-
ఏపీ : చంద్రబాబు కుట్ర.. ఎండల్లో పింఛన్దార్ల అష్టకష్టాలు (ఫొటోలు)
-
ఫించన్ ఎత్తేశారు!
రాకముందే అవ్వాతాతలకు అవస్థలు 14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ పేదవాడికీ, ఏమీ చేయని చంద్రబాబు ఈనాడులో ఇచి్చన ప్రకటన చూశారా? సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ను అప్పుడే ఎత్తేశారు. సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ మీకు ఎక్కడైనా కనిపించిందా? చంద్రబాబు రాకమునుపే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనకా వాననకా తిరగాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇక పొరపాటున చంద్రబాబు పాలన వస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ ఇది జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు, సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘ఈ ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు తన బాణాన్ని నేరుగా పేద సామాజికవర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురి పెట్టాడు. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు, చేస్తున్న అన్యాయాన్ని మీరంతా చూస్తున్నారు. అయ్యా చంద్ర బాబూ...! 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చి న పెన్షన్ ఎంత? కేవలం వెయ్యి రూపాయలు కాదా? ఆ పెన్షన్ను రూ.3 వేలు చేసింది ఎవరు? ఆ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు? చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో అవ్వాతాతల పెన్షన్ను అప్పుడే ఎత్తేశారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లాపెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు, సాయంత్రం ప్రకాశం జిల్లా కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. సాధ్యం కాని హామీలతో వల.. మరో 10 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి కావు. ఐదేళ్ల మీ భవిష్యత్తు, ఇంటింటికీ పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్లీ మోసపోవడమే! చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. సాధ్యం కాని హామీలతో వల వేస్తున్నాడు. వదల బొమ్మాళీ వదలా.. అంటూ పసుపు పతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి మీ ఇంటి తలుపుతట్టి లకలకా అంటూ ఐదేళ్లు రక్తం తాగేందుకు వస్తుంది. మరోసారి మోసగించేందుకే చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాడు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే ఆ పెద్దమనిషి పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకొస్తుందా? నాడు అవస్థలతో 39 లక్షలు.. నేడు ఠంఛన్గా 66 లక్షలు ఓ అవ్వాతాతా.. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా? ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకూ ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ అరకొరగా తీసుకున్న దుస్థితి. మీ బిడ్డ జగన్ హయాంలో ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా రూ.3వేలు చొప్పున పెన్షన్ నేరుగా మీ ఇంటికే అందిస్తున్నాడు. ఆ పాపిష్టి కళ్లు పడనంతవరకూ.. చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకూ ఇంటికే పెన్షన్ సజావుగా అందేది. సూర్యోదయానికి ముందే, ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతల ఇంటికే మనవళ్లు, మనవరాళ్ల రూపంలో వలంటీర్లు వచ్చి చిరునవ్వుతో పింఛను అందించి మంచి చేసిన కాలం మనదే. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో.. తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి వలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకూడదంటూ ఉత్తర్వులు ఇప్పించాడు. చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో ఆగలేదు. ఇంకా కడుపుమంట చల్లారక ఏం చేశాడో తెలుసా? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేటట్టుగా వాళ్ల పెన్షన్ బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు. దీంతో ఎన్నికల కమిషన్ అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చింది. అవ్వాతాతలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇంత ఎండలో క్యూలలో నిలబడలేక చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే ఆ దౌర్భాగ్యపు పని చేసిన చంద్రబాబు ఆ నెపాన్ని మీ బిడ్డపై వేస్తున్నాడు. చంద్రబాబు, దుష్ట చతుష్టయం, ఎల్లోమీడియా వీళ్లంతా కలిసి ఆ నెపాన్ని మీ బిడ్డ మీద వేస్తున్నారు. ఆ ఈనాడు కథనాలు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చూస్తే.. వీళ్లంతా మనుషులేనా? అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనను 14ఏళ్లు మీరంతా చూశారు. మీ బిడ్డ 59 నెలల పాలన కూడా చూశారు. పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వచ్చిన పరిస్థితులు చూశారు. చంద్రబాబు ఏ ఒక్క రోజూ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. పెన్షన్ ఇంటికి పంపిన పరిస్థితి అంతకంటే లేదు. మీ కోసమే నా తొలి సంతకం.. నేను ఇవాళ ప్రతి అవ్వకూ, తాతకూ చెబుతున్నా. అవ్వాతాతా..! ఒక్క నెల ఓపిక పట్టండి. జూన్ 4వ తేదీ దాకా ఓపిక పట్టండి. మీ బిడ్డ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. నా మొట్ట మొదటి సంతకం మీకోసం పెడతా అని అవ్వాతాతలకు మాటిస్తున్నా. మీ మనవళ్లు, మనవరాళ్లుగా వలంటీర్లు సూర్యోదయానికి ముందే ఇంటికే వచ్చి చిరునవ్వుతో పెన్షన్లు అందించే పరిస్థితులు మీ బిడ్డ మళ్లీ తెస్తాడు. విద్యా విప్లవం.. మహిళా సాధికారత గతంలో ఎప్పుడూ జరగని విధంగా గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలకు స్కూళ్లు తెరిచే సమయానికే విద్యాకానుక, ఇంగ్లిష్ మీడియం, బైజూస్ కంటెంట్, మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లను అందుబాటులోకి తెచ్చాం. నాడు–నేడుతో కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాం. ఇంగ్లిష్ మీడియంతో వేసిన అడుగులు నుంచి సీబీఎస్ఈ, ఐబీ దాకా మన ప్రయాణం కొనసాగుతోంది. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనిపిస్తున్నాయి. తొలిసారిగా 6వ తరగతి నుంచే క్లాస్రూమ్ లలో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన పేద పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. పిల్లలు ఇబ్బంది పడకుండా బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ సమకూర్చాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువులు అభ్యసిస్తున్న 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెనతోపాటు వసతి దీవెన కూడా అందిస్తున్నాం. తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను మన కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చాం.పిల్లలను బడికి పంపిస్తే చాలు చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ సున్నావడ్డీ, ఆసరా ఇస్తున్నాం. ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు 22 లక్షల ఇళ్లు కూడా కడుతున్నాం. గ్రామాల్లోనే మహిళా పోలీసు, దిశ యాప్, రాజకీయ సాధికారత కోసం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. లంచాలు లేని సమాజం గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రతి 60–70 ఇళ్లకు వలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా ఇంటికే పెన్షన్, పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ జరుగుతోంది ఈ 59 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి కాకముందు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయని ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశాడు. నాకు ఓటు వేయని వారినీ కోరుతున్నా.. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్. పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా మీ ఓటు ఎంత కీలకమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా ఒక్కటే కోరుతున్నా. మీ ఇంటికి వెళ్లి అవ్వాతాతలు, భార్యాపిల్లలతో కూర్చుని మాట్లాడండి. ఎవరి హయాంలో, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇంటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి నా అక్కచెల్లెమ్మలకు అందుతుంది. ఆ మోసాలు మీరంతా చూశారు.. మీ బిడ్డను నమ్మి మీరంతా అధికారం ఇచ్చినందువల్ల దేవుడి దయతో ఐదేళ్లలో ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తేగలిగాం. ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99శాతం హామీలను అమలు చేశాం. 2014లో ఒకసారి చంద్రబాబును నమ్మారు! ఆ కూటమిని నమ్మి ఓటు వేశారు! చంద్రబాబు మేనిఫెస్టో మాయలు, మోసాలు ఎలా ఉంటాయో మీరంతా చూశారు. ఈ 59 నెలల్లో మీ జగన్ పాలన చూస్తున్నారు. మీ బిడ్డ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు. కొత్త మోసాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న వారికి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని కోరుతున్నా. మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్సింకులోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, ఆసుపత్రులు, వ్యవసాయం బాగుండాలన్నా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మన అభ్యర్థులను ఆశీర్వదించండివైఎస్సార్సీపీ నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ముదునూరి ప్రసాదరాజు, గుడాల గోపి, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకరరావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్ కుమార్ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా. గతంలో ఇవి ఉన్నాయా?» పిల్లలకు విద్యాకానుక, వారి చేతుల్లో ట్యాబ్లు గతంలో ఎప్పుడైనా చూశారా? » రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టికాహారంతో గోరుముద్ద చూశారా? » తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, ఇంటివద్దే అందించిన పౌర సేవలు, పథకాలను చూశారా? » ఇంటికే రూ.3 వేల పెన్షన్ కానుక, ఓ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, చేదోడు, లా నేస్తం, రూ.25 లక్షలదాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష గతంలో మీరు చూశారా? » వీటన్నింటితో పాటు మీ ఊరిలోనే గ్రామ సచివాలయం, నాడు–నేడుతో బాగుపడిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఓ ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల చేతుల్లో దిశ యాప్ గతంలో ఉన్నాయా? » మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇవన్నీ సజావుగా కొనసాగి పథకాలు అందుతాయి. 2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ చేస్తానన్నాడు... జరిగిందా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామని ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? » ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఏ ఇంటికైనా ఇచ్చాడా? » అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? » ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? » సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మించాడా? నరసాపురం, పెదకూరపాడు, కనిగిరిలో ఎవరికైనా కనిపిస్తున్నాయా? » ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు. »ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో మీ ముందుకొచ్చి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కార్ అంటూ మరోసారి వంచనకు సిద్ధమైన మోసగాళ్లతో రాజకీయ యుద్ధం చేస్తున్నాం. నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరిక సాక్షి, నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలు, సంఘాల ముఖ్య నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. తూర్పు గోదావరి జల్లాకు చెందిన బీసీ పోరాట సమితి జిల్లా అ«ధ్యక్షుడు రేలంగి శేఖర్, మూల్ నివాసి సంఘ్ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు, జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ నేత మారూరి రామలింగారెడ్డి, మార్వాడి కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారీకి సీఎం జగన్ వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహా్వనించారు. -
ఈ పాపం చంద్రబాబుదే.. అవ్వాతాతల ప్రాణాలు తీస్తూ రాజకీయాలా? (ఫొటోలు)
-
ఎటువంటి ‘చార్జీ’లు లేకుండానే పింఛన్ ఇవ్వండి
సాక్షి,అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలతో అవ్వాతాతల పింఛన్ సొమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పింఛన్ సొమ్మును ఎలాంటి చార్జీలకు మినహాయించుకోకుండా ఇవ్వాలని బ్యాంక్లను రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) ఆదేశించినట్లు సెర్ప్ అధికారులు గురువారం తెలిపారు. అవ్వాతాతలు తమ బ్యాంక్ అకౌంట్లను చాలా కాలంగా ఉపయోగించని కారణంగా ఆ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేదు.దీంతో ఆయా అకౌంట్లకు బ్యాంక్లు చార్జీలు విధిస్తున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం..అవ్వతాతలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారు పింఛన్ డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఎటువంటి చార్జీలను బ్యాంక్లు తీసుకోకుండా చర్యలు తీసుకుంది. కాగా, మొత్తం లబి్ధదారులు 65.94 లక్షల మందిలో 48.92 లక్షల మందికి వారి బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, వారందరి బ్యాంక్ ఖాతాల్లో బుధవారమే అధికారులు డబ్బులు జమ చేయగా, అందులో 74,399 మందికి వారి సాంకేతిక కారణాలు కారణంగా సొమ్ము జమ కాలేదు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ అందేలా వారి ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీకి చర్యలు తీసుకుంటామని సెర్ప్ అధికారులు తెలిపారు. కాగా, మే నెలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 65,49,864 మంది లబి్ధదారులకు పింఛన్ల పంపిణీ నిమిత్తం రూ.1,945.39 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా గురువారం సాయంత్రం వరకు డీబీటీ విధానంలో 48.92 లక్షల మంది లబి్ధదారులలో 48.17 లక్షల మందికి వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. దివ్యాంగులు, మంచం/వీల్చైర్కు పరిమితమైన వారిలో 16.57 లక్షల మందికి వారి ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయించగా, అందులో 15.13 లక్షల మందికి గురువారం నాటికి పంపిణీ పూర్తయినట్లు వివరించింది. డీబీటీ విధానంలో 98.47% మందికి, లబి్ధదారుల ఇంటి వద్దనే పంపిణీ చేసేవారిలో 91.34% మందికి పంపిణీ పూర్తయినట్లు పేర్కొంది. -
ఠంఛన్గానే పింఛన్
సాక్షి, అమరావతి: మే 1న మేడే సందర్భంగా సెలవు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఠంచనుగా పింఛన్ అందించింది. 48,92,503 లబ్ధిదారులకు రూ.1,471.22 కోట్లను నేరుగా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికి లేదా వీల్చైర్కే పరిమితమైన మరో 16,57,361 మందికి వారి ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.474.17 కోట్లను విడుదల చేయగా బుధవారం ఉదయం నుంచి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పంపిణీని ప్రారంభించారు.గత ఐదేళ్లుగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్లను అందజేసింది. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ కుట్రలతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరగకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రతినెలా ఒకటినే ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును అందుకునే లబ్ధిదారులు గత నెల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడంతో అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ కష్టాలకు చంద్రబాబే కారణమని వారు మండిపడుతున్నారు. ప్రతి నెలా 1నే వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారని.. ఇప్పుడు చంద్రబాబు కుట్రలతో వలంటీర్ల సేవలకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడిన ఇబ్బందులు తమకు పచ్చమూక కుట్రలతో మళ్లీ వచ్చాయని ధ్వజమెత్తుతున్నారు.అవ్వాతాతలకు పచ్చమూక తెచ్చిన కష్టాలు..చంద్రబాబు, ఆయన సన్నిహితుల కుట్రలతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అవ్వాతాతలకు పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేవు. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లోనే బ్యాంకులు ఉన్నాయి. దీంతో మండల కేంద్రాలకు 10–15 కిలోమీటర్ల దూరంలో గ్రామాల్లో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎవరో ఒకరి సహాయం లేకుండా బ్యాంకులకు వారు వెళ్లలేరు. దీంతో ఎవరో ఒకరిని బ్యాంకు వరకు రావాలని సహాయమడగాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు వేసవి కూడా కావడంతో పింఛన్ల నగదు తీసుకోవాలంటే అవ్వాతాతలు చాలా కష్టపడాల్సి వస్తోంది. గత ఐదేళ్ల నుంచి తమ ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును నేరుగా అందుకున్న అవ్వాతాతలు బ్యాంకులకు ఎలాగోలా కష్టపడి వెళ్లినా నగదు విత్ డ్రా చేసుకోవడం తెలియదు. ఇందుకోసం వేరేవారిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇలా చంద్రబాబు, ఆయన ముఠా పన్నిన కుట్రలతో అవ్వాతాతలకు కష్టాలు తప్పడం లేదు.పింఛన్ కోసం వెళ్లి మృత్యువాతపింఛన్ కోసం అన్నమయ్య జిల్లా రాయచోటి కెనరా బ్యాంక్ దగ్గరికి వచ్చిన ముద్రగడ్డ సుబ్బన్న (80) బుధవారం వేసవి తాపానికి గురై కుప్పకూలి చనిపోయాడు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకులవరం గ్రామం పిచ్చుకగుంట్లపల్లెకు చెందిన సుబ్బన్న 1వ తేదీ కావడంతో తన పెన్షన్ డబ్బులు బ్యాంకులో జమ అయ్యాయో, లేదో తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. అయితే మే డే కారణంగా బ్యాంకుకు సెలవు కావడంతో తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో ఎండ వేడికి తాళలేక బ్యాంకు సమీపంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. సమీపంలో ఉన్న వ్యక్తులు నీళ్లు చల్లి మంచినీరు తాగించినా ప్రాణాలు దక్కలేదు.పింఛను నేరుగా ఇవ్వడం లేదని మృతివలంటీర్ల ద్వారా నేరుగా పింఛన్ ఇవ్వనీయకుండా చంద్రబాబు కుట్రలు చేశారని మనస్తాపానికి గురైప ఒక వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు కళ్లా వీధికి చెందిన ఖలీల్ బేగ్ (75) ప్రతి నెలా ఇంటి వద్దనే వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేవాడు. అయితే ఈసారి పింఛన్ బ్యాంకులో వేస్తున్నారని.. అక్కడి నుంచి తెచ్చుకోవాలని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవే ఆలోచనలతో ఇంటిలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. చంద్రబాబు కుట్రలతో ఇబ్బందులునాకు వృద్ధాఫ్య పింఛన్ వస్తోంది. ఆధార్కు లింక్ చేసినా ఇప్పుడు నా బ్యాంక్ ఖాతా పని చేయడం లేదు. పింఛన్ వస్తుందో, లేదో అని భయంగా ఉంది. రెండు నెలల క్రితం వరకు వలంటీర్లు ఇంటికి వచ్చి తలుపు కొట్టి పింఛన్ రూ. 3 వేలు చేతిలో పెట్టేవారు. చంద్రబాబు కుట్రలకు మాలాంటి ముసలోళ్లు ఇబ్బందులు పడుతున్నారు. – గుంజి లక్ష్మీదేవిఇంత ఎండలో బ్యాంకుకు ఎలా వెళ్లేది?పింఛన్ సొమ్మును ఈసారి బ్యాంక్లో వేస్తారని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంక్కు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నాలాంటి వృద్ధులకు ఇబ్బందే. వలంటీర్లు ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి ఇచ్చేవారు. మాలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. చంద్రబాబు వల్లే మాకీ కష్టాలు. – బొబ్బ సుందరమ్మ, ఆత్మకూరు, పల్నాడుజిల్లా వలంటీర్ ఉంటే ఉదయాన్నే పింఛన్..నాకు వితంతు పింఛన్ వస్తోంది. మంచం మీద నుంచి పైకి లేవలేను. వలంటీర్ ఉన్నప్పుడు ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాడు. బాబు ఓర్వలేక వలంటీర్లను అడ్డుకున్నారు. ఇప్పుడు పింఛన్ను బ్యాంకు ఖాతాలో వేస్తామంటున్నారు. నేను బ్యాంక్కు వెళ్లలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. జగనన్న వస్తే మళ్లీ కష్టాలు తీరతాయి.– తాతపూడి రాహేలమ్మ, వెలిగండ్ల, ప్రకాశం జిల్లా బాబు మంచి చేయడు.. చేయనివ్వడు..వలంటీర్ల ద్వారా మాకు వచ్చే పింఛన్లను అడ్డుకుంది చంద్రబాబే. ఆయన మంచి చేయడు.. ఎవరైనా చేస్తుంటే చేయనివ్వడు. ఐదేళ్లుగా ఇంటివద్దే పింఛన్ అందుకున్నాను. గత రెండు నెలలుగా చంద్రబాబు, ఆయన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేశ్ కుట్రలతో మాకు కష్టాలు తెచ్చిపెట్టారు. ఇప్పుడు పింఛన్ తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోంది. నా బ్యాంకు ఖాతా ఇప్పుడు వినియోగంలో కూడా లేదు. – గంగాబాయి, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా -
మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాల కారణంగా పింఛన్దారుల కష్టాలు తొలగిపోలేదు. మే నెలలో కూడా పింఛన్ పొందేందుకు అవస్థలు తప్పేలా లేవు. దాదాపు ఐదేళ్లుగా వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరుతున్న పింఛన్ను అడ్డుకున్నది టీడీపీ వారేనన్న విషయం అందరికీ తెలిసిందే. వలంటీర్లతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్కుమార్ కోర్టులను, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. పింఛన్ల పంపిణీతో సహా సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లను వినియోగించరాదని, వారిని పూర్తిగా పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పింఛన్దారులకు మొదటిసారిగా ఏప్రిల్ నెలలో కష్టాలు మొదలయ్యాయి. ఎర్రటి ఎండలో ముదిమి వయస్సులో పింఛన్ కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలోసచివాయాలకు వెళ్లాల్సి రావడంతో వడదెబ్బ, ఇతర కారణాలతో 35 మంది మృత్యువాత పడ్డారు. టీడీపీ నేతల కుట్రల ఫలితంగా మే నెలలో కూడా పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే మే నెల పింఛన్ల పంపిణీలో అధికారులు కొన్ని మార్పులు చేశారు.నగదు బదిలీ సాధ్యమేనా? పింఛన్ల పంపిణీలో మే నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పింఛన్ మొత్తం బదిలీ చేయనున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న వారు, మంచం పట్టి వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక్ సంక్షేమ పింఛన్లు పొందుతున్న వారికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తారు. మిగిలిన కేటగిరీ పింఛన్దారులకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. డీబీటీ పరిధిలోకి రాని వారికి మాత్రం 3వ తేదీ నుంచి నగదు రూపంలో ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేస్తారు. చాలా మంది పింఛన్దారులకు బ్యాంకు ఖాతాలు లేవు.డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ఎంతవరకు విజయవంతం అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఠంచన్గా ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము చేతితో పడితే ఆ ఆనందమే వేరు. డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తే నగదు కోసం మళ్లీ బ్యాంకులకు వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్దారులకు టీడీపీ నేతల కుట్రలతో కష్టాలు మొదలయ్యాయనేది బహిరంగ రహస్యమే. తమకు కష్టాలను తెచ్చి పెట్టిన వారికి ఓటుద్వారా బుద్ధి చెబుతామని అవ్వాతాతలు స్పష్టం చేస్తున్నారు. మే నెల పింఛన్ల పంపిణీ 5వ తేదీ వరకు జరగనుంది. మే నెలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,68,742 పింఛన్లకు రూ.139.82 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,46,340 పింఛన్లకు రూ.73,74,49,500, నంద్యాల జిల్లాలో 2,22,402 పింఛన్లకు రూ.66,08,47,000 పంపిణీ చేయనున్నారు.సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు ∙ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కర్నూలు(సెంట్రల్): లబి్ధదారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాయాలకు రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలియజేశారు. సామాజిక భద్రత పింఛన్ పంపిణీ అంశంపై స్పెషల్ సీఎస్ ఆజయ్జైన్, పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పింఛన్దారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన వారు, వీల్ చైర్లో ఉన్న వారు, సైనిక సంక్షేమ పింఛన్ పొందుతున్న వారు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేస్తామన్నారు. ఎవరికైనా బ్యాంకు ద్వారా చెల్లించలేని పక్షంలో ఇంటివద్దకే పింఛన్ తెచ్చి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి,జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సలీం బాషా పాల్గొన్నారు. -
మే నెల పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ
సాక్షి, అమరావతి: మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) విధానంలో లబ్ధిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు. ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది. అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్ధిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పింఛన్ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
Fact check: అబద్ధాలు రచించెన్
సాక్షి, అమరావతి: అబద్ధం.. కుళ్లు.. భయం.. వీటికి ప్యాంటూ చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం రామోజీ మాదిరే ఉంటాయేమో! జగన్ పరిపాలనలో అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పింఛన్లు అందుకుంటూ ఆనందంగా ఉంటే రామోజీకి కంపరంగా ఉంది. ఈ వర్గాల్లో జగన్కు పెరుగుతున్న పరపతిని చూసి తన భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. అందుకే వాస్తవాలకు మసిపూసి ‘నవరత్నాలు – నయవంచన’ అంటూ మరో అబద్ధపు కథనాన్ని అచ్చేసేశారు. ఈ నిస్సిగ్గు పాత్రికేయాన్ని చూసి అక్షరాలు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనేమో...!! పింఛనుదారుల సంఖ్య పెరిగింది జగన్ హయాంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 29.51 లక్షల మంది జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా పింఛన్లు అందుకున్నవారే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో పింఛన్ల సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. అప్పట్లో 43.11 లక్షల మంది పింఛనుదారులున్నారని లెక్కలు చెబుతున్నా 39 లక్షల మందికే చెల్లింపులు జరిపేది. నాలుగు నుంచి 5 లక్షల మందికి ఎగ్గొట్టేది. రామోజీ దగ్గర ఈ లెక్కలు లేవో.. లేక కావాలనే విస్మరించారో. ఇంటికో పింఛను విధానం బాబుదే కుటుంబానికి ఒక్కటే పింఛను విధానం జగన్ ప్రభుత్వం అమలు చేసినట్టు ఈనాడు ఓ అబద్ధాన్ని రాసింది. ఈ విధానం ప్రవేశపెట్టిందే చంద్రబాబు ప్రభుత్వం. 2014 సెప్టెంబర్ 18న ఆర్సీ నంబరు 1053 పేరిట జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఐదేళ్ల పాటు దీన్ని అమలు చేసింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఇంటిలో ఇద్దరు దివ్యాంగులున్నా రెండో పింఛను ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. మరో వైపు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల చొప్పున నెలనెలా పింఛన్ అందిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కొత్తగా తీసుకొచి్చన ఈ మేలును బహుశా రామోజీ మరిచిపోయి ఉంటారు. కోతల్లేవు పింఛనుదారులలో మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి పింఛన్లను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తగ్గించినట్టు ఈనాడు ఇంకో అబద్ధం ప్రచురించింది. సాధారణంగా పింఛనుదారుల్లో 0.5 శాతం మరణాలు నమోదవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది 0.8 శాతం ఉండొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2015 మేలో 0.8 శాతం మేర అంటే 36,406 మరణాలు నమోదు కావడంతో ఆ నెలలో పింఛన్లకు కోత పెట్టింది. అదే ఏడాది ఏప్రిల్లో 0.6 శాతం మేర అంటే 22,334 మంది పింఛనుదారులు మరణించినట్లు లెక్కలు వేసి వాటిని తొలగించింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వాస్తవ మరణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ మేరకే తొలగింపులు ఉంటున్నాయి. గత ఆరు నెలల గణాంకాలు తీసుకుంటే ఏ నెలలోనూ ఈ సంఖ్య 20 వేలకు మించలేదు. పింఛను విధానంలో మరెన్నో మార్పులు ► గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ పొ ద్దున్నే లబ్ధిదారుల గడప వద్దనే అందిస్తోంది. ► పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల పెత్తనాన్ని జగన్ కూకటివేళ్లతో పెకలించారు. కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో అందజేస్తున్నారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో లబి్ధదారుల జాబితాలు ప్రదర్శించి, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబి్ధదారులను ఎంపిక చేస్తున్నారు. ► గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. ఈ ప్రభుత్వంలో లబ్ధి రూ.1,91,000. అంటే రూ.1,32,500 అదనం. ► పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ► 2014–19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. -
బొగ్గు కార్మికులకు కనీస పెన్షన్ ఇకపై రూ. వెయ్యి
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ బొగ్గు గని కార్మికుల కనీస పెన్షన్ రూ.1000కి పెరిగింది. ఈ మేరకు ‘ది కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్–1998’కి సవరణలను ప్రకటిస్తూ గత నెల 8న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు కొన్ని కేటగిరీల కార్మికులకు కనీస పెన్షన్ రూ.250 ఉండగా, మరికొన్ని కేటగిరీల వారీకి రూ.350 ఉంది. పెరిగిన పెన్షన్ మార్చి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. నామమాత్రంగా ఉన్న బొగ్గు గని కార్మికుల పెన్షన్ను పెంచాలని దేశ వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ అసోసియేన్లు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయి. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో కేవలం రూ.వెయ్యికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రిటైర్డ్ కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన బొగ్గు ఉద్యోగుల కుటుంబాలు రూ.1000 పెన్షన్తో ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖలోని పెన్షన్ల సవరణ కమిటీ కేవలం రూ.వెయ్యి పెంచుతూ ఎలా సిఫార్సు చేస్తుందని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గును వెలికితీసి దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గు గని కార్మికులు రిటైర్మెంట్ తర్వాత తమ జీవితపు చరమాంకంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెంచాలనీ, కరువు భత్యం సైతం చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
61.37 లక్షల మందికి రూ.1,847.85 కోట్లు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు.. వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయించి తీవ్ర అవాంతరాలు సృష్టించాలని చూసినా ప్రభుత్వం ఠంఛన్గా పింఛన్ పంపిణీ చేసింది. కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1,847.85 కోట్లను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల వద్ద బుధవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ ప్రారంభించి, శుక్రవారం సాయంత్రానికి 93.42 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దే సచివాలయాల ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేశారు. చిత్తూరు, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో 95 శాతం మందికి పైగా పంపిణీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. శనివారం కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగుతుంది. -
ఈ పాపం ఊరికే పోదు.. చంద్రబాబుని ఏకిపారేసిన రోజా
-
చంద్రబాబు అహంకారం.. 31మంది వృద్ధులను పొట్టన పెట్టుకున్న హంతకుడు
-
అవ్వాతాతలకు ఇంటి దగ్గర పెన్షన్ రాకుండా చేసిన పచ్చ గ్యాంగ్
-
పండుటాకులు విలవిల
సాక్షి నెట్వర్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిల కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ఎన్నికల సంఘంపై తమ అనుకూలురుతో ఒత్తిడి తెచ్చి పింఛన్ల పంపిణీ చేయనీయకుండా వలంటీర్లను ఈ ముగ్గురు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో అవ్వాతాతలు, ఇతర పింఛన్ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1నే లబ్దిదారులు ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్ అందిస్తుండగా ఈసారి టీడీపీ, జనసేన కుతంత్రాలతో సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం ఎండా కాలం కావడంతో వేసవి తాపానికి వడదెబ్బ కొట్టి మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 20 మంది పింఛన్ లబ్దిదారులు మృత్యువాత పడటం విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబీకులు చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఆయన వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉసురు చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతలు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఒక్కరోజే 20 మంది మృత్యువాత అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన ఎన్.రాజమ్మ (85) సచివాలయం వద్దకు నడిచి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో రాయి కాలుకు తగిలి ముందుకుపడి మృతి చెందింది. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లిలో టీడీపీ కుట్రలతో ఆందోళనకు గురైన దుగ్గిలమ్మ(70) అనే వృద్ధురాలు మృతిచెందింది. అలాగే గుండెపోటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మద్దులచెర్వులో చోటు చేసుకుంది. అదేవిధంగా కొండకమర్ల పంచాయతీ పోలేవాండ్లకొత్తపల్లిలో సన్నాయప్ప (73) తన భార్య పింఛన్ కోసం ఎండలో నడుచుకుంటూ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వడదెబ్బకు గురై మృతి చెందాడు. సూళ్లూరుపేట సాయినగర్లో ఈశ్వరవాక లలితమ్మ (58) వితంతు పింఛను కోసం గాండ్లవీధి సచివాలయం వద్ద క్యూలో నిలబడి ముందుకు పడిపోయి ప్రాణాలు విడిచింది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం ఎరికంబట్టు దళితవాడకు చెందిన అప్పాస్వామి(75) పెన్షన్ కోసం ఇంటి బయటే మంచంపై ఎదురు చూస్తూ ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై మరణించాడు. అలాగే చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన నన్నేసాహెబ్ (76) పింఛన్ కోసం వెళ్లి సచివాలయం వద్ద కుర్చిలో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన సచివాలయం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు నన్నేసాహెబ్ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఘడియపూడి పునరావాస కాలనీలో బొమ్మల శేషయ్య (70) పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లి ఇంటికి చేరుకుని భోజనం చేసి నీరసంగా పడుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులు లేపడానికి ప్రయత్నించగా విగత జీవుడై ఉన్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లికి చెందిన బుర్ర శామ్యూలు (71) గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. అలాగే గుంటూరు జిల్లా కొల్లిపరలో దొప్పలపూడి బాబూరావు (62) వ్యవసాయ కూలీ. ఈ క్రమంలో పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లిన బాబూరావు తిరిగొస్తూ ఇంటికి సమీపంలో కుప్పకూలిపోయి మరణించాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరుకు చెందిన సయ్యద్ ఖాదర్బాషా బోదకాలుతో బాధ పడుతున్నాడు. ఈసారి సచివాలయం వద్ద ఇస్తారని తెలిసి కుమారుడి బైక్పై అక్కడకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక అస్వస్థతకు గురై మృతిచెందాడు. కాకినాడ జిల్లా తూరంగి పగడాలపేటకు చెందిన అడపా వీర్రాజు (67) పింఛన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో కళ్లు తిరగడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు వీర్రాజును ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. అలాగే ఏటిమొగ ప్రాంతానికి చెందిన పట్టా అప్పారావు(61) సమీపంలోని సచివాలయానికి వెళ్లాడు. ఎండ తీవ్రతతో సచివాలయం దగ్గరే స్పృహ తప్పాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఏటిమొగలోని రాజీవ్ గృహకల్ప సముదాయానికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన పిల్లి నాగేశ్వరమ్మ (75) కిలోమీటరుకు పైగా దూరంలో ఉన్న సచివాలయానికి కాలినడకన బయలుదేరింది. కొంత దూరం నడిచి ఆయాసంతో పడిపోయి మృత్యువాత పడింది. పల్నాడు జిల్లా దుర్గి మండల పరిధిలోని నెహ్రూనగర్ తండాకు చెందిన రమావత్ సాలిబాయి (70) పెన్షన్ కోసం ముటుకూరు 2 సచివాలయానికి ఆటోలో వెళ్తుండగా దారి మధ్యలో సొమ్మసిల్లి కుప్పకూలింది. ఆమెను ముటుకూరు పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ దిగువతొట్లివారిపల్లె గ్రామానికి చెందిన టి. మంగమ్మ(68) ఇంట్లోనే ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలిపోయి మృతి చెందింది. పింఛన్ కోసం ఎండలో వెళ్లి వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాజుబాబు (48) పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయానికి ఎండలో వెళ్లాడు. దీంతో వడదెబ్బకు గురికావడంతో ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు లోనై మృతి చెందినట్లు ఆయన భార్య సీత తెలిపింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ వేలమామడికి చెందిన పాడి సొములు(65) పింఛన్ కోసం పెదకోట సచివాలయానికి నడుచుకుని వెళుతుండగా జాలడ గ్రామ సమీపంలో ఆయాసం రావడంతో కూర్చొన్నాడు. అదే సమయంలో సొమ్మసిల్లిపోవడంతో మృత్యువాత పడ్డాడు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన పింఛన్ లబ్దిదారుడు పాతకోకిల పెద్దిరాజు (63) పింఛన్ ఇస్తున్నారని తెలిసి సచివాలయానికి బయలుదేరాడు. తీవ్ర ఉద్వేగానికి గురైన పెద్దిరాజు ఇల్లు దాటి వెళుతుండగా కొద్దిదూరంలో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. చేతులు విరిగి.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొర్లకుంట సచివాలయానికి పింఛన్ తీసుకునేందుకు వెళ్లిన పోలి తులసమ్మ అనే వృద్ధురాలు తిరిగి వస్తూ కింద పడటంతో చేయివిరిగింది. ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలం వేంపాడుకు చెందిన గ్రంధి మరియమ్మ (71) పింఛను నగదు కోసం ముండ్లమూరు సచివాలయానికి వెళ్లింది. మండుటెండలో ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ సెంటరుకు వచ్చింది. ఆటో ఎక్కే క్రమంలో ఎండధాటికి సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఈ క్రమంలో ఆమె మూతికి, పెదాలకు తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన పరుచూరి కృష్ణకుమారి (74) గుండెపోటుకు గురయ్యారు. చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పొన్న సుబ్బారావు అనే వృద్ధుడు పింఛను కోసం గ్రామ సచివాలయానికి వెళుతూ మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోయారు. పింఛన్ తీసుకోవాలంటే 30 కి.మీ వెళ్లాల్సిందే టీడీపీ నేతల నిర్వాకంతో వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో గిరిజనులు అల్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చెన్నపాలెం గ్రామం గారపెంట పంచాయతీలో ఉండగా దాని సచివాలయం పుల్లలచెరువులో ఉంటుంది. పుల్లలచెరువు నుంచి చెన్నపాలెం గిరిజనగూడెం వెళ్లాలంటే రానుపోను కలిపి 30 కి.మీ దూరం. ఇప్పటి వరకు వలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇస్తున్నారు. ఈనెల వలంటీర్లు రాకపోవడంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు కూడా సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి వచ్చింది. మండుటెండలో అంతదూరం వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కల్పించారంటూ వృద్ధులు, వికలాంగులు టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల డ్రామాలు ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డ్రామాలు మొదలుపెట్టారు. బుధవారం పట్టణంలోని సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్ల పంపిణీకి సంబంధించి టీడీపీ వల్ల ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి వృద్ధులను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇలా ఎందుకు కూర్చోబెట్టారు అంటూ సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించారు. సచివాలయం బయటకు వచ్చి పింఛన్దారులతో మాట్లాడుతూ ఇంకా పింఛన్ డబ్బులు రాలేదు కానీ టీడీపీ వల్లే పింఛన్లు ఇంటికి రావడం లేదని అంటున్నారన్నారు. ఎమ్మెల్యే నిమ్మల వెళ్లిపోయిన తర్వాత అక్కడున్న పింఛన్దారులంతా ఇంటికి పింఛన్లు రాకుండా ఈ టీడీపీ నాయకులే అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరిపై పింఛన్దారుల ధర్నా పింఛను పంపిణీ విధానంపై చంద్రబాబు వైఖరి పట్ల లబ్దిదారులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడులో సచివాలయం వద్ద పింఛనుదారులు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రతి నెల వలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ల కార్యక్రమాన్ని అడ్డుకున్న చంద్రబాబు వైఖరి నశించాలని నినాదాలు చేశారు. పాత పద్ధతిలో వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో ‘బోడె’ శవ రాజకీయం టీడీపీ, జనసేన కుట్రలతో ఈసారి పింఛన్ ఇవ్వటానికి వలంటీర్ లేకపోవటంతో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వెంపటి వజ్రమ్మ (80)గుండెపోటుకు గురై మరణించింది. గంగూరు ఏఆర్ నగర్ కాలనీలో ఉంటున్న వజ్రమ్మ గంగూరు 2 సచివాలయానికి పింఛన్ సొమ్ము కోసం వెళ్లగా బ్యాంకు నుంచి సొమ్ము రావాలని, సాయంత్రం పింఛన్ ఇస్తామని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చింది. సచివాలయం నుంచి ఇంటికి వచ్చిన కొద్ది క్షణాలకే గుండెపోటుకు గురై మృత్యువాత పడింది. మరోవైపు చేయాల్సిందంతా చేసి డ్రామాలకు టీడీపీ నేతలు తెరలేపారు. వజ్రమ్మ మృతిని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు యత్నించగా స్థానిక మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపి తిప్పికొట్టారు. వజ్రమ్మ మృతి సమాచారం తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేష్ బాధితురాలి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వజ్రమ్మకు నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కాగా.. మంత్రి అక్కడ ఉన్న సమయంలోనే టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ కూడా తన అనుచరులతో రావటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సమయంలో టీడీపీ అభ్యర్థి బోడెప్రసాద్, అతని అనుచరులు కల్పించుకుని జగన్ పింఛన్ ఇవ్వకపోవటంతోనే వజ్రమ్మ మరణించిందంటూ ఆరోపించారు. బోడె ప్రసాద్ వ్యాఖ్యల పట్ల మహిళలు అభ్యంతరం తెలిపారు. వజ్రమ్మ మరణాన్ని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు చేసిన యత్నాన్ని లబ్ధిదారులే తిప్పికొట్టారు. వలంటీర్లు పింఛను ఇస్తే చంద్రబాబుకు బాధ ఏంటని బోడె ప్రసాద్ను మహిళలు, పింఛన్ లబ్ధిదారులు ప్రశ్నించారు. జగనన్న పాలనలో ప్రతి నెల వేకువజామునే వలంటీర్లు ఇళ్లకు వచ్చి పింఛన్ ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు. వజ్రమ్మ అన్యాయంగా చనిపోయిందని, ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారా అని నిలదీశారు. ఒక్కసారిగా మహిళలు తిరగబడటంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. -
చేసిందంతా చేసి సచివాలయాల వద్ద టీడీపీ నేతల డ్రామాలు
-
చంద్రబాబు మోసగాడు, వెన్నుపోటుదారుడు..బాబుపై ఫైర్ అయిన పేర్ని నాని
-
చంద్రబాబు కుట్రలు.. పెన్షన్ కోసం వృద్ధుల పాట్లు
సాక్షి, విజయవాడ: హేయమైన రాజకీయాలకు నిరుపేదలకు బలి అవుతున్నారు. చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీల కుట్రతో వృద్దులు పెన్షన్ కోసం పాట్లు పడుతున్నారు. ప్రతినెల ఇంటికే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ నెల లేదు. ఎన్నిలకు కమిషన్ కి ఫిర్యాదు చెయ్యడంతో వాలంటీర్లు సేవలు బంద్ అయ్యాయి. నడవలేని వృద్దులు ఎండలో వస్తున్నారు. సచివాలయాల వద్ద పెన్షనర్లు కు సౌకర్యాలు కల్పించి పెన్షన్ డబ్బులు అందిస్తున్నారు సిబ్బంది. కానీ ఎండలలో సచివాలయాలకు రావాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు చేసిన కుట్రకు మేము బలి అయ్యామని, మాకొద్దు చంద్రబాబు అంటున్నారు. ఓటుతో చంద్రబాబు కి బుద్ధి చెప్తామని పెన్షనర్లు చెబుతున్నారు. -
చంద్రబాబు కుట్రతో పెన్షన్ దారులకు అష్టకష్టాలు
-
విషాదం.. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్దురాలు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్జా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెనమలూరు మండలం గంగూరులో పెన్షన్ కోసం వెళ్లిన వృద్దురాలు వడదెబ్బ తగిలి మృతిచెందింది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వజ్రమ్మ(80) ప్రాణాలు విడిచింది. ఉదయం నుంచి పెన్షన్ కోసం పడిగాపులు కాసిన వజ్రమ్మ వడదబ్బతో అక్కడే కుప్పకూలిపోయింది. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతోంది. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం వారి ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. పెన్షన్ల కోసం బారులు తీరారు. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు కారణంగా పింఛన్ల పంపిణీ నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. బాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు. -
చంద్రబాబు చేసిన పనికి పెన్షన్ కోసం ఇబ్బందులు
-
ఈసీకి కంప్లైంట్ పై చెల్లుబోయిన ఫైర్
-
సైంధవుడుచంద్రబాబే..
సాక్షి, నెట్వర్క్: పింఛన్కోసం సోమవారం సాయంత్రం వరకూ ఎదురు చూసిన వృద్దులకు నిరాశ తప్పలేదు. కనీసం మంగళవారం అయినా ఇస్తారని ఆశగా చూసి చివరికి ఎప్పుడిస్తారో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఆ సొమ్ముతోనే అత్యవసర మందులు కొనుగోలు, ఇతర నిత్యావసరాల కోసం వినియోగించాల్సి ఉండగా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న వారికి చంద్రబాబు పన్నాగం అవరోధంగా మారింది. దీంతో ఆయన వ్యవహారశైలిపై రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నోటికాడ కూడును లాగేసుకున్న చంద్రబాబు విధానంపై ప్రజలు అక్రోశం చెందుతున్నారు. వృద్దులు, వితంతువులు, దివ్యాంగులకు అన్ని రంగాల ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ప్రతి నెలా ఇంటివద్దకే వచ్చి వలంటీర్ కుశలప్రశ్నలు అడిగి సొమ్ము చేతిలో పెట్టే సమయంలో వృద్దులు తడారని కళ్లతో వాటిని సంతోషంగా తీసుకునేవారు. ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో దూర ప్రాంతానికి వెళ్లి ఎలా తెచ్చుకోవాలని ఆందోళన చెందుతున్నారు. సచివాలయానికి ఎలా వెళ్లాలి ? నా వయస్సు 72ఏళ్లు. అనారోగ్యంతో పాటు లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాను. ఇంట్లో వాళ్ల సహాయంతో ఊపిరి పట్టుకుని ఉన్నాను. పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారుజామునే వలంటీర్ మా ఇంటికి తెచ్చి నా చేతిలో పెట్టేది. ఈ నెల ఇంకా రాలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్ల మీద ఫిర్యాదు చేశారని తెలిసింది. వలంటీరు లేకుంటే నా లాంటి ఎంతోమంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయేవారు. కరోనాలో ఆపద్బాంధవులుగా ఆదుకున్నారు. ముసలి వారితో రాజకీయ క్రీడలు ఆడడం ఎంతవరకు సమంజసం. ఈ ఎండలో సచివాలయానికి ఏ విధంగా వెళ్లాలి. మానవత్వం లేని టీడీపీ, జనసేన నాయకులు ప్రజలకు ఏం మేలు చేస్తారు? – ఎస్.గోపాల్, కొర్లగుంట, తిరుపతి జిల్లా చంద్రబాబు చూపు పడితే కష్టాలే నాకు 90 ఏళ్ల పైనే ఉంటాయి. అనారోగ్యంతో కొన్నేళ్లుగా మంచంలోనే ఉంటున్నా. ఎక్కడికీ పోలేను. ప్రతినెలా వలంటీరు ఇంటి వద్దకే వచ్చి జీతం ఇచ్చినట్లు పింఛను ఇచ్చేవారు. వేలి గుర్తులు పడకపోయినా ఓపిక పట్టి ఇచ్చేవారు. ఆ డబ్బులు మందులకు, ఖర్చులకు సరిపోయేవి. ఇప్పుడు వలంటీరును రాకుండా చేసినారు ఎక్కడికో పోయి తెచ్చుకోవాలంట. ఇన్ని ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగులుతుంది. ఆయన చూపు పడితే అన్నీ కష్టాలే. – బోయ బతుకమ్మ, సోమలగూడ, నందవరం మండలం, కర్నూలు జిల్లా. ఆ రోజులు తలచుకుంటే భయమేస్తుంది నా వయస్సు 70 సంవత్సరాలు. ప్రభుత్వం ఇచ్చే పింఛనే నాకు జీవనాధారం. జగన్మోహన్రెడ్డి వచ్చాక ఒకటో తేదీన ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు పింఛన్ సొమ్ముల కోసం గతంలోలా పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడతాం. అప్పటి ఇబ్బంది తలచుకుంటేనే చాలా భయమేస్తోంది. ఇంటి దగ్గరకి వచ్చి పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. – మాముడూరి సూరమ్మ, పెనుగొండ, ప శ్చిమగోదావరి జిల్లా మా ఉసురు తగులుతుంది రోడ్డు ప్రమాదంలో కాలుకు దెబ్బతగలడం వల్ల చేతికర్ర ఉంటే తప్ప నడవలేను. రెండేళ్లుగా పింఛన్ అందుకుంటున్నాను. ప్రతి నెల 1న 6 గంటలకు నా తలుపు తట్టి రూ. 3000లు పింఛన్ అందజేసేవాడు. నాకు షుగర్, బీపీ ఉండడం వలన ఎక్కువ సేపు నిలబడలేను. పింఛన్ డబ్బులు అందితేనే నాకు పూట గడిచేది. టీడీపీ వలంటీర్లపై కోర్టులో కేసు వేసింది. ఈనెల పింఛన్ ఇప్పటికి ఇవ్వలేదు. మాలాంటి వికలాంగుల ఉసురు తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. ఇప్పటి వరకు పింఛన్ ఇంటికే వస్తుందనే ధైర్యంతో ఉన్నాను. – దియ్యా రాంబాబు, రాజుపాలెం గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆమె పేరు మంజుల. భర్త వెంకటేష్ చిరువ్యాపారి. చిత్తూరు నగరంలోని తేనెబండ కాలనీలో నివాసముంటారు. వీరికి 23 సంవత్సరాల వయస్సు ఉన్న భరత్ (విభిన్న ప్రతిభావంతుడు) ఉన్నాడు. 11 సంవత్సరాల క్రితం ఇంటి దగ్గర ఆడుకుంటూ మెట్ల మీద నుంచి పడడంతో కాలుకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి నడవడానికి వీలుకాని పరిస్థితి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేదు. తల్లి తోడు ఉంటేనే కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి. బయట ప్రపంచమే తెలియని భరత్ ఇంటికే పరిమితమయ్యాడు. గత పాలనలో పింఛను కూడా వచ్చేది కాదు. వైఎస్ఆర్సీపీ వచ్చాక గత ఐదు సంవత్సరాలుగా పింఛను అందుకుంటున్నాడు. ప్రతి నెలా ఒకటవ తేదీన వలంటీర్ ఇంటి వద్దకు వచ్చి పింఛను అందజేసేవారు. ప్రతి నెలా వచ్చే రూ.3 వేలు పింఛను డబ్బును భరత్ చికిత్సకు ఉపయోగపడేవి. టీడీపీ చేసిన కుట్రతో వలంటీర్లు పింఛను ఇవ్వరనే వార్త తెలియగానే భరత్ తల్లి తల్లడిల్లిపోయింది. భరత్ను వార్డు సచివాలయానికి ఎలా తీసుకెళ్లాలని ఆవేదన చెందుతోంది. ఇటువంటి నీచమైన పనులు చేయడం చంద్రబాబుకు సబబు కాదని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. – కుమారుడు భరత్తో తల్లి మంజుల, తేనెబండ, చిత్తూరు జిల్లా నిస్సహాయులను శిక్షించడమేమిటి? ఈ ఫోటోలో కనిపిస్తున్న అభాగ్యుడి పేరు పిప్పళ్ల రామలక్ష్మయ్య. కృష్ణాజిల్లా బందరు మండలం పోతేపల్లి గ్రామం. వ్యవసాయ కూలీ. 15 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు. ఇంటి పెద్ద దిక్కు మూలన పడిపోవడంతో కుటుంబం ఆర్థికంగా నలిగిపోయింది. గత ప్రభుత్వంలోనూ పింఛను అందుకున్నప్పటికీ దయనీయ స్థితిలో దూర ప్రాంతానికి వెళ్లి డబ్బులు అందుకోవాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతినెలా ఒకటో తేదీన వలంటీర్ తలుపు తట్టి పింఛను అందించేవారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వలంటీర్ వ్యవస్థపై కక్షగట్టి కోర్టు ద్వారా ఆంక్షలు విధించడంతో ఈనెల లేవలేని స్థితిలో మంచాన ఉన్న అభాగ్యుడికి పెన్షన్ అందలేదు. పెన్షన్ అందితే తప్ప అతనికి జీవనాధారం లేదు. ప్రభుత్వం నుంచి అందుకునే నగదుతోనే మందులు వాడేది. అడుగు తీసివేయలేని తనకు అన్ని విధాల అండగా ఉన్న వలంటీర్ను విధుల నుంచి తొలగించాలని కోర్టు నిర్ణయించడం తనలాంటి నిస్సహాయులను శిక్షించడమేనని ఆవేదన చెందుతున్నాడు. – పిప్పళ్ల రామలక్ష్మయ్య, పోతేపల్లి, బందరు మండలం, కృష్ణా జిల్లా, -
బాబు పగ.. పండుటాకులకు బెంగ
తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీలో వలంటీర్ల ఆప్యాయ పలకరింపులు అవ్వాతాతలకు ఉండవు. చంద్రబాబు పండుటాకులు అనే కనికరం కూడా చూపలేదు. పింఛన్లపై పగపట్టారు. వలంటీర్లపై అక్కసు వెల్లగక్కారు. ఫలితంగా మొదటి సారిగా వైఎస్సార్ పింఛన్ కానుక కింద వలంటీర్లు లేకుండానే పింఛన్ల పంపిణీ ప్రక్రియ జరగనుంది. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి.. ఇంటి వద్ద మంచానికే పరిమితమైన వారికి పింఛన్ సొమ్ము సకాలంలో చేరుతుందా లేదా అనే బెంగ లబ్ధిదారుల్లో కలుగుతోంది. కడప రూరల్ : ప్రతి నెలా వలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే ఠంచన్గా పింఛన్ పంపిణీ జరిగేది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు చేయడంతో పింపిణీపై గందరగోళం నెలకొంది. అదే సందర్భంలో ఆయన చర్యలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిగే పింఛన్ల పంపిణీ సాఫీగా జరిగేనా అనే అనుమానం అందరిలో కలుగుతోంది. అధికారుల చర్యలు ఇలా .. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారులు పింఛన్ల పంపిణీకి ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. రెండు దశల్లో పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారం మొదటి దశ సచివాలయాల్లో సిబ్బంది ద్వారా, రెండవ దశ ద్వారా సచివాలయాలకు రాలేని వ్యాధిగ్రస్తులు, మంచాన పడిన వారు తదితరులకు ఇంటి వద్దనే ఇవ్వాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సచివాలయాల వద్దకు పింఛన్ కోసం వచ్చే వారి సౌకర్యార్థం టెంట్లు, మంచి నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు. వయోభారం.. అనారోగ్యం జిల్లాలో 17 కేటగిరీలకు చెందిన వారు మొత్తం 2,68,179 మంది ఉన్నారు. వారందరికీ రూ.79,31,26,000 నగదును అందజేయాలి. మొత్తం 2,68,179 పింఛన్లలో వృద్ధులు అధిక సంఖ్యలో 1,40,864 మంది ఉన్నారు. అలాగే దివ్యాంగులు 40,391 మంది, డీఎంహెచ్ఓ కింద 1,526 మంది, కిడ్నీ వ్యాధిగ్రస్తులు (ప్రభుత్వ, ప్రైవేట్) 490 మంది ఉన్నారు. ఒక అంచనా ప్రకారం వృద్ధుల విభాగంలో సగం మంది వయోభారంతో, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దివ్యాంగుల్లో 75 శాతం మంది నడవలేని పరిస్థితిలో ఉంటారు. డీఎంహెచ్ఓ, కిడ్నీ వ్యాధిగ్రస్తులతోపాటు సైని క్ వెల్ఫేర్, వితంతువులు, చేనేతలు, ఒంటరి మహిళ విభాగాలకు చెందిన వారిలో అధిక సంఖ్యలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ సంఖ్యలో కదలలేని స్థితిలో ఉన్నారు. వారి కందరికీ ఇంటి వద్దనే పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. మొత్తం పింఛన్లలో దాదాపుగా 50 శాతం మంది ఏదో ఒక సమస్యతో బాధపడే వారే ఉన్నారు. తక్కువ సిబ్బందితో మూడు రోజుల్లో సాధ్యమేనా.. అధిక సంఖ్యలో వలంటీర్లు ఉన్నప్పుడే పింఛన్ల పంపిణీ నాలుగైదు రోజులకు 100 శాతం నమోదయ్యోది. అలాంటిది సచివాలయ సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండే క్రమంలో మూడు రోజుల్లో పంపిణీ సాధ్యమయ్యే పనేనా అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఒక సచివాలయంలో 11 మంది సిబ్బంది ఉంటారు. అందులో ఇద్దరు లేదా ముగ్గరు వ్యక్తిగత సెలవులో ఉండే అవకాశం ఉంది. అదనంగా సిబ్బందిని తీసుకున్నప్పటికీ వలంటీర్ల అంత వేగంగా పింఛన్ల పంపిణీ సాగదనే అభిప్రాయాన్ని అవ్వాతాతలు వ్యక్తం చేస్తున్నారు. ఉసురు తగులుతుంది పింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా పెట్టాలని చంద్రబాబు ఫిర్యాదు చేయడం శోచనీయం. మంచంలో నుంచి లేవలేని వాళ్లం సచివాలయం వద్దకు వెళ్లి పింఛన్ ఎలా తీసుకోవాలి. చంద్రబాబుకు మాలాంటి వాళ్ల ఉసురు తగుతులుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్ ఇంటి వద్దకే వస్తోంది. తెల్లవారక ముందే పింఛన్ అందేది. వలంటీర్ల సేవలు ఎంతో బాగున్నాయి. అలాంటి వారికి అన్యాయం చేయొద్దు. ఇప్పుడు మళ్లీ మాకు పింఛన్ కష్టాలు ఎదురవుతున్నాయి. – ఆకుల సంజమ్మ, 8వ వార్డు, మైదుకూరు పింఛన్ తెచ్చి ఇవ్వడమే పాపమా మా మనవళ్ల వంటి వలంటీర్లు మాకు పింఛన్ తెచ్చి ఇవ్వడమే పాపమా. ఇంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మున్సిపాలిటీ ఆఫీసు వద్దకు పింఛన్ కోసం వెళ్లి ఎండలో సొమ్మసిల్లి పడిపోయే వాళ్లం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి వద్దకే పింఛన్ తెచ్చి ఇస్తున్నారు. వలంటీర్ల సేవలు మరువలేం. మళ్లీ పింఛన్ల పంపిణీ వారికే ఇవ్వాలి. – బాబులమ్మ, సాయినాథపురం, మైదుకూరు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చే వారు ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామునే ఇంటికి వచ్చి పింఛన్ డబ్బులు ఇచ్చేవారు. ఇన్నాళ్లు మాకు పింఛన్ గురించి టెన్షన్ లేకుండా ఉండేది. ఇపుడు వలంటీర్లు లేరంటే చాలా టెన్షన్గా ఉంది. అసలు మాకు పింఛన్ డబ్బులు ఎప్పుడు చేతికి అందుతాయో అర్థం కావడం లేదు. మేము డబ్బుల కోసం సచివాలయాలకు ఎన్ని రోజులు వెళ్లాలో. అంతా గందరగోళంగా ఉంది. జగనన్న డబ్బులు ఇస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు? వలంటీర్ల ద్వారానే మాకు పింఛన్లు ఇప్పించండి. మాకు అది చాలు. ఇంకేం వద్దు. – షహజాదీ, వితంతు పింఛన్ లబ్దిదారురాలు, కమలాపురం. జిల్లాలో సచివాలయాలు.. సిబ్బంది వివరాలు ప్రాంతం సచివాలయాలు సచివాలయ వలంటీర్లు సిబ్బంది -
పింఛన్ దారుడి మృతిపై చలించిన సీఎం జగన్
-
పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు, నిమ్మగడ్డను షాక్
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
చాబహర్ పోర్ట్ నిర్వహణకు ఒప్పందం
మన ఓటే మన భవిత.. కదలండి (ఫొటోలు)
ప్రశాంతంగా ఓటు వెయ్యండి మంచి చేసే వారికే ఓటు వెయ్యండి
బీజేపీ అభ్యర్థిపై మాధవీ లతపై కేసు నమోదు
టీడీపీ నైరాశ్యంలోకి వెళ్లి హింసను ప్రేరేపిస్తోంది: సజ్జల
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి
Mothers day 2024 మామ్స్తో సెలబ్రిటీలు, రెండు కళ్లూ చాలవు (ఫోటోలు)
లండన్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్న మీనా
పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ.. అంతకు ముందే 'ఎగ్ ఫ్రీజింగ్'
అందరూ ఓటు వేయండి.. ఓటర్లకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
తప్పక చదవండి
- బీజేపీ అభ్యర్థిపై మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement