
కాస్మొటిక్ పేపర్తో ఈ కవర్లు తయారయ్యాయి. నలుపు, ఇటుక రంగులో ఉంటాయి. పల్చగా ఉండే ఈ కవర్పై మైనం వంటి పూత ఉండటం వల్ల వర్షపు నీరు కూడా కాయకు తాకకుండా కిందికి జారి΄ోతుంది. పిందె/కాయ మీద వర్షం పడితే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఆశించి మచ్చలు ఏర్పడతాయి.
మచ్చల వల్ల టన్నుకు రూ. పది వేలకు పైగా ధర తగ్గిపోతుంది. కవర్లు కట్టిన మామిడి కాయపై ఎండ, వానల తాకిన లేక మచ్చలు ఏర్పడవు. ఫ్రూట్ ఫ్లై (పండీగ) నుంచి కూడా రక్షణ దొరుకుతుంది. పురుగులు, తెగుళ్లు సోకవు. దీంతో రైతుకు పురుగుమందులు, కూలీ ఖర్చులు సగానికి సగం ఆదా అవుతాయి.
కవర్ తొడిమను పట్టుకొని ఉండటంతో ఒక మోస్తరు గాలుల నుంచి కూడా కవర్ కాయలకు రక్షణ కల్పిస్తుంది. కాయలు ఏపుగా వైట్ ఎల్లో రంగులో పెరుగుతాయి. సాధారణంగా పెరిగే కాయలకంటే కవరులో పెరిగిన కాయలు నాణ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఫలితంగా ఎగుమతిదార్లు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
కవర్లలో పెరిగిన కాయలకు 30–40 శాతం అధికంగా ధర పలుకుతోందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పురుగులు, తెగుళ్ల మందుల వాడకం, ఖర్చు సగానికి సగం తగ్గడం వల్ల ఆరోగ్యదాయకమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేయడంతోపాటు రైతుకూ అధికాదాయం సమకూరడం హర్షదాయకం.
(చదవండి: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్ ఐదేళ్లలో..)