంది. మనకు తెలిసిన అన్ని చిక్కుడు కాయలు ఆకుపచ్చగానే ఉంటాయి. కాయ పొడవుగా, పలకగానో, గుండ్రంగానో ఉంటాయి.అయితే, కాయకు నాలుగు రెక్కలు ఉండే చిక్కుడు (వింగ్డ్ బీన్) వంగడం ఉంది. ఇది ఆకుపచ్చని రకం. ఇందులోనే ఊదా రంగులో ఉండే వింగ్డ్ బీన్స్ రకం ఒకటి ఉంది. అదే పర్పుల్ వింగ్డ్ బీన్. దక్షిణ ఆసియాలోని రైతులు, వినియోగదారులకు ఈ పర్పుల్ వింగ్డ్ బీన్ (Purple Winged Beans) తెలుసు. దీనితో వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయని, వ్యాధి నిరోధకతకు దోహదం చేస్తుందని వారికి గమనిక ఉంది. మొక్క 3–4 మీటర్లు (9.8–13.1 అడుగులు) ఎత్తు పాకే తీగ జాతి కూరగాయ పంట ఇది. దీని గింజలతో పాటు ఆకులు, పువ్వులు, వేర్లు.. అన్నీ తినదగినవే. కాయలను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. గింజలను ఉడికించి తినొచ్చు. వేర్లు కూడా తినొచ్చు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఇనుముతో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. నాటిన మూడు నెలల్లోనే కాయలు కోతకు వస్తాయి. పర్పుల్ బీన్ పువ్వులను సలాడ్గా తినొచ్చు. లేత ఆకులను కోసి పాకూర మాదిరిగానే ఆకు కూరగా తయారు చేసుకోవచ్చు. వేర్లను పచ్చివి లేదా దుంపల్లా కాల్చుకొని తినొచ్చు. గింజలను సోయా బీన్స్ మాదిరిగా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. గింజల్లో 20% ప్రొటీన్ ఉంటుంది. ఆకులు, పూలలో 10–15% ప్రొటీన్ ఉంటుంది. వింగ్డ్ బీన్స్ పంటకు చీడపీడల బెడద లేదని, ఒక్కసారి నాటితే మళ్లీ మళ్లీ దానంతట అదే పెరుగుతూ ఉంటుందని కర్ణాటకకు చెందిన సహజ సీడ్స్ సంస్థ ప్రతినిధి కృష్ణప్రసాద్ చెబుతున్నారు.చిక్కుడు పంటలో బోలñ డంత వైవిధ్యం ఉంది. మనకు తెలిసిన అన్ని చిక్కుడు కాయలు ఆకుపచ్చగానే ఉంటాయి. కాయ పొడవుగా, పలకగానో, గుండ్రంగానో ఉంటాయి.అయితే, కాయకు నాలుగు రెక్కలు ఉండే చిక్కుడు (వింగ్డ్ బీన్) వంగడం ఉంది. ఇది ఆకుపచ్చని రకం. ఇందులోనే ఊదా రంగులో ఉండే వింగ్డ్ బీన్స్ రకం ఒకటి ఉంది. అదే పర్పుల్ వింగ్డ్ బీన్. -
బొప్పాయి.. లాభమేనోయి..
దేవరపల్లి: పొగాకు, జీడిమామిడి పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో ప్రత్యామ్నాయంగా పండ్ల తోటల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బొప్పాయి సాగుతో లాభాలు సాధిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 326 హెక్టార్లలో రైతులు బొప్పాయి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కడియం, అనపర్తి, దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు మండలాల్లో దీని సాగు అధికంగా ఉంది. తెగుళ్లను తట్టుకునే రకాల మొక్కలను మహారాష్ట్ర నుంచి తీసుకుని వచ్చి, తోటలు వేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు.బొప్పాయిలో అనేక రకాల వంగడాలున్నప్పటికీ ఎక్కువ మంది పింక్, కో–786, తైవాన్ రెడ్ లీడ్, స్వీట్ బరీ రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. మొక్క వేసిన 9 నెలల్లో కాపు వస్తోంది. రెండు నుంచి నాలుగేళ్ల పాటు ఎకరాకు 30 నుంచి 40 టన్నుల చొప్పున దిగుబడి వస్తోంది. దిగుబడి బాగుంటే నాలుగేళ్ల వరకూ తోటలు ఉంటాయి. కొంత మంది రెండేళ్లకే తోటలను తొలగిస్తున్నారు. మొదటి రెండేళ్లు దిగుబడి, పండు నాణ్యత, సైజు బాగుంటాయి. ఒక్కో పండు 2 నుంచి 4 కిలోల బరువు ఉంటుంది. ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తోందని, పెట్టుబడి రూ.60 వేల నుంచి రూ.70 వేలు అవుతోందని చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు » బొప్పాయి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. » ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. » చర్మం, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. » బరువు తగ్గడానికి, గుండె సంబంధిత సమస్యల నివారణకు తోడ్పడుతుంది. » బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్–సి దంతాల చిగుళ్ల ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగ నిరోధక శక్తి పెంపుదలకు తోడ్పడుతుంది. » విటమిన్–బి నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. » కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఖనిజాలు, ప్లేవొనాయిడ్లు, ఫోలేట్లు, పాంథోనిక్ ఆమ్లాల వంటి పోషకాలు బొప్పాయి పండులో పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. » ఇన్ని విధాల ఆరోగ్యం కలిగించేది కావడంతో బొప్పాయి పండును ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దిగుబడి బాగుంది నేను నాలుగెకరాల్లో బొప్పాయి పంట వేశాను. రెండు కోతలు జరిగాయి. ఎకరాకు 20 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను కాయలకు రూ.10 వేలు లభించాయి. ప్రస్తుతం టన్ను కాయలు రూ.5 వేలు పలుకుతున్నాయి. రావులపాలెం, అమలాపురం ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కాయలు కొనుగోలు చేసి, కోల్కతా, భువనేశ్వర్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.ధర బాగుంటే మంచి ఆదాయం వస్తుంది. జూలైలో తోట వేయగా, ఫిబ్రవరిలో కాపునకు వచ్చింది. మహారాష్ట్ర నుంచి మొక్క రూ.23 చొప్పున కొనుగోలు చేసి తెచ్చాను. ఎకరాకు 700 మొక్కలు పడతాయి. కాయ సైజు, నాణ్యత బాగున్నాయి. – కూచిపూడి రాజు, రైతు, పట్లంట్ల, దేవరపల్లి మండలం కొవ్వూరు డివిజన్లో అధికం బొప్పాయి సాగు కొవ్వూరు డివిజన్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. రాజమహేంద్రవరం డివిజన్లోని కడియం, అనపర్తి ప్రాంతాల్లో అక్కడక్కడ తోటలు వేశారు. వాతావరణం అనుకూలించి, తెగుళ్లు లేకుండా ఉంటే రైతులకు ఇది లాభదాయకమైన పంట. రైతులు ఇప్పుడిప్పుడే బొప్పాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. – బి.సుజాత కుమారి, జిల్లా ఉద్యాన అధికారి, రాజమహేంద్రవరం కోల్కతా, ఒడిశాకు ఎగుమతి వేసవి అనంతరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు బొప్పాయి తోటలు వేస్తారు. నల్ల నేలలు, ఇసుక, రాతి నేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. రాతి నేలలు, కొండ ప్రాంతాల్లో ఈ పంట పండదు. ఏటా మార్చి నుంచి జూన్ వరకూ దిగుబడి వస్తుంది. ఈ ప్రాంతంలో పండించిన బొప్పాయి కాయలు, పండ్లను ఒడిశా, భువనేశ్వర్, కోల్కతా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో బొప్పాయి కాయలు కూరగా వండుకొని తింటూంటారు. దీంతో, ఆ ప్రాంతాలకు పచ్చి కాయలు కూడా ఎగుమతి చేస్తున్నారు. వేసవిలో పండ్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. స్థానికంగా ఉన్న పండ్ల వ్యాపారులు తోటల్లోకి వచ్చి పండు కాయలు కొనుగోలు చేస్తారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో కిలో రూ.10 పలికింది. ప్రస్తుతం రూ.5 పలుకుతోంది. -
ఏక 'తాటి'గా ఫలాలు..రైతులకు ఆదాయ సిరులు..
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలోని పందిరిమామిడి డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన పరిశోధన స్థానం మంచి ఫలితాలు సాధిస్తోంది. తాటి ఉత్పత్తుల తయారీపై జరిపిన విస్తృత పరిశోధనల ఫలితంగా జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 2024–25కు సంబంధించి ఉత్తమ అవార్డు పొందింది. దీంతో ఇక్కడ 32 ఏళ్లుగా జరిపిన పరిశోధనలకు సార్థకత లభించింది. దేశంలో ఉన్న నాలుగు పరిశోధన స్థానాల్లో మేటిగా నిలుస్తూ గిరిజనుల ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేస్తోంది.రంపచోడవరం: పందిరిమామిడి డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన పరిశోధన స్థానం (హెచ్ఆర్ఎస్)కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. తాటి పరిశోధనల ఫలితంగా ఉత్తమ పరిశోధన స్థానంగా గుర్తింపు పొందింది. ఈ అవార్డును ఈనెల 7 నుంచి 9 వరకు మధురైలో జరిగిన కార్యక్రమంలో పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. వీసీ వెంగయ్య స్వీకరించారు. 1993లో నిధుల కేటాయింపుతో.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సమీపంలోని పందరిమామిడిలో 1986లో ఏర్పాటైన ఈ ఉద్యానవన పరిశోధన స్థానానికి 1993లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ సెంటర్ న్యూఢిల్లీ (ఐసీఏఆర్) తాటి పరిశోధనలకు నిధులు కేటాయించింది. అప్పటినుంచి 32 ఏళ్లుగా తాటి చెట్లకు సంబంధించి నిరంతరంగా వివిధ దశల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 272 తాటి రకాలతో.. దేశంలో వివిధ ప్రాంతాలనుంచి 272 రకాల తాటి చెట్ల టెంకలను సేకరించి ఇక్కడ నాటారు. తరువాత దశలో తాటి చెట్ల నుంచి నీరా సేకరణపై పరిశోధనలు సాగాయి. ఆధునిక పద్ధతులను అవలంభించి నీరాను విజయవంతంగా సేకరిస్తున్నారు. తాటి నుంచి ఆహార ఉత్పత్తుల తయారీపై కూడా ఇక్కడి శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. దీనిలో భాగంగా నీరా నుంచి తాటి బెల్లం, తాటి సిరప్, తాటి తేగల నుంచి నూక,పిండి, తాటి గుజ్జు నుంచి జెల్లీ వంటి 20 రకాల ఆహార పదార్థాలను విజయవంతంగా తయారు చేశారు. గిరిజనులకు తాటి ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి పరిశోధనల ఫలితాలను చేరువ చేశారు. తాటి తేగలతో పిండి, నూక (రవ్వ) తయారు చేసిన మైదా స్థానంలో వీటిని వినియోగించి పోషక విలువలతో కూడి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. వీటితో కేకులు, బిస్కెట్లు, జంతికలు, బ్రెడ్, నూడల్స్, రవ్వ లడ్డు, పిజ్జా బేస్ తదితర పదార్థాలను వాణిజ్య పరంగా తయారు చేస్తున్నారు. చింతూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ వెంయ్య సహకారంతో మూడు టన్నుల తేగల పిండిని లండన్కు పంపించింది. తరువాత కోవిడ్ కారణంగా నిలిచిపోయింది. మళ్లీ పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో 32 వన్య పంట విభాగాలు ఉండగా వీటిలో కొబ్బరి పరిశోధన స్థానాలు 20, ఆయిల్పామ్ రీసెర్చ్ సెంటర్లు, వక్క రీసెర్చ్ సెంటర్, తాటి పరిశోధన స్థానాలు నాలుగు ఉన్నాయి. వీటికి సంబంధించి ఏటా ఉత్తమ రీసెర్చ్ సెంటర్లకు అఖిల భారత వన్య పంటల విభాగంలో అవార్డు అందజేస్తారు. దీనిలో భాగంగా 2024–25కు సంబంధించి పందిరిమామిడి ఉద్యాన పరిశోధన కేంద్రానికి అవార్డు దక్కింది. ఎంతో సంతోషంగా ఉందితాటి పరిశోధనల్లో అనేక అంశాల్లో ముందడుగు వేయగలిగాం. తమ పరిశోధన స్థానంలో 32 ఏళ్లుగా తాటిపై జరిపిన పరిశోధనలు, వాటి ఫలితాలపై జాతీయ స్థాయిలో మధురైలో జరిగిన కార్యక్రమంలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తమ పరిశోధన స్థానానికి తొలిసారి జాతీయస్థాయి గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. తాటి ఫరిశోధనల ఫలితంగా కొత్త రకం తాటి రకాలను త్వరలో తీసుకువస్తాం.జాతీయ వేదికపై తాటికి సంబంధించి పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాం. 2014, 2017, 2023లో వ్యక్తిగతంగా జాతీయ స్ధాయిలో అవార్డులు వచ్చాయి. –డా. వీసీ వెంగయ్య, ప్రధాన శాస్త్రవేత్త, పందిరిమామిడి ఉద్యానవన పరిశోధన స్థానం(చదవండి: సోలార్ కంచె.. కొన్ని జాగ్రత్తలు!) -
సోలార్ కంచె.. కొన్ని జాగ్రత్తలు!
అటవీ జంతువులు, పశువుల నుంచి పంటలను కాపాడుకోవటానికి సోలార్ ఫెన్సింగ్ ఉపయోగపడుతుంది. చిన్న కమతాల్లో ఏర్పాటు చేసుకున్న రైతులను క్షేత్రస్థాయిలో గమనించినప్పుడు రైతులు చేస్తున్న కొన్ని పొరపాట్లను గమనించామని వాటర్లైవ్లిహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్మోహన్ తెలిపారు. సోలార్ ఫెన్సింగ్ నిర్వహణలో ఏ పనులు చెయ్యాలి? ఏ పనులు చెయ్యకూడదు? వంటి అంశాలపై కొన్ని సూచనలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.సోలార్ కంచె వ్యవస్థలో సోలార్ ప్యానల్, బ్యాటరీ, ఎనర్జైజర్, ఫెన్సింగ్ వైర్లు ఉంటాయి. 8–10 అడుగుల దూరంలో ΄పొలం చుట్టూ కట్టెలు, బొంగులు లేదా సిమెంటు స్థంభాలు పాతి కంచె ఏర్పాటు చేసుకోవచ్చు. రెండు రకాల యూనిట్లు మార్కెట్లో ఉన్నాయి. 1. సౌర విద్యుత్తును లాక్ చేసే ఎన్క్లోజర్ వున్నది. 2. ఎన్క్లోజర్ లేనిది. ఎనర్జైజర్, బ్యాటరీని రక్షించుకోవటానికి రైతు ఒక షెల్టర్ను నిర్మించుకోవాల్సి ఉంటుంది. సోలార్ బ్యాటరీలోని లోవోల్టేజి పవర్ను ఎనర్జైజర్ హైవోల్టేజ్ పవర్గా మార్చి కంచె తీగలకు సరఫరా చేస్తుంది. 40 వాట్స్ ప్యానళ్లు 5–8 ఎకరాల చుట్టూ కంచెకు సరిపోతాయి. 12 వోల్టులు, 18 అంప్రె (గంటకు) స్టోరేజ్ గల బ్యాటరీ పెట్టుకోవాలి.ఈ విద్యుత్ను ఎనర్జైజర్ 8 వేలు– 10 వేల వోల్టుల హైవోల్టేజి విద్యుత్గా మార్చి తీగలకు సరఫరా చేస్తుంది. ఇది పల్సేటింగ్ విద్యుత్తు. అంటే.. నిరంతరం విద్యుత్తు ప్రసరించదు. 1 – 1.2 సెకండ్లకు ఒకసారి మిల్లీ సెకండ్ మాత్రమే విద్యుత్తు ఆగి, ఆగి ప్రసరిస్తుంది. అందువల్లే పశువులకు కూడా గట్టి షాక్ తగులుతుంది. కానీ,ప్రాణాంతకం కాదు. షాక్కు షాక్కు మధ్య గ్యాప్ ఉంటుంది. కాబట్టి, ఒకటి రెండుసార్లు షాక్ తగలగానే పశువు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవటానికి వీలుంటుంది. ఎర్త్ విధిగా ఏర్పాటు చేయాలి. సోలార్ కంచెకు సంబంధించి అవగాహన పెంచుకొని, జాగ్రత్తగా నిర్వహించుకుంటే రైతులు దీర్ఘకాలం ప్రయోజనం పొందవచ్చు.ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలుచేయవలసినవిఎనర్జైజర్పైన కనిపించే బ్యాటరీ వోల్టేజిని గమనించండి. వోల్టేజి 10 వోల్టుల కన్నా తక్కువకు తగ్గిపోతుంటే.. గడ్డి, చెట్లు సోలార్ కంచె వైర్లకు తగులుతున్నందున విద్యుత్తు నష్టం జరుగుతోందని గుర్తించాలి. → కండక్టర్ వైర్కు అనుసంధానం చేసిన ఇన్సులేటర్లు పాడయ్యాయేమో అని తరచూ చూసుకోండి. → స్థానికంగా దొరికే వెదురు బొంగులు పాతి సోలార్ కంచె ఏర్పాటు చెయ్యండి. ఇనుప / సిమెంటు స్థంభాల కన్నా ఇవి చవక.→ పది అడుగులకో బొంగు పాతాలి. అంతకన్నా దూరం అయితే గాలి, వానలకు ఇబ్బంది అవుతుంది. → బ్యాటరీకి ఒక చిన్న డిసి బల్బును అమర్చితే పురుగులను నశింపజేసే దీపపు ఎరగా పనికొస్తుంది. → యూనిట్ను వాన, ఎండ, దొంగల నుంచి రక్షించుకోవటానికి పక్కా షెల్టర్ నిర్మించాలి. → సోలార్ ప్యానల్పైన దుమ్మును నెలకోసారైనా తుడవండి. → ఎర్త్ సిస్టం బాగుందా లేదా అని నెలకోసారైనా చూడండి. నీరు పోయండి. → రాత్రుళ్లు మనుషులు సోలార్ కంచెను ΄పొరపాటున తాకకుండా ఉండేందుకు రిఫ్లెక్టివ్ రేడియం టేపు లేదా స్టిక్కర్లు ఏర్పాటు చేయండి.చేయకూడనివికంచె వైర్లను అడుగుకన్నా ఎత్తులో కట్టండి. పంట మొక్కలు/చెట్లకు కొంచెం దూరంగా ఏర్పాటు చేయండి. లేకపోతే కలుపు మొక్కలు ఫెన్సింగ్కు తగిలి, విద్యుత్తు నష్టానికి కారణమవుతాయి. → ఫెన్సింగ్ వైరు కింద కలుపు పెరగనివ్వకండి. ΄్లాస్టిక్ మల్చింగ్ షీట్ లేదా వీడ్ మ్యాట్ వేసుకోవటం మేలు. → చెట్టు, ఇంటి నీడలో సోలార్ ప్యానల్ను పెట్టకూడదు. ఇది దక్షిణం వైపు తిరిగి ఉంటే మంచిది. → తుపాను సమయాల్లో, పిడుగుపాటుకు అవకాశం ఉన్నప్పుడు ఎనర్జైజర్ను ఫెన్సింగ్ వైరు నుంచి ముందుజాగ్రత్తగా వేరు చెయ్యండి.→ కంచెకు దగ్గరగా మొక్కలు నాటకండి. చెట్ల కొమ్మలు వైర్లను తాకనివ్వకండి. → మనుషులు సోలార్ కంచెను తాకకుండా జాగ్రత్త తీసుకోండి. తాకితే ఆగి ఆగి షాక్ కొడుతుంది.→ పిల్లలను కంచెకు దూరంగా ఉంచండి. చిన్న వయస్కులు తాకితేప్రాణాపాయం రావచ్చు లేదా గాయాలవ్వవచ్చు. → వైర్లలో హై వోల్టేజ్ పల్స్ కరెంట్ ప్రసరిస్తూ ఉంటుంది. దీన్ని టెస్ట్ చేయటానికి సాధారణ టెస్టర్లు లేదా వోల్టు మీటర్లు వాడకూడదు. మీటర్లు పాడవుతాయి. వాడితే షాక్ తగులు తుంది. -
కూరగాయలు కొత్త రంగుల్లో!
మన కూరగాయలు సంప్రదాయేతర రంగుల్లోకి రూపొంతరం చెందుతున్నాయి. క్యాలీ ఫ్లవర్ తెల్లగానే ఉండాలనేం లేదు.. వేరే రంగులో కనిపిస్తే ఆశ్చర్యపోకండి. త్వరలోనే పసుపు, ఊదా, ఆకుపచ్చ రంగుల్లోనూ క్యాలీ ఫ్లవర్ మార్కెట్లో కనిపించవచ్చు. అలాగే, బ్రకోలి ఆకుపచ్చగానే ఉండాలనేం లేదు.. పసుపు పచ్చగానూ ఉండొచ్చు. క్యారట్ ఎర్రగానే ఉండాలనేం లేదు.. ముల్లంగి, బంగాళదుంప, బీన్స్ ఇవన్నీ ఊదా రంగులోనూ రానున్నాయి. ఇంతకీ రంగుల కూరగాయలు మనకు మంచివేనా? రంగుతో పాటు పోషకాల్లోనూ ఏమైనా ప్రత్యేకత ఉందా? ఈ వంగడాలను రూపొందిస్తున్న పద్ధతులేమిటి? పర్యవసానాలేమిటి..?కూరగాయలు మనిషి తీసుకునే ΄పౌష్టికాహారంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. అవశ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల కోసం కూరగాయలపైనే ఆధారపడుతున్నాం. వైవిధ్యభరితమైన రంగుల్లో కూరగాయలను రూపొందించటం (కలర్ బ్రీడింగ్) వ్యవసాయంలో దూసుకొస్తున్న సరికొత్త ధోరణుల్లో ఒకటి. కొత్త రంగుల్లో కనిపించే కూరగాయల్లో అదనపు పోషకాలు ఉండటం, వాణిజ్యపరమైన గిరాకీ ఉండటం వల్ల శాస్త్రవేత్తలు ‘కలర్ బ్రీడింగ్’పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అనాదిగా మనకు తెలిసిన రంగులోనే కాదు ఇతర రంగుల్లోనూ కూరగాయలు మార్కెట్లోకి వస్తున్నాయి. చూపులకు ఆకర్షణీయంగా కనిపించడటం కోసం మాత్రమే కాదు ప్రత్యేక పోషకాల కోసం కూడా రంగుల కూరగాయ వంగడాలు రూపుదిద్దుకుంటున్నాయి.→ అటవీ జాతులే ఆధారంకొత్త వంగడాల రూపుకల్పనలో మన కూరగాయలకు సంబంధించిన అటవీ జాతుల పాత్రే అధికం. సాధారణ వంగడాల్లో లోపించే ఆంథోశ్యానిన్లు, కరొటెనాయిడ్లు, బెటాలైన్స్ అటవీ జాతుల్లో ఉంటాయి. అందుకే వాటితో సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో సంకరపరచి రంగు రంగుల వంగడాలు రూపొందిస్తున్నారు. అధిక బీటా కరొటెన్ లేదా ఆంథోశ్యానిన్ కలిగిన నారింజ, ఊదా, తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో క్యారట్ వంగడాలను రూపొందించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా, టొమాటోలో కూడా ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ, నలుపు, రెండు రంగులు కలిసిన రూపంలో లైకోపెన్ వంటి యాంటీఆక్సిడెంట్తో కూడిన కొత్త వంగడాలను రూపొందించడానికి వీలుందన్ని నిపుణులు చెబుతున్నారు. క్యాప్సికం (కూరమిరప)లో కూడా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నారింజ, ఊదా రంగుల్లో విటమిన్ సి కలిగి ఉండేలా కొత్త వంగడాలు రూపొందుతున్నాయి. బీట్రూట్లు సహజంగానే ఎరుపు, పసుపు లేదా తెలుపు రంగుల్లో ఉన్నాయి. డైటరీ ఫైబర్, బెటాలైన్స్ ఎక్కువ బీట్రూట్లలో ఉంటాయి. నారింజ, ఊదా, ఆకుపచ్చ రంగుల్లో క్యాలీఫ్లవర్ వంగడాలను రూపొందిస్తున్నారు. వీటిలో విటమిన్ సి, గ్లుకోసినొలేట్లు పుష్కలంగా ఉంటాయి. ΄పౌష్టికాహారం, ఆకర్షణీయంగా ఉండే ఈ రకాల కూరగాయల్లో రంగురంగుల వంగడాల అభివృద్ధికి అవకాశాలున్నాయి.→ జన్యుసవరణ కూడా..కూరగాయల రంగును మార్చడానికి అనేక ప్రజనన (బ్రీడింగ్) పద్ధతులను ఉపయోగిస్తారు. సాంప్రదాయ పద్ధతిలో స్థానిక లేదా అడవి జాతుల నుంచి రంగురంగుల వైవిధ్యాలను ఎంచుకుని, వాటిని ఇతర రకాలతో సంకరం చేస్తారు. రేడియేషన్ పద్ధతిలో ఉత్పరివర్తన ప్రేరేపిత జన్యు మార్పుల ద్వారా కొత్త రంగుల వంగడాలను రూపొందిస్తారు. బంగారు రంగు క్యాలీఫ్లవర్ ఇలాంటిదే. వర్ణద్రవ్యం సంబంధిత లక్షణాలను మరింత సమర్థవంతంగా గుర్తించి, కొత్త రకాలను అభివృద్ధి చేయటంలో అత్యాధునిక మార్కర్–అసిస్టెడ్ సెలక్షన్ వంటి పద్ధతులు బ్రీడర్లకు తోడ్పడుతున్నాయి. క్రిస్పర్ కాస్9 వంటి జన్యు సవరణ బయోటెక్నాలజీ విధానాలు వర్ణద్రవ్య జన్యువుల ఖచ్చితమైన సవరణకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. అయితే జన్యుమార్పిడి పద్ధతులు ఇతర జాతుల నుంచి రంగును, జన్యువులను కూడా తెచ్చిపెట్టుకునే వీలుకల్పిస్తాయి. అతి ఎరుపు గుజ్జు కలిగి ఉండేలా పుచ్చకాయ వంగడాన్ని రూపొందించటంలో ఈ పద్ధతిని పాటించారు. → ఆదరణ ఉంటుందా?కలర్ బ్రీడింగ్లో కొత్త వంగడాలు రూపొందించటం మన దేశంలో ఆంథోశ్యానిన్లతో కూడిన ఊదారంగు క్యారట్ వంగడంతోప్రారంభమైంది. పోషకాలు అధికంగా ఉండే ఈ రకానికి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. ఆంథోశ్యానిన్లు అధికంగా ఉండే నల్ల టొమాటోలు, బీటా కరొటెన్తో కూడిన నారింజ రంగు క్యాలీఫ్లవర్ యూరప్లోప్రాచుర్యం పొందాయి. అయితే, కొత్త రంగుల కూరగాయలను, జన్యుసవరణ కూరగాయలను సంప్రదాయక మార్కెట్లలో వినియోగదారులు ఎంత వరకు ఇష్టపడతారనే సందేహాలున్నాయి. రంగులప్రాధాన్యంప్రాంతానికో విధంగా ఉంటుంది. సాంస్కృతిక, సంప్రదాయ సంబంధమైన పట్టింపులు ఉంటాయి. కాబట్టి రైతులు ఈ రకాలను సాగు చేసే ముందు ఆలోచించుకోవాలి. రంగును బట్టి పోషకాలు!కూరగాయలు ఆయా రంగుల్లో ఉండటానికి మూల కారణం వాటిల్లోని ప్రత్యేక బయోయాక్టివ్ కాంపౌండ్లే. ఆంథోశ్యానిన్లు, కరొటెనాయిడ్లు, క్లోరోఫిల్, బెటాలైన్స్ వంటి బయోయాక్టివ్ మూలకాలలో.. ఏ మూలకం ఉంటే ఆ కూరగాయకు ఆ రంగు వస్తుంది. → కూరగాయ వేరే రంగులో ఉంటే చూడముచ్చటగా ఉండటంతో పాటు దానిలో పోషకాల వల్ల ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. → ఆంథోశ్యానిన్ల వల్ల ఊదా, ఎరుపు రంగులు వస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించటంతో పాటు గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి. → కరొటెనాయిడ్ల వల్ల పసుపు, నారింజ రంగులు వస్తాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. → క్లోరోఫిల్ వల్ల ఆకుపచ్చని రంగు వస్తుంది. శరీరంలో నుంచి మలినాలను బయటకు పంపటానికి, పొట్ట సూక్ష్మజీవుల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇది ఉపకరిస్తుంది. → ఎరుపు, పసుపు రంగు కూరగాయల్లో ఉండే బెటాలైన్స్ శరీరంలో వాపును తగ్గిస్తాయి.కలర్ బ్రీడింగ్తో ΄పౌష్టికాహార భద్రతఅధిక పోషకాలున్న రంగు రంగుల కూరగాయలపై దేశవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తే ΄పౌష్టికాహార భద్రతకు దోహదమవుతుంది. సంప్రదాయ బ్రీడింగ్ పద్ధతులతో ఎం.ఎ.ఎస్, క్రిస్పర్ కాస్ 9 జన్యుసవరణ వంటి ఆధునిక పద్ధతులను మిళితం చేస్తే మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. జెనిటిక్స్, బ్రీడింగ్ రంగంలో శాస్త్రవేత్తలు, విద్యార్థులకు కలర్ బ్రీడింగ్ మంచి అవకాశాలను కల్పిస్తుంది.– డాక్టర్ రామన్ సెల్వకుమార్, సెంటర్ ఫర్ప్రొటెక్టెడ్ కల్టివేషన్ టెక్నాలజీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ), పూసా, న్యూఢిల్లీ -
వరి జన్యు సవరణలో మనమే ఫస్ట్
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో ఇంతకు ముందు నుంచే అనేక పంటల్లో జన్యుసవరణ (Genome Editing) సాంకేతికత ద్వారా సరికొత్త వంగడాల రూపకల్పన జరిగింది. అయితే, ప్రపంచంలోనే తొలి జన్యు సవరణ వరి వంగడాలను రూపొందించిన ఘనత భారత్కు దక్కింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అభివృద్ధి చేసిన డిఆర్ఆర్ ధన్ 100 (కమల), ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఆర్ఐ) అభివృద్ధి చేసిన పూసా రైస్ డిఎస్టి1 (Pusa DST Rice 1) రకాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అధికారికంగా విడుదల చేసింది. ఇవి 20–30% అధిక దిగుబడినివ్వటం, 20% తక్కువ నీటిని వినియోగించటం, 20 రోజులు ముందుగానే పంట కోతకు రావటం వంటి ప్రయోజనాలను చేకూర్చుతాయని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ప్రకటించింది. మన దేశంలో మొట్టమొదటి జన్యు సవరణ వరి రకాలను అభివృద్ధి చేయటంతో జన్యు సవరణ సాంకేతికత మరోసారి చర్చలోకి వచ్చింది. పంట దిగుబడి అప్సింథటిక్ బయాలజీ రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రసాయన ఎరువులను అధికంగా వాడటం ముఖ్యమైన సవాళ్లలో ఒకటి. ఇది పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. నేలలోని సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయగల సూక్ష్మజీవులను ఇంజనీరింగ్ చేయడం, మొక్కలకు పోషకాలను మరింత అందుబాటులోకి తేవటం, రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించడం ద్వారా జన్యు సవరణ వంటి సింథటిక్ బయాలజీ సాంకేతికత ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. తెగుళ్ళు, వ్యాధులు, కరువు లేదా విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి పర్యావరణ ఒత్తిళ్లకు ఎక్కువ నిరోధకత కలిగిన పంటలకు జన్యు సాంకేతికతతో రూపుకల్పన చేస్తున్నారు. ఇవి పంట దిగుబడిని మెరుగుపరుస్తాయి. పురుగుమందులు, ఇతర రసాయనాల వాడకాన్ని తగ్గిస్తాయి.జంతు ఆధారిత ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంవ్యవసాయంలో సింథటిక్ బయాలజీ (Synthetic biology) మరొక ఉత్తేజకరమైన ప్రయోజనం ఏమిటంటే.. సాంప్రదాయ జంతు ఆధారిత ఉత్పత్తులకు మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడం. మాంసం, పాల ఉత్పత్తులు, ఇతర జంతు ఆధారిత ఉత్పత్తుల రుచిని, ఆకృతిని అనుకరించే ప్రోటీన్లను ఉత్పత్తి చేయడానికి పరిశోధకులు మొక్కల జన్యు క్రమంలో సవరణలు/ చేర్పులు/ మార్పులు చేస్తున్నారు. వ్యవసాయంలో సింథటిక్ బయాలజీ పరిధి అపారమైనది.సింథటిక్ బయాలజీ సవాళ్లుఅయితే, దీనికి సవాళ్లు కూడా ఉన్నాయి. వ్యవసాయంలో సింథటిక్ బయాలజీ వల్ల జన్యు భద్రత, అనాలోచిత విపరిణామాల గురించి కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఇతర సాంకేతికతల వలె సింథటిక్ బయాలజీకి సంబంధించి సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఉపయోగాన్ని నిర్ధారించుకోవడానికి పూర్తిగా అధ్యయనం చేయాలి. జాగ్రత్తగా నియంత్రించాలి.చదవండి: జన్యు సవరణ అంటే ఏంటి.. అదెలా చేస్తారు? -
జన్యు సవరణ.. నియంత్రణలు, నిబంధనలు
జన్యు సవరణకు సంబంధించిన ఆధునిక బ్రీడింగ్ ఆవిష్కరణ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో ఎటువంటి నియంత్రణ చట్టాలు, నియమనిబంధనలు అమల్లో ఉన్నదీ ఈ ఇన్ఫోగ్రాఫిక్ తెలియజెప్తోంది. ఈ దేశాలు జన్యు సవరణ వంగడాలను సాధారణ కొత్త వంగడాలుగానే పరిగణిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో చట్టాల్లో వచ్చిన మార్పుల వల్ల ఇది సాధ్యమైంది.సైట్ డైరెక్టెడ్ న్యూక్లియాసెస్1 (ఎస్డిఎన్1) పద్ధతిలో రూపొందించిన జన్యు సవరణ వంగడాలను సాధారణ కొత్త వంగడాల మాదిరిగానే పరిగణించాలనే అంశంపై విధాన రూపకల్పన దిశగా చెప్పుకోదగిన స్థాయిలో చర్చలు కొనసాగుతున్న దేశాలు. పాత చట్టాల ప్రకారం న్యాయస్థానాలు వ్యాఖ్యానాలకు అనుగుణంగా ఎస్డిఎన్1 పద్ధతిలో రూపొందించిన జన్యు సవరణ వంగడాలను జన్యు మార్పిడి జీవులు(జిఎంఓల)గానే పరిగణిస్తున్న దేశాలు. ఉత్తర అమెరికాజన్యుసవరణ వంటి సరికొత్త బ్రీడింగ్ ఆవిష్కరణలను సాధారణ వంగడాలుగా పరిగణిస్తూ పటిష్ట చట్టాలు చేసిన తొలి వరుస దేశాల్లో అమెరికా, కెనడా ముందు భాగాన ఉన్నాయి. జన్యు సవరణ చేసిన అధిక ఓలిక్ సోయాబీన్స్ నుంచి తీసిన నూనెను ‘కాలినో’ పేరిట విక్రయిస్తున్నారు. ఇది అమెరికాలో 2019 నుంచి వాణిజ్యపరంగా సాగవుతున్న తొలి జన్యు సవరణ పంట.లాటిన్ అమెరికాజన్యు సవరణ వంటి న్యూ బ్రీడింగ్ ఇన్నోవేషన్స్ను అనుమతిస్తూ 8 లాటిన్ అమెరికా దేశాలు చట్టాలు చేశాయి: బ్రెజిల్, చిలి, కొలంబో, ఈక్వడార్, గ్వాటెమల, హాండురస్, పరాగ్వే, అర్జెంటీనా. అర్జెంటీనా 2015లోనే తొలి చట్టం చేసింది. కోసిన తర్వాత రంగు మారకుండా ఉండేలా జన్యు సవరణ చేసిన బంగాళదుంపను క్రిస్పర్ ద్వారా 2018లో అర్జెంటీనా రూపొందించింది.యూరప్జన్యు సవరణ వంటి న్యూ జినోమిక్ టెక్నిక్స్ను జన్యుమార్పిడి వంగడాలుగా కాకుండా సాధారణ కొత్త వంగడాలుగానే భావించాలని యూరోపియన్ యూనియన్ 2023 జూలైలో ప్రతిపాదించింది యునైటెడ్ కింగ్డమ్లో ప్రెసిషన్ బ్రీడింగ్ బిల్లును 2022 మేలో ప్రవేశపెట్టారు. 2023 మార్చిలో రాజు ఆమోదం పొందింది. ఈ చట్టం సైన్స్ బేస్డ్ నియంత్రణ వ్యవస్థను నెలకొల్పటం ద్వారా పరిశోధనలకు దోహదం చేస్తోంది.చదవండి: జీనోమ్ ఎడిటింగ్.. ప్రయోజనాలు, ప్రతికూలతలుఆసియా పసిఫిక్జన్యు సవరణ వంగడాలు/ఉత్పత్తులను అనుమతిస్తూ ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్, భారత్ చట్టాలు చేశాయి. జపాన్లో జన్యు సవరణ చేసిన ‘హై గబ’ టొమాటోను 2021 నుంచి విక్రయిస్తున్నారు. బ్రౌన్గా మారకుండా ఉండేలా జన్యు సవరణ చేసిన అరటి రకాన్ని నాన్–జిఎంఓ ఉత్పత్తిగా పరిగణిస్తూ ఫిలిప్పీన్స్లో 2023లో చట్టం చేసింది. భారత ప్రభుత్వం జన్యు సవరణను జనుమార్పిడి నియంత్రణ జాబితా నుంచి 2023లో మినహాయించింది. తొలి రెండు జన్యుసవరణ అధిక దిగుబడి వరి వంగడాలను 2025 మేలో విడుదల చేసింది.ఆఫ్రికాజన్యు సవరణ వంటి న్యూ బ్రీడింగ్ ఇన్నోవేషన్స్ను అనుమతిస్తూ 4 ఆఫ్రికా దేశాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి: నైజీరియా (ఫిబ్రవరి 2022), కెన్యా (మార్చి 2022), మలావి (ఆగస్టు 2022), ఘన (అక్టోబర్ 2023). ఇన్ఫోగ్రాఫిక్ సౌజన్యం: isaaa.org -
జన్యు సవరణ అంటే ఏంటి?
మన దేశ వ్యవసాయ రంగంలో ఇటీవల సంచలనం సృష్టిస్తున్న అధునాతన సాంకేతికత ‘జీన్ ఎడిటింగ్ – జి.ఇ.’. జన్యు సవరణ అనేది శాస్త్రవేత్తలు మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియాతో సహా సకల జీవుల లక్షణాలను మెరుగుపరచడానికి అనుమతించే సరికొత్త బ్రీడింగ్ పద్ధతుల్లో ఒకటి. జన్యు సవరణ కోసం ఉపయోగించే సాంకేతికతలు కత్తెర లాగా పనిచేస్తాయి. డి.ఎన్.ఎ. అంటే డీఆక్సీరైబో కేంద్రక ఆమ్లం. ముఖ్యంగా క్రోమోజోముల్లో ఉంటుంది. మైటోకాండ్రియాలలో చాలా కొద్దిగా కనిపిస్తుంది. జీవులన్నింటిలో డి.ఎన్.ఎ. ముఖ్యమైన జన్యు పదార్థంగా వ్యవహరిస్తుంది. జీవుల్లో అనువంశికానికి డి.ఎన్.ఎ. మూలాధారం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో డి.ఎన్.ఎ.ను కత్తిరించడం, కత్తిరించిన లేదా తెలిసిన డి.ఎన్.ఎ. శ్రేణులను తొలగించడం, జోడించడం లేదా భర్తీ చేయడం వంటివి చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. పంటల డిఎన్ఎలోని జన్యువుక్రమంలో ఆశించిన అవసరం మేరకు అందుకు సంబంధించిన జన్యువును కత్తిరించటం ద్వారా ఆశించిన ఫలితాలను రాబట్టుకోవటమే జన్యు సవరణ ప్రక్రియ లక్ష్యం.జీన్ ఎడిటింగ్ సింథటిక్ బయాలజీలో ఒక భాగం. ఇది జీవశాస్త్రం, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ సూత్రాలను కలిపి కొత్త జీవ వ్యవస్థలను సృష్టించడానికి, ఉన్న వాటిని సవరించడానికి ఉపయోగపడుతుంది. సింథటిక్ బయాలజీ (Synthetic biology) అనేది సాపేక్షంగా కొత్త రంగం. ఈ సంకేతికతకు ఉన్న విస్తారమైన సామర్థ్యం కారణంగా ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన రీతిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మొక్కలు, బ్యాక్టీరియా వంటి జీవుల జన్యువుల్లో మార్పులు చేయడం ద్వారా నిర్దిష్ట విధులను నిర్వర్తించగల కొత్త జీవ వ్యవస్థలను సృష్టించవచ్చు. జీనోమ్ ఇంజనీరింగ్ను వ్యవసాయం, వైద్యం, బయోటెక్నాలజీ (Biotechnology) సహా వివిధ రంగాల్లో ఉపయోగించవచ్చు. వ్యవసాయాన్ని మరింత సుస్థిరమైన, సమర్థవంతమైన, పర్యావరణ హితమైన రంగంగా మార్చుకోవచ్చు. ఈ సాంకేతికత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తేగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సింథటిక్ బయాలజీ పద్ధతుల్లో జన్యు సవరణ ఒకటిసింథటిక్ బయాలజీలో ఉపయోగించే పద్ధతులు అనేకం ఉన్నాయి. డిఎన్ఎ సంశ్లేషణ – అసెంబ్లీ, జీనోమ్ ఎడిటింగ్, ప్రోటీన్ ఇంజనీరింగ్, జీవక్రియ ఇంజనీరింగ్, సిస్టమ్స్ బయాలజీ వంటివి అందులో ముఖ్యమైనవి. జన్యు సవరణలో క్రిస్పర్ – కాస్9 వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఇది నిర్దిష్ట డిఎన్ఎ శ్రేణులను కత్తిరించడానికి, సవరించడానికి డిఎన్ఎ గైడెడ్ న్యూక్లియస్లను ఉపయోగిస్తుంది. తెగుళ్లు, పర్యావరణ ఒత్తిడి, పంట దిగుబడితో సంబంధం ఉన్న జన్యువుల సవరణల ద్వారా వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో జీనోమ్ ఎడిటింగ్ (Genome Editing) విప్లవాత్మక మార్పులను తేగలిగిన స్థితిలో ఉంది. జన్యు సవరణ ప్రయోజనాలు⇒ ఖచ్చితమైన నియంత్రణతో జీవ వ్యవస్థలను రూపొందించే, నిర్మించే సామర్థ్యం కలిగి ఉండటం జన్యు సవరణ వంటి సింథటిక్ బయాలజీ సాంకేతికతల ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి.⇒ వ్యవసాయం, వైద్య చికిత్సలు, పర్యావరణ కాలుష్య నివారణ, పారిశ్రామిక అప్లికేషన్లకు ఈ సాంకేతితక కొత్త మార్గాలను తెరుస్తుంది.⇒ ఉదాహరణకు, నిర్దిష్ట వ్యాధులను లక్ష్యంగా చేసుకోగల ప్రత్యేక ఔషధాలను రూపొందించడానికి లేదా పర్యావరణంలోని కాలుష్య కారకాలను విచ్ఛిన్నం చేయగల సూక్ష్మజీవులను రూపొందించడానికి సింథటిక్ బయాలజీని ఉపయోగించవచ్చు.⇒ ఆహార భద్రత, ఇంధనం, వాతావరణ మార్పు వంటి విశ్వవ్యాప్త సవాళ్లకు స్థిరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కూడా సింథటిక్ బయాలజీని ఉపయోగించవచ్చు.⇒ ఉదాహరణకు, సింథటిక్ బయాలజీ వాతావరణ మార్పులను దీటుగా తట్టుకునే పంటలను అభివృద్ధి చేయవచ్చు. పురుగుమందులు, కలుపు మందుల వాడకాన్ని తగ్గించడానికి, పంటల దిగుబడిని పెంపొందించడానికి సహాయపడుతుంది.జన్యు సవరణ ప్రతికూలతలు⇒ జన్యు సవరణ వంటి సింథటిక్ బయాలజీ సాంకేతికత వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానికి వుండే సమస్యలు దానికి ఉన్నాయి. జీవుల జన్యువుల్లో మార్పులు చేయటంలో భద్రత, నైతిక చిక్కులు ఇమిడి ఉన్నాయి.⇒ ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించుకోవాలి. అందుకు జాగ్రత్తగా నియంత్రణ, పర్యవేక్షణ అవసరం.చదవండి: జన్యు సవరణ వరి వంగడాలను ఆవిష్కరించిన ఐసీఏఆర్⇒ అధిక ధర, సంక్లిష్టత దీనికి ఉన్న పెద్ద ప్రతికూలత. ప్రత్యేకమైన పరికరాలు, సుశిక్షితులైన సిబ్బంది అవసరం. ఇందుకు భారీ పెట్టుబడి అవసరం, దీని వలన చిన్న తరహా ప్రాజెక్టులను చేపట్టటం కష్టంగా మారుతుంది.⇒ ఊహించని పరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది. జన్యు మార్పులకు లోనైన జీవులు సహజ వాతావరణంతో అనూహ్య విధాలుగా ప్రతిస్పందించే అవకాశం ఉంది. -
18న గోశాల నిర్వాహకులు, గోపోషకుల సదస్సు
సాక్షి, హైదరాబాద్: మండే ఎండలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గోశాలలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గాలు కనుగొనే లక్ష్యంతో ఈ నెల 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ లకడీకాపూల్లోని శ్రీ వాసవి సేవా కేంద్రంలో రాష్ట్రస్థాయి గోశాలల నిర్వాహకులు, గోపోషకుల సదస్సు నిర్వహిస్తున్న సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు 'విజయ్ రామ్' మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోని గోశాలల నిర్వాహకులు, గో పోషకులను ఈ సదస్సుకు సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతి జిల్లా నుంచి గోశాలల నిర్వాహకులు 9052286688 నంబరుకు ఫోన్ చేసి పేర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. సుభాష్ పాలేకర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా ఆవులను పంపిణీ చేసే ఆలోచన ఉందని విజయ్ రామ్ తెలిపారు. పచ్చిగడ్డి, వరి గడ్డి కొరతతో పాటు వైద్యం, తాగునీరు కూడా గోశాలలకు పెను సమస్యలుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
సొంత విత్తనం రైతుకు బలం
వేలాది సంవత్సరాల క్రితం నుంచి రైతులు తమకు నచ్చిన విత్తనాలను సాగు చేస్తూ పరిరక్షించుకుంటున్నారు. పండించిన పంటలో నుంచి మెరుగైన గింజలను విత్తనాలుగా భద్రపరచుకొని తర్వాత సీజన్లో విత్తుకుంటున్నారు. ఇతర రైతులతో పంచుకుంటున్నారు. ఇదొక అవిచ్ఛిన్న సంప్రదాయ విత్తన పరంపర. 1960వ దశకంలో వ్యవసాయం ఆధునికతను సంతరించుకునే వరకు విత్తనంతో వ్యాపారం అనేది పెద్దగా లేదు. వ్యాపారులు తమ సొంత యాజమాన్య హక్కుతో కూడిన విత్తనాలు రైతులకు అమ్మటం అంతకుముందు లేదు. రైతులు తరతరాలుగా తమ వద్ద వున్న ఎన్నెన్నో రకాల పంటల విత్తనాలను బహుళ పంటల పద్ధతిలో సాగుచేస్తూ ఆ విత్తన సుసంపన్నతను, వైవిధ్యతను కాపాడుకున్నారు. హరిత విప్లవ కాలం ప్రారంభమైన తర్వాత అధిక దిగుబడినిచ్చే విత్తనాలొచ్చాయి. విత్తనాలు విత్తన సంస్థలు, వ్యాపారుల చేతుల్లోకి చేరాయి. ఏక పంటల రసాయనిక వ్యవసాయం విస్తరించింది. ఇది మన దేశంలోనే కాదు. చాలా దేశాల్లో జరిగింది ఇదే. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో కేవలం 30 ఏళ్లలో దేశీ విత్తన జాతుల్లో 90% మరుగునపడిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ విత్తనోత్పత్తి సంస్థలు, పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రైవేటు కంపెనీల వాణిజ్య విత్తనాలే రైతులకు చాలావరకు దిక్కయ్యాయి. ఈ పూర్వరంగంలో, దేశీ విత్తనాలను తిరిగి రైతులకు అందుబాటులోకి తేవటానికి కమ్యూనిటీ విత్తన బ్యాంకులు కృషి చేస్తున్నాయి. అదేవిధంగా, అనేకానేక సహకార సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఎఫ్.పి.ఒ.)ల సమాఖ్యలు విత్తన చట్టానికి అనుగుణంగా దేశీ విత్తనోత్పత్తికి కృషి చేస్తున్నాయి. ఈ కోవకు చెందినవే ముల్కనూరు సొసైటీ, సహజాహారం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ వంటి సహకార సంస్థలు. అంతర్జాతీయ సహకార సంవత్సరం (2025) సందర్భంగా దేశీ విత్తన పరిరక్షణ రంగంలో వెల్లివిరుస్తున్న సహకార స్ఫూర్తిపై కథనం. ఏ భూములకు యే విత్తనం?దేశీ విత్తనంతో పాటు సుసంపన్నమైన వ్యవసాయక సంప్రదాయ విజ్ఞానం కూడా మరుగునపడిపోతోంది. ఈ కొరత తీరుస్తూ సహజాహారం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ‘సహజ విత్తన సంపుటి’ (దేశీ సీడ్ కాటలాగ్)ని వెలువరించింది. ఏపీ, తెలంగాణలోని సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ.) ఏపీ, తెలంగాణలో నెలకొల్పిన 67 ఎఫ్పీఓలు ఈ కంపెనీలో భాగస్వాములు. ఈ ఎఫ్పీఓలో రైతులే ఈ దేశీ, ఇంప్రూవ్డ్ విత్తనాలను పండించి, శుద్ధి చేసి, ప్యాక్చేసి చట్టబద్ధమైన పద్ధతిలో రైతులకు అందిస్తున్నారు. వరి, పత్తి, మిరప, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలకు చెందిన 55 రకాల మేలైన దేశీ విత్తనాలు, కొన్ని ఇంప్రూవ్డ్ వంగడా లను సహజ బీజ్ పేరుతో రైతులకు అందుబాటులోకి వచ్చాయి. దేశీ విత్తనాలను అందుబాటులోకి తేవటంతో పాటు అవి ఏయే నేలలకు అనువైనవి? వాటి ఔషధ గుణాలేమిటి? ఏయే విధంగా ఆహారంలో ఆయా దేశీ ఆహారోత్పత్తులు ఎలా ఉపయోగపడతాయి? వంటి విలువైన సమాచారాన్ని ‘సహజ విత్తన సంపుటి’ (దేశీ సీడ్ కాటలాగ్)లో జోడించటం బాగుంది.55 మేలైన దేశీ రకాలు సహజాహారం ఎఫ్పీఓల ఫెడరేషన్ అందుబాటులోకి తెచ్చిన వివిధ పంటల్లో 55 మేలైన దేశీ, ఇంప్రూవ్డ్ విత్తనాలు ఇవీ.. దేశీ వరి రకాలు: రత్నచూడి, చిట్టిముత్యాలు, రక్తశాలి, నవార, బర్మాబ్లాక్, డీఆర్కే (ఖోబ్రఖడే ఎంపిక చేసిన రకం), మెట్ట బుడమ లు, పరిమల సన్నాలు, బహురూపి, బరిగె, పెద్ద కేసరి వడ్లు. ఇంప్రూవ్డ్ వరి రకాలు: బీపీటీ (5204) (సాంబ/సోనా మసూరి), ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా), ఎంటీయూ 1010. దేశీ నవధాన్యాల కిట్: 16 రకాలు. 25 కిలోలు/ఎకరం (ధర రూ. 1,020). దేశీ మిరప: బుడమ, చారు, బ్యాడిగ, పసుపు, భూత్ జోలోకియా. దేశీ రాగులు: ఎర్ర, కళ్యాణి, ముత్యాల. దేశీ కొర్ర: నార్వి, ఎర్ర కొర్ర. ఇంప్రూవ్డ్ కొర్ర: కృష్ణదేవరాయ, 3085. దేశీ జొన్న: జ్వాలాముఖి, సీతమ్మ, పచ్చ, తెల్లజొన్న. దేశీ కంది: కొలంబో కంది, బురక. ఇంప్రూవ్డ్ కంది: బహువార్షిక ఐసీపీఎల్ 7035, ఎల్.ఆర్.జి. దేశీ పెసర: పిల్లపెసర, డబ్ల్యూజిజి 37 (ఇంప్రూవ్డ్). దేశీ టమాటా: రామ్ములక్కాయ, చెర్రీ టమాటా. టమాటా: పీకేఎం1 (ఇంప్రూవ్డ్). దేశీ చిక్కుడు: ఆదిలాబాద్, గెనుపు. గోటి 8038 (ఇంప్రూవ్డ్). ఇంప్రూవ్డ్ వేరుశనగ: అనంతజ్యోతి, టీఎంవీ2, కే6. దేశీ కొత్తిమీర: ధనియం (కొత్తిమీర). దేశీ బీర: గుత్తి బీర, నేతిబీర. దేశీ అలసంద: తెల్ల అలసంద. దేశీ ఉలవ: తెల్లవి, నల్లవి. దేశీ కాకర: చిట్టి. దేశీ సొర: దిందిగల్.‘చిట్టి ముత్యాల’కు ఏ నేల అనుకూలం? మన హెరిటేజ్ రైస్ వెరైటీ ‘చిట్టిముత్యాలు’. సుగంధభరితమైన ఈ బియ్యం ప్రసాదం, పులిహోర, పాయసంలోకి బాగుంటాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కేన్సర్ నిరోధకంగా ఉపయోపడుతుంది. 120–125 రోజుల పంట. సాగుకు గరుసు నేలలు, మజ్జరం నేలలు అనుకూలం. సుడిదోమ ఎక్కువగా ఆశిస్తుంది. 2.5 అడుగులు పెరుగుతుంది. 15 పిలకలు వస్తాయి. ఎకరానికి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎవర్ని సంప్రదించాలి?సహజ విత్తన సంపుటిలో వివరాలు పొందుపరిచిన 55 రకాల దేశీ/ఇంప్రూవ్డ్ రకాల విత్తనాలను కొనాలనుకునే రైతులు ఫోన్లో బుక్ చేసుకుంటే పార్శిల్లో తెప్పించుకోవచ్చు. బుక్ చేసుకున్న 15 రోజుల్లో పంపుతారు. సంప్రదించాల్సిన నంబరు: కిసాన్ మిత్ర: 85009 83300 (ఉ.10 – సా.5) seed@sahajaaharam.com -
గుడ్ ఫార్మర్ స్టాన్లీ..!
అమెరికా తొలి గుడ్ ఫార్మర్ అవార్డుకు మహిళా సేంద్రియ రైతు క్లారెండా ‘ఫార్మర్ సీ’ స్టాన్లీ ఎంపికయ్యారు. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రసిద్ధ రోడేల్ ఇన్స్టిట్యూట్, డావైన్స్ గ్రూప్ సంయుక్తంగా ఈ పురస్కార ప్రదానానికి శ్రీకారం చుట్టటం విశేషం. పదేళ్లకు మించకుండా పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం (రీజనరేటివ్ ఆర్గానిక్ అగ్రికల్చర్)ను ఆచరిస్తూ, పర్యావరణానికి, సమాజానికి ఉత్తమ సేవలు అందించిన ఆదర్శ కృషీవలురికి ఈ పురస్కారం ఇవ్వటం ఈ ఏడాది ప్రారంభించామని అమెరికాలో 1947 నుంచి సేంద్రియ వ్యవసాయ పరిశోధనలకు పట్టుకొమ్మ అయిన రోడేల్ ఇన్స్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జెఫ్ ట్రాక్ అన్నారు. ‘స్టాన్లీ తన గ్రీన్ హెఫ్ఫ ఫామ్స్లో చేస్తున్న పని తన వ్యవసాయ క్షేత్రాన్ని సుసంపన్నం చేయటంతోపాటు కొత్త తరం రైతులకు ప్రేరణగా నిలుస్తోంది. తొట్టతొలి ద గుడ్ ఫార్మర్ అవార్డ్ యుఎస్ పురస్కారాన్ని ప్రదానం ఆమెకు ప్రదానం చేయటం గర్వంగా ఉంది’ అన్నారాయన. నార్త్ కరోలినలో గ్రీన్ హెఫ్ఫ ఫామ్స్ను నిర్వహిస్తున్న స్టాన్లీ సేంద్రియ విలువల పట్ల నిబద్ధతతో వ్యవసాయం చేస్తున్న హెర్బలిస్టు. రీజెనరేటివ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఆర్థిక ప్రగతితోపాటు, సమానత్వం, విద్య, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న విశేష కృషికి గాను ఆమెను పురస్కారం వరించింది. 20 రాష్ట్రాల నుంచి సుమారు వంద దరఖాస్తులు రాగా స్టాన్లీని జ్యూరీ ఎంపికచేసింది. ఈ పురస్కారం కింద పది వేల డాలర్ల నగదును, జ్ఞాపికను అందజేస్తారు. స్టాన్లీ విలువైన ఔషధ మొక్కలను, తేయాకును పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నారు. కొత్తగా సేద్యవృత్తిని చేపట్టిన వారికి ఆమె శిక్షణ ఇస్తున్నారు. చారిత్రకంగా అణగారిన వర్గాల బడుగు వారికి ఆమె ప్రాధాన్యం ఇస్తారు. నేలను సేంద్రియ పద్ధతుల్లో పునరుజ్జీవింపజేసుకుంటూనే పంటలు పండిస్తూ ఈ వ్యవసాయం ఆర్థికంగానూ, పర్యావరణపరంగా, ఆహార భద్రతాపరంగానూ గిట్టుబాటు వ్యవహారమే అని స్టాన్లీ నిరూపించుకున్నారు. ‘గ్రీన్ హెఫ్ఫ ఫామ్స్లో మేం అనుసరిస్తున్న సాగు పద్ధతికి ఈ పురస్కారం వెన్నుతట్టింది. ఈ క్షేత్రంలో మేం పంటలను మాత్రమే పండించటం లేదు, పరివర్తనను పెంపొందిస్తున్నాం’ అన్నారు స్టాన్లీ సంతోషంగా. డావైన్స్ గ్రూప్ ఐదేళ్ల క్రితం ఇటలీలోని పర్మలోయూరోపియన్ రీజెనరేటివ్ ఆర్గానిక్ సెంటర్ను రోడేల్ ఇన్స్టిట్యూట్ తోడ్పాటుతో నెలకొల్పింది. అక్కడ జరిగే సభలో స్టాన్లీకి పురస్కార ప్రదానం జరుగుతుంది. ఆమె రాకపోకల ఖర్చులన్నీ డావైన్స్ గ్రూప్ భరిస్తుంది. ఆమె తమ దేశానికి రావటం వల్ల రీజనరేటివ్ ఆర్గానిక్ వ్యవసాయ స్ఫూర్తి తమ ప్రాంత రైతులకు ప్రేరణ కలిగిస్తుందని భావిస్తున్నామని డావైన్స్ గ్రూప్ సంతోషిస్తోంది. పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం చేయటంతోపాటు.. పండించిన ఆహారాన్ని తినిపించి వ్యాధులు నయం చేసే ఆసుపత్రిని పొలంలోనే నిర్వహించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న స్టాన్లీ సింగిల్ వుమన్ ఫార్మర్ కావటం మరో విశేషం. (చదవండి: మెగా గుమ్మడి!) -
చూడటానికి మొక్కజొన్న పంట.. కానీ దగ్గరకెళ్తే షాకవ్వుతారు!
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ వేసవి రోజుల్లో కూరగాయ పంటలను సన్బర్న్ నుంచి కాపాడుకోవటానికి ఓ సేంద్రియ రైతు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫొటోలో పొలాన్ని చూడండి.. మొక్కజొన్న తోటలాగా ఉంది కదా! కానీ, నిజానికి అది టొమాటో తోట!! టొమాటో మొక్కలకు తోడు– నీడ కోసం పక్కనే మొక్కజొన్న విత్తారు. ప్రచండమైన ఎండల నుంచి టొమాటో తోటను కాపాడుకోవటానికి రైతు రంగప్రసాద్ ఈ వినూత్న ఉపాయాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నతోద్యోగిగా పనిచేసిన రంగప్రసాద్ నాలుగేళ్ల క్రితం సేంద్రియ సేద్యం చేపట్టారు. నాగర్కర్నూలు జిల్లా చారుగొండ మండలం జూపల్లిలో 70 ఎకరాల భూమి తీసుకొని ఐఫామ్స్ను స్థాపించారు. రకరకాల పండ్ల చెట్లు, కూరగాయలు, నాటుకోళ్లు, మేకలు.. పెంచుతున్నారు. గచ్చిబౌలిలో సొంతంగా స్టోర్ తెరచి ఆహారోత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఎండలు మండి΄ోతున్న నేపథ్యంలో ఈ ఏడాది టొమాటో, క్యాబేజీ, బ్రకోలి, లెట్యూస్ వంటి పంటలు సాగుచేస్తున్న అన్ని మడుల్లోనూ పక్కన మొక్కజొన్నను కూడా ఉత్తర – దక్షిణ వరుసలుగా విత్తుతున్నారు. 3–3.5 అడుగులకో వరుస చొప్పున మొక్కజొన్న విత్తుతున్నారు. ‘ప్రతి 30 రోజులకోసారి కొత్త కూరగాయల ప్లాట్లో మొక్కలు నాటుతూ ఏడాది పొడవునా కూరగాయలు పండిస్తున్నాం. అవి నాటేటప్పుడే మొక్కజొన్న విత్తనాలను కూడా వరుసల మధ్య విత్తుతున్నాం. అవసరమైతే, ఈ వరుసల మధ్యలో 15 రోజులకోసారి మొక్కజొన్న విత్తుతాం. అందువల్ల, ఎప్పుడు చూసినా అనేక ఎత్తుల్లో మొక్కజొన్న మొక్కలు పచ్చగా పెరుగుతూ ఉంటాయి. పక్కన ఉన్న ప్రధాన కూరగాయ మొక్కలకు నీడను, చల్లదనాన్ని ఇవి అందిస్తుండటంతో ఎండను తట్టుకొనే శక్తి వస్తోంద’న్నారు. మొక్కజొన్నే ఎందుకు? అంటే.. ‘మొక్కజొన్న వేగంగా పెరుగుతుంది. ఆకులు వెడల్పుగా, ఎత్తుగా పెరుగుతాయి. దీంతో తోట వత్తుగా మొక్కలతో నిండి ఉంటుంది. నీడ పడుతుంది. మొక్కజొన్నను తోడు–నీడ పంటగా నాటిన కూరగాయ తోటలో 3 డిగ్రీల సెల్షియస్ మేరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. బేబీ కార్న్/కండెలను అమ్ముతున్నాం. చొప్పను ఆవులకు మేపుతున్నాం..’ అన్నారు రంగప్రసాద్ (98851 22544). (చదవండి: తొలి ‘జన్యుసవరణ’ వరి!) -
తొలి ‘జన్యుసవరణ’ వరి!
వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న భూతాపాన్ని తట్టుకుంటూ 30% అధిక దిగుబడిని ఇవ్వగలిగిన రెండు సరికొత్త జన్యుసవరణ వరి రకాలను ప్రపంచంలోనే తొట్టతొలిగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) శాస్త్రవేత్తలు రూపొందించారు. క్రిస్పర్– కాస్9 అనే సరికొత్త జీనోమ్–ఎడిటింగ్(జిఇ) టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసిన రెండు వరి వంగడాలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఆవిష్కరించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కి చెందిన పూసాలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) పూసా రైస్ డిఎస్టి1 అనే రకం కరువును, చౌడును తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) పరిశోధకులు అభివృద్ధి చేసిన డిఆర్ఆర్ ధన్ 100 (కమల) అనే వరి అధిక దిగుబడినిస్తుంది. మన దేశంలో ఇప్పటి వరకు అధికారికంగా సాగులో ఉన్న జన్యుమార్పిడి పంట పత్తి ఒక్కటి మాత్రమే. జన్యుసవరణకు ఇదే ప్రారంభం. గతంలో సంక్లిష్టమైన ‘జన్యుమార్పిడి’లో భాగంగానే ‘జన్యుసవరణ’ను కూడా చూసేవారు. అయితే, 2022లో జన్యుసవరణను కఠినమైన నియంత్రణ ప్రక్రియ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తర్వాత జన్యు సవరణ పరిశోధనలకు రూ. 500 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే జన్యుసవరణ తొలి వరి రకాలను ఇప్పుడు ఆవిష్కరించారు. ఈ రెండు వంగడాల పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సత్కరించారు. పూసా డిఎస్టి రైస్ 1 పై కృషి చేసిన డాక్టర్ విశ్వనాథన్ సి, డాక్టర్ గోపాల్ కృష్ణన్ ఎస్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ శివానీ నగర్, డాక్టర్ అర్చన వాట్స్, డాక్టర్ సోహం రే, డాక్టర్ అశోక్ కుమార్ సింగ్, డాక్టర్ ప్రాంజల్ యాదవ్లను సత్కరించారు. డిఆర్ఆర్ రైస్ 100 (కమల) అభివృద్ధికి కృషి చేసిన ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు డాక్టర్ సత్యేంద్ర కుమార్ మంగథియా, డాక్టర్ ఆర్.ఎం. సుందరం, డా. అబ్దుల్ ఫియాజ్, డా. సి.ఎన్. నీరజ, డా. ఎస్వీ సాయి ప్రసాద్లను సత్కరించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది మాట్లాడుతూ, ఈ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసినది కావటం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రయత్నాల ద్వారా రైతులకు త్వరగా అందించవచ్చని అన్నారు.10కి పైగా పంటలకు జన్యు సవరణఐసిఎఆర్ డైరెక్టర్ డాక్టర్ జనరల్ మంగి లాల్ జాట్ ప్రసంగిస్తూ ఈ రెండు వంగడాల ఆవిష్కరణ భారత వ్యవసాయంలో ఒక చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. రాబోయే సంవత్సరాల్లో అనేక ఇతర పంటలకు సంబంధించి జన్యు సవరణ పంట రకాలను విడుదల చేస్తామని అన్నారు. ‘కొత్త వ్యవసాయ విధానాలు కొత్త పద్ధతులకు అనుగుణంగా ఉండాలి. మారిన వాతావరణ పరిస్థితుల్లో పాత పద్ధతులు పనిచేయవు’ అని ఆయన అన్నారు. దేశంలోని బహుళ జాతి సంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం పప్పుధాన్యాలు, ఆవాలు, గోధుమ, పొగాకు, పత్తి, అరటి, టమోటా, నూనెగింజలు వంటి 10కి పైగా పంటలకు సంబంధించి జన్యు–సవరణపై పరిశోధనలు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని ముర్డోక్ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్ చైర్ ఆఫ్ అగ్రికల్చర్ – ఫుడ్ సెక్యూరిటీ, సెంటర్ ఫర్ క్రాప్ అండ్ ఫుడ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ రాజీవ్ వర్షిణి మాట్లాడుతూ, ఈ ఆవిష్కరణలు వ్యవసాయ జీవసాంకేతికతలో ఒక మైలురాయన్నారు. ప్రత్యేకంగా చిన్న–సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని, ప్రపంచ పురోగతికి ప్రేరణనిస్తాయని అన్నారు. ఈ రెండు జన్యు సవరణ వంగడాలను వాణిజ్య స్థాయిలో విత్తనోత్పత్తి చేసి రైతులకు అందించడానికి మరో నాలుగైదు సంవత్సరాలు పట్టొచ్చు. కరువు, చౌడును అధిగమించి..ఎంటియు1010 వరి వంగడానికి జన్యు సవరణ చేసి ‘పూసా రైస్ డిఎస్టి 1’ వంగడాన్ని పూసాలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) అభివృద్ధి చేసింది. ఒత్తిడి నిరోధకతను అణిచివేసే జన్యువును తొలగించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ వంగడాన్ని రూపొందించారు. పత్ర రంధ్రాల సాంద్రతను తగ్గించటం ద్వారా తక్కువ నీటితో పంట పండేలా మార్పు చేశారు. చౌడును తట్టుకొని ఎక్కువ పిలకలు వచ్చేలా చేయటం ద్వారా అధికంగా ధాన్యం దిగుబడి వచ్చేలా చేశారు. క్షేత్రస్థాయి పరీక్షల్లో ఎంటియు 1010 రకంతో పోలిస్తే కరువు, చౌడు వత్తిళ్లను తట్టుకొని గణనీయంగా అధిక దిగుబడిని చూపించాయని ఐఎఆర్ఐ తెలిపింది.సాంబ మసూరికి కొత్త రూపుదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొంది, విస్తారంగా సాగవుతున్న సాంబ మసూరి (బిపిటి–5204) వంగడానికి జన్యుసవరణ చేసి ‘డిఆర్ఆర్ ధన్ 100 (కమల)’ రకాన్ని అభివృద్ధి చేశారు. రాజేంద్రనగర్లోని 30% అధిక దిగుబడిని ఇస్తుంది. 20 రోజులు ముందే కోతకు వస్తుంది. ‘క్రిస్పర్’ను ఉపయోగించి సాంబ మసూరిలోని సైటోకినిన్ ఆక్సిడేస్ జన్యువుకు తగిన విధంగా సవరణ చేశారు. ఫలితంగా ధాన్యం దిగుబడిలో 19% పెరుగుదల, 20 రోజుల వరకు ముందస్తు పరిపక్వతతో పాటు తక్కువ ఎరువుల వినియోగం, కరువు పరిస్థితులలో మెరుగైన పనితీరు వంటి గుణాలతో ‘డిఆర్ఆర్ ధన్ 100 (కమల)’ రకం రూపుదాల్చింది.ఐసిఎఆర్ శాస్త్రవేత్తల అసాధారణ విజయాలువ్యవసాయ సవాళ్లను అధిగమించడానికి ఆధునిక పద్ధతులను అవలంభించాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఆయన మాటల నుంచి ప్రేరణ పొందిన ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు ఈ కొత్త రకాలను సృష్టించడం ద్వారా వ్యవసాయ రంగంలో అసాధారణ విజయాలు సాధించారు. వరిలో ఈ కొత్త పంటలు ధాన్యం ఉత్పత్తిని పెంచడమే కాకుండా పర్యావరణ పరంగా సానుకూల ఫలితాలను ఇస్తాయి. సాగు నీరు ఆదా అవుతుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. తద్వారా పర్యావరణంపై ఒత్తిడి తగ్గుతుంది. మొత్తంగా వరి సాగు విస్తీర్ణాన్ని 50 లక్షల హెక్టార్లు తగ్గించాలి. ధాన్యం ఉత్పత్తిని కోటి టన్నులు పెంచాలి. ఈ 50 లక్షల హెక్టార్ల భూముల్లో అదనంగా పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చెయ్యాలి.– శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిజన్యుభద్రతా పరీక్షల గణాంకాలను కూడా ప్రకటించాలిఐసిఎఆర్ మొట్టమొదటి జన్యు సవరణ వరి రకాలను విడుదల చేసింది. అధిక దిగుబడినిస్తూ, కరువును తట్టుకోవటం కోసం సరికొత్త క్రిస్పర్–కాస్9 టెక్నాలజీని వినియోగించి ఈ రకాలను అభివృద్ధి చేశారు. వీటికి సంబంధించిన జన్యుభద్రతా పరీక్షల గణాంకాలను సైతం బహిరంగంగా ప్రకటిస్తే ఈ సరికొత్త వరి బియ్యం తినటంలో భద్రత గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారు. – డాక్టర్ సుమన్ సహాయ్, స్వతంత్ర శాస్త్రవేత్త, జీన్క్యాంపెయిన్ వ్యవస్థాపకులు -
జీవామృత కేంద్రానికి రూ. లక్ష : కేంద్రం కొత్త మార్గదర్శకాలు తెలుసా?
Bio-input Resource Centres (BRC) ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే సేంద్రియ ఎరువులు, ద్రావణాలు, కషాయాలను ఏ రైతుకు ఆ రైతు స్వయంగా తయారు చేసుకోవటం చాలా కష్టసాధ్యమైన పని. నిన్నటి వరకు రసాయనిక వ్యవసాయంలో వాడే ఎరువులు, పురుగుమందులు వంటి ఉత్పాదకాలన్నీటినీ కొని వినియోగించడానికి అలవాటు పడిన రైతులు ఇప్పుడు అన్నీ ఎవరికి వారు తయారు చేసుకోవటం కష్టమే. ఈ ఇబ్బందిని అధిగమించకుండా ప్రకృతి సేద్యం విస్తరించడం అంత తేలిక కాదు. అందుకే ప్రకృతి సేద్యంలో వాడే ఘనజీవామృతం, జీవామృతం వంటి అన్ని రకాల ఉత్పాదకాలను తయారు చేసి విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం బయో–ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ (బిఆర్సిలు) ఏర్పాటు చేయిస్తోంది. వీటిని సులువుగా ఉండటం కోసం ‘జీవామృత కేంద్రాలు’ అని చెప్పుకుందాం. తొలి విడద దేశవ్యాప్తంగా 10 వేల బిఆర్సిలు ఏర్పాటు చేయాలని 2023–24 బడ్జెట్లోనే పేర్కొన్నారు. అయితే, వీటిని ఏర్పాటు చేయటానికి మార్గదర్శకాలను తాజాగా (ఏప్రిల్ 23న) విడుదల చేసింది. ఆ వివరాలు: ప్రతి బిఆర్సి ఏర్పాటుకు ర. లక్ష చొప్పున (ర. 50 వేల చొప్పున రెండు విడతలుగా) ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఉత్పాదకాలను తయారు చేసి రైతులకు అందుబాటులోకి తేవటంతో ΄ాటు వాటిని ఎలా ఉపయోగించాలో, ఎంత మోతాదులో వాడాలో కూడా ఈ జీవామృత కేంద్రాల నిర్వాహకులే రైతులకు తెలియజెప్పాల్సి ఉంటుంది. బయో–ఇన్పుట్ రిసోర్స్ సెంటర్(బిఆర్సి) లను నెలకొల్పే వ్యక్తులు / సంస్థలు / బృందాలు మొదట తాము ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఈ ఉత్పాదకాలను వారు వాడుతున్న అనుభవం కలిగి ఉండాలి. స్థానిక రైతుల అవసరాలకు, స్థానిక భూములకు తగిన, స్థానికంగా సాగయ్యే పంటల సరళికి అవసరమైన రీతిలో ద్రావణాలు, కషాయాలను తయారు చెయ్యాలి. వీటి ధరలు స్థానిక చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత రాష్ట్ర స్థాయి ప్రకృతి సేద్య విభాగం, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలపై ఉంది. బీఆర్సి ఏర్పాటు కోసం ర. లక్షతో భూమిని, షెడ్డును, డ్రమ్ములు, ఇతరత్రా యంత్ర పరికరాలను సమకర్చుకోవటం ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తూతూ మంత్రంగా కాకుండా.. దీర్ఘకాలంపాటు బిఆర్సిలకు వెన్నుదన్నుగా ఉండేలా ప్రభుత్వం ఆలోంనప్పుడే ఆశింన ప్రయోజనం నెరవేరుతుందని నిపుణులు సూస్తున్నారు. -
Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!
రక్తశాలి బియ్యం దాని ప్రత్యేకమైన ఎరుపు రంగు, గొప్ప పోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఆరోగ్యాభిలాషులైన వినియోగదారులకు దీని విలువ తెలుసు. సాంప్రదాయకంగా దీన్ని కేరళలోని వయనాడ్ జిల్లాలోని సహజమైన, జీవవైవిధ్య వాతావరణంలో పెంచుతారు. ఇది తరచుగా ఈ ప్రాంతపు వ్యవసాయ వారసత్వానికి హ్నంగా చెబుతుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు ప్రకృతి వ్యవసాయ దారులు పండిస్తున్నారు. రక్తశాలి అనే పేరు సంస్కృత పదం నుం వచ్చింది. ‘రక్త’ అంటే రక్తం. ‘శాలి’ అంటే బియ్యం. రక్తశాలి జిగురు లేనిది. గ్లూటెన్ సెన్సిటివ్ వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. దాని అధిక పోషక, ఔషధ లక్షణాల కారణంగా ఆరోగ్య ప్రయోజనాభిలాషులకు ఇది చాలా విలువైనది.విశేష పోషకాలురక్తశాలి పోషకాలతో కూడిన ఆహారం. వంద గ్రాముల ముడి బియ్యం.. 363.49 కిలో కేలరీల శక్తిని అందిస్తుంది. ్ర΄ోటీన్ (8.96 గ్రా.), పిండి పదార్ధం (71.18 గ్రా.), కొవ్వు (4.77 గ్రా.), జింక్ 15.75 మి.గ్రా., ఐరన్ (0.99 మి.గ్రా.) కలిగి ఉంటుంది. ఈ బియ్యాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ కింది ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాల నిపుణులు చెబుతున్నారు.రక్తశాలి బియ్యాన్ని పాలిష్ చేయకుండా ముడి బియ్యం వండుకొని తింటారు. ఇది ముఖ్యంగా రక్తహీనత ఉన్న మహిళలకు ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే ఇది రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దీన్ని ఆహారంగా తీసుకుంటుంటే రక్తం హెచ్చుతగ్గులను స్థిరంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది.అంకితభావంతో కూడిన సేంద్రియ/ప్రకృతి రైతుల సంరక్షణలో సాగవుతున్న అరుదైన రకాల్లో ఇదొకటి. ఆయుర్వేదంలో శరీర త్రిదోషాల(వాత, పిత్త, కఫ) సమతుల్యం చేయగలదన్న గుర్తింపు పొందింది. కాలేయం, మూత్రపిండాలు, నాడీ రుగ్మతలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుందని, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు దీన్ని సిఫార్సు చేస్తున్నారు.110 రోజుల ఖరీఫ్ పంటరక్తశాలి వరి పంట ప్రధానంగా కేరళలో వర్షాధార వ్యవసాయంలో సాగవుతోంది. సేంద్రియ పద్ధతుల్లో, పర్యావరణహిత పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. జూన్/జూలై నుండి నవంబర్/డిసెంబర్ వరకు ‘శాలి’ సీజన్లో పండిస్తారు. దాదాపు 110 రోజుల పంట. జాగ్రత్తగా నీటి నిర్వహణ అవసరం. అయితే, అననుకూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని దిగుబడి నిస్తుంది. సారవంతమైన ఎర్ర ఒండ్రు నేలల్లో రక్తశాలి వరి బాగా పెరుగుతుంది. తగినంత వర్షపాతంతో కూడిన ఉష్ణమండల తేమ వాతావరణం దీనికి అనువైనది. అధిక నాణ్యత గల స్థానికంగా సాగయ్యే రక్తశాలి విత్తనాలను ఎంచుకుంటే మంచి దిగుబడి రావటంతో పాటు తెగుళ్ళు, పురుగుల బెడద ఉండదు. ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయిఔషధ విలువలు, పోషకాల కారణంగా రక్తశాలి బియ్యానికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, దీని సాగు విస్తృతం కాక΄ోవటానికి అనేక సవాళ్లు ఆటకంగా ఉన్నాయి. రక్తశాలి సాగు, వినియోగం పెరగడానికి ఎదురవుతున్న సవాళ్లు... ఈ సవాళ్లలో నాణ్యమైన విత్తనాల లభ్యత ఒకటి. విత్తన బ్యాంకులు లేదా కమ్యూనిటీ విత్తన నిధుల ఏర్పాటు ద్వారా రక్తశాలి వంటి అపురూప దేశీ విత్తనాల లభ్యతను పెంచవచ్చు. ఖర్చులు తగ్గించడానికి, నాణ్యమైన విత్తనాలను అందించేందుకు రైతుల విత్తన సహకార సంఘాలను ప్రోత్సహించాలి. రక్తశాలి దిగుబడి ఇతర రకాలతో పోల్చితే తక్కువ. ఈ కారణంగా, సేంద్రియ వ్యవసాయంలో అధిక శ్రమ వల్ల సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి పోషక, ఔషధ గుణాలు పోకుండా చూసుకుంటూనే దిగుబడి పెంచేందుకు పరిశోధనలు చేపట్టాలి. సేంద్రియ బియ్యం నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్థానిక రైతులతో బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల ఆదాయం పెంచే ప్రయత్నం చెయ్యాలి. ఎక్కువ మంది రైతులు రక్తశాలి బియ్యాన్ని సాగు చేసి విక్రయించేలా ప్రోత్సాహకాలు లేదా సబ్సిడీలను అందించాలి. కొత్త సాగుదారులకు ఉత్తమ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. పంట ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ పనులను సహకార సంఘాలు లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం లేదా అనుసంధానించడం ద్వారా సాగును విస్తరింపచేయవచ్చు. రక్తశాలి బియ్యంతో లభించే ఆరోగ్య ప్రయోజనాలు సాధారణ ప్రజలకు బాగా తెలియక΄ోవటం లేదా అర్థం చేసుకోకపోవటం వల్ల వినియోగం తక్కువగా ఉంది. సోషల్ మీడియా, స్థానిక ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణులను ఉపయోగించి ఔషధ పోషక ప్రయోజనాలను హైలైట్ చేస్తూ అవగాహన ప్రచారం ప్రారంభించడం అవసరం. వర్క్షాప్లు, సెమినార్లు లేదా స్థానిక సంతలు నిర్వహించాలి. స్వచ్ఛంద సంస్థలను ఈ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి.స్థానిక వంటకాల్లో రక్తశాలి బియ్యాన్ని వాడేలా ప్రోత్సహించేలా వంటల ఉత్సవాలు నిర్వహించాలి. ఈ బియ్యంతో తయారు చేసిన సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించే ఆహార ఉత్సవాలను నిర్వహించాలి. మార్కెటింగ్ గొలుసులను, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను అన్వేషించడం ద్వారా మార్కెటింగ్ను మెరుగుపరచవచ్చు. రక్తశాలి బియ్యానికి సేంద్రియ ధృవీకరణ కల్పిస్తే సాగుదారులు ప్రీమియం మార్కెట్లలో అధిక ధర పొందేందుకు సహాయపడుతుంది.మరో విశేషం ఏమిటంటే...ఇది కండగల ఎర్ర నేలల్లో వర్షాధారంగా, సేంద్రియంగా సాగుకు అనువైనది. అయితే, దిగుబడి తక్కువ. కేవలం మహిళల ఆరోగ్యంకోసమైనా దీన్ని తిరిగి మన పంట పొలాల్లోకి, మన వంటిళ్లలోకి, పళ్లాలోకి తెచ్చుకోవటం అత్యవసరం. దిగుబడి పెంచే పరిశోధనలు చేపట్టాలి. అయితే, ఔషధ గుణాలు ΄ోకుండా చూడాలి. రక్తశాలి సాగును ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ పథకాల ద్వారా ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చి ప్రోత్సహించాలి. ప్రత్యేక బ్రాండ్ను క్రియేట్ చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాల ద్వారా నేరుగా దేశంలో మహిళలందరికీ అందేలా చెయ్యాలి!చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో ఇన్ని వేలు పెరిగిదా? కొందామా? వద్దా?ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!విటమిన్లు: మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు (బి విటమిన్లు వంటివి), ఖనిజాలు (ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటివి) రక్తశాలి బియ్యంలో ఉన్నాయి.అధిక ఫైబర్: రక్తశాలి బియ్యంలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. కడుపు నిండిన భావనను కలిగించటం ద్వారా శరీర బరువు నిర్వహణలో సహాయపడుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు: అధిక సాంద్రతలో ఎరుపు రంగు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.తక్కువ గ్లైసెమిక్ సూక: ఇది తెల్ల బియ్యం కంటే తక్కువ గ్లైసెమిక్ సూకను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.గుండె ఆరోగ్యం: ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.గ్లూటెన్–ఫ్రీ: గ్లూటెన్ అసహనం లేదా సెలియాక్ వ్యాధి ఉన్న వ్యక్తులకు ఇది ఒక గొప్ప వరం. సురక్షితమైన, పోషకాలతో కూడిన బియ్యం. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వృద్ధాప్యపు ఛాయలు కనపడకుండా సహాయపడతాయి.రోగనిరోధక శక్తి: రక్తశాలి బియ్యంలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తాయి.రక్త వృద్ధి: రక్తశాలి బియ్యం రక్త వృద్ధిని మెరుగుపరుస్తుంది. రక్తహీనత ఉన్న మహిళలకు వరప్రసాదం వంటిది. రక్తం స్థాయిని స్థిరీకరించడానికి లేదా నిలుపుకోవడానికి కూడా సహాయపడుతుంది. రక్తశాలి బియ్యం రక్తంలో చక్కెరను నిర్వహించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.ముగింపురక్తశాలి అనేది స్వదేశీ వరి రకం. ఔషధగుణాలు, పోషకాంశాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఇప్పటికీ సాధారణ ప్రజలకు అంతగా తెలియదు. అందువల్ల ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేయాలి. రైతులు, పరిశోధకులు, విధాన రూపకర్తలు ఉమ్మడిగా పనిచేసి దీన్ని మళ్లీ వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది.రక్తశాలి అద్భుతమైన అధిక పోషక, ఔషధ గుణాలున్న పురాతన వరి వంగడం. పేరుకు తగ్గట్టే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది రక్తశాలి బియ్యపు గింజ. అంతేకాదు, రక్తహీనతను పారదోలటంతో పాటు రక్తం తగ్గి΄పోకుండా స్థిరీకరించగలిగిన అద్భుత గుణం రక్తశాలి సొంతం. రక్తహీనతకు గురయ్యే మహిళలకు ఇది చక్కటి ఆరోగ్యవంతమైన పరిష్కారం. ముడి రక్తశాలి బియ్యం తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. చాలా రకాల వరి బియ్యంలో ఉన్నట్లు ఇందులో గ్లుటెన్ లేదు. గ్లుటెన్ ఇన్టాలరెన్స్ / సెలియక్ వంటి ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది వరం. -
ఎక్కడికైనా సులభంగా చిన్న బయోచార్ యూనిట్
భూసారాన్ని పెంపొందించడంతో పాటు దీర్ఘకాలం పాటు ప్రభావం చూపటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించటంలో ఉపయోగపడే బయోచార్ (కట్టెబొగ్గు) ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పత్తి కట్టె, కంది కట్టె, వరి ΄పొట్టు వంటి పంట వ్యర్థాలతో ఒక ప్రత్యేక పద్ధతిలో దగ్ధం చేయటం ద్వారా బయోచార్ను ఉత్పత్తి చేస్తున్నారు. అందుకు ఇప్పటికే అనేక రకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా, న్న, సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉండే రొటేటింగ్ డ్రమ్ ఆటోథర్మల్ బయోచార్ యూనిట్ను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధ సంస్థ, భోపాల్లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ఐసిఎఆర్-సిఐఎఇ) రూపొందింంది. పేటెంట్ పొందదిన ఈ యూనిట్ పంట వ్యర్థాలను బయోచార్గా మారుస్తుంది. వంద కిలోల కట్టెను వాడితే 20–35% కట్టె బొగ్గును అందించే సామర్థ్యంతో పనిచేస్తుంది. చిన్నది. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. బయోచార్ను తయారు చేసే ప్రక్రియను పైరోలిసిస్ అంటారు. పైరోలిసిస్ ఛాంబర్తోపాటు రెండు సర్క్యులర్ బీమ్లు రెండు వైపులా ఉంటాయి. రొటేటింగ్ హేండిల్, చిమ్నీతో కూడిన గ్యాస్ అవుట్లెట్, మూతతోపాటు లోడింగ్ పోర్టు, వీటన్నిటినీ మోసే ఫ్రేమ్ ఉంటాయి. ఈ బయోచార్ ఉత్పత్తి యూనిట్ను ఆరుబయట ఉంచి, దాంట్లో పైన ఉండే మూత తీసి పంట వ్యర్థాలను లోపల వెయ్యాలి. ఆ తర్వాత నిప్పంటించాలి. మంట చిన్నగా రగులు కుంటున్నప్పుడు ఎయిర్ బ్లోయర్ ద్వారా గాలిని సరఫరా చెయ్యాలి. ఈ ఛాంబర్ పైభాగాన ఉన్న గ్యాస్ అవుట్లెట్ ద్వారా మంట పొగ బయటకు వస్తాయి. బాగా ఎండబెట్టిన (తేమ సుమారు 10–15% ఉండే) పంట వ్యర్థాలను రియాక్టర్లోకి వెయ్యాలి. పూర్తిగా నింపెయ్యకుండా 80% వరకు వెయ్యాలి. రియాక్టర్ యూనిట్ను 3–4 సార్లు తిప్పటం ద్వారా మంట కట్టెకు అన్ని వైపులా పూర్తిగా మంట వ్యాపించేలా చెయ్యాలి. బయోచార్ 20 శాతం నుంచి 30% మధ్యలో లభిస్తుంది. సామర్థ్యం: 1.2 క్యూబిక్ మీటర్లు (సుమారు 150 కిలోల పంట వ్యర్థాల ముక్కలు) ధర: రూ. లక్ష + 18% జిఎస్టి. వివరాలకు: డాక్టర్ సందీప్ మండల్, సీనియర్ సైంటిస్ట్, ఐసిఎఆర్– సిఐఎఇ, భోపాల్, భారత్. మొబైల్: 97203 23421 -
ఎడారిపై ఆకుపచ్చని సంతకం : సెకెమ్
‘సెకెమ్’ కథ తెలుసుకోవటం అంటే.. ఎడారిలో ఒయాసిస్సు వంటి పచ్చని సేంద్రియ పంట పొలాలను సృష్టించటం ద్వారా జీవితేచ్ఛకు కొత్త ఊపిర్లూదటమే. ఈజిప్టులో బయోడైనమిక్ అనే ఓ రకం సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా ఇసుక రేణువులకు తిరిగి ప్రాణప్రతిష్ట చేస్తున్న ఓ ప్రైవేటు సంస్థ ‘సెకెమ్’. సెకెమ్ అంటే స్థానిక భాషలో ‘సూర్యుని తేజస్సు‘ అని అర్థం. ఇది 47 ఏళ్ల క్రితం ఏర్పడింది. రసాయనిక వ్యవసాయం వల్ల ఏటేటా పంట భూములు పూర్థిస్థాయి ఎడారి ఇసుక దిబ్బలుగా నిర్జీవమవుతూ ఆ నేలలో ఆహారోత్పత్తి భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చుతున్న సంక్షోభ దశలో సెకెమ్ పుట్టింది. తాను సేంద్రియ సాగు చేస్తూ రైతులకు నేర్పిస్తోంది. వారు పండించిన పంటను రూపం మార్చి విక్రయిస్తూ విలువలతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తి, సరఫరా వ్యవస్థలకు చిరునామాగా మారింది. పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల వల్ల ఎడారిగా మారిన భూమిని బయోడైనమిక్ వ్యవసాయం ద్వారా పునరుజ్జీవింపజేస్తోంది. ఏప్రిల్ 22న ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేలతల్లికి ప్రణమిల్లి గుణాత్మకమైన మార్పు తెస్తున్న సెకెమ్ కృషి గురించి తెలుసుకోవటానికి మించిన స్ఫూర్తిదాయకమైన కథ, రైతులకే కాదుసమాజంలో ప్రతి ఒక్కరికీ, మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు!సెకెమ్ కథ ఈజిప్టు ఎడారిలో ఒక టెంట్, ట్రాక్టర్, పియానోతో ప్రారంభమవుతుంది. 1977లో ఇబ్రహీం అబౌలీష్ ఈ సామాజిక స్పృహ ఉన్న సంస్థను ప్రారంభించారు. 20 సంవత్సరాలు విదేశాల్లో రసాయన శాస్త్రం, ఔషధ శాస్త్ర రంగంలో పనిచేసిన తర్వాత ఆయన ఈజిప్ట్కు తిరిగి వచ్చారు. ఆ సమయంలో, ఈజిప్ట్ సంక్షోభ స్థితిలో ఎదుర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభాకు మరింత ఆహారోత్పత్తి చేయాల్సిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగం కునారిల్లుతోంది. వ్యవసాయ భూములు ఎడారిగా మారిపోతున్నాయి. రసాయన ఎరువులు, పురుగుమందుల మితిమీరిన వినియోగం నేలలను విషపూరితం చేసింది. కాబట్టి, రాజధాని కైరోకు ఈశాన్యంగా ఉన్న ఎడారి ప్రాంతంలో అబౌలీష్ ఒక టెంట్లో సెకెమ్ను స్థాపించారు. ప్రకృతి, మానవ అభివృద్ధి, ఆధ్యాత్మికతల మధ్య సామరస్యాన్ని నొక్కి చెబుతూ.. సేంద్రియ వ్యవసాయం ద్వారా దాన్ని సాధించాలని సెకెమ్ బలంగా నమ్మింది.బయోడైనమిక్ సేద్యం దిశగా 40 వేల మంది రైతులుఅబౌలీష్ మొదటి రెండు పెట్టుబడులు ట్రాక్టర్, పియానో! 2017లో ఇబ్రహీం అబౌలీష్ మరణించిన తర్వాత అతని కుమారుడు హెల్మీయే సంస్థను నడిపిస్తున్నారు. మానవాళిని ప్రకృతితో తిరిగి అనుసంధానించడంలో ‘భావోద్వేగాలు, భావాల’ ప్రాముఖ్యతకు పియానో ఓ ప్రతీక అంటారు సెకెమ్ ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న హెల్మీ. స్థాపితమైన 47 సంవత్సరాల తర్వాత సెకెమ్ ఒక బహుముఖ అభివృద్ధి సంస్థగా వికసించింది. ఇది ఎడారీకరణను ఎదుర్కోవడానికి, స్థిరమైన ఆహార వ్యవస్థలను నిర్మించడానికి, గ్రామీణ పేదరికాన్ని పరిష్కరించడానికి, వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సహాయ పడుతోందని యుఎన్ఇపి ప్రశంసించింది. 15,000 మంది రైతులు 19,000 హెక్టార్ల వ్యవసాయ భూములను 2022 నాటికే బయోడైనమిక్ వ్యవసాయంలోకి మార్చడానికి తోడ్పడింది. ఈజిప్షియన్ బయోడైనమిక్ అసోసియేషన్ భాగస్వామ్యంతో 2025 చివరి నాటికి 40,000 మంది రైతులు బయోడైనమిక్ వ్యవసాయంలోకి మారడానికి సహాయం చేయాలని సెకెమ్ లక్ష్యంగా పెట్టుకుంది. 2028 నాటికి 2,50,000 మంది రైతులకు చెందిన 16 లక్షల ఎకరాలను బయోడైనమిక్ వ్యవసాయంలోకి మార్చే దిశగా కృషి చేస్తోంది. అంతేకాదు, 1,000 హెక్టార్ల ఎడారిని తీసుకొని, అందులో ఆహార స్వయం సమృద్ధిగల సమాజాన్ని స్థాపించే ప్రయత్నంలో సెకెమ్ ఉంది. ఈజిప్ట్ భూమిలో 96 శాతం ఎడారిగా ఉంది. అందుకే ఎడారిని తిరిగి పచ్చని పంట భూమిగా మార్చే ఈ కార్యక్రమానికి ‘గ్రీనింగ్ ది డెజర్ట్’ అని పేరు పెట్టింది. వాతావరణాన్ని అతిగా వేడెక్కిస్తున్న కర్బనాన్ని గాలిలో నుంచి భూమిలో స్థిరీకరింపజేయటం ద్వారా పది వేల మంది ప్రజలకు రసాయన రహిత ఆహారం ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది.గుడారం నుంచి విశ్వవిద్యాలయం వరకు...ఎడారిలో ఒక గుడారంలో ప్రారంభమైన సెకెమ్ ప్రయాణం ప్రముఖ అభివృద్ధి సంస్థగా పురోభివృద్ధి సాధించింది. పాఠశాలలు, శిక్షణా కేంద్రాలతోపాటు ఏకంగా సొంతంగా ఓ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది. ఎడారీకరణను, భూముల రసాయనీకరణను ఎదుర్కోవడానికి రైతులను, యువతను శిక్షణతో, మార్గదర్శకత్వంతో సమాయత్తం చేస్తోంది. సెకెమ్ సేంద్రియ ఉత్పత్తులకు ‘ఎకానమీ ఆఫ్ లవ్’ పేరిట ప్రత్యేక సర్టిఫికేషన్ వ్యవస్థను నెలకొల్పింది. ఈ ఉత్పత్తులను దేశ విదేశాల్లో విక్రయిస్తుంది. యూరోపియన్ బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థల తోడ్పాటుతో ఈజిప్టులో బయోడైనమిక్ వ్యవసాయ పద్ధతి విస్తరణకు అవసరమైన నిధులను సేకరిస్తూ ఉంటుంది. సేంద్రియ వ్యవసాయంతో పాటు సహజ ఔషధాలు, వస్త్రాలు, ప్రకృతికి అనుగుణమైన జీవనశైలిని వ్యాపింపజేయటం కోసం సెకెమ్ ప్రత్యేక సంస్థలను నెలకొల్పటం విశేషం. 2017లో ఇబ్రహీం అబౌలీష్ మరణించిన తర్వాత సంస్థ సారధ్యబాధ్యతలు చేపట్టిన హెల్మీ అబౌలీష్ సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. 2057 నాటికి ఈజిప్ట్లోని 70 లక్షల రైతుల పొలాలను బయోడైనమిక్ వ్యవసాయంలోకి మార్చాలన్నది అందులో ముఖ్యమైనది.పురస్కారాల వరదవజ్రసంకల్పంతో ఇసుకలో పచ్చని పంటలు పెంచుతున్న సెకెమ్కు అంతర్జాతీయంగా పేరెన్నికగన్న ప్రతిష్టాత్మక అవార్డులెన్నో వచ్చాయి. గతంలోనే రైట్ లైవ్లీహుడ్ అవార్డు వచ్చింది. 2024లో గుల్బెంకియన్ హ్యుమానిటీ పురస్కారం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేస్తున్న రైతు సాధికార సంస్థతో కలసి సెకెమ్ ఈ పురస్కారాన్ని పంచుకోవటం విశేషం. ఐక్యరాజ్యసమితికి చెందిన పర్యావరణ విభాగం (యుఎన్ఇపి) ప్రతిష్టాత్మక పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్–2024’ ఇటీవల లభించింది. ప్రతి సంవత్సరం 2 కోట్ల టన్నుల ఆహారా ధాన్యాలను ఉత్పత్తి చేయగల 1.2 కోట్ల హెక్టార్ల భూమి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కరువు, ఎడారీకరణ కారణంగా నష్టపోతున్నట్లు యుఎన్ఇపి తెలిపింది. నిస్సారమైన భూములను, ఎడారులను సేంద్రియ పర్యావరణ వ్యవస్థలుగా పునరుజ్జీవింప చేయడానికి సెకెమ్ పాటుపడుతున్నదని ఈ సంస్థ పేర్కొంది. ఎడారిలో జీవాన్ని సృష్టిస్తున్నాం.. ‘మిషన్ ఇంపాసిబుల్’నే ఇష్టపడతాం!‘ఈజిప్ట్ భూమిలో 96 శాతం ఎడారి. 50 ఏళ్ల క్రితం తలసరి సాగు భూమి విస్తీర్ణం 600 క్యూబిక్ మీటర్లు ఉండేది. ఇప్పుడది 300 క్యూటిక్ మీటర్లకు తగ్గి΄ోయింది. ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయాన్ని సమూలంగా మార్చగలమని నిరూపించాలని మా నాన్న సంకల్పించారు. ప్రేమతో కూడిన ఆర్థిక వ్యవస్థ’ను నిర్మించాలని మా నాన్న కలగన్నారు. ఇది శూన్యమైన ఎడారిలో జీవాన్ని సృష్టించటం లాంటిదే. అత్యంత అరుదైన నీటిని పొదుపుగా వాడుతున్నాం. కం΄ోస్టు సహాయంతో ఇసుకలో పంటలు పండిస్తున్నాం. సోలార్ విద్యుత్తును వాడుతున్నాం. ఎడారిని ఆకుపచ్చగా మార్చుతున్నాం. కార్బన్ క్రెడిట్స్ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుతున్నాం. 2057 నాటికి దేశంలో 70 లక్షల మంది రైతులను బయోడైనమిక్ సేద్యంలోకి మార్చాలన్నది లక్ష్యం. మేం ఈ మైలురాయిని చేరుకోకపోతే మా పరమ లక్ష్యం నెరవేరదు. ఇది అసాధ్యమని చాలా మంది అన్నారు. కానీ, అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయటంలో మేం నిపుణులం. మిషన్ ఇంపాసిబుల్నే మేం ఇష్టపడతాం..’ – హెల్మీ అబౌలీష్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సెకెమ్, ఈజిప్టునిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పండ్లు వృథాగా పోకుండా.. ఆస్మోటిక్ డీ హైడ్రేషన్ బెస్ట్
బొప్పాయి, జామ, ఉసిరి వంటి పండ్లకు మార్కెట్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు తెగనమ్ముకోకుండా లేదా వృథాగా పారేయకుండా వాటిని ఎండ బెట్టి నిల్వ ఉండే వివిధ ఉత్పత్తులుగా మార్చితే రైతులకు మంచి అదనపు ఆదాయం చేకూరుతుంది. ఎండబెట్టే క్రమంలో ఆస్మోటిక్ డీహైడ్రేషన్ ప్రక్రియ మేలైనదని, తద్వారా అనేక విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసు కోవచ్చని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా స్థానం (ఐఐహెచ్ఆర్) చెబుతోంది.బొప్పాయి ఫ్రూట్ బార్ తయారీ విధానంబొప్పాయి మన దేశంలో ఒక ముఖ్యమైన పంట. అద్భుతమైన వాసన, రుచి, విటమిన్ ఎ, సిలకు ఇది పెట్టింది పేరు. బొప్పాయికి మార్కెట్లో గిరాకీ లేనప్పుడు దూర ప్రాంతాలకు ఖర్చులు భరించి రవాణా చేయటం కష్టం. అందువల్ల కోత అనంతర నష్టం బొప్పాయిలో చాలా ఎక్కువ. కొన్నిసార్లు చిన్న కాయలు లేదా బాగా పెద్ద కాయలను మార్కెట్లో అమ్మటం కష్టమవుతుంది. అటువంటప్పుడు రైతులు బొప్పాయి ఫ్రూట్ బార్ (బొప్పాయి తాండ్ర)ను తయారు చేసి అమ్ముకోవచ్చు. ఫ్రూట్ బార్లు పోషకవంతమైనవి. చూపులకు నచ్చుతాయి. రుచిగా ఉంటాయి. రవాణా చేయటం సులభం. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అయితే, బొప్పాయి గుజ్జుతో తాండ్రను తయారు చేయటం మామిడి అంత తేలిక కాదు. దీన్ని తయారు చేసే క్రమంలో పగుళ్లు వస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు ఒక ప్రాసెస్ను కనిపెట్టారు. నీటి శాతం తగ్గించి, తాండ్రగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. బొప్పాయి ఫ్రూట్ బార్ చక్కటి తాజా పండు మాదిరిగానే వాసన వస్తుంది. రూపం, రుచి కూడా బాగుంటాయి. దీన్ని చిరుతిండిగా తినొచ్చు. పిల్లలకు, పర్వతారోహకులకు, రక్షణ సిబ్బంది, సైనికులకు ఇది ఉపయోగకరం. ఈ డీహైడ్రేటెడ్ ప్రొడక్ట్ను చిన్న, సన్నకారు పరిశ్రమలతో పాటు మధ్యతరహా పరిశ్రమల్లోనూ తయారు చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా ప్రాసెసింగ్ యూనిట్లకు ఉపయోగపడేలా ఈ సాంకేతికతను రూపొందించినట్లు ఐఐహెచ్ఆర్ పేర్కొంది. కిలో ఫ్రూట్ బార్ తయారు చేయడానికి 7-8 కిలోల బొ΄్పాయి కాయలు అవసర మవుతాయి. ఇది సాధారణ పరిస్థితుల్లో ఆరు నెలలు నిల్వ ఉంటుంది.జామ ముక్కల వొరుగుల తయారీ టెక్నాలజీజామ పండ్లలో గుజ్జు ఎక్కువ నీటితో కూడి తియ్యగా ఉంటుంది కాబట్టి తాజా పండ్లు తినటమే బాగుంటుంది. జామ పండు చక్కటి సువానతో పాటు విటమిన్ సిని కలిగి ఉంటుంది. అయితే, పండు చాలా త్వరగా పాడైపోతుంది. కాబట్టి, ప్రాసెస్ చేస్తే మంచి లాభదాయకం. జెల్లీ, జ్యూస్, ఫ్రూట్ బార్ వంటి ఉత్పత్తులను జామపండుతో తయారు చేయటం మనకు తెలుసు. అయితే, ఆస్మోటిక్ డైహైడ్రేసన్ పద్ధతిలో తొలుత నీటి శాతాన్ని తగ్గిస్తే.. పూర్థిస్థాయి ప్రాసెసింగ్, ఎయిర్ డ్రయ్యింగ్ చప్పున పూర్తవుతుంది. ఈ సాంకేతికత ద్వారా తెలుపు, గులాబీ రంగు గుజ్జు ఉండే జామ పండ్ల ముక్కలను డీౖహె డ్రేట్ చెయ్యొచ్చు. ఆస్మో–ఎయిర్ డ్రైడ్ ఫ్రూట్స్ను ఉత్పత్తి చేసే ప్రక్రియ చాలా వినూత్నమైన పద్ధతి. జామ ముక్కలకు తొలుత పంచదార ΄ాకం కలపటం ఆస్మోటిక్ డీౖహె డ్రేషన్లో తొలి దశ. ఆ తర్వాత పాక్షికంగా నీరు తగ్గిన ముక్కలను హాట్ ఎయిర్ డ్రయ్యర్ ద్వారా తేమ శాతాన్ని 15% కన్నా తక్కువ తేమ ఉండేలా తయారు చేయాలి. ఇలా తయారైన జామ ఎండు ముక్కలను చిరుతిండిగా తినొచ్చు. లేదా ఇతర డ్రైఫ్రూట్స్తో కలిపి తినొచ్చు. దీన్ని ఐస్క్రీమ్ పరిశ్రమలో, ఫ్రూట్ సలాడ్లలో, ఖీర్లో, కేకులు, బేకరీ ఉత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. పిల్లలకు, బరువైన వస్తువులు తీసుకెళ్లలేని పర్వతారోహకులకు, సైనికులకు ఎక్కువ ఉపయోగకరం. ఈ ప్రాసెస్ చాలా సులభం. పెద్ద యంత్ర పరికరాలేమీ అక్కర్లేదు. దీన్ని చిన్నసన్నకారు ప్రాసెసర్లు, మహిళా సంఘాలు, ఇతర స్వయం ఉపాధి పొందే వర్గాల వారు ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. కిలో ఆస్మో-ఎయిర్ డ్రైడ్ జామ ఒరుగులు తయారు చేయటానికి 7–8 కిలోల జామ పండ్లు కావాలి. 6 నెలల నుంచి ఏడాది వరకు నిల్వ ఉంటాయి.సహజ రంగుతో కూడిన వుసిరి ఒరుగులుఔషధ గుణాల పుట్ట అయిన ఉసిరికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంటుంది. అస్కార్బిక్ ఆసిడ్ అధిక పాళ్లలో కలిగిఉండటంతో పాటు యాంటీబయోటిక్, లాక్జేటివ్గా పనిచేసే గుణాలు దీనికి ఉన్నాయి. కోకుమ్ / మాంగోస్టీన్లో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి జీర్ణశక్తిని, ఆకలిని పెంచుతాయి. దీని రంగును ఉసిరి ఒరుగులకు పట్టిస్తే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇటు ఉసిరి, అటు మాంగోస్టీన్లలో ఔషధ గుణాలు ఎక్కువే గానీ అవి త్వరగా పాడైపోతాయి. వీటిని నేరుగా పండ్లను తినటం కష్టం. ప్రాసెస్ చేయాల్సిందే. కోకుమ్ జ్యూస్ను తీసి వుసిరి తొనలకు కలిపితే.. వుసిరి ఒరుగులకు మంచి ఎరుపు రంగుతోపాటు సువాసన వస్తాయి. ఆస్మోటిక్ పద్ధతిలో ఎండబెట్టిన వుసిరి తక్కువ అసిడిక్గా ఉంటాయి. రుచి బాగుంటుంది. ఎర్రటి ఈ ఒరుగులను విడిగా చిరుతిండిగా తినొచ్చు లేదా ఇతర డ్రై ఫ్రూట్స్తో కలిపి తినొచ్చు. పిల్లలకు, పర్వతారోహకులకు, సైనికులకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కోకుమ్ రంగు కలిపిన ఉత్పత్తులు మార్కెట్లో లేవు. చిన్న తరహా ప్రాసెసింగ్ సదుపాయాలున్న వారు వీటిని తయారు చేసుకోవచ్చు. ఆస్మోటిక్ పద్ధతిలో ఎండబెట్టిన ఉసిరి ఉత్పత్తులు తాజా పండ్ల మాదిరిగానే ఉంటాయి. 4-5 కిలోల ఉసిరి పండ్లు, 2 కిలోల కోకుమ్ పండ్లు కలిపి తయారు చేస్తే ఓస్మో-ఎయిర్ డ్రైడ్ స్లైసెస్ తయారవుతాయి. జాగ్రత్తగా నిల్వ చేస్తే ఒక ఏడాది పాటు నిల్వ ఉంటాయి. -
రూ.10,980కే గానుగ నూనె యంత్రం
ఆరోగ్య రక్షణలో గానుగ నూనెల ప్రాధాన్యాన్ని ఇప్పుడు చాలా మంది తెలుసుకుంటున్నారు. ధర ఎక్కువైనప్పటికీ ఆరోగ్యాభిలాషులు గానుగ నూనెల కొనుగోలుకు వెనుకాడటం లేదు. మన దేశంలో గానుగ నూనెల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. దీని వార్షిక వ్యాపారం (సిఎజిఆర్) 2024–2032 మధ్యకాలంలో సుమారు 6% పెరుగుతుందని ఒక అధ్యయనం చెబుతోంది. ప్రజల్లో ముఖ్యంగా నగర, పట్టణవాసుల్లో గానుగ నూనెల పట్ల మక్కువ పెరగటంతో పాటు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుండటంతో గానుగ నూనెల వ్యాపారానికి భవిష్యత్తులో విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. ఎద్దును కట్టి గానుగ తిప్పి నూనె వెలికి తీసే సంస్థలతోపాటు విద్యుత్తుతో కట్టె గానుగలు నడుపుతూ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఎవరి ఇంట్లో వాళ్లు పెట్టుకొని నడుపుకోగలిగిన చిన్నవి, ఇంకో చోటికి సులభంగా తీసుకెళ్ల గలిగిన చిన్నపాటి గానుగ యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, వాటి ధర, నాణ్యతలో ప్రామాణికత లోపిస్తోంది. ఈ నేపథ్యంలో కాన్పూర్ ఐఐటి ఒక కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ పోర్టబుల్ యంత్రాన్ని తక్కువ ధరలో రూపొందించింది. ఐఐటి కాన్పూర్లోని రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్ (రుటాగ్)లో ఇంక్యుబేషన్ సేవలు అందుకున్న డి–ఐవి ఎంటర్ప్రైజెస్ అనే స్టార్టప్ ఈ యంత్రాలను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తెచ్చింది. ఈ యంత్రంలో మూడు భాగాలు ఉంటాయి. ఛాంబర్, ప్లంగర్ రాడ్, స్టెయిన్లెస్ సిలెండర్. అడుగున ఒక గిన్నెలో ఛాంబర్ను ఉంచి, అందులో నూనె గింజలు పోసి, పైన ఉన్న హేండిల్ను పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ ఉంటే ప్లంగర్ రాడ్ కిందికి దిగుతూ గింజల్ని వత్తుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ సిలెండర్కు ఉన్న రంథ్రాలలో నుంచి నూనె బయటకు వస్తుంది. తక్కువ విద్యుత్ ఖర్చుతో అధిక నాణ్యత గల నూనెను ఈ విధంగా వెలికితీయవచ్చని ఐఐటి చెబుతోంది. దీన్ని నడపడానికి విద్యుత్తు అవసరం లేదు. ఒక వ్యక్తి పెద్ద శ్రమ లేకుండానే దీనితో నూనెను వెలికితీయవచ్చు. వేరుశనగ, కొబ్బరి, నువ్వులు, సోయా తదితర నూనె గింజల నుంచి దీనితో నూనె తీయవచ్చు. సంవత్సరం క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ యంత్రం ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్లింది. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లగలిగే ఈ యంత్రం ధర రూ. 10,980 మాత్రమే. ఇతర యంత్రాలతో పోల్చితే దీని ఖరీదు చాలా తక్కువని ఐఐటి కాన్పూర్ రుటాగ్ అధిపతి డాక్టర్ అమన్దీప్ సింగ్ చెప్పారు. యంత్రం వీడియో లింక్: https://www.youtube.com/watch?v=0ZMNaZMMC5oయంత్రం తయారీదారు మెయిల్ఐడి: divakmse@gmail.com -
మధుర కవచం! ఈ ఫ్రూట్ కవర్లతో లాభాలెన్నో..!
కాస్మొటిక్ పేపర్తో ఈ కవర్లు తయారయ్యాయి. నలుపు, ఇటుక రంగులో ఉంటాయి. పల్చగా ఉండే ఈ కవర్పై మైనం వంటి పూత ఉండటం వల్ల వర్షపు నీరు కూడా కాయకు తాకకుండా కిందికి జారి΄ోతుంది. పిందె/కాయ మీద వర్షం పడితే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఆశించి మచ్చలు ఏర్పడతాయి. మచ్చల వల్ల టన్నుకు రూ. పది వేలకు పైగా ధర తగ్గిపోతుంది. కవర్లు కట్టిన మామిడి కాయపై ఎండ, వానల తాకిన లేక మచ్చలు ఏర్పడవు. ఫ్రూట్ ఫ్లై (పండీగ) నుంచి కూడా రక్షణ దొరుకుతుంది. పురుగులు, తెగుళ్లు సోకవు. దీంతో రైతుకు పురుగుమందులు, కూలీ ఖర్చులు సగానికి సగం ఆదా అవుతాయి. కవర్ తొడిమను పట్టుకొని ఉండటంతో ఒక మోస్తరు గాలుల నుంచి కూడా కవర్ కాయలకు రక్షణ కల్పిస్తుంది. కాయలు ఏపుగా వైట్ ఎల్లో రంగులో పెరుగుతాయి. సాధారణంగా పెరిగే కాయలకంటే కవరులో పెరిగిన కాయలు నాణ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఫలితంగా ఎగుమతిదార్లు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కవర్లలో పెరిగిన కాయలకు 30–40 శాతం అధికంగా ధర పలుకుతోందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పురుగులు, తెగుళ్ల మందుల వాడకం, ఖర్చు సగానికి సగం తగ్గడం వల్ల ఆరోగ్యదాయకమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేయడంతోపాటు రైతుకూ అధికాదాయం సమకూరడం హర్షదాయకం. (చదవండి: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్ ఐదేళ్లలో..) -
అగ్గినీ తట్టుకునే ‘అగవె’! దెబ్బకు కార్చిచ్చులు కట్టడి..
అగవె.. చాలా అరుదైన ఎడారి మొక్క. మంటలకు తట్టుకొని నిలబడగలిగే అరుదైన లక్షణం గల ఎడారి పంట ఇది. కలబంద మొక్క మాదిరిగా కనిపించే అగవే చాలా ఎత్తుగా ఎదుగుతుంది. అగవె మట్టల నుంచి నార తీసి, తాళ్లు అల్లే సంప్రదాయం ఉంది. ‘నార కలబంద’ అని పేరుంది. తీవ్ర వేడి పరిస్థితుల్లోనూ మనుగడ సాగిస్తుంది. పశుగ్రాసంగా పనికొస్తుంది. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి భూమిలో స్థిరీకరించటం ద్వారా భూతాపాన్ని తగ్గిస్తుంది. నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందిస్తుంది. దీని మట్టల పైపొర చాలా దృఢంగా, బూడిద పూసినట్లు ఉండటం వల్ల మంటలను కూడా తట్టుకోగలుగుతుంది. అందువల్ల, అగవే తోటలకు నిప్పు భయం ఉండదు. ఉద్యాన తోటల మధ్యలో అక్కడక్కడా కొన్ని వరుసలు అగవే మొక్కలు నాటుకుంటే నిప్పు భయం నుంచి తోటలను కొంతమేరకైనా కాపాడుకోవచ్చు. 275కు పైగా రకాలుఅగవె సక్యులెంట్ ప్లాంట్. అంటే, గాలి నుంచి తేమను గ్రహించి తన ఆకుల్లో దాచుకోగలిగే ఎడారి మొక్క. ఐదారు అడుగుల ఎత్తుకు పెరిగే అగవె జాతులు కూడా ఉన్నాయి. బహుళ ప్రయోజనకారి అయిన అగవె తోటలు అమెరికా ఖండం అంతటా వ్యాపించి ఉన్నప్పటికినీ.. మెక్సికోలో ఎక్కువ. మన దేశంలోనూ అగవె మొక్కలు మెట్ట ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. 275కు పైగా అగవె పంట రకాలున్నాయి. ఇందులో ఎ. సిసాలన, ఎ. కంటల, ఎ.అమెరికానా వంటి అగవె రకాలు భారత దేశంలో అందుబాటులో ఉన్నాయని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పదేళ్ల క్రితమే ప్రకటించింది. దీని సాగు పద్ధతులను కూడా ప్రామాణీకరించింది. అయినా, ఇప్పటికీ అగవె మనం ఉపయోగించుకోలేక΄ోయిన పంటగానే మిగిలిపోయింది.దైవమిచ్చిన పంట! మెక్సికోలో పురాతన కాలం నుంచే అజ్టెక్ ప్రజలు అగవెను దైవమిచ్చిన పంటగా భక్తితో సాగు చేసుకొని ఉపయోగించుకుంటున్నారని చరిత్ర చెబుతోంది. మాయాహుఎల్ అనే దేవత తమకు ప్రసాదించిన తేనె అగవె మట్టల నుంచి తీసినదేనని వారు నమ్ముతారు. ఇప్పుడు దీన్ని ఒక పారిశ్రామిక పంటగా, ఆదాయ వనరుగా కూడా చూస్తున్నారు. అనేక ఆల్కహాల్ ఉత్పత్తులతో పాటు.. షుగర్, సిరప్ వంటి ఆహారోత్పత్తులు, సహజ నార ఉత్పత్తుల తయారీకి.. పశుగ్రాసంగా కూడా అగవె పంటను ఉపయోగిస్తున్నారు. యాంటీఆక్సిడెంట్లు, సపోనిన్లు వంటి ఆరోగ్యకర ఉత్పత్తులను కూడా ఇటీవల అగవె నుంచి ఇటీవల సంగ్రహిస్తున్నారు. దీంతో ఇది బహుళ ప్రయోజనకారి అయిన పారిశ్రామిక పంటగా మారింది. భూతాపోన్నతి పెచ్చుమీరుతున్న ఈ దశలో ఈ ఎడారి పంట మరింత ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం వల్ల లాండ్స్కేపింగ్లో కొన్ని రకాల అగవె మొక్కలను కంచెలుగా పెంచుతుండటం నగరాల్లోనూ కనిపిస్తోంది.వంద కోట్ల అగవె ప్రాజెక్టుఅగవె జాతి మొక్కల పెంపకం వల్ల ప్రజలకే కాకుండా పర్యావరణానికీ గొప్ప మేలు జరుగుతుందని నమ్మే ‘రీజెనరేషన్ ఇంటర్నేషనల్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల అగవె మొక్కలు నాటాలన్న బృహత్ సంకల్పం తీసుకుంది. ద బిలియన్ అగవె ప్రాజెక్ట్లో భాగంగా మెక్సికోలోని గ్వానాజువాటో ఎడారి ప్రాంతంలో పర్యావరణంలో అద్భుత మార్పులు తేగల అగవె తోటలు నాటుతున్నారు. అగవె మొక్కలతో పాటు వాటి పక్కనే నత్రజనిని గాలిలో నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరింపజేసే జాతుల చెట్లను నాటడం, పశువులను ఈ తోటల్లో తగుమాత్రంగా మేపుతూ ఉండటం ద్వారా ఆ ఎడారి ప్రాంతాన్ని తిరిగి పచ్చని ప్రాంతంగా మార్చటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో, నిస్సారమైన భూముల్లో అధికంగా పశుగ్రాసాన్ని పెద్ద మొత్తంలో సాగు చేయటం అగవె ద్వారానే సాధ్యమని ఈ సంస్థ తెలిపింది. అగవె మట్టలను గుజ్జులాగా చేసి, కొన్ని రోజులు గాలి తగలకుండా మగ్గబెడితే అద్భుతమైన పశుగ్రాసంగా పనికి వస్తుంది. తీవ్ర కరువు ్ర΄ాంతాల్లో పశువులను ఇది కష్టకాలంలో రక్షిస్తుందని చెబుతున్నారు.సరికొత్త తోటల నమూనా అగవెతో మెట్ట ప్రాంతాల్లో సాగు చేయదగిన సరికొత్త తోటల (ఆగ్రోఫారెస్ట్రీ) నమూనాను రీజనరేషన్ ఇంటర్నేషనల్ రూ΄÷ందించింది. హెక్టారుకు 1600–2500 మొక్కల్ని వత్తుగా నాటాలి. వీటి మధ్యలో వేగంగా పెరిగే, పశువులు తినే ఆకులుండే దీర్ఘకాలిక ద్విదళ జాతి చెట్ల జాతి (గ్లైరిసీడియా (గిరిపుష్పం), తుమ్మ వంటి) మొక్కల్ని 500 వరకు నాటాలి. అగవె మొక్కలు 3 ఏళ్లు పెరిగిన తర్వాత నుంచి 5–7 ఏళ్ల పాటు ఈ చెట్ల మట్టలను (ఆకులను) కోసుకోవచ్చు. గట్టిగా ఉండే ఈ మట్టలను చాప్ కట్టర్ వంటి యంత్రంతో గుజ్జులాగా తరగాలి. ΄్లాస్టిక్ బక్కెట్లు/ డ్రమ్ముల్లో ఈ గుజ్జును నింపి, మూత పెట్టి, 30 రోజులు మాగ బెట్టాలి. దీనితో ΄ాటు.. గ్లైరిసీడియా/ అడవి తుమ్మ /సర్కారు తుమ్మ వంటి ద్విదళ జాతి చెట్ల కాయలు, ఆకులను 20% వరకు కలిపి గుజ్జుగా చేసి కలిపితే ప్రోటీన్లు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. ఈ విధంగా సహజ సిద్ధమైన కూడిన పశువుల దాణా అతి తక్కువ ఖర్చుతో తయారవుతుంది. 8–10 ఏళ్ల తర్వాత అగవె చెట్టు పువ్వు పూసి చని΄ోతుంది. ఆ దశలో చెట్టు కాండం నుంచి ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీకి వినియోగించవచ్చు. ఈ అగవె తోటలో పశువులను మేపుకుంటూనే, పశువుల దాణాను కూడా తయారు చేసుకోవచ్చు. ఎడారి ప్రాంత రైతులకు అగవె తోటలు ఆర్థికంగానే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తాయని రీజెనరేషన్ ఇంటర్నేషనల్ స్పష్టం చేస్తోంది. ఇది మన దేశంలోనూ దక్షిణాదిలో మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అగ్రోఫారెస్ట్రీ నమూనాగా చెప్పవచ్చు.ఎకరానికి 30–40 టన్నుల మట్టల దిగుబడిమన దేశంలో ఎ. సిసలన, ఎ. కంటల, ఎ. అమెరికానా రకాల అగవె మొక్కలు ఉన్నాయి. నీరు నిల్వ ఉండని, ఎర్ర గరప నేలల్లో బాగా పెరుగుతుందని అగవె పంటపై పరిశోధన చేసిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకు ముక్కలను లేదా పిలకలను నాటుకోవాలి. ఆకు ముక్కల్ని నర్సరీలో 9–12 అంగుళాల వరకు పెంచి, 2“2 మీటర్ల దూరంలో, వర్షాకాలంలో నాటుకోవాలి. మూడేళ్ల తర్వాత నుంచి ఆకుల దిగుబడి వస్తుంది. మీటరు కన్నా ఎక్కువ ΄÷డవు పెరిగిన ఆకులను కత్తిరించాలి. ప్రతి మొక్కా ఏడాదికి 40–50 ఆకుల దిగుబడిని 8 ఏళ్ల వరకు ఇస్తుంది. ఈ మట్టల్లో నార/పీచు రకాన్ని బట్టి 2.5–4.5% వరకు ఉంటుంది. అగవె సిసలన రకంలో 4.5% నాణ్యమైన నార ఉంటుంది. మూడేళ్లు గడచిన తర్వాత ఎకరానికి 30–40 టన్నుల మట్టల దిగుబడి వస్తుంది. పదేళ్ల నాటి అంచనాల ప్రకారం.. ఎకరానికి రూ. 2 వేల నికారాదాయం వస్తుంది. పొలాల చుట్టూ కంచె పంటగా అగవెను నాటుకున్నా.. ఇందులో 25% నికరాదాయం వస్తుంది. యంత్రంతో నార తీసి, నీటితో శుద్ధిచేసి, ఎండబెట్టి బేళ్లుగా కట్టి అమ్మాలి. ఎండగా ఉన్న రోజే నార తియ్యాలి. మట్టలను కోసిన రెండు రోజుల్లోగా తీస్తేనే నాణ్యమైన నార వస్తుంది. పాల తెలుపు నుంచి బంగారు పసుపు రంగుల్లో ఈ నార ఉంటుందని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. అగవెను పశు దాణా ఉత్పత్తి గురించి మెక్సికో రైతులు ఎక్కువగా చెబుతుంటే.. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రం నార కోసం అని మాత్రమే చెబుతోంది. అందుకే దీనికి నార కలబంద అని పేరొచ్చినట్టుంది. ఏదేమైనా బంజర్లు, ఎడారి ్ర΄ాంతాల్లో అగవెతో కూడిన కొత్త రకం ఆగ్రోఫారెస్ట్రీ తోటల సాగుపై ప్రభుత్వ రంగ పరిశోధకులు దృష్టి సారిస్తే వర్షాధార ప్రాంత రైతులకు, పర్యావరణానికీ మేలు కలుగుతుంది. ‘అగవె’నే ఎందుకు?భూతాపం పెచ్చు మీరిన తర్వాత అడవుల్లో కార్చిచ్చులు మరీ ఎక్కువైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. వేలాది ఎకరాల్లో అడవులు దగ్థమైపోతున్నాయి. అంతర్జాతీయంగా కార్చిచ్చుల నుంచి పచ్చని చెట్లను, తోటలను రక్షించుకోవటానికి మధ్యలో అక్కడక్కడా అగవే మొక్కలు నాటుకోవటం ఒక వినూత్న పరిష్కార మార్గంగా ముందుకు వస్తోంది.అగవె మట్టలు(ఆకులు) మందంగా, బూడిద పూసినట్లు ఉండి, వేడిని తట్టుకునేలా ఉంటాయి. సులువుగా నిప్పంటుకోవటానికి అవకాశం ఉండదు. అగవె మొక్క తన ఆకుల్లో చాలా నీటిని నిల్వ చేసుకుంటుంది. అందువల్ల వాటికి అంత సులువుగా నిప్పంటుకోదు. ఈ కారణంగా మంటలను అవతలి ప్రాంతానికి వ్యాపింపజేయకుండా అడ్డుకునే తత్వం అగవె మొక్కలకు వచ్చింది. అగవె చెట్టు వేర్లు ఎంత విస్తారంగా భూమిలోకి విస్తరించి ఉంటాయంటే.. ఇతరత్రా చెట్లన్నీ అగ్నికి ఆహుతైపోయినా ఇవి మాత్రం నిలబడే ఉంటాయి. ఒక మొక్కకు టన్ను పశువుల దాణా!అగవె మొక్కలు గాలికి, ఎండకు, వానకు పెరుగుతాయి. నిర్వహణ అతి సులభం. బాగా పెరుగుతుంది. ఒక్కో చెట్టు 8–10 ఏళ్లు బతుకుతుంది. ఈ కాలంలో ఒక టన్ను బరువైన మట్టలను అందిస్తుంది. ఈ చెట్లను ఇతర ద్విదళ చెట్లతో కలిపి పెంచితే ఎడారి ప్రాంతం కూడా ఆకుపచ్చగా మారుతుంది. భూమి సారవంతమవుతుంది. వాన నీరు అక్కడికక్కడే భూమిలోకి బాగా ఇంకుతుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సయిడ్ను భారీగా గ్రహించి భూమిలో స్థిరీకరించడానికి అగవె తోటలు దోహదపడతాయి. ఈ ప్రయోజనాల రీత్యా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల అగవె మొక్కలు నాటాలని ద బిలియన్ అగవె ఉద్యమాన్ని రీజనరేటివ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రారంభించింది. విరాళాలు, ప్రభుత్వ, ప్రజల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఈ సంస్థ తలపెట్టింది. పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్(చదవండి: beat the heat ఇండోర్ ప్లాంట్స్తో ఎండకు చెక్) -
పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
తాజా పుట్టగొడుగులను నగర, పరిసర ప్రాంతాల వినియోగదారులకు వారి ఇంటి దగ్గరకే తీసుకెళ్లి అందించే లక్ష్యంతో సౌర విద్యుత్తుతో పుట్టగొడుగులను ఉత్పత్తి చేసే ట్రైసైకిల్ సాంకేతికతను బెంగళూరులోని బారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించింది. వేరే చోట పుట్టగొడుగులను పెంచి, తీసుకెళ్లి విక్రయించడటం వల్ల అవి తాజాదనాన్ని కోల్పోతుంటాయి. కోసిన తర్వాత వినియోగదారులకు చేరటం ఆలస్యమైతే రెండు, మూడు రోజుల్లో పుట్టగొడుగులు రంగు మారి వృథా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించటంతో పాటు పౌష్టికాహారాన్ని ప్రజలకు తాజాగా అందించటం ద్వారా ఉపాధి పొందగోరే యువతకు ఆదాయ వనరుగా ఈ మష్రూమ్ సోలార్ ట్రైసైకిల్ సాంకేతికతను ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!పెరట్లో, మేడపైన కొద్ది ఖాళీలోనే అవుట్డోర్ సోలార్ మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్ను ఇంతకుముందే ఐఐహెచ్ఆర్ రూపొందించింది. ఈ యూనిట్లో పెరిగిన పుట్టుగొడుగులతో కూడిన గ్రోబాగ్స్ను సోలార్ ట్రైసైకిల్లోకి మార్చుకొని... వినియోగదారుల ఇళ్ల దగ్గరకు తీసుకు వెళ్లి విక్రయించడానికి ట్రైసైకిల్ ద్వారా అవకాశం కలిగిస్తోంది. తద్వారా పోషకవిలువలతో కూడిన పుట్టగొడుగులను ప్రజల దైనందిన ఆహారంలో భాగం చేసుకోగలుగుతారని ఐఐహెచ్ఆర్ ఆశిస్తోంది. చదవండి: beat the heat ఇండోర్ ప్లాంట్స్తో ఎండకు చెక్ఈ ట్రైసైకిల్ ఛాంబర్ 1.5“1“1 మీటర్ల సైజులో ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్లలో పుట్టగొడుగులు పెరిగే బ్యాగులను అమర్చుకోవచ్చు. గాలి ఆడటం కోసం, పురుగులు, ఈగలు వాలకుండా నైలాన్ 40 మెష్ను, గోనె సంచులను చుట్టూతా ఏర్పాటు చేశారు. కిలో/2 కిలోల పుట్టగొడుగులతో కూడిన 36 బ్యాగ్లు ఇందులో పెట్టుకోవచ్చు. 30 వాట్స్ డిసి మిస్టింగ్ డయాఫ్రం పంప్ నిరంతరం గోనె సంచులపై నీటి తుంపర్లను చల్లుతూ చల్లబరుస్తూ ఉంటుంది. ఇది విద్యుత్తుతో లేదా సౌర విద్యుత్తుతో నడుస్తుంది. 300 వాట్స్ ΄్యానల్, ఇన్వర్టర్, 12వి స్టోరేజ్ బ్యాటరీ, టైమర్ ఇందులో అమర్చారు. ట్రైసైకిల్కి 48వి, 750 వాట్స్ డిసి గేర్డ్ మోటార్ అమర్చారు. వోల్టేజి కంట్రోలర్, సౌర విద్యుత్తును నిల్వ చేయటానికి 24ఎహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇతర వివరాలకు.. ఐఐహెచ్ఆర్ మష్రూమ్ లాబ్ (బెంగళూరు) – 070909 49605. -
విద్యుత్తు లేకుండా ఆకుకూరలను 36 గంటలు నిల్వ ఉంచే బాక్స్!
దైనందిన ఆహారంలో ఆకుకూరలకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. అయితే, నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు, చిల్లర వర్తకులు ఆకుకూరలను రెండో రోజు వరకు నిల్వ ఉంచడానికి నానా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే, బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) శాస్త్రవేత్తలు ఈ సమస్యకో పరిష్కారం కనుగొన్నారు. దాని పేరే అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్. సాధారణంగా 24 గంటల్లోనే ఆకుకూరలు వాడి పోయి పాడైపోతుంటాయి. అయితే, అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్లో పెడితే 36 గంటలపాటు తాజాగా ఉంటాయి. ఈ బాక్స్ను గది ఉష్ణోగ్రత(26–28 డిగ్రీల సెల్షియస్, 52% గాలిలో తేమ)లో ఉంచి, అందులో ఆకు కూరలు పెట్టి మూత వేస్తే చాలు. విద్యుత్తు అవసరం లేదు. రిఫ్రిజరేషన్ చేయనవసరం లేకుండానే అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్లో ఉంచితే చాలు.. ఆకుకూరలు 36 గంటలు తాజాగా ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలు విక్రయించే రిటైల్ షాపులకు, సూపర్ మార్కెట్లకు, తోపుడు బండ్లు/ ఆటోలపై కూరగాయలు అమ్మే వ్యాపారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్లో పరిశుభ్రమైన స్థితిలో ఆకుకూరలను తాజాదనం కోల్పోకుండా నిల్వ ఉంచుకోవ్చు. ఇతర వివరాలకు... 77608 83948చదవండి: పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్! -
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు..!
గత మూడు రోజుల వాతావరణం:గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలోఅక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు35నుండి 40డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు18 నుండి 24డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.వచ్చే ఐదు రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు:హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు (సోమవారం మధ్యాహ్నానికి ఉన్న సమాచారం ఆధారంగా) అందించిన సమాచారం ప్రకారం ఈ నెల 26 (బుధవారం) నుండి 30వ(ఆదివారం) వరకు రాబోయే ఐదు రోజుల్లో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 35 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కోసం పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాల్లో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర పంటలను వేసుకోవచ్చు.నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వరికి ఆరుతడులు ఇవ్వాలి.చీడపీడలు, తెగుళ్ళ ఉధృతి అధికంగా కాకుండా చూడటానికి సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టాలి. వడగళ్ళ వాన, అధిక వర్షాలు కురిసిన ప్రాంతపు రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు: నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళను నివారించడానికి నేల బాగా తడిచే విధంగా 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొదళ్ళలో పోయాలి.అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుంచి నీటిని తీసివేసిన తరువాత పంట త్వరగా కోలుకోవటానికి 2% యూరియా లేదా 1% ΄÷టాషియం నైట్రేట్ ద్రావణాన్ని పంటపై పిచికారీ చేయాలి.వర్షాలతో శాకీయ దశలో ఉన్న కూరగాయ పంటల్లో నష్టం ఎక్కువగా ఉంటే తిరిగి మొక్కలను నాటుకోవాలి.పడిపోయిన మొక్కజొన్న పచ్చి కంకి దశలో ఉనట్లయితే కంకులను కోసి పచ్చి కంకులుగా అమ్ముకోవాలి.అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో వరి పంటలో అగ్గి తెగులు, గింజమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. కావున తెగుళ్ళ ఉధృతి గమనించినట్లయితే 1 మి.లీ. ్ర΄ోపికోనజోల్ లేదా 0.4 గ్రా. టేబుకొనజోల్ + ట్రైఫ్లాక్సిస్త్రోబిన్ లేదా 2.5 గ్రా. ట్రైసైక్లాజోల్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి. పగిలి ΄ోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది.మామిడిలో కాయమచ్చ తెగులు కనిపిస్తే 1 గ్రా. కార్బండజిమ్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరిప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు 5 మి.లీ. డైకోఫాల్ లేదా 1 మి.లీ. స్పైరోమేసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి (కంకివెన్ను 10 శాతం కన్న తక్కువ ఉన్నప్పుడు మందుల పిచికారీ చేసుకోవాలి. కంకివెన్ను 10 శాతం కన్నా ఎక్కువ పైకి వచ్చినట్లయితే మందుల పిచికారీ చేస్తే దిగుబడి తగ్గుతుంది).వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు, ఎసిఫేట్ + ఇమిడాక్లోప్రిడ్: 1.5గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకడానికి అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లాజోల్ 0.5 గ్రా. లేదా ఐసో ప్రోథైయోలిన్ 0.5 మీ.లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరిలో కాండం తొలిచే పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకి 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మి. లీ. క్లోరాంట్రానిలిపోరల్ లేదా 0.5 మి.లీ. టెట్రానిలి్ర΄ోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణంలో వరికి జింక్ ధాతువు లోపం రావటానికి అనుకూలం. నివారణకు 2గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.మొక్కజొన్నప్రస్తుత వాతావరణ పరిస్థితులు (భూమిలో ఎక్కువ తేమ) మొక్కజొన్నలో బాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 4 కి.గ్రా. బ్లీచింగ్ పొడి (35 % క్లోరిన్ కలిగిన) మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచేటట్లు పోయాలి.పూత అనంతరం ఎండు తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు 1 గ్రా. కార్బండజిమ్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచేలా పోయాలి.మేడిస్ అకుమాడు తెగులు ఆశంచడానికి అనుకూలం. నివారణకు, 2.5గ్రా. మ్యంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.కత్తెర పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు 0.4 మి.లీ. క్లోరంట్రానిలి్ర΄ోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నం, 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవాలి.వంగప్రస్తుత వాతావరణ పరిస్థితులు వంగలో కొమ్మ, కాయతొలిచే పురుగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు ఎకరానికి 10–15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను తుంచి 10,000 పి.పి.యమ్ వేపనూనెను 3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 0.25 మి.లీ. ఫ్లూబెండమైడ్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రినిలిపోరల్ పిచికారీ చేయాలి.మిరపప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో జెమిని వైరస్ (ఆకుముడత) తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు.. వ్యాధి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలం లో కలుపు మొక్కలను నివారించాలి. n పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8–10 చొప్పున అమర్చాలి.నివారణకు 1.5 మి.లీ. పైరాప్రాక్సిఫెన్ లేదా 1.0 మి.లీ. పైరాప్రాక్సిఫెన్ + ఫెన్ ప్రోపాత్రిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.కొమ్మ ఎండు, కాయకుళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 1 మి.లీ.ప్రోపికోనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.నల్ల తామర పురుగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు, 2 మి.లీ. సైంట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.టమాటప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో పొగాకు లద్దె పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు, 1మి.లీ. నోవల్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ∙ఫ్యుజేరియం ఎండు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొదళ్ల చుట్టూ ΄ోయాలి.తీగజాతి కూరగాయలుప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయల పంటలలో పండు ఈగ ఆశించడానికి అనుకూలం. నివారణకు 2 మి.లీ. మలాథియాన్ లేదా 2 మి.లీ ప్రోఫెనోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడితరచుగా పండు ఈగ గమనించే మామిడి తోటల్లో కాయ అభివృద్ధి దశ నుంచి పక్వానికి వచ్చే దశలో పాటించవలసిన యాజమన్య పద్దతులు: తోటలను శుభ్రంగా ఉంచాలి పండు ఈగ సోకిన కాయలను / పండ్లను ఏరి నాశనం చేయాలి. 10,000 పి.పి. యం వేప నూనెను పిచికారీ చేయాలి. పండుఈగ ఎరలను (2 మి.లీ. మలాథియాన్ + 2 మి.లీ. మిథైల్ యూజినాల్ మందును లీటరు నీటికి కలిపి) ఒక్కొక్క ప్లాస్టిక్ కంటైనర్ లో 200 మి.లీ. ఉంచి ఎకరాకి 6 చొప్పున చెట్టు కొమ్మలకు వేలాడదీయాలి. ఎకరాకి 40 పసుపు రంగు జిగురు అట్టలు అమర్చుకోవాలి.– డా. పి. లీలా రాణి, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమి)– అధిపతి, వాతావరణ ఆధారిత వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఎఆర్ఎస్, పిజెటిఎయు, రాజేంద్రనగర్. (చదవండి: 'క్లైమేట్ ఎమర్జెన్సీ': ఇలాంటప్పుడు ఈ సిరి ధాన్య పంటలే మేలు..!) -
అకాలవర్షంతో నష్ట నివారణకు ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు
అకాల వర్షాలు విరుచుకుపడటంతో గత రెండు, మూడు రోజులుగా అనేక చోట్ల అనేక పండ్ల తోటలకు నష్టం జరిగింది. ఈ తోటల్లో పునరుద్ధరణకు, నష్ట నివారణకు సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ సూచనలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.. మామిడివీలైనంత వరకు అకాల వర్షపు నీటిని 24 గంటల లోపు తోట బయటకు పంపాలి. అదే విధంగా నీరు నిలిచిపోయే పరిస్థితులను నివారించడానికి ఎతైన కట్టలతో సరైన పారుదల సౌకర్యాన్ని అందించాలి.గాలికి దెబ్బతిన్న కొమ్మలను కత్తిరించి కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఒక లీటర్ నీటికి 20గ్రా. కలిపి పేస్ట్ లాగ చేసి పూయాలి.రాలిపోయిన పండ్లను చెట్ల కింద నుంచి సేకరించి దూరంగా వేసి, నాశనం చేయాలి. వీటిని అలాగే వదలివేయటం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మామిడికి ప్రస్తుతం పక్షి కన్ను తెగులు వచ్చే అవకాశం ఉంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటర్ నీటికి 3 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా బాక్టీరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, స్ట్రె΄్టోమైసిన్ సల్ఫేట్ 0.5 గ్రా. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.పండ్ల పరిమాణం పెరగడానికి ఒక లీటర్ నీటికి కెఎన్03ను 10 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.కాయలకు పగుళ్లు రాకుండా ఉండటానికి ఒక లీటర్ నీటికి బోరాన్ను 1.25 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.కాపర్ ఆక్సీక్లోరైడ్, స్ట్రెపోటోమైసిన్ సల్ఫేట్, కెఎన్03, బొరాన్.. ఈ నాలుగింటిని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు.ప్రస్తుతం తడి వాతావరణం వల్ల పండు ఈగ కాయల్లో గుడ్లు పెట్టే అవకాశం ఉంది.నివారణకు మిథైల్ యూజీనాల్ (ఎర) ఉచ్చులను ఎకరానికి 10–20 అమర్చు కోవాలి.చెట్టుపైన మామిడి పండ్లను సంచులతో కప్పితే ఎగుమతికి అవసరమైన నాణ్యమైన పండ్లను పొందవచ్చు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుటమాటకాయలకు పగుళ్లు వచ్చే అవకాశం ఉన్నందున బొరాక్స్ ఒక లీటర్ నీటికి 2 నుండి 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి.పూత దశలో ఉంటే, పూత రాలి పోకుండా ఉండటానికి పోలానోఫిక్స్ ఒక మి.లీ., 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.సూక్ష్మ పోషక మిశ్రమాన్ని ఒకలీటర్ నీటికి 5గ్రా. కలిపి పిచికారి చేయాలి.పసుపువర్షాల వల్ల ఆరబెట్టిన పసుపు తడిసి΄ోయే ప్రమాదం ఉంది. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ షీట్స్ను కప్పడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ మరియు సుగంధద్రవ్య మొక్కలు:శ్రీమతి కృష్ణవేణి – 9110726430పసుపు : శ్రీ మహేందర్ : 94415 32072మిర్చి : శ్రీ నాగరాజు : 8861188885 -
Avocado: పోషకాల పండు.. లాభాలు మెండు
విదేశీ పంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడా ఇస్తున్నాయి. గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడý, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఔషధ గుణాలు, పోషకాలు అధికం అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టìకేడి–1, హోస్ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న అవకాడోకు శాస్త్రీయ నామం లేదు. దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు. ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వెరైటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాస్త్రీయ నామంతో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త,ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
స్ప్రే డ్రైడ్ అవొకాడో పౌడర్..!
అవొకాడో పండులో పౌష్టిక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా మెండుగా ఉన్నాయి. ఇది సీజనల్ ఫ్రూట్. కొద్ది నెలలే అందుబాటులో ఉంటుంది. ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు కాబట్టి, పొడిగా మార్చి పెట్టుకుంటే.. ఏడాదంతా వాడుకోవచ్చు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చరల్ రీసెర్చ్ పండ్ల పరిశోధనా విభాగం అధిపతి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. జి. కరుణాకరన్, తదితర శాస్త్రవేత్తలు అవొకాడోపై విస్తృత పరిశోధన చేస్తున్నారు. ఐఐహెచ్ఆర్ అవొకాడో పండును ప్రీసెసింగ్ చేసి స్ప్రే డ్రయ్యింగ్ పద్ధతిలో పొడిగా మార్చే సాంకేతికతను రూపివదించింది. అత్యంత నాణ్యమైన అవొకాడో పొడిని ఉత్పత్తి చేయటం ఈ సాంకేతికత ద్వారా సాధ్యమవుతుంది. గది సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తే ఈ పొడి మూడు నెలల పాటు నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. అవొకాడో పండును ఏడాది పొడవునా నిల్వ చేయటం కష్టం. అయితే, ఈ పొడిని నిల్వ చేయటం, రవాణా చేయటం సులభం. ఈ ఉత్పత్తికి మన దేశంలో, విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. రూపాయి పెట్టుబడి పెడితే 1.78 రూపాయల ఆదాయాన్ని పొందటానికి స్ప్రే డ్రయ్యింగ్ సాంకేతికత ఉపయోగపడుతుందని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఆసక్తి గల ఆహార పరిశ్రమదారులు ఐఐహెచ్ఆర్కు నిర్దేశిత ఫీజు చెల్లించి ఈ సాంకేతికతను పొంది అవొకాడో పొడిని తయారు చేసి అనేక ఉత్పత్తుల్లో వాడుకోవచ్చు లేదా దేశ విదేశాల్లో విక్రయించుకోవచ్చు. ఇతర వివరాలకు.. ఐఐహెచ్ఆర్ వెబ్సైట్ చూడండి. (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!
ఇంటిని పచ్చని పంటలు, మొక్కలతో నందన వనంగా మార్చిన విశ్రాంత ప్రధానోపాధ్యాయిని ఆహారమే ఆరోగ్యం అనే సూత్రాన్ని నమ్మి.. ఇంటినే ఆరోగ్యదాయక పంటలు, మొక్కలతో నందన వనంగా మార్చారు మచిలీపట్నానికి చెందిన ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుని. ఆమే ఎండీ ముంతాజ్బేగం.కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హైనీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిగా 2019లో ముంతాజ్బేగం ఉద్యోగ విరమణ చేశారు. సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి దోహదం చేస్తుందని ఆమె ఆచరణాత్మకంగా చాటి చెబుతున్నారు. తాను మొదట ఆచరించి, తర్వాత ఇతరులకు చెప్పాలన్నా వ్యక్తిత్వం ఆమెది. ఇంటి నుంచి వచ్చే చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేసి పెంచుతూ అధిక ఫలసాయాన్ని పొందుతున్నారు. మునగాకు, బెల్లం కలిపి నీళ్లలో నానబెట్టి మొక్కలకు పోయటం.. పొగాకును నీళ్లలో వేసి రెండు, మూడు రోజులు నానబెట్టి మొక్కల వేర్లకు వేస్తే మట్టి ద్వారా వచ్చే తెగుళ్లు నివారించవచ్చని ఆమె తెలిపారు. పెసలు, మినుము, ఉలవలు, బార్లీ, నువ్వులు నానబెట్టి గ్రైండ్ చేసి నీళ్లలో కలిపి మొక్క వేళలో వేస్తే, మంచి దిగుబడి వస్తుందని ఆమె చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నారు. ఆరోగ్యదాయకంగా పెంచుకున్న కూరగాయలు, పండ్లు తింటే ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చని ఆమె ఘంటాపధంగా చెబుతున్నారు. సేంద్రియ ఇంటిపంటలు ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.మానసిక, శారీరక ఆరోగ్యంముంతాజ్ ఇంటి ఆవరణలో, మిద్దెపై ఎన్నో రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతూ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవటంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మొక్కలను సంరక్షిస్తే మానసిక, శారీరక ఆరోగ్యం పొందవచ్చునని ఆమె చెబుతున్నారు. మామిడి, జామ, అరటి, డ్రాగన్, చెర్రీ, వాటర్ యాపిల్, నేరేడు, అంజూర, ఫ్యాషనఫ్రూట్, పీ నట్ బటర్, బొప్పాయి పండ్ల మొక్కలతో పాటు ΄పాలకూర, చుక్కకూర, ఆకుకూరల మొక్కలతోపాటు వంగ, టమాట, అలసంద, మునగ, అరటి, మల్బరీ ఆకులతోపాటు వంద రకాల క్రోటస్ను ఆమె తమ ఇంటి ఆవరణలో, మేడపైన పెంచుతున్నారు. మొక్కలే ప్రాణం.. ఇంటిపంటల ధ్యానం!మొక్కలే ప్రాణంగా ప్రతి రోజు నా దినచర్య ఉంటుంది. రోజు మూడు, మూడున్నర గంటలు వీటి సంరక్షణ కోసం వెచ్చిస్తుంటాను. మొక్కలను సంరక్షిస్తే సమాజం ఆరోగ్యం బాగుంటుందని, భవిష్యత్తు మన చేతిలోనే ఉందనేది అందరికీ తెలియజేయాలనేదే నా తపన. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తొక్కలు, ఇతర సేంద్రియ చెత్తను మునిసి΄ాలిటీ వారికి ఇవ్వకుండా, ఇంటిపట్టునే కం΄ోస్టు ఎరువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. నర్సరీ నుంచే పిల్లలకు మొక్కలను పెంచటంపై అవగాహన కల్పిస్తే మంచి భవిష్యత్తు సమాజాన్ని సృష్టించుకోవచ్చు. – ఎండీ ముంతాజ్ బేగం, ఇంటి పంటల సాగుదారు, విశ్రాంత ప్రధానోపాధ్యాయిని, మచిలీపట్నం – అంబటి శేషుబాబు, సాక్షి, చిలకలపూడి (మచిలీపట్నం). (చదవండి: ఎదురు లేని వెదురు) -
‘మన పంటలు – మన వంటలు’ మూడు రోజుల సదస్సు
మారుతున్న వాతావరణం నేపథ్యంలో ‘మన పంటలు – మన వంటలు’ అనే శీర్షికతో అనంతపురంలోని పోలిస్ కళ్యాణ మండపంలో ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహించనున్నట్లు అనంత సుస్థిర వ్యవసాయ వేదిక కన్వీనర్ డా. వై.వి. మల్లారెడ్డి తెలిపారు. ఆహారమే ఆరోగ్యం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు.. వర్షాధార ప్రకృతి వ్యవసాయంలో పంటలు, వంటల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మూడు రోజులూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 23 (ఆదివారం) న ఉ.10.30 గం.కు డా. ఖాదర్ వలి ప్రసంగం ఉంటుందన్నారు. 20 స్వచ్ఛంద సంస్థలు కలసి వరుసగా రెండో ఏడాది ఈ సదస్సులు నిర్వహిస్తుండటం విశేషం. 22,23 తేదీల్లోబయోచార్పై శిక్షణ వ్యవసాయ వ్యర్థాలతో బయోచార్ (బొగ్గు పొడి)ని తయారు చేసి పొలంలో తగిన మోతాదులో చల్లితే భూసారం పెరుగుతుంది. ఈ విషయమై రైతులకు లోతైన అవగాహన కల్పించటం కోసం ఘట్కేసర్ సమీపంలోని పిట్టల ఆర్గానిక్ ఫామ్ (ఎన్ఎఫ్సి నగర్ – అంకుష్పుర్ మధ్య)లో జరగనుంది. ప్రసిద్ధ బయోచార్ నిపుణులు డా. నక్కా సాయిభాస్కర్ రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు పిట్టల శ్రీశైలం తెలిపారు రు. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇతర వివరాలకు.. 70137 84740 నెంబర్ను సంప్రదించవచ్చు. చదవండి: డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. అవొకాడో పండ్ల తోటలు సాగు ఎలా చెయ్యాలి? -
Avocado డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. సాగు ఎలా చెయ్యాలి?
మన దేశంలో పట్టణ ప్రాంత ప్రజల్లో ఆహార – ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రకాల దేశ, విదేశీ జాతుల పండ్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. అందులో ఒకటి అవొకాడో. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి. కరుణాకరన్ మాటల్లో చెప్పాలంటే.. అవొకాడో, డ్రాగన్ సహా పన్నెండు రకాల దేశ, విదేశీ ఖరీదైన పండ్ల జాతుల సాగు విస్తీర్ణం మన దేశంలో గత మూడేళ్లుగా పెరుగుతోంది. ఈమొక్కలకు గిరాకీ 30% పెరిగింది. పరిమిత నీరు, పోషకాలు, శ్రమతో సాగు చేయడానికి అవకాశం ఉండటం.. ధాన్యపు పంటలతో పోల్చితే అధికాదాయం రావటం.. యాంత్రీకరణకు అనుకూలం కావటం.. పౌష్టిక విలువలతో కూడిన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం.. మార్కెట్లో డిమాండ్ ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. అయితే, అవొకాడో పండ్ల తోటలు ఏయే భూముల్లో సాగు చెయ్యాలి? ఏయే రకాలు అనువైనవి? వంటి ప్రశ్నలకు సమాధానాలు డా. కరుణాకర్ మాటల్లోనే చదవండి.అవొకాడో సాగు మనకు కొత్తది కాదు. 70 ఏళ్లుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, సిక్కిం, మహారాష్ట్రల్లో సాగవుతోంది. అయితే, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అవొకాడో తోటలను తామర తంపరగా నాటుతున్నారు. గత మూడేళ్లలోనే 8–10 లక్షల అవొకాడో మొక్కలు నాటారు. ఉష్ణమండలం, తేమ ఎక్కువగా ఉండే ఉప–ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ పెరిగే లక్షణం దీనికి ఉన్నప్పటికీ, తగిన వాతవరణం, నేలల గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవలసిందిగా రైతులను కోరుతున్నాను. 18–33 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు, 700–1500 ఎం.ఎం. వర్ష; ఉన్న ప్రాంతాలు.. 5.5 - 8 వరకు ఉదజని సూచిక (పిహెచ్) ఉన్న భూములు అనుకూలం. మొక్కలు నాటిన 5 ఏళ్లకు పూర్తిస్థాయి దిగుబడినిచ్చే స్థితికి పెరుగుతుంది. ప్రస్తుతం మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. అందుకే రైతులు, వ్యాపారులు, వినియోగదారులు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే, అవొకాడో ఖరీదైన పండు కాబట్టి మిల్క్షేక్, ఐస్క్రీమ్లు, డిసర్ట్ స్వీట్ల తయారీలో మాత్రమే వాడుతున్నారు. మున్ముందు దిగుబడి పెరిగే నాటికి ప్రాసెసింగ్ సదుపాయాలు పెరిగి వేర్వేరు రూపాల్లో వాడకం పెరగాలి. లేదంటే మార్కెట్ పడిపోయే ముప్పు ఉంటుంది. ఇక రైతుల విషయానికొస్తే.. తోటలు నాటేటప్పుడు అది ఏ రకమో తెలియకుండానే, ఏయే నేలలకు సరి;yతుందో తెలుసుకోకుండానే స్థానిక నర్సరీల నుంచి కొనుగోలు చేసిన మొక్కలు నాటుతున్నారు. దీంతో సాగులో చాలా సమస్యలు వస్తున్నాయి.‘హాస్’ రకం మొక్కలు వద్దుబెంగళూరులోని ఐఐహెచ్ఆర్లో 16 రకాల అవొకాడో మొక్కలున్నాయి. మీ భూమి, నీరు, వాతావరణానికి అనువైన రకాన్ని ఎంచుకోవటంపై శ్రద్ధ పెడితే విజయం సాధించవచ్చు. అర్క సుప్రీం, అర్క రవి, లాంబ్ హాస్, పింకర్టన్ రకాలు మేలైనవి. చాలా మంది హాస్ రకం సాగు చేస్తున్నారు. ఇది మనకు సూట్ కాదు. నెర్రెలిచ్చే భూముల్లో వద్దుఅవొకాడో చాలా సున్నితమైన పంట. నీటి నిల్వను అసలు తట్టుకోలేదు. అవొకాడోకే కాదు ఏ పండ్ల తోటలకైనా ఎండా కాలం నెర్రెలిచ్చే నల్లరేగడి నేలలు పనికిరావు. వేర్లు తెగి΄ోతాయి. నీరు నిలవని, బాగా గాలి సోకే ఎర్ర గరప నేలలు (రెడ్ శాండీ సాయిల్) మేలు. 40% ఇసుక కలిసిన చెరువు మట్టిలో కూడా బాగా పెరుగుతుంది. బంక మట్టి నేల (క్లే సాయిల్) అసలు పనికిరాదు. ఈ నేలలో సాగు చేయాలంటే... 4x3 అడుగుల గుంతల్లో ఎర్ర మట్టిపోసి, మొక్కలు నాటుకోవాలి. పిహెచ్ సమతుల్యంగా ఉండాలి. నీటిలో ఈసీ 1 కన్నా ఎక్కువ ఉంటే సరిగ్గా పెరగదు. అందుకని, అవొకాడో మొక్కలు నాటే ముందు మట్టి, నీటి పరీక్షలు చేయించి ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకోవాలి.పిహెచ్ 7 కన్నా ఎక్కువ ఉంటే, కాల్షియం కార్బొనేట్ 20% కన్నా ఎక్కువ ఉన్న నేలలు అనుకూలం కాదు. నీరు తగుమాత్రంగా ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఐరన్ లభ్యత సమస్య వస్తుంది. నీటి ఉప్పదనం 2% కన్నా ఎక్కువ ఉంటే పనికిరాదు. క్లోరైడ్ సాంద్రత ఎక్కువగా ఉన్న నేలలకు తగిన రకాల మొక్కలను ఎంపిక చేసుకోవాలి.ఏటా రెండు సీజన్లుఅవొకాడో పూత వచ్చిన తర్వాత 120–150 రోజుల్లో పండ్లు కోతకు వస్తాయి. ఏప్రిల్–జూలై, అక్టోబర్– ఫిబ్రవరి సీజన్లలో రెండు దఫాలుగా పండ్ల దిగుబడి వస్తుంది. విత్తనం నాటితే 5–6 ఏళ్లలో, అంటు మొక్కలు నాటితే 3–4 ఏళ్లలో కాపుకొస్తాయి. చెట్టుకు 100 నుంచి 500 కాయలు కాస్తాయి. కాయలు పక్వానికి వచ్చినా చెట్టు మీద గట్టిగానే ఉంటాయి. కోసిన తర్వాత మెత్తబడతాయి. ముదురు రంగులోకి మారితే పక్వానికి వచ్చినట్లు గుర్తించి కోయాలి. పక్వ దశను గుర్తించడానికి ఇతర దేశాల్లో చిన్న΄ాటి యంత్రాలను వాడుతున్నారు. మన శరీర ఉష్ణోగ్రతను సెన్సార్లతో గుర్తించే పరికరంతోనే అవొకాడో పక్వ దశను తెలుసుకోవచ్చు. 24% ఆర్గానిక్ కంటెంట్ ఉన్న దశలో పండును కోయాలి. కాయ కోసిన తర్వాత రంగు మారుతుంది. అవొకాడోతో ఒక ఉపయోగం ఏమిటంటే పండు పక్వానికి వచ్చిన తర్వాత కూడా మార్కెట్ ధర లేకపోతే చెట్టు మీదే 1–2 నెలల వరకు కాయ కోతను వాయిదా వేసుకోవచ్చు! ముందుగా/ఆలస్యంగా కోతకు రావటం.. మంచి సువాసనతో అధిక గుజ్జు ఉండటం.. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం.. మార్కెట్లో గిరాకీ ఉండటం.. కోసుకు తినటానికి లేదా ప్రాసెసింగ్కు అనువుగా ఉండటం.. వంటి అనేక అంశాలను పరిశీలించి అవొకాడో సాగుచేసే రకాలను ఎంపిక చేసుకోవటం కీలకం. మరికొన్ని మెళకువలుసముద్రతలం నుంచి 1,000 మీటర్ల ఎత్తుగల ప్రదేశాల్లో వెస్ట్ ఇండియన్ అవొకాడో వెరైటీలను నాటుకోవాలి. వీటి కొమ్మలు, విత్తనాల ద్వారా మొక్కలు తయారు చేసుకోవచ్చు. మొదటి 5 ఏళ్లూ మధ్యాహ్నపు ఎండ నుంచి మొక్కల్ని కాపాడాలి. 5 ఏళ్ల వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ పూత, కాతను ఉంచకూడదు. తీసెయ్యాలి. 5 మీ.“ 5 మీ. సైజులోగొయ్యి తవ్వి, అది 3 నెలలు ఎండిన తర్వాత మొక్కలు నాటుకోవాలి. అవొకాడో పండ్లను ప్రాసెస్ చేసి అనేక ఉత్పత్తుల తయారు చేయటం, స్ప్రే డ్రయ్యింగ్ ద్వారా పొడిని తయారు చేసే టెక్నాలజీని ఐఐహెచ్ఆర్ రూపొందించింది. విలువ జోడించి ఉత్పత్తులు అమ్ముకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది.5 అడుగుల ఎత్తు మడులపై మొక్కలు నాటాలి అవొకాడో 2 – నీరు నిలవని ఎర్ర గరప నేల (రెడ్ శాండీ సాయిల్)లో అవొకాడో చెట్టు చక్కగా పెరుగుతుంది. బంక మన్ను (క్లే సాయిల్) దీనికి సరిపడదు. ఐఐహెచ్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. కరుణాకరన్ ఈ విషయాన్ని ఈ చిత్రంలో చక్కగా చె΄్పారు. బంక మన్ను నేలలో అవొకాడో సాగు చేయదలిస్తే 4 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పున గొయ్యి తీసి, ఆ గోతిలో 90% వరకు ఎర్ర గరప మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపి సాగు చేయవచ్చని ఆయన తెలిపారు. గుంతలో సగం వరకే ఎర్ర గరప మట్టిని నింపితే.. చెట్టు కొన్ని సంవత్సరాలు పెరిగిన తర్వాత వేర్లు బంకమన్నులోకి విస్తరించినప్పుడు పోషకాలు, నీరు అందక (చిత్రంలోచూపిన విధంగా) నిలువునా ఎండిపోతుందని వివరించారు. అవొకాడో చాలా సున్నితమైన పంట. వేరుకుళ్లు బెడద ఉంటుంది. అవొకాడో మొక్కల్ని (ఆ మాటకొస్తే ఏ పండ్ల తోటైనా) 5 అడుగుల ఎత్తుమడి (రెయిజ్డ్ బెడ్) పైనే నాటుకోవాలి. ట్రాక్టర్తో అంతర సేద్యం చేసినా బెడ్ దెబ్బతినదు. సాళ్ల మధ్య వర్షపు నీరు బయటకు త్వరగా వెళ్లిపోవటానికి కందకం తియ్యాలి. ఇజ్రాయెల్, సౌతాఫ్రికాలో కూడా ఎత్తుమడులపైనే నాటుతారు.5 అడుగుల ఎత్తు మడులపై మొక్కలు నాటాలి.థాంక్స్ టు ‘టొక్సోడాన్’!అవొకాడో.. అమెజాన్, మెక్సికన్ అటవీ ప్రాంతాల్లో నివసించే భారీ శాకాహార జంతువు ‘టొక్సోడాన్’కు పండ్లు తినే అలవాటుంది. అయితే, దానికి ఏ పండూ సరిగ్గా నచ్చేది కాదు. అవొకాడో పండు టొక్సోడాన్కు తెగ నచ్చేసిందట. అందులో పుష్కలంగా ఉండే మోనో అన్ శాచ్యురేటెడ్ ఫాటీ యాసిడ్సే అందుకు కారణమట. ఇందులో 20% కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైనదే కాకుండా ‘సంతృప్తినిచ్చేది’ కూడానట! అందుకే దీనికి ‘వెన్న పండు’ అని పేరు. ఆ విధంగా దీని గొప్పతనాన్ని జనానికి తెలిసేలా చేసినందుకు టొక్సోడాన్కి థాంక్స్ చెప్పాలి అన్నారు ఐఐహెచ్ఆర్ (బెంగళూరు)లో పండ్ల పరిశోధనా విభాగాధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. జి. కరుణాకరన్! అదేవిధంగా, 1950లలో కూర్గ్, వయనాడ్ ప్రాంతాల్లో టీ ఎస్టేట్ల యజమానులు వ్యాహ్యాళికి వెళ్తూ పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్లేవారు. దారి పక్కన చెట్ల కింద రాలినపడి ఉన్న అవొకాడో పండ్లను కుక్కలు ఇష్టంగా తినటం గమనించారు. అప్పటి వరకు ఇవి తినదగిన పండ్లని చాలా మందికి తెలియదు. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశంలో ‘డాన్ ఆఫ్ ఫ్రూట్స్’ అయ్యింది! -నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఇంటర్ ఫెయిలైన రైతు ఆవిష్కరణ.. ఎస్కె–4 పసుపు!
చేసే పని మీద శ్రద్ధాసక్తులు మెండుగా ఉంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని నిరూపించే విజయగాథ రైతు శాస్త్రవేత్త సచిన్ కమలాకర్ కారేకర్ది. పన్నెండో తరగతి ఫెయిల్ అయ్యి వ్యవసాయం చేపట్టిన సచిన్ శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడినిచ్చే ఒక చక్కని పసుపు వంగడాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరు ‘ఎస్కె–4’. ఈ వంగడం సచిన్కు ఉత్తమ ప్లాంట్ బ్రీడర్గా, గొప్ప ఆవిష్కర్తగా కీర్తితోపాటు జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఎస్కె–4 పసుపు రకాన్ని ఇప్పుడు 13 రాష్ట్రాల్లో సాగు చేస్తుండటం విశేషం. తాను పండిస్తున్న పసుపు పంటలో మెరుగైన ఫలితాలనిస్తున్న మొక్కల్ని వేరే చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు శ్రద్ధగా కొనసాగించిన ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ కొత్త వంగడాన్ని ఆయన రూపొందించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ స్థాయి ద్వితీయ ఆవిష్కర్త పురస్కారాన్ని అందుకున్నారు. ఔషధ విలువలకు పెట్టింది పేరైన పసుపు పంటకు సంబంధించి దేశవ్యాప్తంగా 30 వంగడాలు సాగులో ఉన్నాయి. మహారాష్ట్రలో రైతులు 70% విస్తీర్ణంలో రాజపురి సేలం వెరైటీని సాగు చేస్తుంటారు. ఇది 20 రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నప్పటికీ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో ఎక్కువగా సాగవుతోంది. 2022–23లో మన దేశంలో 11.61 లక్షల టన్నుల పసుపు పండింది. పసుపునకు సంబంధించి ప్రపంచంలోనే భారత్ అత్యధిక ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారు కూడా!సచిన్ కమలాకర్ కరేకర్ (48) స్వస్థలం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అబ్లోలి అనే గ్రామం. చిప్లన్కు 55 కి.మీ. దూరంలో ఈ ఊరు ఉంది. సచిన్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత 22 ఏళ్ల వయసు నుంచి గత 26 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 500 వక్క చెట్లు, 50 కొబ్బరి చెట్ల మధ్య పసుపును అంతరపంటగా సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రూపొందించాలన్న ఆకాంక్ష మొదటి నుంచే ఆయనకు ఉంది. నచ్చిన గుణగణాలున్న మొక్కల్ని ఏటేటా వేరుగా సాగు చేస్తూ కొత్త పసుపు వంగడాన్ని ఆవిష్కరించారు. దీన్నే క్లోనల్ సెలక్షన్ మెథడ్ అంటారు.1998 నుంచి కొత్త వంగడంపై కృషిసచిన్ తన సేద్య ప్రయాణం గురించి ఇలా చెప్పుకొచ్చారు.. ‘1998లో నేను ఒక స్థానిక పసుపు రకాన్ని సాగు చేయటం ప్రాంభించాను. పొలంలో కొన్ని మొక్కల పంట కాలం మిగతా వాటికన్నా ముందుగానే ముగుస్తున్నట్లు గుర్తించాను. ఆ మొక్కలు చాలా ఏపుగానూ పెరిగాయి. అట్లా మెరుగ్గా కనిపించిన మొక్కల దుంపలను వెలికితీసి, విడిగా ఉంచాను. ఆ పసుపు దుంపలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ముదురు రంగులో ఆకర్షణీయంగానూ, చీడపీడలను దీటుగా తట్టుకొని బాగా పెరిగాయి. అధిక దిగుబడి కూడా వచ్చింది. అదే విధంగా ఆ మొక్కల్ని ప్రతి ఏటా సాగు చేస్తూ, మెరుగ్గా ఉన్న మొక్కల పసుపు కొమ్ముల్ని నాటి, మళ్లీ వాటిలో నుంచి మంచి వాటిని ఏరి తర్వాత ఏడాది సాగు చేయటం 2007 వరకు కొనసాగించాను. 2008 నాటికి నాకు నచ్చిన (త్వరగా కోతకు రావటం, ఏపుగా చీడపీడలను తట్టుకొని పెరగటం, అధిక దిగుబడి, దుంప రంగు బాగుండటం.. వంటి) మంచి గుణగణాలున్న మెరుగైన కొత్త వంగడం సిద్ధమైంది. దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, దానికి ఎస్కె–4 అని పేరు పెట్టాను.’కుక్కుమిన్ 4%పచ్చి పసుపు హెక్టారుకు 55–56 టన్నుల దిగుబడినిచ్చే వంగడం ఇది. చాలా ఆకర్షణీయంగా ముదురు ఎరుపు–పసుపు రంగు. దీని పంటకాలం 160–170 రోజులు. అధిక వర్షపాతం గల ప్రాంతానికి అనువైనది. దుంపకుళ్లు తెగులును, ఆకు మచ్చ తెగులును తట్టుకునే గుణం దీనికి ఉంది. నేషనల్ ఇన్నేవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ఈ వంగడాన్ని గుర్తించి 2020 ఖరీఫ్లో ప్రయోగాత్మకంగా దపోలిలోని డాక్టర్ బాలసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ (డిబిఎస్కెకెవి) ఆవరణలో సాగు చేయించింది. హెక్టారుకు పచ్చి పసుపు 56 టన్నుల అధిక దిగుబడి వచ్చింది. 28 రకాల కన్నా ఎస్కె–4 రకం అధిక దిగుబడినిచ్చింది. ఈ పసుపులో కుర్కుమిన్ 4% ఉంది. దీంతో ఈ రకం పసుపు విత్తనాన్ని పరిసర జిల్లాల్లోని రైతులకు సచిన్ ఇవ్వటం ప్రారంభించారు. ఆ రైతులకు కూడా మంచి దిగుబడి వచ్చింది. ఆ విధంగా ఈ రకం పసుపు సాగు 2021 నాటికే ఎస్కె–4 రకం మహారాష్ట్రలో లక్ష ఎకరాలకు విస్తరించింది. దీంతో పొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ –2001 కింద ఈ సరికొత్త వంగడానికి సంబంధించి సచిన్కు ప్రత్యేక జన్యు హక్కులు ఇవ్వమని కోరుతూ ఎన్ఐఎఫ్ దరఖాస్తు చేసింది.ఎస్కె–4 పేరు ఎందుకొచ్చింది?తన ఆవిష్కరణకు మూలమైన స్థానిక వంగడం సంగ్లి కడప వెరైటీ స్పెషల్ కొంకణ్ను ఇచ్చింది షెండ్గే కాక అనే రైతు. అందుకని కొత్త వంగడానికి మొదటి అక్షరం ఆయనది, రెండో అక్షరం తనది కలిపి ఎస్కె–4 అని పేరు పెట్టారు. డిబిఎస్కెకెవికి చెందిన ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రఫుల్ల మలి మాట్లాడుతూ.. మేం ఈ రకాన్ని రెండేళ్లు వరుసగా సాగు చేసి చూశాం. రాజేంద్ర సోనా అనే రకం మాదిరిగా ఇది కూడా అధిక దిగుబడినిచ్చే రకమని రుజువైంది.రాజేంద్ర సోనా హెక్టారుకు 64 టన్నుల దిగుబడినిచ్చేదైనప్పటికీ దాని విత్తనం అందుబాటులో లేదు. అందువల్ల ఎస్కె–4 రకం ప్రత్యామ్నాయంగా అధిక వర్షపాతం నమోదయ్యే కొంకణ్ ్ర΄ాంతానికి ఇది అనువైనదిగా గుర్తించాం. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో దీని పనితీరు ఎలా ఉంటుందో ఇంకా పరీక్షించాల్సి ఉంది అన్నారు. సింద్దుర్గ్, రాయ్గడ్, రత్నగిరి జిల్లాల్లో చాలా మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. గుహగర్ తాలూకా వేలాంబ్ గ్రామానికి చెందిన విశ్రాం మలి (58) అనే రైతు గత ఏడాది ఈ పంటను సాగు చేయగా ఒక మొక్క కుదురులోని పసుపు 8.15 కిలోల బరువు తూగింది!నర్సరీ పెంచి నాట్లు వేయటం మేలుడాక్టర్ ప్రఫుల్ల మలి ఇంకా ఇలా చెప్పారు.. ఏప్రిల్లో నర్సరీ బ్యాగుల్లో పసుపు విత్తనం పెడతాం. జూన్లో ఆ మొక్కల్ని పొలంలో నాటుతాం. నాట్లకు ముందు సేంద్రియ ఎరువు వేసి పొలాన్ని దుక్కి చేస్తాం. ఆగస్టులో రెండో దఫా ద్రవ ఎరువును అందిస్తాం. జనవరి ఆఖరు వరకు నీరు ఇస్తుంటాం. ఫిబ్రవరిలో పంట కోత జరుగుతుంది. ప్రతి మొక్కకు సగటున 3.2 కిలోల దుంపలు వస్తాయి. సచిన్ ఈ వంగడాన్ని పదేళ్లుగా రైతులకు ఇస్తున్నారు. దీనితోపాటు దీని యాజమాన్య మెళకువలపై రైతులకు ఆయన తరచూ శిక్షణ ఇస్తున్నారు. పసుపు విత్తనాన్ని నేరుగా పొలంలో నాటే కంటే నర్సరీలో పెంచి నాట్లు వేయటం వల్ల అధిక దిగుబడి వస్తోందని ఇటీవల వరకు గుహాగర్లో వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేసిన గజేంద్ర పానికర్ అంటున్నారు. విత్తనం 500 మందిరైతులకు ఇచ్చానేను కొత్తగా అభివృద్ధి చేసిన ఎస్కె–4 రకం పసుపు విత్తనాన్ని రత్నగిరి, సింధుదుర్గ్, రాయగడ్ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది రైతులకు ఇచ్చాను. కొత్తగా వేసే రైతులు అతిగా ఆశపడి ఈ రకాన్ని మొదటే ఎక్కువ విస్తీర్ణంలో వేయొద్దు. మొదట ఒక గుంట (వెయ్యి చదరపు అడుగులు) లో వేసి చూడండి. తర్వాత పది గుంటలకు పెంచండి. నేనూ అలాగే చేశా. ఇప్పుడు రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నా. ఈ ప్రత్యేక పొలాన్ని చూడటానికి సందర్శకులు వస్తుంటారు.- సచిన్ కమలాకర్ కారేకర్, ఎస్కె–4 పసుపు రకం ఆవిష్కర్త, అబ్లోలి, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ ద్వితీయ పురస్కార గ్రహీత, ఆవిష్కర్తకు ఆరేళ్లపాటు ప్రత్యేక హక్కులు2023లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) నిర్వహించిన ద్వైవార్షిక గ్రామస్థాయి ఆవిష్కరణలు మరియు అసాధారణ సంప్రదాయ విజ్ఞాన పురస్కారాల 11 వ మహాసభలో రైతు శాస్త్రవేత్త సచిన్ కమలాకర్ కారేకర్కు జాతీయ ద్వితీయ పురస్కారం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. ఎన్ఐఎఫ్ గతంలో దరఖాస్తు ఆధారంగా.. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ (పిపివి అండ్ ఎఫ్ఆర్ఎ) 2024 డిసెంబర్లో సచిన్ అభివృద్ధి చేసిన ఎస్కె–4 వంగడానికి ప్రత్యేక వంగడంగా గుర్తింపునిచ్చింది. సచిన్ కమలాకర్ కరేకర్ను ప్లాంట్ బ్రీడర్’గా గుర్తించి ప్రత్యేక హక్కులను ప్రదానం చేసింది. దీని ప్రకారం ఆరేళ్ల పాటు ఈ వంగడాన్ని పండించి, విత్తనాన్ని అమ్ముకునే ప్రత్యేక హక్కు ఆవిష్కర్త అయిన సచిన్కు దఖలుపడింది. నిర్వహణ: పంతంగి రాంబాబు ,సాగుబడి డెస్క్ -
మండే ఎండల్లోనూ ఆరుబయటే పుట్టగొడుగుల పెంపకం!
పుట్టగొడుగులను పెంచడానికి సాధారణంగా పక్కా భవనంలో లేదా సెమీ పర్మినెంట్ షెడ్లను వినియోగిస్తూ ఉంటారు. అయితే, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చర్ రీసెర్చ్ (ఐఐహెచ్ఆర్) ఆరుబయటే ఉంచి సౌర విద్యుత్తుతో పుట్టగొడుగులను పెంచే ఒక ప్రత్యేక పెట్టె వంటి యూనిట్ను రూపొందించింది. ఏప్రిల్, మే నెలల్లో మండే ఎండల్లో కూడా ఈ యూనిట్ ద్వారా రూపాయి కరెంటు ఖర్చు లేకుండా పుట్టగొడుగులు పెంచుకోవచ్చని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఎవాపరేటివ్ కూలింగ్ ప్రిన్సిపల్ ఆధారంగా ఈ ‘అర్క మష్రూమ్ గ్రోయింగ్ యూనిట్’ పనిచేస్తుండటంమే ఇందుకు కారణం. తక్కువ పెట్టుబడి, సులభ నిర్వహణ దీని ప్రత్యేకత ఆకర్షణలు. పుట్టగొడుగులు పెంచే ఈ ఛాంబర్ సైజు: 1.35 “ 0.93 “ 1.69 మీటర్లు. అంటే.. దీన్ని పెట్టుకోవటానికి రెండు చదరపు మీటర్ల స్థలం ఉంటే చాలు. 1’’ సిపివిసి పైపులు, ఫిట్టింగ్లతో దీన్ని తయారు చేశారు. సాధారణ గదుల్లో పుట్టగొడుగులు పెంపకంతో ΄ోల్చితే దీనిలో 51–108% వరకు దిగుబడి పెరిగింది. ఈ యూనిట్ ద్వారా నెలకు 25–28 కిలోల ఎల్మ్ అయిస్టర్, వైట్ మష్రూమ్స్ రకాల పుట్టగొడుగుల్ని పెంచవచ్చని ఐఐహెచ్ఆర్ తెలిపింది.ఈ యూనిట్లో సులభంగా మిద్దె పైన, ఇంటి పెరట్లో కూడా ఎంచక్కా పుట్టగొడుగులు పెంచి, వాటిని పచ్చివి, ఎండువి విక్రయించవచ్చు. వాటితో తయారు చేసిన పోషక విలువలతో కూడిన పొడులను విక్రయించవచ్చు. ఒక్క ఎండు పుట్టగొడుగులు మాత్రమే విటమిన్ డిని అందించగల ఏకైక ఉత్పత్తి అని డా. ఖాదర్వలి వంటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాపార దృష్టితో మిద్దె తోటల్లో లేదా ఇంటిపంటల్లో మేడలపైనే పుట్టగొడుగులు పెంపకాన్ని ప్రారంభించదలచిన వారికి ఈ సోలార్ మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్ వరమని చెప్పవచ్చు. ఫాబ్రికేటర్లు ఇటువంటి యూనిట్లను తయారు చేసి విక్రయించుకోవటానికి అవకాశం ఉంది. ఇతర వివరాలకు.. 90909 49605, 080 – 23086100 (ఎక్స్టెన్షన్ : 348–349)mushroomiihr@gmail.com -
మల్టీపర్పస్ రోబో : పనులన్నీ చక చకా
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అగ్రిహబ్, ఇక్రిశాట్, టిహబ్, ఐఎస్బి, ట్రిపుల్ ఐటి, ఐఐటి హైదరాబాద్, బిరాక్లలో 2017లో ఇంక్యుబేట్ అయిన అగ్రిటెక్ స్టార్టప్ ‘ఎక్స్ మెషిన్స్’. ఈ ఇండియన్ రోబోటిక్స్, ఎఐ కంపెనీ వ్యవస్థాపకుడు త్రివిక్రమ్ కుమార్ డోగ్గా. పటాన్చెరులోని ఇక్రిశాట్లో ఎఐపి బిల్డింగ్ కేంద్రంగా ఎక్స్ మెషిన్స్ రీసెర్చ్ లాబ్ పనిచేస్తోంది. ఎక్స్ మెషిన్స్ రూ పొందించిన కృత్రిమ మేధ ఆధారిత మల్టీపర్పస్ రోబో వ్యవసాయంలో కూలీలు చేసే కలుపుతీత వంటి అనేక పనులను చక్కబెడుతుంది. పంటల సాగులో రసాయనాల వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించటం, శాస్త్రీయ, సుస్థిర వ్యవసాయ సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తేవటం ఎక్స్ మెషిన్స్ లక్ష్యాలు. ప్రెసిషన్ అగ్రికల్చర్ కోసం మల్టీపర్పస్ ఎఐ బేస్డ్ రోబోలను తయారు చేస్తోంది. వ్యవసాయంతో ప్రారంభించి ఇతర పరిశ్రమలకు అవసరమైన ఎఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది. ఈ రోబోలను ఎవరూ నడపాల్సిన అవసరం లేదు. వాటంతట అవే తమ ప్రయాణాన్ని నిర్దేశించుకొని పనిచేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. మిరప, పత్తి, పొగాకు తదితర సాళ్లుగా విత్తే పంట పొలాల్లో అన్ని మొక్కలకూ పురుగుమందుల పిచికారీలు అవసరం ఉండదు. కనీసం 30% మొక్కలకు అవసరం ఉండదని ఎక్స్ మెషిన్స్ సంస్థ అంచనా. చీడపీడల బారిన పడిన మొక్కల్ని ఎఐ టెక్నాలజీతో గుర్తించి వాటిపై మాత్రమే పిచికారీ చేయటం ఈ రోబో ప్రత్యేకత అని చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు గోదాములు, లాజిస్టిక్స్, రక్షణ శాఖ అవసరాలు, ఉత్పత్తి యూనిట్లకు అవసరమైన ఎఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది.చదవండి: ‘మునగరాణి’ : అపుడు ఎన్నో అవహేళనలు..ఇపుడు నెలకు లక్ష రూపాయలు సాంకేతికత: ఎక్స్ 111– మల్టీపర్పస్ రోబోసమస్య: కూలీల కొరత రైతులకు ప్రధాన సవాళ్లలో ఒకటి. దాని అనుబంధ ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. పరిష్కారం: ఈ సవాల్ను అధిగమించడానికి ఎక్స్ మెషిన్స్ రోబోని రూపొందించింది.వ్యవసాయ పంటల్లో కలుపు సమస్య, కూలీల కొరత లేకుండా చేస్తుంది. ఇది విత్తనం వేయటం, నారు పెంపకం, మైక్రో స్ప్రేలు, ఎరువుల పిచికారీ, ఇతర పనులకు సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఇది 8 గంటల సమయంలో 2.5 ఎకరాల్లోని కలుపు మొక్కల్ని తొలగిస్తుంది. -
అపుడు అవహేళనలు.. ఇపుడు నెలకు లక్ష రూపాయలు
పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే పెద్దగా చదువుకోకపోయినా నమ్ముకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పటానికి తమిళనాడుకు చెందిన మహిళా రైతు పొన్నరాసి (Ponnarasi) విజయగాథే ఒక ఉదాహరణ. ఆమెకు 38 ఏళ్లు. నలుగురు పిల్లల తల్లి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. పదో తరగతి మధ్యలో చదువు మానేసింది. పదేళ్లుగా పది ఎకరాల్లో మునగ తోట సాగు చేస్తూ.. తొలుత విత్తనాలు, ఆకులు, మొక్కలు అమ్ముతుండేది. పోటీ ఎక్కువై ఆదాయం తగ్గిపోయింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులను కలిసి సలహా అడిగింది. విత్తనాలు, ఆకులు, మొక్కలు వంటి మునగ ముడి ఉత్పత్తులకు అంత విలువ లేదు. వాటికి విలువను జోడించి.. అంటే, ప్రాసెసింగ్ చేసి రూపం మార్చి.. అమ్మితే మంచి ఆదాయం వస్తుందని చెప్పారు. అదెలా చెయ్యాలో తెలీదు. పెద్దగా చదువు లేదు. అయినా, పట్టుదలతో ముందడుగు వేసి, శిక్షణ పొంది ధైర్యంగా ముందడుగు వేసింది. మునగ సాగు చేస్తూనే మునగ నూనె తదితర ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ వ్యాపారవేత్తగా ఎదిగింది. నాణ్యతా ప్రమాణాలు పాటించటంతో దేశంలో వివిధ ప్రాంతాల నుంచే కాదు అమెరికా, సింగపూర్ వంటి అనేక ఇతర దేశాలకూ మునగ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. ఏటా రూ. 12 లక్షలకు పైగా నికారదాయం సంపాదిస్తూ తోటి రైతులకు, మహిళలకు శిక్షణ కూడా ఇస్తోంది. అందుకే పొన్నరసికి ‘మునగ రాణి’ అని పేరొచ్చింది!తమిళనాడులోని దిండిగల్ ప్రాంతం మునగ సాగుకు పెట్టింది పేరు. అటువంటి రంగంలో నలుగురు బిడ్డల తల్లి అయిన మహిళా రైతు పొన్నరాసి సంచలనమే సృష్టించింది. ‘మా కుటుంబానికి ఉన్న పదెకరాల భూమిలో గత దశాబ్ద కాలంలో నేను మునగ తోట సాగు (Drumstick farming) చేస్తున్నాను. మునగ ఆకులు, విత్తనాలు, వేర్లు అమ్మేవాళ్లం. అయితే, ఈ పని చేసే రైతులు చాలా మంది ఉండటం వల్ల మార్కెట్ దారుణంగా పడిపోయింది. మునగ విత్తనాల కిలో ధర రూ. 5–10కి పడిపోయింది..’ అని ఎటువంటి సంక్షోభ పరిస్థితుల్లో తాను కొత్తగా ఆలోచించి ప్రాసెసింగ్లోకి అడుగు పెట్టిందీ పొన్నరాసి వివరించారు.అటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో కోయంబత్తూరు వెళ్లి, అక్కడి తమిళనాడు వ్యవసాయ కాలేజీలో డాక్టర్ జాన్ కెనడీ అనే శాస్త్రవేత్తను స్వయంగా కలిసి మాట్లాడటమే ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ‘పంటను పండించి, ఎక్కువ దిగుబడి తియ్యటం, పండించిన పంటను ముడి రూపంలో అలాగే ఎంతో కొంతకు అమ్ముకోవటం వల్ల డబ్బులు రావు. ప్రాసెసింగ్ చేసి మునగ నూనె ((Drumstick Oil), పొడి, సౌందర్య సాధనాలను అమ్మితే డబ్బులు వస్తాయి అని జాన్ కెనడీ సార్ చెప్పగా విన్నప్పుడు.. వ్యవసాయం గురించి అప్పటి వరకు నాకు ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఏం చేస్తే గట్టెక్కుతామో అర్ధమైంది..’ అన్నారామె.కిలో మునగ నూనె రూ. 5 వేలుకెనడీ చెప్పిన విషయాలు పొన్నరాసికి బాగా నచ్చాయి. అయితే వాటిని తయారు చేయటం ఎట్లా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే క్రమంలో దిండిగల్ జిల్లాలోనే ఉన్న గాంధీ గ్రామ్ యూనివర్సిటీలో వ్యవసాయ విస్తరణాధికారులు శ్రీకుమారి, శరవణన్లను సంప్రదించింది. మునగ గింజల నుంచి నూనెను వెలికి తీసే పద్ధతులు, యంత్రాలకు సంబంధించిన విషయాలన్నిటినీ తెలుసుకుంది. మునగ గింజల నుంచి తీసే నూనె కిలో రూ. 5 వేలు పలుకుతుందని పొన్నరాసికి తెలిసింది అప్పుడే. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సహకారం కూడా తీసుకొని ముందడుగు వేసింది. ఆ విధంగా వ్యవసాయం తప్ప వ్యాపారం తెలియని ఆమె జీవితంలో 2019లో వ్యాపారఅధ్యాయం ప్రారంభమైంది.కరువును తట్టుకునే మూలనుర్ మునగమునగ మెట్ట పంట అయినప్పటికీ అన్ని రకాల మునగ విత్తనాలూ కరువును తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వలేవు. అందుకే పొన్నరాసి కరువును తట్టుకునే మూలనూర్ మునగ రకాన్ని సాగు చేస్తున్నారు. అంతే కాదు ఏడాదికి మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకం గింజల్లో నూనె శాతం కూడా ఎక్కువట. అయితే, మునగ విత్తనాల నుంచి నూనె తియ్యటం అంత తేలికేమీ కాదు. విత్తనంపైన పొరను తొలగించడానికి చాలా మంది కూలీలు అవసరం అవుతారు. యంత్రాల నిర్వహణ అనుభవం కూడా అవసరం.నూనె తీయటం ప్రారంభించబోయే లోగా తన చుట్టూ ఉన్న వారు ఏవేవో కామెంట్స్ చేసి ఆమె ఉత్సాహం మీద నీళ్లు చల్లేవారు. పదో తరగతి చదువు కూడా లేని దానివి ఏం చేస్తావులే అని ఎత్తి పొడుపు మాటలు అనేవారు. ‘వారి మాటల్ని నేను అసలు పట్టించుకునే దాన్ని కాదు. నా ద్విచక్రవాహనంపై నలుగురు పిల్లల్ని ఎక్కించుకొని ఎక్కడికంటే అక్కడకు వెళ్లి పనులు చక్కబెట్టుకునే దాన్ని. బంధువులు కూడా నా ఆర్థిక పరిస్థితి గురించి ఇంకా వేవేవో సూటిపోటి మాటలు అనేవారు..’ అని పొన్నరాసి గుర్తు చేసుకున్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టిన పట్టు విడవలేదు. ‘అక్క ఇంటా బయటా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఆత్మస్థయిర్యంతో అన్నీటినీ ఎదుర్కొంది. ఆమె మీద నమ్మకం ఉంచి మేం పనిచేస్తున్నాం అన్నారు పొన్నరాసి దగ్గర పనిచేసే మహిళ కలైరాసి. విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటం ఒక్కటే సరిపోదు. అవి నాణ్యతా ప్రమాణాలకు తగినట్టు ఉండేలా చూసుకోవటం కూడా ఒక సవాలే. తంజావూరులోని ఇండియన్ ఫుడ్ ఎడిబుల్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ (ఐఇఎఫ్ఇడి) అనే సంస్థ నుంచి తన ఉత్పత్తులకు నాణ్యతా సర్టిఫికెట్ తీసుకోవటంతో పొన్నరాసికి మార్కెట్లో మంచి పట్టు దొరికింది. ప్రమాణాలకు తగినట్లు విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్న మహిళా రైతు, వ్యాపారవేత్తగా ఆమెకు ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల గ్రాంటు వచ్చింది. ఆ సొమ్ముతో పొలంలోనే ప్యాక్ హౌస్ను ఏర్పాటు చేసుకోగలిగింది. దాంతో ఆమె పని సులువైంది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి మునగ ఆకులు, కాయలు, గింజలతో మొత్తం 36 రకాల ఉత్పత్తులను తయారు చేయటానికి వీలు దొరికింది. మునగ నూనెతో పాటు సబ్బులు, షాంపూలు, లిప్ బామ్స్ తయారీలో వాడేందుకు పొడిని.. సూప్ పౌడర్లు.. ఇటువంటివే ఎన్నో ఉత్పత్తుల్ని తయారు చేశారు. ‘ఆహారోత్పత్తులను స్వయంగా తయారు చేయిస్తాను. సౌందర్య సాధనాలను తయారు చేయించే పనులను మా తమ్ముడు చూసుకుంటున్నాడని ఆమె తెలిపారు.కస్టమర్ల సంఖ్య పెరిగే కొద్దీ, వారి అవసరాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా కనీసం పది రకాల కొత్త ఉత్పత్తులను అదనంగా చేర్చుతున్నారామె. తన సిబ్బంది ఇతి తమ పనిగా భావించి నిమగ్నమై పని చేయటం వల్ల పనులు సజావుగా చేయగలుగుతున్నానని చెబుతూ.. మునగ ఇడ్లీ పొడిని తయారు చేస్తే బాగుంటుందని మా దగ్గర పనిచేసే కలైరాసి చెప్పటంతోనే మొదలు పెట్టామని పొన్నరాసి సంతోషంగా చెప్పారు.ఫేస్బుక్, వాట్సప్..పొన్నరాసి గత ఆరేళ్లుగా అంకితభావంతో పనిచేయటం వల్ల ఏడాదికి రూ. 12 లక్షలకు పైగా నికరాదాయం పొందగలుగుతున్నారు. ఆమె దగ్గర మునగ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే వారి సంఖ్య లక్ష దాటిపోయింది. ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్ల ద్వారా తెలుసుకొని కాంటాక్ట్ చేసిన వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ΄ పొన్నరాసి కృషి గురించి, మునగ ఉత్పత్తుల గురించి తెలుసుకున్న మలేషియా, సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, మస్కట్ వాసులు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు.ఎన్ని ఎక్కువ ఉత్పత్తుల్ని ఆమె విక్రయిస్తున్నా అందులో బాగా అమ్ముడు పోయేవి మాత్రం.. మునగ విత్తనాలు, సూప్ పౌడర్లు, నూనె మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగటం, పొన్నరాసి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో మంచి వ్యాపారం జరుగుతోంది. త్రిచీ కలెక్టర్ పొన్నరాసికి బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును ప్రదానం చేసి గౌరవించారు. దీంతో ఆమెకు ‘మునగ రాణి’ అని పేరొచ్చింది.చదవండి: కార్బన్ పాజిటివ్ పొలం.. అంటే తెలుసా?ఇప్పుడామె చాలా మంది రైతులకు, స్వయం సహాయక బృందాలకు మునగ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తూ, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడుతోంది. ‘ఎంబిఎ కాలేజీ వాళ్లు నన్ను పిలిచి వ్యవసాయాధిరిత వ్యాపార పాఠాలు చెప్పమని అడుగుతుంటే చాలా గర్వంగా ఉంది’ అని సంబర పడుతున్నారు పొన్నరాసి. సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టటం నాకు తెలిసేది కాదు. మా అమ్మాయి నేర్పించింది. ఫేస్బుక్లో మా ఉత్పత్తుల వివరాలు చూసి విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఆ విధంగా ఫేస్బుక్, వాట్సప్ మా వ్యాపారానికి చాలా బాగా ఉపయగపడ్డాయి అని పొన్నరాసి సంబరంగా చెబుతున్నారు!ప్రచారాలను పట్టించుకోకూడదు..‘మహిళ బాధ్యతల విషయంలో సమాజం గందరగోళపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక మహిళ వ్యాపారం మొదలు పెట్టిందంటే, ఆమె తల్లిగా లేదా భార్యగా విఫలమైపోయిందని ప్రచారం జరుగుతుంటుంది. ఇటువంటి ప్రచారాలను పట్టించుకోకుండా మహిళలు తాము ఉన్న చోట నుంచి ముందడుగు వేయాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆ తర్వాత తెలుస్తుంది మనం చేసిన పనుల వల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో, ఆర్థికంగా ఎంత స్వయం సమృద్ధి సాధించామో. డిగ్రీలే చదివి వుండాలనేమీ లేదు. మన సంకల్పంతో పాటు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం, సామర్ధ్యాన్ని మెరుగుపరచుకోవటం ముఖ్యం. – పొన్నరాసి, ఎంటర్ప్రెన్యూర్గా మారిన మునగ రైతు, దుండిగల్, తమిళనాడు -
వింగ్డ్ బీన్స్..పోషకాలు పుష్కలం : ఒకసారి పాకిందంటే!
వింగ్డ్ బీన్ (సోఫోకార్పస్ టెట్రాగోనోలోబస్).. ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న ఒక రకం చిక్కుడు పంట. మిగతా చిక్కుడు కాయల కన్నా ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ చిక్కుడు కాయకు నాలుగు ముఖాలు ఉంటాయి. అందువల్ల ఈ తీగ జాతి కూరగాయ మొక్కకు ‘రెక్కల చిక్కుడు’ అని పేరొచ్చింది. ఉష్ణమండల ప్రాంతాల్లో చక్కగా పెరుగుతుంది. ఆసియా దేశాలకు బాగా అనుకూలమైనదైనా, ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా సాగు చేయని పంట ఇది. ఇది కూరగాయ పంట. ఆకుకూర పంట. దుంప పంట. పప్పు ధాన్యపు పంట కూడా! ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా తట్టుకొని దిగుబడినిచ్చే అద్భుత పంట!! భారత్, బర్మా, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్, ఫిలిప్పీన్స్, చైనా తదితర దేశాల్లో సాగవుతోంది. వింగ్డ్ బీన్స్తో కూర చేసుకోవచ్చు. ఎండు చిక్కుడు గింజల కోసం కూడా పెంచవచ్చు. గాలిలో పుష్కలంగా ఉన్న నత్రజనిని గ్రహించి నేలకు అందించే సామర్థ్యం అన్ని పప్పుధాన్యపు పంటలకూ ఉంది. దీనికి కొంచెం ఎక్కువగా ఉంది. దీని వేర్లపై ఉండే బుడిపెల ద్వారా నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తుంది. దీని ఆకుల్లో కూడా అత్యంత నాణ్యమైన మాంసకృత్తులు ఉంటాయి. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు దోహదపడే ఈ చక్కని చిక్కుడు పంటపై మనం పెద్దగా పట్టించుకోవటం లేదు. వింగ్డ్ బీన్లో కూడా అనేక రకాల వంగడాలు ఉన్నాయి. అద్భుతమైన ఈ కూరగాయ పంట ప్రతికూల బెట్ట వాతావరణ పరిస్థితులను తట్టుకోగలుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో నివసించే పేద గ్రామీణ కుటుంబాల ఆహారంలో మాంసకృత్తులను తగినంత చేర్చగల శక్తి ఉన్న పంట ఇది. సారం అంతగా లేని భూముల్లో సైతం మంచి దిగుబడినిస్తుంది. పంట పొలాల్లో పంటల జీవవైవిధ్యాన్ని, భూసారాన్ని పెంపొందించడానికి, వాణిజ్యపరంగా ఆదాయం పొందడానికి కూడా వర్షాధార వ్యవసాయంలో వింగ్డ్ బీన్ సాగును ్ర΄ోత్సహించవలసిన అవసరం ఉందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) పరిశోధన, విస్తరణ సిబ్బందికి సూచించింది. వింగ్డ్ బీన్స్ ప్రజల పళ్లాల్లోకి చేర్చగలిగితే మనుషుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చగలమని, పౌష్టికాహార లోపాన్ని పారదోలగలమని ఐసిఏఆర్ ఆశిస్తోంది. కూరగాయ తోటల్లో, ఇంటిపంటల్లో, మిద్దె తోటల్లో సైతం సాగు చేయదగిన మేలుజాతి తీగ జాతి కూరగాయ పంట ఇది.వన్ స్పెసీస్ సూపర్మార్కెట్!ఐసిఏఆర్ వింగ్డ్ బీన్ని ‘వన్ స్పెసీస్ సూపర్మార్కెట్’గా అభివర్ణించింది. ఆకుపచ్చని కాయలు, ఆకులు, గింజలతో పాటు.. కొంచెం లావుగా పెరిగే దీని వేర్లు కూడా చక్కని పోషకాలతో కూడి ఉండటమే ఇందుకు కారణం. ఆకులను పాలకూర మాదిరిగా పప్పులో వేసుకోవచ్చు. పూలను సలాడ్గా తినొచ్చు. దుంప మాదిరిగా ఊరే వేర్లను విడిగా తినొచ్చు లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్లో కలుపుకోవచ్చు. ఈ తీగ జాతి మొక్క వేగంగా అల్లుకుపోతుంది కాబట్టి సజీవ ఆచ్ఛాదనగా వేసుకోవచ్చు. ప్రధాన పంట మధ్యలో కలుపు పెరగనీయకుండా అంతరపంటగా, పంటమార్పిడి కోసం సాగు చేస్తూ భూసారాన్నిపెంపొందించుకోవచ్చు. ఇది తేలిగ్గా చనిపోదు. ఇతరత్రా ప్రధాన ఆహార పంటలతో పోల్చితే కరువును, వరదను, వేడిని, చీడపీడలను అధికంగా తట్టుకునే శక్తి ఈ పంటకు ఉంది. ఇది బహు వార్షిక పంట. అయితే, వార్షిక పంటగానే సాగులో ఉంది. ఈ తీగ 3–4 మీటర్ల కన్నా పొడవుగానే పెరుగుతుంది. తీగ సాధారణంగా ఆకుపచ్చగా ఉంటుంది. కొన్ని రకాల వింగ్డ్ బీన్ జాతుల తీగ ఊదా, గులాబీ, గోధుమ రంగుల్లో కూడా ఉంటాయి. పూలు తెలుపు నుంచి ముదురు ఊదా రంగు, నీలం, నీలం తెలుపు కలగలపు రంగుల్లో ఉంటాయి. కాయలు నాలుగు పలకలుగా 15-22 సెం.మీ. ΄ పొడవున 2-3 సెం.మీ. వెడల్పున ఉంటాయి. కాయలో 5 నుంచి 20 గుండ్రటి గింజలుంటాయి. ఎండిన తర్వాత ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వింగ్డ్ బీన్ పంటలో ఎక్కువ రకాలు న్యూగినియా, మారిషస్ దేశాల్లో కనిపిస్తాయి. మన దేశంలో అస్సాం, మణిపూర్, మిజోరం, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో ఎక్కువగా దీన్ని సాగు చేస్తున్నారు. ఉత్తరాది మైదాన ప్రాంతాల్లోనూ మంచి దిగుబడినిస్తున్నట్లు రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి తప్ప పెద్దగా ప్రాచుర్యంలోకి రాని పంట ఇది.పుష్కలంగా పోషక విలువలువచ్చే కాలంలో మన ప్రాంతాల్లో కూడా బాగా ్ర΄ాచుర్యంలోకి తేదగిన అద్భుత పోషక విలువలు కలిగిన పంట వింగ్డ్ బీన్. ప ప్రొటీన్, పీచు, బీకాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు తగుపాళ్లలో వింగ్డ్ బీన్స్లో ఉన్నయి. థయామిన్, పైరిడాక్సయిన్ (విటమిన్ బి–6), నియాసిన్, రిబోఫ్లావిన్ వంటి బికాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. ఇనుము, రాగి, మాంగనేసు, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు ఉన్నాయి. వింగ్డ్ బీన్ ఆకుల్లో పీచు, విలమిన్ ఎ, సి, ఖనిజాలు ఉన్నాయి. వంద గ్రాముల తాజా ఆకుల్లో 45 మిల్లీ గ్రాముల విటమిన్ సి (రోజువారీ అవసరంలో ఇది 75%), 8090 ఇంటర్నేషనల్ యూనిట్ల (ఐయు) విటమిన్ ఎ (270% ఆర్డిఎ) ఉంటాయి. లేత వింగ్డ్ బీన్ కాయల్లో ఫొలేట్స్ పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల బీన్స్లో 66 మైక్రో గ్రాముల (రోజుకు మనిషికి రోజువారీ అవసరంలో ఇది 16.5%) ఫొలేట్స్ ఉంటాయి. డిఎన్ఎ సంశ్లేషణకు, కణ విభజనకు విటమిన్ బి–12తో ΄ాటు ఫొలేట్స్ అతి ముఖ్యమైనవి. గర్భం దాల్చే సమయం నుంచి ప్రసవం వరకు తల్లికి ఫొలేట్స్ లోపం లేకుండా ఉంటే బిడ్డకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రావు. వంద గ్రాముల తాజా వింగ్డ్ బీన్స్లో 18.3 మిల్లీ గ్రాముల (రోజువారీ అవసరంలో 31%) విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి నీటిలో కరిగే యాంటీఆక్సిడెంట్. ఇన్ఫెక్షన్లకు తట్టుకునే రోగనిరోధక శక్తిని కలిగించటంలో తోడ్పడుతుంది. రక్త నాళాలకు సంకోచ వ్యాకోచ గుణాన్ని ఇస్తుంది. ఆహారంలో తగినంతగా తీసుకుంటే కేన్సర్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. వింగ్డ్ బీన్స్ అతి తక్కువ కేలరీలతో కూడిన కూరగాయ. వంద గ్రాముల్లో 49 కేలరీలు మాత్రమే ఉంటాయి.అతివృష్ఠినీ తట్టుకుంటుంది!కరువు కాటకాలను, వరదలను, తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని, చీడపీడలను తట్టుకొని దిగుబడినివ్వగలగటం అనే లక్షణం వాతావరణ మార్పుల నేపథ్యంలో మిగతా ప్రధాన పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్లో కూడా వింగ్డ్ బీన్స్ నిరాశపరచదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలకు ఆహార కొరత, ΄పౌకాహార లోపాన్ని సరిదిద్దే క్రమంలో తోడ్పడే పంటగా దీన్ని చాలా ప్రాంతాల్లో విస్తృతంగా సాగు చేయించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీని ఆకులు, కాయలు, గింజలు, దుంపల్లాంటి వేర్లను తినటానికి వీలుంది. మిగిలిన తీగను పశుగ్రాసంగా వాడుకోవచ్చు. నత్రజనిని స్థిరీకరిస్తుంది కాబట్టి పంట మార్పిడికి ముఖ్యమైన పంటగా ఇది గుర్తింపు పొందింది. ఇది ప్రధానంగా స్వీయపరాగ సంపర్క పంట. మహా అయితే 7.6% మేరకు పరపరాగ సంపర్కం జరుగుతున్నట్లు గుర్తించారు. వింగ్డ్ బీన్స్ పంట అనావృష్టిని, అతివృష్టిని కూడా తట్టుకుంటుంది. 700 మిల్లీ మీటర్ల నుంచి 4100 ఎం.ఎం. వార్షిక వర్షపాతాన్ని తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత 15.4 – 27.5 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతను ఇష్టపడుతుంది. మెత్తని దుక్కి చేసి విత్తుకుంటే వేరు వ్యవస్థ విస్తరించడానికి వీలుగా ఉంటుంది. ఇసుక నేలల నుంచి లోతైన రేగడి నేలలు, నీరు నిలబడని ఎర్ర నేలలు, సేంద్రియ పదార్థం బాగా ఉన్న నేలలు అనుకూలం. 4.3–7.5 మధ్య ఉదజని సూచిక ఉన్న నేలలు అనుకూలం. సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ మధ్యలో పూత వస్తుంది. 18 డిగ్రీల కన్నా తక్కువ, 32 డిగ్రీల సెల్షియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పూత రాదు. సముద్రతలం నుంచి 2,000 మీటర్ల ఎత్తు వరకు గల ప్రాంతాల్లో ఈ పంట బాగా పెరుగుతుంది (హైదరాబాద్ 542 మీ. ఎత్తులో ఉంది). కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్లో విస్తారంగా సాగు చేయటానికి, తోటల్లో అంతరపంటగా సాగు చేయటానికి ఇది అనుకూలమైన పంట. విత్తుకోవచ్చు. కాండం ముక్క పెట్టినా వస్తుంది. హెక్టారుకు 15–20 కిలోల విత్తనాలు అవసరం. విత్తనం పైన గట్టి పెంకులాంటి పొర ఉంటుంది. 1-2 రోజులు నానబెట్టి, 3-4 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. 5-7 రోజుల్లో మొలకెత్తుతుంది. 25 డిగ్రీల సెల్షియస్ పగటి ఉష్ణోగ్రత ఉన్న కాలంలో చక్కగా పెరుగుతుంది. ఉత్తర–దక్షిణ నిలువు పందిళ్లకు తీగలు పాకిస్తే ఎండ బాగా తగిలి బాగా పెరుగుతుంది. కూరగాయ పంటగా సాగు చేసేటప్పుడు 90 సెంటీమీటర్లు (36 అంగుళాలు)“ 90 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి. విత్తన పంటగా అయితే 45 సెం.మీ.“ 45 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. తీగ 3-4 మీటర్ల కన్నా తక్కువ పెరిగే రకాలైతే 30 సెం.మీ. “ 20 సెం.మీ. దూరంలో నాటుకోవచ్చు. రుతుపవనాలు వచ్చిన తర్వాత జూన్–జూలైల్లో నాటుకోవాలి. వింగ్డ్ బీన్ వేరు దుంపలను కూడా ఆహారంగా వాడుతారని చెప్పుకున్నాం కదా. దుంపల కోసం సాగు చేసేటప్పుడు ఆగస్టు–సెప్టెంబర్ మధ్య ఆలస్యంగా విత్తుకుంటే రొట్ట ఎక్కువ పెరగకుండా వేరు ఎక్కువ పెరుగుతుంది.నత్రజని తక్కువ నేలలైనా.. నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తుంది కాబట్టి వింగ్డ్ బీన్స్ పంటను సారం తక్కువగా ఉన్న నేలల్లోనూ విత్తుకోవచ్చు. హెక్టారుకు 20 టన్నుల మాగిన పశువుల ఎరువుతోపాటు 50:80:50 కిలోల ఎన్.పి.కె. ఎరువులు హెక్టారుకు వేసుకోవాలి. నత్రజనిని మాత్రం రెండు భాగాలుగా చేసి, ఒక భాగాన్ని విత్తనానికి ముందు, రెండో భాగాన్ని 40–60 రోజుల మధ్య వేసుకోవాలి.నెలలోనే కమ్మేస్తుంది!వింగ్డ్ బీన్స్ తీగ విత్తిన నెల రోజుల్లోనే వేగంగా పెరిగి పొలం అంతా కమ్మేస్తుంది. విత్తిన తర్వాత 15–20 రోజులకు ఒకసారి కలుపు తీస్తే చాలు. వేరు దుంపల కోసం సాగు చేస్తే నేల మీదే పాకించవచ్చు. కూరగాయ పంటగా, విత్తనాల పంటగా సాగు చేసుకుంటేపాదులను ఒక మోస్తరు ఎత్తు గల ఊత కర్రలకు పాకిస్తే కాయలు కోసుకోవటానికి వీలుగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది. తుప్పు తెగులు, ఆకుమచ్చ వంటి శిలీంధ్ర తెగుళ్లు తప్ప మిగతా తీవ్రమైన చీడపీడలేవీ ఈ పంటకు సోకవు. రూట్నాట్ నెమటోడ్స్ సమస్య ఉండొచ్చు. అవసరాన్ని బట్టి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.చదవండి: ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధనఐరన్ లోపానికి అర్క ఐరన్ ఫార్టిఫైడ్ మష్రూమ్ హెక్టారుకు 5–10 టన్నులువిత్తుకున్న 10 వారాలకు ఆకుపచ్చని వింగ్డ్ బీన్స్ కూరగాయలను కోసుకోవచ్చు. హెక్టారుకు 5–10 టన్నుల వరకు తాజా కాయలతోపాటు అంతే బరువైన వేరు దుంపల దిగుబడి వస్తుంది. విత్తనాలైతే హెక్టారుకు 1 నుంచి 1.5 టన్నుల దిగుబడి వస్తుంది. తాజా వింగ్డ్ బీన్స్ కూరగాయలను ప్లాస్టిక్ బాగ్స్లో కట్టి 10 డిగ్రీల సెల్షియస్, 90% తేమ గల చోట నిల్వ చేస్తే 4 వారాల వరకు బాగుంటాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం,పౌష్టిక విలువలతో కూడిన పంట కావటంతో వింగ్డ్ బీన్స్ పంట భవిష్యత్తులో విస్తారంగా సాగులోకి తేవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సాగవుతున్న రాష్ట్రాల్లో నుంచి అనువైన రకాలను సేకరించి తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యాన పరిశోధనా సంస్థలు పరిశోధన చేసి స్థానికంగా రైతులకు విత్తనాలను అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వం విధానాల ద్వారా ఈ పంట వ్యాప్తికి దోహదం చేయాలి. -
ఐరన్ లోపానికి అర్క ఐరన్ ఫార్టిఫైడ్ మష్రూమ్
పుట్టగొడుగులు ఎంతో ఆరోగ్యదాయకమైనవని మనకు తెలుసు. రక్తహీనతకు ఐరన్ లోపం పెద్ద సమస్య. మన దేశంలో ముఖ్యంగా మహిళలు, యుక్తవయసు బాలికలు అధిక శాతంలో రక్త హీనతతో బాధపడుతున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు బెంగళూరులోని (భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి– ఐసిఎఆర్– అనుబంధ సంస్థ) భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) అధిక పాళ్లలో ఐరన్ కలిగి ఉండే పుట్టగొడుగులను రూపొందించింది. ఐరన్ ఎల్మ్ ఆయిస్టర్ మష్రూమ్ను ఉత్పత్తి చేసి, దానితో రసం పొడిని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవటం ద్వారా రక్తహీనతను అధిగమించవచ్చని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఎల్మ్ ఆయిస్టర్ పుట్టగొడుగుల్లో సాధారణంగా ఐరన్ 135.60 పిపిఎం స్థాయిలో ఉంటుంది. ఫార్టిఫికేషన్ ప్రక్రియ ద్వారా దీన్ని 338.15 పిపిఎంకు ఐఐహెచ్ఆర్ పెంపొందించింది. అంటే 149.37% పెంచిందన్నమాట. తినే ఆహారంలో ఉన్న పోషకాన్ని కూడా మన దేహం వంట పట్టించుకోగలిగేది తక్కువే ఉంటుంది. సాధారణంగా మొక్కల ఆహారం ద్వారా మనం తీసుకోగలిగే ఐరన్ 5–8% మాత్రమే. అదే ఇన్ఆర్గానిక్ ఐరన్ టాబ్లెట్లు వంటి సప్లిమెంట్ల ద్వారా 10–12% ఐరన్ను మాత్రమే మన దేహం తీసుకోగలదు. అయితే, ఐఐహెచ్ఆర్ రూపొందించిన ఆర్క ఐరన్ ఫార్టిఫైడ్ మష్రూమ్ పొడితో రసం తయారు చేసుకొని రోజువారీ భోజనంలో తీసుకుంటే 21.68% ఐరన్ను తీసుకోగలుగుతామని ఐఐహెచ్ఆర్ పేర్కొంది. ఐరన్తో ఫార్టిఫై చేసిన పుట్టగొడుగుల పొడిని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని కుటీర పరిశ్రమగా ఉత్పత్తి చేసి ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. చదవండి: ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధనShivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి? ఇతర వివరాలకు.. 080–23086100 – ఎక్స్టెన్షన్ 348, 349. mushroomiihr@gmail.com -
తెల్లబియ్యం తిన్నా.. షుగర్ పెరగదు!
సాక్షి, సాగుబడి డెస్క్: ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది షుగర్ వ్యాధి (మధుమేహం) బాధితులుంటే.. అందులో 10.1 కోట్ల మంది భారతీయులే (2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరనుంది). త్వరలోనే ఈ జాబితాలో చేరే వారు జనాభాలో మరో 15% ఉంటారు. గ్లైసైమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉండే సాంబ మసూరి (జీఐ 72) వంటి పాలిష్ చేసిన తెల్ల బియ్యం తినటం మధుమేహానికి ప్రధాన కారణాల్లో మొదటిదని ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) గుర్తించింది. ఏదైనా ఆహార పదార్ధాన్ని తిన్న తర్వాత అది ఎంత త్వరగా గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తున్నదో సూచించేదే ‘గ్లైసైమిక్ ఇండెక్స్’. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత హానికరమన్నమాట. హరిత విప్లవానికి ముందు ఐఆర్8 వంటి అధిక దిగుబడినిచ్చే ‘మిరకిల్ రైస్’ వంగడాన్ని ఇచ్చి మన దేశ ఆకలి తీర్చిన ‘ఇరి’.. ఇప్పుడు షుగర్ పెంచని, ప్రొటీన్ లోపాన్ని ఎదుర్కొనే మరో రెండు అద్భుత వంగడాలను అందుబాటులోకి తెస్తోంది. లో గ్లైసైమిక్ ఇండెక్స్ (55%) కలిగిన ‘ఐఆర్ఆర్ఐ147’ ఈ ఏడాది ఖరీఫ్లోనే మన దేశంలో అందుబాటులోకి రానుంది. అలాగే అల్ట్రా లో మిగతా 2వ పేజీలో uగ్లైసైమిక్ (45%) + హై ప్రొటీన్ (16%)ను అందించే మరో అద్భుత వంగడం ఇంకో ఏడాదిలో అందుబాటులోకి రానుందని ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త, కంజ్యూమర్–డ్రివెన్ గ్రెయిన్ క్వాలిటీ అండ్ న్యూట్రిషన్ యూనిట్ హెడ్ డా.నెసె శ్రీనివాసులు తెలిపారు. ఈ రెండో వంగడానికి డాక్టర్ శ్రీనివాసులు స్వయంగా రూపకల్పన చేశారు. భారత్ పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తక్కువ జీఐ.. ‘ఐఆర్ఆర్ఐ147’ ‘ఐఆర్ఆర్ఐ 147’ రకం తెల్లగా పాలిష్ చేసిన బియ్యంలో గ్లెసైమిక్ ఇండెక్స్ (55%) తక్కువగా ఉంటుంది. 22.3 పీపీఎం జింక్ ఉంటుంది. ఉప్పదనాన్ని, తెగుళ్లను తట్టుకుంటుంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)కి రెండేళ్ల క్రితం ‘ఇరి’ ఈ వంగడాన్ని అందించింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఐసీఏఆర్ ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా క్షేత్రస్థాయిలో సాగు చేసింది. 7కు గాను 4 జోన్లలో మంచి ఫలితాలు వచ్చాయి. హెక్టారుకు 5– 9.5 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ‘సీడ్ వితవుట్ బార్డర్స్–ఎల్లలు లేని విత్తనాలు’ కార్యక్రమంలో భాగంగా ఫాస్ట్ ట్రాక్లో విడుదల చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ముతక రకం కావటంతో ఉప్మా రవ్వ, అటుకులు, తదితర అల్పాహార ఉత్పత్తులుగా ప్రాసెస్ చేసి విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి మన దేశంలోని రైతులకు ఐసీఏఆర్ ద్వారా ఈ న్యూక్లియస్ సీడ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అత్యల్ప జీఐ, రెట్టింపు ప్రొటీన్! షుగర్ రోగులు కూడా తినదగిన అతి తక్కువ గ్లెసైమిక్ ఇండెక్స్తో పాటు అధిక ప్రొటీన్ను కలిగి ఉండే అద్భుత వరి వంగడాన్ని ‘ఇరి’ భారతీయులకు అందిస్తోంది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. అత్యంత ప్రజాదరణ పొందిన సాంబ మసూరి మాదిరిగానే ఇది సన్న రకం, అధిక దిగుబడినిచ్చేది కూడా. సాధారణ సాంబ మసూరి జీఐ 72% కాగా, ప్రొటీన్ 8%, కుక్డ్ రెసిస్టెంట్ స్టార్చ్ 0.3% మాత్రమే. సాంబ మసూరితో కలిపి రూపొందిస్తున్న ఈ సరికొత్త రకం జీఐ కేవలం 45% మాత్రమే. ప్రొటీన్ మాత్రం రెట్టింపు. అంటే.. 16%. కుక్డ్ రెసిస్టెంట్ స్టార్చ్ కూడా 3.8% ఉంటుంది. అందువల్ల తిన్న తర్వాత 125 నిమిషాల వరకు నెమ్మదిగా జీర్ణమవుతూ గ్లూకోజ్ను తగుమాత్రంగా విడుదల చేస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు, ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్న వారు కూడా ఈ రకం తెల్ల బియ్యాన్ని ఇబ్బంది లేకుండా తినవచ్చు. వచ్చే ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా ఐసీఏఆర్ ఆధ్వర్యంలో సాగు చేస్తాం. ప్రజల దైనందిన ఆహారం ద్వారా డయాబెటిస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, ప్రొటీన్ లోపాన్ని అరికట్టడానికి ఈ వంగడం ఉపకరిస్తుంది. ఎఫ్పీవోల ద్వారా సాగు..మహిళా సంఘాల ద్వారా ప్రాసెసింగ్ అత్యల్ప గ్లెసైమిక్ ఇండెక్స్తో పాటు రెట్టింపు ప్రొటీన్ను కలిగి ఉండే ఆరోగ్యదాయకమైన కొత్త రకం వరి బియ్యాన్ని, ఇతర ఉప ఉత్పత్తులను దేశంలోని సాధరణ ప్రజలకు సైతం అందుబాటులోకి తేవాలన్నదే ‘ఇరి’ లక్ష్యం. ఒకసారి అందుబాటులోకి వస్తే భారత్తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ బియ్యానికి చాలా గిరాకీ ఉంటుంది. అందువల్ల ఈ వంగడంపై పెద్ద కంపెనీలు గుత్తాధిపత్యం పొందటానికి వీల్లేకుండా, ఈ బియ్యాన్ని, ఇతర ఉత్పత్తులను దేశ ప్రజలకు సరసమైన ధరకే అందుబాటులోకి తేవటానికి కేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నాం. ( వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!)ఇందులో భాగంగా ఒడిశాలో ఎంపిక చేసిన కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓలు) రైతులతో సాగు చేయిస్తున్నాం. మిల్లింగ్, ప్రాసెసింగ్లో 30 మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చారు. భువనేశ్వర్ దగ్గర్లో ప్రత్యేక ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం భారీ పెట్టుబడితో నెలకొల్పుతోంది. ప్రత్యేక బ్రాండ్ను ప్రారంభించి ఆరోగ్యదాయకమైన ఈ బియ్యం, ఇతర ఉత్పత్తులను రిటైల్ మార్కెట్లోని పెద్ద కంపెనీల ద్వారా సరసమైన ధరలకే ప్రజలకు విక్రయించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం. ఇదీ చదవండి: వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్లు -
పందిరి సాగు.. ఫలితాలు బాగు
చిన్నకోడూరు(సిద్దిపేట): ఆరుగాలం కష్టపడి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని వరి సాగు చేస్తే సరైన దిగుబడి రాక, గిట్టుబాటు ధర అందడం లేదని ఆందోళన చెందుతున్న రైతులు తమ ఆలోచను మార్చుకుంటున్నారు. సంప్రదాయ పంటలకు బదులుగా ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ తమకున్న కొద్దిపాటి సాగు భూమిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటే సాగును లాభాల బాటలో నడిపించొచ్చని నిరూపిస్తున్నారు. చిన్నకోడూరు మండలంలో సుమారు 90 ఎకరాల్లో పందిరి సాగు ద్వారా కూరగాయలు పండిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.పందిరి సాగుతో మేలురైతులు వారి భూముల్లో పందిరి వేసి, ఉద్యాన పంటను సాగు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఎకరా భూమిలో పందిరి సాగు అమలు చేసే రైతులు ఉద్యానశాఖ ద్వారా రూ. లక్ష సాయం అందిస్తుండగా, ఇందులో రూ. 50 వేలు సబ్సిడీ వస్తుంది. మిగితా సగాన్ని రైతులు భరించాల్సి వస్తుంది. అధికారులే పందిరి సిద్ధం చేసి ఇస్తారు. సుమారు నాలుగేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీగజాతి కూరగాయలు పండించుకోవచ్చు. కాకర, బీర, దొండ, సోరకాయ పండిస్తూ ఆదాయం పొందవచ్చు. పందిరి కింది బాగంలో ఖాళీగా ఉన్న స్థలంలో టమాట, వంకాయ, బెండ వంటి అంతర పంటలు సాగు చేయవచ్చు.దిగుబడి బాగుందిపందిరి సాగు విధానంతో దిగుబడులు బాగున్నాయి. ఈ విధానం ద్వారా కలుపు తక్కువగా ఉండి కూలీల అవసరం ఉండదు. కూరగాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. చీడ పీడలు ఎక్కువగా ఆశించవు. పంటలు సాఫీగా వస్తాయి. మార్కెట్ల మంచి ధర పలుకుతుంది. (దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!)–నాగర్తి తిరుపతిరెడ్డి, రైతు మాచాపూర్ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం -
దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడెవరూ ఆశ్చర్యపోవడం లేదు. కానీ.. ఎద్దులతోనో, ట్రాక్టరుతోనో దున్నే పనే లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చంటే.. నమ్మలేం. అయితే, మధ్యప్రదేశ్కు చెందిన దివంగత రైతు శాస్త్రవేత్త రాజు టైటస్ మాత్రం 30 ఏళ్ల పాటు ఇలాగే వ్యవసాయం చేసి సత్ఫలితాలు సాధించారు. ‘ప్రకృతి వ్యవసాయం వెనుకబడినదో లేదా ప్రాచీనమైనదో కాదు. ఆధునికమైనది, వినూత్నమైనది అని రాజు టైటస్ రుజువు చేశారు’ అని ఐసిఎఆర్ ప్రశంసించింది. ఆరేళ్ల క్రితం కన్నుమూసినా.. ఆయన కృషి రైతులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్కు చెందిన ‘రాజు టైటస్’ ప్రభుత్వోద్యోగి. అయినా కుటుంబ వారసత్వంగా వచ్చిన 13 ఎకరాల పొలాన్ని సాగు చేయటం మానలేదు. 70వ దశకంలో అందరిలానే ఆయనా ‘హరిత విప్లవం’ ఒరవడిలో రసాయన ఎరువులు, కీటకనాశనులు వాడటం మొదలుపెట్టారు. మొదట్లో దిగుబడులు పెరిగి ఆదాయం వచ్చినా పదిహేనేళ్లు తిరిగేసరికి పంట భూమి నిస్సారమయింది. దిగుబడులు తగ్గి నష్టాల పాలై పొలం అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు. ఇది జరిగింది 1984లో. రాజు నిర్ణయంతో తల్లి హతాశురాలయింది. గాంధేయవాదులు నడిపే స్వచ్ఛంద సంస్థ ‘ఫ్రెండ్స్ రూరల్ సెంటర్’ కార్యకర్తలతో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. వారు ఆమె చెప్పినదంతా విని జపాన్ దేశానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ (వన్ స్ట్రా రివల్యూషన్) పుస్తకాన్నిచ్చి మీ సమస్యకు ఈ పుస్తకం పరిష్కారాన్ని చూపుతుందని చెప్పారు. కలుపు తీయకుండా.. దుక్కిదున్నకుండా.. ఎరువులు వేయకుండా.. పురుగు మందులు పిచికారీ వంటి పద్ధతులు అనుసరించకుండానే పంటలను సాగు చేసే పద్ధతుల గురించి పుకుఒకా ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని చదివిన రాజు తను సాగులో తను అనుసరిస్తున్న పద్ధతులు అనర్థ హేతువులని అర్థం చేసుకున్నారు.అడ్డంకులను అధిగమించి.. 15 ఏళ్లుగా రసాయన ఎరువులు వేస్తూ పంటభూమిని ధ్వంసం చేస్తున్నానని అర్థం చేసుకున్న రాజు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 1985 నుంచి పుకుఒకా చెప్పిన పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నేలను దున్నటం, ఎరువులు, పురుగుమందుల వాడకం ఆపేశారు. రకరకాల గడ్డి, చెట్ల విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగాక కత్తిరించి ఆచ్ఛాదనగా వాడేవారు. దీనివల్ల వర్షపు నీరు బయటకు వెళ్లకుండా పొలంలోనే ఇంకి.. నేల గుల్లబారటంతో పాటు తేమను పట్టి ఉంచింది. తొలుత గ్రామస్తులు అవహేళన చేసినా అడ్డంకులను అధిగమించి రాజు ప్రకృతిసేద్యం దిశగా వడివడిగా అడుగులు వేశారు.సోయా విత్తన బంతులు!అంకితభావంతో రాజు టైటస్ చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. 1988లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనటానికి ఇండియా వచ్చిన ఫుకుఒకా ప్రకృతిసేద్యం చేస్తున్న రాజు గురించి తెలుసుకొని ఆయన పొలాన్ని సందర్శించారు. ఫుకుఒకా సలహాలు సూచనలను అనుసరించి రెట్టించిన ఉత్సాహంతో రాజు పనిచేశారు. పుకుఒకా సూచన మేరకు పంటను విత్తుకోవటానికి బదులు.. ఒక పాలు సోయా విత్తనం, ఏడు పాళ్లు మట్టి కలిపి క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండే ‘విత్తన బంతుల’ ను తయారు చేశారు. భార్య శాళిని సహకారంతో.. అడుగుకో బంతి చొప్పున.. పొలంలో వేశారు. దీనివల్ల మొలకెత్తినప్పటి నుంచే మొక్కలు పోషకాలను, సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి ఏపుగా ఎదిగాయి. ఆ ఏడాది దిగుబడి బావుండటంతో పాటు నాణ్యమైన పంట వచ్చింది. సోయా మొక్కల మధ్య ఎత్తుగా పెరిగిన గడ్డిని కత్తిరించి భూమిపైన ఆచ్ఛాదనగా వేశారు. దీనివల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు ఆశ్రయం లభిస్తుంది. పంటలకు హానిచేసే శతృ పురుగులను ఇవి నిర్మూలిస్తాయి. దీనివల్ల రసాయనిక ఎరువులు, కీటకనాశనుల అవసరం తప్పుతుంది. ఇవి నేలలో చేసే బొరియల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వేర్లు లోతుకంటా చొచ్చుకు΄ోయి తేమను ΄ోషకాలను గ్రహిస్తాయి. నేల గుల్లబారి భూ సారం పెరిగి మంచి పంట దిగుబడులు వస్తాయి. నేలను దున్నాల్సిన అవసరం లేకపోవటం వల్ల ట్రాక్టరు.. ఎద్దుల కోసం అప్పు చేయాల్సిన అగత్యం తప్పింది. రాజు తన పొలంలో నత్రజనిని స్థిరీకరించేందుకు సుబాబుల్ చెట్లను సాగు చేశారు. దీనివల్ల యూరియా రూపంలో రసాయన ఎరవును అందించాల్సిన అవసరం ఉండదంటారాయన. సుబాబుల్ ఆకులు మేకలకు మంచి మేతగా ఉపయోగపడ్డాయి. ఈ చెట్ల కలపతో పాటు మేకల విక్రయం ద్వారా ఆదాయం లభిస్తోంది. ఆ విధంగా 30 ఏళ్లకు పైగా పొలాన్ని దున్నకుండానే సమృద్ధిగా పంటలు పండిస్తూ పేరు΄ పొందారు. వినియోగదారులు అడిగితేనే రైతులు పండిస్తారు!వినియోగదారులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిమాండ్ చేసినప్పుడే రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం మానేస్తారు. ఆరోగ్యకరమైన నేల ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి సాధ్యమనే విషయాన్ని గుర్తిస్తారు’ అనేవారు రాజు టైటస్. మన దేశంలో ప్రజలకు సోకుతున్న పలు జబ్బులకు మూలకారణం ఆహార పంటల సాగులో వాడుతున్న రసాయనాలు. వీటి వల్ల తొలుత మధుమేహం సోకి పలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. నాకు పక్షవాతం వచ్చింది. నా భార్య గుండెజబ్బు వ్యాధిగ్రస్తురాలు. అయినా మేం కోలుకోవటానికి ప్రకృతి సేద్య పంట ఉత్పత్తులే కారణం అన్నారాయన. ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగంమా కుటుంబ అవసరాల కోసం ప్రస్తుతం ఎకరా పొలంలో ధాన్యం, పండ్లు, పాలు, కూరగాయలను సాగు చేస్తున్నాం. ఖరీఫ్లో గోధుమ, వరి, మొక్కజొన్న, రబీలో పెసరను సాగు చేస్తున్నాం. రోజురోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులే రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఫుకు ఒకా విధానంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేద్యం మూలసూత్రాలను ఒంటబట్టించుకుంటే ఏ రైతైనా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేయవచ్చు అంటారు రాజు టైటుస్! -
వరి చేలోనే కూరగాయలు, చేపలు!
మాగాణి చేను అనగానే మనకు ఒక్క వరి పంట (Paddy) మాత్రమే మదిలో మెదులుతుంది. అయితే, మాగాణి పొలంలో వరి పంటతో పాటు కూరగాయ పంటలు, చేపల సాగు (aquaculture) కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించుకునే సరికొత్త సమీకృత సేద్య నమూనా ఇది. కాకినాడ జిల్లా (Kakinada District) పిఠాపురం మండలం పి.రాయవరం గ్రామానికి చెందిన యువ రైతు కరుపురెడ్డి వెంకటేష్ నమూనా క్షేత్రం ఇందుకు ఒక ఉదాహరణ. 1.20 ఎకరాల భూమిలో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు, కందకంలో చేపల సాగు దర్శనమిస్తాయి. ఏడాదికి ఎకరం వరి సాగులో సాధారణంగా రూ. 40 వేల ఆదాయం వస్తుంది. అయితే, సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వెంకటేష్ రూ. లక్షకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈయన వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల రైతులకు సైతం ఆదర్శంగా నిలిచారు.ఎకరానికి రూ. లక్ష ఆదాయంవెంకటేష్ వ్యవసాయ క్షేత్రం విసీర్ణం ఎకరం 20 సెంట్లు. కాగా, చుట్టూతా విశాలమైన గట్టు 55 సెంట్లలో, గట్టు పక్కనే చుట్టూతా 20 సెంట్లలో తవ్విన కందకంలో చేపల పెంపకం, మధ్యలో మిగిలిన 45 సెంట్ల విస్తీర్ణంలో వరి పంట పండిస్తున్నారు. మాగాణిలో ఒకే పంటగా వరి సాగు చేస్తే ఎకరానికి మహా అయితే రూ.40 వేల ఆదాయం వస్తుంది. దీనికి భిన్నంగా తన పొలంలో గట్టు మీద పండ్ల చెట్లు, కూరగాయ పంటలు, ఆకు కూరలు.. గట్టు పక్కనే తవ్విన కందకం (లేదా కాలువ)లో చేపలు పెంచుతున్నారు. మధ్యలోని పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఈ విధంగా సమీకృత ప్రకృతి సేద్యం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.లక్ష ఆదాయం సంపాదిస్తున్నారు. మాగాణి పొలాల్లో కూడా వరి తప్ప వేరే పండదు అనే అపోహను వదిలిపెట్టి పలు రకాల పంటలు పండించుకోవటం ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో ఈ సమీకృతి ప్రకృతి సేద్య నమూనా తెలియజెప్తోంది. వెంకటేష్ వ్యవసాయ క్షేత్రం రైతులకు, ఇతర సిబ్బందికి రాష్ట్ర స్థాయి శిక్షణ ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుండటం విశేషం. – విఎస్విఎస్ వరప్రసాద్, సాక్షి, పిఠాపురంఇతర రైతులకు ఆదర్శంయువ రైతు వెంకటేష్ సమీకృత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరితో పాటు చేపలు, కూరగాయ పంటల సాగుపై ఆసక్తి చూపటంతో శిక్షణ ఇచ్చాం. ఆచరణలో పెట్టి, మంచి ఫలితాలు సాదించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన పొలాన్నే రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రదర్శన క్షేత్రంగా వినియోగిస్తున్నాం. – ఎలియాజర్ (94416 56083), జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడరెండేళ్లలోనే మంచి ఫలితాలునాకున్న 1.2 ఎకరాల పొలంలో గతంలో వరి మాత్రమే సాగు చేసే వాడిని. ఏడాదికి పెట్టుబడి పోను అతి కష్టం మీద రూ. 40 వేల వరకు ఆదాయం వచ్చేది. ఆ దశలో 2020లో మా జిల్లాలో చేపట్టిన పకృతి వ్యవసాయం చేయాలనిపించి ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లాప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ను సంప్రదించాను. ఆయన నా ఆసక్తిని గమనించి దుర్గాడ రైతు గుండ్ర శివ చక్రం ద్వారా నాకు సమీకృత సాగుపై శిక్షణ ఇప్పించారు. సార్వా వరి కోసిన తర్వాత, అదేవిధంగా దాళ్వా పంట కోసిన తర్వాత నేలను సారవంతం చేసే 20 రకాల పచ్చిరొట్ట పంటలను పెంచి, కలిదున్నేస్తున్నా. దీని వల్ల భూమి సారవంతమవుతోంది. ఎద్దులతోనే దుక్కి, దమ్ము చేస్తాం. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు వాడుతున్నాం. రెండేళ్లలోనే మంచి ఫలితాలు వచ్చాయి. మా కుటుంబానికి వాడుకోగా మిగిలిన కూరగాయల ఇతరులకు ఇస్తున్నాం. బొచ్చె, కొర్రమీను వంటి చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం వస్తోంది. రసాయనాలు వాడకుండా పెంచటం వల్ల మా పంటలకు మంచి డిమాండ్ ఉంటోంది. సంతృప్తికరంగా ఆదాయం పొందటంతో పాటు రైతుల శిక్షణ కేంద్రంగా మా పొలం మారినందుకు చాలా సంతోషంగా ఉంది. – కరుపురెడ్డి వెంకటేష్ (63024 19274),పి.రాయవరం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా -
ఎండు ఆకులను కాల్చకండి.. ఇలా సులభంగా ఎరువు!
ఇది ఆకులు రాలే కాలం. చెట్లు ఆకులు రాల్చే కాలం. ఏప్రిల్ వరకు మన చూట్టూతా ఉండే చెట్లు ఆకులను రాల్చుతూ ఉంటాయి. పొద్దున్న లేచేటప్పటికల్లా వాకిలి నిండా, ఇంటి ఆవరణలో, చెట్ల పక్కనున్న ఇంటి పైకప్పుల మీద, కాలనీల్లో రోడ్ల మీద, పార్కుల్లో.. ఎక్కడ చూసినా ఆకులే.. ఆకులు.. రాలిన ఆకులు! ఈ ఆకులను చక్కని కంపోస్టు ఎరువుగా మార్చుకోవచ్చని తెలిసినా.. నిర్లక్ష్యం కొద్దీ ఆకులను కుప్ప జేసి నిప్పు పెట్టడమో లేదా చెత్తను మోసుకెళ్లే మున్సిపాలిటీ వాళ్ల నెత్తిన వెయ్యడమో చేస్తున్నాం.. అయితే, స్వల్ప ప్రయత్నంతోనే ఈ ఎండాకులను అమూల్యమైన సహజ ఎరువుగా మార్చుకోవచ్చని ఓ మహిళ ఎలుగెత్తి చాటుతున్నారు. మహారాష్ట్రలోని పుణే నగరవాసి అదితి దేవ్ధర్ ‘బ్రౌన్లీఫ్’ పేరిట ఏకంగా ఓ సామిజిక ఉద్యమాన్నే ప్రారంభించి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ఆమె స్ఫూర్తి కథనం.. పచ్చని చెట్లంటే మనందరికీ ఇష్టమే. అందుకే పొలాల గట్ల మీద, పడావు భూముల్లో, ఇంటి దగ్గర, ఊళ్లు / కాలనీల్లో రోడ్ల పక్కన, పార్కుల్లో.. ఇష్టపడి పచ్చని చెట్లను పెంచుకుంటూ ఉంటాం. అయితే, ఆ చెట్లు రాల్చే ఆకుల్ని ఏం చేయాలి? ఊడ్చి మున్సిపాలిటీ వ్యాన్లో వేస్తున్నారు లేదా కుప్ప చేసి ఏకంగా నిప్పు పెడుతున్నారు. ఈ రెండూ మంచి పనులు కాదు. పనిగట్టుకొని మొక్కలు నాటి పచ్చని చెట్లని పెంచుతున్న వారు సైతం నాకెందుకులే అనో.. ఓ రకమైన నిరాసక్తతతోనో, నిర్లక్ష్యంతోనో చూస్తూ ఊరుకుంటున్నారు. అయితే, అదితి దేవ్ధర్ ఊరుకోలేదు. తమ ఇంటి ఆవరణలో పెద్ద చెట్లు రాల్చే ఆకులు పోగుపడుతూ ఉంటే.. ఆ ఆకులను నిప్పు పెట్టి వాయుకాలుష్యాన్ని పెంచి ప్రజారోగ్యానికి ముప్పు తేవడానికి గానీ, మున్సిపాలిటీ వాళ్లకు ఇచ్చి డంపింగ్ యార్డులో చెత్త దిబ్బలను కొండలుగా పెంచడానికి గానీ ఆమె ఒప్పుకోలేదు. తానే చొరవతో ఎండాకుల సమస్యకు పరిష్కారం వెదికారు. బ్రౌన్లీఫ్ ఛాలెంజ్ తీసుకున్నారు. నలుగురినీ కూడగట్టారు. ఒక్క ఎండాకునూ తగులబెట్టనియ్య కూడదని ప్రతినబూనారు. నాలుగేళ్లుగా ఎండాకులను తగుల బెట్టకుండా చూస్తున్నారు. ఎండాకులతో కం΄ోస్టు తయారు చేసుకునే పద్ధతులను ప్రచారం చేస్తున్నారు. ఆ కంపోస్టుతో చక్కని సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి దోహదం చేస్తూ మరెందరిలోనో ప్రేరణ కలిగిస్తున్నారు. ఎండాకులను వాడుకునే మూడు పద్ధతులు! రాలిన ఎండాకులకు నిప్పు పెడుతున్నారా? వద్దు. ఎందుకంటే దీని వల్ల గాలి కలుషితమవుతుంది. చెట్లు రాల్చే ఎండాకులు భూమికి తిరిగి చెట్లు అందిస్తున్న పోషకాలు. ప్రకృతిలో, అడవిలో రాలిన ఆకులు దొంతర్లుగా పేరుకొని భూమికి ఆచ్ఛాదన కల్పిస్తున్నాయి. వర్షానికి తడిచిన ఆకులు, అలములు కుళ్లి భూమిని సారవంతం చేస్తున్నాయి. అదితి బ్రౌన్లీఫ్.ఓఆర్జి పేరిట వెబ్సైట్ను రూపొందించారు. వాట్సప్ గ్రూప్ ప్రాంరంభించారు. ఫేస్బుక్ ఖాతా తెరిచారు. ఎండాకులను తగులబెట్టకుండా వాడుకునే మూడు పద్ధతులను ప్రచారం చేస్తున్నారు. అదితి బ్రౌన్లీఫ్.ఓఆర్జి పేరిట వెబ్సైట్ను రూ పొందించారు. వాట్సప్ గ్రూప్ ప్రారంభించారు. ఫేస్బుక్ ఖాతా తెరిచారు. ఎండాకులను తగులబెట్టకుండా వాడుకునే మూడు పద్ధతులను ప్రచారం చేస్తున్నారు. ఆచ్ఛాదన (మల్చింగ్) చెయ్యండిఎండాకులను మొక్కలు, చెట్ల దగ్గర నేలపై ఎండ పడకుండా మల్చింగ్ చేయాలి. ఎండ నేరుగా నేలకు తగలకుండా ఆకులతో ఆచ్ఛాదన కల్పిస్తే మట్టిలో ఉండే సూక్ష్మజీవులు, వానపాములకు మేలు జరుగుతుంది. కాలక్రమంలో ఆకులు కుళ్లి భూమిని సారవంతం చేస్తాయి.కంపోస్ట్ చెయ్యండి... ఎండాకులను కుళ్లబెట్టి కంపోస్టు తయారు చేయండి. కంపోస్టు చేయడానికి మూడు పద్ధతులు ఉన్నాయి. ఎ) ఇంటి ఆవరణలో ఒక మూలన గుంత తవ్వి ఆకులను అందులో వేయటం. బి) ఇనుప మెష్తో ట్రీగార్డు మాదిరిగా గంపను తయారు చేసి అందులో ఎండాకులు వేయడం. సి) ఎండాకులను కుప్పగా పోసి కూడా కంపోస్టు చెయ్యొచ్చు. ఈ మూడు పద్ధతుల్లో కూడా ఆకులను తేమగా ఉండేలా తరచూ నీరు పోస్తుండాలి. పేడ నీరు లేదా జీవామృతం లేదా వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం లేదా లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియా ద్రావణం లేదా పుల్లమజ్జిగ వంటి సేంద్రియ పదార్థాన్ని కుళ్లింపజేసే సూక్ష్మజీవరాశి ఉండే కల్చర్ను కలపాలి (వీటి గురించి మున్ముందు వివరంగా తెలుసుకుందాం)ఇతరులకివ్వండి... పట్టణాలు, నగరాలలో నివసించే వారు ఇంటి దగ్గర లేదా కాలనీ రోడ్లపై లేదా పార్కుల్లో చెట్లు రాల్చే ఆకులను కం΄ోస్టు చేసే ఉద్దేశం లేకపోతే వాటిని కంపోస్టు చేసుకోదలచిన వారికి అందించడం ఉత్తమం. పుణే వాసులు ఎండాకులను ఇచ్చి పుచ్చుకోవడానికి వీలుగా అదితి బ్రౌన్లీఫ్ పేరుతో వాట్సప్ గ్రూప్, ఫేస్బుక్ ఖాతాతోపాటు వివరంగా చర్చించేందుకు వెబ్సైట్ను సైతం 2016లో ప్రారంభించారు. తొలి ఏడాదే 500 బస్తాల ఎండాకులను ప్రజలు ఇతరులకు అందించారట. సోషల్ మీడియా ద్వారా సామాజికోద్యమం ప్రారంభించి ఉండకపోతే ఈ ఆకులన్నిటినీ తగులబెట్టి ఉండేవారని ఆమె సంతోషంగా చెబుతారు. అయితే, రెండో ఏడాదికి ఆకులను ఇతరులకిస్తాం అనే వారు లేకుండా ΄ోయారట. అంటే అందరూ కం΄ోస్టు తయారు చేసుకోవడం, దానితో కుండీలలో సేంద్రియ ఇంటిపంటలు పండించడం ప్రారంభించారన్న మాట! https://brownleaf.org -
రొయ్యల సాగు: సక్సెస్ సీక్రెట్ ఇదే!
రొయ్యల పెంపకం విజయవంతానికి సీడ్ (పిల్లల) నాణ్యతే కీలకమైన అంశం. టైగర్, వెనామీ వంటి సాగుకు అనువైన రొయ్యల జాతుల వలన ప్రపంచవ్యాప్తంగా ఆక్వా ఒక ముఖ్య పరిశ్రమగా మారింది. చెరువుల్లో రొయ్యల పెరుగుదల, ఆరోగ్యం, బతుకుదల అనేవి నీటి నాణ్యత, చెరువు నిర్వహణ పద్ధతులు, సీడ్ సాంద్రత, మేత నాణ్యత వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. చెరువులో రొయ్య పిల్లలు ఎలా పెరుగుతున్నా యనేది అర్థం చేసుకోవడం దిగుబడిని పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి, సుస్థిరత్వానికి ముఖ్యమైన అంశం. చెరువులోని నీటి వాతావరణ పరిస్థితులకు రొయ్యల సీడ్ అలవాటు పడే ప్రక్రియపై శ్రద్ధచూపటం చాలా అవసరం. ఈ ప్రక్రియనే ఎక్లిమటైజేషన్ అంటారు. హేచరీలు, చెరువుల మధ్య ఉష్ణోగ్రత, లవణీయత వంటి నీటి నాణ్యత గుణాలలో ఆకస్మిక మార్పులు గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది రొయ్యలలో శారీరక, ప్రవర్తనా సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల చెరువుకు అలవాటుచేయడం, ఈ మార్పులకు రొయ్యలు క్రమంగా సర్దుబాటు అవడానికి తోడ్పడుతుంది. ఒత్తిడి అధికమైతే మరణాలకు దారితీస్తుంది లేదా పెరుగుదల కుంటుపడుతుంది. రొయ్యల సీడ్ను చెరువుకు అలవాటు చేయటం ఒక క్లిష్టమైన అంశం. హేచరీలలో రొయ్యపిల్లలు స్థిరమైన, నియంత్రిత ఉష్ణోగ్రతలో పెరుగుతాయి. అయితే చెరువుల్లో వాతావరణ మార్పులు, నీటి ప్రవాహం కారణంగా క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వదిలినప్పుడు ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు రొయ్యల సీడ్ను ఒకవిధమైన ’షాక్’ కు గురి చేస్తుంది. వాటి జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమై వ్యాధులకు గురి చేస్తుంది.అదేవిధంగా, హేచరీ, చెరువు మధ్య లవణీయత (సెలినిటి) హెచ్చుతగ్గులు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. క్రమంగా అలవాటు చేస్తే రొయ్య పిల్లలు చెరువు నీటి లవణీయతకు సర్దుకోగలుగుతాయి. మరో ముఖ్యమైన అంశం నీటిలోని ఆక్సిజన్ స్థాయి. రొయ్యల ఆరోగ్యం, పెరుగుదలను ప్రోత్సహించడానికి హేచరీలు ఎయిరేషన్ ద్వారా అధిక స్థాయిలో ఆక్సిజన్ను అందిస్తాయి. అయితే, చెరువుల్లో ఆక్సిజన్ స్థాయి నీటి ఉష్ణోగ్రత, సంఖ్య వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. రొయ్యల సీడ్ను చెరువులో సరిగ్గా అలవాటు చేయకపోతే అకస్మాత్తుగా తక్కువ ఆక్సిజన్ స్థాయిలున్నపుడు అవి ఒత్తిడికి గురవుతాయి. అలాగే, పిహెచ్ హెచ్చుతగ్గులు స్టాకింగ్ సమయంలో పోస్ట్–లార్వాల బ్రతుకుదలపై ప్రభావం చూపెడతాయి. కాబట్టి వాటిని సర్దుబాటు చేయాలి. చెరువు నీటిని విత్తన సంచులకు క్రమంగా కలపడం, తరువాత నెమ్మదిగా చెరువులోకి రొయ్య పిల్లలను విడుదల చేయడం మేలు.చెరువు నీటికి సరిగ్గా అలవాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు: 1. మెరుగైన బతుకుదల 2. మంచి పెరుగుదల 3. వ్యాధి నియంత్రణ లేదా తక్కువ వ్యాధి ప్రమాదాలు4. పర్యావరణ ఒత్తిడి ప్రభావం తగ్గుదల 5. ఖర్చు తగ్గటం6. మెరుగైన ఉత్పాదకతచెరువులో రొయ్యల విత్తనాలను ప్రవేశపెట్టే ముందు, ఉష్ణోగ్రత, పిహెచ్, లవణీయత, నీట కరిగిన ఆక్సిజన్ స్థాయి వంటి కీలక నీటి గుణాలు రొయ్యలకు సరైన స్థాయిలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. వెనామీ రొయ్యలకు అనువైన పరిస్థితులు: ఉష్ణోగ్రత: 28–32 డిగ్రీల సెల్షియస్పిహెచ్: 7.5–8.5లవణీయత: 15–35 పిపిటి (స్థానిక పరిస్థితులను బట్టి)నీటిలో కరిగిన ఆక్సిజన్: 5 పిపిఎం కన్నా తక్కువచెరువు పరిస్థితులు, హేచరీ నీటి మధ్య ముఖ్యమైన వ్యత్యాసాలు ఉన్నట్లయితే, సీడ్ వేయడానికి ముందు సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది (ఉదా.. మంచినీరు, ఎయిరేషన్ మొదలైనవి). రవాణా సమయంలో ఒత్తిడిని తగ్గించడానికి రొయ్యల సీడ్ ను ( పోస్ట్–లార్వాలు) శుభ్రమైన, ఆక్సిజన్ ఉన్న బ్యాగ్లు లేదా ఫైబర్ కంటైనర్లలో రవాణా చేయండి. బ్యాగ్లు/కంటెయినర్ల రవాణా సమయంలో ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు రొయ్యలకు హాని కలిగిస్తాయి. పర్యావరణ ఒత్తిడికి ఎక్కువ కాలం గురికావడం సీడ్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి రొయ్యల విత్తనాల రవాణా వేగంగా జరిగేలా చూడండి.రొయ్యల సీడ్ను చెరువుకు అలవాటుచేసే ప్రక్రియసాగు చేసే ప్రదేశానికి రొయ్య పిల్లలను చేర్చిన తర్వాత, బ్యాగులను తాడు/కర్రల సహాయంతో చెరువు ఉపరితలంపై కట్టి ఉంచండి. ఉష్ణోగ్రతల సర్దుబాటుకు ఇది సహాయపడుతుంది. తర్వాత సీడ్ బ్యాగ్లను తెరిచి క్రమంగా చెరువు నీటిని సీడ్ బ్యాగ్లలోకి ప్రవేశపెట్టండి. ప్రతి 10–20 నిమిషాలకు 10–20% చొప్పున కంటైనర్/బ్యాగ్లో చెరువు నీటిని కలపండి. ఇది రొయ్యలు క్రమంగా పిహెచ్, ఉష్ణోగ్రత, లవణీయతలో తేడాలకు అనుగుణంగా మారడానికి సహకరిస్తుంది.కొనుగోలు చేసిన పి.ఎల్. సంఖ్య నీటి గుణాల వ్యత్యాసాల పరిధిని బట్టి కొన్ని గంటల పాటు ప్రక్రియను కొనసాగించండి. ఈ సమయంలో నీటి నాణ్యత గుణాలను నిరంతరం గమనించండి. థర్మామీటర్, రిఫ్రాక్టోమీటర్, పిహెచ్ మీటర్లను ఉపయోగించండి.చెరువు నీటిలోకి చేరిన రొయ్య పిల్లలు ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యం పాలవటం, మరణాలు పెరగడం వంటి ఒత్తిడికి సంబంధించిన ఏవైనా సంకేతాలు గమనిస్తే.. చెరువు నీటికి వాటిని అలవాటు ప్రక్రియను మరింత నెమ్మదిగా చేయండి లేదా నీటి గుణాలను తగిన రీతిలో మార్చండి. చెరువులోకి రొయ్యలను నెమ్మదిగా వదలండి. రొయ్య పిల్లలను ఒకేసారి చెరువు నీటిలోకి వేసెయ్యకుండా చిన్న బ్యాచ్లుగా విడుదల చేయండి.రొయ్య పిల్లలను చెరువు అంతటా సమానంగా పంపిణీ చేయండి. వాటికి షెల్టర్, ఆక్సిజన్, తగిన ఫీడింగ్ జో¯Œ లు అందుబాటులో ఉంచండి. విడుదల చేసిన తర్వాత, మొదటి కొన్ని రోజులు చెరువు నీటి నాణ్యతను జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ఉష్ణోగ్రత, లవణీయత లేదా ఆక్సిజన్ స్థాయి స్థిరంగా ఉండేలా చూసుకోండి.రొయ్యల పరిమాణం, వయసుకు తగిన మేత షెడ్యూళ్లను అమలుచేయండి. నీటి నాణ్యత క్షీణత ప్రమాదాన్ని తగ్గించడానికి అతిగా మేత ఇవ్వడం మానుకోండి. ఫీడ్ కంపెనీల ద్వారా సరఫరా చేయబడిన ఫీడ్ చార్ట్లను అనుసరించండి. మేత తినే తీరు, కదలికలను గమనించడం ద్వారా రొయ్యల ఆరోగ్యాన్ని గమనించండి. ఆరోగ్యకరమైన రొయ్యలు చురుకుగా తింటాయి. ప్రశాంతంగా ఈత కొడతాయి. ఒత్తిడికి సంబంధించిన ఏవైనా సంకేతాలు ఉంటే తక్షణమే పరిష్కరించాలి. ్ర΄ారంభ రోజుల్లో రొయ్య పిల్లలు చిన్నగా ఉంటాయి. స్పష్టంగా కనిపించవు కాబట్టి ఇది చాలా కష్టమైన ప్రక్రియ.చెరువు నీటికి అలవాటు చేసే ప్రక్రియలో రొయ్య పిల్లలు వ్యాధికారక క్రిములకు గురికాకుండా చూసుకోండి. వ్యాధుల ప్రవేశాన్ని నివారించడానికి రవాణాలో, చెరువు నిర్వహణ పద్ధతుల్లో సరైన పరిశుభ్రతను పాటించండి. చెరువు నీటి నాణ్యత గుణాలు, రొయ్యల ఆరోగ్య వివరాలను ‘రికార్డ్’ చేయండి. ఈ సమాచారం సమస్యలను పరిష్కరించడంలో, భవిష్యత్తులో రొయ్యల సాగులో తగిన మెళకువలు తీసుకోవడానికి సహాయపడుతుంది. మరికొన్ని సూచనలు: నీటి గుణాలను సర్దుబాటు చేస్తే రొయ్య పిల్లలు క్రమంగా, సాఫీగా చెరువుకు అలవాటు పడతాయి. ఆక్సిజన్ తగినంత అందేలా చూడండి. ఒత్తిడిని తగ్గించడానికి తక్కువ సంఖ్యలో రొయ్య పిల్లలను బ్యాచ్ల వారీగా రవాణా చేసి, నెమ్మదిగా చెరువు నీటిలోకి విడుదల చేయండి. రొయ్యలు, చెరువు వాతావరణానికి బాగా సర్దుబాటు అవుతున్నాయని నిర్ధారించుకోవడానికి విడుదల చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు వాటి ఆరోగ్యాన్ని, ప్రవర్తనను నిశితంగా గమనించండి.చాలా మంది రైతులు రొయ్య విత్తనాన్ని కొనుగోలు చేసి, త్వరగా చెరువులో వేసుకోవాలని ఆత్రంగా వ్యవహరిస్తుంటారున. నెమ్మదిగా చేపట్టాల్సిన ఈ కీలక ప్రక్రియను పట్టించుకోరు. కాబట్టి, రొయ్యల పంట విజయానికి ఉత్తమమైన ప్రారంభాన్ని ఇవ్వటం ముఖ్యం. ఈ ప్రక్రియలో సీడ్ను చెరువుకు అలవాటు చేయడమే కీలకఘట్టం. రొయ్యల సీడ్ ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో హేచరీ/ల్యాబ్లోని ఒత్తిడి పరీక్షలు సహాయపడతాయి. – డా. పి. రామమోహన్రావు (98851 44557), కాకినాడ -
వర్టికల్ టవర్ గార్డెన్ను ఇలా మీరే తయారు చేసుకోవచ్చు!
వర్టికల్ టవర్ గార్డెన్ ఇంటిపంటల సాగుదారులకు చాలా ఉపయోగకరం. మేడ మీద లేదా బాల్కనీలో, ఇంటి పెరట్లో అతి తక్కువ స్థలంలో (కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బారెల్లో 60 రకాల ఆకుకూరలు, కూరగాయలు, కషాయాల కోసం ఔషధ మొక్కలను పెంచుకోవచ్చు. బారెల్ మధ్యలో ఉండే పీవీసీ పైపులో వంటింటి వ్యర్థాలు వేస్తూ.. వర్మీ కం΄ోస్టును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టవర్ గార్డెన్లను సేంద్రియ ఇంటిపంటలపై ఆసక్తి, ఓపిక ఉన్న వారు తమంతట తాము తయారు చేసు కోవచ్చు. అదెలాగో హైదరాబాద్కు చెందిన వర్టికల్ టవర్ గార్డెన్ నిపుణులు రవి చంద్ర కుమార్ వివరిస్తున్నారు. మార్కెట్లో దొరికే 300 లీటర్ల లేదా 250 లీటర్ల హెచ్.డి.పి.ఇ. బారెల్ తీసుకోవాలి. బారెల్ పొడవు 36 అంగుళాలు. బారెల్కు చుట్టూతా 5 అంగుళాలకు ఒక చోట కత్తిరిస్తే (దీన్నే పాకెట్ అని పిలుస్తున్నాం).. 7 వరుసల్లో పాక్లెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్డంగా ఒక్కొక్క పాకెట్ వెడల్పు 5 అంగుళాలు ఉండేలా కొలత స్కేల్తో మార్క్ చేసుకోవాలి. రెండు పాకెట్ల మధ్య 4 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక వరుసలో 8 పాకెట్ వస్తాయి. 7 వరుసల్లో మొత్తం 56 పాకెట్లు వస్తాయి. బారెల్ పై భాగాన 4 మొక్కలు పెట్టవచ్చు. అన్నీ కలిపి 60 మొక్కలు పెట్టుకోవచ్చు. అంటే ఒక బారెల్ 60 కుండీలతో సమానం అన్నమాట! పాకెట్ ఎక్కడ పెట్టుకోవాలో మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసిన చోట బారెల్ను డ్రిల్ మెషిన్తో కత్తిరించి చిల్లు పెట్టాలి, జిగ్సా రంపం పట్టడం కోసం. జిగ్సా తో వరుసలల్లో మార్క్ చేసిన చోట్ల 5 అంగుళాల వెడల్పున కట్ చేయాలి. పాకెట్ మౌల్డింగ్ చేసే విధానం.. హీట్ గన్తో కట్ చేసిన ప్రదేశంలో హీట్ చేయాలి. తగిన హీట్ అయిన తరువాత ఆ ప్రదేశంలో చిత్రంలో చూపిన విధంగా సిమెంటు దిమ్మె అమర్చాలి. అలా అన్నిపాకెట్ ను తయారు చేయాలి. బారెల్ అడుగు భాగంలో మధ్యన 4 అంగుళాల రంధ్రం చేయాలి. పక్కన అర అంగుళం రంధ్రం చేయాలి. అధిక నీరు బయటకు వెళ్లడానికి అక్కడ గ్రోమేట్ పెటి టేకాహ్ అమర్చాలి. మధ్యలో 4 అంగుళాల పీవీసీ గొట్టం అమర్చాలి. గొట్టం చుట్టూ చిల్లులు పెట్టాలి. ఇదీ చదవండి: గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలుగొట్టం అమర్చే విధానం.. ఆ గొట్టాన్ని క్రింది భాగాన 6 అంగుళాలు బయటకు ఉండేలా అమర్చి.. అక్కడ ఎంసీల్తో అతకాలి. పై భాగాన జీయే వైరుతో కట్టాలి. 4 అంగుళాల గొట్టానికి పైన, కింద మూతలు అమర్చాలి. ఈ బారెల్ను నిలబెట్టడానికి ఇనుప స్టాండ్ను తయారు చేసుకోవాలి. స్టాండ్ 18 అంగుళాల పొడవు, 18 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల ఎత్తు ఉండాలి.వర్టికల్ గార్డెన్లో కంపోస్టు తయారు చేసే విధానం : వర్మీ కం΄ోస్టు 30%, రంపపు పొట్టు 30%, పశువుల ఎరువు 30%, వేప గింజల చెక్క 10%.. ఇవన్నీ కలిపి బారెల్లో సరిపడినంత నింపుకోవాలి. బారెల్ మధ్యలో అమర్చిన గొట్టంలో వంటింటి వ్యర్థాలు వేయాలి. అందులో చక్కటి వర్మీకంపోస్టు తయారవుతుంది. స్టాండ్ మీద వర్టికల్ గార్డెన్ను అమర్చుకున్న తర్వాత.. అందులో కం΄ోస్టు మిశ్రమాన్ని నింపుకోవాలి. బారెల్ చుట్టూ ఉన్న అరలలో విత్తనాలు నాటుకోవాలి. ఒక్కో వర్టికల్ గార్డెన్ టవర్ను తయారు చేసుకోవడానికి (బారెల్, స్టాండ్, టవర్, కం΄ోస్టు, విత్తనాలు.. అన్నీ కలిపి) రూ. 5 వేలు ఖర్చవుతుంది. వర్టికల్ టవర్కు రోజుకు కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. ఇందులో అన్ని రకాల ఆకుకూరలు, ఔషధ మొక్కలు చక్కగా పండించవచ్చని రవిచంద్ర కుమార్ తెలిపారు. -
గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలు
ఇరవై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతు కరుటూరి పాపారావు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ ఆయన స్వగ్రామం. 8 ఎకరాల్లో పదేళ్లుగా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. అరెకరంలో వివిధ రకాల పసుపు, పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. 2012లో బాసరలో సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొని స్ఫూర్తి పొందిన పాపారావు 2015 నుంచి 8.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. పంట వ్యర్థాలను కాలబెట్టకుండా జనుము, జీలుగతో కలిపి కుళ్లబెట్టి భూమిని సారవంతం చేస్తున్నారు ΄ పాపారావు. తన వ్యవసాయ క్షేత్రంలో 5వేల లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేసి బెల్లం, మజ్జిగ, మదర్ కల్చర్ కలిపి గోకృపామృతం.. దేశీ ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి, పుట్టమట్టి కలిపి జీవామృతం తయారు చేస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి పైప్లైన్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. పురుగుల నియంత్రణ కోసం వేప కషాయం, పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు.ఏడాది పాత బియ్యం..పంట నూర్పిడి అనంతరం నిల్వ, ప్రాసెసింగ్ అంతా సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ పోషక సంపన్న ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తుండటం రైతు పాపారావు మరో ప్రత్యేకత. వరి పొలం గట్ల మీద కందిని కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. కందులను ఇసుర్రాయితో ఆడించి సహజ విధానంలో పప్పుగా మార్చుతున్నారు. ధాన్యం దిగుబడి రసాయన సాగుతో పోలిస్తే సగమే వస్తోంది. కూలీల అవసరమూ ఎక్కువే. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి గన్నీ బ్యాగుల్లో నింపి ఏడాది పాటు నిల్వ చేస్తున్నారు. నిల్వ సమయంలో పురుగు పట్టకుండా ఉండేందుకు వావిలాకు, గానుగ ఆకు, సీతాఫలం ఆకు ధాన్యం బస్తాల వద్ద ఉంచుతున్నారు. ఏడాది దాటిన తరువాత ధాన్యాన్ని ముడి బియ్యం ఆడించి 10 కిలోల సంచుల ద్వారా ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతున్నారు.పచ్చి పసుపు ముక్కలు..పసుపు తవ్విన తరువాత ఉడకబెట్టి, పాలిష్ చేసి అమ్మటం సాధారణ పద్ధతి. అలాకాకుండా, పచ్చిగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి, నీడలో ఎండబెట్టి పసుపు పొడిని తయారు చేయిస్తున్నారు. ఉడకబెడితే పోషకాలు తగిపోతాయని ఇలా చేస్తున్నానని అంటున్నారు పాపారావు. నల్ల పసుపు, సేలం, కృష్ణ సేలం రకాల పసుపును సాగు చేస్తున్నారు. మునగాకును నీడలో ఆరబెట్టి ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఆయన 50 రకాలకు పైగా కూరగాయలు, సుగంధ, ఔషధ, పండ్ల రకాలను సేంద్రియ పద్ధతిలో పండిస్తు న్నారు. తాను పండించే పంటలతో పాటు పప్పులు, బెల్లం, పల్లీలు ఇతర జిల్లాలు, రాష్ట్రాల సేంద్రియ రైతుల నుంచి సేకరించి వాట్సప్ ద్వారా విక్రయిస్తున్నారు. పలువురు ప్రకృతి వ్యవసాయదారులను కలుపుకొని వాట్సప్లో‘నేచురల్ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్స్ గ్రూపు’ ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయక ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పాపారావును ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు పురస్కారంతో అనేక ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రకృతి సాగుకు మరింత తోడ్పాటునివ్వాలి అన్ని రకాల పంటలను రైతు పండించి, సంప్రదాయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి వినియోగదారుడికి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో నా వంతు కృషి చేస్తున్నాను. రైతులు అన్ని రకాల పంటలు పండించాలి. అన్ని పనులూ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవాలి. ప్రతి రైతూ ఈ లక్ష్యంతోనే ముందుకెళ్లాలి. ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం మరింత తోడ్పాటు ఇవ్వాలి. – కరుటూరి పాపారావు (96188 11894), జైతాపూర్, ఎడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా -
ఆచ్ఛాదనతో అధిక దిగుబడి!
సుభాష్ శర్మ(Subhash Sharma) కృషిపై 2018లో, హారిమన్ శర్మ విశేష కృషి గురించి 2017లోనే ‘సాక్షి సాగుబడి’లో కథనాలు ప్రచురించాం. ఈ ఏడాది వీరు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన సందర్భంగా ఆ కథనాలను పునర్ముద్రిస్తున్నాం.మహారాష్ట్ర.. విదర్భ.. యవత్మాల్.. ఈ పేర్లు వినగానే అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాల పాలైన వేలాది మంది పత్తి రైతుల విషాద గాథలు మదిని బరువెక్కిస్తాయి. అయితే, ఈ కథ అంతటితో ముగిసిపోలేదు. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా సేద్యాన్ని ఆనందమయంగా మార్చుకున్న అతి కొద్ది మంది ప్రకృతి వ్యవసాయదారులు కూడా అదృష్టవశాతూ అక్కడ ఉన్నారు. రసాయనాలను త్యజించి, నేల తల్లికి ప్రణమిల్లుతూ భూసారాన్ని పరిరక్షించుకుంటూనే అధిక దిగుబడులు సాధిస్తున్న అద్భుత ప్రకృతి వ్యవసాయదారుల్లో సుభాష్ శర్మ ఒకరు. ప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదన అతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, ఆచ్ఛాదనగా వేయడానికి గడ్డీ గాదం ఎక్కడ దొరుకుతుంది అని రైతులు ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్యకు సుభాష్ శర్మ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. రెండు సాళ్లు పత్తి వేస్తారు (కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు). ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదనగా వేస్తారు. పోలం అంతా ఇలాగే వేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించేవినూత్న పద్ధతిని ఆయన దీర్ఘకాలంగా అనుసరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా, పరిశోధకుడిగా ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న సుభాష్ శర్మతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ముఖ్యాంశాలు..సుభాష్ శర్మకు 66 ఏళ్లు. వ్యవసాయంలో 46 ఏళ్ల అనుభవం ఉన్న రైతు. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని, గడ్డు సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను వెదికిన తలపండిన ప్రకృతి వ్యవసాయదారుడు, రైతుశాస్త్రవేత్త. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. తన ప్రజ్ఞతో ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతులను రూపొందించుకున్నారు. కరువుకు, పత్తి రైతుల ఆత్మహత్యలకు నిలయమైన మహారాష్ట్ర విదర్భలోని యవత్మాల్ జిల్లా (చోటి గుజారి) వితస గ్రామ వాస్తవ్యుడైన ఆయనకు 19 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. 1975 నుంచి వ్యవసాయం చేస్తున్న సుభాష్ శర్మ 20 ఏళ్ల పాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా ఆర్థికంగా నష్టాలపాలవటమే కాకుండా భూసారం సర్వనాశనమైపోయింది. 1986 తర్వాత ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ దరశలో రసాయనిక వ్యవసాయ పద్ధతే నష్టదాయకమైనదన్న సత్యాన్ని గ్రహించారు. 1994 నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లారు. నిశిత పరిశీలనతో ప్రకృతికి అనుగుణమైన ఆచరణాత్మక సుస్థిర వ్యవసాయ పద్ధతులను రూపొందించుకొని అనుసరిస్తూ మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. ఆయనకున్న 3 ఎకరాలను ఆవులు, ఎద్దులు మేయడానికి కేటాయించి మిగతా పోలంలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఏడాది పోడవునా ఏవో కొన్ని రకాల పంటలు సాగు చేస్తుంటారు.పత్తి/కంది సాళ్ల మధ్యలో పచ్చి రొట్ట పంటల సాగుపత్తి లేదా కంది సాగులో సుభాష్ శర్మ అధిక దిగుబడులు పొందుతున్న పద్ధతి ఆసక్తికరంగానే కాదు.. రైతులెవరైనా సులభంగా అనుసరించడానికి వీలుగానూ ఉంది. రెండు సాళ్లలో పత్తి లేదా కంది పంట, వాటి పక్కనే మూడు సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలను సాగు చేస్తారు. ప్రతి సాలుకు మధ్య 2 అడుగుల దూరం ఉంటుంది. ఈ ఐదు సాళ్లు 10 అడుగుల స్థలంలో ఉంటాయి. అంటే.. 4 అడుగుల్లో పంట, 6 అడుగుల్లో పచ్చిరొట్ట పంటలు పెరుగుతాయి. పత్తి లేదా కంది సాళ్ల మధ్య 2 అడుగులు, మొక్కల మధ్య అడుగున్నర దూరం ఉంటుంది. సాధారణంగా పత్తి సాగు చేసే రైతులు 4“2 అడుగుల దూరం పాటిస్తారు. 2“1.5 అడుగుల దూరాన వేస్తున్నందున ఎకరానికి వేసే మొక్కల సంఖ్య గానీ దిగుబడి గానీ తగ్గబోదని, ఎకరానికి కిలో పత్తి విత్తనాలు అవసరమవుతాయని సుభాష్ శర్మ అన్నారు. పచ్చిరొట్ట పంటలుగా ఎకరానికి 4 కిలోల సజ్జ, 6 కిలోల అలసంద, 15 కిలోల జనుము విత్తనాలను కలిపి వరుసలుగా బోదెలపై విత్తుతారు. పత్తి లేదా కంది సాళ్లలో కలుపును అతి చిన్నగా ఉన్నప్పుడే మనుషులు పీకేస్తారు లేదా కుర్ఫీతో తీసేస్తారు. నెలకోసారి కలుపు తీసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. మరీ అవసరమైతే పంట తొలిదశలో గుంటక తోలుతారు. కలుపు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తే కలుపు తీత ఖర్చు 80% తగ్గుతుందని సుభాష్ శర్మ తెలిపారు. పచ్చిరొట్ట పంటలున్న సాళ్లలో కలుపు తియ్యరు. 45–50 రోజులు పెరిగిన తర్వాత పచ్చిరొట్ట పంట మొక్కలను, కలుపును కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఆ తర్వాత 30–35 రోజులు గడచిన తర్వాత మరోసారి కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఈ రెండు సార్లూ ఆచ్ఛాదనగా వేసే పచ్చిరొట్ట మూరెడు ఎత్తున వస్తుంది. కాబట్టి, ఆచ్ఛాదనతో సత్ఫలితాలు వస్తున్నాయి.పచ్చిరొట్ట ఆచ్ఛాదనతో ప్రయోజనాలు..1. పంట పక్కనే పచ్చిరొట్టను కూడా పెంచడం వల్ల సూర్యరశ్మి పూర్తిగా వినియోగమవుతుంది. ఆచ్ఛాదన వల్ల నేలలో సేంద్రియ కర్బనంతో పాటు భూసారం పెరుగుతుంది. 2. పోలం అంతటా వత్తుగా పంటలు ఆవరించి ఉండటం వల్ల, ఆచ్ఛాదన వల్ల వర్షాలకు భూమి పైపోర మట్టి కొట్టుకుపోకుండా రక్షింపబడుతుందని తెలిపారు. 3. పచ్చిరొట్ట పంటలు ఎర పంటగా పనిచేస్తాయి. జీవ నియంత్రణ వల్ల చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. ప్రతి 75 మిత్రపురుగులకు 25 శతృపురుగుల చొప్పున పెరుగుతుంటాయి. మిత్రపురుగులు శతృపురుగులను తింటూ వాటి సంతతిని అదుపు చేస్తూ ఉంటాయి. పురుగుల మందులు, కషాయాలు కూడా చల్లాల్సిన అవసరం లేదని, ఆ ఖర్చంతా రైతుకు మిగిలిపోతుందని సుభాష్ శర్మ తెలిపారు. సూరజ్ సూటి రకం పత్తి గులాబీ పురుగును సైతం తట్టుకుంటుందన్నారు. 4. భూమిలో తేమ ఆరిపోకుండా ఎక్కువ కాలం నీటి ఎద్దడి రాకుండా చూస్తుంది. పత్తి వేర్లకు బోజనంతోపాటు తేమ కూడా దొరుకుతుంది. వర్షాలు మొహం చాటేసి మరీ ఇబ్బంది అయినప్పుడు ఒకటి లేక రెండు తడులు ఇస్తున్నామని సుభాష్ శర్మ వివరించారు. ఒక పంట కాలంలో పత్తి లేదా కంది సాళ్లు వేసిన చోట తదుపరి పంట కాలంలో పచ్చిరొట్ట పంటలు వేస్తామని, ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు చల్లిన చోట పత్తి లేదా కంది పంటలు వేస్తూ.. విత్తిన ప్రతిసారీ పంట మార్పిడి చేస్తారు.పత్తి 12, కంది 15 క్వింటాళ్ల దిగుబడిపత్తిని పచ్చిరొట్టతో కలిపి సాగు చేసే ప్రయోగంలో.. సూరజ్ (సూటి రకం) పత్తి తొలి ఏడాది ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మూడో ఏడాదికి 12 క్వింటాళ్లకు పెరిగింది. మరో రెండు, మూడేళ్లలో 20 క్వింటాళ్లకు పెరుగుతుందని సుభాష్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నల్లరేగడి నేలలో ఇది ఒకటి, రెండు తడులు ఇచ్చే పద్ధతిలో దిగుబడి వివరాలు. పూర్తిగా వర్షాధారంగా ప్రయోగాత్మక సాగు వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు సుభాష్ శర్మ. అదేవిధంగా, కంది స్థానిక సూటి రకాలను విత్తి 15–20 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నామని తెలిపారు. రైతులు ఈ పద్ధతి వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకొని సాగు చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయని, తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందవచ్చని తెలిపారు. (సుభాష్ శర్మతో 94228 69620 హిందీలో మాట్లాడవచ్చు)ఆచ్ఛాదనలోని శాస్త్రీయతను అర్థం చేసుకోవాలిపత్తి 2 సాళ్లు వేసి.. ఆ పక్కనే 3 సాళ్లలో అనేక రకాల పచ్చిరొట్టను సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు భూసారం పెరగడం, బెట్టను తట్టుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెరవేరతాయి. చీడపీడల బెడద కూడా తీరిపోతుంది. పత్తి మాదిరిగానే కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఈ విషయాలు చాలా కీలకం. రైతులు మనసుపెట్టి దీనిలో దాగి ఉన్న శాస్త్రీయతను సరిగ్గా అర్థం చేసుకోవాలి. పచ్చిరొట్ట సాగుకు స్థలం వృథా అవుతున్నదని పోరబడకూడదు. రసాయనిక వ్యవసాయంలో కన్నా ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి, అధికాదాయం పొందటం ముమ్మాటికీ సాధ్యమే. – సుభాష్ శర్మ, ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, మహారాష్ట్రఆచ్ఛాదన వల్ల అనేక ప్రయోజనాలుపంటల సాళ్ల పక్కనే పచ్చిరొట్ట పంటలను పెంచటం వల్ల చాలా స్థలం వృథా అయినట్లు పైకి కనిపిస్తుంది. కానీ, నిజానికి బహుళప్రయోజనాలు నెరవేరతాయి. దీని వెనుక ఉన్న శాస్త్రీయతను రైతులు సరిగ్గా అర్థం చేసుకోవాలని సుభాష్ శర్మ అంటారు. పోలం బెట్టకు రాకుండా భూమిలో తేమను పచ్చిరొట్ట పంటలు కాపాడతాయి. ఆ పంటలను కోసి, అక్కడే ఆచ్ఛాదనగా వేస్తే నేలలోని తేమ ఆరిపోకుండా ఉంటుంది. వాతావరణంలో నుంచి నీటి తేమను ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం గ్రహించి భూమికి అందిస్తుంది. ఫలితంగా వానపాములు, సూక్ష్మజీవులు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వర్తిస్తూ నేలను సారవంతం చేస్తూ ఉంటాయి. పత్తి లేదా కంది మొక్కల వేర్లు పక్క సాళ్లలో ఉన్న ఆచ్ఛాదన కిందికే చొచ్చుకు వచ్చి దాహాన్ని తీర్చుకోవడంతోపాటు పోషకాలను గ్రహిస్తాయి. ఈ విధంగా పచ్చిరొట్ట సాగు వల్ల పత్తి లేదా కంది పంట దిగుబడి పెరుగుతుంది. -
మన నగరంలోనే అరుదైన పంటలు..రుద్రాక్ష, కుంకుమ పువ్వు..
హైదరాబాద్ నగరం కేవలం ఐటీ, పారిశ్రామిక స్టార్టప్లకు మాత్రమే కాదు.. అరుదైన పంటల ఆవిష్కర్తలకు నగరంలోని శివారు ప్రాంతాలు వేదికగా నిలుస్తున్నాయి.. బీటెక్ కోర్సులు పూర్తి చేసి, ఐటీ, ఇతర సాంకేతిక సాగులో ఆరితేరాల్సిన జిల్లా యువత.. అరుదైన పంటల పరిశోధనలు, సాగుపై దృష్టిసారించింది. అందమైన కాశ్మీర్ లోయల్లో మాత్రమే సాగయ్యే అరుదైన కుంకుమ పువ్వు బాలాపూర్ మండలం గుర్రంగూడలో సాగవుతుండగా, కేరళ తీరం వెంట మాత్రమే సాగయ్యే వక్క తోటలు శంకర్పల్లిలోనూ సాగవుతున్నాయి. ఇక సిమ్లా, ఇతర శీతల ప్రదేశాల్లో మాత్రమే కనిపించే యాపిల్ ప్రస్తుతం కందుకూరు మండలం పులిమామిడిలోనూ దర్శనమిస్తున్నాయి. సౌదీ అరేబియా దేశాల్లో విరివిగా పండే ఖర్జూర సరస్వతి గూడలో నోరూరిస్తుంది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అవకాడో ప్రస్తుతం దెబ్బగూడలోనూ లభిస్తుంది. నేపాల్ సరిహద్దులో అరుదుగా లభించే రుద్రాక్ష.. ప్రస్తుతం మేడ్చల్ మండలం రాయిలాపూర్లో సాగవుతుండటం గమనార్హం.. ఎస్బీఐలో ఉద్యోగం చేస్తూ.. పూర్వ మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో వ్యవసాయ కుటుంబం. నల్లగొండ ఎన్జీకాలేజీలో డిగ్రీ, ఉస్మానియాలో ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుతం కోఠి ఎస్బీఐలో పని చేస్తున్నా. అచ్చంపేటలో పదెకరాలు, సరస్వతి గూడలో ఏడెకరాలు ఉంది. యూట్యూబ్ ద్వారా అనంతపూర్లో ఖర్జూర సాగు చేస్తున్న విషయం తెలుసుకున్నా. ఆ మేరకు ఆరేళ్ల క్రితం మొత్తం 17 ఎకరాల్లో 1260 మొక్కలు నాటాను. ఎకరాకు రూ.5 లక్షల వరకూ వచి్చంది. మూడేళ్ల క్రితం దిగుబడి ప్రారంభమైంది. తొలిసారిగా 1.50 టన్నుల దిగుబడి వచి్చంది. ఆ తర్వాత 55 నుంచి 60 టన్నుల దిగుబడి వచ్చింది. – ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అచ్చంపేట (ఖర్జూర) విదేశాల నుంచి తిరిగొచ్చి.. బీటెక్ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక వెనక్కి తిరిగొచ్చా. అవకాడోపై అవగాహన ఉండటంతో అటువైపు చూశా.. మూడేళ్ల క్రితం 1.10 ఎకరాల విస్త్రీర్ణంలో 220 అవకాడో మొక్కలు నాటాను. సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది. డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందించా. చీడపీడల సమస్యే కాదు.. పెట్టుబడికి పైసా ఖర్చు కూడా కాలేదు. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచ్చింది. ఆన్లైన్లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. – రమావత్ జైపాల్, దెబ్బడిగూడ (అవకాడో) బీటెక్ చదువుతూనే.. బాలాపూర్ మండలం గుర్రంగూడ మాది. ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నా. వ్యవసాయ కుంటుంబం కావడంతో నాన్నతో పాటు తరచూ పొలానికి వెళ్తుంటా. కాశ్మీర్లో ప్యాంపూర్, పుల్వొమా జిల్లాల్లో అరుదుగా పండే కుంకుమ పువ్వు పంటను ఎంచుకున్నా. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. కల్తీని నివారించి, నాణ్యమైన పువ్వును అందివ్వాలనుకున్నా. ఇంటిపై ఖాళీగా ఉన్న ఓ గదిలో 2024 సెప్టెంబర్లో సాగు ప్రారంభించాను. రూ.5 లక్షలు ఖర్చు అయ్యింది. ఇప్పటి వరకూ 20 గ్రాముల వరకూ సేకరించాం. ఒక గ్రాము రూ.800 నుంచి రూ.1000 వరకూ పలుకుతోంది. – లోహిత్రెడ్డి, గుర్రంగూడ (కుంకుమ పువ్వు) వక్కసాగులో విశ్రాంత వైద్యుడు.. ఐడీపీఎల్ బాలానగర్లో ఫ్యామిలి ఫిజీషియన్గా నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించా. శంకర్పల్లి మాసానిగూడలోని భూమిలో ఏదైనా చేయాలని భావించా. ఏలూరులో నా స్నేహితుడు విజయసారధి సూచనలతో 2015లో నాలుగు ఎకరాల్లో.. ఎకరాకు 300 చొప్పున వక్క మొక్కలు నాటాను. 2023లో తొలిసారిగా పంట దిగుబడి 1500 కేజీలు వచ్చింది. కేజీ రూ.350 నుంచి రూ.400 పలుకుతుంది. వక్కతోటలోనే అంతరపంటలుగా మిరియాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, అల్లం, యాపిల్, ద్రాక్ష, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, అవకాడో, మ్యాంగో, జామ వంటి పండ్ల మొక్కలను సాగు చేస్తున్నా. మరో ఏడాదిలో పండ్ల దిగుబడి ప్రారంభమవుతుంది. – డాక్టర్ విజయ్కుమార్ కొడాలి, బోధన్ (వక్కసాగు)రాయలాపూర్లో రుద్రాక్ష.. ఫిన్లాండ్కు చెందిన మహిళను వివాహం చేసుకుని మేడ్చల్ మండలం రాయలాపూర్ గ్రామ శివారులో స్థిరపడ్డారు. ఇంటి చుట్టూ వివిధ రకాల చెట్లు నాటారు. దక్షిణ భారతదేశంలో అత్యంత అరుదుగా కనిపించే రుద్రక్ష మొక్కలను ఇంటి ముందు నాటారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. జనవరి, ఫిబ్రవరిలో కాయలు తెంపి, ఆరబెడుతుంటారు. ప్రదీప్ ఇటీవల వెయ్యి రుద్రాక్షలతో పూజ చేయడం కొసమెరుపు. – ప్రదీప్, మేడ్చల్ (రుద్రాక్ష) (చదవండి: గట్ బయోమ్ 'పవర్ హోమ్'..!) -
మిద్దె తోట : షేడ్నెట్ అవసరమా? కాదా?
మేడపైన ఖాళీ ఉంచకుండా పచ్చని పంటలతో కళకళలాడేలా చూసుకుంటే ఏడాది పొడవునా ఆ కుటుంబం అంతటికీ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కొంతవరకైనా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మేడపైన, పెరట్లో ఖాళీ లేకుండా ఇంటిపంటలు సాగు చేసుకోవటం అర్బన్ ప్రాంతాల్లో సొంతి ఇంటి యజమానులకు చాలా వరకు అలవాటైపోయింది. అయితే, వేసవిలో తమ పంటలను రక్షించుకోవటానికి సేంద్రియ మిద్దెతోట / ఇంటిపంటల సాగుదారులు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. షేడ్నెట్లు కట్టడం, గాలిదుమ్ములకు అవి చిరిగి΄ోవటం, ఎగిరి΄ోవటం పరి΄ాటి. అయితే, మండు వేసవిలోనూ షేడ్నెట్ అవసరం లేకుండానే పంటల ప్రణాళిక ద్వారా మిద్దె తోటలను సంరక్షించుకోవచ్చు అంటున్నారు సీనియర్ మిద్దెతోట నిపుణులు ‘లతా కృష్ణమూర్తి’.. ‘సాక్షి సాగుబడి’కి ఆమె తెలిపిన వివరాలు.. వచ్చేది ఎండాకాలం. షేడ్నెట్కు బదులుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చే పండ్ల మొక్కలను మిద్దెతోటలో పది అడుగులకు ఒకటి చొప్పున పెద్ద కుండీల్లో పెంచుకుంటే.. వాటి పక్కన చిన్న మొక్కలకు ఎండ నుంచి రక్షణ ఉంటుంది. మిద్దెతోట ఏర్పాటు చేసుకునేటప్పుడే కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలతోపాటు పండ్ల మొక్కలు కూడా పెట్టుకోవాలి.పండ్ల మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు (మొదటి సంవత్సరం) ఎండాకాలం ఉష్ణోగ్రతలకు మొక్కలు తట్టుకోలేకపోయినా రెండో సంవత్సరం నుంచి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మా మిద్దెతోటలో నిర్మించిన ఎత్తుమడుల్లో ప్రతి పది అడుగులకు ఒక పండ్ల చెట్లు పెంచుతున్నాం. మిద్దెతోట వల్ల ఇంటి లోపల చల్లగా ఉంటుంది. బయటి ఉష్ణోగ్రతల కంటే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మండువేసవిలోనూ ఇంట్లో ఏ.సి. అవసరం ఉండదు. అందువల్ల కరెంట్ వాడకం తగ్గుతుంది. ఖర్చు కలిసి వస్తుంది. అలాగే, ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందటంతోపాటు తేమ కూడా రిలీజ్ అయి, గదిలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇవీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే... రోజుకు నాలుగు కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా? -
సేద్యంలో మహిళా సైన్యం!
దేవతల స్వంత దేశంగా భావించే భూమిపై తమకంటూ సొంతమైన కుంచెడు భూమి లేని నిరుపేద మహిళలు వారు. కేరళ ప్రభుత్వం ఇచ్చిన చిన్న ఆసరాతో సాగునే నమ్ముకోని వేరే ఉపాధికి నోచుకోని ఆ మహిళలు చేయి.. చేయి కలిపారు. సాగుబాటలో వేల అడుగులు జతకూడాయి. మహిళల నుదుటి చెమట చుక్కలు చిందిన బీడు భూములు విరగపండాయి. పైరు పరవళ్లు తొక్కాయి. వ్యవసాయం లాభసాటి కాదనే మాటలు నీటిమీది రాతలుగా తేలాయి. కేరళలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ సేద్యం జరుగుతోంది. వ్యవసాయంలో మాదే పైచేయి సుమా అంటున్నారు కేరళ మహిళా రైతులు.భూమిలేని మహిళల ఆర్థిక స్వావలంభన కల్పించే దిశగా కేరళ ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న కార్యక్రమం కుడుంబశ్రీ. కేరళ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ 1998లో ఊపిరి΄ోసుకున్న ‘కుడుంబ శ్రీ’ కేరళ గడ్డపై మహిళా సంఘటిత శక్తికి ప్రతీకగా ఎదిగింది. ఆ రాష్ట్రం మొత్తం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉపాధి. ముఖ్యంగా తమకంటూ సొంత వ్యవసాయ భూములు లేని కుటుంబాలే ఎక్కువ. స్థానిక సాగు భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించటం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేది. వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎక్కువగా మహిళలే కావటంతో పనులు దొరక్క తీవ్ర ఒడిదుడుకులకు లోనవ్వాల్సివచ్చేది. రాష్ట్ర భూ సంస్కరణల చట్టం కౌలుపై నిషేధం విధించింది. అనధికారికంగా కౌలుకు ఇస్తే తమ భూమిపై అధికారం శాశ్వతంగా కోల్పోతామనే భయం యజమానుల్లో ఉండేది. కూలి పనులు మానుకొని సొంత వ్యవసాయం చేయాలనుకునేవారికి అది అందని ద్రాక్ష అయింది. సంఘటిత శక్తే తారక మంత్రం.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోను కేరళ ప్రభుత్వం వెనుకడుగేయలేదు. సామూహిక వ్యవసాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూమిలేని మహిళలకు ΄÷లం, పంటతో అనుబంధం కల్పించటమే లక్ష్య సాధనలో తొలి అడుగుగా కొంతమంది భూమిలేని మహిళలను కలిపి 15–40 మంది మహిళలను కలిపి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, వ్యక్తిగత వ్యవసాయ భూములను గుర్తించి సంఘాలకు దఖలు పరిచారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు సాగులో సేంద్రియ పద్ధతులకు పెద్ద పీట వేశారు. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మహిళా రైతుల కోసం ఏర్పాటు చేశారు. మంచి దిగుబడులను సాధించిన సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించేవారు. అన్ని జిల్లాల్లో 201 క్లస్టర్లలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ / ప్రకృతి సేద్యం జరుగుతోంది. నాబార్డు సహకారంతో కుడుంబశ్రీ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. రుణాలు తీసుకోవటం తిరిగి చెల్లించటంలో ఆయా సంఘాల్లోని మహిళా సభ్యులందరిది ఉమ్మడి బాధ్యత. ఒక్క తిరువనంతపురం జిల్లాలోనే ఆరువేల గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 30 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఆదునిక పద్ధతుల్లో అరటి సాగుపై కేర ళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన శిక్షణతో తక్కువ కాలంలోనే రెండింతల దిగుబడులు సాధించారు. వనితా కర్మసేన పేరుతో కుడుంబశ్రీ కోసం వ్యవసాయ పరికాలను, యంత్రాలను ఉపయోగించటంలో మహిళలకు శిక్షణ ఇచ్చారు. కొనుగోలుకు రుణాలు ఇచ్చారు. ప్రతి సంఘానికి తమ సొంత పరికరాలు ఉన్నాయి. దీంతో వారే శ్రామికులుగా మారటంతో ఖర్చును ఆదా చేయగలిగారు. పంటను నష్ట΄ోయిన సందార్భాల్లో నాబార్డ్ మహిళా రైతులకు అండగా నిలిచింది. 47 వేల పై చిలుకు సంఘాలు, లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నాయి. జీడిమామిడి, కొబ్బరి, వరి, అరటి, పైనాపిల్ పండ్లతోటలు, ఆకుకూరలు, గుమ్మడి, బఠాణీ, సొర, అల్లం, బెండ, మిరప, వంటి పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. తాము పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయించటంతో మంచి లాభాలు కళ్లజూశారు. ఆరు నెలలు తిరగకుండానే రుణాలు తిరిగి చెల్లించారు. ఒక్కో సీజన్లోనే ఈ సంఘాలు రూ. లక్ష వరకు నికరాదాయం ఆర్జించేవి. దీంతో తమకంటూ సొంత ఇళ్లను నిర్మించుకున్నారు. చిన్న వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకులు గతంలో మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవి కాదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. 10543 స్వయం సహాయక సంఘాలకు రూ. 123 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకుల దృష్టిలో మహిళారైతులు అంటే మంచి పరపతిగల మహిళలు. (చదవండి: కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..) -
కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..
గులాబీ ఎంత అందమైనదో అంత సున్నితమైనది. కామెల్లియా పువ్వు కూడా చూడటానికి గులాబీ పువ్వంత అందంగానే ఉంటుంది. అయితే, ఇది అంత సున్నితమైనది కాదు. ఈ పువ్వు రేకులు దృఢంగా ఉంటాయి. అందుకే, కామెల్లియా పంటను గులాబీ పంటకు చక్కని ప్రత్యామ్నాయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.కామెల్లియా ఆకర్షణీయమైన, అద్భుతమైన పువ్వులు. కామెల్లియా సొగసైన పుష్పించే మొక్క. తూర్పు ఆసియాకు చెందినది. ముఖ్యంగా జపాన్, చైనా, కొరియా దేశాల్లో సాగులో ఉంది. థియేసి కుటుంబానికి చెందినది. కామెల్లియా పూజాతిలో వైవిధ్యపూరితమైన అనేక వంగడాలతో పాటు సంకరజాతులు ఉన్నాయి.నిగనిగలాడే సతత హరిత ఆకులతో ఈ చెట్టు అన్ని కాలాల్లోనూ నిండుగా ఉంటుంది. అందానికి, అలంకారానికి ప్రతీకగా అద్భుతమైన తెలుపు, గులాబీ, ఎరుపు, ఊదా రంగుల్లో కామెల్లియా మొక్క పూస్తుంది. అందమైన నున్నని రేకులు, సున్నితమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన కామెల్లియాను తరచుగా గులాబీతో పోల్చుతూ ఉంటారు. గులాబీలు సాంప్రదాయకంగా ప్రేమ ప్రతీకలైతే.. కామెల్లియా పూలు స్వచ్ఛత, అభిరుచి, పరివర్తనలకు ప్రతీకగా చెబుతుంటారు.నీడలోనూ పెరుగుతుందిగులాబీ చెట్టు చల్లదనాన్ని, నీడను తట్టుకోలేదు. అయితే, కామెల్లియా అందంగా కనిపించటమే కాదు ఇటువంటి విభిన్న వాతావరణాన్ని కూడా తట్టుకుంటుంది. పదగా, చిన్నపాటి చెట్టుగా పెంచినా ముదురు ఆకుపచ్చని ఆకులతో కామెల్లియా మొక్క పూలు లేనప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల గార్డెన్లో గాని, అలంకరణలో గానీ కామెల్లియా పూలు గులాబీలకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి. కామెల్లియా పూలు గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో పూస్తాయి కాబట్టి ఆయా సందర్భాలకు తగిన రంగు పూలను ఉపయోగపెట్టుకోవచ్చు. పూరేకులు మృదువుగా, గుండ్రంగా, మందంగా ఉంటాయి కాబట్టి ఇన్డోర్ బొకేల్లో పెట్టినా, గార్డెన్లో పెంచినా ఈ పూలు ఏడాది పొడవునా చూడముచ్చటగా ఒదిగిపోతాయి. గులాబీలు ఇలా కాదు. గులాబీ రేకులు బాగా సున్నితమైనవి, పల్చటివి కాబట్టి త్వరగా వాడిపోతాయి. కామెల్లియా పూలు రంగు, రూపు, నిర్మాణం, పరిమాణం విషయంలో ఇతర పూజాతుల మధ్య వైవిధ్యంగా నిలబడుతుంది. ఈ పువ్వులోనే ఆడ (పిస్టిల్), మగ (స్టేమెన్స్) భాగాలు అమరి ఉండటం వల్ల పరాగ సంపర్కానికి అనువుగా ఉంటుంది. ఈ పువ్వులో వంగడాన్ని బట్టి 5 నుంచి 9 రేకులు ఉంటాయి. ఇవి సాధారణంగా గుడ్డు ఆకారంలో స్పైరల్ పద్ధతిలో కూడుకొని ఉంటాయి. కామెల్లియా పూలలో రేకుల వరుసలు సింగిల్ (కొద్ది రేకులతో) లేదా సెమీ డబుల్ నుంచి డబుల్ (అనేక వరుసలు కలిసి) ఉంటాయి. పూల రంగులు... ప్రతీకలుపూలు లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని రకాల్లో ఊదా రంగులో, అనేక రంగులతో కూడిన రేకులతోనూ కామెల్లియా పూలు పూస్తాయి. తెల్ల కామెల్లియా పూలు స్వచ్ఛతకు, అమాయకత్వానికి, అనురాగానికి ప్రతీకలు. గులాబీ రంగు కామెల్లియా పూలుఇష్టానికి, ప్రేమకు ప్రతీకలు. ఎర్ర కామెల్లియా పూలు అభినివేశానికి, గాఢమైన ప్రేమకు ప్రతీకలు. ఊదా రంగు కామెల్లియా పూలు ఆరాధనకు, పరివర్తనకు ప్రతీకలుగా చెబుతారు. ఈ పువ్వు 5–10 సెం.మీ. (2–4 అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటుంది. కొన్ని కామెల్లియా రకాల పూలు 12 సెం.మీ. (4.7 అంగుళాల) వరకు ΄÷డవుగా, గుండ్రంగా అద్భుతమైన ఆకర్షణీయంగా పెరుగుతాయి. ఈ చెట్టు ఏ సీజన్లో అయిన నిగనిగలాడే ముదురు ఆకుపచ్చని ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆకులు 5–10 సెం.మీ.ల ΄÷డవున, 2–5 సెం.మీ. (0.8 నుంచి 2 అంగుళాల) వెడల్పున ఉంటాయి.2 నుంచి 12 మీటర్ల ఎత్తు కామెల్లియా మొక్కను పొద మాదిరిగా పెంచుకోవచ్చు లేదా చిన్నపాటి నుంచి మధ్యస్థ ఎత్తు ఉండే చెట్టుగానూ పెంచుకోవచ్చు. రకాన్ని, పరిస్థితులను బట్టి 2 నుంచి 12 మీటర్ల (6.5 నుంచి 40 అడుగుల) ఎత్తు వరకు పెరుగుతుంది. కాయ ఆకుపచ్చగా లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. విత్తనాలు ఓవల్ షేపులో చిన్నగా, గట్టిగా ఉంటాయి. వీటి నూనెను సౌందర్యసాధనాల్లో వాడతారు. వంటకు కూడా వాడుతుంటారు. కామెల్లియా జాతిలో చాలా రకాల చెట్లు శీతాకాలంలో పూతకొస్తాయి. ఇవి పెరిగే వాతావరణ స్థితిగతులు, నేలలను బట్టి పూత కాలం మారుతూ ఉంటుంది.పూలు.. అనేక వారాలు! కామెల్లియా మొండి జాతి. చల్లని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గులున్న ప్రాంతాల్లోనూ తట్టుకుంటుంది. గులాబీ చెట్లతో పోల్చితే కామెల్లియా చెట్లు పెద్దవి, చాలా కాలం మనుగడసాగిస్తాయి. దీర్ఘకాలం ఆధారపడదగిన పూల చెట్ల జాతి ఇది. దీని పూలు అనేక వారాల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ చెట్లకు ఆకులు ఏడాది పొడవునా నిండుగా, ముచ్చటగొలుపుతుంటాయి.ఆమ్ల నేలల్లో పెరుగుతుందిగులాబీ మొక్కను జాగ్రత్తగా పెంచాలి. తరచూ కొమ్మలు కత్తిరించాలి. చీడపీడల నుంచి జాగ్రత్తగా రక్షించుకోవాలి. తరచూ మట్టిలో ఎరువులు వేస్తూ ఉండాలి. కానీ, కామెల్లియా చెట్లు అలాకాదు. వీటి మెయింటెనెన్స్ చాలా సులభం. మొక్క నాటిన తర్వాత నిలదొక్కుకుంటే చాలు. నీరు నిలవని ఆమ్ల నేలల్లో పెరుగుతుంది. ఏడాదిలో చాలా తక్కువ రోజులు మాత్రమే ఎండ తగిలే ప్రాంతాల్లో పూల తోటను పెంచాలంటే కామెల్లియాను ఎంచుకోవాలి. చిన్న పొదగా పెంచుకోవచ్చు. తరచూ కత్తిరిస్తూ హెడ్జ్లుగా అనేక రకాలుగా, అనేక సైజుల్లో దీన్ని పెంచుకోవచ్చు. గులాబీ మొక్కల్ని పొదలుగా, తీగలుగా మాత్రమే పెంచగలం. గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో అందంగా పూస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే పూలు కావటం కూడా ముఖ్యమైన విషయం. ఇన్ని ప్రత్యేకతలున్నందునే గులాబీకి కామెల్లియాను చక్కని ప్రత్యామ్నాయంగా చెబుతారు. ఆకులతో టీ, గింజలతో నూనెకామెల్లియా జాతిలో 100–250 వైవిధ్యపూరితమైన రకాలు ఉండటం విశేషం. పువ్వు రూపు, రంగును బట్టి అది ఏ రకమో గుర్తించవచ్చు. ‘కామెల్లియా జ΄ోనికా (జూన్ కామెల్లియా) రకం ఎక్కువగా సాగులో ఉంది. దీని పూలు పొడవుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. తెలుపు నుంచి ముదురు ఎరుపు, గులాబీ రంగుల పూలు జూన్ కామెల్లియా చెట్టు పూస్తుంది. కామెల్లియా సినెన్సిస్ (టీ కామెల్లియా) రకం చెట్టు ఆకులతో టీ కాచుకొని తాగుతారు. అందువల్ల దీని ఆకుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.దీని తెల్లని పూలు చిన్నగాను, తక్కువ ఆకర్షణీయంగానూ ఉంటాయి. కామెల్లియా ససన్కువ రకం పూలు చిన్న, అతి సున్నితంగా ఉన్నా సువాసనను వెదజల్లుతాయి. జూన్ కామెల్లియా రకం కన్నా చాలా ముందుగానే ఈ రకం చెట్టు పూస్తుంది. కామెల్లియా రెటిక్యులాట జాతి చెట్లకు పొడవాటి పూలు పూస్తాయి. అందరినీ ఆకర్షించగల ఈ రకం చెట్లు చైనాలో విస్తారంగా కనిపిస్తాయి. కామెల్లియా ఒలీఫెరా రకం కూడా చైనాలో విస్తారంగా కనిపిస్తుంది. దీని విత్తనాల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నూనెను వంటకాల్లో, సౌందర్య సాధనాల తయారీకి కూడా వాడుతున్నారు. చిన్న, తెల్లని పూలు పూస్తుంది. వాణిజ్యపరంగా చూస్తే మంచి ఆదాయాన్నిచ్చే రకం ఇది. -
తక్కువ ఖర్చుతో...పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్
రసాయనిక వ్యవసాయం వల్ల కాలుష్య కాసారంగా మారిపోయిన వ్యవసాయ భూములను తక్కువ ఖర్చుతో, సులభంగా, సమర్థవంతంగా శుద్ధి చేసే కొన్ని జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ముంబై ఐఐటి పరిశోధకులు కనుగొన్నారు. రసాయనిక పురుగుమందుల వల్ల, ఇతరత్రా కాలుష్య కారకాల వల్ల పంట భూములు నాశనమవుతున్న సంగతి తెలిసిందే.విషతుల్య కాలుష్య కారకాలను హరించటంతో పాటు నేలలో ఉన్నప్పటికీ మొక్కలకు అందుబాటులో లేని పోషకాలను అందుబాటులోకి తేవటం ద్వారా పనిలో పనిగా పంట దిగుబడిని కూడా పెంపొందించడానికి ఈ ‘బ్యాక్టీరియా కాక్టెయిల్’ ఉపయోగపడుతున్నదని ముంబై ఐఐటి పరిశోధకులు ప్రకటించారు. ముంబై ఐఐటిలో బయోసైన్సెస్, బయోఇంజినీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే మార్గ దర్శకత్వంలో సందేశ్ పపడే ఈ పరిశోధన చేశారు. మట్టిలోని విషాలను విచ్చిన్నం చేసి తీసివేయటంతో పాటు ఈ బ్యాక్టీరియా అధికోత్పత్తికి దోహదం చేసే గ్రోత్ హార్మోన్ల పెరుగుదలకు ఊతం ఇస్తున్నాయని, అదేసమయంలో హానికారక శిలీంధ్రాలను అరికడుతున్నాయని, తద్వారా పోషకాల లభ్యత పెరుగుతోందని గుర్తించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందుల వాడకాన్ని తగ్గించటానికి.. నేలల ఆరోగ్యం, ఉత్పాదకశక్తిని పెంపొందించడానికి ఉపయోడపడుతోందని ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే వెల్లడించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందులలోని బెంజీన్ వంటి ఆరోమాటిక్ కాంపౌండ్స్ వల్ల నేలలు కలుషితం కావటం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఈ సమ్మేళనాలు విషతుల్యమైనవి. విత్తనం మొలక శాతాన్ని ఇవి తగ్గిస్తాయి. పంట మొక్కల ఎదుగుదలకు, దిగుబడికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ధాన్యాలు, గింజల్లో, మొక్క భాగాల్లో ఈ విషతుల్యమైన సమ్మేళనాలు చేరి΄ోతాయి. కార్బారిల్, నాఫ్తలిన్, బెంజోయేట్, 2,4–డ్రైక్లోరోఫెనాక్సియేసెటిక్ ఆసిడ్, థాలేట్స్ను పురుగుమందుల్లో విస్తృతంగా వాడుతున్నారు. సౌందర్యసాధనాలు, దుస్తులు, నిర్మాణ రంగం, ఆహార రంగంలో వాడే ప్రిజర్వేటివ్స్, అద్దకం, పెట్రోలియం, ప్లాస్టిక్ ఉత్పత్తి రంగాల్లో కూడా ఈ విషతుల్యమైన సమ్మేళనాలను వాడుతున్నారు. వీటి వల్ల మట్టి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. అయితే, ఈ కలుషితాలను తొలగించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న రసాయనిక పద్ధతి లేదా కలుషితమైన మట్టిని తొలగించటం వంటి పద్ధతులు అధిక ఖర్చుతో కూడినవే కాక సమస్యను సమూలంగా పరిష్కరించకుండా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి. ఈ దృష్ట్యా సమస్యాత్మక నేలలను శుద్ధి చేసుకోవటానికి ఐఐటి ముంబై పరిశోధకుల కృషి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.సహజ పద్ధతిలో శుద్ధిఘాటైన వాసనలతో కూడిన రసాయనిక విషపదార్థాలను చక్కగా విచ్ఛిన్నం చేయటానికి సూడోమోనాస్, అసినెటోబాక్టర్ తదితర జాతుల బ్యాక్టీరియా ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు. ఇవి విషతుల్య సమ్మేళనాలను తిని.. హానికరం కాని, విషరహిత సమ్మేళనాలుగా మార్చుతున్నాయి. ఆ క్రమంలో కలుషిత∙పర్యావరణాన్ని ఇవి సహజంగా శుద్ధి చేస్తున్నాయని ఫలే వ్యాఖ్యానించారు.పెరిగిన పోషకాల లభ్యత ఫాస్ఫరస్, పొటాషియం వంటి నీట కరగని స్థూల పోషకాలను ఈ బ్యాక్టీరియా నీట కరిగేలా చేస్తుంది. తద్వారా పంట మొక్కల వేర్లు అదనపు పోషకాలను పీల్చుకునే అవకాశం కల్పిస్తాయి. నిస్సారమైన భూముల్లో పెరిగే పంట ఐరన్ను ఎక్కువగా తీసుకోలేకపోతుంటుంది. ఈ సూక్ష్మజీవులు సైడెరోఫోర్స్ అనే పదార్ధాన్ని విడుదల చేయటం ద్వారా ఐరన్ను సరిగ్గా తీసుకునేలా చేస్తాయి. అంతేకాకుండా ఇండోల్ అసెటిక్ ఆసిడ్ (ఐఎఎ) అనే గ్రోత్ హార్మోన్ను ఈ బ్యాక్టీరియా విడుదల చేసి దిగుబడిని పెంచుతుంది. ఇంకా ప్రొఫెసర్ ఫలే ఇలా అన్నారు.. ‘సూడోమోనాస్, అసెనెటోబాక్టర్ జెనెరకు చెందిన అనేక జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని వాడిన తర్వాత గోధుమ, పెసర పాలకూర, మెంతికూర తదితర పంటల దిగుబడి 40–45% వరకు పెరిగింది. మట్టిలో రసాయనాలను కొన్ని రకాల బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంటే, మరికొన్ని సూక్ష్మజీవులు మొక్కల పెరుగుదలను పెంపొందించే హార్మోన్ ఉత్పత్తికి, చీడపీడల బెడద నుంచి దీటుగా తట్టుకునేందుకు ఉపయోగపడుతున్నాయని, కలసికట్టుగా పనిచేస్తే కలిగే ప్రయోజనం ఇదే అన్నారు ప్రొ. ఫలే. -
11న తార్నాకలో సేంద్రియ సంత : పిండివంటలు, చేనేత వస్త్రాలు
గ్రామభారతి, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రీయ సంతను నిర్వహిస్తున్నారు. ఆధునిక సమాజంలో ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆదరణపెరుగుతోంది.సేంద్రీయ ఆహారం ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలనే అవగాహన కూడా బాగా పెరిగింది. ఇలా ఆర్గానిక్ ఉత్పత్తులు, సంప్రదాయ రుచులు , సహజ ఆహారాలను ఇష్టపడేవారికి ఈ సంత ఒక అవకాశం కావచ్చు. సికింద్రాబాద్ తార్నాకలోని మర్రి కృష్ణా హాల్లో ఈ నెల 11 (శనివారం)న ఉ. 10 నుంచి సా. 7 గం. వరకు సేంద్రియ/ప్రకృతి ఆహారోత్పత్తుల మూలం సంత జరగనుంది. దేశీ వరి బియ్యం, చిరుధాన్యాలు, ఇతర ఉత్పత్తులు, సంప్రదాయ పిండివంటలు, చేనేత వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు నిర్వాహకులు సూర్యకళ తెలిపారు. సంప్రదాయ రుచులతో కూడిన ఆర్గానిక్ భోజనం ఈ సంత ప్రత్యేకత. ఇతర వివరాలకు.. 94908 50766. -
ఇంటి పంటల సాగుకు ఏడు సూత్రాలు!
‘సాక్షి’ పప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిలో స్ఫూర్తిని రగిలించి ‘ఇంటిపంట’ల సాగుకు ఉపక్రమింపజేసింది. నివసించే ఇంటి వద్ద ఉన్న తక్కువ స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో పండించుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతున్నారు. అటువంటి సహజాహార ప్రేమికుల్లో డా. వసంత శ్రీనివాసరావు ఒకరు. కొత్తగా ఇంటిపంటల సాగు ప్రారంభించిన వారికి తరచూ ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం.. కొన్ని పద్ధతులు, సూచనలను స్వీయానుభవంతో ఆయన మీ ముందుంచుతున్నారు.జీవామృతం..కావలసిన పదార్థాలు...తాజా(పది రోజుల్లోపు) నాటు లేదా దేశీ ఆవు పేడ 2 కేజీలు, నాటు ఆవు పంచకం ఒకటిన్నర లీటర్లు, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) అర కేజీ, ఏదైనా పప్పుల(కంది/శనగ/మినుము/పెసర..) పిండి అర కేజీ, బాగా పండిన అరటి పండ్లు 2 లేదా 3, చెట్ల కింద మట్టి 2 గుప్పిళ్లు, 30 – 35 లీటర్ల నీరు, 50 లీటర్ల డ్రమ్ము. తయారీ విధానం... పేడ, తురుముకున్న బెల్లం, పప్పుల పిండి, మట్టి, అరటి పండ్ల గుజ్జు.. వీటిని చేతితో బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో ఆవు పంచకం వేసి మళ్లీ కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 50 లీటర్లు పట్టే డ్రమ్ములో వేసుకొని 30 నుంచి 35 లీటర్ల నీటిని పోయాలి. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని నీడలో పెట్టుకోవాలి. ఇలా భద్రపరచుకున్న ద్రావణాన్ని ఉదయం, సాయంత్రం పూటల్లో వేప కర్రతో ఒక నిమిషం పాటు కుడి చేతివైపు తిప్పుతూ మొదట 3 రోజులు కలుపుకోవాలి. నాలుగో రోజు నుంచి వాడుకోవడానికి జీవామృతం మంచి బ్యాక్టీరియాతో తయారవుతుంది. వాడే విధానం: ఇలా తయారైన జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో మొక్కలు, చెట్ల పాదుల్లో పోయవచ్చు. వాటిపైన పిచికారీ చేయొచ్చు. ఇలా తయారుచేసుకున్న జీవామృతాన్ని 7–10 రోజుల్లోపు వినియోగించాలి.బూడిద+ పసుపు మిశ్రమంకావలసిన పదార్థాలు...దేశీ/నాటు ఆవు పేడతో చేసిన పిడకలు, పసుపు తయారీ పద్ధతి... పిడకలను కాల్చి బూడిద చేసుకోవాలి. తర్వాత ఆ బూడిదను మట్టికుండలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న బూడిద తగినంత తీసుకొని.. అంతే పరిమాణంలో పసుపు కల΄ాలి. ఈ మిశ్రమాన్ని తీగజాతి మొక్కలపై చల్లితే పూత రాలడం తగ్గుతుంది.కీటకాల నివారిణి(మల్టీ పెస్ట్ కంట్రోలర్)...కావలసిన పదార్థాలు...పావు కేజీ చొప్పున జిల్లేడు, మారేడు, వేప, కానుగ, ఉమ్మెత్త, సీతాఫలం, గన్నేరు ఆకులతోపాటు దేశీ ఆవు పంచకం(డ్రమ్ములో వేసిన ఈ ఆకుల మిశ్రమం పూర్తిగా మునగడానికి) తగినంత.తయారీ విధానం: పైన చెప్పిన అన్ని రకాల ఆకులను మెత్తగా నూరుకొని.. ఏదైనా ఒక ప్లాస్టిక్ పాత్రలో పెట్టి ఆకుల మిశ్రమం పూర్తిగా మునిగే వరకు ఆవు మూత్రం పోయాలి. ఈ మిశ్రమాన్ని 15 రోజులు మురగబెట్టాలి. ఆ తర్వాత వడకట్టుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. కషాయాన్ని 1:30 నిష్పత్తిలో నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉన్నదైతే అంత ఎక్కువ ప్రభావశీలంగా పనిచేస్తుంది.ఆచ్ఛాదన (మల్చింగ్)కుండీల్లోని మట్టిని నిత్యం తేమగా ఉంచడానికి ఆచ్ఛాదన(మల్చింగ్) పద్ధతి బాగా సహకరిస్తుంది. ఈ ఆచ్ఛాదన ఎండి΄ోయిన ఆకులతోను, ఎండు వరిగడ్డితోను చేసుకోవచ్చు. ఈ ఆచ్ఛాదన 7 నుంచి 10 అంగుళాల మందాన వేయాలి. తద్వారా కుండీల్లో ఉన్న మట్టి తేమను పట్టిఉంచగలుగుతుంది. తద్వారా మట్టిలో ఉన్న వానపాములు మట్టి పైభాగానికి రావడానికి అనువైన వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. వాటితోపాటుగా కింది మట్టిలోని పోషకాలను మొక్కల వేళ్లకు అందుబాటులోకి తెస్తుంది. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.వేప కషాయంకావలసిన పదార్థాలు... తాజా వేపాకులు అర కేజీ, తాజా దేశీ ఆవు పేడ అర కేజీ, దేశీ ఆవు పంచకం అర లీటరు. తయారీ విధానం: మెత్తగా నూరిన వే΄ాకు మిశ్రమానికి ఆవు పేడ, ఆవు పంచకం చేతితో కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకున్న వేప కషాయాన్ని 3 రోజులు పులియబెట్టాలి. నాలుగో రోజున ఈ మిశ్రమాన్ని గుడ్డతో వడబోసి దాచుకోవాలి. 1:10 నిష్పత్తిలో వేప కషాయం, నీరు కలిపి ప్రతి పది నుంచి పదిహేను రోజుకొకసారి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఎగ్ అమైనో ఆమ్లం (ముట్టగయం):కావలసిన పదార్థాలు:నాటు కోడిగుడ్లు 2 లేక 3, మూత ఉన్న గాజు సీసా(లీటరు ద్రవం పట్టే అంతది), నాటు కోడిగుడ్లు మునగడానికి కావలసినంత తాజా నిమ్మరసం, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) పావు కేజీ. తయారీ విధానం: గాజు సీసాలో నాటు కోడిగుడ్లను (పగలగొట్టకుండా, పెంకు తీయకుండా) ఉంచాలి. గుడ్లు మునిగేంత వరకు తాజా నిమ్మరసం ΄ోయాలి. మూత గట్టిగా పెట్టి 18 రోజులు వేడి తగలని ప్రదేశంలో ఉంచుకోవాలి. 18వ రోజున దీనిలో తురిమిన బెల్లాన్ని వేసి బాగా కలిపి ఆ రోజు నుంచి మళ్లీ పది రోజుల వరకు వేడి తగలని నీడ ప్రదేశంలో భద్రపరచాలి. మొత్తం 28 రోజుల్లో పిచికారీకి సిద్ధమవుతుందన్నమాట. పిచికారీ విధానం: సిద్ధమైన ఎగ్ అమైనో ఆమ్లంను ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పిచికారీలో మరోపద్ధతి: 900 మిల్లీలీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల జీవామృతం, 2 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో ఆసిడ్ కలిపి కూడా మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. పూత పుష్కలంగా వస్తుంది. పూత రాలకుండా ఉండడానికి ఇది ఉపయోగ -
పుట్టింది పనామా, పోషకాల చిరునామా
ప్రాచుర్యంలోకి రాని అద్భుతమైన ఉష్ణమండల పండ్ల జాతిలో ‘స్టార్ ఆపిల్’ ఒకటి. సపోటేసియా కుటుంబానికి చెందిన ఈ పండును వండర్ మిల్క్ ఫ్రూట్ అని వ్యవహరిస్తుంటారు. చూపులకు గుండ్రటి నేరేడు పండులాగా ఉంటుంది. మధ్యకు కోసి చూస్తే నక్షత్రపు ఆకారంలో త్లెని గుజ్జు ఉంటుంది. అందుకే దీన్ని ‘స్టార్ ఫ్రూట్’ అంటారు. దీని రంగును బట్టి పర్పుల్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. స్టార్ ఆపిల్ శాస్త్రీయ నామం క్రైసోఫైల్లం కైనిటో. కైనిటో, కైమిటో అని అంటుంటారు. ఈ పదాల మూలాలు పురాతన మయన్ భాషలో ఉన్నాయి. తెల్లని, తియ్యని రసం కలిగి ఉంటుంది కాబట్టి ఈ పేరు వచ్చిందట.పుట్టిల్లు పనామాస్టార్ ఆపిల్ మన వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో సాగుకు అనువైన సతత హరిత వృక్షం. పనామా దేశంలోని ఇస్థమస్ దీని పురిటి గడ్డ. అక్కడి నుంచి గ్రేటర్ అంటిల్లెస్, వెస్ట్ ఇండీస్కు విస్తరించింది. ఇవ్వాళ స్టార్ ఆపిల్ విస్తరించని ఉష్ణమండల ప్రాంతాల్లేవంటే అతిశయోక్తి కాదు. ఈశాన్య ఆసియా దేశాల్లో ఈ పండ్ల చెట్టు ఎంచక్కా ఇమిడిపోయి సాగవుతోంది. స్టార్ ఆపిల్ చెట్టు చాలా వేగంగా పెరుగుతుంది. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ ఊదా రంగు పండ్లలోని తెల్లని గుజ్జు, రసం తియ్యగా ఉంటుంది. పంట పండే స్థానిక ప్రాంతాల్లో తాజా పండ్ల వినియోగంతో పాటు ఇతర దేశాలకు వాణిజ్యపరంగా ఎగుమతి అవుతుంటాయి. కొన్ని ఉష్ణమండల దేశాల్లోని వ్యవసాయంలో స్టార్ ఆపిల్ ప్రధాన భాగంగా మారిపోయింది. మయన్ భాషలోని కైనిటొ, కైమిటో పదాల నుంచి దీని శాస్త్రీయ నామం పుట్టింది. ఈ పండ్ల రసం తల్లి΄ాలు మాదిరిగా అత్యంత పోషకాలతో కూడినదని చెబుతారు. ఈ పండును అడ్డంగా రెండు ముక్కలుగా కోస్తే.. లోపలి తెల్లని గుజ్జు నక్షత్రం ఆకారంలో ఉంటుంది. అందువల్లే దీనికి స్టార్ ఆపిల్ అనే పేరు వచ్చింది. ఊదా రంగులో ఉంటుంది కాబట్టి పర్పుల్ ఆపిల్ అని కూడా అంటారు. ఈ జాతికి చెందిన కొన్ని రకాల పండ్లు పండిన తర్వాత కూడా ఆకుపచ్చగానే ఉంటాయి.మెక్సికో నుంచి పెరూ వరకు.. స్టార్ ఆపిల్ సెంట్రల్ అమెరికాలో పుట్టినట్లు చెబుతున్నప్పటికీ దీని మూలాలు వెస్ట్ ఇండీస్లో కూడా ఉన్నాయని చెబుతుంటారు. దక్షిణ మెక్సికో నుంచి ఉత్తర అర్జెంటీనా, పెరు వంటి లో–మీడియం ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో విస్తారంగా సాగవుతోంది. గ్వాటెమల పసిఫిక్ తీర ప్రాంతంలో ఇది విస్తారంగా సాగు అవుతోంది. అక్కడితో దీని విస్తృతి ఆగలేదు. వియత్నాం, భారత్, చైనా, శ్రీలంక, మలేసియా, ఇండోనేసియా దేశాల్లోనూ సాగవుతోంది. కోస్టారికా, క్యూబా, డొమినిక, హైతి, హాండూరస్, జమైకా, నెదర్లాండ్స్ అంటిల్లెస్, నికరాగువ, పనామా, ఉరుగ్వే, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఈజిప్ట్, సౌత్ఆఫ్రికా, మొంజాబిక్, జింబాబ్వే తదితర దేశాల్లోనూ సాగులో ఉంది.పోషకాలు పుష్కలంస్టార్ ఆపిల్ గుజ్జు, రసం తియ్యగా ఉండటానికి కారణం అందులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండటమే. ఈ పండులో నీరు 78–86% వరకు ఉంటుంది. వంద గ్రాముల పండ్లలో 0.71–2.33 గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల పిండి పదార్థం, 9–10 గ్రాముల టోటల్ సుగర్స్ ఉన్నాయి. దీని విత్తనాల్లో శ్యానోజెనిక్ గ్లైకోసైడ్ లుకుమిన్, తదితర యాక్టివ్ కాంపౌండ్లు ఉన్నాయి. స్టార్ ఆపిల్లో ఉన్న జీవరసాయనాల జాబితా చెప్పాలంటే చాలానే ఉంది. ఫెనాల్స్, అల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, స్టెరాయిడ్స్, సపోనిన్స్, టాన్నిన్స్, కార్డియాక్ గ్లైకోసైడ్స్ వంటివి వున్నాయి. 2002లో వెలువడిన ఓ అధ్యయన పత్రం ప్రకారం ఈ పండులో 120 రకాల వొలేటైల్ కాన్స్టిట్యుయెంట్స్ ఉన్నాయి. పచ్చి, పండిన పండ్లలోనూ విటమిన్ సి బాగా ఉంది. ఆకుల్లో కూడా గాల్లిక్ యాసిడ్, ట్రైటెర్పినాయిడ్స్ వంటి ఉపయోగకరమైన కాంపౌండ్స్ ఉన్నాయి. అధిక స్థాయిలో ఫెనోలిక్స్, ఫ్లావనాయిడ్స్ కలిగి ఉండటం వల్ల స్టార్ ఆపిల్కు వ్యాధినిరోధకతను పెంచే యాంటీఆక్సిడెంట్ల సామర్థ్యం మెండుగా ఉంది. ఇందులోని క్యుయెర్సెటిన్ కాంపౌండ్కు అత్యధిక యాంటీఆక్సిడెంట్ గుణం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.గోళాకార పండ్లుఈ చెట్టు ఆకులు ఆకర్షణీయమైన ముదురు ఆకుపచ్చగా ఓవెల్ షేప్లో ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి 5–15 సెం.మీ. పొడవు పెరుగుతాయి. ఊదా–తెలుపు రంగుల్లో ఉండే దీని పూలు చక్కని సుగంధాన్ని వెదజల్లుతూ తేనెటీగలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ చెట్టు స్వీయ పరాగ సంపర్క సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని కాయ గోళాకారంలో 2–3 అంగుళాల డయామీటర్లో ఉంటాయి. ఈ పండ్లను తాజాగా తింటారు. ఈ జాతి పండ్లు ముదురు ఊదా రంగులోను, ఆకుపచ్చ–గోధుమ, పసుపు రంగుల్లో కూడా ఉంటాయి. ఊదా రంగు పండు తొక్క మందంగా, గుజ్జు గట్టిగా ఉంటుంది. రవాణాకు, నిల్వకు అనువైనవి కాబట్టి ఈ రకం స్టార్ ఆపిల్ తోటలే సాగులో ఉన్నాయి. ఆకుపచ్చ–గోధుమ రంగులో ఉండే రకం పండ్ల తొక్క పల్చగా, గుజ్జు పల్చని ద్రవంలా ఉంటుంది. పసుపు రంగులో ఉండే పండ్లు చాలా అరుదు. ఈ కుటుంబంలోనే క్రైసోఫైల్లం కైనిటో మాదిరిగానే ప్రజాదరణ పొందుతున్న రెండు స్టార్ ఆపిల్ రకాలు ఆఫ్రికాలో సాగులో విస్తారంగా సాగులో ఉన్నాయి. అవి.. గంబేయ అల్బిద, గంబేయ ఆఫ్రికాన. 3–5 ఏళ్లకు కాపు ప్రారంభంక్రైసోఫైల్లం కైనిటో రకం స్టార్ ఆపిల్ మొక్కలు నాటిన తర్వాత 3–5 ఏళ్లలో కాపు వస్తుంది. 6–7 ఏళ్లకు పూర్తిస్థాయి కాపు తీసుకోవచ్చు. ఫ్రూట్ చాలా త్వరగా సెట్ అవుతుంది కాబట్టి తోటల సాగుదారులకు అనుకూలంగా ఉంటుంది. శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చే దశలో పండ్లు పక్వానికి వస్తాయి. వెస్ట్ ఇండీస్లో ఏప్రిల్–మే మధ్యన స్టార్ ఆపిల్స్ పుష్కలంగా మార్కెట్లోకి వస్తాయి. స్టార్ ఆపిల్ విత్తనాల వ్యాప్తికి గబ్బిలాలు బాగా తోడ్పడుతుంటాయి. ఏ సీజన్లోనైనా పచ్చగా ఉండే స్వభావం వల్ల ఈ చెట్లు వ్యాపించిన చోట్ల పచ్చదనం, పర్యావరణం పరిఢవిల్లుతాయి.అన్ని పండ్లూ ఒకేసారి కోతకు రావుస్టార్ ఫ్రూట్ పక్వానికి రాక ముందు బంక సాగుతూ వగరుగా ఉంటుంది. బాగా పండి పోయిన తర్వాత కోస్తే రవాణా చేయటానికి, నిల్వ చేయటానికి ఇబ్బంది అవుతుంది. అందుకని పండు ముచ్చిక దగ్గర కొంచెం ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోసెయ్యాలి. తాజా పండ్లు తినొచ్చు లేదా జెల్లీలుగా మార్చి నిల్వ చేసుకోవచ్చు. ఈ పండులోని విత్తనాలు కూడా పనికొస్తాయి. విత్తనం లోపలి పప్పుతో తయారు చేసే డ్రింక్ బాదం పాల మాదిరిగా ఉంటాయి. అనేక తినుబండారాల్లో వాడుతున్నారు. ఫ్రోజెన్ స్టార్ ఫ్రూట్ గుజ్జును ఐస్క్రీమ్లు, షర్బత్లలో వాడుతున్నారు. కాబట్టి, వాణిజ్యపరమైన సాగుకు అనువైన పండ్ల జాతి. అయితే, నేరేడు మాదిరిగానే ఈ పంటకు కూడా కోత కూలి ఎక్కువ అవుతుంది. -
మంకీ జాక్ గురించి విన్నారా? బోలెడన్ని పోషకాలు, ప్రయోజనాలు
మంకీ జాక్ మనకు అనువైన పంట. ఏడాదంతా ఆకులతో పచ్చగా, నిలువుగా పెరుగుతుంది. దీని కలప విలువైనది. పరికరాలు తదితర వస్తువులు తయారీకి వాడుతారు. మంకీ జాక్ పండు ఆరోగ్యకరమైనది. ఇందులో పోషక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్న ఈ కాలంలో ఆగ్రో ఫారెస్ట్రీ పద్ధతిలో ఈ చెట్లను సాగు చేస్తూ.. ఈ చెట్లు అందించే పాక్షిక నీడలో ఇతర స్వల్పకాలిక పంటలు పండించుకోవచ్చు. వ్యవసాయానికి సుస్థిరత చేకూర్చటానికి మంకీ జాక్ చెట్లు ఎంతగానో దోహదపడతాయి. కలప కోసం పెంచే రైతుకు పండ్లు కూడా ఇస్తుంది. మంకీ జాక్ను బాదల్, దెఫల్, దావ్ లేదా లకూచ తదితర పేర్లతో పిలుస్తారు. ఆగ్రోఫారెస్ట్రీకి ఎంతగానో ఉపయోగపడే ఈ జాతి చెట్లు విస్మరణకు గురయ్యాయి. ఇకనైనా దృష్టి కేంద్రీకరించాల్సిన దీర్ఘకాలిక పంట ఇది. మంకీ జాక్ చెట్లుపర్యావరణరంగా, ఆర్థికపరంగానే కాక పోషకాహార స్థాయిని పెంపొందించడానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మంకీ జాక్ బొటానికల్ నేమ్ ఆర్టోకార్పస్ లకుచ (Artocarpus Lacucha) పనస, మల్బరీ కూడా ఇదే కుటుంబానికి చెందినవి. అందుకే మంకీ జాక్ పండు ఆకారం, దానిలో తొనలు, గింజలు పనసను పోలి ఉంటాయి. కాకపోతే కొంచెం చిన్నవి. భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, థాయ్లాండ్, మయన్మార్లోని కొన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో సైతం చక్కగా పెరిగే బహుళ ప్రయోజనకారి మంకీ జాక్ చెట్టు. నిటారుగా పెరిగే చెట్టు ఇది. అంతర పంటలతో కూడిన తోటల్లో ప్రధాన వృక్ష జాతిగా మంకీ జాక్ చెట్లను పెంచుకోవచ్చు. పర్యావరణపరమైన సమతుల్యతను కాపాడే అనేక ప్రయోజనాలు అందించటం మంకీ జాక్ చెట్ల ప్రత్యేకత. నిటారుగా 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు పెద్దగా, గట్టిగా ఉంటాయి. కొన్నిప్రాంతాల్లోఈ చెట్ల ఆకులు ఏడాదికి ఒకసారి రాలిపోతాయి. దీని పండ్లు మెత్తగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, పండినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. ఈ చెట్టు బెరడు ముదురు రంగులో ఉంటాయి. దీని పూలు సువానతో తేనెటీగలను ఆకర్షిస్తూ పరపరాగ సంపర్కానికి దోహదపడుతూ ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఉన్నప్పటికీ మంకీ జాక్ చెట్ల పెంపకం పెద్దగా కనపడక΄ోవటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఒక్కచోట తప్ప ఈ చెట్లు కనిపించవు. (ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!)పండ్లు తినొచ్చు.. పచ్చడి పెట్టుకోవచ్చు..మంకీ జాక్ కొత్త వాతావరణ పరిస్థితులకు, భిన్నమైన నేలలకు ఇట్టే అలవాటు పడిపోతుంది. ఏ ప్రాంతంలోనైనా ఇతర పంటలతో కలిపి సాగు చేయటానికి అనువైన జాతి ఇది. పండ్లు, పశుగ్రాసం, కలప, ఔషధ గుణాలు, సహజ రంగుగా వాడటానికి ఉపయోగపడే బెరడు వంటి ఉపయోగాలున్నాయి.మంకీ జాక్ పండును నేరుగా తినొచ్చు. పచ్చళ్లు, సాస్లు, చట్నీలు తయారు చేసుకోవచ్చు. ఈ పండ్ల గుజ్జు తింటే కాలేయ జబ్బులు తగ్గిపోతాయట. యాంటీఆక్సిడెంట్లతో పాటు కాలేయాన్ని రక్షించే గుణాలు పుష్కలంగా ఉండటం దీని ప్రత్యేకత. వయోభారం వల్ల చర్మం ముడతలు పడటం వంటి సమస్యల్ని దూరం చేసే చికిత్సల్లో దీన్ని వాడుతున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీలో వాడుతున్నారు. జార్కండ్ వంటి చోట్ల గిరిజనుల సంప్రదాయ వైద్యంలో మంకీ జాక్ను ఉపయోగిస్తున్నారు. మంకీ జాక్ చెట్టు ఆకుల్లో ప్రొటీన్ అత్యధికంగా 28.6% ఉంటుంది. అందువల్ల ఈ ఆకులు పశువులకు అత్యంత విలువైన గ్రాసం అని చెప్పచ్చు. కాబట్టి పొడి పశువులపాల ఉత్పత్తిని పెంపొందించడానికి మంకీ జాక్ చెట్టు ఆకులు బాగా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి ఎండా కాలంలో ఇతర పచ్చి మేత అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ చెట్ల ఆకులు చక్కని పచ్చిమేతగా ఉపయోగపడతాయి. దీని బెరడు నుంచి వచ్చే జిగురు ఉపయోగకరం. అన్నిటికీ మించి దీని కలప ఎంత గట్టిగా ఉంటుందంటే చెద పురుగులు కూడా ఏమీ చేయలేవు. అందువల్ల కుర్చీలు, బల్లలు వంటి ఫర్నీచర్ తయారీలో దీని చెక్కను వాడుతున్నారు. పడవలు, నౌకల తయారీలో, నిర్మాణ రంగంలో కూడా ఈ కలపను ఉపయోగిస్తున్నారు.పర్యావరణ, పౌష్టికాహార ప్రయోజనాలుమంకీ జాక్ చెట్లు సుస్థిర వ్యవసాయ పద్ధతులకు అనేక విధాలుగా దోహదపడతాయి. భూసారాన్ని పెంపొందించటం, గాలికి వర్షానికి మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడటం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి ఈ చెట్లు దోహదపడతాయి. వేడిని, గాలిలో తేమను తట్టుకొని పెరుగుతాయి. తరచూ కరువు బారిన పడే నిస్సారమైన భూముల్లో సైతం ఈ చెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల నీడ సానుకూల సూక్ష్మ వాతావరణాన్ని కలిగిస్తుంది కాబట్టి అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఇక పోషకాల సంగతికి వస్తే.. మంకీ జాక్ పండ్లు, ఆకులు పోషకాల గనులే. పండ్ల గుజ్జులో డయటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విత్తనాలు, జిగురులో యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉన్నాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి ఇనుమడిస్తుంది. నాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎజెంట్గా పనిచేస్తుంది. ఈ గుణగణాలు మనుషులకు, పశువులకు ఆరోగ్యాన్నందిస్తాయి. తద్వారా పశువుల ఉత్పాదకత పెరుగుతుంది. పండ్ల ధర కిలో రూ. 175మంకీ జాక్ చెట్లు వర్షాధార వ్యవసాయం చేసే చిన్న,సన్నకారు రైతులకు మంచి ఆదాయాన్ని సమకూర్చుతాయి. ఒక చెట్టు ఆకుల నుంచి 200 కిలోల పచ్చి మేతను పొందవచ్చని, ఆ మేరకు పొడి పశువుల పోషణ ఖర్చు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్ల పచ్చి ఆకులు క్వింటాలు రూ. 300 విలువ చేస్తాయి. పండ్లు కిలో రూ. 175 పలుకుతామంటున్నారు. చీడపీడలను తట్టుకునే స్వభావం కలిగిన ఈ చెట్లను పెంచటం చాలా సులభం. దీని కలప, పండ్ల ద్వారా కూడా ఇంకా ఆదాయం సమకూరుతుంది. మంకీ జాక్ చెట్లు రాల్చే ఆకులు భూమిని సారవంతం చేస్తాయి. అంటే రైతులు రసాయనాలపై ఆధారపడటం తగ్గుతుంది. అంతర పంటలకు అనువైన తోటల్లో పెంచడానికి మంకీ జాక్ చెట్లు ఎంతో అనువైనవి. భూతాపోన్నతితో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే అతివృష్టి, అనావృష్టిని తట్టుకునే స్వభావం, నిస్సారమైన భూముల్లోనూ పెరిగే స్వభావం ఈ చెట్లకు ఉండటం రైతులకు ఎంతో ఉపయోగపడే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే, మంకీ జాక్ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే గ్రామీణాభివృద్ధికి, పేదరికాన్ని పారదోలటానికి, పశుగ్రాసం కొరతను తీర్చడానికి, పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంపొందించడానికి బహువిధాలుగా ఉపయోగ పడుతుంది. -
ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!
ఉద్యోగం వద్దు వ్యవసాయమే ముద్దు అని అతను నమ్మాడు. సాగులోకి దిగింది మొదలు నిరంతర కృషితో రుషిలా తపించి ఒక అద్భుత మునగ వంగడాన్ని రూపొందించారు. ఈ వంగడం ఖ్యాతి దేశం నలుమూలలకు విస్తరించింది. అధిక దిగుబడులనిస్తూ అళగర్ స్వామికే కాదు అనేక రాష్ట్రాల్లోని వేలాది మంది రైతులకూ కనక వర్షం కురిపిస్తోంది. ఈ ఆవిష్కరణతో అళగర్ స్వామి వ్యవసాయ క్షేత్రం మునగ నర్సరీగా మారిపోయింది.ఏరోజు కారోజు విధులు ముగించుకొని బాధ్యతలు తీర్చుకునే ఉద్యోగం కాదు రైతు జీవితం. అలాగని పంటలు పండించటం, అమ్ముకోవటంతోనే దింపుకునే తల భారమూ కాదు. ఎంత చాకిరీ చేసినా వద్దనని పొలం సముద్రాన్ని ఈదటంలా అనిపిస్తుంటే.. అలసిపోని చేపలా మారి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలిగితేనే రాణింపు, సంతృప్తి. అళగర్స్వామి చేసింది అదే. తమిళనాడు దిండిగల్ జిల్లాలోని పల్లపట్టి గ్రామం స్వామి జన్మస్థలం. ఆర్ట్స్లో పీజీ విద్యను పూర్తి చేసిన స్వామి మక్కువతో వ్యవసాయాన్ని చేపట్టారు. మొక్కుబడి వ్యవసాయం చే యకుండా నిరంతరం శాస్త్రవేత్తలతో చర్చిస్తూ ఆధునిక పద్ధతులను ఆకళింపు చేసుకుంటూ.. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. దిండిగల్ నుంచి మధురైకి వెళ్లే ప్రధాని రహదారి పక్కనే అళగర్ స్వామికి చెందిన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. బీడు భూమిని సాగులోకి తెచ్చే క్రమంలో మునగ వంగడాన్ని రూ పొందించేందుకు కృషిని మమ్మురం చేసి 2002లో ఒక నూతన మునగ వంగడాన్ని ఆవిష్కరించారు. రెండు స్థానిక రకాలను సంకరం చేసి ఈ వంగడాన్ని సృష్టించారు. దీనికి ‘పళ్లపట్టి అళగర్ స్వామి వెళ్లిమాలై మురుగన్’(పీఏవీఎం) అని తన పేరే పెట్టుకున్నారు. తక్కువ నీటితో సాగయ్యే ఈ వంగడం కరవు పరిస్థితులను, చీడపీడలు, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది. సాగులో ఉన్న రకాలకన్నా అధిక దిగుబడులను ఇస్తుండటంతో ఆనోటా ఈనోటా ప్రచారంలోకి వచ్చిన ఈ వంగడం ఖ్యాతి దేశమంతటా పాకింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మునగకు పుట్టినిల్లయిన ఉత్తర భారతదేశంలోనూ రైతులు ఈ వంగడం సాగుపై మొగ్గు చూపుతున్నారు. (కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా? )తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది రైతులు 30 వేల ఎకరాల్లో పీఏవీఎం మునగ వంగడాన్ని సాగు చేస్తున్నారు. దాదాపు 90 లక్షల పీఏవీఎం మునగ మొక్కలను అళగర్ స్వామి వివిధ రాష్ట్రాల రైతులకు అందించారు. గ్రాఫ్టింగ్ లేదా ఎయిర్ లేయర్ పద్ధతుల్లో అంట్లు కడుతున్నారు.20 అడుగులకో మొక్క...మునగను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పద్ధతులను అళగర్ స్వామి అనుసరిస్తున్నారు. పంచగవ్యను కనుగొన్న డాక్టర్ నటరాజన్తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. పంచగవ్యను క్రమం తప్పకుండా వాడతారు. భూమిని దున్ని సిద్ధం చేసుకున్న తర్వాత.. తూర్పు పడమర దిశలో మొక్కలు, సాళ్ల మధ్య 20 అడుగుల ఎడం ఉండేలా నాటుకోవాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు ధారాళంగా లబిస్తుంది. ఎకరాకు 150 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. మునగ మొక్కలు పెళుసుగా ఉంటాయి కాబట్టి రవాణాలోను.. నాటుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. 50 సెం. మీ. లోతు వెడల్పుతో గుంతలు తీసుకోవాలి. 20 రోజుల వయసు మొక్కలను నాటుకొని, గాలులకు పడి పోకుండా కర్రతో ఊతమివ్వాలి. ప్రతి మొక్కకు 5 కిలోల కం΄ోస్టు ఎరువు లేదా 10 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. కొత్త మట్టితో గుంతను నింపితే మొక్క త్వరగా వేళ్లూనుకుంటుంది. నాటిన మరుసటి రోజు నుంచి రెండు నెలల పాటు నీరుపోయాలి. తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి తగుమాత్రంగా తడులు ఇవ్వాలి. పూత కాత దశలో మాత్రం సమృద్ధిగా నీరందించాలి. మిగతా సమయాల్లో పొలం బెట్టకొచ్చినట్టనిపిస్తే తడి ఇవ్వాలి. వర్షాధార సాగులో నెలకు రెండు తడులు ఇస్తే చాలు. అంతర కృషి చేసి చెట్ల మధ్య కలుపును ఎప్పటికప్పుడు తొలగించాలి. ఒకటిన్నర ఏడాది తర్వాత కొమ్మల కత్తిరింపు చేపట్టాలి. బలంగా ఉన్న నాలుగైదు కొమ్మలను మాత్రమే చెట్టుకు ఉంచాలి. పెద్దగా చీడపీడలు ఆశించవు. పశువుల బారి నుంచి కాపాడుకునేందుకు కంచె వేసుకోవాలి.లక్షల మొక్కల సరఫరా...ఆళ్వార్ స్వామి ప్రస్తుతం మునగ కాయల సాగుపైన కన్నా నర్సరీపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 100 మంది కూలీలతో పల్లపట్టి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు పీఏవీఎం మొక్కలను సరఫరా చేస్తున్నారు. 90 లక్షలకు పైగా మొక్కలను విక్రయించారు. ఏటా రూ. 6 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అళగర్ స్వామి కృషికి మెచ్చి ఎన్నో అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక సృష్టి సమ్మాన్ అవార్డుతోపాటు సీఐఐ అవార్డు, మహీంద్రా టెక్ అవార్డు వంటి దాదాపు వంద అవార్డులు ఆయనను వరించాయి. సిటీ బ్యాంక్ ఉత్తమ ఔత్సాహిక వ్యాపారవేత్త అవార్డుతో సత్కరించడం విశేషం. అద్భుతమైన ఆవిష్కరణతో ఖ్యాతి గడించిన అళగర్ స్వామి స్థానిక గ్రామీణ ఆవిష్కర్తల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ రైతులకు స్ఫూర్తినిస్తున్నారు. ఐదేళ్లలో చెట్టుకు 3 క్వింటాళ్ల దిగుబడి..ఇతర వంగడాలు నాటిన 9 నెలలకు కాపుకొస్తాయి. పీఏవీఎం మునగ ఆరు, ఏడు నెలల నుంచే కాస్తుంది. సాళ్లు, మొక్కల మధ్య 20 అడులు దూరంలో ఎకరానికి 150 మొక్కలు నాటుకోవాలని అళగర్ స్వామి సూచిస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుంచి ఎకరానికి 10 – 15 టన్నుల కాయల దిగుబడి వస్తుంది. ఐదేళ్ల వయసు చెట్టు సగటున ఏడాదికి 300 కిలోల దిగుబడినిస్తుంది. ఐదేళ్ల తోట నుంచి ఏడాదికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. సాధారణ రకాల్లో కాయల దిగుబడి 20 టన్నులే. పైగా అవి ఐదారేళ్ల పాటే నిలకడగా దిగుబడులిస్తాయి. పీఏవీఎం మాత్రం ఏడాదికి 8 –9 నెలల చొప్పున 20–25 ఏళ్లపాటు మంచి దిగుబడి నిస్తుంది. తమిళనాడు రైతులు స్థానిక మార్కెట్లలో కాయ రూ. 5 – 20 చొప్పున విక్రయిస్తున్నారు. ఖర్చులు పోను ఏటా ఎకరాకు రూ. లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కొందరు రైతులు కంచె పంటగాను ఈ వంగడాన్ని సాగు చేస్తున్నారు. -
విద్యుత్ లేకుండా వాగు నీటిని ఎత్తిపోసే హైడ్రో లిఫ్ట్!
కొండ్ర ప్రాంత వాగుల్లో ఎత్తయిన ప్రాంతం నుంచి వాలుకు ఉరకలెత్తుతూ ప్రవహించే సెలయేళ్లు సందర్శకులకు కనువిందు చేస్తూ మనోల్లాసం కలిగిస్తుంటాయి. అయితే, ఆయా కొండల్లో వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులకు మాత్రం ఈ సెలయేళ్లలో నీరు ఏ మాత్రం ఉపయోగపడదు. పొలాలు ఎత్తులో ఉండటమే కారణం. విద్యుత్ మోటార్లతో వాగుల్లో నిటిని రైతులు తోడుకోవచ్చు. అయితే, చాలా కొండ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం ఉండదు. డీజిల్ ఇంజన్లు పెట్టుకునే స్థోమత రెక్కాడితే గాని డొక్కడని అక్కడి చిన్న, సన్నకారు రైతులకు అసలే ఉండదు. కళ్ల ముందు నీరున్నా ఆ పక్కనే కొద్ది ఎత్తులో ఉన్న తమ పొలాల్లో పంటలకు పెట్టుకోలేని అశక్తత ఆ రైతుల పేదరికాన్ని పరిహసిస్తూ ఉంటుంది. ఏజన్సీవాసులకు శాశ్వతంగా మేలు జరిగేలా వాగుల్లో పారే నీటిని విద్యుత్తు అవసరం లేకుండా ఎత్తిపోసేందుకు తన శక్తిమేరకు ఏదైనా ఉపాయం ఆలోచించాలని గ్రామీణ ఆవిష్కర్త పంపన శ్రీనివాస్(47) లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ జిల్లా కైకవోలు ఆయన స్వగ్రామం. చదివింది ఐటిఐ మాత్రమే అయినా, లక్ష్యసాధన కోసం అనేక ఏళ్ల పాటు అనేక ప్రయోగాలు చేస్తూ చివరికి విజయం సాధించారు. వాగుల్లో నుంచి నీటిని విద్యుత్ లేకుండా పరిసర పొలాల్లోకి ఎత్తిపోయటంలో ఆయన సాధించిన విజయాలు రెండు: 1. పాతకాలపు ర్యాం పంపు సాంకేతికతను మెరుగుపరచి వాగుల్లో ర్యాం పంపులను ఏర్పాటు చేయటం. 2. హైడ్రో లిఫ్ట్ అనే కొత్త యంత్రాన్ని ఆవిష్కరించటం.హైడ్రో లిఫ్ట్ ఆవిష్కరణవాగులో 4–5 అడుగుల ఎత్తు నుంచి చెంగు చెంగున కిందికి దూకే నీటిని ఒడిసిపట్టి పరిసర పంట పొలాల్లోకి ఎత్తి΄ోసే ‘హైడ్రో లిఫ్ట్’ అనే వినూత్న యంత్రాన్ని శ్రీనివాస్ సొంత ఆలోచనతో, సొంత ఖర్చుతో ఆవిష్కరించారు. ఈ గ్రామీణ ఆవిష్కర్త రూపొందించిన చిన్న నమూనా ప్రొటోటైప్) యంత్రాన్ని ఉమ్మడి తూ.గో. జిల్లా దివిలికి సమీపంలోని ముక్కోలు చెక్డ్యామ్ వద్ద విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. దీని పనితీరును నిపుణులు ప్రశంసించారు. ఇది మూడు అడుగుల పొడవు, ఒక డయామీటర్తో ఉంది. దీని చుట్టూతా అంగుళం బ్లేడ్లు వాలుగా అమర్చి వుంటాయి. నీటి ఉధృతికి లేదా వరదకు దుంగలు, రాళ్లు కొట్టుకొచ్చినా కదిలి΄ోకుండా ఉండేలా ఇనుప చట్రంలో ఈ చక్రాన్ని అమర్చారు. హైడ్రో లిఫ్ట్తో కూడిన ఈ చట్రాన్ని చెక్డ్యామ్ కింది భాగాన ఏర్పాటు చేశారు. సెకనుకు 20 లీటర్ల చొప్పున ఈ చక్రంపై పడేలా నీటి ప్రవాహం ఉంటే సెకనుకు 1 లీటరు నీటిని పొలంలోకి ఎత్తి΄ోయటానికి వీలవుతుందని శ్రీనివాస్ తెలి΄ారు. నీటి ప్రవాహ వేగం తక్కువగా వున్నా నిమిషానికి 40 సార్లు (ఆర్పిఎం) ఇది శక్తివంతంగా తిరుగుతోంది. ఈ బాక్స్ షాఫ్ట్నకు అమర్చిన పిస్టన్ 300 ఆర్పిఎంతో నడుస్తుంది. చిన్న హైడ్రో లిఫ్ట్తో ఎకరానికి నీరునిమిషానికి 60 లీటర్ల నీటిని వాగులో నుంచి 20 అడుగుల ఎత్తుకు (40 అడుగుల ఎత్తుకైతే నిమిషానికి 40 లీటర్లు) తోడే శక్తి ఈ ప్రోటోటైప్ హైడ్రో లిఫ్ట్కు ఉంది. ఈ నీరు పారగడితే ఎకరంలో కూరగాయల సాగుకు సరిపోతుందని, డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఎకరానికి సరిపోతుందని శ్రీనివాస్ తెలిపారు. దీని తయారీకి రూ. 35 వేలు ఖర్చవుతుందని, వాగులో ఇన్స్టాల్ చేయటానికి అదనంగా ఖర్చవుతుందన్నారు. వాగు నీటి ఉధృతిని బట్టి, అధిక విస్తీర్ణంలో సాగు భూమి నీటి అవసరాలను బట్టి హైడ్రో లిఫ్ట్ పొడవు 9–16 అడుగుల పొడవు, 2–4 అడుగుల డయామీటర్ సైజులో తయారు చేసుకుంటే అధిక పరిమాణంలో నీటిని ఎత్తిపోయవచ్చునని శ్రీనివాస్ వివరించారు. గత అక్టోబర్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శోధాయాత్రలో భాగంగా పల్లెసృజన అధ్యక్షులు పోగుల గణేశం బృందం ఈ హైడ్రో లిఫ్ట్ పనితీరును పరిశీలించి మెచ్చుకున్నారన్నారు. పల్లెసృజన తోడ్పాటుతో పేటెంట్ కోసం దరఖాస్తు చేయబోతున్నాన్నారు. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించి పెద్ద హైడ్రో లిఫ్టులను తయారు చేసి పెడితే కొండ ప్రాంతవాసుల సాగు నీటి కష్టాలు కొంతైనా తీరుతాయి. ర్యాం పంపుతో పదెకరాలకు నీరుఎత్తు నుంచి లోతట్టు ప్రాంతాలకు పారే వాగు నీటిని ఒడిసిపట్టే ర్యాం పంపు సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉంది. ఏజన్సీవాసుల నీటి కష్టాలు తీర్చేందుకు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే ఈ ర్యాం పంపును మెరుగైన రీతిలో వినియోగంపై శ్రీనివాస్ తొలుత కృషి చేశారు. వివిధ సంస్థల తోడ్పాటుతో కొన్ని చోట్ల ర్యాం పంపులు ఏర్పాటు చేశారు. అయితే, ర్యాం పంపు సాంకేతికతకు ఉన్న పరిమితులు కూడా ఎక్కువేనని శ్రీనివాస్ గ్రహించారు. ర్యాం పంపు అమర్చాలి అంటే.. వాగులో 4 నుండి 6 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి పారే చిన్నసైజు జలపాతం ఉండాలి. ఆ నీటిని ప్రవాహానికి ఎదురుగా పొడవాటి ఇనుప గొట్టాన్ని అమర్చి, ఆ గొట్టం ద్వారా ఒడిసిపట్టిన నీటిని పిస్టన్ల ద్వారా ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో ర్యాం పంపు బెడ్పైన రెండు పిస్టన్లు అమర్చుతారు. ఒక పిస్టన్ను కాలితో లేదా చేతితో రెండు మూడు సార్లు కిందికి నొక్కితే చాలా ఇక వాటంతట అవే రెండు పిస్టన్లు ఒకదాని తర్వాత మరొకటి, పైకి కిందకు లేచి పడుతూ ఉంటాయి. అలా పిస్టన్లు పనిచేయటం వల్ల నీరు వత్తిడి ద్వారా పక్కనే ఏర్పాటు చేసిన ఒక నాన్ రిటర్న్ వాల్వ్కు అమర్చిన పైపు ద్వారా పంట పొలాలకు నీరు ఎత్తి΄ోస్తారు. రెండున్నర అంగుళాల పైపు ద్వారా నీరు వెళ్తుంది. ర్యాం పంపు నెలకొల్పడానికి రూ. 2.5–3.5 లక్షలు ఖర్చవుతుంది. ఒకసారి పెట్టుబడి పెడితే రోజుకు కనీసం 10 ఎకరాలకు నీటిని పారించవచ్చు. విద్యుత్తు అవసరం లేదు. పిస్టన్లకు ఆయిల్ సీల్స్ లాంటి విడి భాగాలు ఏవీ ఉండవు కాబట్టి, నిర్వహణ ఖర్చేమీ ఉండదు. ర్యాం పంప్ల తయారీకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ (సీడీఆర్), టాటా ట్రస్టు విసిఎఫ్, సిసిఎల్ తదితర సంస్థలు ఆర్థిక సహాయాన్నందించాయి. ర్యాం పంపుల పరిమితులు అయితే, కనీసం 8–10 అడుగుల ఎత్తు నుంచి కిందికి నీరు పారే చోట్ల మాత్రమే ర్యాం పంపును నిర్మించగలం. ఇందుకు అనుకూలమైన చోట్లు చాలా తక్కువే ఉంటాయి. దీన్ని నెలకొల్పడానికి సిమెంటు కాంక్రీటుతో పునాదిని నిర్మించాలి. బండ రాళ్లు అనువైన రీతిలో ఉంటేనే సివిల్ వర్క్ చేయడానికి అనుకూలం. అందువల్ల కాంక్రీట్ వర్క్ కొన్నిచోట్ల విఫలమవుతూ ఉంటుంది. ర్యాం పంపులకు ఉన్న ఈ పరిమితుల దృష్ట్యా తక్కువ ఎత్తు నుంచి నీరు పారే చోట్ల నుంచి నీటిని ఎత్తిపోసే కొత్త యంత్రాన్ని తయారు చేస్తే ఎక్కువ భూములకు సాగు నీరందించవచ్చన్న ఆలోచన శ్రీనివాస్ మదిలో మెదిలింది. అలా పుట్టిన ఆవిష్కరణే ‘హైడ్రో లిఫ్ట్’. ఇటు పొలాలకు నీరు.. అటు ఇళ్లకు విద్యుత్తు!రంపచోడవరం, చింతూరు, పాడేరు ఐటిడిఏల పరిధిలో కొండలపై నుంచి వాగులు, వంకలు నిత్యం ప్రవహిస్తున్నాయి. వాగు నీటి ప్రవాహ శక్తిని బట్టి వాగు ఇరువైపులా ఉన్నటు భూమి ఎత్తు, స్వభావాన్ని బట్టి తగినంత రూ. 15–20 లక్షల ఖర్చుతో 9–16 అడుగుల వరకు పొడవైన హైడ్రో లిఫ్ట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా 6 అంగుళాల పంపుతో విద్యుత్ లేకుండానే వాగు ఇరువైపులా 50 నుంచి 100 ఎకరాల భూమికి సాగు నీరు అందించవచ్చు. అంతేకాకుండా, ఒక్కో వాటర్ వీల్ ద్వారా 15 కెవి విద్యుత్ను తయారు చేసి సుమారు 20–30 కుటుంబాలకు అందించవచ్చు. ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, గిరిజనాభివృద్ధి శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు హైడ్రో లిఫ్ట్ పద్ధతిని ప్రోత్సహిస్తే నా వంతు కృషి చేస్తా. – పంపన శ్రీనివాస్ (79895 99512), గ్రామీణ ఆవిష్కర్త, కైకవోలు, పెదపూడి మండలం, కాకినాడ జిల్లా – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, ప్రతినిధి కాకినాడ -
6 జిల్లాల్లో శీతల గాలులు: పంటలను ఇలా రక్షించుకుందాం!
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే రెండు రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయపు వేళల్లో దట్టంగా పొగమంచు ఆవరించే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. పి. లీలారాణి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు ఈ కింది సూచనలు పాటించాలని డా. పి. లీలారాణి సూచించారు.వరి: తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలి ప్రభావంతో యాసంగి నారుమడుల్లో నారు ఎదగక పోవచ్చు. ఆకులు పసుపు, ఎరుపు రంగుల్లోకి మారవచ్చు. కొన్నిసార్లు నారు చనిపోవచ్చు. అందువల్ల రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలి. నారుమళ్ళపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి, కొత్త నీరు పెట్టాలి. ∙200 చదరపు మీటరు విస్తీర్ణం గల నారుమడికి ఆఖరి దుక్కిలో 2 క్వింటాళ్లు బాగా చివికిన కోళ్ళు లేదా గొర్రెల ఎరువు వేయాలి. విత్తే సమయంలో 1 కిలో నత్రజని, 1కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే రసాయనిక ఎరువులు వేయాలి. వరి నారుమళ్ళలో జింక్ ధాతువు లోపం నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరుసగా వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి యాసంగిలో దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. చలి వాతావరణం, పొగమంచు వరిని అగ్గి తెగులు ఆశించటానికి అనుకూలం. పొలంలో, పొలంగట్లపైన ఉండే గడ్డి కలుపు మొక్కలు అగ్గి తెగులను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి, పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. వరి నారుమళ్ళలో అగ్గి తెగులు గమనిస్తే, నివారణకు 0.5 గ్రా. ట్రైసైక్లాజోల్ లేదా 1.5 మి.లీ. ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న: చలి వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపించి ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లైతే నివారణకు 10 గ్రా. 19–19–19 లేదా డి.ఎ.పి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మిరప : ప్రస్తుత చలి వాతావరణం మిరపను బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5గ్రా. టేబుకొనజోల్ + గంధకం లేదా 1.5గ్రా. కార్బండజిమ్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 0.3గ్రా. డైనోటేఫురాన్ + 1గ్రా. కార్బండజిమ్ + 2.5 మి.లీ. వేపనూనె లేదా 0.5 గ్రా. థయోమిథాక్సామ్ + 2 మి.లీ. హెక్సాకొనజోల్ + 2.5 మి.లి వేప నూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కుసుమ: నవంబర్లో విత్తుకున్న కుసుమ పంటకు పేనుబంక ఆశించే అవకాశం ఉంది. నివారణకు 2 మి.లీ. డైమిథోయెట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
19 ఏళ్ల ఐటీ ఉద్యోగానికి బై చెప్పి, ప్రకృతి సేద్యంతో లాభాలు
దేశ విదేశాల్లో అధికాదాయాన్నిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంతకంతకూ పెరిగే పని ఒత్తిడి, తీవ్ర అసంతృప్తి నుంచి బయటపడటానికి ప్రకృతితో తిరిగి మమేకం కావటం ఒక్కటే మార్గమని మునిపల్లె హరినాద్(52) భావించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి కుమారుడు హరినాద్. 1994లో బీటెక్ పూర్తి చేసి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆస్ట్రేలియా, అమెరికా, యూకేలలో పనిచేశారు. నెలకు రూ. 1.5 లక్షల జీతంతో మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ 2013లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎడతెగని పని వత్తిడితో నలుగుతూ కుటుంబానికి సమయం ఇవ్వలేని స్థితిలో ఎంత చేసినా సంతృప్తినివ్వని ఉద్యోగాన్ని కొనసాగించటం కన్నా.. సొంతూళ్లో కుటుంబ సభ్యులతో కలసి ప్రశాంతంగా జీవిస్తూ వారసత్వ భూమిలో సాధారణ రైతుగా కొత్త జీవితాన్ని ప్రారంభించటంలో నిజమైన ఆనందం ఉందని ఆయన భావించారు. ముందు నుంచే అధ్యయనంవిదేశాల్లో ఉన్న సమయంలో అక్కడి సూపర్ మార్కెట్లలో లభించే ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆకర్షితులయ్యారు. ఖర్చు ఎక్కువైనా కల్తీలేని ఆహార పదార్ధాలను తాను కూడా ఎందుకు పండించేలేననే పట్టుదలతో ఇంటర్నెట్లో ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనే అంశాలపై మూడేళ్లపాటు అధ్యయనం చేశారు. రసాయనిక అవశేషాల్లేని, పోషకాల సమతుల్యతతో కూడిన ఆరోగ్యాదాయకమైన ఆహారాన్ని పండించటమే ముఖ్యమైన పనిగా తలచి ఉద్యోగానికి 2013లో రాజీనామా ఇచ్చారు. ఆ కొత్తలోనే మధురైలో జరిగిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో హరినాధ్ పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఇతర రైతులతో పరిచయాలు పెంచుకొని వారి క్షేత్రాలను సందర్శించి, వ్యవసాయం చేస్తూ నేర్చుకున్నారు. వారసత్వంగా సంక్రమించిన 2.5 ఎకరాల మాగాణి, అర ఎకరం మెట్టలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. (చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!)దిబ్బపై ఉద్యాన పంటలుమాగాణిలో సార్వాలో వరి, దాళ్వాలో మినుములు, పెసలు, నువ్వులు తదితర పంటలను హరినా«ద్ సాగు చేస్తున్నారు. మాగాణి పక్కనే 3 అడుగుల ఎత్తు దిబ్బగా ఉన్న అరెకరంలో పండ్లు, దుంపలు తదితర పంటలు పండిస్తున్నారు. అరటి, జామ, బొ΄్పాయి, కొబ్బరి, మునగ, కంద, అల్లం, కంద, మద్ది, మామిడి, టేకు పెంచుతున్నారు. తమ ప్రాంతంలో ఖరీఫ్లో వరి కోతలు అయ్యాక, రబీలో మొక్కజొన్న పూర్తయ్యాక పంట వ్యర్థాలను ఉత్తరాదిలో మాదిరిగా తగుల బెడుతున్నారని హరినా«ద్ తెలిపారు. గత ఏడాది ఇతర ΄÷లాల నుంచి వ్యాపించిన మంటలకు తమ అరెకరంలోని ఉద్యాన పంటలు కాలిపోయాయన్నారు. గోదావరి ఇసుకలు, కట్టుయానం...ప్రకృతి సేద్యానికి అనువైన దేశీ వరి రకాల సాగుపై హరినాద్ దృష్టి కేంద్రీకరించారు. వ్యవసాయం చేసిన అనుభవం లేక΄ోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఒక్కో పని నేర్చుకుంటూ నిలదొక్కుకున్నారు. కాశీవిశ్వనాద్ (130 రోజులు) అనే సన్న తెల్ల వరి రకాన్ని 8 ఏళ్ల పాటు వరుసగా సాగు చేశారు. బీపీటీ కన్నా సన్నని ఈ రకం ధాన్యాన్ని పూర్తిగా ప్రకృతి సేద్యంలో ఎకరానికి అత్యధికంగా 25 బస్తాల దిగుబడి పొందారు. ఈ ఏడాది నుంచి 1.25 ఎకరాల్లో గోదావరి ఇసుకలు (110 రోజులు) సాగు చేస్తున్నారు. ఇది తెల్ల, సన్న రకం. త్వరలో నూర్పిడి చేయనున్నారు. ఎకరానికి 20 బస్తాల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. మరో 1.25 ఎకరాల్లో కట్టుయానం (180 రోజులు) అనే రెడ్ రైస్ను సాగు చేస్తున్నారు. ఇది 15 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావచ్చని చెప్పారు.సంపూర్ణ సంతృప్తి, సంతోషం!ఉద్యోగ బాధ్యతల్లో అసంతృప్తి, పని ఒత్తిడితో ఏదో తెలియని వేదనకు గురయ్యాను. వారానికి 5 గంటలు నిద్రతో సరిపెట్టుకొని, పర్సనల్ పనులనూ మానుకొని, 3–4 నెలల ΄ాటు పనిచేసి ్ర΄ాజెక్టు పూర్తి చేసిన రోజులున్నాయి. డబ్బు వస్తుంది. కానీ, ఆ వత్తిడిమయ జీవితంలో సంతృప్తి, ఆనందం లేవు. గత 9 ఏళ్లుగా కుటుంబీకులతో ఉంటూ ప్రకృతి సేద్యం చేసే భాగ్యం కలిగింది. కుటుంబం అంతా మద్దతుగా నిలిచారు. రసాయనాల్లేకుండా వరి ధాన్యం తొలి ఏడాది 10 బస్తాల దిగుబడి తీయటం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు 25 బస్తాల దిగుబడినిచ్చే స్థాయికి ΄÷లం సారవంతమైంది. ఈ ఏడాది జీవామృతం కూడా ఇవ్వలేదు. పూర్తి ప్రకృతి వ్యవసాయం అంటే ఇదే. రైతుగా మారి 6 కుటుంబాలకు ఏడాది ΄÷డవునా ఆరోగ్యదాయకమైన ఆహారం అందిస్తున్నా. అనేక ఆరోగ్య సమస్యలు తగ్గాయని, షుగర్ను నియంత్రించటం సులువైందని వారు చెబుతుంటే సంతృప్తిగా ఉంది. సొంతూళ్లో ప్రకృతి సేద్యం సంపూర్ణంగా సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. – మునిపల్లె హరినాద్ (93805 16443). మునిపల్లె, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా ఈ ఏడాది జీవామృతమూ లేదు!పొలం దుక్కి చేయటం, రొటోవేటర్ వేయటం, దమ్ము చేయటం వంటి పనులను సొంత చిన్న ట్రాక్టర్తో స్వయంగా చేసుకోవటం నేర్చుకున్నారు హరినా«ద్. పచ్చిరొట్ట పంటలను కలియదున్నటం, జీవామృతం పిచికారీ, కాలువ నుంచి తోడుకునే నీటితో కలిపి ఆవు మూత్రం పారించటం చేస్తుంటారు. ఈ సంవత్సరం అవేవీ చెయ్యలేదన్నారు. అయినా, గోదావరి ఇసుకలు రకం ధాన్యం ఎకరానికి 20 బస్తాలకు తగ్గకుండా వస్తాయని సంతోషంగా తెలిపారు. నాట్లు, కలుపు తీత, కోతలు మనుషులతోనే చేయిస్తున్న హరినాద్కు ఎకరా వరి సాగుకు రూ. 35 వేల నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతోంది. అన్నీ అనుకూలిస్తే రసాయనిక రైతులకు 40–45 బస్తాలు, తనకు 25 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని, అయినా తనకు మంచి ఆదాయమే వస్తున్నదన్నారు. ఆ ప్రాంతంలో అందరూ కౌలు రైతులే. కోత కోసి ఆ రోజే అమ్మేస్తుంటారు. హరినా«ద్ నెలకోసారి ధాన్యం మర పట్టించి కనీసం 6 కుటుంబాలకు నెల నెలా పంపుతూ ఉంటారు. కిలో బియ్యం రూ. వందకు అమ్ముతున్నారు. తాను నిర్ణయించిన ధరకు నేరుగా వినియోగదారులకు అమ్మటం వల్ల తనకు ఇతర రైతుల కన్నా అధికాదాయమే వస్తోందని హరినా«ద్ తెలిపారు. నేలను బాగు చేసుకుంటూ ఇతరులకూ ఆరోగ్యదాయక ఆహారాన్ని అందిస్తున్నానన్న సంతృప్తితో చాలా ఆనందంగా ఉన్నానని ఆయన తెలిపారు. – సయ్యద్ యాసిన్, సాక్షి, పొన్నూరు, గుంటూరు జిల్లా -
చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న, సన్నకారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లు, కూరగాయలు వినియోగదారుల నోటికి చేరే లోగా దాదాపు 30–40 శాతం వరకు కుళ్లిపోతున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) అంచనా. దుంపలైతే ఏకంగా 40–50% పాడవుతున్నాయి. కోత అనంతర రవాణా వ్యవస్థ, శీతల సదుపాయాలు లేకపోవటం పెద్ద సమస్య. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఉగాండాకు చెందిన ఫ్రెజా నానోటెక్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థ సేంద్రియ పదార్థాలతో రూపొంచిన ఇన్స్టంట్ టీ బ్యాగ్ అంత సైజు ఉండే పౌడర్ ప్యాకెట్ కూరగాయలు, పండ్లను కుళ్లిపోకుండా నెల రోజుల వరకు రక్షించగలుగుతుంది. ఎటువంటి రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా, రసాయన రహితంగానే షెల్ఫ్ లైఫ్ను గణనీయంగా పెంచే ఈ ఆవిష్కరణ ‘ఎఫ్ఎఓ ఇన్నోవేషన్ అవార్డు–2024’ను ఇటీవల దక్కించుకుంది. శీతల గదుల్లో పెట్టని పండ్లు, కూరగాయలు మగ్గిపోయి కొద్ది రోజుల్లోనే కుళ్లియే ప్రక్రియ ‘ఫాస్ఫోలిపేస్ డి’ అనే ఎంజైమ్ కారణంగానే జరుగుతుంటుంది. ఫ్రెజా నానోటెక్ సంస్థ రూపొదించిన పౌడర్ ఈ ప్రక్రియను నెమ్మదింపజేయటం ద్వారా కూరగాయలు, పండ్లను దీర్ఘకాలం పాటు తాజాగా ఉంచుతుంది.టీ బ్యాగ్ అంతటి చిన్న ప్యాకెట్ (దీని ధర రూ. 20)ను 5 కిలోల పండ్లు, కూరగాయల మధ్య ఉంచితే చాలు.. నెల రోజులైనా అవి కుళ్లిపోకుండా ఉంటాయని ఎఫ్ఎఓ తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి మెరుగవుతుంది, పోషకాలలభ్యత పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, జీవనోపాధులు మెరుదలపై ఈ ఆవిష్కరణ సానుకూల ప్రభావం చూపుతుందంటూ ఎఫ్ఎఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు ప్రశంసించారు. కోత అనంతర దశలో రైతులకు ఎదురయ్యే నష్టాలను ఇది తగ్గిస్తుంది. త్వరగా పాడుకావు కాబట్టి రిటైల్ వ్యవస్థలో జరిగే నష్టాల భారం తగ్గుతుంది. ఆవిధంగా వినియోగదారులపై కూడా భారం తగ్గుతుందని ఆయన అన్నారు. -
ఎర్ర ఆకులతో అరటి చెట్టు.. ఎక్కడైనా చూశారా?
ఎర్ర అరటి పండు మనకు అక్కడక్కడా కనిపిస్తుంది. అయితే, ఎర్ర ఆకులతో కూడిన అరటి చెట్టు అరుదనే చెప్పాలి. దీని ఆకు మాదిరిగానే కాయ కూడా ఎర్రగానే ఉంటుంది. కర్ణాటకలోని సిర్సికి చెందిన రైతు ప్రసాద్ కృష్ణ హెగ్డే ఈ అరుదైన అరటి వంగడాన్ని సంరక్షిస్తున్నారు. దీనితో పాటు ఆయన మరో 80 అరటి రకాలను తన పొలంలో పెంచుతూ అరటి పంటల్లో వైవిధ్యాన్ని కాపాడుతున్నారు. ప్లాస్టిక్ బనానా అనే మరో రకం కూడా ఈయన దగ్గర ఉంది. దీని ఆకులను భోజనం చేయటానికి వాడతారట. మైసూరులో ఇటీవల 3 రోజుల పాటు సహజ సమృద్ధ, అక్షయకల్ప ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘అరటి పండుగ’ సందర్భంగా ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. 550 అరటి రకాలను సంరక్షిస్తున్న కేరళకు చెందిన వినోద్ నాయర్ 75 రకాల అరటి పండ్లను ఈ ఉత్సవంలో ప్రదర్శించటం మరో విశేషం. వినోద్ నాయర్తో పాటు 100 దేశీ అరటి రకాలను సంరక్షిస్తున్న తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్ను సైతం ఘనంగా సత్కరించారు.ఆహార నిపుణురాలు, రచయిత్రి రత్న రాజయ్య అరటి పండుగలో మాట్లాడుతూ ఏదో ఒకే రకం అరటిని సాగు చేయటం ప్రమాదకరమని, ఏదైనా మొండి తెగులు సోకిందంటే మొత్తం ఆ అరటి రకమే అంతరించిపోతుందన్నారు. భవిష్యత్తు తరాల కోసం అరటి రకాల్లో జీవవైవిధ్యాన్ని మన తరం పరిరక్షించుకోవాలని పలుపునిచ్చారు.ఎర్ర అరటి జగత్ప్రసిద్ధంసహజ సమృద్ధ ఎన్జీవో డైరెక్టర్ జి. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘అరటి బంగారంతో సమానం. అరటి ప్రపంచం పెద్దది. వందలాది వంగడాలున్నాయి. మానవ జీవితంలో పుట్టుక దగ్గరి నుంచి చావు వరకు అనేక సందర్భాల్లో, ఆచార వ్యవహారాల్లో అరటి పండు సాంస్కృతిక అవసరం ఉంటుంది. ప్రతి రకం రుచి, రంగు, సైజు, చెట్టు ఎత్తులో వైవిధ్యభరితంగా ఉంటాయ’న్నారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి అరటి రకాలున్నాయి. ఆఫ్రికన్ జంజిబార్ స్ప్రౌట్ లాంగ్ బనానా, ఇండోనేషియా జావా బ్లూ బనానా, హవాయికి చెందిన తెల్ల చారల అరటితో పాటు దక్షిణాసియాకు సంబంధించి ఎర్ర అరటి రకాలు జగత్ప్రసిద్ధి గాంచాయన్నారు.చదవండి: తాటి తేగలతోనూ వంటకాలు!అరటికి భారతదేశం పుట్టిల్లు. ఇక్కడ ఎన్నో వందల రకాల అరటి వంగడాలు కనిపిస్తాయి. భింకెల్ అనే రకం అరటి చెట్టు ఎత్తయిన దూలం మాదిరిగా ఉంటుంది. కేరళకు చెందిన పొడవాటి రకం అరటి గెలకు వెయ్యి కాయలుంటాయి. ప్రపంచంలోకెల్లా ఇదే అతి పొడవైన అరటి రకం. కొడిగుడ్డు అంత చిన్న అరటి కాయ రకం కూడా ఉంది అన్నారు కృష్ణప్రసాద్. కర్ణాటకకు ప్రత్యేకమైన అరటి రకాలు ఉన్నాయన్నారు. వాణిజ్యపరంగా డిమాండ్ ఉన్న కావెండిష్ బ్రీడ్ల అరటి పంటలను సాగు చేయటం ప్రారంభమైన తర్వాత దేశీ వంగడాలు మరుగున పడిపోయాయంటున్నారు కృష్ణప్రసాద్. ఒకే రకం అరటి సాగు చేస్తే పనామా కుళ్లు తెగులు సోకే ముప్పు ఉందని చెబుతూ, ఈ తెగులు సోకిందంటే పంటంతా తుడిచిపెట్టుకుపోవటం ఖాయమన్నారు.కార్డమమ్, నెండ్ర ఆర్గానిక్ సాగుకు అనుకూలంసేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన అరటి పండ్లకు ఈ రోజుల్లో అధిక డిమాండ్ ఉందన్నారు కృష్ణప్రసాద్. సేంద్రియంగా సాగు చేయటం వల్ల భూమి కరువు బారిన పడకుండా ఉంటుంది. రసాయనాలకు ఖర్చుపెట్టే డబ్బు ఆదా అవుతుంది అన్నారాయన. కార్డమమ్, నేండ్ర అరటి రకాలు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయటానికి అనువైనవే కాక, మార్కెట్ డిమాండ్ రీత్యా కూడా ఇవి మేలైనవని దేశీ విత్తన నిపుణుడు కూడా అయన కృష్ణప్రసాద్ వివరించారు. అరటి సాళ్ల మధ్యన ముల్లంగి, ఆకుకూరలు, గుమ్మడి, బీన్స్, పసుపు, చిలగడదుంప పంటలను సాగు చేసుకోవచ్చని కృష్ణప్రసాద్ వివరించారు. ఇతర వివరాలకు.. 94821 15495. -
తేగలతో వంటకాలు గురించి విన్నారా..?
తాటి పండు నుంచి లభించే ఉత్పత్తుల్లో తేగలు ముఖ్యమైనవి. పలు పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న తేగలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. తేగల పిండి తయారీని కుటీర పరిశ్రమగా చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని పందిరిమామిడి (తూ. గో. జిల్లా) ఉద్యానపరిశోధనా కేంద్రం అధిపతి, ఆహార–సాంకేతిక విజ్ఞాన సీనియర్ శాస్త్రవేత్త డా. పి సి వెంగయ్య (94931 28932) అంటున్నారు. తాటి టెంక నుంచి 21–30 రోజుల్లో మొలక వస్తుంది. ఈ మొలక భూమిలోకి దాదాపు 45–60 సెం.మీ. పోతుంది. మొలక వచ్చినప్పటి నుంచి నాలుగు నెలలకు ఏర్పడే దానిని తేగ అంటారు. తేగ పెరిగే కొద్ది కొబ్బరిలా గట్టిగా ఉండే పదార్థం కరిగిపోతుంది. ఇది దాదాపు 6–12 నెలలు అంటే తేగ నుంచి మొక్క వచ్చే వరకు ఆహారంగా ఉపయోగపడుతుంది. టెంకలను నీడలో పాతర పెడితే తేగలు ఇంకా బాగా పెరుగుతాయి. విత్తనం నుంచి మొక్క రావటం అనేది 50 శాతం వరకు ఉంటుంది. గుజ్జు తీసిన టెంకలు తొందరగా మొలక వచ్చి బాగా పెరుగుతాయి. పెద్ద టెంకల నుంచి మందం గల తేగలు చిన్న టెంకల నుంచి సన్న తేగలు వస్తాయి. పొడవులో మాత్రం వ్యత్యాసం ఉండదు. తేగల ఉత్పత్తిలో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. తేగల పిండి తయారీ ఇలా...తాజా తేగలను శుభ్రపరచి ఒక అరగంట పాటు ఉడికించి అమ్మవచ్చు. వీటిలో పలు ఔషద గుణాలు ఉన్నాయి. తేగలను వివిధ రూపాల్లోకి మార్చి సంవత్సరమంతా వాడవచ్చు. దీనికోసం తేగలను ఎండబెట్టి ముక్కలుగా నిల్వ ఉంచాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిగా మార్చుకోవచ్చు. పచ్చి తేగలను లేదా ఉడికించిన తేగలను రెండుగా విడదీసి ఆరబెట్టవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టటం మరో పద్ధతి. వీటిలో ఏదో ఒక విధానంలో తేగలను పిండిగా మార్చవచ్చు. తేగను పిండి రూపంలోకి మార్చి 250 మైక్రాన్ల జల్లెడ ద్వారా జల్లిస్తారు. పచ్చి పిండిని వాడేటప్పుడు ఒకట్రెండు గంటలు నీటిలో నానపెడితే చేదుపోతుంది. పిండి నుంచి నీటిని తొలగించేందుకు వడపోయాలి. లేదా వేడి చేయాలి. తేగల పిండితో పలు వంటకాల తయారీ పిండిని ఉడికించడం ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలు చేయవచ్చు. ఉడికించిన పిండిలో బెల్లం, కొబ్బరి పొడి కలిపి తినవచ్చు. ఈ పిండిలో కొబ్బరిపొడి కలిపి ఆవిరితో ఉడికిస్తే మంచి రుచికరమైన వంటకం తయారవుతుంది. మినపప్పుతో కలిపి ఇడ్లీ, దోశె తయారు చేయవచ్చు. బ్రెడ్, గోధుమ పిండితో కలిపి నూడిల్స్ తయారు చేయవచ్చు. వరి, గోధుమ పిండితో తయారు చేసే అన్ని వంటకాల్లోను దీన్ని వాడవచ్చు. చదవండి: యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు: విదేశంలో డైవర్స్ కేసు వేస్తే..!తాజా తేగ 46 గ్రా. బరువుంటుంది. ఉడికించి ఆరబెట్టినది 16. గ్రా., పచ్చిది ఆరబెట్టినది 18గ్రా. బరువుంటుంది. సమారు 60 శాతం పిండి పదార్థం ఉంటుంది. తేగల్లో ముఖ్యమైనది పిండి పదార్థం. ఇది తేగ మొదటి భాగంలో ఎక్కువగా ఉంటుది. పోనుపోను తగ్గుతూ ఉంటుంది. తాజా తేగలో సుమారు 55 శాతం తేమ ఉంటుంది. ప్రోటీన్లు 5 శాతం, కొవ్వు పదార్థాలు 0.5 శాతం ఉంటాయి. -
ఈ నెల 12 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళా
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకు ప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహార ప్రాసెసింగ్పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522. ఇదీ చదవండి : నిలువు పుచ్చ తోట!అవును..నిజమే! -
నిలువు పుచ్చ తోట!అవును..నిజమే!
నిలువు పుచ్చ తోట, అవును మీరు చదవింది.. ఈ ఫొటోలో చూస్తోంది.. నిజమే! మన పుచ్చ తోటల్లో పాదులు నేలపై పరచుకొని ఉంటాయి. పుచ్చ కాయలు నేలపైనే పెరుగుతాయి కదా. సౌతాఫ్రికాలో ఒక కంపెనీ పాలీహౌస్లలో పుచ్చ పాదులు నిలువుగా ఎగబాగుకుతున్నాయి. పుచ్చ కాయలు వాటికి వేలాడుతున్నాయి. ట్రెల్లిస్ పద్ధతిలో పెరిగే టొమాటోల మాదిరిగా ఈ పుచ్చకాయలు వేలాడుతున్నాయి కదూ.. కాండీ బాల్ సీడ్లెస్ పుచ్చకాయలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరుగుతాయి. అదేమాదిరిగా కిలో బరువు పెరిగే స్మైల్ మెలన్స్ (ఇదో రకం కర్బూజ) పండ్లను కూడా నిలువు తోటల్లో పెంచుతున్నారు. టొమాటోలు వంటి కాయలు బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి తీగజాతి మొక్కలు మొయ్యగలుగుతాయి. అయితే, ఇలాంటి నిలువు తోటలో పుచ్చకాయలు, కర్బూజ కాయల బరువు మొక్కలకు భారం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ నెట్ కవర్లతో కాయలను ప్లాస్టిక్ వైర్లకు కట్టేస్తున్నారు. ‘నిలువు తోటలో పెరిగిన పుచ్చకాయలను మేం త్వరలోనే అమ్మకానికి పెట్టబోతున్నాం. సౌతాఫ్రికా మార్కెట్లో మేమే ఫస్ట్’ అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధి ఫ్రాంకోయిస్ ఫౌరీ. పాలీహౌస్లు, నెట్హౌస్లలో, మేడపై ఇంటిపంటల్లో ట్రెల్లిస్ పుచ్చ, కర్బూజ సాగు సాధ్యమే అని గ్రహించాలి! -
బ్రెడ్ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?
బ్రెడ్ఫ్రూట్ (ఆర్టోకార్పస్ ఆల్టిలిస్) చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. పనస, బ్రెడ్నట్, అంజీర, మల్బరీలకు దగ్గరి జాతికి చెందినదే. తెలుగులో ‘సీమ పనస’, ‘కూర పనస’ అంటారు. ఫిలిప్పీన్స్, న్యూగినియా, మలుకు దీవులు, కరిబియన్ దీవుల ప్రాంతం దీని పుట్టిల్లు. ఇప్పుడు దక్షిణాసియా, ఈశాన్య ఆసియా, పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలు, కరిబియన్, సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో సాగవుతోంది. ఈ చెట్లకు కాచే కాయలు లేత ఆకుపచ్చని రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కాయలనే (పండుగా కాదు) అనేక రూపాల్లో తింటూ ఉంటారు. పసిఫిక్ దీవుల్లోని ప్రజలు అనాదిగా దీన్ని బ్రెడ్ లేదా బంగాళ దుంపల మాదిరిగా దైనందిన ఆహారంగా తింటున్నారు. బ్రెడ్ఫ్రూట్ చెట్లలో విత్తనాలు ఉన్న, లేని రెండు రకాలున్నాయి. ఈ చెట్టు 26 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. అదే చెట్టుకు ఆడ, మగ పూలు పూస్తాయి. లేతగా ఉన్నప్పు లేత ఆకుపచ్చగా, పండినప్పుడు ముదురు పసుపు రంగులో దీని కాయలు ఉంటాయి. తొక్కపైన చిన్నపాటి బుడిపెలు ఉంటాయి. లోపలి గుజ్జు లేత గోధుమ రంగులో చక్కని వాసనతో కొంచెం తియ్యగా ఉంటుంది. దీని కాయలు కిలో నుంచి 5 కిలోల వరకు బరువు పెరుగుతాయి. పోషక విలువలుబ్రెడ్ఫ్రూట్ తినగానే జీర్ణమైపోయేది కాదు. నెమ్మదిగా అరుగుతుంది. దీనిలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు, జీర్ణమయ్యే పీచుపదార్థం, ముఖ్యమైన విటమిన్లు, విటమిన్ సి, పొటాషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లకు కూడా ఇది నెలవు. ఉత్పాదకత, సుస్థిరతఎదిగిన ఒక బ్రెడ్ఫ్రూట్ చెట్టు ఏడాదికి 200 కిలోలకు పైగా కాయలు కాస్తుంది. నాటిన తర్వాత వేరూనుకొని బతికితే చాలు. తర్వాత ఢోకా ఉండదు. మొండిగా పెరిగి, కాయలనిస్తుంది. ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని, నిస్సారమైన భూముల్లోనూ బతుకుతుంది. అందువల్లే ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రజలకు కరువు కాలాల్లో కూడా సుస్థిరంగా ఆహారాన్ని అందిస్తుంది. ఎన్నో రకాలుగా తినొచ్చుబ్రెడ్ఫ్రూట్ను పచ్చిగా, లేతగా, పండుగా.. ఇలా ఏ దశలోనైనా తినొచ్చు. పూర్తిగా మగ్గిన పండుకు బంగాళ దుంప రుచి వస్తుంది కాబట్టి అనేక వంటకాలు చేసుకోవచ్చు. పెరిగిన కాయను ఉడకబెట్టుకొని, కుమ్ములో పెట్టుకొని, వేపుకొని, కాల్చుకొని తినొచ్చు. పచ్చి బ్రెడ్ఫ్రూట్ కాయలను పిండి చేసి పెట్టుకొని, బేకరీ ఉత్పత్తుల్లో కూడా కలుపుకోవచ్చు. ఇందులో గ్లుటెన్ ఉండదు కాబట్టి సెలియాక్ జబ్బు ఉన్న వారు కూడా తినొచ్చు. తీపి పదార్ధాల్లో, రుచికరమైన ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవచ్చు. పోషక విలువలుబ్రెడ్ఫ్రూట్లో పోషకవిలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉన్నాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడే ముఖ్యమైన అమినోయాసిడ్లు, ప్రొటీన్లు, పీచుపదార్థం ఇందులో ఉంటాయి. విటమిన్ సి, బి1, బి5తో పాటు పొటాషియం, రాగి వంటి మినరల్స్ ఉన్నాయి.చదవండి: వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ.. ఆదాయం ఎంతో తెలుసా?ఈ కాయలో కొవ్వు, సోడియం స్వల్పంగా, పీచుపదార్థం అధికంగా ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్ఫ్రూట్ ముక్కల్లో 4.4 మిల్లీ గ్రాముల సోడియం, 60 గ్రాముల పిండిపదార్థాలు, 2.4 గ్రాముల మాంసకృత్తులు, 227 కేలరీల శక్తి, 24.2 గ్రాముల చక్కెర, 0.5 గ్రామలు కొవ్వు, 10.8 మిల్లీ గ్రాముల పీచు పదార్థం ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్ఫ్రూట్ ముక్కలు తింటే ఆ రోజుకు సరిపోయే పొటాషియంలో 23% లభించినట్లే. రోగనిరోధక శక్తిపుష్కలంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను అందించటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించటం, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచగలగటం బ్రెడ్ఫ్రూట్ ప్రత్యేకత. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను నిర్మూలించటం, దీర్ఘరోగాల బెడదను తగ్గించటంతో పాటు దేహం బరువును తగ్గించుకోవటానికి ఉపకరిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముక పుష్టికి దోహదపడుతుంది. విటమిన్ ఎ ఉండటం వల్ల కంటి చూపునకు కూడా మంచిదే. వెంటనే అరిగిపోకుండా క్రమంగా శక్తినిస్తుంది కాబట్టి రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. -
పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?
మీ గార్డెన్లో పేనుబంక (అఫిడ్స్)ను నియంత్రించటం ఒక సవాలుతో కూడుకున్న పని. కానీ, పేనుబంక పురుగులను అదుపు చేయటానికి అనేక ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. మీరు అనుసరించగల కొన్ని సూచనలు:1. మీ మొక్కలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండిముడుచుకున్న ఆకులపై అంటుకునే పదార్థం లేదా స్టెమ్ లేదా ఆకులపై పేనుబంక సోకుతున్న సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో గమనించటం కోసం మీ మొక్కలను తరచుగా తనిఖీ చేయండి. 2. వేపనూనె వాడండి వేప నూనె అఫిడ్స్ను నియంత్రిండానికి వాడే సహజమైన పురుగుమందు. లేబుల్ సూచనల ప్రకారం వేప నూనెను నీటితో కలిపి పేనుబంక సోకిన మొక్కలపై పిచికారీ చేయండి. 3.సబ్బు నీరు స్ప్రే చేయండిపేనుబంకను నియంత్రించడానికి తేలికపాటి డిష్ సోప్ను నీటిలోకలిపి ప్రభావిత మొక్కలపై స్ప్రే చేయవచ్చు.4. గార్లిక్ స్ప్రే ఉపయోగించండివెల్లుల్లి సహజ క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పేనుబంకను నియంత్రించడంలో సహాయ పడుతుంది. వెల్లుల్లి రసాన్ని నీటితో కలపండి. ప్రభావిత మొక్కలపై పీచికారీ చేయండి.5. ప్రయోజనకరమైన కీటకాలులేడీబగ్స్, లేస్వింగ్, పరాన్నజీవి కందిరీగలు వంటి ప్రయోజనకరమైన కీటకాలు పేనుబంకను వేటాడతాయి. అఫిడ్స్ పురుగుల సంతతిని నియంత్రించడానికి మీ గార్డెన్ లో ఈ కీటకాలు పెరిగేలా చూసుకోండి.6. తోట పరిశుభ్రత పాటించండికలుపు మొక్కలను తొలగించండి. తెగులు సోకిన మొక్కలను తీసి దూరంగా పారవేయండి. పురుగుల ముట్టడిని నివారించడానికి ఎక్కువ ఎరువులు వేయకుండా ఉండండి.7. స్క్రీన్లు, రో కవర్లను ఉపయోగించండిఅఫిడ్స్ మీ మొక్కలను ఆశించకుండా నిరోధించడానికి ఫైన్–మెష్ స్క్రీన్లు లేదా ఫైన్–వెటెడ్ రో కవర్లను ఉపయోగించండి.8.జీవ నియంత్రణపేనుబంకను తినే పక్షులు, సాలె పురుగులు వంటి సహజ మాంసాహారులను ప్రోత్సహించటం ద్వారా జీవ నియంత్రణకు అవకాశం కల్పించండి.9. పర్యవేక్షించండి, పునరావృతం చేయండి మీ గార్డెన్లో మొక్కలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. పేనుబంకను సమర్థవంతంగా అరికట్టే నియంత్రణ చర్యలను అవసరాన్ని బట్టి పునరావృతం చేయండి.– హేపీ గార్డెనర్స్ అడ్మిన్ టీం -
వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?
ఫిలిప్పో కర్రర 28 ఏళ్ల యువ రైతు. అతనిది ఇటలీలోని ఉత్తరప్రాంతంలోని పర్మ నగరం. ఇటలీలో పెద్ద కమతాలే ఎక్కువ. ఇప్పుడు సగటు వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణం సుమారు 11 హెక్టార్లు. అక్కడ కమతాల సైజు పెరుగుతూ వస్తోంది. 2000వ సంవత్సరంలో 5 హెక్టార్లున్న సగటు కమతం విస్తీర్ణం 2010 నాటికి 8 హెక్టార్లకు, తర్వాత 11 హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయక కుటుంబంలో పుట్టిన ఫిలిప్పో చదువు పూర్తి చేసుకొని ఏడేళ్ల క్రితం వ్యవసాయంలోకి దిగాడు. పేరుకు వ్యవసాయమే అయినా వాణిజ్య దృష్టితో సేద్యం చేయటంలో దిట్ట ఫిలిప్పో. అతను పగ్గాలు చేపట్టేటప్పటికి వారి కుటుంబ వ్యవసాయ కంపెనీ పది హెక్టార్లలో పంటలు సాగు చేస్తుండేది. ఈ ఏడేళ్లలోనే 150 హెక్టార్లకు విస్తరించిందంటే యువ రైతు ఫిలిప్పో పట్టుదల, కార్యదక్షతలను అర్థం చేసుకోవచ్చు. 50 హెక్టార్లలో ఇటాలియన్ బసిల్ పంటను పండిస్తున్నాడాయన. బసిల్ తులసి జాతికి చెందిన పంట. ఇందులో తీపి రకం కూడా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన సలాడ్లలో కలుపుకొని తింటారు. బసిల్ నుంచి నూనెను కూడా వెలికితీసి అనేక ఔషధాల్లో వాడుతూ ఉంటారు. 1996లో పుట్టిన ఫిలిప్పోను ఆ దేశంలో కొత్త తరం రైతులకు, వాణిజ్య స్ఫూర్తికి ప్రతీకగా యువత పరిగణిస్తున్నారు. ‘నేను ఏడేళ్ల క్రితం మా వ్యవసాయం బాధ్యతలు తీసుకున్నాను. పది హెక్టార్ల పొలానికి బాధ్యత తీసుకున్నాను. మా తాత ప్రాంరిశ్రామిక పద్ధతుల్లో భారీ విస్తీర్ణంలో టొమాటోలు సాగు చేసేవారు (ఇటలీ ఉత్తర భాగంలో ఎక్కువ టొమాటోలే సాగవుతూ ఉంటాయి). బసిల్ పంటను అధిక విస్తీర్ణంలో పెంచడానికి అనువైనదిగా గుర్తించాను. ఇది అధికాదాయాన్నిచ్చే పంట. అయితే, రైతులు కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. నేను భారీ యంత్రాలు ఉపయోగించటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం ప్రారంభించాను. బసిల్ ఆకులను తాజాగా, సువాసనతో కూడి ఉండాలని దీనితో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఆశిస్తుంటాయి..’ అంటాడు ఫిలిప్పో (బ్రెడ్ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?)మనుషులతో కాకుండా భారీ యంత్రాలతో బసిల్ పంట కోతను చేపట్టాలనుకున్నప్పుడు.. తమ పొలంలో మడుల సైజుకు తగిన విధంగా పంట కోత యంత్రాన్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించి తయారు చేయించాడు. ఫిలిప్పో ఫిలిప్ఫో బసిల్ ఆకును ఆ రంగంలో వేళ్లూనుకున్న 6 కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ‘నేను ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం చదివాను. కానీ, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం’ అన్నాడు. ‘ఆరుబయట పొలాల్లో విస్తారంగా బసిల్ పంటను నాణ్యమైన దిగుబడి తీసే విధంగా సాగు చేయటం సవాళ్లతో కూడిన పని. అయితే, ఈ పంటలోనే ఎదిగే అవకాశం ఉందని నేను గుర్తించాను. మా కంపెనీ 3 వేల టన్నుల బసిల్ ఆకులను పండిస్తోంది. టన్ను ధర 550 యూరోలు (సుమారుగా రూ. 49 వేలు). అనేక విషయాలపై ఆధారపడి ఈ ధరలో హెచ్చుతగ్గులుంటాయి అనిఫిలిప్పో చెప్పాడు. 50 ఎకరాల్లో ఏడాదికి రూ. 14.66 లక్షల ఆదాయం పొందుతున్నాడు. (పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?)ఏప్రిల్ రెండోవారంలో బసిల్ విత్తటం ప్రారంభిస్తాం. మొదటి కోత జూన్ రెండోవారంలో మొదలవుతుంది. అక్టోబర్ వరకు కోతలు కొనసాగుతాయి. ‘ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారం వరకు దిగుబడి, నాణ్యత బాగున్నాయి. భారీ వర్షం కురవటంతో పంట దెబ్బతింది.’ అన్నాడు ఫిలిప్పో. పొద్దున్న, సాయంత్రపు వేళల్లో బసిల్ ఆకుల్ని కత్తిరిస్తే వాటి నాణ్యత, రంగు, వాసన బాగుంటాయి. మేం కత్తిరించిన కొద్ది గంటల్లోనే ఫుడ్ కంపెనీకి చేర్చుతాము అని చెప్పాడు. ఇటలీలో ఒకానొక పెద్ద సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ‘ఎలిల్బంక’. ఫిలిప్పో కర్రరకు దీని మద్దతు ఉంది. ఫిలిప్పోకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, వ్యాపారాత్మక దృష్టి అమోఘమైనవి’ అని ఎలిల్బంక ప్రతినిధి ఆండ్రియా కలెఫ్పి ప్రశంసించారు. -
పత్తి చేనులో పప్పులు,కూరగాయలు : ఇలా పండించుకోవచ్చు!
వర్షాధారంగా వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులు బహుళ పంటల సాగుకు స్వస్థి చెప్పి పత్తి, కంది వంటి ఏక పంటల సాగు దిశగా మళ్లటం అనేక సమస్యలకు దారితీస్తోంది. వికారాబాద్ జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు ఈ సమస్యలకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. పత్తిలో పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలను అంతర పంటలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేయటం రైతులకు నేర్పిస్తున్నారు. ప్రధాన పంటపై ఆదాయం పొందుతూనే అంతరపంటలతో కుటుంబ పౌష్టికాహార అవసరాలు తీర్చుకునే దిశగా రైతు కుటుంబాలు ముందడుగు వేస్తున్నాయి.వికారాబాద్ జిల్లాలోని సాగు భూమిలో 69.5% భూమిలో రైతులు వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. నల్ల రేగడి భూములతో పోల్చుకుంటే ఎర్ర /ఇసుక నేలలు ఈ జిల్లాలో అధికంగా ఉన్నాయి. ఈ నేలల్లో సారం తక్కువ. తేమ నిలుపుకునే శక్తి కూడా తక్కువ. తద్వారా పంట దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ ప్రధానమైన పంట కంది. జిఐ గుర్తింపు కలిగిన ప్రఖ్యాతమైన తాండూర్ కంది పప్పు గురించి తెలిసిందే. పదేళ్ల క్రితం వరకు వికారాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో కంది, పెసర, నువ్వు, పచ్చ జొన్న, బొబ్బెర, కొర్ర, అనుములు, మినుములు, పత్తి, మొక్క జొన్న వంటి పంటలు పండించేవారు. అయితే, ప్రస్తుతం వర్షాధార భూముల్లో 60% వరకు పత్తి పంట విస్తరించింది. రబీలో ప్రధానంగా బోర్ల కింద వేరుశనగ, వరి పంటలు సాగులో ఉన్నాయి. (రూ. 40 వేలతో మినీ ట్రాక్ట్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ)ఒక పొలంలో అనేక పంటలు కలిపి సాగు చేసే పద్ధతి నుంచి ఏక పంట సాగు (మోనోకల్చర్) కు రైతులు మారటం వల్ల చీడపీడలు పెరుగుతున్నాయి. రైతు కుటుంబాలు రోజువారీ వాడుకునే పప్పులు, కూరగాయలను కొనుక్కొని తినాల్సిన పరిస్థితి నెలకొంది. వాసన్ స్వచ్ఛంద సంస్థ ఈ సమస్యలకు పరిష్కారాలు వెదికే దిశగా కృషి చేస్తోంది. దౌలతాబాద్, దోమ, బోమరసపేట మండలాల్లో అరక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, ఇతర సహకార సంఘాలతో కలసి పనిచేస్తోంది. పత్తిలో అంతర పంటల సాగుపై సలహాలు, సూచనలు అందిస్తూ రైతులకు తోడుగా ఉంటూ వారి నైపుణ్యాలు పెంపొదిస్తోంది. పత్తి ప్రధాన పంటగా 5 సాళ్లు, పక్కనే 6వ సాలుగా కంది.. వీటి మధ్య బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు విత్తుతున్నారు. 3–4 నెలల్లో ఈ పంటల దిగుబడి చేతికి వస్తోంది. ఆ పంటల కోత పూర్తయ్యాక ఎండు కట్టెను పత్తి పొలంలోనే ఆచ్ఛాదనగా ఉపయోగిస్తున్నారు. టైప్ 2 ఘన జీవామృతం వేయటంతో పాటు ప్రతి 15–20 రోజులకు ద్రవ జీవామృతం, కషాయాలు పిచికారీ చేస్తున్నారు. దీంతో తొలి ఏడాదిలోనే రైతులు సత్ఫలితాలు పొందుతున్నారని వాసన్ ప్రతినిధి సత్యం (83175 87696) తెలిపారు. మా కుటుంబంలో అమ్మ, నా భార్య, ఇద్దరు పిల్లలు ఉంటాం. ఐదు ఎకరాల పొలం ఉంది. 8 బోర్లు వేసినా రెంటిలోనే నీరు పడింది. ఒకటి 2 ఇంచులు, మరొకటి 1 ఇంచు నీరు ఇస్తున్నాయి. సాధారణంగా 2 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, అలాగే కూరగాయలు సాగు చేస్తుంటాను. 2024 ఫిబ్రవరి, మే నెలల్లో వాసన్ సంస్థ నిర్వహించిన రెండు శిబిరాలకు హాజరై శిక్షణ తీసుకున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే సాగు పద్ధతులు, తక్కువ వర్షం అవసరం ఉన్న పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ ఖరీఫ్లో 1 ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేశాను. పంటల సాగుకు ముందు అనేక రకాల పచ్చిరొట్ట పంటలు సాగు చేసి రొటోవేటర్తో నేలలో కలియదున్నాను. జులై 3వ తేదీన పత్తి, కంది, బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూర విత్తనాలు వేశాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పట్టుదలతో పాటించాను. నా ప్రయాణంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. విత్తనాలు వేయడం, కషాయాలు, ద్రవ, ఘన జీవామృతాల వాడకం వంటి అన్ని విషయాల్లో వాసన్ సంస్థ వారు నాకు సూచనలు ఇచ్చారు. విత్తనాలు వేసిన నెల నుంచే ఏదో పంట చేతికి రావడం ప్రారంభమైంది, మాకు నిరంతరం ఆదాయం వచ్చేలా చేశారు. ఇంట్లో మేము తినటానికి సరిపడా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు వచ్చాయి. మిగిలినవి అమ్ముకొని మంచి ఆదాయం పొందాం. కానీ, ఈ ఏడు అధిక వర్షాల కారణంగా పత్తి 6 క్వింటాళ్లే వచ్చింది. అనుకున్న స్థాయిలో పంట రాలేదు. ఈ పప్పు ధాన్యాలు, నూనె గింజలు సంవత్సరమంతా మా కుటుంబానికి పోషకాహారాన్ని అందిస్తున్నాయి. ఈ ఎకరానికి రూ. 29,400 ఖర్చయ్యింది. పత్తి, కంది పంటలన్నీ పూర్తయ్యే నాటికి ఆదాయం రూ. 96,500లు వస్తుందని అనుకుంటున్నాను. ఈ వ్యవసాయ పద్ధతి మా కుటుంబానికి ఆర్థిక భద్రతను కలిగించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో మాకు ఆదాయం బాగుంది. అలాగే, నీటి వినియోగాన్ని తగ్గించడంలో ఈ పద్ధతులు మాకు ఎంతో సహాయపడ్డాయి.– అక్కలి శ్రీనివాసులు (96668 39118), రైతు,దోర్నాలపల్లి, దోమ మండలం, వికారాబాద్ జిల్లా ప్రకృతి సేద్యంతో ఆదాయం బాగుందివికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లికి చెందిన బందయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల పొలంలో 6 సార్లు బోర్లు వేసినా ఒక్క బోరులోనే 2 ఇంచుల నీరు వస్తోంది. కుటుంబం తిండి గింజల కోసం ఎకరంలో వరి నాటుకున్నారు. మిగిలిన 1.5 ఎకరంలో వర్షాధారంగా జొన్న, పత్తి, కందులను రసాయనిక పద్ధతిలో సాగు చేసేవారు. పెద్దగా ఆదాయం కనిపించేది కాదు. వాసన్ సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పత్తి పంట సాగుపై రెండుసార్లు శిక్షణ పొంది సాగు చేపట్టారు. ఒక పంట నష్టమైతే మరొక పంటలో ఆదాయం వస్తుందని తెలుసుకున్నారు. ఒక ఎకరంలో పత్తితో పాటు పప్పుదినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను అంతర పంటలుగా ఈ ఏడాది ఖరీఫ్లో సాగు చేశారు. విత్తనం వేయటం నుంచి, కషాయాలు పిచికారీ, ద్రవ – ఘన జీవామృతాల వినియోగం, పంట కోత విధానం.. ఇలా ప్రతి పనిలోనూ వాసన్ ప్రతినిధుల సూచనలు పాటించారు. మొదటి నెల నుంచి ఆకుకూరలు, 3 నెలల్లో మినుము, పెసర, కూరగాయలు, చిరుధాన్యాలు.. ప్రతినెలా ఏదో ఒక పంట చేతికి రావడంతో సంతోషించారు. ఇంట్లో తినగా మిగిలినవి అమ్మటం వల్ల అదనపు ఆదాయం కూడా వచ్చింది. పత్తి 7 క్వింటాళ్లు, కందులు 4–5 క్వింటాళ్లు వస్తాయని ఆశిస్తున్నారు. ఒకసారి నీటి తడి ఇచ్చారు. నేల మొత్తం పంటలు పరుచుకోవడం వల్ల నీటి అవసరం చాలా తగ్గిందని బందయ్య తెలి΄పారు. పత్తిలో అంతరపంటలు వేసిన ఎకరానికి పెట్టుబడి రూ. 28 వేలు. కాగా, ఇంట్లో వాడుకోగా మిగిలిన పప్పుధాన్యాలు, చిరుధాన్యాల అమ్మకంపై వచ్చిన ఆదాయం రూ. 13,750. పత్తి, కందులపై రాబడి (అంచనా) రూ. 1,01,000. ఖర్చులు ΄ోగా రూ. 86,750 నికరాదాయం వస్తుందని భావిస్తున్నారు. అధిక వర్షం వలన పత్తి పంట కొంత దెబ్బతిన్నప్పటికీ మిగతా పంటల్లో వచ్చిన దిగుబడులు సంతోషాన్నిచ్చాయని, వచ్చే ఏడు కూడా ఈ పద్ధతిలోనే పత్తి, అంతర పంటలు సాగు చేస్తానని బండి బందెయ్య అంటున్నారు. -
రూ. 40 వేలతో మినీ ట్రాక్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ
పెద్దగా చదువుకోకపోయినా సృజనాత్మక ఆలోచన, పట్టుదలతో కూడి కృషితో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పటానికి ఈ మినీ ట్రాక్టర్ ఓ ఉదాహరణ. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన పెంచల నారాయణ (25) వెల్డింగ్ పనిచేస్తూ జీవిస్తున్నారు. 9వ తరగతి వరకు చదువుకున్న నారాయణ చిన్న రైతుల కోసం కేవలం రూ.40 వేల ఖర్చుతో మినీ ట్రాక్టర్ను తయారు చేసి ప్రశంసలు పొందుతున్నారు. ఆటో ఇంజన్ తదితర విడిభాగాలను జత చేసి మినీ ట్రాక్టర్ను రూపొందించారు. 2 లీటర్ల డీజిల్తో ఎకరా పొలం దున్నేయ వచ్చునని నిరూపించారు. ΄ పొలం దున్నడంతో పాటు నిమ్మ, జామ వంటి పండ్ల తోటల్లో అంతర సేద్య పనులను ఈ మినీ ట్రాక్టర్తో అవలీలగా చేసుకోవచ్చని నారాయణ వివరించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు తక్కువ ఖర్చుతో కూడిన మినీ ట్రాక్టర్ను అందిస్తానని పెంచల నారాయణ అంటున్నారు. కాన్సెప్ట్ బాగుంది: గణేశంపల్లెసృజన అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం మాట్లాడుతూ.. ‘కాన్సెప్ట్ బాగుంది. ఏమీ తెలియని ఒక అబ్బాయి నడిచే మోటరు వాహనాన్ని తయారు చేయడం సులభం కాదు అన్నారు. ‘రోడ్డు మీద బాగానే నడుస్తోంది. చిన్న ఇంజన్తో దుక్కిచేయటం వంటి శక్తితో కూడుకున్న పనులను ఏయే రకాల భూముల్లో ఈ చిన్న టాక్టర్ ఎంతవరకు చేయగలుగుతుందో చూడాలి’ అన్నారాయన. – కే.మధుసూధన్, సాక్షి, పొదలకూరు -
కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించటం ఎలా?
వ్యాధి నిర్ధారణ అయిన కోళ్లకు, వాటి పక్కన ఉన్న కోళ్లకు చికిత్స చేయడానికి మాత్రమే యాంటీబయాటిక్స్ ఉపయోగించండి. వీటిని మేత ద్వారా కంటే నీటిలో కలిపి ఇస్తే బాగా పనిచేస్తాయి. యాంటీబయాటిక్ ఔషధాలను వ్యాధి నివారణకు లేదా కోళ్ల పెరుగుదలను పెపొందించడానికి ఉపయోగించవద్దు.కోళ్ల షెడ్లోకి వచ్చే సందర్శకుల సంఖ్యను పరిమితం చేయండి. లోపలికి వెళ్లే ముందు బట్టలు, చెప్పులు/బూట్లు మార్చుకోవాలి. చేతులు కడుక్కోవాలి. ఆవరణలోకి ప్రవేశించే ముందు వాహనాలను క్రిమిసంహారకాలతో శుభ్రపరచండి. వ్యాధులను వ్యాపింపజేసే ఎలుకలు, పురుగులు, పెంపుడు జంతువులు, అడవి జంతువులు కోళ్ల ఫారాలల్లోకి రానివ్వకండి. నాణ్యతతో కూడిన మంచి వ్యాక్సిన్లను ఉపయోగించండి. తయారీదారు సూచించిన విధంగా వాటిని నిల్వ చేయండి, జాగ్రత్తగా వాడండి.మీ ఫౌల్ట్రీ ఫామ్లో కోళ్ల ఆరోగ్యాన్ని, ప్రవర్తనను ప్రతిరోజూ తనిఖీ చేయండి. వాటిల్లో అకస్మాత్తుగా లేదా క్రమంగా వస్తున్న మార్పులను వెంటనే గుర్తించండి. చనిపోయిన పక్షులను తొలగించి పారవేయండి.గాలి, వెల్తురు, మేత, నీటి సరఫరా, కోళ్ల సంఖ్య (స్టాకింగ్ డెన్సిటీ) ఇతర విషయాలకు సంబంధించి నిపుణుల సిఫార్సులను అనుసరించండి.కోళ్లకు వేసే మేత నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండాలి. మేతలో తగినంత శక్తినిచ్చే దినుసులు, ఖనిజాలను సమతుల్యంగా ఉండాలి. మేతను జాగ్రత్తగా నిల్వ చేయండి. మొక్కలు, గింజలతో కూడిన మేతను ఇవ్వటమే మేలు.ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, సుగంధ తైలాలు, ఆర్గానిక్ యాసిడ్స్, నీటకరగని పీచు కోళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి పేగులలో ఉపయోగకరమైన బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. సూక్ష్మక్రిములను నిరోధిస్తాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.చదవండి: మనం తింటున్న ఆహార నాణ్యత ఎంత?మీ ఫౌల్ట్రీ షెడ్ను, పరికరాలను క్రిమిసంహారకాలతో శుభ్రం చేసిన తర్వాత.. మురికిని శుభ్రంచేయటానికి డిటర్జెంట్లు లేదా వేడి నీటిని ఉపయోగించండి. ప్రతి బ్యాచ్ తర్వాత తగినన్ని రోజులు షెడ్ను ఖాళీగా ఉంచండి.కొత్తగా కోడి పిల్లలను తెచ్చుకునేటప్పుడు విశ్వసనీయమైన హేచరీల నుంచి తెచ్చుకోండి. టీకాలు వేసి, వ్యాధులు సోకని తల్లి కోళ్ల నుంచి పుట్టిన పిల్లలనే ఎంచుకోండి.కోడిపిల్లలను తెచ్చిన వెంటనే మేతను, నీటిని అందించండి. వాటికి అవసరమైన అన్ని పోషకాలు ఇవ్వండి. శారీరక అవసరాలను తీర్చేలా ఏర్పాట్లు చేయండి.చదవండి: కుమ్ఖాత్ పండు.. పోషక విలువలు మెండుశుభ్రమైన, మంచి నాణ్యత గల నీరు అందుబాటులో ఉండేలా చూసుకోండి. నీటి సరఫరా గొట్టాలను తరచుగా శుభ్రపరచండి. డ్రింకింగ్ లైన్లను వారానికోసారి శుభ్రపరచండి.మరిన్ని ముఖ్యాంశాలుకోడి పిల్లలకు మొదటి నుంచే అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోండి. ఆరోగ్యకరమైన కోడి పిల్లలను మాత్రమే పెంచండి. మీ కోళ్ల ఫారాన్ని సిద్ధం చేయండి.మేతలో ప్రత్యేక పోషకాలు కలిపి ఇవ్వండి.మేత ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.సౌకర్యవంతమైన వాతావరణం కల్పించండి.ప్రతి రోజూ కోళ్లను పరిశీలించండి.సకాలంలో టీకాలు వేయండి.గట్టి జీవ భద్రతా చర్యలు పాటించండి. యాంటీ బయాటిక్స్ను తగుమాత్రంగా వాడండి.అధిక నాణ్యత గల నీరివ్వండి. -
రైతు లాభాలకు పంట మార్పిడి ఊతం!
వ్యవసాయం ఆశల జూదమంటారు. సకాలంలో వానలు కురవకపోవడం మొదలుకొని వాతావరణ మార్పులు, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత.. ఇలా రకరకాల కారణాలు రైతును దెబ్బతీయవచ్చు. అయితే ఇవేవీ రైతు నియంత్రణలో ఉన్న అంశాలు కావు. కానీ.. రైతులు తమ చేతుల్లో ఉన్నవీ సక్రమంగా చేసుకోకపోవడంతో కూడా నష్టపోతున్నాడని అంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ జి.పద్మజ. పైగా ఈ విషయం గురించి తెలియని వారు ఉండరని, ఆచరణలో పెట్టకపోవడం వల్ల రైతులు కనీసం 25 శాతం పంట దిగుబడిని నష్టపోతున్నాడని చెబుతున్నారు. ఏంటా విషయం. దిగుబడి నాలుగో వంతు పెరిగే మార్గమేది? ఒక్క ముక్కలో చెప్పాలంటే... పంట మార్పిడి!అంతేనా అని అనుకోకండి.. రైతు ఆదాయాన్ని పెంచుకునేందుకు పంట మార్పిడి అద్భుతమైన సాధనం. పైగా రసాయనిక ఎరువుల ధాటికి నానాటికీ తీసికట్టుగా మారుతున్న నేల సారానికి టానిక్గానూ పనిచేస్తుంది ఇది. దురదృష్టం ఏమిటంటే.. ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ మన మన రైతన్నలు పంట మార్పిడిని సీరియస్గా తీసుకోవడం లేదని అంటున్నారు డాక్టర్ జి.పద్మజ. ఈ నేపథ్యంలో అసలు పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను ఇంకోసారి తరచి చూద్దాం...భూసారం, దిగుబడులు పెరుగుతాయి..వరి, మొక్కజొన్న, పత్తి వంటి వాణిజ్య పంటలు మట్టిలోని పోషకాలను తగ్గిస్తూంటాయి. దీనివల్ల ఏటికేడాదీ దిగుబడి కూడా తగ్గుతూంటుంది. అయితే.. పంటలను మార్చి మార్చి వేసుకోవడం అది కూడా మట్టిలో నత్రజనిని చేర్చగల వాటిని వేసుకోవడం ద్వారా పోషకాలను మళ్లీ భర్తీ చేసుకోవచ్చు. తద్వారా నేల సారం పెరుగుతుంది. దిగుబడులు కూడా ఎక్కువవుతాయి. ఉదాహరణకు.. వేరుశనగ, పప్పుధాన్యాల పంటలు మట్టిలో నత్రజనిని పెంచుతాయి. ఫలితంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నేల నుంచే తగినంత నత్రజని అందుతుంది. కృత్రిమంగా అందించాల్సిన అవసరం తగ్గుతుంది కూడా. పంట మార్పిడి చేసుకోవడం వల్ల దిగుబడి సుమారు 25 శాతం వరకూ పెరుగుతుందని పరిశోధనలు చెబుతూండగా.. వరి, మొక్కజొన్న, కాయధాన్యాల విషయంలో ఈ పెరుగుదల 20 శాతమని ఇప్పటికే స్పష్టమైంది. మార్పిడులు ఇలా...వరి వేసిన తరువాత మినుములు లేదా నువ్వుల్లాంటి నూనెగింజల సాగు చేయడం మేలు. దీనివల్ల నేలలో నత్రజని మోతాదు పెరగడమే కాకుండా.. చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. మొక్కజొన్న పంటను వేరుశనగ లేదా కాయగూర పంటలతో మార్పిడి చేసుకోవడం మేలు. ఒకవేళ ప్రధాన పంటగా వేరు శనగ వేస్తూంటే.. తరువాతి పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. ఇది నేలలో సేంద్రీయ పదార్థం మోతాదులను కూడా పెంచుతుంది. పత్తి పంటకు మార్పిడిగా పెసలు వేస్తే చీడపీడల బెడద తగ్గుతుంది. నేలలో నత్రజని మోతాదు ఎక్కువ అవుతుంది. ప్రధాన పంటల సాగు తరువాత కాయధాన్యాలను సాగు చేయడం.. వ్యర్థాలను మళ్లీ నేలలో కలిపేస్తే మేలు కలిగించే సూక్ష్మజీవులు కూడా ఎక్కువవుతాయి. వేర్వేరు పంటల సాగు వల్ల రైతు ఆదాయమూ పెరుగుతుంది. రైతుకు ఎంతవరకూ లాభం...?పంట మార్పిడిని తగు విధంగా అమలు చేస్తే రైతు ఆదాయం 15 నుంచి 20 శాతం ఎక్కువ అవుతుంది. ఒక సంవత్సరంలో వేర్వేరు పంటలు సాగు చేస్తారు కాబట్టి మార్కెట్ రిస్క్ తక్కువ అవుతుంది. పైగా ఎక్కువ డిమాండ్ ఉన్న, ఆదాయం అందించే కూరగాయల్లాంటివి సాగు చేసుకునే వీలేర్పడుతుంది. పైగా పంట మార్పిడి వల్ల నేలలో నత్రజని మోతాదు ఎక్కువై ఇన్పుట్ ఖర్చులు 10 - 15 శాతం వరకూ తగ్గుతాయి. అంటే రసాయన ఎరువులు, క్రిమి, కీటకనాశినుల వాడకం తగ్గుతుందని అర్థం. పంటలు మార్చి మార్చి సాగు చేయడం వల్ల చీడపీడలకు అవకాశాలూ తగ్గుతాయి. ఒకే రకమైన పంట సాగు చేస్తూంటే చీడపీడలు కూడా వాటికి అలవాటు పడిపోతాయి కాబట్టి సమస్య ఎక్కువవుతుంది. ఉదాహరణకు వరికి సోకే కాండం తొలుచు పురుగు కాయధాన్యాల మొక్కలపై జీవించలేదు. వరి తరువాత ఈ కాయధాన్యాల సాగు చేస్తే సహజసిద్ధంగా చీడపీడల సమస్య తగ్గిపోతుంది. దేశంలో వ్యవసాయంపైనే ఆధారపడిన అరవైశాతం గ్రామీణుల జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు, ఆహార భద్రతకు పంట మార్పిడి అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. భూసారం, దిగుబడులు పెంచే పంటమార్పిడి గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమయ్యేందుకు తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు కారణమవుతుంది. ఆసక్తి లేదు ఎందుకు?తెలుగు రాష్ట్రాల్లో రైతులు పంటమార్పిడిపై అంతగా ఆసక్తి చూపకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. మొదటిది పంట మార్పిడి వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన లేకపోవడమైతే.. రెండోది పంట మార్పిడి ప్రయోజనాలపై తగిన ప్రచారం లేకపోవడం. వ్యవసాయ, హార్టికల్చర్ విస్తరణాధికారులు ఇతర బాధ్యతలు నిర్వర్తించరావడం వల్ల వారు రైతులకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు. ఇక మూడో కారణం మార్కెట్, ఆర్థిక పరిమితులు. పంటల మార్పిడి వల్ల వేర్వేరు పంటల విత్తనాలు, ఎరువులు, కొన్నిసార్లు వ్యవసాయ పరికరాల అవసరమూ ఏర్పడుతుంది. ఇవి రైతులపై కొంత ఆర్థిక భారం మోపే అవకాశం ఉంటుంది. పైగా అన్ని రకాల పంటలకు మద్దతు ధర లభించని నేపథ్యంలో రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపడం లేదు. చివరగా.. ఒకే రకమైన పంటలు వేయడం (మోనోక్రాపింగ్) అనే సంప్రదాయానికి రైతులు గుడ్ బై చెప్పాలి. రిస్క్ తక్కువన్న అంచనాతో అప్పటివరకూ ఇతరులు పాటిస్తున్న పద్ధతులను గుడ్డిగా అనుసరించడం వల్ల పంట మార్పిడికి ధైర్యం చేయలేకపోతున్నారు. గ్రామస్థులంతా మూకుమ్మడిగా పంట మార్పిడి తీర్మానం చేసుకుని ఆచరిస్తే బహుళ ప్రయోజనాలు కలుగుతాయి.చేయాల్సింది ఇది...రైతులందరూ పంట మార్పిడిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది. అలాగే పైలెట్ ప్రోగ్రామ్తోపాటు డెమాన్స్ట్రేషన్ల ద్వారా వ్యవసాయ అధికారులు పంట మార్పిడి లాభాలు రైతుకు అర్థమయ్యేలా వివరించాలి. సీజన్ను బట్టి మారిపోయే పంటలకు తగ్గట్టుగా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాయధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు నూనెగింజల పంటల విత్తనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా.. మద్దతు ధరలు దక్కేలా చూడటం. మార్కెట్ ఒడిదుడుకులను వీలైనంత మేరకు తగ్గించడం ద్వారా రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపేలా చేయాలి. చివరగా..విధానపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా పంటల మార్పిడి అనేది దేశంలో లక్షలాది రైతు కుటుంబాల ఆదాయాన్ని పెంచే, ఆహార భద్రత కల్పించే సాధనంగా మారుతుంది!తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి పంటల సాగు ఎక్కువ. ఒక్క తెలంగాణలోనే సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి పండిస్తూండగా వార్షిక దిగుబడి కోటీ అరవై లక్షల టన్నుల వరకూ ఉంది. అలాగే తెలంగాణలో మొక్కజొన్న సాగు 28 లక్షల ఎకరాల్లోనూ, వేరుశనగ దాదాపు అరవై వేల ఎకరాల్లోనూ సాగులో ఉంది. రైతులందరూ పంట మార్పిడి చేపట్టడం ద్వారా దిగుబడులు పెరగడంతోపాటు సాగునీటిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. -
మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది?
హరిత విప్లవానికి పట్టుగొమ్మ వంటి పంజాబ్ రాష్ట్రంలో రైతులు పునరలోచనలో పడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అత్యధిక మోతాదులో వాడుతూ ఏడు దశాబ్దాలుగా మార్కెట్ కోసం వరి, గోధుమ వంటి పంటలు పండిస్తూ వచ్చిన రైతులు.. ఆ ఆహారం తిని తమ కుటుంబ సభ్యులు వ్యాధిగ్రస్తులుగా మారుతుండటాన్ని గురించారు. తమ కుటుంబం కోసమైనా రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించుకోవటమే ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గమని పంజాబ్ రైతులు ఎట్టకేలకు గ్రహిస్తున్నారు.తేజ్పాల్ సింగ్ 30 ఎకరాల ఆసామి. పొలం అంతా (గత సెప్టెంబర్లో) పచ్చని వరి పంటతో నిండి ఉంది. పటియాలా జిల్లా కక్రాల గ్రామ పొలిమేరల్లోని తన వరి పొలానికి 4 టన్నుల యూరియా వేశానని, పురుగుల మందు ఒకసారి చల్లానని చెప్పారు. ఇది మార్కెట్లో అమ్మటం కోసం అతను పండిస్తున్నాడు. ఈ పంట అమ్మటం కోసం కాదుఈ ప్రధాన పొలానికి పక్కనే అతనిదే 4 ఎకరాల పొలం మరొకటి ఉంది. అందులో కొంత మేరకు వరి పంట, దాని పక్కనే కూరగాయల తోట కూడా ఉంది. ‘ఈ 4 ఎకరాల పంట అమ్మటం కోసం కాదు, మా కుటుంబం కోసమే పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నా. పచ్చిరొట్ట ఎరువు, వర్మీకంపోస్టు, జీవన ఎరువులు ఈ పొలంలో వాడుతున్నా. మా కుటుంబం తినగా మిగిలినవి ఏమైనా ఉంటే అమ్ముతా’ అన్నారు తేజ్పాల్ సింగ్.ఈ మార్పు ఎందుకొచ్చిందని అడిగితే.. మూడేళ్ల క్రితం తన భార్య అనారోగ్యం పాలైంది. టెస్ట్ చేయిస్తే యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. ఆ రోజుల్లో మరో దగ్గరి బంధువుకు కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది అని ఆలోచించటం మొదలు పెట్టాడు. తాను రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తుల్ని పరీక్ష చేయించాడు. యూరియా, పొటాష్, పురుగుమందుల అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఆ ఆహారంలో ఉన్నట్లు తేలింది.మా కోసం ఆర్గానిక్ పంటలు‘అప్పుడు నేను నిర్ణయించుకున్నా. మా కుటుంబం తినేదంతా సేంద్రియ పద్ధతుల్లోనే పండించుకోవాలని గట్టి నిర్ణయానికొచ్చా. అప్పటి నుంచి ఈ 4 ఎకరాల్లో మా కోసం ఆర్గానిక్ పంటలు పండించుకొని తింటున్నాం. నా భార్య దేహంలో యూరిక్ యాసిడ్ తగ్గింది. మేం తింటున్న సేంద్రియ ఆహారం రుచిగా, నాణ్యంగా ఉంది. ఈ ఆహారం అంతకు ముందు తిన్న దానికన్నా ఎంతో మేలైనదని మాకు అర్థమైంది’ అన్నారు తేజ్పాల్ సింగ్. ఇది ఆయన ఒక్కడి మాటే కాదు. తినే ఆహారంలో రసాయనాల అవశేషాల్లేకపోతే ఆరోగ్యం బాగుంటుందని గట్టిగా గుర్తించిన రైతులు చాలా మందే కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు.చదవండి: సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?కొద్ది నెలల క్రితం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. పంజాబ్లో 2023–24లో ఎకరానికి 103 కిలోల రసాయనిక ఎరువులు వాడారు. దేశవ్యాప్తంగా రైతులు వాడుతున్న 58 కిలోలతో పోల్చితే ఇది దాదాపుగా రెట్టింపు. 1980–2018 మధ్యలో పంజాబ్ రైతులు వాడిన ఎన్పికె ఎరువులు ఏకంగా 180% పెరిగిందట.దీనికి తగ్గట్టే జబ్బులూ పెరిగాయి. ఐసిఎంఆర్ సంస్థ నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం.. పంజాబ్లో 2021లో 39,521 మంది కేన్సర్ బారిన పడితే.. అది 2024 నాటికి 42,288కి పెరిగింది. పొలాల్లో రసాయనాల వాడకం పెరగటానికి, మనుషుల్లో జబ్బులు పెరగటానికి మధ్య సంబంధం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇది పంజాబ్ రైతులు, వినియోగదారులూ గుర్తిస్తున్నారు. మన సంగతేంటి? -
అంతర్జాతీయ సహకార మహాసభ.. ఒకే రంగానికి రెండు చట్టాలెందుకు?
పరస్పరం సహకరించుకోవటం మానవ సహజ లక్షణం. ఈ లక్షణాన్ని ఒక పద్ధతి ప్రకారం కొనసాగించడానికి సహకార సంఘాలు (కోఆపరేటివ్ సొసైటీలు) దోహదం చేస్తాయి. ప్రపంచ సహకార వ్యవస్థకు 130 ఏళ్ల చరిత్ర, సుసంపన్న వారసత్వం ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 12% మంది ఏదో ఒక సహకార సంఘంలో సభ్యులే. మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, వందేళ్లకు పైబడి చక్కగా ఆర్థిక సేవలందిస్తున్న ఘనమైన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పిఎసిఎస్లు), సహకార అర్బన్ బ్యాంకులు అనేకం కనిపిస్తాయి. ఈ నెల 14 నుంచి సహకార వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరో రెండు ముఖ్య విశేషాలు... ఈ నెల 25 నుంచి 30 వరకు న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా అంతర్జాతీయ సహకార మహాసభ జరగబోతోంది.అంతర్జాతీయ మహాసభ మన దేశంలో జరగటం ఇదే మొదటిసారి. సుమారు రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఐక్యరాజ్యసమితి 2025వ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం’గా ప్రకటించింది. ఈ పండుగకు కూడా ఈ నెల 25న ఉత్సాహపూరిత వాతావరణంలో న్యూఢిల్లీలో తెర లేవనుంది. సహకార విలువలకు తిలోదకాలు, అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం.. వంటి అవశ్యం వదిలించుకోవాల్సిన జాఢ్యాలు మన సహకార వ్యవస్థను పట్టి పీడిస్తున్నప్పటికీ.. మొక్కవోని సహకార స్ఫూర్తి మన సమాజంలో అనుక్షణం వర్థిల్లుతూనే ఉంటుంది. సహకారం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది! ఈ నేపథ్యంలో తలపండిన సహకారవేత్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. సహకార సంఘం అంటే?సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చటమే లక్ష్యంగా పనిచేసే ప్రజాస్వామిక సంస్థ సహకార సంఘం. యాజమాన్యం, నియంత్రణ, నిర్వహణ అన్నీ సభ్యులదే. సభ్యుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చటమే సహకార సంఘాల ధ్యేయం. సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, ఒక దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించటానికి సహకార వ్యవస్థ ఉపయోగపడుతుంది. చాలా దేశాల్లో సహకార వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఉంది. నెదర్లాండ్స్లో సహకార సంఘాలకు స్వేచ్ఛ ఎక్కువ. అధికారుల జోక్యం ఉండదు. ఫ్రాన్స్లో 2008లో ఆర్థిక మాంద్యం దెబ్బకు వాణిజ్య బ్యాంకులు నిలవలేక సహకార బ్యాంకుల్లో విలీనమయ్యాయి. అమెరికాలోనూ కమ్యూనిటీ బ్యాంకులు బలంగా ఉన్నాయి. జర్మనీలో రైతులకు ఎక్కువ రుణాలిస్తున్నది సహకార బ్యాంకులే. న్యూజిలాండ్లో డెయిరీ కోఆపరేటివ్లదే రాజ్యం. లాటిన్ అమెరికాలో ఇటీవల కోఆపరేటర్లు బలపడుతూ కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు.జవాబుదారీతనం ఏదీ?మన దేశంలో సహకార విస్తరణకు అవకాశాలెక్కువ. మన సంస్కృతిలోనే సహకార స్ఫూర్తి ఉంది. గ్రామీణులు, గిరిజనుల్లో ఇది మరీ ఎక్కువ. అయితే, అధికారులకు అధిక పెత్తనం ఇవ్వటం, జవాబుదారీతనం లేకుండా చేయటం వల్ల మన దేశంలో సహకార వ్యవస్థ దెబ్బతింటున్నది. ఆర్బీఐ నిబంధనలు, సహకార చట్టాల మధ్య వైరుధ్యం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను కుంగదీస్తోంది. సహకార విలువలను తుంగలో తొక్కేలా కొన్ని నిబంధనలు ఉంటున్నాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, మల్టీస్టేట్ కోఆపరేటివ్ల విషయంలో రాష్ట్ర సహకార చట్టాలు నిర్దేశించే నిబంధనలకు భిన్నమైన నిబంధనలను బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిర్దేశిస్తోంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు షేర్ క్యాపిటల్ తిరిగి ఇవ్వొద్దని, డైరెక్టర్ల పదవీ కాలం నాలుగేళ్లేనని (సహకార చట్టాల ప్రకారం 5 ఏళ్లు).. ఇలా అనేక విషయాల్లో వైరుధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 45 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 20 బ్యాంకులు వందేళ్ల క్రితం నుంచి ఉన్నవే. ఇవి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక తోడ్పాటునూ పొందటం లేదు. పిఎసిఎస్లలో బ్యాంకింగ్ సేవలా?సహకారం పూర్తిగా రాష్ట్ర సబ్జెక్ట్. రాష్ట్రాలతో చర్చించకుండానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలు చేస్తోంది. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలతో ఇంకో 25 పనులు చేయించాలని కేంద్ర సహకార శాఖ నిర్దేశించింది. ఇందులో బ్యాంకింగ్ సేవలు కూడా ఉన్నాయి. నిధులు దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షించేదెవరూ అంటే సమాధానం లేదు. ఇది సరికాదు. అమలు చేయాల్సింది రాష్ట్రాలైనప్పుడు సహకార రిజిస్ట్రార్, ముఖ్య కార్యదర్శితో కనీసం చర్చించకుండానే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటే ఎలా? సహకార సంస్థల్లో అక్రమాలకు బాధ్యులను జవాబుదారీ చేయటం లేదు. ఎంత అవినీతి జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టులు, ఆస్తుల రికవరీ వంటి చర్యలు తీసుకోవటం లేదు. సహకార శాఖకు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ జవాబుదారీతనం లేకుండా΄ోయింది. – మానం ఆంజనేయులు పూర్వ అధ్యక్షులు, విశాఖ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, పూర్వ ఉపాధ్యక్షులు, నాఫ్కాబ్ కేంద్రం తెచ్చిన కొత్తచట్టాలతో చేటుభారతీయ ఆర్థిక రంగంలో సహకార వ్యవస్థ వాటా 43% వుంది. రైతులు, గ్రామీణ చేతివృత్తిదారులు, బలహీన వర్గాలు ఈ సహకార వ్యవస్థలో భాగస్వాములు. గత 75 సంవత్సరాలుగా 29 కోట్ల మంది సభ్యులు తమ ఖర్చులు తగ్గించుకొని రూ.40,689 కోట్ల మూలధనంతో సుమారు 9 లక్షల సహకార సంఘాలను స్థాపించుకున్నారు. రూ. లక్షల కోట్ల సహకార ఆర్థిక సౌధాన్ని నిర్మించారు. దీన్ని అక్రమంగా పెట్టుబడిదారుల పరం చేయటానికి పార్లమెంటులో రెండు చట్టాలు చేశారు. వీటిని అమలుచేస్తే జిల్లా స్థాయి సహకార బ్యాంకుల నుంచి ఇఫ్కో, క్రిభ్కో, నాఫెడ్ వంటి పెద్ద సంస్థలన్నీ కారుచౌకగా పెట్టుబడిదారుల పరం అవుతాయి. సహకార సిద్ధాంతాలకు, సహకార సూత్రాలకు ఇది విరుద్ధం. మొత్తంగా భారత రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని రాజ్యాంగ సవరణ చేయకుండానే ఈ చట్టాలు మార్చేస్తున్నాయి. ప్రజలు చైతన్యవంతులై వీటిని అడ్డుకోవాలి. సహకార ధర్మపీఠం తరఫున దేశవ్యాప్త ప్రచారోద్యం చేపట్టాం. – సంభారపు భూమయ్య , సీనియర్ సహకారవేత్త, సహకార ధర్మపీఠం, హైదరాబాద్సహకార సంస్థల బలోపేతానికి దోహదంఅంతర్జాతీయ సహకార మహాసభ న్యూఢిల్లీలో ఈ నెలాఖరులో జరుపుకోవటం సంతోషదాయకం. దేశంలో సహకార సంస్థలన్నీ బలోపేతం కావటానికి, ప్రభుత్వం మరింత దృష్టి కేంద్రీకరించడానికి అంతర్జాతీయ మహాసభ ఉపయోగపడుతుంది. సహకార సంఘాలు చాలా వరకు వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా వరకే పరిమితం అవుతున్నాయి. ప్రాసెసింగ్, విలువ జోడింపు, ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించటం, ఉత్పత్తుల బ్రాండింగ్ చేసుకోవాలి. ఆన్లైన్, సొంత అవుట్ లెట్ల ద్వారా విక్రయించాలి. రైతుల ప్రయోజనమే పరమావధిగా ముల్కనూర్ సొసైటీ 60 ఏళ్లుగా ఇటువంటి అనేక సేవలు అందిస్తోంది. గోదాములు నిర్మించటం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సహకార సంఘాలకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలిచ్చి ప్రోత్సహించాలి. శిక్షణపై దృష్టి కేంద్రీకరించాలి. సహకార సంఘాల సభ్యులు, సిబ్బంది, బోర్డు సభ్యులకు సహకార విలువలు, వాణిజ్య, నిర్వహణ నైపుణ్యాల పెంపుదల శిక్షణకు కృషి చెయ్యాలి.– అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, అధ్యక్షులు, ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సంఘం, తెలంగాణఒకే రంగానికి రెండు చట్టాలెందుకు?సహకార రంగం ఆర్థిక పురోగతి బాగానే వుంది. కానీ, నడక సరిగ్గా లేదు. సహకార మూల సూత్రాలకు సహకార వ్యవస్థ దూరమైంది. సహకార విద్య, సహకార విలువలకు సంబంధించిన కనీస జ్ఞానం కొరవడిన యంత్రాంగం ఆధ్వర్యంలో తెలుగునాట సహకార వ్యవస్థ నడుస్తోంది. సహకార హక్కులు, బాధ్యతలు తెలియని దుస్థితి. 12 నెలలు శిక్షణ పొందినవారే సహకార సంస్థల్లో సిబ్బందిగా వుండాలన్నది నియమం. చదవండి: ఫ్యామిలీ ఫార్మింగ్.. విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణఇప్పుడున్న సహకార సిబ్బందిలో 90 శాతం సరైన శిక్షణ లేనివారే. ఉద్యోగం చేస్తూ మూడు నెలలు, ఆరు నెలల డిప్లొమా అంటూ సర్టిఫికెట్లు పొందిన వారే ఎక్కువ కనిపిస్తున్నారు. వీరిని నడిపించే ఉన్నతోద్యోగుల పరిస్థితి కూడా ఇంతే! ఏ ఇతర రంగాల్లోనూ లేనివిధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 1964, 1995 సహకార చట్టాలు అమల్లో ఉన్నాయి. ఒకే రంగానికి రెండు చట్టాలేమిటి? 1904, 1912,1932, 1964 సహకార చట్టాలకు రూల్స్ ఉన్నాయి. కానీ, 1995 చట్టం అమల్లోకి వచ్చి 29 ఏళ్లయినా ఇప్పటికీ రూల్స్ లేవు. రిజిష్ట్రార్ బాధ్యతలపై కూడా స్పష్టమైన నిబంధనల్లేవు.– దాసరి కేశవులు, సీనియర్ సహకారవేత్త, చైర్మన్, సహకార భూమి జర్నల్ కోఆపరేటివ్ సొసైటీ, విజయవాడ -
అమూల్ డెయిరీకి అంతర్జాతీయ పురస్కారం
మూడు భారతీయ డెయిరీ సంస్థలకు అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ‘ఇన్నోవేషన్ ఇన్ సస్టయినబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ 2024’ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. పాడి పశువులకు సోకే జబ్బులకు చేసే చికిత్సల్లో అల్లోపతి యాంటీబయాటిక్ ఔషధాలకు బదులుగా హోమియోపతి ఔషధాలను వాడి చక్కని ఫలితాలు సాధించినందుకు గాను ‘యానిమల్ కేర్’ విభాగంలో అమూల్ డెయిరీకి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది.సుమారు 68 వేల పశువులకు సోకిన 26 రకాల సాధారణ వ్యాధులకు హోమియోపతి మందులతో చికిత్స చేయటం ద్వారా అమూల్ డెయిరీ సత్ఫలితాలు సాధించింది. ఇందుకోసం 2024 మే నాటికి 3.30 లక్షల (30 ఎం.ఎల్. సీసాలు) హోమియోపతి మందులను అమూల్ సొంతంగానే ఉత్పత్తి చేసి, 1.80 లక్షల సీసాలను పాడి సహకార సంఘాల రైతులకు పంపిణీ చేసింది. యాంటీబయాటిక్ ఔషధాల వాడకాన్ని తగ్గించటం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగవుతోంది. పాల ఉత్పత్తులు వినియోగించే ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతోందని ఐడిఎఫ్ తెలిపింది. సంప్రదాయ ఆయుర్వేద (ఈవీఎం) చికిత్సా పద్ధతులతో పాటు హోమియో పశువైద్య పద్ధతులను కూడా అమూల్ ప్రాచుర్యంలోకి తేవటం హర్షదాయకం.పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ పాడి, పశు పెంపకందారుల సహకార సంఘానికి ఆర్థిక, సామాజిక విభాగంలో పురస్కారం లభించింది. 4,500 మంది మహిళా రైతులు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అనేక పాల ఉత్పత్తులను, ఎ2 ఆవు నెయ్యిని తయారు చేస్తున్నారు. సేంద్రియ నాటు కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ పప్పుదినుసులను సైతం ఉత్పత్తి చేసి, ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తూ మహిళా రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.చదవండి: 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదుఐడిఎఫ్ పురస్కారం అందుకున్న మరో సంస్థ ‘ఆశా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ’. సౌర విద్యుత్తుతో నడిచే ఇన్స్టంట్ మిల్క్ చిల్లర్లను వినియోగించటం ద్వారా చిన్న, సన్నకారు పాడి రైతుల అభ్యున్నతికి వినూత్న రీతిలో దోహదపడటం ఈ ఎఫ్పిఓ ప్రత్యేకత. -
ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను హైస్కూలు నుంచి యూనవర్సిటీ స్థాయి వరకు విద్యార్థులకు అలవాటు చేయటం ఎంతో అవసరమనే విషయంతో ఇప్పుడు ఏకీభవించని వారు బహుశా ఎవరూ ఉండరు. రసాయనిక అవవేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తి ద్వారానే మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఈ బృహత్ కార్యక్రమాన్ని వ్యాప్తిలోకి తేవటానికి విద్యాసంస్థలతో కలసి పనిచేస్తూ స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పనులను అలవాటు చేయటంలో ప్రత్యక్ష కృషి చేస్తున్న వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఈ కోవలో మొదటి పేరు డాక్టర్ గంగాధరం. దాదాపు రెండు దశాబ్దాలుగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ ద్వారా విశేష కృషి చేస్తున్న ప్రకృతి సేద్య ప్రేమికుడు డాక్టర్ వర్డ్ గంగాధర్. ఇప్పటికే వేలాది మంది రైతులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఘనత వర్డ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తిరుపతికి చెందిన డాక్టర్ ఎం గంగాధర్కే దక్కుతుంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే పద్ధతులను ఆయన గత కొన్ని నెలలుగా నేర్పిస్తున్నారు. 20 అడుగుల వెడల్పు “ 20 అడుగుల ΄÷డవు విస్తీర్ణంలో చిన్న చిన్న ఎత్తుమడులు ఏర్పాటు చేసి విద్యార్థుల చేత 15 రకాల ఆకుకూరలు, 4 రకాల కూరగాయల సాగు చేయిస్తున్నారు. ఈ నమూనాకు కుటుంబ వ్యవసాయం (ఫ్యామిలీ ఫార్మింగ్) అని పేరు పెట్టారు. డాక్టర్ గంగాధరం యూనవర్సిటీలో కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చి ‘గ్రీన్ టీమ్’లను ఏర్పాటు చేశారు. డా. గంగాధరం మార్గదర్శకత్వంలో ఈ గ్రీన్ టీమ్ల ఈ కుటుంబ వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ టీం సభ్యులు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఇంటింటల కుటుంబ వ్యవసాయ నమూనా మడుల దగ్గరకు ఆహ్వానించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.ప్రకృతి సేద్య వ్యాప్తికి దోహదంఈ ఫ్యామిలీ ఫార్మింగ్ నమూనా ముఖ్య ఉద్దేశం గురించి వివరిస్తూ డా. గంగాధరం (98490 59573) ఇలా అన్నారు.. ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యకరమైన 15 రకాల కూరగాయలను ఏ విధంగా సాగు చేయవచ్చో నేర్పిస్తున్నాం. ఈ నమూనా ద్వారా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో నమూనాపై అవగాహన తెచ్చుకోగలుగుతారు. వివిధ ప్రాంతాలలో వారి సొంత పొలాల్లో కూడా కొంచెం విస్తీర్ణంలో అయినా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయటం ప్రాంరంభిస్తారు. ఆ విధంగా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రాంచుర్యానికి ఎంతో దోహదపడుతుంది. అట్లే తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశాభావం..’ అన్నారు. (గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!)తిరుపతి పట్టణంలోని ప్రజలు కూడా సాయంత్రం 4–5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనవచ్చని, తమ ఇంటి వద్ద తక్కువ స్థలంలో వివిధ రకాల కూరగాయలు సాగుచేసే పద్ధతులను తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో యువత విశ్వవిద్యాలయం నుంచి హైస్కూల్ వరకు ఈ నమూనా వ్యాప్తి చెంది రాష్ట్రమంతా యువత ప్రకృతి వ్యవసాయంపై పట్టు సాధించగలరని భావిస్తున్నానన్నారు. ఈ కృషి ఫలించాలని ఆశిద్దాం. డా. గంగాధరం -
గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!
కూరగాయల వ్యర్థాలను మురగ బెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది. భూసార వర్థినిగా, పురుగుల మందుగా ఉపయోగపడుతుంది. థాయ్లాండ్కు చెందిన డాక్టర్ రోసుకాన్ పూమ్ పాన్వాంగ్ ఈ ఎంజైమ్ను తొలుత తయారు చేశారు. కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు.. మార్కెట్లలో చెత్తకుప్పలో పోసిన మిగలపండిన పండ్లు, కూరగాయలు వంటివి ఎందుకూ పనికిరాని వ్యర్థాలే కదా అని అనుకోనక్కర్లేదు. వీటికి కొంచెం నల్లబెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ పంచదార కలిపితే 90 రోజుల్లో గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.గార్బేజ్ ఎంజైమ్ తయారీ ఇలా.. మూత బిగుతుగా పెట్టడానికి వీలుండే గాజు లేదా పలాస్టిక్/ఫైబర్ డ్రమ్ముల్లో దీన్ని తయారు చేయవచ్చు. కావాల్సిన పదార్థాలు : కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, ముక్కలు, కుళ్లినవి) 3 పాళ్లు + నల్ల బెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ (బ్రౌన్) పంచదార 1పాలు + నీరు 10 పాళ్ల చొప్పున కలపాలి.మార్కెట్లు, దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి వాడుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. అయితే, జారుగా ఉండే గ్రేవీ కలపకూడదు. మాంసం, మందంగా ఉండే పనస పండ్ల తొక్కలు కలపకూడదు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి గాలి చొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగలకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. మొదటి 30 రోజుల పాటు.. రోజుకోసారి మూత తీసి వాయువులు బయటకు వెళ్లాక, మళ్లీ గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడకట్టి, నిల్వ చేసుకొని అక్కడి నుంచి 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చే వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు లేదా మళ్లీ గేర్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడుకోవచ్చు. (ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ)పలు ప్రయోజనాలుగార్బేజ్ ఎంజైమ్ లో ఉన్న సూక్ష్మజీవరాశి, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ భూసార వర్థినిగా, కీటకనాశనిగా పనిచేస్తుంది. తెగుళ్లు బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. దీన్ని వాడితే పంట మొక్కల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. గార్బేజ్ ఎంజైమ్ను నీటిలో తగినపాళ్లలో కలిపి వాడుకోవాలి. ఎరువుగా.. 1:1000 పాళ్లలో(అంటే.. 1 మిల్లీలీటరు ఎంజైమ్కు 100 మిల్లీలీటర్ల నీరు) కలిపి నేలలో పోయవచ్చు లేదా పిచికారీ చేయవచ్చు. పురుగులు/ తెగుళ్ల నాశినిగా.. 1:100 మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. దిగుబడి పెంపుదలకు.. 1:500 పాళ్లలో కలిపి పిచికారీ చేయాలి. -
బీఎస్ఎఫ్ పురుగులతో చవకగా చేపల మేత!
బ్లాక్ సోల్జర్ ఫ్రై (బిఎస్ఎఫ్) పురుగులను ప్రత్యామ్నాయ ప్రొటీన్ వనరుగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఎండబెట్టిన బిఎస్ఎఫ్ పురుగుల పిండితో బలపాల(పెల్లెట్ల) రూపంలో చేపల మేతను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను ముడిసరుకుగా వాడి పర్యావరణ హితమైన పద్ధతుల్లో బిఎస్ఎఫ్ పురుగులను ఉత్పత్తి చేసి, వాటితో వాణిజ్య స్థాయిలో నాణ్యమైన చేపల మేతను ఉత్పత్తి చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐసిఎఆర్ సంస్థ సెంట్రల్ మెరైన్ ఫిష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎంఆర్ఎఫ్ఐ) ఇటీవల అభివృద్ధి చేసింది. ఫీడ్ కన్వర్షన్ రేషియో చాలా మెరుగ్గా ఉండటమే కాకుండా చేపల మేత ఖర్చు తగ్గటం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని సిఎంఆర్ఎఫ్ఐ తెలిపింది. ఇప్పటివరకు సోయాచిక్కుళ్ల పిండి, ఎండుచేపల పిండిని ప్రొటీన్ వనరుగా చేపల మేతల్లో వాడుతున్నారు. (Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు)ఇక మీదట బిఎస్ఎఫ్ పురుగుల పిండిని నిక్షేపంగా వాడొచ్చని వెల్లడైంది. అయితే, ఈ మేత ఏయే రకాల చేపల పెంపకంలో ఎలా ఉపయోగపడుతోంది? అన్నది పరీక్షించాల్సి ఉంది. ఈ పరిశోధనను కొనసాగించేందుకు సిఎంఎఫ్ఆర్ఐ అమల ఎకోక్లీన్ అనే కేరళకు చెందిన స్టార్టప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదీ చదవండి: డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో -
Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు
పశువైద్యంలో సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నోవెటర్నరీ ప్రాక్టీసెస్ –ఈవీపీల) ద్వారా యాంటీబయాటిక్స్ వాడకాన్ని 90% తగ్గించవచ్చంటున్నారు తమిళనాడుకు చెందిన విశ్రాంత పశువైద్య ఆచార్యుడు డా. ఎన్. పుణ్యస్వామి. గత 20 ఏళ్లుగా సంప్రదాయ పశువైద్యంపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఈ చికిత్సలు పొదుగువాపు సహా 42 పశువ్యాధులను 3–5 రోజుల్లో 90% ఖచ్చితత్వంతో తగ్గిస్తున్నాయని రుజువైంది. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి) దేశవ్యాప్తంగా వీటిని పశువైద్యంలో భాగం చేసింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.) సమస్యను అధిగమించాలన్నా, యాంటిబయాటిక్స్ను రక్షించుకోవాలన్నా సంప్రదాయ పశువైద్యమే మేలైన మార్గమని పుణ్యస్వామి స్పష్టం చేస్తున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘గోసంజీవని’ ఆంగ్ల పుస్తకావిష్కరణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పుణ్యస్వామితో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ముఖ్యాంశాలు. అల్లోపతి పశువైద్య శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన మీ దృష్టి సంప్రదాయ ఆయుర్వేద పశు వైద్య (ఈవీపీ) పద్ధతుల వైపు ఎలా మళ్లింది?పశువైద్యానికి సంబంధించి ఇప్పుడున్న వ్యవస్థ అరకొరగా ఉందని నా అభిప్రాయం. ప్రతి పశువుకు ఆరోగ్య సేవలు అందాలి. వనరులు రైతులకు తక్కువ ఖర్చుతో పరిసరాల్లోనే అందుబాటులో ఉండాలి. చికిత్సకు పొందబోయే ఫలితంపై ఖచ్చితమైన అంచనా ఉండాలి. అల్లోపతి పశువైద్య వ్యవస్థలో ఇవి లోపించాయి. ఎంత ఖచ్చితంగా ఫలితం వస్తుందో చెప్పలేం. అందువల్లే ఆయుర్వేదం, సంప్రదాయ సిద్ధ వైద్య రీతులను 2001 నుంచి అధ్యయనం చేశా. 20 ఏళ్ల నుంచి ఈవీపీ పద్ధతులపై పనిచేస్తున్నాం. 42 పశువ్యాధులకు చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేశాం. మేం సూచించిన ఇంట్లోని దినుసులతో రైతులే స్వయంగా ఈ మందులను తయారు చేసుకొని పశువైద్యం చేసుకుంటున్నారు. స్వల్ప ఖర్చుతోనే 3–5 రోజుల్లోనే 80–90% పశువ్యాధులు ఖచ్చితంగా తగ్గిపోతున్నాయి. ఇది శాస్త్రీయంగా నిర్థారణ అయిన సంప్రదాయ చికిత్స పద్ధతి. అందువల్లే ఈ సంప్రదాయ చికిత్సను జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) అంగీకరించింది. 2016లో నన్ను సంప్రదించింది. అప్పటి నుంచి 12 రాష్ట్రాల్లో మిల్క్ యూనియన్లతో కలసి పనిచేస్తున్నాం. పశువైద్యులకు, పాడి రైతులకు శిక్షణ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఈవీపి పద్ధతుల్లో పశువైద్యం జరుగుతోంది. పొదుగు వాపు నమ్మకంగా తగ్గిపోతుందా?తప్పకుండా తగ్గి΄ోతుంది. ఎన్.డి.డి.బి. పరిధిలో వేలాది రైతుల అనుభవాలే ఇందుకు నిదర్శనం. పొదుగు వాపు నుంచి గాంగ్రీన్ వరకు 10 రకాల పొదుగు సంబంధిత జబ్బులు వస్తుంటాయి. గాంగ్రీన్ మినహా మిగతా 9 రకాల పశువ్యాధులను 3–5 రోజుల్లోనే ఈవీపీ వైద్యం ద్వారా సమర్థవంతంగా 85–90% కేసుల్లో శాశ్వతంగా తగ్గించవచ్చని నిరూపితమైంది. నేషనల్ లైవ్స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో సిక్కింలో డాక్టర్లకు శిక్షణ ఇచ్చాం. బీహార్లో పశు సఖిలకు శిక్షణ ఇచ్చాం. భారత ప్రభుత్వం కూడా ఎత్నో వెటరినరీ జ్ఞానాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం ప్రారంభించింది. పశువైద్యంలో డిగ్రీ కోర్సు (బీవీఎస్సీ) సిలబస్లోకి ప్రభుత్వం చేర్చింది.అంతర్జాతీయంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఎఎంఆర్) సమస్యను పరిష్కరించేందుకు ఈవీపీ చికిత్సలు ఉపయోగ పడతాయా?ప్రపంచవ్యాప్తంగా అందరూ యాంటీబయాటిక్ ఔషధాలను పశువైద్యంలో తగ్గించా లంటున్నారు. అయితే, వీటికి ప్రత్యామ్నాయ మందుల్ని సూచించలేక΄ోతున్నారు. ఇండియాకున్న బలమైన సంప్రదాయ విజ్ఞానం పెద్ద ఆస్థి. ఈవీపీ పద్ధతుల ఉగాండా, ఇథియోపియాలో రైతులకు శిక్షణ ఇచ్చాం. అమలు చేయటం సులభం కాబట్టి ఆయా దేశాల్లో రైతులు సత్ఫలితాలు సాధించారు. నెదర్లాండ్స్ దేశంతో, వాగనింగన్ విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తున్నాం. అక్కడి పశువైద్యులకు శిక్షణ ఇచ్చాం. ఆహార వ్యవసాయ సంస్థ (యు.ఎన్. ఎఫ్.ఎ.ఓ.) గుర్తించిందా? ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్.ఎ.ఓ. కేంద్ర పశుసంవర్థక శాఖతో కలసి ఇటీవలే ‘స్టాండర్డ్ వెటరినరీ ట్రీట్మెంట్ గైడ్లైన్స్’ను విడుదల చేసింది. ఇందులో కూడా ఈవీపీ సంప్రదాయ చికిత్సా పద్ధతులను చేర్చింది. అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతి ఆధిపత్యం గురించో, మరో పద్ధతి ఆధిపత్యం నిరూపణ గురించో మనం మాట్లాడటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. ఇప్పటికే అమల్లో ఉన్న అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి. నేనూ అల్లోపతి పశువైద్య శాస్త్రం చదువుకున్న వాడినే. రోగ నిర్థారణకు అల్లోపతి జ్ఞానాన్ని, చికిత్సకు సంప్రదాయ పద్ధతిని వాడుతూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం.యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుందా? పొదుగు వాపు వ్యాధి చికిత్సలో కూడా 90% కేసులలో యాంటీబయాటిక్ మందులను వాడాల్సిన అవసరం లేదు. దూరంలో ఉన్న వైద్యులు టెలిమెడిసిన్ వ్యవస్థ ద్వారా పశువులకు సత్వర చికిత్సను అందించడానికి ఈవిఎం చికిత్సా పద్ధతులు ఎంతో అనువైనవి. ఇతర వైద్య పద్ధతుల్లో ఇది వీలు కాదు. రైతులు నేర్చుకొని, అవసరం వచ్చినప్పుడు తమంతట తాము ఆచరించదగిన గొప్ప పద్ధతి ఎత్నోవెటరినరీ మెడిసిన్. పశువులకు గాలికుంటు వ్యాధి (ఎఫ్.ఎం.డి.) వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఫోన్ ద్వారా రైతులకు సూచనలు ఇచ్చి చికిత్స చేయవచ్చు. 35–40 ఏళ్లలో ఏ ఒక్క కొత్త యాంటీ బయాటిక్ను తయారు చేసుకోలేకపోయాం. అదే సమయంలో మనుషుల చికిత్సకు వాడాల్సిన అనేక యాంటీ బయాటిక్స్ను పశు వైద్యంలో విస్తృతంగా వాడటంతో ఆ యాంటీబయాటిక్స్ రోగకారక క్రిముల నిరోధకత (మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్)ను పెంపొందించు కున్నాయి. దీంతో ఆ యాంటీబయాటిక్స్ పనిచేయక మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. యాంటీబయాటిక్ ఔషధాలను మనం రక్షించుకోవాలి. యాంటీబయాటిక్ ఔషధాల జోలికి పోకుండానే పశువుల్లో జ్వరం, విరేచనాలు వంటి సాధారణ జబ్బులకు వైద్యం చేయటానికి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను ఆచరించాలి.దేశీ ఆవులు, సంకరజాతి ఆవులు, బర్రెలు అన్నిటికీ ఈ వైద్యం పనిచేస్తుందా?ఏ జాతి పశువులకైనా తప్పకుండా పనిచేస్తుంది. సంకరజాతి ఆవుల్లో మాదిరిగా అధిక పాలు ఇచ్చే సాహివాల్ ఆవుల్లోనూ పొదుగు సంబంధిత సమస్యలు ఎక్కువే. వీటన్నిటికీ ఈవీపీలో నమ్మదగిన పరిష్కారం ఉంది. కృష్ణా మిల్క్ యూనియన్లో పొడి రైతులు ఈవీపీల చికిత్స ద్వారా పొదుగువాపు తదితర జబ్బులతో పాటు వంధ్వత్వం వంటి సమస్యలను సైతం అధిగమించారు.కోళ్ల వ్యాధులకు కూడా..?కోళ్ల ఫారాల్లో కూడా ఈవీపీ చికిత్సలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేల ఉసిరి (భూమి ఆమ్ల), జిలకర్ర కలిపి నూరి, ఉండలు చేసి.. గంట గంటకు కొక్కెర సోకిన కోళ్లకు తినిపిస్తే 1–2 రోజుల్లోనే తగ్గిపోతుంది. ఇలా ఏ జాతి పశువులైనా, కోళ్లయినా, బాతులైనా.. వాటికి ఇతర ఔషధాల మాదిరిగానే ఈవిఎం మందులను కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు.అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. సేంద్రియ పాల ఉత్పత్తికి ఈవీపీలు దోహదం చేస్తాయా?నిస్సందేహంగా. అంతర్జాతీయంగా ఇటీవల ‘మెడిసినల్ అగ్రోఎకాలజీ’ భావన బలం పుంజుకుంటున్నది. పంటలనే కాదు పశువులను కూడా రసాయనాల్లేకుండా పెంచటమే ఇందులో ముఖ్యాంశం. (నవంబర్ 18 నుంచి ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్’ సందర్భంగా..)నిర్వహణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాలి
సాక్షి, హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితులు, రైతుల ఆకాంక్షల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లకు పాత కాలపు ఆలోచనలతో కూడిన పరిష్కారాలు సరిపడవని, క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) మినీ ఆడిటోరియంలో మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.చిరుధాన్యాలపై అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘క్లైమెట్ ఛేంజ్, మిల్లెట్స్, ఎకోసిస్టమ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టికి రామాంజనేయులు సమన్వయకర్తగా వ్యవహరించారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 30 ఏళ్ల నాడు పాలకులు ఏర్పాటు చేసిన మద్దతు వ్యవస్థలు ఇప్పటి సవాళ్లను ఎదుర్కోవటానికి పనికిరావని, కొత్త తరహా మద్దతు వ్యవస్థలను అమల్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని డా. రామాంజనేయులు సూచించారు. రైతుబంధు వంటి పథకాలను కొత్త సవాళ్ల వెలుగులో సమీక్షించుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలిపర్యావరణ సేవలకు చెల్లింపులు అవసరం అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్ మంజుల మేనన్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి మిశ్రమ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఎరువులకు సంబంధించి ఎటువంటి సబ్సిడీలు పొందటం లేదు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం ఒనగూడుతున్నది. ఈ పర్యావరణ సేవలకు గుర్తింపుగా ఈ రైతులకు ప్రత్యేక చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందని మంజుల సూచించారు.ఇది కొత్త భావన కాదని, ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉన్నదేనన్నారు. డీడీఎస్ మాదిరి రసాయన రహిత జీవవైవిధ్య సాగు వల్ల భూసారాన్ని పెంపొందించటం, సాగు నీరు ఆదా అవుతుంది, పోషక విలువలతో కూడిన ఆహారం ప్రజలకు అందుతుంది కాబట్టి ఈ రైతులకు ప్రత్యేక మద్దతు వ్యవస్థను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో 6% అదనపు నిధులతోనే ఈ మద్దతు వ్యవస్థను అందుబాలోకి తేవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని మంజుల అన్నారు. రైతులు ఎందుకు నష్టపోవాలి?సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ కెవి కూర్మనాధ్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల రైతులకు ఎదురవుతున్న సరికొత్త సమస్యలను పాలకులు గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. కుండపోత వర్షాలు, అకాల వర్షాల వల్ల పత్తి, ధాన్యంలో అధిక మోతాదులో తేమ ఉంటే అందుకు రైతులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నిబంధనలు సడలించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తెరగటం లేదన్నారు.చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలిరైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత మద్దతు ధర, సేకరణ సదుపాయాల్లేక రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు మరింత దిగజారిందన్నారు. అధిక బ్యాంకు రుణాలు పొందటం కోసం చిరుధాన్యాలు సాగు చేసే రైతులు కూడా తాము పత్తి, వరి వంటి పంటలు సాగు చేస్తున్నామని అధికారులతో చెబుతున్నారని, అందుకే చిరుధాన్యాల వాస్తవ సాగు విస్తీర్ణం కూడా గణాంకాల్లో ప్రతిఫలించటం లేదన్నారు. అత్యంత కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ పరిశ్రమలు మరో 30 రాష్ట్రంలో రానున్నాయని, వీటికి ముడిసరుకు అందించటం కోసమే ప్రభుత్వం వరి సాగును ప్రత్యేక బోనస్ ప్రకటించి మరీ ప్రోత్సహిస్తున్నదన్నారు. మూడు చిరుధాన్య పంటలకు మద్దతు ధర ప్రకటించినా, జొన్నలను మాత్రమే కోర్టు ఆదేశించినప్పుడే ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేదుకు ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని రవి కోరారు. -
డ్రాగన్ తోట : ఉపాయం ఉండాలేగానీ, నెలకు రూ.లక్ష ఈజీగా
ఉపాయం ఉండాలే గాని ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా మరో వృత్తిని చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చనటానికి కేరళకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయిని కృషే నిదర్శనం. కొల్లం పట్టణానికి చెందిన రెమాభాయ్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సాయిల్ లెస్ పద్ధతిలో తమ ఇంటిపైనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం ప్రారంభించారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో హైడ్రోపోనిక్ పద్ధతిలో డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నారు. నెలకు 500 కిలోల డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి వస్తోంది. కిలో రూ. 200కు విక్రయిస్తూ నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి 3 నెలలే డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ఉంటుంది. రిటైరైన కొద్ది రోజులకే ఆమె తల్లి వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆ వేదనలో నుంచి బయటపడటం కోసం ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలనుకున్నారు. విదేశీ పండైన డ్రాగన్ సాగును ఇంటిపైనే ప్రారంభించారామె. నేలపైన పెంచడానికి ఇంటి దగ్గర ఖాళీ స్థలం లేదు. అందుకే మేడపై రెండొందల లీటర్ల బ్యారళ్లు 50 పెట్టి, వాటిల్లో వంద డ్రాగన్ మొక్కల్ని పెంచుతున్నారు. మట్టి మోసుకెళ్లి ఇంటిపైన పెట్టటం నాకు కష్టం అనిపించి సాయిల్ లెస్ పద్ధతిని ఎంచుకున్నానని రమాభాయ్ అంటున్నారు. కొన్ని రెడ్, కొన్ని ఎల్లో రకం డ్రాగన్ రకాలను నాటారు. ఎక్కువైన నీరు బయటకు పోవటానికి బ్యారెల్కు అడుగున బెజ్జం పెట్టి.. అందులో ఆకులు, రంపపు పొడి, వరి గడ్డి ముక్కలు, బ్యారెల్కు 3 కిలోల చొప్పున కం΄ోస్టు ఎరువును దొంతర్లుగా వేశారు. వంద గ్రాముల బోన్ మీల్ కూడా కలిపి, మొక్కలు నాటారు. ఎండాకులు, కూరగాయ వ్యర్థాలు, చేపలు, రొయ్యల వ్యర్థాలు, ఆల్చిప్పలతో సొంతంగా తయారు చేసుకునే ద్రవరూప ఎరువులను మొక్కలకు ఆమె అప్పుడప్పుడూ ఇస్తున్నారు. దీంతో మొక్కలు పోషకలోపాల్లేకుండా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తున్నాయని రమాభాయ్ సంతృప్తిని వ్యక్తం చేశారు.‘ఏదైనా కంటెయినర్లో కిలో చేపలు, రొయ్యలు, పీతల డొప్పలకు కిలో బెల్లంతో పాటు బొప్పాయి పండ్ల తొక్కలు కలపాలి. ఎండ తగలకుండా నీడన ఉంచి అప్పుడప్పుడూ కలియదిప్పుతూ ఉంటే.. 90 రోజులకు సేంద్రియ ద్రావణం సిద్ధమవుతుంది. ఇది కాల్షియం, ఫాస్ఫరస్ను పుష్కలంగా అందిస్తుంది. ఆ బలంతో డ్రాగన్ మొక్కలు చక్కగా కాస్తున్నాయి’ అన్నారు రమాభాయ్. జెసిస్ వరల్డ్ పేరిట యూట్యూబ్ ఛానల్ను కూడా ఆమె ప్రారంభించారు. సీజన్లో మా ఇంటిపైన 200–300 డ్రాగన్ పూలు కనువిందు చేస్తుంటే నా వయసు 60 నుంచి 20కి తగ్గిపోతుంది. బాధలన్నీ మర్చిపోతున్నా అంటున్నారామె సంతోషంగా! -
హెల్దీ సంచోక్స్ : లాభాలు అన్నీ ఇన్నీ కావు!
సంచోక్స్.. ఎన్నో ఔషధ గుణాలున్న దుంప పంట. దీనికి మరో పేరు జెరూసలెం ఆర్టిచోక్ (హెలియాంతస్ ట్యూబరోసస్) అని దీనికి మరో పేరుంది. ఆస్టెరాసియా కుటుంబం. ఇది ఒకసారి నాటితే చాలా ఏళ్లపాటు పెరుగుతుంది. కానీ, పసుపు మాదిరిగా వార్షిక పంట మాదిరిగా కూడా పెంచుతుంటారు. ఉత్తర అమెరికా దీని పుట్టిల్లు. జెరూసలెం ఆర్టిచోక్ అనే పేరు ఉన్నప్పటికీ ఇది జెరూసలెంలో పుట్టిన పంట కాదు. ఆర్టిచోక్ అని ఉన్నప్పటికీ ఇది నిజమైన ఆర్టిచోక్ కాదు. వాడుకలో అలా పేర్లు వచ్చాయంతే. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది బతికేస్తుంది. పోషక విలువలు, చీడపీడలను బాగా తట్టుకునే స్వభావం ఉండటం వంటి గుణగణాల వల్ల మెడిటరేనియన్, ఆ పరిసర ప్రాంతాల్లో దీన్ని సాగు చేయటం ప్రారంభమైంది. ఇప్పుడు అమెరికా, కెనడా, బల్గేరియా, రష్యా సహా అనేక ఐరోపాదేశాల్లో ఇది సాగవుతోంది. మన దేశంలోనూ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్తోపాటు ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా సాగవుతున్నదని చెబుతున్నారు. సంచోక్స్ దుంపలు రకరకాల రంగులు..సంచోక్స్ మొక్క చూడటానికి పొద్దు తిరుగుడు మొక్క మాదిరిగా ఉంటుంది. 5–8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని దుంప బంగాళదుంప మాదిరిగా తినటానికి అనువుగా కండగలిగి ఉంటుంది. సంచోక్స్ దుంపలు తెలుపు నుంచి పసుపు వరకు, ఎరుపు నుంచి నీలం వరకు అనేక రంగుల్లో ఉంటాయి. దుంప బరువు 80–120 గ్రాముల బరువు, 75 సెం.మీ. పొడవు ఉంటుంది. పూలు చిన్నగా పసుపు రంగులో ఉంటాయి. ఆకులపై నూగు ఉంటుంది. సంచోక్స్ మొక్క వేగంగా పెరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే శక్తి దీనికి ఉంది. మంచును కూడా తట్టుకుంటుంది. ఎరువులు కొంచెం వేసినా చాలు, వేయకపోయినా పండుతుంది. కరువును తట్టుకుంటుంది. చౌడు నేలల్లోనూ పెరుగుతుంది. 4.4 నుంచి 8.6 పిహెచ్ను తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత తక్కువున్నా ఎక్కువున్నా బతికి దిగుబడినిస్తుంది. ఇసుక దువ్వ నేలలు, సారంవతం కాని భూముల్లోనూ పెరుగుతుంది. 18–26 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత దీనికి నప్పుతుంది. ఫిబ్రవరి – మార్చి లేదా సెప్టెంబర్ – అక్టోబర్లలో విత్తుకోవచ్చు. మొక్క వడపడిపోయిన తర్వాత విత్తిన 5 నెలలకు దుంపలు తవ్వుకోవచ్చు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు హెక్టారుకు 15 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. దుంపలపై పొర పల్చగా ఉంటుంది. కాబట్టి, జాగ్రత్తగా తవ్వితీయాలి. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు, మొక్క అంతటినీ, ముఖ్యంగా ఆకులను ఔషధాల తయారీలో వినియోగించటం అనాదిగా ఉందనటానికి ఆధారాలున్నాయి. వాపు, నొప్పి, ఎముకలు కట్టుకోవటానికి, చర్మ గాయాలకు మందుగా ఇది పనిచేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహాన్ని, ఊబకాయాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. మలబద్ధకాన్ని పోగొట్టటం, జీవక్రియను పెంపొందించటం, కేన్సర్ నిరోధకంగా పనిచేయటం వంటి అనేక అద్భుత ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలోనూ ఉపకరిస్తుంది. అండర్సన్, గ్రీవ్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తల చెప్పిందేమంటే.. జెరూసలెం ఆర్టిచోక్ డి–లాక్టిక్ యాసిడ్ రూపంలో లాక్టిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుందని నిర్థారణైంది. అంటే, పారిశ్రామిక ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగించుకోవడానికి ఎంతో అవకాశం ఉందన్నమాట. రోటనారోధక వ్యవస్థ లోపాలు, దీర్ఘకాలిక నిస్తత్తువ, గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధులు, రొమ్ము కేన్సర్, మలబద్ధకం, పేను తదితర వ్యాధులు, రుగ్మతల నివారిణిగా పనిచేస్తుందని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని ప్రేరేపించటం, దేహం లో నుంచి కలుషితాలను బయటకు పంపటంలో దోహదకారిగా ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దుంపల ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలను చెరకు, మొక్కజొన్న మాదిరిగా జీవ ఇంధనాల తయారీలోనూ వాడుకోవచ్చట. హెక్టారు పొలంలో పండే దుంపలతో 1500–11,000 లీటర్ల ఇథనాల్ తయారు చేయొచ్చు. భార లోహాలను సంగ్రహిస్తుంది..జెరూసలెం ఆర్టిచోక్ మొక్క భార లోహాలను సంగ్రహించే స్వభావం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిలో నుంచి, నేలలో నుంచి భార లోహాలను సంగ్రహించడానికి ఈ మొక్కలను ఉపయోగించ వచ్చని చెబుతున్నారు. అల్బిక్ రకం జెరూసలెం ఆర్టిచోక్ మొక్కల్లో ఈ గుణం ఎక్కువగా ఉందట. దీని మొక్కల చొప్ప పశువులకు మొక్కజొన్న చొప్ప సైలేజీకి బదులు వాడొచ్చు. భూసారం తక్కువగా ఉన్న నేలల్లో ఆచ్ఛాదనగా పచ్చిరొట్ట పెంచటానికి, జీవ ఇంధనాల తయారీకి పచ్చిరొట్ట విస్తారంగా పెంచాలనుకుంటే కూడా జెరూసలెం ఆర్టిచోక్ దుంప పంట ఎంతో ఉపయోగ పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. షుగర్ రోగులకు ఉపయోగకరంటైప్ 2 షుగర్, ఊబకాయంతో బాధపడే వారిలో ఇన్సులిన్ను విడుదలకు దోహదపడే ఇనులిన్ను ఈ దుంప కలిగి ఉంది. ఫ్రక్టోజ్, ఓలిగోఫ్రక్టోస్ తదితర సుగర్స్ను నియంత్రించే గుణం జెరూసలెం ఆర్టిచోక్కు ఉంది. సాధారణంగా ఇనులిన్ను చికొరీ,జెరూసలెం ఆర్టిచోక్ నుంచి పారిశ్రామిక పద్ధతుల్లో వెలికితీస్తుంటారు. ఈ దుంపను సన్నగా తరిగి, వేడి నీటిలో మరిగించి ఇనులిన్ను వెలికితీసిన తర్వాత శుద్ధి చేస్తారు. ఈ ద్రవం నుంచి ఇనులిన్ పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అనేక ఆహారోత్పత్తులో వాడతారు. ఇటీవల కాలంలో ఈ పొడి, కాప్సూల్స్ రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ దుంపల్లో ఉండే ఫ్రక్టోజును ఔషధాలు, ఫంక్షనల్ ఫుడ్స్లో స్వీట్నర్గా వాడుతున్నారు. ఫ్రక్టోజ్ గ్లైసెమిక్ ఇండెక్స్ (23) గ్లూకోజ్ (100) లేదా సుక్రోజ్ (65) కన్నా తక్కువ కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు ఆరోగ్యదాయకమైన ఆహారంగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి, మున్ముందు బాగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంది. -
మట్టి + ఆముదం + కుంకుడు ద్రావణం: పంటలు పచ్చగా, నిండుగా!
పొలంలోని మట్టినే సేంద్రియ ఎరువుగా, పురుగులనునియంత్రించే ద్రావణం వాడి సత్ఫలితాలు పొందటం ద్వారా ఆరోగ్య దాయకమైన ద్రాక్ష, వరి తదితర పంటలు పండించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి (సివిఆర్) మరో ద్రావణాన్ని రూ పొందించారు. మట్టి+ఆముదంతో పాటు కుంకుడు రసం కలిపి చల్లితే పంటలకు చీడపీడల నియంత్రణతోపాటు పెరుగుదల బాగుందని గుర్తించారు. ఈ ద్రావణాన్ని తయారు చేసి మొదట తన పెరట్లోని టొమాటో, మొక్కజొన్న పంటలపై ఆయన ప్రయోగించి చూశారు. కేవలం వారం నుండి 10 రోజుల్లోనే పంటలో విపరీతమైన మార్పును గమనించారు. అంతకు ముందు మొక్కజొన్న ఆకులను పురుగులు తినటం, పంట పసుపు పచ్చగా ఉన్నపుడు ఈ ద్రావణం పిచికారీ చేశారు. కేవలం వారం నుంచి పది రోజుల్లోనే ఆ పంట పచ్చదనంతో కళకళలాడుతూ, ఆకులు కూడా వెడల్పుగా రావటం అంటే పంటలో మంచి ఎదుగుదలను గమనించారు. మరి కొందరు రైతులు కూడా సత్ఫలితాలు సాధించటంతో ఈ ద్రావణం సామర్థ్యంపై సివిఆర్ నిర్థారణకు వచ్చారు.మట్టి, ఆముదం, కుంకుడు ద్రావణం తయారీ విధానంలోపలి మట్టి (బాగా జిగటగా ఉండే మట్టి) 10 కిలోలు (ఒక తట్టెడు) తీసుకొని, గడ్డలు చిదిపి మెత్తని మట్టిని సిద్ధం చేసుకోవాలి. ఆ మట్టిలో 250 మి.లీ. నుంచి 500 మి.లీ. వరకు ఆముదం కలపాలి. 250 నుండి 500 గ్రా. కుంకుడు కాయలు తీసుకొని కొంచెం నీటిలో వాటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని చేతితో పిసికి, విత్తనాలు తీసివేసి, పేస్టులాగా తయారు చెయ్యాలి. అలా తయారైన పేస్టును అంతకు ముందు రోజు ఆముదం కలిపి పక్కన పెట్టిన మట్టిలో వేసి, బాగా కలియ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటి డ్రమ్ములో వేసి కర్రతో బాగా కలపాలి. మట్టి మిశ్రమం అంతా నీటిలో బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపటికి నీటిలోని మట్టి రేణువులు నీటి అడుగుకు పేరుకుంటాయి. పైకి తేరుకున్న ద్రావణాన్ని వడకట్టి స్ప్రేయర్లలో పోసుకొని పంటపై పిచికారీ చెయ్యాలి. రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మట్టి ద్రావణం నీటిలో కలిపిన తర్వాత 4 గంటల్లోగా వంటపై పిచికారీ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ఆలన్యం అయితే ఆముదం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. కుంకుడుతో పచ్చదనం వస్తోంది!పైకి పురుగు కనిపిస్తూ ఉంటే గతంలో చెప్పినట్లు మట్టి 20 కిలోలు, ఆముదం పావు కిలో నుంచి అర కిలో వరకు కలిపిన ద్రావణం చల్లితే పురుగుల నియంత్రణ బాగుంటుంది. అయితే, పెరుగుదల ఉండేది కాదు. మొలకల ద్రావణం చల్లాల్సి వచ్చేది. ఇప్పుడు కుంకుడు రసం కలపటం వల్ల ఆ కొరత తీరి పచ్చదనం వస్తోంది. తెగుళ్లు నివారిస్తుంది. పురుగులను గుడ్లు పెట్టనివ్వదు. అనేక పంటల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇది చల్లిన వారం, పది రోజుల్లోనే పంటలు ఆకుపచ్చని రంగులోకి మారి, గ్రోత్ వేగాన్ని అందుకుంటున్నది. మల్బరీ తప్ప ఏ పంటలోనైనా చల్లొచ్చు. పత్తి రైతులు కాయ పగలటానికి ముందు దశలోనే ఈ ద్రావణం వాడాలి. టొమాటోలో ఏ తెగుళ్లు, పురుగులూ రాలేదు. మిర్చిలో తామర పురుగు నియంత్రణకు మట్టి, ఆముదం, కుంకుళ్లతో పాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా కలిపి తయారు చేసిన ద్రావణం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ద్రావణాన్ని వర్షాలు బాగా పడే రోజుల్లో వారానికోసారి చల్లాలి. ఇప్పటి నుంచి పది రోజులకోసారి చల్లితే సరిపోతుంది. ఇది చల్లిన 2 గంటల వరకు వర్షం పడకపోతే చాలు, పనిచేస్తుంది. – చింతల వెంకటరెడ్డి (98668 83336), పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆల్వాల్, సికింద్రాబాద్చాలా పంటలపై చల్లా.. రిజల్టు బాగుంది!మట్టి, ఆముదం, కుంకుడు రసం ద్రావణం వాడిన వారం రోజుల్లోనే చీడపీడల నియంత్రణతో పాటు పంటల్లో పెరుగుదల బాగా కనిపించింది. 10 కిలోల లోపలి మట్టికి 250 ఎంఎల్ ఆముదం కలిపి పెట్టుకోవాలి. కుంకుడు కాయలను గింజలతో ΄ాటు నలగ్గొట్టి, ఉడక బెట్టాలి. నానబెట్టిన దానికన్నా, కుంకుడు విత్తనాలు కూడా పగులగొట్టి ఉడకబెడితే మరింత ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించింది. ఆ తెల్లారి కుంకుళ్లను పిసికి రసం తీసుకోవాలి. ఆముదం కలిపిన మట్టిలో ఈ కుంకుడు రసం కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. పసుపు, మామిడి, నిమ్మ, అవకాడో, అరటి తదితర పంటలన్నిటిపైనా ఈ ద్రావణాన్ని పిచికారీ చేశాను. వారంలోనే గ్రోత్ చాలా కనిపించింది. నూనెలు చల్లితే గ్రోత్ వస్తుంది. ఇక్కడ ఆముదం వాడుతున్నందున గ్రోత్తోపాటు చీడపీడల నియంత్రణ కూడా జరుగుతుంది. మట్టి ద్వారా మినరల్స్ కూడా పంటకు అందుతున్నాయి. 12–15 రోజులకోసారి అన్ని పంటలపైనే పిచికారీ చేస్తున్నా. ఈ రెండు పిచికారీల మధ్య ఒకసారి వేపనూనె పిచికారీ చేస్తే పురుగుల గుడ్లు నశించి మరింత మెరుగైన ఫలితాలుంటాయి. – పడాల గౌతమ్ (98497 12341), ఎస్టేట్ మేనేజర్, రుషి వ్యాలీ స్కూల్, మదనపల్లిదివంగత సంజీవరెడ్డి సూచనలతో 2007 నుంచి మా 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. 2014లో ‘సాక్షి సాగుబడి’లో సివిఆర్ మట్టి ద్రావణం గురించి చదివినప్పటి నుంచి వంగ, సాంబారు దోస, పూల తోట, వేరుశనగ వంటి అన్ని పంటలకూ లోపలి మట్టి+ ఆముదం ద్రావణం వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నాను. సివిఆర్ కొత్తగా చెప్తున్నట్లు మట్టి, ఆముదంతోపాటు కుంకుడు రసం కూడా కలిపి పత్తి పంట 20 రోజుల దశలో రెండు నెలల క్రితం ఒకసారి, ఆ తర్వాత మరోసారి పిచికారీ చేశాను. పంట ముదురు ఆకుపచ్చగా బలంగా పురుగుల బెడద లేకుండా పెరిగింది. ఇప్పుడు పత్తి తీస్తున్నాను. ఇతర రైతులతో కూడా మట్టి ద్రావణం వాడిస్తున్నాం. – పి. గిరీష్ గౌడ్ (80732 45976), ఇనగలూరు,అగళి మండలం, సత్యసాయి జిల్లా -
ప్రకృతి సేద్యం ఇంత గొప్పగా ఉంటుందని ఉహించలేదు: ప్రొ.రమేశ్ చంద్
సుభాష్ పాలేకర్ కృషితో ప్రాధమిక రూపంలో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయం గత కొన్నేళ్లలో అనేక ఆవిష్కరణలతో శాస్త్రీయతను సంతరించుకుంటూ క్లైమెట్ ఎమర్జెన్సీని తట్టుకునేలా ఆశ్చర్యకరమైన రీతిలో పరిపుష్టమవుతూ, ప్రకృతి వైపరీత్యాలను దీటుగా తట్టుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యవసాయ నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్ చంద్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయ వికాసం తీరు తెన్నులను ఇటీవల రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తమ నీతి ఆయోగ్, ఐసిఎఆర్ నిపుణుల బృందానికి ఒక గొప్ప అభ్యాసం (గ్రేట్ లెర్నింగ్)గా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.వినూత్న ఆవిష్కరణలుఏడేళ్ల క్రితం తాను ఆంధ్రలో పర్యటించినప్పుడు ప్రకృతి వ్యవసాయం పాలేకర్ పద్ధతికి మాత్రమే పరిమితమైందని, ఇప్పుడు వినూత్న ఆవిష్కరణలతో శాస్త్రీయత ప్రాతిపదికపై పురోగమిస్తోందని, క్షేత్రస్థాయిలో ఇంత గొప్పగా ఉంటుందని తాము ముందుగా ఊహించలేదన్నారు. పర్యటన అనంతరం ప్రొ. రమేశ్ చంద్ ఒక వీడియో సందేశంలో తన స్పందనను వెల్లడించారు. ఏపీ ప్రకృతి సేద్య ఆవిష్కరణలను వివరిస్తూ, రసాయనిక సేద్యంలో, ప్రకృతి సేద్యంలో పక్క పక్కన పొలాల్లోనే సాగవుతున్న వరి పంటను పరిశీలిస్తే.. కరువు, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతి సేద్యం ఎంత మెరుగైన ఫలితాలనిస్తోందో అర్థమైందన్నారు. అదేవిధంగా, కూరగాయలు, పండ్ల తోటలను పరిశీలించినప్పుడు కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలను కళ్లజూశామన్నారు. అరటి తోట సాగు చేస్తున్న ఒక రైతు జీవామృతం వంటి బయో ఇన్పుట్స్ కూడా ఇక వాడాల్సిన అవసరం లేనంతగా తన భూమిని సారవంతం చేసుకోవటం ఆశ్చర్యం కలిగించిందని ప్రొ.రమేశ్ చంద్ తెలి΄ారు. విత్తనాలకు అనేక పొరలుగా మట్టి, జీవామృతాలతో లేపనం చేసి గుళికలు తయారు చేసి, నేలలో తేమ లేని పరిస్థితుల్లో వర్షం రావటానికి ముందే విత్తుతున్నారన్నారు.విభిన్నమైన దృష్టికోణంపంటలతో, ఆచ్ఛాదనతో నేలను కప్పి ఉంచటంతోపాటు అనేక పంటలను కలిపి పండిస్తూ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తున్నారన్నారు. గడ్డిని ఆచ్ఛాదనగా వేస్తే చెదలు సమస్య వస్తుంది కదా అని ఓ ప్రకృతి వ్యవసాయదారుడ్ని ప్రశ్నిస్తే.. చెదపురుగులు తమ మిత్రపురుగులని బదులిచ్చారన్నారు. సాధారణ రైతుల అభిప్రాయానికి ఇది పూర్తిగా విభిన్నమైన దృష్టికోణం అని, అన్ని విషయాల్లోనూ ఈ వ్యత్యాసం ఉందన్నారు. ఈ పర్యటనలో రైతులతో స్వయంగా మాట్లాడి అనేక కొత్త విషయాలను తాము నేర్చుకున్నామని, ఇది గ్రేట్ లెర్నింగ్ అని ఆయన అన్నారు. ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఫార్మింగ్ సిస్టమ్స్ నిపుణులు, మట్టి నిపుణులు, నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా. నీలం పటేల్ కూడా మాతో ఈ పర్యటనలో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రసాయనిక వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులను మాత్రమే విస్తరణ, బోధన, పరిశోధన రంగాల్లో అనుసరిస్తున్నామని, ఇక మీదట ప్రకృతి సేద్యాన్ని కూడా భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు.సబ్సిడీ ఎలా ఇవ్వగలం?ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట రసాయన వ్యవసాయంలో పండించిన పంటతో పోల్చితే చాలా మెరుగైనది. నాణ్యతకు తగిన ధర ఎలా కల్పించగలమో ఆలోచించాలి. యూరియా ధరలో 85–90% సబ్సిడీ ఇస్తున్నాం. ప్రకృతి సేద్యాన్ని దేశంలో విస్తరింపజేయటానికి ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వాలో ఆలోచించాల్సి ఉందంటూ క్రేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామన్నారు. -
సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు
ఈనెల22, 23 తేదీల్లో బయోడైనమిక్సేద్యంపై శిక్షణ దేశ విదేశాల్లో చిరకాలంగా కొందరు రైతులు అనుసరిస్తున్న సేంద్రియ సేద్య పద్థతుల్లో బయోడైనమిక్ సేద్యం ఒకటి. రైతులు స్వయంగా తయారు చేసుకునే ఆవు కొమ్ము ఎరువు తదితర సేంద్రియ ఎరువులను సూక్ష్మ పరిమాణంలో వేస్తూ చేసే రసాయన రహిత సేద్య పద్ధతి ఇది. టైమ్ టేబుల్ ప్రకారం ప్రతి వ్యవసాయ పనినీ నిర్దేశిత రోజుల్లో మాత్రమే చేయటం ఇందులో ప్రత్యేకత. బయోడైనమిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో బెంగళూరులోని బెంగళూరు ఇంటర్నేషనల్ సెంటర్లో రైతు శిక్షణా శిబిరం జరగనుంది. బయోడైనమిక్ సేద్యంలో అనుభవం కలిగిన రైతులు శిక్షణ ఇస్తారు. క్షేత్ర సందర్శన ఉంటుంది. ప్రవేశ రుసుము (శిక్షణ, భోజనం సహా): రూ. 1,500. వసతి ఎవరికి వారే చూసుకోవాలి. ఆసక్తి గల వారు ముందుగా గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇతర వివరాలకు.. 97386 76611 సంప్రదించవచ్చు. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ΄్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపిహెచ్ఎం) దేశంలోనే పేరెన్నికగల వ్యవసాయ శిక్షణా సంస్థ. సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులు, ఎఫ్పిఓలు/ సహకార సంఘాల నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు లోతైన శాస్త్రీయ అవగాహన, ఆచరణాత్మక శిక్షణ కల్పించడానికి ఎన్ఐపిహెచ్ఎం 3 నెలల సర్టిఫికెట్ కోర్సు తెలుగు/హిందీ భాషల్లో నిర్వహించనుంది.నూటికి నూరు శాతం రసాయనాల్లేకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయదలచిన వారికి ఇది సదవకాశం. నవంబర్ 27 నుంచి వచ్చే మార్చి 5 వరకు ఈ కోర్సు ఉంటుంది. వివిధ కేంద్ర వ్యవసాయ సంస్థలతో కలసి ఎన్ఐపిహెచ్ఎం నిర్వహించే ఈ కోర్సులో 3 దశలుంటాయి. మొదట 21 రోజులు రాజేంద్రనగర్లోని ఎన్ఐపిహెచ్ఎం ఆవరణలో శాస్త్రీయ అంశాల బోధన. తర్వాత అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో 2 నెలలు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు. ఆ తర్వాత ఎన్ఐపిహెచ్ఎంలో 10 రోజుల తుది దశ శిక్షణ ఉంటాయి. ఇంటర్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ డిప్లొమా చేసిన 18 ఏళ్లు నిండిన అన్ని సామాజిక వర్గాల స్త్రీ పురుషులు అర్హులు. గ్రామీణ యువతకు ప్రాధాన్యం. కోర్సు ఫీజు: రూ. 7,500. శిక్షణా కాలంలో ఉచిత వసతి కల్పిస్తారు. భోజనానికి రోజుకు రూ.305 అభ్యర్థి చెల్లించాలి. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. దరఖాస్తులను నవంబర్ 22 లోగా పోస్టు/మెయిల్ ద్వారా పంపవచ్చు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా.కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు. -
వరిలోనే గోనె సంచుల్లో కూరగాయల సాగు!
నీరు నిల్వగట్టే రబీ వరి పొలాల్లో కూరగాయల సాగుతో పౌష్టికాహార భద్రతతో పాటు అదనపు ఆదాయంఅధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడిహెక్టారులో 4–5 టన్నుల వరి ధాన్యంతో పాటు 60 క్వింటాళ్ల టొమాటోలు లేదా 30 క్వింటాళ్ల క్యారట్/ ముల్లంగి దిగుబడి పొందవచ్చుఐసిఎఆర్ సంస్థ ‘క్రిజాఫ్’ పరిశోధనల్లో వెల్లడిసార్వా, దాళ్వా సీజన్లలో (వర్షాకాలం, ఎండాకాలాల్లో) విస్తారంగా వరి పంట సాగయ్యే ప్రాంతాల్లో గట్ల మీద తప్ప పొలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలను నేలపై సాగు చేయటం సాధ్యపడదు. అయితే, వరి సాళ్ల మధ్యలో వరుసలుగా ఏర్పాటు చేసిన గోనె సంచుల్లో సాధ్యపడుతుంది. గోనె సంచిలో అడుగు ఎత్తున మట్టి + మాగిన పశువుల ఎరువు/ఘన జీవామృతాల మిశ్రమం నింపి.. అందులో రకరకాల కూరగాయ మొక్కలు సాగు చేసుకునే అవకాశం మెండుగా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. స్వల్ప ఖర్చుతోనే వరి రైతులు అధికాదాయం పొందేందుకు అవకాశం ఉంది. వరి సాగయ్యే ప్రాంతాల్లో స్థానికంగా కూరగాయల లభ్యత పెరగటంతో ప్రజలకు పౌష్టికాహార భద్రత చేకూరుతుందని ఈ పద్ధతిపై సుదీర్ఘ పరిశోధన చేసిన విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.కె. ఘోరాయ్ అంటున్నారు. పశ్చిమ బెంగాల్ బారక్పుర్లోని (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ) సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్)లో ఈ పరిశోధనలు చేశారు. అధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడి పొందవచ్చని ఈ పరిశోధనల్లో తేలింది.పదేళ్ల పరిశోధన2011–2021 మధ్యకాలంలో క్రిజాఫ్ ఆవరణలో, మరికొన్ని జిల్లాల్లో రబీ వరి పొలాల్లో గోనె సంచుల్లో కూరగాయలను అంతర పంటలుగా ప్రయోగాత్మకంగా సాగు చేశారు. నీరు నిల్వ ఉండే చోట నేలలో ప్రాణవాయువు లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ద్విదళ జాతికి చెందిన కూరగాయ పంటలు సాగు చేసుకోవచ్చని తేలింది. మట్టి లోతు తక్కువగా ఉండే రాళ్ల నేలల్లో, చౌడు నేలల్లో కూడా ఈ విధంగా గోనె సంచుల్లో మట్టి మిశ్రమం నింపుకొని కూరగాయ పంటలు నిశ్చింతగా పండించుకోవచ్చు. ఎండాకాలంలో మంచి ధర పలికే టొమాటోలు, క్యారట్, ముల్లంగి, వంగ, పొద చిక్కుడు, కాళీఫ్లవర్, క్యాబేజి వంటి పంటలతో పాటు బీర, పొట్ల, సొర, ఆనప, గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి తీగజాతి కూరగాయలను, కొత్తిమీర, ఉల్లి, కంద తదితర పంటలను పండించి మంచి ఆదాయం గడించవచ్చని డాక్టర్ఘోరాయ్ తెలిపారు. తీగలు పాకడానికి మూడు కర్రలు పాతి, పురికొస చుట్టి ఆసరా కల్పించాలి. వరి పంట కోసిన తర్వాత నేల మీద పాకించవచ్చు. అవసరాన్ని బట్టి తాత్కాలిక పందిరి వేసుకోవచ్చు. ఈ మడుల్లో ఒక పంట పూర్తయ్యాక మరో పంటను వేసుకోవచ్చు.గోనె సంచుల్లో సాగు ఎలా?ప్లాస్టిక్ వాడకం జోలికి పోకుండా వాడేసిన గోనె సంచిని అడ్డంగా ముక్కలుగా చేయాలి. బ్లైటాక్ నాడ్ రోగార్ కలిపిన నీటిలో గోనె సంచిని శుద్ధి చేస్తే శిలీంధ్రాలు, పురుగులను తట్టుకోవడానికి వీలుంటుంది. వాటికి నిలువుగా నిలబెట్టి, మట్టి+ సేంద్రియ ఎరువు నింపాలి. బయట ఏర్పాటు చేసి తీసుకెళ్లి పొలంలో పెట్టకూడదు. నీటిని నిల్వగట్టిన వరి పొలంలోనే వీటిని తయారు చేసుకోవాలి. గోనె అడుగున మొదట 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి వేయాలి. దానిపై వరి పొలంలోని బురద మట్టినే 4 అంగుళాలు వేయాలి. ఆపైన మాగిన పశువుల ఎరువు లేదా ఘన జీవామృతం 2 అంగుళాల మందాన వేయాలి. ఆపైన మళ్లీ 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి, మట్టి, ఎరువు పొరలుగా వేసి ఆపైన కొంచెం మట్టి కలపాలి. అంతే.. కూరగాయ మొక్కలు నాటడానికి గోనె సంచి మడి సిద్ధమైనట్టే. వరి గడ్డి క్రమంగా కుళ్లి పోషకాలను అందించటంతో పాటు మట్టి పిడచకట్టుకుపోకుండా గుల్లబరుస్తుంది. ఈ గోనె సంచుల మడులకు పనిగట్టుకొని నీరు పోయాల్సిన అవసరం లేదు. కాపిల్లరీ మూమెంట్ ద్వారా మట్టి అడుగున ఉన్న నీటి తేమను ఎప్పటికప్పుడు పీల్చుకొని మొక్కల వేర్లకు అందిస్తుంది. అప్పుడప్పుడూ ద్రవజీవామృతం తదితర ద్రవరూప ఎరువులను ఈ మడుల్లో పోస్తుంటే మొక్కలకు పోషకాల లోపం లేకుండా పెరిగి ఫలసాయాన్నిస్తాయి. వరి పంటను కంబైన్ హార్వెస్టర్తో కోత కోసే పనైతే.. అది వెళ్లడానికి వీలైనంత దూరంలో ఈ కూరగాయ మొక్కలను వరుసలుగా ఏర్పాటు చేసుకోవాలి.హెక్టారుకు 3 వేల మడులు95 సెం.మీ. పొడవుండే 50 కిలోల గోనె సంచిని అడ్డంగా 3 ముక్కలు చేసి మూడు మడులు ఏర్పాటు చేయొచ్చు. హెక్టారుకు వెయ్యి గోనె సంచులు (3 వేల మడులకు) సరిపోతాయి. మడి ఎత్తు 30 సెం.మీ. (అడుగు), చుట్టుకొలత 45 సెం.మీ. ఉంటుంది. వరిపొలంలో 5–10 సెం.మీ. లోతు నీరుంటుంది. కాబట్టి కూరగాయ మొక్కలకు ఇబ్బంది ఉండదు. హెక్టారుకు 3 వేల గోనె సంచి మడులు పెట్టుకోవచ్చు. 3వేల వంగ మొక్కల్ని లేదా 6 వేల క్యాబేజి మొక్కల్ని వేసుకోవచ్చు. సమ్మర్ కేరట్ లేదా ముల్లంగి హెక్టారుకు 30 క్వింటాళ్లు దిగుబడి తీసుకోవచ్చు. టొమాటో మొక్కకు 2 కిలోల చొప్పున హెక్టారుకు 60 క్వింటాళ్ల టొమాటోల దిగుబడి పొందవచ్చు. హెక్టారుకు 4–5 టన్నుల వరి ధాన్యానికి అదనంగా కూరగాయలను పుష్కలంగా పండించుకోవచ్చని డాక్టర్ ఘోరాయ్ వివరించారు. రబీ వరిలో అంతరపంటలుగా కూరగాయల సాగుపై మన యూనివర్సిటీలు / కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తే రైతులు అందిపుచ్చుకుంటారు. ఈ పంటల వీడియోలను డాక్టర్ ఘోరాయ్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. నీరు నిల్వ గట్టే వరి పొలాల్లో గోనె సంచుల్లో వరుసలుగా ఈ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తే రైతుల కుటుంబాలకు, స్థానిక ప్రజలకు పుష్కలంగా కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. ఒకే స్థలంలో అవే వనరులతో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు పండించుకోవచ్చు. వరి రైతులు రూ;eయి అదనంగా ఖర్చుపెట్టి పది రెట్లు ఆదాయం సమకూర్చుకోవచ్చు. వరి పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ఆరుబయట కూరగాయ తోటలతో పోల్చితే 6–8 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండలు ముదిరిన తర్వాత కూడా కూరగాయల దిగుబడి బాగుంటుంది. వేసవిలో నీరు తదితర వనరులను మరింత ఉత్పాదకంగా వినియోగించుకోవటానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది. – డాక్టర్ ఎ.కె. ఘోరాయ్, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్),బారక్పుర్, పశ్చిమ బెంగాల్. -
పుష్కలంగా కూరగాయలు కావాలా? అయితే ఇలా చేయండి!
సేంద్రియ ఆహారం ఆవశ్యకతపై వినియోగదారుల్లో పెరుగుతున్న చైతన్యంతో కిచెన్ గార్డెన్ల సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో కూరగాయలు, పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇంటిపట్టునే 13 రకాల కూరగాయలను సేంద్రియంగా పండించుకొని తింటున్న కుటుంబాల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. పఠాన్చెరులోని ‘ఇక్రిశాట్’ ఆవరణలో గల వరల్డ్ వెజిటబుల్ సెంటర్ దక్షిణాసియా కేంద్రం సేంద్రియ పెరటి తోటల సాగుపై పరిశోధనలు చేపట్టింది (లాభాపేక్ష లేని ఈ సంస్థ కేంద్ర కార్యాలయం తైవాన్లో ఉంది). రెండు నమూనాల్లో సేంద్రియ పెరటి తోటల సాగుకు సంబంధించి ‘సెంటర్’ అధ్యయనంపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వ / ప్రైవేటు వ్యవసాయ పరిశోధనా సంస్థలతో కలసి కూరగాయలు, మిరప వంటి పంటలపై పరిశోధనలు చేసింది. టాటా ట్రస్టులతో కలిసి 36 చదరపు మీటర్ల స్థలంలో పౌష్టిక విలువలతో కూడిన 13 రకాల సేంద్రియ కూరగాయల పెరటి తోటల (న్యూట్రి గార్డెన్స్) పై తాజాగా క్షేత్రస్థాయిలో ఈ పరిశోధన జరిగింది. కుటుంబానికి వారానికి 5.1 కిలోల (ప్రతి మనిషికి రోజుకు 182 గ్రాముల) చొప్పున.. ఏడాదికి 266.5 కిలోల పోషకాలతో కూడిన తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సమకూరాయి. తద్వారా ఒక కుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75% అందాయి. బీటా కెరొటెన్ (విటమిన్ ఎ), విటమిన్ సి అవసరానికన్నా ఎక్కువే అందాయి. 25% ఐరన్ సమకూరిందని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది.జార్కండ్లో పెరటి తోటల పెంపకం ద్వారా కుటుంబాలకు కూరగాయల ఖర్చు 30% తగ్గింది. అస్సాంలో సేంద్రియ న్యూట్రిగార్డెన్ల వల్ల పది వేల కుటుంబాలు విషరసాయనాలు లేని కూరగాయలను సొంతంగానే పండించుకుంటున్నారు. మార్కెట్లో కొనటం మానేశారని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది. వ్యవసాయ దిగుబడులు పెంచే పరిశోధనలతో పాటు భవిష్యత్తు తరాల ప్రజల ఆరోగ్యదాయక జీవనానికి ఉపయోగపడే క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తున్నామని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ చెప్పారు. స్క్వేర్ గార్డెన్ నిర్మాణం ఎలా?గ్రామీణ కుటుంబాలకు సర్కిల్ గార్డెన్తో పోల్చితే నలుచదరంగా ఉండే స్క్వేర్ గార్డెనే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు ఉండే స్థలాన్ని ఎంపికచేసుకొని మెత్తగా దున్నాలి. మాగిన పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువుతో వేప పిండి కలిపి చల్లితే చీడపీడలు రావు. 6-6 స్థలాన్ని 7 బెడ్స్ (ఎత్తుమడులు) గా ఏర్పాటు చేయాలి. వాటిని అడ్డంగా విభజించి 14 చిన్న మడులు చేయాలి. ఒక్కో మడిలో ఒక్కో పంట వేయాలి. పాలకూర, గోంగూర, ఉల్లి, క్యారట్, టొమాటో, బెండ, వంగ వంటి పంటలు వేసుకోవాలి. బెడ్స్ మధ్యలో అంతరపంటలుగా బంతి, మొక్కజొన్న విత్తుకుంటే రసంపీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ఇంటిపంటల ఉత్పాదకత 5 రెట్లు! సేంద్రియ ఇంటిపంటలు పౌష్టిక విలువలతో కూడి సమతులాహార లభ్యతను, ఆహార భద్రతను పెంపొందిస్తున్నాయి. తాము తినే ఆహారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సామర్ధ్యాన్ని కుటుంబాలకు ఇస్తున్నాయి. ఫలితంగా మరింత సుస్థిరమైన, ఆరోగ్యదాయకమైన జీవనానికి మార్గం సుగమం అవుతోంది. ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలను వ్యక్తిగత శ్రద్ధతో సాగు చేస్తే పొలాల ఉత్పాదకతో పోల్చినప్పుడు దాదాపు 5 రెట్ల ఉత్పాదకత సాధించవచ్చు. భారత్లో పొలాల్లో కూరగాయల దిగుబడి హెక్టారకు సగటున 12.7 టన్నులు ఉండగా, సేంద్రియ ఇంటిపంటల ద్వారా హెక్టారుకు ఏడాదికి 73.9 టన్నుల దిగుబడి పొందవచ్చు. విస్తారమైన కూరగాయ తోటల్లో సైతం సమీకృత వ్యవసాయ పద్ధతులు పాటిస్తే రసాయనాల వినియోగం తగ్గటంతో పాటు 20% అధిక దిగుబడి పొందవచ్చు. – ఎం. రవిశంకర్, సీనియర్ హార్టీకల్చరిస్ట్, ప్రాజెక్టు మేనేజర్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం, పఠాన్చెరుసర్క్యులర్ కిచెన్ గార్డెన్ ఎలా?పట్టణ ప్రాంతాల్లో స్థలం తక్కువగా ఉన్న చోట సర్క్యులర్ గార్డెన్ అనుకూలంగా ఉంటుంది. చూపులకూ ముచ్చటగా ఉంటుంది. 3 మీటర్ల చుట్టుకొలత ఉండే మడిలో 11 రకాల పంటలు పండించవచ్చు. మధ్యలో ఉండే చిన్న సర్కిల్లో కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలు వేసుకోవచ్చు. పెద్దగా ఉండే వెలుపలి సర్కిల్లో అనేక మడులు చేసి వేర్వేరు కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు. ఒక మడిలో భూసారం పెంపుదలకు వాడే పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలి. చీడపీడల నియంత్రణకు పసుపు, నీలం జిగురు అట్టలు పెట్టుకోవాలి. వేపనూనె, పులిసిన మజ్జిగ పిచికారీ చేస్తుంటే తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. ఈ సస్యరక్షణ చర్యల ద్వారా రసాయనిక పురుగుమందులు వాడకుండానే పంటలను రక్షించుకోవచ్చు. స్క్వేర్ గార్డెన్ దిగుబడి ఎక్కువగుండ్రంగా, దీర్ఘ చతురస్త్రాకారంలో ఉండే రెండు రకాల గార్డెన్ డిజైన్లు పెరటి కూరగాయ తోటల సాగుకు అనుకూలం. స్థలం లభ్యతను బట్టి గార్డెన్ డిజైన్ను ఎంపిక చేసుకోవాలి. 6 మీటర్ల చుట్టుకొలత గల సర్కిల్ గార్డెన్లో 150 రోజుల్లో 56 కిలోల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు పండాయి. ఎరువులు, విత్తనాలు తదితర ఉత్పాదకాల ఖర్చు రూ. 1,450. అయితే, 6“6 మీటర్ల విస్తీర్ణంలో పెరటి తోట (స్క్వేర్ గార్డెన్)లో అవే పంటలు సాగు చేస్తే 67 కిలోల దిగుబడి వచ్చింది, ఉత్పాదకాల ఖర్చు రూ. 1,650 అయ్యింది. ఈ గార్డెన్లు విటమిన్లు, ఖనిజాలు, పీచు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన సమతుల ఆహారాన్ని కుటుంబానికి అందించాయి. ఆమేరకు మార్కెట్పై ఆధారపడకుండా రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పౌష్టికాహారాన్ని ఆ కుటుంబం పండించుకొని తినవచ్చని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పేర్కొంది. ఇళ్లు కిక్కిరిసి ఉండే అర్బన్ ప్రాంతాల్లో కంటెయినర్ గార్డెన్లను ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను నగరవాసులు పండించుకోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. సేంద్రియ ఇంటిపంటలపై వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పరిశోధన36 చ.మీ. స్థలంలో వారానికి 5.1 (ఏడాదికి 266.5) కిలోల సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల దిగుబడికుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75%, ఐరన్ 25%, పుష్కలంగా ఎ, సి విటమిన్లు(ఇతర వివరాలకు.. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ప్రతినిధి వినయనాథ రెడ్డి 99125 44200) -
Snake Fruit: స్నేక్ ఫ్రూట్!
‘స్నేక్ ఫ్రూట్’ లేదా సలక్ ఫ్రూట్. శాస్త్రీయ నామం సలక్క జలక్క. అరెకేసియే కుటుంబం. ఈత, ఖర్జూర వంటి పామ్ జాతికి చెందిన ఒక రకం. ఇండోనేషియాలోని జావా, సుమత్ర ప్రాంతం దీని పుట్టిల్లు. ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్ వంటి ఈశాన్య ఆసియా దేశాల్లో విస్తారంగా సాగులో ఉన్న పండు. లేత కాఫీ రంగులో ఉండే ఈ పండు పైన పోలుసు పాము చర్మంపై పోలుసులను పోలి ఉంటుంది. అందుకే కాబోలు, దీనికి స్నేక్ ఫ్రూట్ లేదా స్నేక్ స్కిన్ ఫ్రూట్ అంటారు. పండిన అంజూర పండు సైజులో, అదే ఆకారంలో స్నేక్ ఫ్రూట్ ఉంటుంది. పైపోర పెళుసుగా ఉంటుంది. పైపోరను ఒలిస్తే లోపల తెల్లటి రెబ్బలు (వెల్లుల్లి రెబ్బల మాదిరిగా) ఉంటాయి. వాటి లోపల గోధుమ రంగు గింజలు ఉంటాయి. గింజలు తీసేసి ఈ రెబ్బల్ని తినాలి. రుచి గమ్మత్తుగా, విలక్షణంగా ఉంటుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ద హెల్త్ అని, సూపర్ హీరోస్ ఆఫ్ ఫంక్షనాలిటీ అని దీన్ని వ్యవహరిస్తుంటారు. సలక్కు ఇంకా చాలా పేర్లున్నాయి. ఇండోనేషియాలో పోందో, థాయ్లాండ్లో రకం, చైనాలో సలక లేదా షి పై గ్యో జాంగ్, మయన్మార్లో ఇంగన్ అని పిలుస్తున్నారు. న్యూ గినియ, ఫిలిప్పీన్స్, క్వీన్స్లాండ్, ఉత్తర ఆస్ట్రేలియా, పోనపె ఐలాండ్ (కారోలిన్ అర్చిపెలాగో), చైనా, సూరినామ్, స్పెయిన్, ఫిజి తదితర దేశాల్లో స్నేక్ ఫ్రూట్ను సాగు చేస్తున్నారు. ఇండోనేషియాలోని ఇతరప్రాంతాల్లో దీన్ని ఆహార పంటగా సాగు చేస్తున్నారు.20 అడుగుల ఎత్తుస్నేక్ ఫ్రూట్ చెట్టుకు కాండం చాలా చిన్నది. అయితే, కొమ్మలు పెద్దగా 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ప్రతి కొమ్మకు ముళ్లతో కూడిన 2 మీటర్ల పోడవైన తొడిమె ఉంటుంది. ముల్లు 6 అంగుళాల వరకు పోడవుంటుంది. కొమ్మకు చాలా ఆకులుంటాయి. ఈ చెట్టు కాండానికి కాయలు గెలలుగా కాస్తాయి. ఆకు అడుగున లేత ఆకుపచ్చగా, పైన ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. స్నేక్ ఫ్రూట్ మొక్క నాటిన తర్వాత 3–4 ఏళ్లలో కాపుకొస్తుంది. ఇప్పుడు ముళ్లు లేని వంగడాలు కూడా వచ్చాయి. ఆడ చెట్లు, మగ చెట్లు ఉంటాయి. కొన్ని రకాల స్నేక్ ఫ్రూట్ చెట్లలో (ఉదా.. సలక్ బాలి) ఆడ, మగ పూలు రెండూ ఒకే చెట్టుకు పూసి స్వపరాగ సంపర్కం చెందుతాయి. పూలు గుత్తులుగా పూస్తాయి. ఆడ పూలు 20–30 సెం.మీ., మగవి 50–100 సెం.మీ. పోడవు ఉంటాయి. పరాగ సంపర్కం కోసం మగ పూలలో 20%ని మాత్రమే ఉంచి, మిగతావి తొలగించాలి. మనుషులు చేతులతో పరాగ సంపర్కం చేయిస్తే పండ్ల దిగుబడి పెరుగుతుంది.తీపి కాదు, వగరుసలక్క చెట్ల రకాలు 21 జాతులున్నాయి. మలేషియాలో మూడు రకాలను పెంచుతున్నారు. ఎస్.గ్లాబెరెసెన్స్, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన. ఎస్. గ్లాబెరెసెన్స్ను లోకల్ సలక్గా భావిస్తారు. దీని నుంచి 9 క్లోన్స్ను తయారు చేశారు. ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలు ఇండోనేషియా నుంచి మలేషియాకు వచ్చాయి. ఇక ఇండోనేషియాలో దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం వాణిజ్యపరంగా ఎస్. జటక్క, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలను సాగు చేస్తున్నారు. మనోంజయ, బొంగ్కాక్, బంజార్నెగర, కొండెట్, పోందో, బాలి, ఎన్రెంకంగ్, సైడెంపుయన్ వంటి అనేక రకాల స్నేక్ ఫ్రూట్ వంగడాలు సాగులో ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్ తియ్యని పండు కాదు, కొంచెం వగరు. బోంగ్కాక్ రకం పండు మరీ ఎక్కువ వగరు. మిగతా రకాల కన్నా తక్కువ తీపి కలిగి ఉంటుంది.పుష్కలంగా పోషకాలుస్నేక్ ఫ్రూట్లో ఇతర పండ్లతో పోల్చినప్పుడు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సుక్రోజ్ (7.6 గ్రా/100 గ్రా.), ఫ్రక్టోజ్ (3.9 గ్రా/100 గ్రా.), టోటల్ సుగర్ (17.4 గ్రా./100 గ్రా.), జీర్ణమయ్యే పీచు (0.3 గ్రా./100 గ్రా.), జీర్ణం కాని పీచు (1.4 గ్రా./100 గ్రా.), టోటల్ డైటరీ ఫైబర్ (1.7 గ్రా./100 గ్రా.), నీరు (80గ్రా./100 గ్రా.), కేలరీలు (77 కిలోకేలరీలు/ 100 గ్రా.),ప్రోటీన్ (0.7గ్రా./100 గ్రా.), బూడిద (0.6గ్రా./100 గ్రా.), కొవ్వు (0.1 గ్రా./100 గ్రా.). ఉన్నాయి. సహజ పీచు, సుగర్స్కు స్నేక్ ఫ్రూట్ చక్కని వనరు. దీని గుజ్జులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఫాస్ఫరస్ (1161 ఎంజి/కేజీ), పోటాషియం (11.339 ఎంజి/కేజీ), కాల్షియం (220 ఎంజి/కేజీ), మెగ్నీషియం (607 ఎంజి/కేజీ), సోడియం (231 ఎంజి/కేజీ), ఐరన్ (12.0 ఎంజి/కేజీ), మాంగనీసు (10.4 ఎంజి/కేజీ), రాగి (3.36 ఎంజి/కేజీ), బోరాన్ (5.07 ఎంజి/కేజీ), సల్ఫర్ (5.07 ఎంజి/కేజీ), అస్కార్బిక్ ఆసిడ్ (400 ఎంజి/కేజీ), కెరోటిన్ (5 ఎంజి/కేజీ), థయామిన్ (20 ఎంజి/కేజీ), నియాసిన్ (240 ఎంజి/కేజీ), రిబోఫ్లావిన్ (0.8 ఎంజి/కేజీ), ఫొలేట్ (6 ఎంజి/కేజీ) మేరకు ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్లో ఆరోగ్యదాయకమైన పీచు, పిండి పదార్థం నిండుగా ఉన్నాయి. ఇతర విదేశీ పండ్లతో పోల్చితే దీని గుజ్జులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ పండును నేరుగా తినొచ్చు లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, చిప్స్, ఊరబెట్టి కూడా వాడుకుంటున్నారు. పోందో (ఇండోనేషియన్ సలక్) రకం లేత కాయలను గింజలతో సహా తినొచ్చు. స్నేక్ ఫ్రూట్ ఆకులను, రెమ్మలను కూడా చాపలు, బుట్టల అల్లికకు వాడుతున్నారు.50 ఏళ్ల పాటు దిగుబడిస్నేక్ ఫ్రూట్ను విత్తనాలతో మొక్కలు పెంచి నాటుకోవాలి. అయితే, 50% మాత్రమే ఆడ మొక్కలు వస్తాయి. పండు నాణ్యత ఒకే స్థాయిలో ఉంటుంది. తల్లి మొక్క లక్షణాలు పూర్తిగా రావాలంటే మాత్రం పిలకలు నాటుకోవాలి. 6–12 నెలల వయసు మొక్కను పైన ఆకుల నుంచి కింది వేర్ల వరకు నిలువుగా చీల్చి నాటుకోవచ్చు. పిహెచ్ 4.7 – 7.5 వరకు తట్టుకుంటుంది. లేత మొక్క నీడలో బాగా పెరుగుతుంది. వాణిజ్యపరంగా సాగయ్యే తోటల్లో కొబ్బరి, డ్యూరియన్ చెట్ల నీడన ఈ మొక్కల్ని పెంచుతుంటారు. నాటిన 3–4 ఏళ్లకు కాపు ్రపారంభం అవుతుంది. ఈ చెట్టు 50 ఏళ్ల పాటు హెక్టారుకు 5–15 టన్నుల పండ్ల దిగుబడినిస్తుంది. ఏటా నాలుగు సార్లు పూత వచ్చినప్పటికీ ఏప్రిల్ – అక్టోబర్ మధ్యలోనే పండ్లు వస్తాయి. మొక్కలు 60–70 సెం.మీ. ఎత్తు పెరిగిన 5–7 నెలల తర్వాత నాటుకోవాలి. గుంతలు 40“40“40 సెం.మీ. సైజులో తవ్వాలి. 1.5 “ 3 మీటర్ల నుంచి 2 “ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. కొమ్మకత్తిరింపు, కలుపు తీత ప్రతి రెండు నెలలకోసారి చేస్తే పూత బాగా వస్తుంది. సరిగ్గా లేని లేదా పాడైన పండ్లను ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. గుత్తికి 20–25 పండ్లు ఉంటే దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా వర్షాధారంగానే పెరుగుతుంది. కొమ్మ కత్తిరించినప్పుడు, పండ్లు ఎదుగుతున్న దశలో, వేడి సీజన్లలో నీరు అందించాలి. పూత దశలో, పండ్ల కోతకు ముందు రోజుల్లో తగుమాత్రంగా నీరివ్వాలి. ఎక్కువ నీరిస్తే కుళ్లిపోతాయి. వాణిజ్యపరంగా సాగు చేసే తోటల్లో అధిక దిగుబడి కోసం కూలీలతో పోలినేషన్ చేయిస్తారు. పువ్వు గట్టిపడితే పోలినేషన్ సక్సెస్ అయ్యిందని గుర్తు. మెత్తగానే ఉండిపోతే ఫెయిలైనట్లు గుర్తించి తొలగిస్తారు. పండు తగిన సైజు, రంగు వచ్చి, పండుపై ఉన్న సన్నని ముళ్లు ఊడిపోయిందంటే పక్వానికి వచ్చినట్లు గుర్తిస్తారు. పండు 70–80% పండినప్పుడు కూలీలతో పండ్లు కోయిస్తారు. తాజా పండ్ల మార్కెట్లో విక్రయించటంతో పాటు స్నేక్ ఫ్రూట్స్ను ఊరగాయ పచ్చడి పెడతారు. సుగర్, ఈస్ట్ కలిపి వైన్ తయారీలో కూడా స్నేక్ ఫ్రూట్స్ వాడుతున్నారు. -
అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి దోహదం!
2030 నాటికి ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవటానికి ఐక్యరాజ్యసమితి 2015లో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన లక్ష్యాలే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్.డి.జి.లు). ఇవి 17 రకాలు. ఈ లక్ష్యాల సాధన కృషి స్థితిగతులపై సమీక్షకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈనెల 22–23 తేదీల్లో కీలక శిఖరాగ్రసభ ‘ఫ్యూచర్ 2024’ జరగనుంది. ఈ నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా ప్రభావితం చేస్తోందో తెలుసుకునేందుకు ఒక అధ్యయనం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ గ్రోనింగెన్ (నెదర్లాండ్స్)కు చెందిన డాక్టర్ ప్రజల్ ప్రధాన్ సారథ్యంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. అర్బన్ అగ్రికల్చర్ ఎస్.డి.జి.ల సాధన కృషిపై చూపుతున్న సానుకూల ప్రభావాలతో ΄ాటు ప్రతికూల ప్రభావాలను చర్చించే 76,000 పరిశోధన పత్రాల్లో నుంచి 1,450ని ఎంపిక చేసి అధ్యయనం చేయటం విశేషం. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్ సెల్స్ రి΄ోర్ట్ సస్టయినబిలిటీలో ప్రచురితమయ్యాయి.అర్బన్ అగ్రికల్చర్.. అంటే? నగరాలు, నగరాల పరిసరప్రాంతాల్లో ఇళ్లపైన, ఖాళీ స్థలాల్లో చేపట్టే వ్యవసాయ కార్యకలా΄ాలనే అర్బన్ అగ్రికల్చర్గా చెప్పచ్చు. నగర, పట్టణప్రాంతాల్లో ఇంటిపంటలు, మిద్దె తోటలు, పెరటి తోటలు, పశుపోషణ, పాడి పరిశ్రమలు. కోళ్లు, చేపల పెంపకం.. వంటి కార్యకలా΄ాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. 17 ఎస్.డి.జి.లన్నిటితోనూ అర్బన్ అగ్రికల్చర్కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంది. నాణానికి అవతలి వైపు..అర్బన్ అగ్రికల్చర్ వల్ల అభివృద్ధి లక్ష్యాల సాధనకు అంతా మేలే జరుగుతుందని చెప్పలేమని, చెడు కూడా జరుగుతోందని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ స్పష్టం చేశారు. ‘అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తోంది. అయితే, ప్రతికూల ప్రభావాన్ని బాగా తగ్గించే అర్బన్ అగ్రికల్చర్ పద్ధతులను ΄ాటించగలిగినప్పుడే దాని ద్వారా ప్రయోజనాలు ఒనగూడతాయి. ఐరాస 2024 ఫ్యూచర్ సమ్మిట్ లక్ష్యాల సాధనకు అర్బన్ అగ్రికల్చర్ దోహదపడేదైనప్పటికీ మరో కోణాన్ని కూడా ఆవిష్కరించటం కోసం ఈ అధ్యయనం చేశాం’ అన్నారాయన. వుహాన్ యూనివర్సిటీ (చైనా) అసోసియేట్ రిసెర్చ్ ప్రోఫెసర్ యుయాన్ఛావ్ హు మాట్లాడుతూ ‘ఎస్.డి.జి.ల సాధన కృషికి అర్బన్ అగ్రికల్చర్ ఎంతగానో దోహదం చేస్తుంది. అయితే, విభిన్న ప్రదేశాల్లో ఈ కార్యకలా΄ాల వల్ల ఎదురయ్యే సవాళ్లను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధిగమించటం ముఖ్యం’ అన్నారు. అర్బన్ అగ్రికల్చర్ కార్యకలాపాలలో సుస్థిరతకు దోహదం చేసే పద్ధతులను అనుసరించటం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా నగరాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. ‘అర్బన్ అగ్రికల్చర్ వల్ల చేకూరే అనుకూల, ప్రతికూల ప్రభావాల గురించి అందుబాటులో ఉన్న సైంటిఫిక్ లిటరేచర్ను విశ్లేషించడానికి మా అధ్యయనం ద్వారా కృషి చేశాం. మొత్తంగా చూసినప్పుడు అర్బన్ అగ్రికల్చర్ వల్ల ఆహారం, విద్య, సాంఘిక సదుపాయాలను కల్పించటంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపోందించేందుకు సుస్థిరత ఎలా చేకూరుతుందో శాస్త్రబద్ధంగా ఈ అధ్యయనం రుజువులు చూపింది’ అని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ వివరించారు. తాజా పోషకాహారం లభ్యతపోషకాలతో కూడిన తాజా ఆహారోత్పత్తులను స్థానికంగానే అందుబాటులోకి తేవటం.. దూరప్రాంతాల నుంచి ఆహారాన్ని తరలించాల్సిన అవసరాన్ని తగ్గించటం.. ఆహారోత్పత్తుల్ని వందల కిలోమీటర్ల నుంచి తీసుకురావటానికి ఖర్చయ్యే ఇంధనాన్ని ఆదా చేయటం ద్వారా కాలుష్యాన్ని(ఫుడ్ మైల్స్ను) తగ్గించటం.. వివిధ సామాజిక వర్గాల ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెం΄÷ందించటం.. మానసిక ఆరోగ్యాన్ని పెం΄÷ందించటం వంటివి అర్బన్ అగ్రికల్చర్ ప్రయోజనాలని ఈ అధ్యయనం తేల్చింది. బీజింగ్ ఫారెస్ట్ యూనివర్సిటీ (చైనా) పరిశోధక విద్యార్థి దయ రాజ్ సుదేబ్ ఇలా అన్నారు:‘అవకాశాలను ఉపయోగించుకునేలా ప్రజలు, సంస్థలు, ప్రభుత్వాలు అర్బన్ అగ్రికల్చర్ పద్ధతుల్లో సుస్థిర లక్ష్యాల సాధన దిశగా పరివర్తన తేవాలి..’ప్రతిబంధకాలుశుద్ధమైన, చవక ఇంధనం లభ్యతకు సంబంధించి 3,6,7 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, జలచరాల జీవన భద్రతకు సంబంధించి 11,12,14,16 ఎస్.డి.జి.లకు సంబంధించి అర్బన్ అగ్రికల్చర్ ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. నీరు, ఇంధనం, ఎరువులు, పురుగుమందుల అధిక వాడకం వల్ల నేల, నీరు కలుషితం కావటం.. వనరులు ఉన్న వారికే ప్రయోజనాలను పరిమితం చేయటం ద్వారా పేదలకు ఫలితాలను అందించలేని పరిస్థితులు నెలకొనటం వంటి ప్రతిబంధనాలు అర్బన్ అగ్రికల్చర్కు ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ఈ సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడానికి చర్యలు తీసుకుంటే అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందనటంలో సందేహం లేదు. -
జీవితాలను పండించుకుంటున్నారు! సలాం!
ప్రస్తుతం వ్యవసాయంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయనాల వల్ల పంటలు కలుషితమవడంతో పాటు మట్టిలో సూక్ష్మజీవులు నశించి΄ోతున్నాయి. పర్యావరణానికి హాని కలగటమే కాకుండా మానవాళి అనారోగ్యానికి ఆహారంలోని రసాయనాల అవశేషాలు కారమణవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నరసరావు పేటకు చెందిన మహిళా రైతులు కొందరు ఈ ముప్పును గుర్తించారు. విషపూరిత ఆహార పదార్థాల నుంచి కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ప్రకృతి సాగుకు నడుం బిగించారు. ఒకవైపు భూసారాన్ని పెంచుతూ మరోవైపు అధిక దిగుబడులు సాధిస్తూ తమ జీవితాలను పండించుకుంటున్నారు.ప్రకృతి వ్యవసాయ విభాగం మహిళలకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీల) ద్వారా మహిళా రైతులను గుర్తించి గ్రామాల వారీగా అవగాహన కల్పించి, ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు ప్రకృతి సేద్యమే ఏకైక మార్గమని నమ్ముతున్న మహిళా రైతులు ఇప్పుడిప్పుడే ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. మహిళా సంఘాల్లోని ప్రతి మహిళా కనీసం తన ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలనైనా పెరటి తోటల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించుకునే విధంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిపుణులు, అధికారుల కృషి ఫలిస్తోంది. గత నాలుగేళ్లలో జిల్లాలో ప్రకృతి సాగు అంచనాకు మించి విస్తరించింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని కూడా వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాల (ఆర్బికెల) పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో సిబ్బంది ఆర్బీకేల్లోనే రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయానికి వాడే ఉత్పాదకాలను స్వయంగా రైతులే పొలం దగ్గర తయారు చేసుకొని వాడాలని, బయట కొనకూడదన్నది ఒక నియమం. అయితే, నాటు ఆవు లేక, ఉన్నా వాటిని తయారు చేసుకునే ఓపిక, తీరిక లేని వారు ప్రకృతి సాగుపై ఆసక్తి ఉన్నా ముందడుగు వేయలేక΄ోతున్నారు. అటువంటి వారి కోసం ఒక్కో మండలంలో ఐదు నుంచి పది వరకు ఎన్పీఎం (నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్) షాపులను ప్రకృతి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతుల ఉత్పత్తులను మార్క్ఫెడ్ ద్వారా 10 నుంచి 15 శాతం అధిక మద్దతు ధర చెల్లించేలా ప్రకృతి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. అ మేరకు రైతులతో ముందస్తుగా ఒప్పందం చేసుకొని ఉత్పత్తులను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా పండించిన ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. వినియోగదారులే రైతుల వద్దకు వచ్చి అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీనితోపాటు.. టీటీడీతోపాటు మరో 11 ప్రధాన దేవస్థానాలు మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ దిగుబడులు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు లభిస్తోంది. – పుట్లూరి శివకోటిరెడ్డి, సాక్షి, నరసరావుపేట రూరల్ ఉద్యమంగా ప్రకృతి వ్యవసాయంప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నైవేద్యాల తయారీకి వాడేందుకు టీటీడీతో ΄ాటు మరో 11 దేవస్థానాలు మూడేళ్లుగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు. సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నాం. – కె.అమలకుమారి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, నరసరావుపేట పెట్టుబడి తక్కువ.. ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో మెట్ట పంటలు సాగు చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తగ్గింది. దిగుబడి బాగుంది. ఈ ఉత్పత్తులకు అధిక ధర వస్తుండటంతో లాభదాయకంగా ఉంది. – శివలక్ష్మి, మహిళా రైతు, ఏనుగు΄ాలెం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లాదిగుబడి బాగుంది.. మా రెండు ఎకరాల్లో పంట సాగు చేసేందుకు గతంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయాం. కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో వరి పంటను పండిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించారు. ఖర్చులు తగ్గాయి. దిగుబడులు పెరిగాయి. – లక్ష్మీదుర్గ, మహిళా రైతు, కారుమంచి, శావల్యాపురం మండలం ఇదీ చదవండి: తాతల నాటి నత్త మాంసం కూర తిన్నారా? అనేక రోగాలకు మందు! -
గాక్’ ఫ్రూట్.. ద గ్రేట్! అత్యంత ఖరీదైన పండు, లాభాలు మెండు
గాక్ ఫ్రూట్.. అత్యంత ఖరీదైన పండు. మనకు కొత్త పంట. కానీ, అనేక దక్షిణాసియా దేశాల్లో విరివిగా సాగవుతున్నది. ఎన్నెన్నో ΄ోషకాలు, ఔషధ గుణాల గని ఈ అద్భుత పండు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమకు కూడా ఎంతో ఉపయుక్తమైన పండ్ల జాతి గాక్. కేరళ, కర్ణాటకలో అతికొద్ది మంది ఇంటిపంటగా సాగు చేస్తున్న ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటగా ఏలూరు జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి పెరట్లో సాగు చేస్తూ.. కిలో రూ. 500కు విక్రయిస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంటిపంటగా, వాణిజ్య పంటగా సాగు చేసుకోదగిన ఈ కొత్త పంటపై ప్రత్యేక కథనం. బొరగం వెంకట్ బీటెక్ చదువుకొని పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇంతవరకే అయితే పెద్ద విశేషం ఏమీ లేదు. ఏదైనా మంచి కొత్త పంటను మన ప్రజలకు పరిచయం చేయాలన్న తపనతో ఇంటర్నెట్ సహాయంతో లక్షణమైన గాక్ ఫ్రూట్ను సాగు చేయనారంభించారు. వెంకట్ స్వస్థలం ఏలూరు జిల్లా పోలవరం మండలం లోని మామిడిగొంది గ్రామం. గాక్ ఫ్రూట్ను కేరళలో కొందరు సాగు చేస్తుండటాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న వెంకట్, మొక్కలు తెప్పించి తన ఇంటి పెరట్లో 2023 నవంబర్ నెలలో నాటారు. సుమారు 300 మొక్కల్ని నాటి, పందిరి పైకి పాకించారు. ఇందులో కొన్ని ఆడ, మగ మొక్కలు కలిసి ఉన్నాయి. చాలా ఏళ్లపాటు పండ్ల దిగుబడిని ఇవ్వటంతోపాటు.. ఏడాది పొడవునా పండ్లను అందించే అద్భుత తీగజాతి పంట ఇది. అవగాహన లోపం వల్ల మొక్కల్ని దగ్గరగా నాటటం వల్ల కొన్ని మొక్కలు చనిపోయాయని, ప్రస్తుతం 120 మొక్కలు మాత్రమే బతికి ఉన్నాయని వెంకట్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. రెండు నెలల క్రితం నుంచి చక్కని ఎర్రటి పండ్ల దిగుబడి తీసుకుంటున్నానని, ఎంతో ఆరోగ్యకరమైన ఈ పండ్లకు చాలా గిరాకీ ఉందని వెంకట్ తెలి΄ారు. గాక్ ఫ్రూట్ సాగు గురించి తెలుసుకున్న ప్రజలు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కిలో పండ్లకు రూ. 500 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని సంతోషంగా చెప్పారు. ఒక్కో పండు అరకేజీ వరకు బరువు పెరుగుతోంది. ప్రతి రెండు ఆడ మొక్కల పక్కన ఒక మగ మొక్కను నాటుకోవాలని, 6“6 అడుగుల దూరంలో నాటుకొని పందిరి వేస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల పాటు ఏడాది పొడవునా నిరంత రాయంగా పండ్ల దిగుబడి వస్తూ ఉంటుందన్నారు. దీని తీగలు ఎంత విస్తారంగా పెరిగే వీలుంటే అన్ని ఎక్కువ పండ్ల దిగుబడి వస్తుందని తన అనుభవంలో తెలుసుకున్నానన్నారు. ఆకాకర జాతికి చెందిన గాక్ ఫ్రూట్ పైన కూడా నూగు ఉంటుంది. లోపల గుజ్జుతో ΄ాటు గింజలు ఎక్కువగానే ఉంటాయి. గింజల్ని తీసేసి గుజ్జును జ్యూస్ చేసుకొని తాగితే పోషకాల లోపం తగ్గి΄ోతుందని, జబ్బులు సైతం తగ్గుతాయని ఆయన చెబుతున్నారు. గాక్ ఫ్రూట్ పూలకు కృత్రిమంగా చేతులతో పరపరాగ సంపర్కం చేస్తే అధిక పండ్ల దిగుబడి వస్తుందని, సహజంగా జరిగితే సగం దిగుబడి మాత్రమే వస్తుందని వెంకట్ వివరించారు. గాక్ ఫ్రూట్ పువ్వు రెండు నెలల్లో పిందె నుంచి పండు దశకు పెరుగుతుంది. రంగులు మారుతుంది. పిందె పడిన తొలి నెలలో ఆకు పచ్చగా ఉంటుంది. ఈ దశలో ఈ కాయలను గోకాకర మాదిరిగానే కూరవండుకొని తినొచ్చు. దోస కాయ మాదిరి రుచి ఉంటుందన్నారు. రెండో నెలలో మొదటి పది రోజుల్లో పసుపు పచ్చ రంగుకు మారుతుంది. 20 రోజులకు నారింజ రంగులోకి మారి, 30 రోజులకు ఎర్రగా మారుతుంది. పండు పండిన తర్వాత త్వరగా మెత్తబడి పోతుందని వెంకట్ వివరిస్తున్నారు. విత్తనాలు నల్లగా ఉంటాయి. యూట్యూబ్ ద్వారా వెంకట్ దగ్గర ఈ కొత్త పంట సాగవుతున్నట్లు తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ స్పందించి ఉద్యాన శాఖ అధికారులను పంపారు. పండ్లతో పాటు కొన్ని మొక్కలను తెప్పించి ప్రయోగాత్మకంగా సాగు చేయించటం ప్రారంభించారు. గాక్ ఫ్రూట్ పోషక విలువలతో కూడిన పంటని, దీన్ని సులువుగా తీగ ముక్కలను కత్తిరించి నాటుకోవచ్చని వెంకట్ ఇంటిపంటను పరిశీలించిన ఉద్యానాధికారి సందీప్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు. ఇది చీడపీడలు ఆశించని పంటని, సాగు చేయటం కూడా సులువేనని అన్నారు. ఇద్దరు రైతులతో తాము ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నామన్నారు. వియత్నాం, చైనా, థాయ్లాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో చిరకాలంగా సాగులో ఉన్న గాక్ ఫ్రూట్ను అనాదిగా సందప్రదాయ వైద్యంలో విస్తృతంగా వినియోగిస్తున్నారని యూనివర్సిటీ సైన్స్ మలేషియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లైకోపెన్, బీటా కెరోటిన్, ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు అత్యధిక మోతాదులో కలిగి ఉండటం వల్ల కేన్సర్, అల్సర్లు, కంటి సమస్యలు తదితర జబ్బుల్ని నయం చేసే విశేష ఔషధ గుణాలు గాక్ ఫ్రూట్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా జర్నల్ ఆఫ్ క్రాప్సైన్స్లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీ పరిశ్రమలకు గాక్ ఫ్రూట్ ముడిసరుకుగా ఉపయోగపడుతున్నందున వాణిజ్యపరమైన విలువ కలిగి ఉండటం మరో విశేషం. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్కిలో రూ. 500కు అమ్ముతున్నామన ప్రాంతానికి ఓ మంచి కొత్త పంటను పరిచయం చేయాలనే తపన నాకుండేది. ఇంటర్నెట్లో గాలిస్తుండగా గాక్ ఫ్రూట్ గురించి తెలిసింది. కేరళలో ఒకరి దగ్గరి నుంచి మొక్కలు తెప్పించి నాటా. 20 సెంట్ల నా పెరటి తోటలో గాక్ ఫ్రూట్స్ వారానికి 10–15 కిలోల వరకు పండుతున్నాయి. కూరకు ఉపయోగపడే పచ్చి గాక్ కాయలను కిలో రూ. 300కు అమ్ముతున్నా. కేరళలో కిలో రూ. 1,000 – 1,500 వరకు అమ్ముతున్నారు. గ్యాస్ ఫ్రూట్ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంపొదించటంతో పాటు.. షుగర్, కేన్సర్ వంటి జబ్బుల్ని కూడా నయం చేస్తుంది. హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల వాళ్లు ముందే బుక్ చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. మొక్కలు కావాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. – బోరగం వెంకట్ (77999 11174), గాక్ ఫ్రూట్ సాగుదారు, మామిడిగొంది, పోలవరం మండలం, ఏలూరు జిల్లా -
ముళ్లు లేని బ్రహ్మజెముడుతో బయోగ్యాస్!
ముళ్లు లేని బ్రహ్మజెముడు (స్పైన్ లెస్ కాక్టస్) పంటను కరువు ప్రాంతాల్లో ఎండా కాలంలోనూ పశుగ్రాసం కోసం సాగు చేయవచ్చన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల శాస్త్రవేత్తలు దీనితో బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నారు. ముళ్లు లేని బ్రహ్మజెముడు మొక్కల్ని తీవ్ర కరువు పరిస్థితుల్లో.. నిస్సారమై వ్యవసాయానికి పనికిరాని భూముల్లో (మన దేశంలో వ్యవసాయ భూమిలో 40శాతం ఇప్పటికే నిస్సారమై సాగు యోగ్యం కాకుండా΄ోయిందని అంచనా) కూడా సాగు చేయొచ్చు. ఇప్పటికే కొందరు రైతులు ఈ దిశగా అడుగులు వేశారు కూడా. అయితే, బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రస్తుతం వాడుతున్న పశువుల పేడకు బదులు పాక్షికంగా బ్రహ్మజెముడు మొక్కల్ని వాడొచ్చని తాజాగా రుజువైంది. బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియను ఈ ఆవిష్కరణ కొత్తపుంతలు తొక్కిస్తుందని ఆశిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఇండియన్ గ్రాస్ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బ్రహ్మజెముడుతో బయోగ్యాస్పై పరిశోధన జరుగుతోంది. కరువు ప్రాంతం బుందేల్ఖండ్లో బయోగ్యాస్ ఉత్పత్తిని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం పశువుల పేడతో బయోగ్యాస్ ద్వారా 65% బయోమీథేన్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియలో పేడపై ఆధారపడటం తగ్గించి బ్రహ్మజెముడును వాడుతున్నారు. (కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!)ఇండియన్ గ్రాస్ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ ది డ్రై ఏరియాస్ ఉమ్మడిగా ఝాన్సీలో పరిశోధనలు చేపట్టాయి. ముళ్లు లేని బ్రహ్మజెముడు మొక్క ఆకులను పశుగ్రాసంగా, çపర్యావరణహితమైన తోలు ఉత్పత్తులకు ముడిసరుకుగా, బయోగ్యాస్ ఉత్పత్తితో ఇంధనంగా, బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే బ్రహ్మజెముడు స్లర్రీని సేంద్రియ ఎరువుగా, ఈ చెట్టు పండ్లు ఆహారంగా ఉపయోగ పడుతున్నాయి. ఈ పండ్లను అనేక దేశాల్లో ప్రజలు డ్రాగన్ ఫ్రూట్ మాదిరిగా ఇష్టంగా తింటారు. బ్రహ్మజెముడు ఆకుల గుజ్జుతో పాటు కొంతమేరకు పేడను కలిపి చేసిన బయోగ్యాస్ ప్రయోగాత్మక ఉత్పత్తిలో 61% వరకు మీథేన్ కంటెంట్ను సాధించడం విశేషం. దీంతో ఇది వాణిజ్యపరంగా లాభదాయకమైనదేనని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రిప్ ద్వారా నీటిని అందించటం, ఎరువుల వాడకం ద్వారా ముళ్లు లేని బ్రహ్మజెముడు పంట ఉత్పాదకతను పెంచే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఒక్కో బ్రహ్మజెముడు మొక్క ఏడాదికి 69 కిలోల బొగ్గుపులుసు వాయువును గ్రహిస్తుందట. రైతులకు కార్బన్ క్రెడిట్స్ ద్వారా అదనపు ఆదాయం కూడా చేకూరుతుంది. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)ఇదీ చదవండి : గాక్’ ఫ్రూట్.. ద గ్రేట్! అత్యంత ఖరీదైన పండు, లాభాలు మెండు -
Sagubadi: ‘ఐ గ్రో యువర్ ఫుడ్’.. ఉద్యమం!
అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ ఉద్యమ సంస్థల సమాఖ్య (ఐ.ఎఫ్.ఓ.ఎ.ఎం. –ఐఫోమ్) పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు ఈ నెల 10వ తేదీన ‘ఐ గ్రో యువర్ ఫుడ్’ పేరిట వినూత్న ప్రచారోద్యమాన్ని చేపట్టారు. ప్రజల కోసం రసాయనాల్లేకుండా ఆరోగ్యదాయకంగా చేపట్టిన సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్ తీరుతెన్నులు.. సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి ప్రజలు చేయగల సహాయం ఏమిటి? వంటి అంశాలపై తమ అభి్రపాయాలతో కూడిన వీడియోలను సేంద్రియ రైతులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.ఐగ్రోయువర్ఫుడ్.. బయో పేరిట ఏర్పాటైన ప్రత్యేక వెబ్సైట్లో, ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్కు చెందిన వెబ్సైట్/ఎక్స్/యూట్యూబ్/ఇన్స్టా తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రపంచ దేశాల సేంద్రియ రైతుల షార్ట్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చూసిన ప్రజలు/వినియోగదారులు తమ అభి్రపాయాలను, సూచనలను పంచుకోవడానికి వీలుంది.ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ 1972లో ఫ్రాన్స్లో ప్రారంభమైంది. వంద దేశాల్లోని సుమారు 700 సేంద్రియ వ్యవసాయ సంస్థలకు ఇప్పుడు ఐఫోమ్ సభ్యత్వం ఉంది. ఆరోగ్యం, పర్యావరణం, న్యాయం, శ్రద్ధ అనే నాలుగు మూల సూత్రాలపై ఆధారపడి సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింపజేయటమే ఐఫోమ్ తన లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రియ వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించటంతో పాటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజన్సీలకు అక్రెడిటేషన్ ఇస్తుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఆహారోత్పత్తి చేసి ప్రజలకు అందిస్తున్న రైతుల్లో 80% మంది చిన్న, సన్నకారు రైతులేనని ఐఫోమ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో 90% క్షేత్రాలు ఒంటరి రైతులు లేదా రైతు కుటుంబాలే నడుపుతున్నారు. సంస్థలు/కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ క్షేత్రాలు మిగతా పది శాతం మాత్రమే. https://igrowyourfood.bio/కేరళలో కౌలు సేద్యం చేస్తున్నా..!నా పేరు షమికా మోనే, మహారాష్ట్రలో పుట్టా. పరిశోధనలు వదలి పెట్టి సేంద్రియ రైతుగా మారా. కేరళలో భూమిని కౌలుకు తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. అనేక రకాల దేశీ వరితో పాటు కూరగాయలు పండిస్తున్నా. పంట విత్తిన దగ్గర నుంచి నూర్పిడి,ప్రాసెసింగ్ వంటి పనులు సాధ్యమైనంత వరకు నేనే చేసుకోవటం అద్భుతమైన అనుభవం. నేను పండించిన ఆహారోత్పత్తుల్ని తింటున్న స్నేహితులు, బంధువులు చాలా సంతోషంగా ఉన్నారు. సీజన్కు ముందే డబ్బు పెట్టుబడిగా ఇస్తారు. పంటలు పండించిన తర్వాత.. తమకు అవసరమైన ఆహారోత్పత్తుల్ని తీసుకుంటున్నారు. దేశీ వరి బియ్యం, అటుకులతో చేసిన స్థానిక సంప్రదాయ వంటకాలను పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ‘ఐగ్రోయువర్ఫుడ్’ ఉద్యమంలో భాగస్వామిని కావటం సంతోషంగా ఉంది.– షమిక మోనె, సేంద్రియ యువ మహిళా రైతు, కేరళ -
Sagubadi: ప్రకృతి సేద్యం.. బతికించింది!
దేవేంద్ర మాటలు అనంతపురం జిల్లాకు చెందిన లక్షలాది మంది రైతుల కష్టాలను ప్రతిబింబిస్తాయి. ప్రపంచంలోని ఇతర కరువు పీడిత ్రపాంతాల మాదిరిగానే ఇక్కడ వ్యవసాయం ఒక సవాలు. గత ఏడాది కరువుకు అధిక ఉష్ణోగ్రతలు తోడు కావటంతో ఎండుతున్న చీనీ తోటలు.. పంట నష్టాల మధ్య.. ఈ విద్యాధిక యువ రైతుది ఓ ఆశావహమైన కథ.‘నా పేరు పొత్తూరు దేవేంద్ర. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చిన్నమల్లేపల్లి గ్రామం. గత ఏడాది లోటు వర్షపాతంతో మా ్రపాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మాకు 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. మా నాన్న చిన్న వెంకట స్వామి 30 ఏళ్లు సంప్రదాయ రసాయన వ్యవసాయం చేశారు. ఆ రోజుల్లో కుటుంబ ఖర్చులకూ కనా కష్టంగా ఉండేది. ఎమ్మే చదివాను. గత 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను.నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. విత్తనాలు వేయటం నుంచి పంట నూర్పిడి వరకు ప్రతి పనినీ మనసు పెట్టి చేస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు మా కుటుంబం ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉంది. అంతేకాదు, వ్యవసాయ పనులను మరింత నైపుణ్యంతో చేయటం నేర్చుకున్నారు. మాకున్న 2.5 ఎకరాల్లో ఒక ఎకరంలో చీనీ(బత్తాయి) తోట ఉంది. నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, గత ఏడాది జూలై 31న అలసంద, పొద చిక్కుడు, సజ్జలు, కందులు, ఆముదం విత్తనాలను గుళికలుగా మార్చి.. వానకు ముందే విత్తే (పిఎండిఎస్) పద్ధతిలో విత్తాను.ప్రూనింగ్ చేసి ఘనజీవామృతం వేస్తున్న రైతుఅప్పటి నుంచి 13 నెలలుగా చీనీ చెట్ల మధ్యలో భూమిని ఒక్కసారి కూడా దున్నలేదు. కానీ, మట్టిలో బెజ్జాలు చేసి చేతులతో విత్తనాలు వేస్తూ.. ఏడాది పొడవునా కాలానుగుణమైన అంతర పంటలు పండిస్తూనే ఉన్నాం. ఇలా ఏడాది పొడవునా పంటలతో పొలాన్ని ఆకుపచ్చగా కప్పి ఉంచుతున్నాం. పడిన కొద్దిపాటి వర్షంతోనో లేదా కొద్దిపాటి నీటి తడి ద్వారానో మట్టిలో తేమను నిలుపుకుంటున్నాం. చీనీ చెట్లకు, అంతర పంటలకు అవసరమైన విధంగా నిరంతరాయంగా తేమ అందుతున్నట్లు పచ్చని పొలాన్ని చూస్తే నిర్ధారణ అవుతోంది. గత వేసవిలో అతి వేడి పరిస్థితుల్లో కూడా నేలలో తగినంత తేమ ఉంది. గడ్డీ గాదం, పంట అవశేషాలతో నేలను కప్పి ఉంచటం కూడా తోటను పచ్చగా ఉంచడంలో సహాయపడుతోంది. వీటన్నింటితో కరువు పరిస్థితులను అధిగమిస్తున్నా.నాలుగేళ్లలో ఎంతో మార్పు..ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ఈ నాలుగేళ్లలో మా పొలం మట్టిలో, చీనీ చెట్లలో అనేక మార్పులను గమనించాను. వానపాములు, సూక్ష్మజీవులు పనిచేయటం వల్ల మట్టిలో జీవవైవిధ్యం పెరిగింది. అందుకు రుణపడి ఉన్నాం. మొక్కలు నేల నుంచి పోషకాలను తీసుకోవడం మెరుగుపడింది. ఫలితంగా చీనీ చెట్లలో ఎటువంటి సూక్ష్మధాతు లోపాలు లేవు. మంచి నాణ్యమైన పండ్ల దిగుబడి వచ్చింది. మా నాన్న రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేస్తూ వ్యవసాయం చేసినప్పుడు పరిస్థితి ఇలా లేదు. గత ఏడాది అధిక ఎండలకు మా పొలానికి దగ్గర్లోని తోటల్లో కూడా చీనీ చెట్లు ఎండిపోయాయి. రైతులు చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో రసాయనాలను స్ప్రే చేశారు. కానీ చీనీ చెట్లను రక్షించుకోలేకపోయారు.ఎపిసిఎన్ఎఫ్ చీఫ్ టెక్నాలజీ– ఇన్నోవేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ్రపాజెక్ట్ మేనేజర్ లక్ష్మా నాయక్ చనిపోతున్న చీనీ చెట్లను ఎలా రక్షించుకోవాలో మాకు నేర్పించారు. ఆయన చెప్పినట్లు.. 50 శాతం ఎండిన చెట్ల కొమ్మలను నేల నుంచి 2 అడుగుల ఎత్తులో కత్తిరించి, మోళ్లకు తడి ఘన జీవామృతం పూసి, ద్రవజీవామృతం పిచికారీ చేశాం. ఆ తర్వాత చెట్టు చుట్టూ 2 అడుగుల వెడల్పున పాది చేసి, ఘనజీవామృతాన్ని వేసి, అనేక పంటల విత్తనాలు చల్లి, దానిపైన మట్టి వేశాం.కాయలతో కళకళలాడుతున్న చీనీ చెట్లుఇటువంటి పద్ధతులతో మట్టిలో సూక్ష్మజీవుల కార్యకలాపాల ఫలితంగా చనిపోతున్న చెట్లు కూడా బతికాయి. 20–25 రోజుల్లో కొత్త చిగుర్లు వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ చెట్లు పునరుజ్జీవం పొందాయి. మృత్యువాత పడుతున్న చీనీ చెట్లను కాపాడుకోగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వెనుక ఉన్న సై¯Œ ్సను అర్థం చేసుకొని ఆశ్చర్యపోయాను. రసాయనిక వ్యవసాయం చేసిన రోజుల్లో అనేక మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాం. వైద్యం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించిన తర్వాత పరిస్థితి మారింది. నా పొలంలో 365 రోజులు కాలానుగుణమైన కూరగాయలు, ఇతర ఆహార పంటలను అంతర పంటలుగా పండించడం ్రపారంభించాను. బయటి నుంచి ఏదైనా ఆహారాన్ని కొనుగోలు చేయడం మానేశాను. మనం ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నది తినడం వల్ల, హాస్పిటల్ ఖర్చులు, మీరు నమ్ముతారో లేదో గాని, దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి.ఎకరంలో 10 టన్నుల బత్తాయిలు..ఎనీ టైమ్ మనీ (ఏటీఎం) మోడల్తో పాటు ఏ–గ్రేడ్ మోడల్లో కూడా పంటలు సాగు చేస్తున్నాం. మా కూరగాయలు, తదితర పంటలను ఇంట్లో వాడుకోగా, అదనంగా వీటి ద్వారా ప్రతి నెలా రూ. 4–5 వేల వరకు ఆదాయం వస్తోంది. కుటుంబం ఖర్చులు తీరుతున్నాయి. ఈ ఒక ఎకరం చీనీ తోట నుండి ప్రతి సంవత్సరం సగటున 10 టన్నుల బత్తాయిలు పండిస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా, మేం టన్ను బత్తాయి పండ్లను సగటున రూ. 30–33 వేలకు అమ్ముతున్నాం. ఏటా కనీసం రూ. 3 లక్షల ఆదాయం బత్తాయిల ద్వారా వస్తోంది. ఇక చెట్ల మధ్యలో సాగు చేసే బొబ్బర్లు, పొద అనప, కంది, సజ్జ, ఆముదం పంటలతో పాటు సూపర్ నేపియర్ గడ్డి ద్వారా వచ్చే ఆదాయం కలిపితే మొత్తం రూ. 4 నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది..’ – దేవేంద్ర, మొబైల్: 79976 44711గేదెలకూ ఇతర జంతువుల మాదిరిగానే కంటి శుక్లం సమస్య వస్తుంటుంది. కంటి కటకం తెల్లగా మారడం వల్ల దృష్టి లో΄ానికి లేదా అంధత్వానికి దారితీస్తుంది. గేదె కన్ను తెల్లగా మారినా, వాపు ఉన్నా.. కళ్ళు కనపడక వస్తువుల్ని ఢీ కొట్టడం వంటి లక్షణాలను బట్టి శుక్లం వచ్చినట్లు భావించాలి..కారణాలు..– వయస్సు: ముసలి గేదెలకు కంటిశుక్లం వచ్చే అవకాశం ఎక్కువ.– జన్యువులు: వారసత్వంగా వచ్చిన జన్యు కారణాల వల్ల కొన్ని గేదెల్లో కంటిశుక్లం రావచ్చు.– ΄ోషకాహార లోపం: విటమిన్ ఎ వంటి ముఖ్యమైన ΄ోషకాలు లోపించటం వల్ల కంటిశుక్లం ఏర్పడుతుంది.– అంటువ్యాధులు: కొన్ని అంటువ్యాధులు, ముఖ్యంగా కంటిని ప్రభావితం చేసేవి, కంటిశుక్లాలకు కారణమవుతాయి.– గాయం: గాయం వల్ల కంటి కటకాలు దెబ్బతిని శుక్లాలకు దారితీస్తుంది.– రసాయనాలు: కొన్ని రసాయనాలు/ విషతుల్య పదార్థాలు తగలటం వల్ల కంటిశుక్లం ఏర్పడవచ్చు.హోమియోపతి చికిత్స యుఫ్రేసియ– క్యు: కంటిలో 3 చుక్కలు.. రోజుకు 3 సార్లు.. 10 రోజులు వేయాలి.యుఫ్రేసియ 200: 10 మాత్రలు.. రోజుకు 2 సార్లు.. 10 రోజులు వేయాలి. 5 రోజుల్లోనే పూర్తిగా ఫలితం కనపడుతుంది.– డా. జి. రాంబాబు (94945 88885), పశువైద్యాధికారి, కడప -
డ్రాగన్ పౌడర్ టెక్నాలజీ రెడీ!
అధికంగా యాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థం, ఇంకా ఇతర పోషకాలతో కూడిన డ్రాగన్ ఫ్రూట్ ఇటీవల కాలంలో సూపర్ ఫ్రూట్గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రారంభమైన 5–7 ఏళ్లలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పాటు మరో 9 రాష్ట్రాలకు డ్రాగన్ సాగు విస్తరించింది. పింక్/రెడ్, వైట్ పల్ప్ రకాలు సాగవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు ‘కమలం’ అని పేరుపెట్టింది. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) గత ఏడాది డ్రాగన్ జ్యూస్ ఉత్పత్తి సాంకేతికతను రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా, రెడ్/పింక్ డ్రాగన్ ఫ్రూట్తో పౌడర్ (పిండి)ని తయారు చేసే టెక్నాలజీని రూపొందించింది. కర్ణాటకలోని కొడగు జిల్లా చెట్టల్లిలోని ఐఐహెచ్ఆర్కు చెందిన కేంద్రీయ ఉద్యాన పంటల ప్రయోగ కేంద్రం ఈ టెక్నాలజీ అభివృద్ధికి వేదికైంది.డ్రాగన్ పండ్లతో పిండిగా మార్చే ప్రక్రియలో రెండు పద్ధతులున్నాయి. స్ప్రే డ్రైడ్ పద్ధతిలో తయారైన పిండికి కిలో రూ. 4 వేలు, ఫ్రీజ్ డ్రైడ్ పద్ధతిలో తయారైన పిండికి కిలో రూ.12 – 15 వేల ధర పలుకుతోంది. ఈ రెండు పద్ధతుల్లో పిండిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయాలంటే భారీ పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే, ఇందులో సగం ఖర్చుతోనే డ్రాగన్ పిండిని ఉత్పత్తి చేసే టెక్నాలజీని బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ ఇటీవల రూపొందించింది.మార్కెట్లో ఉన్న డ్రాగన్ పిండి కంటే అత్యంత పోషక విలువలతో ఉండే విధంగా ఈ టెక్నాలజీతో డ్రాగన్ పిండిని తయారు చేయవచ్చని, ఈ పిండిని సహజ రంగు పదార్థంగా అనేకప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల్లో కలపవచ్చని ఐఐహెచ్ఆర్ తెలిపింది. ఐస్క్రీమ్లు, మిల్క్షేక్లు, జ్యూస్లు, కేకులు, బిస్కట్లు, టీ బ్యాగ్స్, మఫిన్స్ తయారీలో డ్రాగన్ పిండిని విస్తృతంగా వాడుతున్నారు. ఐఐహెచ్ఆర్ రూపొందించిన డ్రాగన్ పొడి సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులకు మెరుగైన ఆదాయం తెప్పించేందుకు వాణిజ్య సంస్థలు/ ఎఫ్పిఓలు/ కోఆపరేటివ్లు కృషి చెయ్యాలి. -
Sagubadi: పొద చిక్కుడు పంటతో.. ఏనుగులకు చెక్!
లఏనుగులు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి రాకుండా తిప్పికొట్టేందుకు కేరళవాసులు రెండు పద్ధతులను అవలంభిస్తున్నారు. మొదటిది: తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెలు నిర్మించటం. రెండోది: ప్రత్యేక వాసనను వెదజల్లే దేశవాళీ పొద చిక్కుడు పంటను సరిహద్దు పంటగా సాగు చేయటం. మొదటి పద్ధతి కన్నా రెండో పద్ధతి ఎక్కువ ప్రభావశీలంగా పని చేస్తోందని రైతులు చెబుతున్నారు.గ్రామ సరిహద్దుల్లో తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెల (బీహైవ్ ఫెన్సెస్)ను ఏర్పాటు చేశారు. ఏనుగులు అడవి నుంచి గ్రామాల వైపు వచ్చే దారిలో ఈ కంచె తీగలను తాకగానే తేనెటీగలు పెద్దపెట్టున శబ్ధం చేస్తూ వాటిని చుట్టుముడతాయి. అవి చేసే శబ్ధం ఏనుగులకు గిట్టదు. అందువల్ల అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకురాలు లూసీ కింగ్ 15 ఏళ్ల క్రితం ఈ పద్ధతిని కనుగొన్నారు. కెన్యా, టాంజానియాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి, తేనెటీగల కంచెలు ఏనుగులను సమర్థవంతంగా బెదరగొట్టగలవని నిర్థారించారు. ఆ తర్వాత కేరళలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న అట్ట΄్పాడి తాలూకాలో అనేక గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులకు ఏనుగుల నుంచి కొంతమేరకు ఉపశమనం దొరికింది.కేరళలో గిరిజనులు మరో సంప్రదాయ పద్ధతిలో కూడా ఏనుగుల సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆట్టుకొంబ అమర (అట్టాప్పడీ డొలిఖోస్ బీన్ లేదా లాబ్లాబ్ బీన్) అనే స్థానిక రకం పొద చిక్కుడు పంటను ఏనుగులు గ్రామాల్లోకి వచ్చే మార్గాల్లో సాగు చేయటం ద్వారా వాటì రాకను సహజ పద్ధతిలో నిరోధించవచ్చని గిరిజన రైతులు గుర్తించారు.అట్టాప్పడీ తాలూకాలోని మూలకొంబు అనే గ్రామవాసి అయిన చింది అనే 65 ఏళ్ల మహిళా రైతు ఏనుగులను నిరోధించేందుకు చెట్టు చిక్కుడును సాగు చేస్తున్నారు. అడవి ఏనుగుల గుంపును తేనెటీగల కంచెలు పూర్తిగా ఆపలేకపోతున్నాయన్నారు. ఆట్టుకోంబ అమర వంటి దేశవాళీ పొద చిక్కుడు పంట ప్రభావం చాలా బాగుందన్నారు. ‘ఈ చిక్కుడు పంటను కంచె పంటగా వేసినప్పటి నుంచి నా పొలం మీద ఏనుగులు దాడి చెయ్యలేదు. అమర చిక్కుళ్లు మంచి ధరకు అమ్ముడు కావటంతో మంచి ఆదాయం కూడా వస్తోంద’ని చింది సంతోషిస్తున్నారు.ఈ చిక్కుడు రకం పంట వెదజల్లే ఒక రకమైన ఘాటు వాసన ఏనుగులు, తదితర వన్య్రపాణులకు గిట్టకపోవటం వల్లనే అవి వెనుదిరిగి వెళ్లి పోతున్నాయని చెబుతున్నారు. ఈ సంగతి శాస్త్రీయంగా ఇంకా రుజువు కానప్పటికీ, ప్రజలకు ఏనుగుల బెడద మాత్రం తీరింది. కేరళలో అనాదిగా సాగవుతున్న ఆట్టుకొంబ అమర చిక్కుళ్లు విలక్షణమైన రకం కావటంతో మూడేళ్ల క్రితం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపు వచ్చింది. దీంతో ‘బయోసర్టిఫికేషన్’ ఉన్న ఈ చిక్కుళ్లకు ఏకంగా కిలోకు రూ. వెయ్యి వరకు ధర పలుకుతుండటం మరో విశేషం. మళయాళంలో ‘ఆట్టు’ అంటే మేక. ‘కొంబు’ అంటే కొమ్ము. కేరళ గిరిజన రైతులు సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ‘మేక కొమ్ము’లతో ఏనుగులను జయిస్తున్నారన్న మాట! -
Sagubadi: వేపతో స్వయం ఉపాధి..
వారంతా వ్యవసాయం చేసుకునే సాధారణ మహిళలు.. కానీ సేంద్రియ ఉత్పత్తులు తయారుచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వృథాగా భూమిలో కలిసి పోయే వేప గింజల నుంచి విలువైన వేప నూనె, వేప పిండిని తయారు చేసి విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి విజయ గాథలోకి వెళదాం...సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గ్ల్ గ్రామంలో సుమారు 15 మంది మహిళలు మూడు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డారు. ఐదుగురికి ఒక్కో యూనిట్ చొప్పున మూడు యూనిట్లు స్థాపించుకున్నారు. మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలోని వివిధప్రాంతాలకు వెళ్లి వేప గింజలను కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటారు. ఇటు వ్యవసాయం చేసుకుంటూనే సమయం దొరికినప్పుడు వేప నూనె, వేప పిండిని తయారు చేస్తున్నారు.ఏటా వేప చెట్లకు కాసే వేప కాయలు పండి రాలిపోతుంటాయి. ఇలా రాలిపోయిన గింజలను ఆయాప్రాంతాల్లోని మహిళలు, గిరిజనులు సేకరిస్తుంటారు. ఇలా సేకరించి తెచ్చిన గింజలకు అంటుకున్న మట్టిని తొలగించి, ఎండబెట్టి ్రపాసెస్ చేస్తుంటారు. క్వింటాలు గింజలకు ఐదు లీటర్ల వరకు వేప నూనె, 70 నుంచి 90 కిలోల వరకు నూనె తీసిన వేప పిండి (కేకు) తయారవుతుంది. గింజల నాణ్యత బాగుంటే నూనె కాస్త ఎక్కువ వస్తుంది. వేప నూనెను వ్యవసాయంలో పంటలపై చీడపీడల నివారణకు పిచికారీ చేస్తుంటారు. ఔషధాల తయారీకి, చర్మవ్యాధుల నివారణకూ వాడుతుంటారు. వేప పిండిని పంటల సాగులో సేంద్రియ ఎరువుగా వినియోగిస్తుంటారు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నారు.దారి చూపిన డీడీఎస్..చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు సాగు చేసే సేంద్రియ రైతులను ప్రోత్సహించే స్వచ్చంద సంస్థ డక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) వీరికి వేప కాయలతో సేంద్రియ ఉత్పత్తుల తయారీ పద్ధతిని నేర్పించింది. సుమారు రెండు దశాబ్దాల క్రితమే వేప గింజల నుంచి నూనె, వేప పిండి తీసే యంత్రాల కొనుగోలు చేసేందుకు రుణ సహాయం అందించింది. ఇప్పుడు ఆ యంత్రాలు పనిచేయడం లేదు. అప్పటి మహిళలకు వయస్సు మీద పడటంతో వారి కోడళ్లు, కూతుళ్లు ఈ యూనిట్లను నడుపుతున్నారు. పాతయంత్రాలు పనిచేయకపోవడంతో కొత్త యంత్రాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం బ్యాంకుల ద్వారా కొంత మొత్తాన్ని రుణంగా పొందారు. ఈ రుణంపై వడ్డీలు పెరిగిపోతుండటం తమకు భారంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ రుణాలను మాఫీ చేసిప్రోత్సహించాలని, లేదంటే కనీసం రుణంపై వడ్డీనైనా మాఫీ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షి, మెదక్ జిల్లా ఫొటోలు: మాతంశెట్టి మల్లన్న, జహీరాబాద్ టౌన్అప్పు భారమైంది..ఇటు వ్యవసాయం పని చేసుకుంటూనే ఏడాదిలో 6నెలల పాటు వేప నూనె, వేప చెక్క (కేక్) తయారు చేస్తున్నాం. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలి. ఎక్కువ ధర వచ్చేలా చూడాలి. ప్రస్తుతం సరైన మార్కెట్ లేకపోవడంతో చేసిన కష్టమంతా వృథా అవుతోంది. బ్యాంకు రుణాలను వడ్డీతో కలిపి చెల్లిస్తే మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకు రుణం రద్దు చేయాలి. కనీసం వడ్డీ అయినా రద్దు చేయాలి. – దవలమ్మ, స్వయం సహాయక బృందం సభ్యురాలుఆర్టీసీ కార్గో ద్వారా పంపుతాం..జడ్చర్ల, కోస్గి వంటిప్రాంతాలకు వెళ్లి వేపగింజలను కొనుగోలు చేసి తెచ్చుకొని వేప నూనె, వేప చెక్క తయారు చేస్తున్నాం. ఇప్పుడు గింజలు దొరకడం కష్టమవుతోంది. ఏడాదిలో ఆరు నెలలు ఈ పనే చేస్తున్నాం. వేప గింజల రేట్లు పెరిగినా వేప నూనె (కిలో రూ.400), వేప చెక్క/కేక్ (కిలో రూ. 35) రేటు పెంచలేదు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు ఇక్కడి వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నాం. – సువర్ణమ్మ (88979 04571), స్వయం సహాయక బృందం సభ్యురాలు -
రైతులకు త్వరగా చేరినప్పుడే కొత్త వంగడాల ప్రయోజనం!
వాతావరణ మార్పుల్ని ధీటుగా తట్టుకునే అధిక పోషకాలతో కూడిన 109 కొత్త వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేశారు. వీటిల్లోని 5 వంగడాలతో అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్)కు సంబంధం ఉంది. ఇక్రిశాట్లో పెరిగిన తల్లి మొక్కల (పేరెంట్ లైన్స్)ను తీసుకొని వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు కొత్త వంగడాలను రూపొందించాయి. ఈ ఐదింటిలో మూడు కంది, జొన్న, సజ్జ వంగడాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు అనువైనవి. ఈ వంగడాల రూపకల్పనలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డా. ప్రకాశ్, డా.గుప్తా, డా. ఇఫ్రీన్ ప్రధానపాత్ర పోషించారని ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త డా.పసుపులేటి జనీల ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఇంతకీ.. ఇప్పుడు విడుదలైన కొత్త విత్తనాలు రైతులకు ఎప్పటికి అందుతాయి? అని ప్రశ్నిస్తే.. ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. కొన్ని పంటల్లో 5 నుంచి 15 ఏళ్లు పడుతోందన్నారు. విత్తన వ్యవస్థలపై శ్రద్ధ కొరవడినందున కొత్త వంగడాలు గ్రామీణ రైతులకు సత్వరమే చేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5 తెగుళ్లను తట్టుకునే సజ్జ హైబ్రిడ్సజ్జ పూసా 1801: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు అనువైన హైబ్రిడ్ ఇది. ఇక్రిశాట్తో కలసి న్యూఢిల్లీలోని ఐఎఆర్ఐ రూపొందించింది. సజ్జల కోసమే కాకుండా, పశుగ్రాసం కోసం కూడా సాగు చేయతగినది. 5 తెగుళ్లను తట్టుకోగలుగుతుంది. అగ్గి తెగులును, వెర్రి తెగులును పూర్తిగా.. తుప్పు తెగులు, స్మట్, ఆర్గాట్ తెగుళ్లను కొంతమేరకు తట్టుకుంటుంది. ఈ రకం సజ్జల్లో ఇనుము (70 పిపిఎం), జింక్ (57 పిపిఎం) ఎక్కువ. హెక్టారుకు 33 క్వింటాళ్ల సజ్జలు, ఎండు చొప్ప హెక్టారుకు 175 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది ప్రకృతి సేద్యానికీ అనువుగా ఉంటుందని డా. జనీల తెలిపారు.కోతకొచ్చినా పచ్చగా ఉండే జొన్నజొన్న ఎస్పిహెచ్ 1943: తెలంగాణకు అనువైన(ఏపీకి కాదు) హైబ్రిడ్ ఇది. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధర్వాడ్(కర్ణాటక) ఇక్రిశాట్తో కలసి అభివృద్ధి చేసింది. హెక్టారుకు 39 క్వింటాళ్ల జొన్నల దిగుబడినిచ్చే ఈ రకం ఖరీఫ్లో వర్షాధార సాగుకు అనుకూలం. గడ్డి దిగుబడి హెక్టారుకు 116 క్వింటాళ్లు. కోత దశలోనూ గడ్డి ఆకుపచ్చగానే ఉండటం (స్టే గ్రీన్) దీని ప్రత్యేకత. గింజ బూజును కొంత వరకు తట్టుకుంటుంది. తక్కువ నత్రజని ఎరువుతోనే 9% అధిక దిగుబడినిస్తుంది. ప్రకృతి సేద్యానికీ అనువైనదని డా. జనీల తెలిపారు. 5 నెలల కంది సూటి రకంకంది ఎన్ఎఎఎం–88: ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వర్షాధారం/నీటిపారుదల కింద ఖరీఫ్కు అనువైన సూటి రకం. ఇక్రిశాట్తో కలసి కర్ణాటక రాయచూర్లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఈ రకాన్ని అభివృద్ధి చేసింది. 142 రోజుల (స్వల్పకాలిక) పంట. హెక్టారుకు 15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎండు తెగులును కొంతమేరకు తట్టుకుంటుంది.పాలకులు శ్రద్ధ చూపాలిశాస్త్రవేత్తలు దీర్ఘకాలం పరిశోధనలు చేసి ఓ కొత్త వంగడాన్ని రూపొందిస్తారు. కానీ, విడుదలైన తర్వాత కూడా కొత్త విత్తనం రైతులకు సత్వరం అందటం లేదు. వేరుశనగ, శనగ వంటి పంటల్లో 15–18 ఏళ్లు పడుతోంది. వెరైటీల రిలీజ్తో పని అయి పోయినట్లు కాదు. ఫార్మల్, ఇన్ఫార్మల్ సీడ్ సిస్టమ్స్ను ప్రోత్సహించటంపైపాలకులు దృష్టిని కేంద్రీకరించటం అవసరం. అప్పుడే రైతులు, వినియోగదారులకు కొత్త వంగడాల ప్రయోజనాలందుతాయి. – డా. పసుపులేటి జనీల, క్లస్టర్ లీడర్ – క్రాప్ బ్రీడింగ్, ప్రధాన శాస్త్రవేత్త (వేరుశనగ), ఇక్రిశాట్ -
సేంద్రీయ వ్యవసాయం : ఏడాది పొడవునా ఆదాయం!
ఆ రైతు క్షేత్రం దట్టమైన ఆహారపు అడవిపదేళ్లుగా పాలేకర్ పద్థతిలో గడ్డి మందు సహా, 100% రసాయనాల్లేని సాగు 20 ఎకరాల్లో లక్ష్మణ ఫలం నుంచి అవకాడో వరకు పండ్లు, కూరగాయల సాగుపంటలతో పాటు గొర్రెలు, నాటుకోళ్లు, చేపల పెంపకంతో నిరంతరాదాయం ఆదర్శంగా నిలుస్తున్న మాజీ ప్రభుత్వాధికారి అంజిరెడ్డి సేద్యంఏదుళ్ల అంజిరెడ్డి 2013లో హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నేలతల్లికి ప్రణమిల్లి ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో అన్ని సంపదల్లో కెల్లా ఆరోగ్య సంపద గొప్పదని భావించి కార్యాచరణకు ఉపక్రమించారు. నల్లగొండ సమీపంలోని చర్లపల్లి వద్ద తన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దట్టమైన ఆహారపు అడవిగా మార్చారు. తొలుత కుటుంబ అవసరాల కోసం పురుగుమందుల అవశేషాలు లేని పండ్లు, కూరగాయలు సాగు చేయనారంభించి.. వ్యవసాయాన్ని క్రమంగా 20 ఎకరాలకు విస్తరించారు.మామిడి నుంచి అవకాడో వరకు 11 రకాల పండ్లతో పాటు 10 రకాల పంటలను సాగు చేస్తున్నారు. శ్రీగంధం, ఎర్రచందనం, చింత, రావి, వెదురు, సరుగుడు, మహాగని మొక్కల్ని నాటారు. బహురూపి దేశీవరిని సాగు చేస్తున్నారు. గత పదేళ్లుగా భూసారం సమృద్ధిగా వృద్ధి చెందటం ఆ వ్యవసాయ క్షేత్రంలో కనిపిస్తుంది. ఆరోగ్యంగా పెరుగుతూ పచ్చగా ఉన్న తోటలో అనేక చోట్ల పుట్టలు కనిపిస్తాయి. పంటలతో పాటే గొర్రెలు, కోళ్లు..ఏ చెట్టు కింద మట్టిని తీసినా వానపాములు ఉంటాయి. పండ్లు, కూరగాయల సాగే కాకుండా 500కు పైగా గొర్రెలతో అధునాతన ఫామ్ను అంజిరెడ్డి గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. గొర్రెల మేత కోసం ఆరోగ్యవంతమైన గడ్డిని పెంచుతున్నారు. తోటలో నాటు కోళ్లను పెంచి గుడ్లను అమ్ముతున్నారు. సీమ కోళ్లు, బాతులు ఉన్నాయి. ఈ సమీకృత వ్యవసాయ క్షేత్రంలోని చిన్న కొలనులో కొర్రమీను చేపలనూ పెంచుతున్నారు. డ్రిప్ ద్వారా ద్రవ జీవామృతాన్ని చెట్లు, మొక్కలకు అందిస్తున్నారు. భూమిని దున్నకుండా అవసరం ఉన్న చోటనే పరిమితంగా దున్ని కూరగాయలను సాగు చేస్తుండటం విశేషం. క్రిమికీటకాల నివారణకు వేప నూనెను స్ప్రే చేస్తున్నారు.నేరుగా అమ్మకాలుతన సమీకృత వ్యవసాయ క్షేత్రం దగ్గర, నల్లగొండలోని తన నివాసం వద్ద పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లను ప్రజలకు నేరుగా విక్రయిస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు అంజిరెడ్డి. కలుపు మందు సహా ఏ రసాయనాలు వాడకుండా సాగు చేస్తున్నందున దిగుబడుల నాణ్యతను గుర్తించిన నల్గొండ నగర ప్రజలు వచ్చి కొనుక్కెళ్తున్నారు. కూరగాయలు ఏ రకం అయినా కిలో రూ.80 చొప్పున అమ్ముతున్నారు. కేజీ రూ.420 లెక్కన గొర్రెలను విక్రయిస్తున్నారు. నాటు కోడిగుడ్డు రూ.15, జామ కాయలు కిలో రూ.60, సపోట కిలో రూ.40, నిమ్మ వేసవిలో కిలో రూ.100, వానాకాలంలో కిలో రూ.50, బత్తాయి కిలో రూ.80, మామిడి రూ.100 – 150, కూర అరటి డజన్ రూ.70, అరటి పండ్లు డజన్ రూ.80, నెయ్యి కిలో రూ. 1,200, ΄ాలు లీ. రూ.80 చొప్పున విక్రయిస్తూ అంజిరెడ్డి రోజూ ఆదాయం పొందుతున్నారు. మొత్తంగా 20 ఎకరాలలో ఖాళీ స్థలం లేకుండా బహుళ పంటలను సాగు చేస్తూ.. జీవాలు, కోళ్లను పెంచుతుండటంతో అంజిరెడ్డి క్షేత్రం ఏడాది పొడవునా దిగుబడులనిచ్చే అక్షయపాత్రగా మారింది. – కుంభం వెంకటేశ్వర్లు గౌడ్, సాక్షి, నల్లగొండ రూరల్ ఫొటోలు: కంది భజరంగ్ ప్రసాద్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ప్రతి రైతూ కుటుంబం కోసమైనా రసాయనాల్లేకుండా పండించాలిభూసారాన్ని కాపాడుకుంటే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. క్యాన్సర్, గుండె΄ోటు, బీపీ, షుగర్ వంటి అనేక రకాల వ్యాధులు రావడానికి రసాయనాలతో పండించిన ఆహరమే కారణం అని గ్రహించాను. రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని మా కుటుంబంతో పాటు ప్రజలకూ అందించటం కోసమే రైతుగా మారాను. ప్రతి రైతూ మిశ్రమ పంటలను తన కుటుంబ అవసరాల కోసమైనా రసాయనాలు లేకుండా సాగు చేసుకోవాలి. విద్యార్థులకు ఇటువంటి వ్యవసాయ క్షేత్రాలు చూపిస్తే వారిలో ప్రకృతి సేద్యంపై, ఆరోగ్యదాయకమైన ఆహారంపై అవగాహన పెరుగుతుంది. రైతు కుటుంబ నేపధ్యం ఉన్న వారు భవిష్యత్తులో వ్యవసాయాన్ని వృత్తిగా చేపడతారన్న ఆశతో క్షేత్ర పరిశీలనకు వచ్చిన విద్యార్థులకు వ్యవసాయం గురించి వివరిస్తున్నా. – ఏదుళ్ల అంజిరెడ్డి (99482 55544), ప్రకృతి వ్యవసాయదారుడు, నల్గొండ -
సేంద్రియ సేద్యంపై 21 రోజుల ఉచిత శిక్షణా శిబిరం..
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో ఇమిడి ఉండే అన్ని అంశాలతో పాటు పిజిఎస్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ విషయాలపై పూర్తిస్థాయి శిక్షణ పొందాలనుకునే తెలుగు వారికి ఇదొక గొప్ప అవకాశం. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో అన్ని విషయాలతో పాటు పిజిఎస్ సర్టిఫికేషన్పై లోతైన అవగాహన కల్పించేందుకు 21 రోజుల పాటు తెలుగులో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం జరగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్/నేచురల్ ఫార్మింగ్ (ఎన్సిఓఎన్ఎఫ్) తోడ్పాటుతో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ), కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ (కెఎస్ఎ) సెప్టెంబర్ 5 నుంచి ఉమ్మడిగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నాయి. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సిఎస్ఎ, కెఎస్ఎల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుండటం విశేషం.విజయవాడకు 50 కిమీ దూరంలో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలో శ్రీపద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ నెలకొల్పిన కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఈ శిబిరం జరగనుంది. 38 ఎకరాలలో అత్యాధునిక సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేస్తూ ఆచణాత్మక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటైన కెఎస్ఎకు సుస్థిర వ్యవసాయ కేంద్రం నాలెడ్జ్ పార్టనర్గా వ్యవహరిస్తోంది. ఈ 21 రోజుల శిబిరంలో బోధన పూర్తిగా తెలుగులో ఉంటుంది. శిక్షణ, భోజన వసతులు ఉచితం. అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. 30 మందికి అవకాశం.సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోను, సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారంలోను స్థానికంగా కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి, నిబద్ధత కలిగిన వారికి సంపూర్ణ అవగాహన కలిగించేందుకే ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు డా. రామాంజనేయులు వివరించారు. స్థానిక స్వయం సహాయక బృందాలు/ ఎఫ్పిఓలు / ఐసిఎస్/ ఆత్మ, పికెవివై, నామని గంగే లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సేంద్రియ వ్యవసాయ పథకాలలో నమోదైన వారికి ్రపాధాన్యం ఉంటుందన్నారు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి.. గూగుల్ ఫామ్లో వివరాలు పొందుపరచటం ద్వారా ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 85002 83300. జుట్చఃఓటజీటజిn్చ uఛీజ్చిఅఛ్చిఛ్ఛీఝy.ౌటజముచ్చింతల్లో ‘సిరిధాన్యాలతో జీవన సిరి’ శిబిరం..రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో.. కర్షక సేవా కేంద్రం నిర్వహణలో హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో సిరిధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్వలి, డా. సరళా ఖాదర్లచే ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. 3 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇతర వివరాలకు.. 97053 83666, 70939 73999. -
నల్లతామరకు విరుగుడు.. ఈ కుంకుడు ద్రావణం!
నల్గొండ జిల్లా చందంపేట మండలంపోలేపల్లి వాస్తవ్యులు లోకసాని పద్మారెడ్డి అనే మెట్ట ్రపాంత రైతు సాగు చేస్తున్న 12 ఎకరాల కుంకుడు తోట కొత్త ఆవిష్కరణలకు పురుడుపోసింది. మొదటిది... చెట్టుకు ఏడాదికి 400 కిలోల వరకు కుంకుడు కాయల దిగుబడినిచ్చే సరికొత్త రైతు వంగడం ఆవిష్కారమైంది. కుంకుడు ద్రావణం రెండోది.కుంకుడు కాయల పొడికి రెండు రకాల ఔషధ మొక్కల పొడిని చేర్చి.. ఆ పొడితో తయారు చేసిన ద్రావణం సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణ కోసం వినియోగిస్తూ పద్మారెడ్డి, ఆయన మిత్రులైన కొందరు రైతులు చక్కటి ఫలితాలు సాధిస్తుండటం విశేషం. సేంద్రియ పురుగుమందుగా, శిలీంధ్రనాశనిగానే కాక పంట పెరుగుదలకు కూడా కుంకుడు ద్రావణం దోహదం చేస్తోందని ఆయన చెబుతున్నారు. పండ్ల తోటలు, వరి, కూరగాయలు తదిరత పంటల సేంద్రియ సాగులో ఉపయోడపడుతోందన్నారు.200 లీ. డ్రమ్ముకు 2 కిలోలు...2 కిలోల కుంకుడు పొడిని 200 లీటర్ల డ్రమ్ములో 2 గంటలు నానబెట్టి, పిసికి, వడకడితే సిద్ధమయ్యే ద్రావణాన్ని పంటలకు పిచికారీ చేసుకోవచ్చు. మళ్లీ నీరు కలపాల్సిన అవసరం లేదు. రెండేళ్లుగా తాము ప్రయోగాత్మకంగా ఈ ద్రావణాన్ని వాడుతున్నామని చెబుతూ.. ఎన్ని రోజులైనా నిల్వ ఉంచి వాడుకోవచ్చు అన్నారు.ఇంటిపంటలకు...లీటరు నీటికి 10 గ్రాముల కుంకుడు పొడిని కలిపిన ద్రావణం ఇంటిపంటలు/ మిద్దె తోటల రైతులకూ కుంకుడు పొడి ఎంతో ఉపయోగకరంగా ఉందని పద్మారెడ్డి తెలిపారు.వరిలో తెగుళ్లకు...కుంకుడు ద్రావణాన్ని ఆకుకూరలకు ఒక్కసారి చాలు. పంటలు ఏపుగా పెరగడానికి కూడా ఈ ద్రావణం దోహదపడుతుందని పద్మారెడ్డి తెలిపారు. బత్తాయి తదితర పండ్ల తోటలకు 30 రోజుల వ్యవధిలో వాడుకోవచ్చు. కూరగాయల సాగులో 15 రోజులకోసారి పిచికారీ చేయొచ్చు. వరి పంట కాలంలో 3 దఫాలు.. నాటేసిన 15–25 రోజులకు, 60 రోజులకు, 90 రోజులకు చల్లాలి. ఊస తెగులు/కాండం తొలిచే పురుగును ఈ ద్రావణం పూర్తిగా నివారిస్తుందని పద్మారెడ్డి స్వానుభవంగా చెప్పారు.మిరపలో నల్లతామరకు...మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బ్లాక్ త్రిప్స్ (నల్లతామర)ను కూడా కుంకుడు ద్రావణం 70–80% నియంత్రిస్తున్నట్లు సేంద్రియ మిరప తోటలో రుజువైందని పద్మారెడ్డి చెబుతున్నారు. రసాయనిక పురుగుమందులు అసలు వాడకుండా కుంకుడు ద్రావణాన్ని ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేస్తే సేంద్రియ మిరప రైతులకు మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. గ్రోత్ ప్రమోటర్గా, ఫంగిసైడ్గా ఇది పనిచేస్తుందని, మిరపకాయలపై మచ్చలు కూడా రావని పద్మారెడ్డి(99481 11931) చెబుతున్నారు. -
రైతు బ్రాండ్.. ఈ నేరేడు జ్యూస్!
నేరేడు పండ్లు జూన్–జూలై మధ్య ఏడాదికి ఒక్క నెల రోజులు మాత్రమే వస్తాయి. చెట్లపై 90% పండిన నేరేడు కాయలను వ్యాపారులు కొని నగరాలు, పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ ఉంటారు. ఒక్క రోజు కోయక΄ోయినా పండ్లు 100% పండి΄ోతాయి. రవాణాకు పనికిరావు కాబట్టి వ్యాపారులు కొనరు. మరో రోజు కోయక΄ోతే రాలి మట్టిపాలవుతాయి. 100% పండిన పండ్లను వృథా కాకుండా ఇంటిపట్టునే జ్యూస్గా మార్చితే పండ్ల వృథాను అరికట్టినట్లవుతుంది. జ్యూస్ అమ్మకం ద్వారా మంచి ఆదాయం కూడా వస్తుందని ఆశించిన రైతు మారుతీ ప్రసాద్. 8 ఏళ్లు కష్టపడి నేరేడు జ్యూస్ తయారీకి అవసరమైన ప్రత్యేక టెక్నాలజీని విజయవంతంగా రూపొందించుకున్నారు.అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన రైతు, మాజీ సర్పంచ్ పి. మారుతీ ప్రసాద్ ఇంటర్ వరకు చదువుకున్నారు. దానిమ్మ, ద్రాక్ష తదితర పంటల సాగుతో నష్టాల పాలైన నేపథ్యంలో వ్రేదావతి ఒడ్డున 4 ఎకరాల చౌడు భూమిని 15 ఏళ్ల క్రితం కొన్నారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ సహకారంతో రెండెకరాల్లో 150 అల్లనేరేడు మొక్కలు 2009లో నాటారు. కాలక్రమంలో నేరేడు తోటల విస్తీర్ణం ఆ ్రపాంతంలో 400 ఎకరాలకు పెరిగి, మార్కెటింగ్ సమస్య వచ్చిపడింది.8 ఏళ్ల ప్రయోగాలు ఫలించిన వేళ..జూన్–జూలై మధ్య కేవలం నెల రోజుల్లోనే నేరేడు పండ్లన్నీ మార్కెట్లోకి వస్తాయి. వీటిని నిల్వ చేసుకొని నెమ్మదిగా అమ్ముకునే మౌలిక సదుపాయాలు రైతులకు లేవు. పూర్తిగా పండిన నేరేడు పండ్లతో జ్యూస్ తయారు చేయటం ద్వారా మార్కెటింగ్ సమస్యను అధిగమించవచ్చని మారుతీప్రసాద్ భావించారు. మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎఫ్టిఆర్ఐ) శాస్త్రవేత్తలను 8 ఏళ్ల క్రితం సంప్రదించారు. అయితే, వారు సూచించిన ్రపాసెసింగ్ పద్ధతి నేరేడుకు సరిపడలేదు. అయినా, ఆయన తన ప్రయత్నాలు మానలేదు.‘మామిడి నుంచి నేరేడు వరకు అన్ని రకాల పండ్ల రసాల తయారీకి వారి వద్ద ఒకటే ్రపాసెసింగ్ పద్ధతి ఉంది. సగం రసం, సగం పంచదార, ప్రిజర్వేటివ్లు తదితరాలు కలిపి జ్యూస్ తయారు చేయాలని వారు సూచించారు. అవేమీ కలపకుండా నేరేడు జ్యూస్ తయారు చేయాలన్నది నా ప్రయత్నం. ఈ క్రమంలో నేరేడు ్రపాసెసింగ్ పద్ధతి, నిల్వ పద్ధతి, బాట్లింగ్ పద్ధతితో పాటు యంత్రాలను నా అవసరాలకు తగినట్లు ఏయే మార్పులు చేసుకోవాలి అనేది స్వీయఅనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఏవీ కలపకుండా కేవలం నేరేడు జ్యూస్ తయారు చేసి, ఏడాది పాటు నిల్వ ఉంచటంలో ఎట్టకేలకు విజయం సాధించాను..’ అని మారుతీప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో సంతోషంగా చె΄్పారు.నేరేడు గింజల పొడి8 ఏళ్ల స్వయంకృషి ఫలితమిది..గత ఏడాది సీజన్లో 5 టన్నుల నేరేడు జ్యూస్ తయారు చేసి విక్రయించాను. ఈ ఏడాది పదెకరాల తోటలో పండ్లను అదనంగా కొనుగోలు చేసి, 22 టన్నుల జ్యూస్ తయారు చేశా. జ్యూస్ను అన్నివిధాలా సంతృప్తికరమైన రీతిలో ఆరోగ్యదాయకంగా ఉత్పత్తి చేస్తున్నా. సిఎఫ్టిఆర్ఐ తోడ్పాటు తీసుకున్నా. వ్యయ ప్రయాసలకోర్చి 8 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేసి ఎట్టకేలకు విజయం సాధించా. నాకు అవసరమైన విధంగా తగిన మార్పులు చేర్పులతో ప్రత్యేక ్రపాసెసింగ్ పద్ధతిని, ప్రత్యేక యంత్రాలను రూపొందించుకున్నా. పంచదార, రసాయనాలు, ప్రిజర్వేటివ్లు ఇతరత్రా ఏమీ కలపకుండా స్వచ్ఛమైన నేరేడు రసాన్ని ప్రజలకు అందిస్తున్నా. గర్భవతులు మాత్రం నేరేడు జ్యూస్ తాగకూడదు. ఇతరులు నీటిలో కలిపి తాగితే మంచిది. ఎందుకైనా మంచిది వైద్యుల సలహా మేరకు వాడమని కొనే వారికి సూచిస్తున్నా. – పి. మారుతీ ప్రసాద్ (97018 66028), ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం, అనంతపురం జిల్లా2.5 కేజీలకు లీటరు జ్యూస్..తన ఇంటి దగ్గరే ్రపాసెసింగ్ యూనిట్ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. తన రెండెకరాల్లో నేరేడు పండ్లతో పాటు మరో 10 ఎకరాల తోటలో పండ్లను కొని జ్యూస్ తయారు చేస్తున్నారు. రెండున్నర కేజీల నేరేడు పండ్లతో లీటరు జ్యూస్ తయారు చేస్తున్నారు. మొదట్లో గింజలు తీసేసి గుజ్జుతో మాత్రమే జ్యూస్ తయారు చేశారు. గత ఏడాది నుంచి ప్రత్యేకంగా గింజతో పాటు మొత్తం పండ్లతో కూడా రెండు రకాలుగా జ్యూస్ తయారు చేస్తున్నారు. 200 ఎం.ఎల్. బాటిల్స్ లో ΄్యాక్ చేసి అమ్ముతున్నారు. గుజ్జు జ్యూస్ కన్నా ఇది కొంచెం వగరుగా ఉన్నా, మార్కెట్లో క్లిక్ అయ్యింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి దూర్రపాంతాల నుంచి కూడా చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు నేరుగా కొనుగోలు చేస్తూ, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ జ్యూస్ తమకు బాగా ఉపయోగపడుతోందని షుగర్ పేషెంట్లు చెప్పటం మారుతీ ప్రసాద్కు కొండంత ధైర్యాన్నిచ్చింది. అందుకే ఈ ఏడాది ఎక్కువగా గింజలతో కూడిన జ్యూస్ను తయారు చేశారు. ఈ జ్యూస్ను నాణ్యతా పరీక్షల కోసం సిఎఫ్టిఆర్ఐకి పంపానన్నారు. గుజ్జుతో జ్యూస్ చేసిన తర్వాత మిగిలే గింజలను కూడా ఎండబెట్టి, ΄÷డి చేసి అమ్ముతున్నారు. ఈ ΄÷డిని గోరువెచ్చ నీటితో కలుపుకొని తాగొచ్చు. నీటితో మరిగించి టీ డికాక్షన్ చేసుకొని తాగొచ్చని ఆయన చెబుతున్నారు. ఒక ఉద్యాన యూనివర్సిటీ లేదా పరిశోధనా కేంద్రం చేయాల్సిన పరిశోధనను సడలని పట్టుదలతో కొనసాగించి విజయం సాధించినను రైతు మారుతీప్రసాద్ అసలు సిసలైన రైతు శాస్త్రవేత్త. – కె. వంశీనాథ్రెడ్డి, సాక్షి, బొమ్మనహాళ్, అనంతపురం జిల్లా -
వర్షాధార భూముల్లో.. అధిక దిగుబడినిచ్చే.. సరికొత్త బీటీ పత్తి సూటి రకం!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న విడుదల చేసిన 61 పంటలకు సంబంధించిన 109 సరికొత్త వంగడాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాధార వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగపడే పత్తి సూటి రకం ఒకటి ఉంది. దాని పేరు సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 (ఐసిఎఆర్–సిఐసిఆర్ పికెవి 081 బిటి). నాగపూర్లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సిఐసిఆర్) ఈ బీటీ సూటి రకాన్ని రూపొందించింది.ఇప్పటి వరకూ మార్కెట్లో ఉన్న జన్యుమార్పిడి బీటీ పత్తి వంగడాలన్నీ హైబ్రిడ్ రకాలే. ఇది హైబ్రిడ్ కాదు. ఓపెన్ పొల్లినేటెడ్ వంగడం. అంటే.. రైతులు ఈ విత్తనాన్ని ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం లేదు. దూదిలో నుంచి తీసిన విత్తనాన్ని తిరిగి విత్తుకోవచ్చు. పత్తి సాగులో పెద్ద సమస్యగా మారిన పచ్చదోమ వంటి రసంపీల్చే పురుగులతో ΄ాటు తెగుళ్లను సైతం సమర్థవంతంగా తట్టుకుంటుందని సిఐసిఆర్ డైరెక్టర్ డాక్టర్ వై.జి. ప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 రకాన్ని మూడేళ్లు 15 చోట్ల పండించి చూసిన తర్వాత సివీఐసి దీన్ని దక్షిణాది మెట్ట భూముల్లో సాగుకు ఎంపిక చేసింది. హెక్టారుకు సగటున 17.3 క్వింటాళ్ల పత్తి(సీడ్ కాటన్) దిగుబడి వచ్చింది. ఆదిలాబాద్లో 2023–24 సీజన్లో సాధారణ దూరంలో విత్తినప్పుడు అత్యధికంగా హెక్టారుకు 32.05 క్వింటాళ్ల దిగుబడినిచ్చింది. ఇతర రకాలతో ΄ోల్చితే 11–18% అధిక పత్తి దిగుబడినిస్తోంది. దూదిపింజ 26 ఎం.ఎం. పొడవుంటుంది. సగటు దూది పటుత్వం 25.8 జి/టెక్స్. 34–38% గింజల్లేని పత్తి దిగుబడినిస్తుంది. ఈ రకం చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. రసంపీల్చే పురుగులను దీటుగా తట్టుకునే ఈ సరికొత్త బీటీ కాటన్ జినోటైప్ వంగడం దక్షిణాది వర్షాధార తేలిక భూముల్లో అధిక దిగుబడినిస్తుందని సిఐసిఆర్ తెలిపింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనువైనది..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వర్షాధార తేలిక నేలల్లో అధిక సాంద్రతలో విత్తుకోవటానికి సూటిరకమైన సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 (ఐసిఎఆర్–సిఐసిఆర్ పికెవి 081 బిటి) చాలా అనువైనది. చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడినిస్తుంది. సర్టిఫైడ్ సీడ్ వచ్చే ఏడాది ఇవ్వగలం. బ్రీడర్ సీడ్ కొద్ది మొత్తంలో ఉంది. కిలో ధర రూ. 320. వచ్చే ఏడాది విత్తనం కావాలనుకునే వారు ముందుగా బుక్ చేసుకోవచ్చు. నాగపూర్ సిఐసిఆర్లోని విత్తన శాస్త్రవేత్త డా. శాంతిని 98906 84572 నంబరులో సంప్రదించవచ్చు. – డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్, మహారాష్ట్ర -
కుంకుడు తోట.. ఎకరానికి రూ.13 లక్షలు!
ఎక్కువ పొలం ఉండి, నీటి వసతి అంతగా లేని బీడు భూముల్లో కుంకుడు తోట ద్వారా అనూహ్యమైన రీతిలో ఎకరానికి రూ. 13 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు నల్గొండ జిల్లా రైతు లోకసాని పద్మారెడ్డి. ఎకరానికి కేవలం రూ. 5 వేల నిర్వహణ ఖర్చుతో ఈ ఆదాయం పొందటం విశేషం. 33 ఏళ్ల క్రితం 12 ఎకరాల్లో 1200 కుంకుడు మొక్కలు నాటి అసాధారణ ఫలితాలు సాధిస్తున్నారు. సరికొత్త కుంకుడు వంగడాన్ని రూపొందించటంతో ΄ాటు కుంకుడు పొడితో సబ్బులు, టూత్పేస్టులు తయారు చేస్తున్నారు. కుంకుడు కాయల పొడిని సేంద్రియ పురుగుమందుగా, గ్రోత్ ప్రమోటర్గా, శిలీంధ్రనాశనిగా కూడా వాడొచ్చని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తల తోడ్పాటుతో పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేయనున్నారు. రైతు శాస్త్రవేత్త పద్మారెడ్డి సుసంపన్న అనుభవాలు రైతులకు చక్కని వ్యవసాయ, వ్యా΄ార ΄ాఠాలుగా నిలుస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదు.నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి వాస్తవ్యులు లోకసాని పద్మారెడ్డి అనే మెట్టప్రాంత రైతు చేసిన ప్రయోగం అబ్బుర పరిచే ఫలితాలనందిస్తోంది. డిగ్రీ చదువుకున్న పద్మారెడ్డి(59) వ్యవసాయమే వృత్తిగా స్వీకరించారు. గతంలో హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో పట్టు సాధించారు. ఆయన భార్య శోభారాణి స్వగ్రామంలోనే బ్రాంచ్ పోస్ట్మాస్టర్గా సేవలందిస్తున్నారు. ఇద్దరు కుమారులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. 1991లో పద్మారెడ్డి నీటి వసతి లేని తమ 12 ఎకరాల పొలంలో 1200 కుంకుడు మొక్కలు నాటించారు. తన ఊరి వారు, మిత్రులు కుంకుడు మొక్కల తోట చూసి నీకేమైనా పిచ్చా? కుంకుడు చెట్లు చేలో ఒకటో రెండో వేసుకుంటే చాలు. ఎవరైనా ఏకంగా 12 ఎకరాల్లో ఇలా తోట ఎవరైనా పెడతారా పటేలా? అని ఎగతాళి చేశారు. కానీ తన ఆలోచన వేరు. తాను వేరే ఏ తోట పెట్టినా ఆ తోటను బతికించుకోవటానికి తగినంత నీరు లేదు. కుంకుడు చెట్లయితే నీరు పెట్టాల్సిన పని లేదు. మొండి చెట్టు కాబట్టి బతికి పోద్దిలే అన్నది పద్మారెడ్డి ఆలోచన. ఆ చెట్లు పెరిగి మంచి కుంకుడు కాయల దిగుబడి ఇస్తుండటంతో ఆయన ఆలోచన ఎంత ముందుచూపుతో కూడినదో అందరికీ అర్థం అవుతున్నది.8 లక్షల ఎకరాలకు విత్తనాలు..33 ఏళ్ల చెట్టు ఏటా 100 కిలోల కాయలు కాస్తోంది. ఎకరానికి పది వేల కిలోల దిగుబడి. గత సీజన్లో కిలో రూ. 130 చొప్పున అమ్మితే ఎకరానికి రూ. 13 లక్షల ఆదాయం వచ్చిందని పద్మారెడ్డి తెలి΄ారు. ఆనోటా ఈనోటా తెలుసుకున్న అనేక రాష్ట్రాల రైతులు సుమారు 4 లక్షల మంది ఇప్పటికి సందర్శించారు. 8 లక్షల ఎకరాలకు సరిపడే విత్తనాలు అమ్మానని, వారిలో చాలా మంది కుంకుడుతోటలు సాగు చేస్తున్నారన్నారు. కాబట్టి, భవిష్యత్తులోనూ ఇంత ఎక్కువ ఆదాయం వస్తుందని అనుకోలేమని ఆయన స్పష్టం చేశారు. విస్తీర్ణం పెరిగి భవిష్యత్తులో కుంకుళ్ల ఉత్పత్తి పెరిగినప్పుడు ధర తగ్గుతుందన్నారు. ఎంత తగ్గినా, ఎట్టిపరిస్థితుల్లోనూ.. ఎకరానికి రూ. 2.5 లక్షల కన్నా తక్కువగా అయితే ఆదాయం రాదని పద్మారెడ్డి చెబుతున్నారు.కొత్త వంగడం నమోదుకు యత్నాలు..దేశంలోనే అరుదైన ఒక అద్భుత కుంకుడు వనంగా పద్మారెడ్డి తోట గుర్తింపు పొందింది. అనేక రాష్ట్రాల నుంచి రైతులు, అధికారులు ఇప్పటికి లక్షలాది మంది తన తోటను సందర్శించారని ఆయన సంతోషంగా చె΄్పారు. 12 ఎకరాల్లో 1200 కుంకుడు చెట్లను 31 ఏళ్లుగా సాగు చేస్తున్న పద్మారెడ్డి తోటలో 3–4 రకాల కుంకుడు రకాలు ఉన్నాయి. వీటిలో 63 చెట్లు అద్భుత ఫలితాలను ఇస్తున్నట్లు ఆయన గుర్తించారు. మెరుగైన చెట్లను ఎంపిక చేసి సరికొత్త కుంకుడు వంగడాన్ని ఆయన రూపొందించారు. శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులు పద్మారెడ్డి కుంకుడు క్షేత్రాన్ని సందర్శించి ప్రశంసించారు. దీనితో ΄ాటు జాతీయ స్థాయిలో దీన్ని సరికొత్త రైతు వంగడంగా అధికారికంగా గుర్తింపు తెప్పించేందుకు దరఖాస్తు చేయటంలో పద్మారెడ్డికి ఉద్యాన వర్సిటీ తోడ్పాటునందిస్తోంది. పిజెటిఎస్ఎయు క్వాలిటీ కంట్రోల్ ప్రయోగశాలలో పద్మారెడ్డి కుంకుడు కాయలపై పరీక్షలు జరిపించారు. ఇందులో అద్భుత ఫలితాలు రావటంతో శాస్త్రవేత్తలే ఆశ్చర్యానికి లోనయ్యారు.ఒక్కసారి నాటి, మూడు/ నాలుగు సంవత్సరాలు వాటిని కా΄ాడుకుంటే చాలు.. రైతుకు ఊహించనంత ఆదాయం వస్తుందని పద్మారెడ్డి అనుభవాలు చాటి చెబుతున్నాయి. పెద్ద కమతాలు ఉండి, సీజనల్ పంటలు సాగు చేసుకోలేక బీడు పెడుతున్న రైతులు కుంకుడు తోటలను సులువుగా పెంచి, అధికాదాయం పొందవచ్చని పద్మారెడ్డి సూచిస్తున్నారు.20×20 దూరంలో నాటాలి..కుంకుడు సాగులో పద్మారెడ్డి 33 ఏళ్ల అనుభవం గడించారు. 20“20 అడుగుల దూరంలో కుంకుడు మొక్కలు నాటుకోవాలి. డ్రిప్తో నీటిని అందించాలి. రెండు కుంకుడు చెట్ల మధ్య తొలి మూడేళ్లు బొ΄్పాయి, మునగ, జామ వంటి పంటలు వేసుకుంటే రైతుకు ఆదాయం వస్తుంది. కుంకుడు మొక్క నాటి డ్రిప్ ఏర్పాటు చేసి, యాజమాన్య పద్ధతులు ΄ాటిస్తే నాలుగో ఏడాది నుంచి 20–30 కిలోల కాపుప్రారంభమవుతుంది. ఐదేళ్ల తర్వాత పూత దశలో నీరు ఇస్తే చాలు. మంచి దిగుబడి వస్తుంది. నవంబర్–డిసెంబర్లో పూత వస్తుంది. ఏప్రిల్లో కాయలు కోతకు వస్తాయి. కుంకుడు చెట్టు కాపు సీజన్ పూర్తయ్యాక ఆకు రాల్చి నిద్రావస్థలోకి వెళ్తుంది. ఎండిన మానులా ఉండే చెట్టు మేలో చిగురిస్తుంది. ఒక్కో చెట్టుకు 20–25 కిలోల రాలుతాయి. ఆకులన్నీ చెట్టు మొదట్లోనే కుళ్లి సేంద్రియ ఎరువుగా పోషకాలను అందిస్తాయి.విలువ ఆధారిత ఉత్పత్తులపైనే దృష్టి!33 ఏళ్లుగా 12 ఎకరాల్లో కుంకుడు తోట సాగుచేస్తున్నా. ఏటా 1200–1300 క్వింటాళ్ల ఎండు కాయలు ఉత్పత్తి అవుతున్నాయి. 200 సంవత్సరాల వరకు ఈ చెట్లకు ఢోకా ఉండదు. ఎండుకాయలు కిలో రూ. 130కి ఇస్తున్నా. విత్తనాలు కిలో రూ. వెయ్యి, ఇప్పటికి 8 లక్షల ఎకరాలకు అమ్మా. ఇకపై కుంకుళ్లు అమ్మకుండా.. విలువ జోడించి అమ్మాలనుకుంటున్నా. కుంకుడు పొడికి రెండు రకాల ఔషధ మొక్కల పొడిని జోడించి.. కిలో 170కి అమ్ముతున్నా. ఇది పంటలకు పురుగుమందుగా, గ్రోత్ప్రమోటర్గా, శిలీంధ్రనాశనిగా చక్కగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఈ పొడిని మరింత మెరుగ్గా తయారు చేసి.. బ్రాండ్ చేసి ప్యాక్చేసి మార్కెట్లోకి తేబోతున్నా. పండ్ల పొడిగా, టూత్పేస్ట్గా, కాళ్ల పగుళ్లకు మందుగా.. ఇలా అనేక రకాలుగా కూడా కుంకుడు ఉపయోగపడుతోంది. పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నా. కుంకుడు చెట్లకు తేనెటీగలు విపరీతంగా ఆకర్షితమవుతాయి. ప్రకృతికి కూడా ఈ తోట ఎంతో మేలు చేకూర్చుతోంది. – లోకసాని పద్మారెడ్డి (99481 11931), రైతు శాస్త్రవేత్త, పోలేపల్లి, చందంపేట మండలం, నల్గొండ జిల్లా– నిర్వహణ: పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్ -
రైతుబడి అగ్రి షో!
తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు రాజేంద్రరెడ్డి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 17, 18 తేదీల్లో నల్గొండలోని నాగార్జున గవర్నమెంటు కాలేజీ ఆవరణలో జరిగే తొలి వ్యవసాయ ప్రదర్శనలో వ్యవసాయం, డెయిరీ, పౌల్ట్రీ, ఆక్వా రంగాలకు చెందిన 150 దేశ విదేశీ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు. సందర్శకులు వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఉచిత పాస్లు పొందవచ్చు. ఇతర వివరాలకు.. rbagrishow.com28న అమలాపురంలో కొబ్బరి రైతుల సదస్సు..‘కలసి నడుద్దాం – కొబ్బరికి లాభసాటి ధర సాధిద్దాం’ నినాదంతో ఈ నెల 28 (బుధవారం) ఉ. 10 గం. నుంచి అమలాపురంలో భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సును నిర్వహించనుంది. దేశం నలుమూలల నుంచి కొబ్బరి రైతులు ఈ సదస్సులో పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. ఇతర వివరాలకు.. 94906 66659, 95425 9966629 నుంచి హైదరాబాద్లో నర్సరీ మేళా..హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గల పీపుల్స్ ΄్లాజాలో ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు 16వ అఖిలభారత నర్సరీ మేళా జరగనుంది. 140 సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు...98492 61710.15న తార్నాకలో సేంద్రియ సంత..గ్రామభారతి, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15న సికింద్రాబాద్లోని తార్నాకలో మర్రి కృష్ణ హాల్లో ఉ. 10 గం. నుంచి సా. 6 గం. వరకు బ్యాక్ టు రూట్స్ మూలం సంత పేరిట సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తుల సంతను నిర్వహించనున్నారు. ఇతర వివరాలకు.. 94908 50766, 63051 82620.17న హైదరాబాద్లో బయోచార్పై సెమినార్..హైదరాబాద్ యూసఫ్గూడలోని నిమ్స్మే ఆడిటోరియంలో ఈ నెల 17(శనివారం) ఉ. 9.30 నుంచి సా. 6 గం. వరకు బయోచార్ (కట్టెబొగ్గు)పై జాతీయ సదస్సు జరగనుంది. ్ర΄ోగ్రెసివ్ బయోచార్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్, నిమ్స్మే, రెయిన్బో బాంబూ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 63051 71362.18న పెనుకొండలో..బయోచార్ (కట్టెబొగ్గు) ఉత్పత్తిపై ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్లోని పెనుకొండలో చార్ గోల్డ్ సంస్థ ఆవరణలో వర్క్షాప్ జరగనుంది. బయోచార్ నిపుణులు డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి, ప్రేమ్రాజ్ అవగాహన కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. వాట్సప్ – 92463 52018.11న సేంద్రియ చెరకు సాగు, 18న మట్టి సేద్యంపై శిక్షణ..‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ‘కర్షక సేవా కేంద్రం’ నిర్వహణలో హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో ఈ నెల 11,18 తేదీల్లో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు 11 (ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ పద్ధతిలో చెరకు సాగు, చెరకుతో బెల్లం తయారీ విధానం’పై రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు శిక్షణ ఇస్తారు.18(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ సాగులో మట్టి ద్రావణంతో పురుగులు తెగుళ్ళ నివారణ ఎలా?’ అనే అంశంపై రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. హాజరుకాగోరే వారు తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 95538 25532, 70939 73999. -
Yarru Baparao: సేఫ్ ఫుడ్ సేనాని!
కుటుంబ సభ్యులు కేన్సర్ బారిన పడిన ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్న నేపథ్యంలో ఆహారంలో రసాయనాల అవశేషాలే ఇందుకు మూల కారణంగా గుర్తించిన ఓ యువకుడు ఉద్యోగం వదలి ప్రకృతి సేద్య సేనానిగా మారారు. అతనే యర్రు బాపారావు (బాపయ్య). కేవలం ఎకరంన్నర సొంత భూమి మాత్రమే ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయం చేపట్టడంతో పాటు దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. తమిళనాడు వెల్లూరులో ఈషా ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘భారతీయ సంప్రదాయ వరి, ఆహారోత్పత్తుల ఉత్సవం’లో బాపారావు మరో ముగ్గురు తెలుగు రైతులతో పాటు ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు.సేఫ్ ఫుడ్ యువ ఉద్యమకారునిగా బాపారావు (39), లక్ష్మీ సౌజన్య దంపతుల ప్రకృతి వ్యవసాయ జీవన ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. వారి స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట. ఉన్నత విద్యావంతుడైన బాపారావు హైదరాబాద్లో గ్రాఫిక్ డిజైనర్, 2డి ఏనిమేటర్ గా ఉద్యోగం చేసేవారు. తమ కుటుంబంలోనే ముగ్గురు కేన్సర్ వ్యాధితో కొద్ది కాలంలోనే మృత్యువాతపడటంతో రసాయనాల మయమైన ఆహారమే ఆరోగ్యాన్ని నాశనం చేస్తోందని గ్రహించారు. ఓ వైద్యుని సలహా మేరకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. 9 ఏళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం – సంప్రదాయ ఆహారోద్యమం ్రపారంభించారు. భార్య తోడ్పాటుతో బాపారావు తిరిగి స్వగ్రామం చేరుకొని ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. సొంత భూమి ఎకరంన్నరకు తోడు 7 ఎకరాల కౌలు భూమిలో ఔషధ, పోషక విలువలతో కూడిన దేశీ వరి వంగడాలను గత తొమ్మిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో అత్తోట గ్రామానికి చెందిన 60 మంది రైతులు సమష్టిగా ప్రకృతి వ్యవసాయం చేపట్టి సుమారు 85 ఎకరాల భూమిలో దేశీ వరి రకాలను సాగు చేస్తుండటం విశేషం.ఎకరంలో 365 రకాల దేశీ వరి రకాలను విత్తనాల పరిరక్షణ కోసం బాపారావు సాగు చేస్తున్నారు. 7 ఎకరాల్లో సార్వాలో మైసూర్మల్లిగ, బహురూపి తదితర దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. గట్లపై బంతి, వంగ, చిక్కుడు, ΄÷ద్దు తిరుగుడు, బెండ, అరటి, మునగ, టమాటా, మిర్చి, తోటకూర, గోంగూర, ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. వేసవిలో 20 రకాల ధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలు చల్లి.. 40 రోజులు పెరిగిన తర్వాత కోసి ఆవులకు మేతగా ఉపయోగించుకుంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలు ఇంట్లోకి వాడుకుంటున్నారు. మిగతా పచ్చిరొట్టను భూమిలో కలియదున్ని తర్వాత వరి సాగు చేస్తున్నారు.ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, కూరగాయలను స్నేహితులు, బంధువులకు అమ్ముకొని ప్రతి రోజూ ఆదాయం సంపాదిస్తున్నారు. లక్ష్మి దేవినేని సహకారంతో ‘తానా’ సహకారంతో గ్రామంలోనే ‘భూమి భారతి’ అనే సంస్థను నెలకొల్పారు. భూమి భారతి ద్వారా దేశీ వరి విత్తన నిధిని నిర్వహించటంతోపాటు.. రైతులు పండించిన దేశీ వరి బియ్యాన్ని, విలువ జోడించిన ఇతర ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులను సంతల్లో, సోషల్ మీడియా ద్వారా సుమారు వెయ్యి కుటుంబాలకు విక్రయిస్తున్నారు. రైతు మిత్రుల ద్వారా దేశీ వరి విత్తనోత్పత్తి చేసి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 4 వేల మంది ప్రకృతి వ్యవసాయదారులకు అందించటం బాపారావు విశేష కృషికి నిదర్శనం.భావితరం కోసం...ఆయన ఇలా చెబుతున్నారు.. ‘రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం వలన భూమి సారం కోల్పోతున్నది, రైతులు అప్పుల పాలవుతూ, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి సాగు పద్ధతిలో పండిస్తే ఖర్చులు తగ్గించుకోవచ్చు. నీటి తడులు పెట్టడం తగ్గుతుంది. అంతర పంటలతో అధికాదాయాన్ని ΄÷ందుతాం. దేశీ విత్తనం వాడటం వలన ఆ పంటలు తినే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఇతర రైతులు పండించే పంటదిగుబడులను బై బ్యాక్ సిస్టం కింద కొని భూమి భారతి ద్వారా నేరుగా ప్రజలకు అమ్ముతున్నాను. ప్రతి రైతూ ఏటీఎం మోడల్ వేసుకుంటే అదనపు ఆదాయం కూడా వస్తుంది. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తోపాటు మంచి భూమి భావితరానికి కావాలి అంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయటమే మార్గం..’ అంటారు బాపారావు.ప్రవాస భారతీయులు మౌనికా రెడ్డి దంపతుల సాయంతో విజయవాడలోని కనకదుర్గ అమ్మ వారికి , మరో ఎన్ఆర్ఐ తాళ్లూరి జయశేఖర్ దంపతుల సాయంతో భద్రాచలంలోని సీతారాముల వారికి ఏడాది ΄÷డవునా నైవేద్యం కోసం దేశీ వరి బియ్యాన్ని పంపుతుండటం మరో విశేషం. వరి కోత సమయంలో వర్షాల కారణంగా ధాన్యం ఎండబెట్టడం, కలుపు తీసే సమయంలో కూలీల కొరత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని ఆయన చెబుతున్నారు. బాలారిష్టాలను అధిగమించి నిలదొక్కుకున్న ఆయన నెలకు రూ. 4 లక్షల టర్నోవర్కు చేరుకోవటం విశేషం. ‘ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యదాయక ఆహారమే ఆరోగ్య సోపానమ’ని తన చేతల ద్వారా చాటిచెబుతున్న బాపారావు (91003 07308) దంపతులు యువతకు ఆదర్శ్రపాయులు. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
తిరుపతిలో 3,4 తేదీల్లో.. ఆర్గానిక్ ఉత్పత్తుల మేళా!
ఆగస్టు 3, 4 తేదీల్లో తిరుపతిలోని తుడా బిల్డింగ్ వెనుక గల కచ్ఛపీ కళాక్షేత్రంలో ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులు, చేనేత వస్త్రాల మేళాను కనెక్ట్ టు ఫార్మర్స్ సంస్థ నిర్వహించనుంది. ఉ. 11 గం. నుంచి రాత్రి 8 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3వ తేదీ(శనివారం) ఉ. 11 గం.కు ప్రకృతి వనం వ్యవస్థాపకులు ఎంసీవీ ప్రసాద్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. దేశవాళీ వరి విత్తన ప్రదర్శన ్రపారంభం. 4(ఆదివారం)న ఉ. 10.30 గం.కు దేశవాళీ వరి విత్తన పరిరక్షణ ్రపాముఖ్యతపై అక్బర్, బాపన్న అవగాహన కల్పిస్తారు. మట్టి వినాయక బొమ్మల తయారీపై శిక్షణ ఉంటుంది.హైదరాబాద్లో పాలేకర్తో చర్చాగోష్టి నేడు..సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో పర్యావరణ హితమైన అల్కలైన్ ఆహారోత్పత్తుల ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర అంశాలపై ఈ నెల 30 (మంగళవారం)న హైదరాబాద్ ఫిల్మ్నగర్లో తెలుగు రాష్ట్రాల రైతులు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రచయితలు, వైద్యులు, పాత్రికేయులతో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ చర్చాగోష్టి జరగనుంది. ఈ నెల 30(మంగళవారం)న మధ్యాహ్నం 3–6 గంటల మధ్య జూబ్లీహిల్స్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ (ఫిలింనగర్ క్లబ్)లో చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు వి.నరసింహారెడ్డి (98662 46111), నరేశ్ (99481 58570), విజయరామ్ (63091 11427) తెలిపారు. పాలేకర్ ఆంగ్ల ప్రసంగాన్ని అప్పటికప్పుడు తెలుగులోకి అనువదిస్తారు. ప్రవేశం ఉచితం.4న మిరప, అపరాల సేంద్రియ సాగుపై శిక్షణ..సేంద్రియ పద్ధతిలో మిరప, అపరాల సాగు, వివిధ రకాల కషాయాలపై ఆగస్టు 4 (ఆదివారం) ఉ. 10 గంటల నుంచి హైదరాబాద్ ఖైరతాబాద్లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో రైతులకు నాగర్కర్నూల్కు చెందిన సీనియర్ ప్రకృతి వ్యవసాయదారు లావణ్యా రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 95538 25532ఇవి చదవండి: 'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట! -
ఈ యువరైతుకి.. అరుదైన ఘనత!
సిద్ధేశ్ సాకోర్ (28)... ఒక మారుమూల గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చదివారు. అయినప్పటికీ, తన తండ్రి వంటి చిన్న, సన్నకారు మెట్ట రైతుల ఆదాయాలు పెంచటం కోసం స్వగ్రామంలోనే ఉంటూ తన వంతుగా ఏదైనా చెయ్యాలన్నదే తపనంతా! ఈ తపనకు తోడైన ఆచరణే సిద్ధేశ్కి గత నెలలో ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది! దాని పేరే.. భూమి హీరో!ఐక్యరాజ్య సమితికి చెందిన కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ గత నెల 17న బ్రెజిల్లో భూమి పరిరక్షణ కృషిలో క్రియాశీలపాత్ర నిర్వహిస్తున్న పది మంది యువతకు భూమి హీరో పురస్కారాలు అందించింది. ఈ పురస్కార విజేతల్లో సిద్ధేశ్ ఒకరు. మన దేశం నుంచి ఈయనొక్కరికే ఈ గుర్తింపు దక్కింది. ఆయన ప్రయాణం ఆసక్తిదాయకం.. స్ఫూర్తిదాయకం..అతనిది మహారాష్ట్ర పుణే జిల్లా షిరూర్ తాలూకా ధామరి గ్రామం. పేద వ్యవసాయ కుటుంబంలో పెరిగిన సిద్ధేశ్ కరువు పీడిత మెట్ట ్రపాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశాడు. తాను వ్యవసాయం చేసి మార్పు తేవాలనుకున్నాడు. కొడుకు వ్యవసాయం చేయటం తండ్రికి ఇష్టం లేదు. కుటుంబ పొలాన్ని ఇవ్వనన్నాడు తండ్రి. మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చదవమన్నాడు. ఆ ప్రకారంగానే డిగ్రీ చదివిన సిద్ధేశ్ ఆ తర్వాత తమ జిల్లాలోనే గల విజ్ఞానాశ్రమంలో చేరి అనేక చిన్న యంత్రాలను ఆవిష్కరించాడు.వంటింటి వ్యర్థాలతో తక్కువ సమయంలో కంపోస్టు ఎరువు తయారు చేసే యంత్రాలను రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈలోగా కరోనాతో తండ్రి చనిపోయారు. అప్పటికి తండ్రి బ్యాంకు ఖాతాలో రూ. 3వేలు నిల్వ ఉందని చెబుతూ.. ఇదీ చిన్న రైతుల దుస్థితి అంటారాయన. భూములను సారవంతం చేసుకుంటూ రైతుల ఆదాయం పెంచే పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయంతో రైతుల తలరాత మార్చవచ్చని సిద్ధేశ్ బలంగా నమ్మాడు.ఐదెకరాల్లోపు వర్షాధార వ్యవసాయం చేసే రైతులు తగినంత ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. ఆదాయం ఎందుకు రావటం లేదు? వారి భూములు అతిగా రసాయనాలు వాడటం వల్ల నిస్సారమైపోతున్నాయి. సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువగానే ఉంది. ఆ నేలల్లో అరకొర దిగుబడులు రావటం, గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల బడుగు రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ వెతలన్నిటికీ మూలం సాగు భూమి అతిగా నిస్సారమైపోవటం అని గ్రహించిన సిద్ధేశ్ స్వగ్రామంలోనే ఉండి, వారసత్వ చిన్నకమతంలో పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. తోటి రైతులను కూడా ఆ దిశగా నడిపించే పనిని ్రపారంభించారు. ‘ఆగ్రో రేంజర్స్’ అనే లాభాపేక్ష లేని సంస్థను ఐదేళ్ల క్రితం స్థాపించాడు.సీజనల్ పంటలపైనే ఆధారపడకుండా చిన్న కమతాల రైతులు కూడా కొంత మేరకు పండ్ల తోటలు పండించుకుంటూ.. రసాయన వ్యవసాయం నుంచి స్థిరమైన సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఆగ్రో రేంజర్స్ రైతులకు మద్దతు ఇస్తోంది. బహుళ పంటలు పండించే పండ్ల చెట్ల ఆధారిత ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను ఆగ్రో రేంజర్స్ అభివృద్ధి చేసింది. ఇది రైతులకు స్థిరంగా ఆదాయం వచ్చేలా చేస్తుంది. అదే సమయంలో నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది.గత 5 సంవత్సరాలుగా సిద్ధేశ్ బృందం 1,200 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. 23 గ్రామాల్లో వందకు పైగా ఎకరాల్లో రీజనరేటివ్ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను క్షేత్రస్థాయిలో అమల్లోకి తేగలిగారు. రెండు, మూడు సంస్థల్లో నైపుణ్య శిక్షణ పొందటం ద్వారా, అనేక సంస్థల ఆర్థిక తోడ్పాటుతో ఆగ్రోరేంజర్స్ బృందం లోపాలను సరిదిద్దుకొని పురోగమిస్తోంది.రైతులు శిక్షణ తీసుకున్నప్పటికీ సాగు పద్ధతి మార్చుకోవటానికి ముందుకు రాకపోవటాన్ని గమనించి.. పండ్ల మొక్కలను, డ్రిప్ లేటరల్స్తో పాటు నాణ్యమైన శిక్షణ ఇవ్వటంతో మార్పు క్రమంగా వస్తోందని సిద్ధేశ్ తెలిపారు. వారికి ఎప్పుడు ఏమి అవసరమైతే అది చెబుతూ ముందుకు తీసుకువెళ్తే ఒక్కసారి ఈ పద్ధతి వల్ల ఆదాయం పెరిగితే ఇక వారికి నమ్మకం కుదురుతుంది. నేల క్షీణతను, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనే దిశగా పునరుజ్జీవ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనా సాగు పద్ధతిని చిన్న, సన్నకారు రైతులకు అందించే కృషిలో గ్రామీణ యువతను విరివిగా భాగస్వామ్యం చేయాలని సిద్ధేశ్ ఆశిస్తున్నారు.పుణేలోని లఖేవాడికి చెందిన రైతు జలంధర్ చేమాజీ మావ్లే మాటల్లో చె΄్పాలంటే.. ‘భూతాపం పెరిగిపోవటం అనే సమస్యను ఎదుర్కోవడానికి, సాధ్యమైనంత ఎక్కువ చెట్లను పెంచటం ఉత్తమం. అందువల్ల, పండ్ల మొక్కలు, బిందు సేద్యం, విలువైన పాఠాలతో నాకు సహాయం చేసిన ఆగ్రో రేంజర్స్ బృందంతో నేను కనెక్ట్ అయ్యాను. ఇది వాతావరణ మార్పుపై పోరాటంలో మాత్రమే కాదు. నాకు స్థిరమైన ఆదాయం కూడా వస్తోంది. రెండు ఎకరాల భూమి గతంలో పండ్ల మొక్కలు నాటాను. ఈ సంవత్సరం మరో మూడు ఎకరాల భూమి కోసం ప్లాన్ చేస్తున్నాను’.ఇవి చదవండి: కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల! -
కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల!
దేశవ్యాప్తంగా పత్తి పంటకు పెనునష్టం కలిగిస్తున్న గులాబీ పురుగును సమర్థంగా అరికట్టే కృషిలో నాగపూర్లోని కేంద్రీయ పత్తి పరిశో«దనా సంస్థ (ఐసిఎఆర్–సిఐసిఆర్) పెద్ద ముందడుగు వేసింది. కృత్రిమ మేధ (ఎఐ)తో నడిచే హైటెక్ ఫెరమోన్ ట్రాప్లను పంజాబ్ రైతులకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. పంటలపై పురుగుల నియంత్రణలో కృత్రిమ మేధ సాంకేతికతను దేశంలోనే మొట్టమొదటి సారిగా వాడిన ఘనతను సిఐసిఆర్ దక్కించుకుంది.సంప్రదాయ లింగాకర్షక బుట్టలతోపోల్చితే ఈ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ట్రాప్లు చాలా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయని పంజాబ్ పత్తి రైతులు సంతోషిస్తున్నారు. పురుగుల తీవ్రతపై ప్రతి గంటకు రైతుల మొబైల్కు, కంప్యూటర్కు సమాచారం అందించటం ఈ ఎఐ ఫెరమోన్ ట్రాప్ ప్రత్యేకత. దీని ప్రకారం వ్యవసాయ విస్తరణాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు వెంటనే నియంత్రణ చర్యలు సూచిస్తున్నారు.అదే రోజు ఆ చర్యలను రైతులు అమలు చేస్తుండటం వల్ల గులాబీ పురుగు వల్ల నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతున్నానని పంజాబ్ రైతు జగదేవ్సింగ్ చె΄్పారు. 2021 నుంచి వరుసగా మూడేళ్లుగా ఉగ్రరూపం దాల్చిన గులాబీ పురుగు బారిన పడి పంటను తీవ్రంగా నష్ట΄ోయిన రైతుల్లో ఈయన ఒకరు. ఎకరంన్నరలో బీజీ2 పత్తి సాగు చేస్తున్నారు. మూడు జిల్లాల్లో మరో 17 మంది రైతులు సిఐసిఆర్ పైలట్ ప్రాజెక్టు వల్ల ఈ ఏడాది పత్తి పంటపై దిగులు లేకుండా గడుపుతున్నారు.పత్తి పంటలో గులాబీ పురుగు తీవ్రతను గుర్తించడానికి హెక్టారుకు 5 చొప్పున లింగాకర్షక బుట్టలు పొలంలో వేలాడగడతారు. గాసిప్లూర్ అనే రసాయనిక ల్యూర్ను ఈ బుట్టలో పెడతారు. అది అడ పురుగుల వాసనగా పొరపడి ఆకర్షితులై వచ్చే మగ పురుగులు ఆ బుట్టలో చిక్కుకుంటాయి. వీటి సంఖ్యను బట్టి గులాబీ పురుగు తీవ్రతను అంచనా వేసి, క్రిమిసంహారకాలు చల్లుతారు. స్మార్ట్ ట్రాప్ ఎలా పనిచేస్తుంది?డిజిటలీకరించిన ఈ స్మార్ట్ ట్రాప్ సోలార్ విద్యుత్తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ట్రాప్ వ్యవస్థలో సింగిల్ బోర్డ్ కంప్యూటర్, కెమెరా మోడ్యూల్, వాతావరణ సెన్సార్, సోలార్తో నడిచే జిఎస్ఎం ట్రాన్స్మిటర్, రీచార్జిబుల్ బ్యాటరీ ఉంటాయి. ట్రాప్లోకి వచ్చి అతుక్కు΄ోయిన పురుగులను నిరంతరం ఈ కెమెరా ఫొటోలు తీసి, క్లౌడ్లోని రిమోట్ సర్వర్కు ఎప్పటికప్పుడు పంపుతుంది. ఆ ఫొటోలను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ను ఉపయోగించి ఏయే రకాల పురుగులన్న విశ్లేషణ జరుగుతుంది. గులాబీ పురుగునకు చెందిన రెక్కల పురుగులు ఎన్ని అనే విషయం ఇలా నిర్థారణ అవుతుంది. ఈ సమాచారంతో పాటు వాతావరణ వివరాలు స్మార్ట్ ట్రాప్కు అనుసంధానించిన మొబైల్/కంప్యూటర్లకు సంక్షిప్త సందేశాల రూపంలో చేరుకుంటాయి. ఈ విధంగా రైతులు సకాలంలో పురుగు తీవ్రతను గుర్తించి, క్రిమిసంహారాలు వాడి పత్తిని గులాబీ పురుగు నుంచి రక్షించుకుంటున్నారు.‘గతంలో సాధారణ లింగార్షక బుట్టలను పత్తి పొలంలో పెట్టి, ప్రతి 3 రోజులకోసారి స్వయంగా పొలానికి వెళ్లి చూసేవాడిని. నేను వెళ్లి చూసినప్పుడు పురుగులు పెద్దగా లేక΄ోవచ్చు. కానీ, తర్వాత రెండు రోజులు అటు వెళ్లను. ఆ తర్వాత రోజు వెళ్లేటప్పటికే పురుగు ఉధృతితో పంటకు తీవ్ర నష్టం జరిగి΄ోతూ ఉండేది. ఏ రోజు, ఏయే వేళలో పురుగు ఎక్కువ పంటను ఆశించిందీ మాకు తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు ఆ సమస్యల్లేవు. ప్రతి గంటకు మెసేజ్ వస్తుంది. అవసరమనిపిస్తే వెంటనే స్పందించి పిచికారీలు చేసి పంటను కాపాడుకుంటున్నాం..’ అన్నారు రైతు జగదేవ్సింగ్. సకాలంలో గులాబీ పురుగుకు చెక్..పత్తి పొలంలోని లింగాకర్షక బుట్టల్లో వరుసగా 3 రోజులు రోజుకు 8 చొప్పున గులాబీ రెక్కల పురుగులు కనిపిస్తే.. పంట దిగుబడిని భారీగా నష్టపరిచే స్థాయిలో పురుగు ఉందని అర్థం. అయితే, సాధారణ లింగాకర్షక బుట్టలను రైతులు పొలంలో పెట్టుకున్నప్పటికీ.. వాటిలో ఎన్ని పురుగులు పడుతున్నాయో గమనించే రైతులను మేం గతంలో చాలా అరుదుగా చూశాం. ఎందుకంటే, ఆ పని చేయటానికి వారికి చాలా సమయం అవసరం పడుతుంది. రైతు లు పత్తితో పాటు ఇతర పంటల పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా.ఈ కొత్త వ్యవస్థ వారి సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతుంది. ఫోన్లోకి వచ్చే సమాచారంతో పత్తి రైతులు గులాబీ పురుగు ఉనికిని సకాలంలో గుర్తించగలుగుతారు. తగిన సమయంలో క్రిమిసంహారకాలను చల్లి, పంట నష్టాన్ని సమర్థవంతంగా తగ్గించుకుంటున్నారు. కృత్రిమ మేధతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫెరమోన్ ట్రాప్ తక్కువ ఖర్చుతోనే గులాబీ పురుగును సమర్థవంతంగా అరికడుతోంది. ఇవి రైతులు స్వయంగా పొలాల్లో ఏర్పాటు చేసుకోవటానికి ఉద్దేశించి రూపొందించినవి కాదు. తహసిల్ స్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు పురుగు తీవ్రతను సకాలంలో గుర్తించి, రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వటానికి డిజిటల్ సాధనాలుగా వాడుకోవడానికి స్మార్ట్ ట్రాప్స్ ఉపయోగపడుతాయి. తక్కువ సాంద్ర గ్రిడ్ పద్ధతిలో రైతుల పొలాల్లో ప్రభుత్వం ఈ స్మార్ట్ ట్రాప్లను ఏర్పాటు చేయవచ్చు.– డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్ -
మట్టి కొట్టుకెళ్లనివ్వని సాగు! పీఎండీఎస్!
పంటలకు ప్రాణప్రదమైన భూమి పైపొర మట్టి వర్షపు నీటితో భారీగా కొట్టుకు పోతోంది. మట్టితో కూడిన బురద నీరు వరదలా పారుతుంటే.. ఇది ‘ప్రవహిస్తున్న భూమాత రక్తం’ అని ఓ రైతు శాస్త్రవేత్త ఆవేదన చెందారు. మట్టిని కొట్టుకెళ్లనివ్వని సాగు పేరు పిఎండిఎస్.. పిఎండిఎస్ ప్రయోజనాలు: నేల గుల్ల బారి వానపాములు వృద్ధి చెందుతాయి నేలలో నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యం పెరుగుతుంది పోషక విలువలతో కూడిన నవధాన్య పంటలు పశువులకు పచ్చి మేతగా ఉపయోగ పడతాయిఏకకాలంలో బహుళ పంటలు వేయటం వలన అదనపు ఆదాయం వస్తుంది ప్రధాన పంటల్లో కలుపు సమస్య ఉండదు. నేల కోతకు గురి కాదు ప్రధాన పంటల దిగుబడులు పెరుగుతాయి ∙నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది మట్టిలో సూక్ష్మజీవుల జీవవైవిధ్యం పెరుగుతుంది ∙ప్రధాన పంటలకు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది ప్రధాన పంటలకు చీడపీడలు, తెగుళ్ళను తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది వివిధ పంటల వేర్లు భూమిలో వివిధ రకాల సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పిస్తాయి. ఈ సూక్ష్మజీవుల కార్యకలాపాల ద్వారా ప్రధాన పంటకు కావలసిన స్థూల, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా అందుతాయి ప్రధాన పంటకు అతివృష్టి, అనావృష్టి వంటి వాతావరణ వైపరీత్యాలను తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది ∙ఏడాదిలో 365 రోజులు బహుళ పంటలతో భూమిని కప్పి ఉంచే సేద్యం ఇలా సాధ్యమవుతుంది భూమిని పలు పంటలతో పూర్తిగా కప్పి ఉంచడం వల్ల నీరు ఆవిరికాకుండా ఉంటుంది.ప్రపంచ వ్యాప్తంగా భూముల్లో నుంచి ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల మట్టి వాన నీటితో పాటు కొట్టుకు΄ోతోంది. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.2శాతం మాత్రమే. అయితే, ప్రపంచం ఏటా కోల్పోతున్న మట్టిలో 23శాతంని, హెక్టారుకు సగటున 16శాతం టన్నుల మట్టిని మన దేశం కోల్పోతున్నదని ఎఫ్.పి.ఓ. చెబుతున్న లెక్క. అయితే, ఢిల్లీ ఐఐటిలోని పరిశోధకుల బృందం ‘సాయిల్ ఎమర్జెన్సీ’ గురించి తాజా అధ్యయనం విస్తుగొలిపే గణాంకాలను బయటపెట్టింది. అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎకరానికి ఏటా 100 టన్నులకు పైగా మట్టి కొట్టుకు΄ోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెక్టారుకు హెక్టారుకు ఏటా 15 నుంచి 30 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎడారీకరణకు గురవుతున్న రాయలసీమ వంటి కొన్ని చోట్ల ఏకంగా 50 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనం తేల్చింది. అడవుల నరికివేత, ప్రతి ఏటా అతిగా దుక్కిచేయటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వాతావరణ మార్పులతో కుండ΄ోత వర్షాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రం తమ భూముల్లో మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడుకోగలుగుతుండటం విశేషం. పోర్చుగల్కు చెందిన స్వచ్ఛంద సంస్థ గెల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇటీవల అందుకున్న సందర్భంలో.. ప్రకృతి సాగులో ఒక ముఖ్యభాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అనే వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం. సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర స్థితిని మానవాళి దీటుగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి. విజయకుమార్ అంటున్నారు. 2023–24లో 8 లక్షల 60 వేల మంది రైతులు 3.80 లక్షల హెక్టార్లలో పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో ఎండాకాలంలో వానకు ముందే విత్తారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పి.ఎం.డి.ఎస్. సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాలను కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కాపాడుకుంటూ.. సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30–60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు. -
ఇనుప బట్టీలతో బయోచార్ : బెట్ట నుంచి రక్షణ, 15శాతం అదనపు పంట!
పంట కోతలు పూర్తయ్యాక పత్తి, కంది, సోయా తదితర పంటల కట్టెకు నిప్పుపెట్టి పర్యావరణానికి హాని చేసే కన్నా.. ఆ కట్టెతో కట్టె బొగ్గు (బయోచార్) తయారు చేసి, తిరిగి భూములను సారవంతం చేసుకోవచ్చు. ఎకరానికి టన్ను బయోచార్ కం΄ోస్టు వాడితే పంటలు బెట్టను తట్టుకుంటాయి. తద్వారా పంట దిగుబడులను 12–15% వరకు పెంచుకోవచ్చని మహారాష్ట్రలో ఓ రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనుభవం చాటి చెబుతోంది..పంట వ్యర్థాలను తగులబెట్టటం పరిపాటి. ఇది పర్యావరణానికి హాని చేసే పని. పత్తి కట్టె, కంది కట్టె వంటి పంట వ్యర్థాలను కాలబెట్టటం వల్ల గాలి కలుషితమై కార్బన్డయాక్సయిడ్ శాతం పెరిగిపోతంది. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. రసాయనిక ఎరువుల వాడకం పెరిగిపోయింది. ఫలితంగా సాగుభూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయింది. మట్టికి నీటిని పట్టి ఉంచే శక్తి లోపించటం, వాన నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం తగ్గి΄ోవటం, సూక్ష్మజీవరాశి నశించటం వల్ల భూములు నిస్సారమైపోతున్నాయి. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో 4 లక్షల హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో కంది పంటలను రైతు సాగు చేస్తారు. పంట కోత పూర్తయిన తర్వాత రైతులు పత్తి, కంది కట్టెను కాల్చివేస్తారు. దీని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా భూమికి తిరిగి అందాల్సిన సేంద్రియ పదార్థం అందకుండా పోతోంది. బిఎఐఎఫ్ (బైఫ్) డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే పుణేకు చెందిన స్వచ్ఛంద సంస్థ యవత్మాల్ రైతులతో కలసి పనిచేసి ఈ పరిస్థితిలో విజయవంతంగా మార్పుతెచ్చింది. పత్తి, కంది కట్టెను వట్టిగా కాలబెట్టకుండా.. ఒక పద్ధతి ప్రకారం (దీన్నే పైరోలిసిస్ అంటారు) కాల్చితే బొగ్గుగా మారుతుంది. దీన్నే బయోచార్ అంటారు. దీన్ని సేంద్రియ ఎరువులతో కలిపి బయోచార్ కంపోస్టుగా మార్చి భూమిలో చల్లితే మట్టిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంతతి పెరిగి భూసారం మెరుగవుతుంది. బయోచార్ కంపోస్టు వాడకం వల్ల ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ నేలలకు బెట్టను తట్టుకునే శక్తిని పెంపొందిస్తాయి. బయోచార్ కంపోస్టు తయారు చేయాలంటే.. బయోచార్ను ఉత్పత్తి చేసే ఇనుప బట్టీని ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత చిన్న రైతులకు విడిగా ఉండదు. అందుకని బైఫ్ ఫౌండేషన్ రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్.పి.ఓ.ని) 2019లో రిజిస్టర్ చేయించింది. 220 మంది రైతులను కూడగట్టి ఒక్కొక్క రైతు నుంచి రూ. వెయ్యి షేర్ ధనంతో ఎఫ్.పి.ఓ.ను రిజిస్టర్ చేయించారు. పత్తి, కంది కట్టెను కాల్చవద్దని, దీనితో ఎఫ్పిఓ తరఫున బయోచార్ తయారు చేసుకొని పంటలకు వాడుకుంటే బెట్టను తట్టుకొని మంచి దిగుబడులు పొందవచ్చని బైఫ్ ఫౌండేషన్ సిబ్బంది రైతులకు ఆలోచన కలిగించారు. 2021 జనవరిలో ఎఫ్పిఓ పత్తి కట్టెను రైతుల నుంచి కిలో రూ. 2.5–3లు చెల్లించి కొనుగోలు చేసింది. రూ. 60 వేల ఖర్చుతో బ్యాచ్కు 200 కిలోల కట్టెను కాల్చే ఇనుప బట్టీని ఎఫ్పిఓ కొనుగోలు చేసింది. ఈ బట్టీ ద్వారా పైరోలిసిస్ పద్ధతిలో ఈ కట్టెను కాల్చి బొగ్గును తయారు చేసింది. బొగ్గును పొడిగా మార్చి గోనె సంచుల్లో నింపి ఎఫ్పిఓ తిరిగి రైతులకే అమ్మింది. మార్కెట్ ధర కన్నా కిలోకి రూ. 2, 3 తగ్గించి అమ్మింది. 2021–22లో ఎఫ్పిఓ విజయవంతంగా 100 టన్నుల పత్తి కట్టెతో 25 టన్నుల బయోచార్ను ఉత్పత్తి చేయగలిగింది. ఎఫ్పిఓ బయోచార్ ఉత్పత్తిని చేపట్టటం వల్ల చాలా మందికి పని దొరికింది. కాల్చేసే పత్తి కట్టెను రైతు అమ్ముకొని ఆదాయం పొందాడు. కట్టెను సేకరించటంలో కూలీలకు పని దొరికింది. వాహనదారులకు కట్టెను బట్టీ దగ్గరకు చేర్చే పని దొరికింది. చివరికి బయోచార్ను రైతులే తిరిగి తక్కువ ధరకు కొనుక్కోగలిగారు. అంతిమంగా కాలబెడితే ఆవిరైపోయే పత్తి కట్టె.. ఎఫ్పిఓ పుణ్యాన భూమిని సుదీర్ఘకాలం పాటు సారవంతం చేసే బయోచార్గా మారి తిరిగి ఆ పొలాలకే చేరటం విశేషం. హెక్టారుకు 2.5 టన్నుల బయోచార్ కంపోస్టును దుక్కిలో వేశారు. ఏటేటా పంట దిగుబడులు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా భూముల్లో నుంచి ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల మట్టి వాన నీటితో పాటు కొట్టుకు΄ోతోంది. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.2% మాత్రమే. అయితే, ప్రపంచం ఏటా కోల్పోతున్న మట్టిలో 23%ని, హెక్టారుకు సగటున 16% టన్నుల మట్టిని మన దేశం కోల్పోతున్నదని ఎఫ్.పి.ఓ. చెబుతున్న లెక్క. అయితే, ఢిల్లీ ఐఐటిలోని పరిశోధకుల బృందం ‘సాయిల్ ఎమర్జెన్సీ’ గురించి తాజా అధ్యయనం విస్తుగొలిపే గణాంకాలను బయటపెట్టింది. అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎకరానికి ఏటా 100 టన్నులకు పైగా మట్టి కొట్టుకుపోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెక్టారుకు హెక్టారుకు ఏటా 15 నుంచి 30 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎడారీకరణకు గురవుతున్న రాయలసీమ వంటి కొన్ని చోట్ల ఏకంగా 50 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనం తేల్చింది. అడవుల నరికివేత, ప్రతి ఏటా అతిగా దుక్కిచేయటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వాతావరణ మార్పులతో కుండపోత వర్షాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రం తమ భూముల్లో మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడుకోగలుగుతుండటం విశేషం. పోర్చుగల్కు చెందిన స్వచ్ఛంద సంస్థ గెల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇటీవల అందుకున్న సందర్భంలో.. ప్రకృతి సాగులో ఒక ముఖ్యభాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అనే వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం. సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర స్థితిని మానవాళి దీటుగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి. విజయకుమార్ అంటున్నారు. 2023–24లో 8 లక్షల 60 వేల మంది రైతులు 3.80 లక్షల హెక్టార్లలో పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో ఎండాకాలంలో వానకు ముందే విత్తారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పి.ఎం.డి.ఎస్. సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాలను కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కా΄ాడుకుంటూ.. సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30–60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు.ఎకరానికి టన్ను బయోచార్ కంపోస్టుయవత్మాల్ జిల్లాలోని 0.5% కన్నా తక్కువగా ఉండే వర్షాధార పత్తి తదితర పంటలు పండించే నేలలను బయోచార్ కంపోస్టు పోషకవంతం చేయటమే కాకుండా నీటిని పట్టి ఉంచే సామర్ధ్యాన్ని, కరువును తట్టుకునే శక్తిని పెంపొదించింది. బయోచార్ను ఎంత మోతాదులో వేయాలనే దాన్ని ఇంకా ప్రామాణీకరించాల్సి ఉంది. హెక్టారుకు 1 నుంచి 10 టన్నుల వరకు సూచిస్తున్న సందర్భాలున్నాయి. రైతుకు మరీ భారం కాకుండా వుండేలా హెక్టారుకు 2.5 టన్నుల (ఎకరానికి టన్ను) చొప్పున బయోచార్ కంపోస్టును వేయించాం. బొగ్గు పొడితో వర్మీకంకంపోస్టు, అజొటోబాక్టర్, అజోస్పిరిల్లమ్ వంటి జీవన ఎరువులను కలిపి బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని పంట పొలాల్లో వాడాం. ఆ సంవత్సరంలోనే పత్తి, సోయా వంటి పంటల దిగుబడి 12–15% పెరిగింది. పోషకాలను నిదానంగా దీర్ఘకాలం పాటు పంటలకు అందించేందుకు, బెట్టను తట్టుకునేందుకు బయోచార్ ఉపకరిస్తుంది. బయోచార్ వినియోగం వల్ల ఒనగూడే ప్రయోజనాలను రైతులు పూర్తిగా గుర్తించేలా ప్రచారం చేయటానికి ప్రభుత్వ మద్దుతు అవసరం ఉంది. ఎఫ్పిఓలు తయారు చేసే బయోచార్ కంపోస్టుకు ప్రభుత్వం మార్కెటింగ్కు అవకాశాలు పెంపొందించాలి.– గణేశ్ (98601 31646), బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్, పుణే -
ఔషధ మొక్కల వ్యాపారంపై శిక్షణ
సుగంధ మొక్కల వ్యాపార అవకాశాలపై 10 రోజుల ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుజరాత్ ఆనంద్లోని ఐసిఎఆర్ సంస్థ అయిన డైరెక్టరేట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ లాంట్స్ రీసెర్చ్కు చెందిన మెడి–హబ్ ఆగస్టు 1 నుంచి 12వ తేదీ వరకు రోజుకు జరుగుతుంది. రెండు విడతలుగా మొత్తం 5.30 గంటలపాటు ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఉ. 10 గం. నుంచి మ. 12.30 వరకు, మ. 2 గం. నుంచి సా. 5.30 వరకు ఇంగ్లీష్/హిందీలో జూమ్ ద్వారా శిక్షణ ఇస్తారు. వివరాలకు.. డా. స్నేహల్కుమార్ ఎ పటేల్, వాట్సాప్: 99098 52552. ఆసక్తి ఉన్న వారు ఈ గుగుల్ ఫామ్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలి -
దుక్కి చేయని సేద్యం.. దుఃఖం లేని భాగ్యం!
వరి సాగులో రసాయనిక ఎరువులు, సాగు నీటి వాడకాన్ని దిగుబడి తగ్గకుండా తొలి ఏడాదే సగానికి తగ్గించుకోగలమా? వరి పొలాల నుంచి వెలువడే మిథేన్ వాయువు (బొగ్గుపులుసు వాయువు కంటే ఇది భూతా΄ాన్ని 20 రెట్లు ఎక్కువగా పెంచుతోంది) ని అరికట్టే మార్గం ఏమిటి? ఏటా దుక్కి చేసే పంట భూముల్లో నుంచి ఏటా హెక్టారుకు 20 టన్నుల మట్టి వానకు గాలికి కొట్టుకుపోతోంది.దీన్ని ఆపటం ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోగలమా? భారీ ఖర్చుతో నిర్మించిన రిజర్వాయర్లు కొద్ది ఏళ్లలోనే పూడికతో నిండిపోకుండా చెయ్యగలమా..? భూగర్భజలాలు వర్షాకాలంలో (రెండు నెలలుగా మంచి వర్షాలు పడుతున్నప్పటికీ) కూడా అడుగంటే వుంటున్నాయెందుకు? ఈ పెద్ద ప్రశ్నలన్నింటికీ సమాధానం ‘ఒక్కటే’ అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు.. అవును.. సాగు పద్ధతిని మార్చుకోవటం అనే ఒక్క పని చేస్తే చాలు..వరి, పత్తి వంటి తదితర పంటల సాగును ’సగుణ రీజెనరేటివ్ టెక్నిక్’ (ఎస్.ఆర్. టి.) అనే నోటిల్లేజ్ ఆరుతడి పద్ధతిలోకి మార్చుకుంటే పై సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని అనుభవపూర్వకంగా చెబుతున్నారు రైతు శాస్త్రవేత్త చంద్రశేఖర్.పొలాన్ని దున్ని ఒక్కసారి ఎత్తుమడులను ఏర్పాటు చేస్తే చాలు.. 20 ఏళ్లు మళ్లీ దున్నే పని లేకుండానే ఏటా మూడు పంటలు పండించుకోవచ్చు.వరి దగ్గర నుంచి పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయ పంటలను సాగు చేస్తూ చంద్రశేఖర్ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు.రసాయనాలను తగుమాత్రంగా వాడుతూ ఖర్చును, శ్రమను తగ్గించుకొని దిగుబడులతో΄ాటు సేంద్రియ కర్బనాన్ని సైతం 0.3% నుంచి 1.5%కి పెంపొందించానన్నారు.జమ్మికుంటలోని జి.ఎన్.ఎన్.ఎస్. ప్రశాశం కేవీకే ఆవరణలో ఎస్.ఆర్.టి. పద్ధతిలో శాశ్వత ఎత్తుమడులపై ఆరుతడి వరి సాగుకు ఇటీవల శ్రీకారం చుట్టారు. చంద్రశేఖర్ స్వయంగా హాజరై రైతులకు, శాస్త్రవేత్తలకు మెళకువలు నేర్పించారు. ఇతర వివరాలకు.. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరావు (98485 73710)ను సంప్రదింవచ్చు.1. 136 సెం.మీ. దూరంలో మార్కింగ్ చేసుకొని.. 100 సెం.మీ. వెడల్పుతో శాశ్వత బెడ్స్ను ఏర్పాటు చేసుకోవాలి. రెండు వైపులా కాలువలు ఉండాలి.2. ఎస్.ఆర్.టి. ఫ్రేమ్తో బెజ్జాలు వేసుకొని బెడ్పై వరి విత్తనాలను 5 వరుసలుగా విత్తుకోవాలి. మొక్కలు, వరుసల మధ్య దూరం 25 సెం.మీ.లు.3. కాలువల్లో నీరు పెట్టుకొని.. వరి విత్తనాలను ఇలా విత్తుకోవచ్చు..4. మహరాష్ట్రలోని చంద్రశేఖర్ పొలంలో ఎత్తుమడులపై వరి పంట ఇది. పొలం అంతా ఒకే మాదిరిగా పెరిగి కోతకు సిద్ధమైన దృశ్యం.5. వరి పంటలో నీటిని నిరంతరం నిల్వ ఉంచకూడదు. అవసరాన్ని బట్టి ఆరుతడులు ఇవ్వాలి. ఒక్కసారి మాత్రమే యూరియా వేయాలి.6. విత్తనాలు వేసిన తర్వాత కలుపు మొలవకుండా ఎంపిక చేసిన గడ్డి మందును పిచికారీ చేయాలి.భూమిని పంట వేసిన ప్రతి సారీ దున్నకుండా వ్యవసాయం (నోటిల్లేజ్ / జీరోటిల్లేజ్ వ్యవసాయం) చెయ్యగలిగితే భూమి కోతను అరికట్టి భూసారాన్ని పెంపొందించుకోవటానికి అంతకుమించి మరో ఉత్తమ మార్గం ఉండదు. ఈ పద్ధతిని దీర్ఘకాలం సాగులో ఉండే పండ్ల తోటల్లో త్రికరణశుద్ధితో అనుసరించే ప్రకృతి/సేంద్రియ వ్యవసాయదారులు చాలా మంది కనిపిస్తుంటారు. అయితే, మూడు, నాలుగు నెలల్లో పూర్తయ్యే సీజనల్ పంటలను నోటిల్లేజ్ పద్ధతిలో శ్రద్ధగా సాగు చేసే రైతులు మాత్రం అత్యంత అరుదు. ఈ కోవకు చెందిన వారే చంద్రశేఖర్ హరి భడ్సావ్లే(74).మహారాష్ట్ర రాయ్గడ్ జిల్లా కర్జత్ తాలూకాలోని దహివాలి సమీపంలో చంద్రశేఖర్ హరి భడ్సావ్లే వ్యవసాయ క్షేత్రం ‘సగుణబాగ్’ ఉంది. మహారాష్ట్రలో అగ్రిబిఎస్సీ చదివిన తర్వాత అమెరికాలో ఎం.ఎస్.(ఫుడ్ టెక్) చదువుకొని ఇంటికి తిరిగి వచ్చి.. 48 ఏళ్ల క్రితం వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టిన చంద్రశేఖర్ అప్పటి నుంచి మొక్కవోని దీక్షతో 55 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. సుదీర్ఘ సేద్య అనుభవాన్ని రంగరించి వెలువరించిన అనేక ఆవిష్కరణలతో ఎత్తుమడులపై నోటిల్లేజ్ సాగును ఈయన కొత్తపుంతలు తొక్కిస్తున్నారు.ఆరుతడి వరి దగ్గర నుంచి పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి పదికి పైగా పంటలను సాగు చేస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఒకటి తర్వాత మరొకటి పంటల మార్పిడి చేస్తూ ఖర్చుల్ని తగ్గించుకుంటూ దిగుబడులతో΄ాటు పనిలోపనిగా భూసారాన్ని సైతం పెంపొందిస్తున్నారు. తగుమాత్రంగా రసాయనిక ఎరువులతో ΄ాటు కలుపు మందును వాడుతున్నారు. గత 12 ఏళ్లుగా నోటిల్లేజ్ సాగులో చక్కని ఫలితాలు సాధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ సాగు పద్ధతిని ఇప్పుడు కనీసం మరో పది వేల మంది అనుసరిస్తున్నారు.రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించే సాగు పద్ధతిగా ‘రీజెనరేటివ్ అగ్రికల్చర్’ (పునరుజ్జీవన వ్యవసాయం) అనే మాట వాడుకలో ఉంది. అయితే, ఈ మాటకు తనదైన శైలిలో సరికొత్త అర్థం చెబుతున్నారు చంద్రశేఖర్.ఎత్తుమడులపై ఆరుతడి పంట (వరి కావచ్చు, మరొకటి కావచ్చు) కోసిన తర్వాత మోళ్లు మిగులుతాయి. వాటి కింద నేలలో వేర్లుంటాయి. మరో పంట వేసుకోవటానికి వీలుగా ఈ మోళ్లను వదిలించుకొని శుభ్రం చేయటం ఎలాగన్నది పెద్ద సమస్య.అయితే, ఈ సమస్యనే చంద్రశేఖర్ అద్భుతమైన పరిష్కారంగా మార్చుకున్నారు. మోళ్లను వేర్లతో సహా పీకెయ్యటమో, కాల్చెయ్యటమో కాకుండా.. వాటిని ఒక చిన్న పనితో పొలంలో కురిసే వాన నీటిని అక్కడికక్కడే ఒడిసిపట్ఠి భూమిలోకి ఇంకింపజేసేందుకు చక్కని సాధనంగా మార్చుకుంటున్నారు. మోళ్లపై కలుపుమందు చల్లటంతో నిర్జీవమవుతాయి. తిరిగి మొలకెత్తవు. కుళ్లిపోతాయి. అప్పుడు తదుపరి పంట విత్తనాలను మనుషులతోనో లేదా సీడ్ డిబ్లర్తోనో కోవచ్చు.మోళ్లు, వేర్లు కుళ్లిపోయి పోషకాలు పంటకు అందుబాటులోకి వస్తాయి. ఆఖాళీల ద్వారా వాన నీరు వేగంగా ఇంకుతుంటుంది. వేరు వ్యవస్థలో మట్టికి పుష్కలంగా గాలి, పోషకాలు అందుతాయి. సూక్ష్మజీవరాశి, వాన΄ాములతో ΄ాటు సేంద్రియ కర్బనం పెరుగుతుంది. పంట కోసిన తర్వాత మోళ్లపై కలుపు మందు చల్లుతున్న కారణంగానే ఈ ప్రక్రియ సౌలభ్యకరంగా, వేగవంతంగా జరుగుతోందని చంద్రశేఖర్ చెబుతారు. నోటిల్లేజ్ సాగు పద్ధతిలో ఇది అత్యంత కీలకమైన అంశమని ఆయన అంటున్నారు.‘సగుణ’తో సకల ప్రయోజనాలు!నేను అగ్రికల్చర్ బీఎస్సీ, అమెరికాలో ఎమ్మెస్ చదివి కూడా 48 ఏళ్లుగా 55 ఎకరాల్లో శ్రద్ధగా వ్యవసాయం చేస్తున్నా. గత పన్నెండేళ్లుగా ఎస్.ఆర్.టి. పద్ధతిలో దుక్కి దున్నకుండా వరుసగా అనేక పంటలు పండిస్తున్న అనుభవంతో చెబుతున్నా. నోటిల్లేజ్ సాగు రైతులకు సౌలభ్యకరంగా, అనేక రకాలుగా ప్రయోజనకరంగా ఉంది.ప్రతి పంటకూ ముందు, వెనుక దుక్కి దున్నటం వల్ల వానకు, గాలికి భూమి కోతకు గురై ఏటా హెక్టారుకు 20 టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. దుక్కి చేయకుండా విత్తనాలు వేస్తున్నందు వల్ల సాయిల్ అగ్రిగేషన్ జరిగి పొలంలో మట్టి వానకు, గాలికి కొట్టుకుపోవటం ఆగిపోతుంది. రసాయనిక కలుపు మందులు వాడటం వల్ల కలుపు సమస్య తీరిపోతుంది. ΄ాత పంటల మోళ్లు, వేర్లు కుళ్లటం వల్ల పోషకాల పునర్వినియోగం జరుగుతుంది.ఆ రంధ్రాల ద్వారా పొలంలోనే వాన నీటి సంరక్షణ అత్యంత సమర్థవంతంగా జరుగుతుంది. బెట్టను తట్టుకునే శక్తి పంటలకు కలుగుతుంది. నీటిని నిల్వగట్టే పద్ధతిలో సాగయ్యే వరి పొలం మాదిరిగా మిథేన్ వాయువు వెలువడదు. కాబట్టి, భూతాపం గణనీయంగా తగ్గుతుంది. కలుపు మందు వల్ల కలిగే నష్టంతో పోల్చితే రైతుకు, భూమికి, పర్యావరణానికి ఒనగూడే ప్రయోజనాలు చాలా ఎక్కువ.నానా బాధలు పడి సాగు చేసే రైతు ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటున్నాడు. ఎస్.ఆర్.టి. సాగు పద్ధతి వల్ల రైతులకు సంతోషం కలుగుతోంది. అగ్రిటూరిజం కూడా ఇందుకు తోడ్పడుతోంది. అందరూ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. భూతా΄ాన్ని తట్టుకునే శక్తి, ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెంచే శక్తి ‘సగుణ’ సాగు పద్ధతికి ఉందని నా అనుభవంలో రుజువైంది.శాశ్వత ఎత్తుమడులపై ఖరీఫ్లో వరిని ఆరుతడి పద్ధతుల్లో సాగు చేయటం, ఆ తర్వాత అవే మడులపై 2,3 పంటలుగా పప్పుధాన్యాలు/ నూనెగింజలు/ కూరగాయలను పంట మార్పిడి ΄ాటిస్తూ సాగు చేస్తున్నాం. వరిలో ఖర్చు 29% తగ్గి దిగుబడి 61% పెరిగింది. పత్తి సాగు ఖర్చు 17% తగ్గి దిగుబడి 96% పెరిగింది. నాతో ΄ాటు మహారాష్ట్రలోని పది వేల మంది రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎవరైనా వచ్చి చూడొచ్చు. – చంద్రశేఖర్ హరి భడ్సావ్లే (98222 82623), సగుణ రీజెనరేటివ్ టెక్నిక్ ఆవిష్కర్త, రైతు శాస్త్రవేత్త, మహారాష్ట్ర, https://sugunafoundation.ngo/– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
6,7 తేదీల్లో హుబ్లీలో పనస మేళా..
కరువును తట్టుకొని చక్కని ఫలసాయాన్నిచ్చే పండ్ల చెట్టు పనస. ఈ నెల 6,7 తేదీల్లో కర్ణాటకలోని హుబ్లీ నగరంలో మూడు వేల మఠాల ఆవరణలో పనస మేళా జరగనుంది. సరికొత్త ‘శంకర ఎర్ర పనస’ రకం ఈ మేళాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అత్యంత రుచికరంగా ఉండటం, ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పాటు జిగట తక్కువగా ఉండటం దీని ప్రత్యేకతలు.హుబ్లీ మేళాలో ‘శంకర ఎర్ర పనస’తో పాటు సిద్ధు, వియత్నాం ఎర్లీ, లాల్బాగ్ మథుర, భైరచంద్ర, రుద్రాక్షి వంటి అనేక పనస రకాల పండ్లను ప్రదర్శించటంతో పాటు మొక్కలను కూడా మేళాలో విక్రయిస్తారు. ‘శంకర ఎర్ర పనస’ రకం ప్లాంట్ బ్రీడ్ కన్సర్వేషన్ అథారిటీలో కూడా రిజిస్టర్ అయ్యింది. దీన్ని అభివృద్ధి చేసి, మొక్కల్ని విక్రయిస్తున్న రైతు శాస్త్రవేత్త పేరు కెంపరాజు (76767 80559).7,8 తేదీల్లో అనంతపురం జిల్లాలో డా. ఖాదర్ సభలు..స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్ వలి ఈ నెల 7,8 తేదీల్లో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంప్రాంతంలో జరిగే వివిధ సభల్లో ప్రసంగిస్తారు. సిరిధాన్యాల ఆహారం ద్వారా ఆరోగ్యం, సిరిధాన్యాల సాగు, గ్రామాల్లోనేప్రాసెసింగ్ పద్ధతులు, తద్వారా మహిళల ఆదాయం పెంచుకోవటం.. వంటి అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారు. 7 (ఆదివారం)న కళ్యాణదుర్గం సమీపంలోని గుడ్డిళ్లలోని రాధాసామి సత్సంగంలో ప్రసంగిస్తారు.8 (సోమవారం)న ఉ. 9 గంటలకు కోట గుడ్డెమ్ గ్రామంలో, 10.30 గంటలకు చెన్నంపల్లిలో, మధ్యాహ్నం 12 గంటలకు పేరూరులో జరిగే సమావేశాల్లో డా. ఖారద్ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కుళ్లాయిస్వామి (92464 77103), రామప్ప (94411 65281) రైతులకు చిరుధాన్యాల విత్తనాలు పంపిణీ చేస్తారు. 8న మధ్యాహ్నం 3 గంటలకు కురుగుంటలోని పుడమిసిరి మిల్లెట్స్ హోటల్ ప్రాంగణంలో మా భూమి మహిళా రైతు సమాఖ్య చిరుధాన్య ఉత్పత్తుల ప్రదర్శనప్రారంభోత్సవంలో డా. ఖాదర్ ప్రసంగిస్తారు. నిర్వాహకులు భానూజ (94400 17188) ఆధ్వర్యంలో విత్తన వితరణ జరుగుతుంది. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అతిథిగా పాల్గొంటారు.సిరిధాన్యాలతో జీవన సిరి’పై 3 రోజుల శిబిరం..గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 12,13,14 తేదీల్లో చిరు (సిరి)ధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై డా. ఖాదర్ వలి, డా. సరళా ఖాదర్ ద్వారా ప్రత్యేక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ఆధునిక రోగాల నుంచి విముక్తి పొందే మార్గాల గురించి, రోగరహితంగా జీవనాన్ని కొనసాగించే సిరి జీవన శైలిపై పూర్తి అవగాహన కల్పిస్తారన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 97053 83666, 95538 25532.