-
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో!
తొలి సినిమా ‘అల్లుడు శీను’తోనే హిట్ కొట్టి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఆ తర్వాత జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోల లిస్ట్లో చేరిపోయాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవల నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ సిక్స్ ప్యాక్ హీరో..ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. ప్రస్తుతం 14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్పై టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది. దీంతోపాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్తో మరియు మూన్షైన్ పిక్చర్స్తో చేతులు కలిపాడు.వీటి కోసం..మునుపెన్నడూ చూడని లుక్లో శ్రీనివాస్ కనిపించనున్నాడు అని తెలుస్తుంది. ఇవీ అన్నీ కూడా చాలా ప్రత్యకమైన కథలు అని, ఇవి అతని కెరీర్లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తాయి అని అంటున్నారు. యాక్షన్-ఓరియెంటెడ్ మరియు కంటెంట్-డ్రైవెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ సినిమాలు ఆయనకు మంచి కమ్ బ్యాక్ మూవీలు అవుతున్నాయి అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. -
తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ మూవీ.. ఏకంగా ప్రపంచ రికార్డ్ సొంతం!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'జయ జానకి నాయక'. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్లో రిలీజ్ అయినప్పటీ నుంచి ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తాజాగా 800 మిలియన్ల వ్యూస్తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కాగా.. ఈ సినిమాను హిందీలో ఖుంఖార్ పేరుతో రిలీజ్ చేశారు. సౌత్ డబ్బింగ్ మూవీస్లో ఇప్పటివరకు జయ జానకి నాయక మాత్రమే ఈ రికార్డ్ సాధించింది. యశ్ నటించిన కేజీఎఫ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. కానీ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలోనే హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 772 మిలియన్ల వ్యూస్తో రెండోస్థానంలో కొనసాగుతోంది. కాగా.. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #JayaJanakiNayaka 800M+ Views 💥👌@BSaiSreenivas @Rakulpreet #BellamkondaSrinivas #RakulPreetSingh #PenMovies pic.twitter.com/eC5M6cml89 — South Hindi Dubbed Movies (@SHDMOVIES) February 20, 2024 -
టైసన్ నాయుడి యాక్షన్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్ని ఖరారు చేశారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమా నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 3న) సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ని ‘టైసన్ నాయుడు’గా ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. సాయి శ్రీనివాస్ను బాక్సింగ్ లెజెండ్ మైక్టైసన్ అభిమానిగా ఈ చిత్రం వీడియో గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యునిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘టైసన్ నాయుడు’. సాయి శ్రీనివాస్ను మునుపెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్లో చూపిస్తున్నారు సాగర్ కె. చంద్ర. హై బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ముఖేష్ జ్ఞానేష్, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: హరీష్ కట్టా. -
యాక్షన్ ఎంటర్టైనర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బీఎస్ఎస్ 10’(వర్కింగ్ టైటిల్). ‘భీమ్లా నాయక్’ మూవీ తర్వాత సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా కీలక షెడ్యూల్ పూర్తయింది. ‘‘యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘బీఎస్ఎస్ 10’. భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ని గతంలో ఎన్నడూ చూడని పవర్ ఫుల్ పాత్రలో సరికొత్తగా చూపించనున్నారు సాగర్ కె.చంద్ర. ఈ సినిమాలోని కీలకమైన షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేశాం. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 3న శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: హరీష్ కట్టా, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ముఖేష్ జ్ఞానేష్. -
ఓటీటీలోకి బెల్లంకొండ హిందీ మూవీ.. ఆరునెలల తర్వాత ఇప్పుడు
రీసెంట్ టైమ్స్లో థియేటర్లలో రిలీజైన ఎలాంటి సినిమా అయినా సరే నెల, నెలన్నరలోపే ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేస్తోంది. అలాంటిది ఓ సినిమాని దాదాపు ఐదారు నెలల రిలీజ్ చేయకుండా అలా ఉంచేశారు. ఇప్పుడేమో చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఆ సినిమా సంగతేంటి? అసలు దీనికి కారణమేంటి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్కి తగ్గట్లు మన హీరోలు.. బాలీవుడ్లోనూ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. 'ఛత్రపతి' రీమేక్తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులోనే ఒక్కటి తప్ప మరో హిట్ కొట్టలేకపోయాడు. అలాంటిది హిందీలో, అదీ కూడా ఓ రీమేక్తో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ ఘోరమైన టాక్ వచ్చింది. కలెక్షన్స్ అయితే మరీ దారుణం. ఈ ఏడాది మే 12న రిలీజైన ఈ సినిమాని థియేటర్లలో జనాలు చూడలేకపోయారు. దీనికి తోడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ మూవీ గురించి మర్చిపోయారు. ఓటీటీలో కూడా రిలీజ్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు సడన్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలిసింది. దీంతో మళ్లీ ట్రోలర్స్ బెల్లంకొండ మూవీపై విరుచుకుపడుతున్నారు. థియేటర్లలో చూడటానికి చాలా కష్టపడ్డారు. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి? (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్లో ఆ థ్రిల్లర్ మూవీ) -
యాక్షన్ ఎంటర్టైనర్ షురూ
శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ కొట్టి, డైరెక్టర్ పరశురామ్తో కలసి మేకర్స్కి స్క్రిప్ట్ను అందించారు. ‘‘యూనిక్ సబ్జెక్ట్తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. శ్రీనివాస్ కెరీర్లో పదో చిత్రంగా రూపొందుతోంది. ఈ నెల రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: జిమ్షి ఖలీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. -
రాజమౌళి, ప్రభాస్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయిన హిందీ ఛత్రపతి లెక్కలు
-
ప్రభాస్కు, సాయికి పోలికలు వద్దు: వీవీ వినాయక్
‘నేటి యువతలో చాలామంది తెలుగు ‘ఛత్రపతి’ (2005) సినిమాను చూసి ఉండరు. వారికి హిందీ రీమేక్ ‘ఛత్రపతి’ (2023) ఫ్రెష్గా ఉంటుంది. ఇక అప్పట్లో ‘ఛత్రపతి’ని చూసినవారు తెలుగు ‘ఛత్రపతి’ సినిమాను పాడు చేయకుండా బాగా తీశారని అనుకుంటారు. లొకేషన్స్, సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్లు కొత్తగా ఉంటాయి. ఓ ప్రాపర్ హిందీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. (చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి ) ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను అదే టైటిల్తో హిందీలో రీమేక్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో జయంతి లాల్ గడ నిర్మించిన ఈ సినిమా మే 12న హిందీలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన సమావేశంలో దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో సాయి హీరోగా నటించిన సినిమాలు హిందీలో అనువాదమై, మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసం తను ఫిజిక్ బాగా మెయిన్టైన్ చేశాడు. హిందీ నేర్చుకున్నాడు. ఇంట్రవెల్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో సాయి నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. (చదవండి: ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ! ) ఈ చిత్రంతో సాయి బాలీవుడ్లో హీరోగా నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. రీమేక్ అంటే కొన్ని ఐకానిక్ షాట్స్ను టచ్ చేయకపోవడమే మంచిది. మేమూ అదే చేశాం. ఇక యాక్టింగ్ పరంగా ప్రభాస్కు, సాయికి పోలికలు వద్దు. అయితే ‘ఛత్రపతి’ సినిమాలో హీరో క్యారెక్టర్కు సాయి న్యాయం చేశాడని మాత్రం చెప్పగలను. హిందీ ‘ఛత్రపతి’ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాను కేవలం హిందీ భాషలోనే రిలీజ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘మాస్ పల్స్ తెలిసిన దర్శకుల్లో వీవీ వినాయక్గారు ఒకరు. తెలుగులో ‘అల్లుడు శీను’తో మా అబ్బాయి (బెల్లంకొండ సాయి)ని ఇంట్రడ్యూస్ చేసిన వినాయక్గారు హిందీలోనూ పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయవచ్చు. కానీ హిందీలో తీసిన సినిమాను హిందీ భాషలోనే ఆడియన్స్కు చూపిద్దామన్నారు వినాయక్గారు. రూ. 60 కోట్ల బడ్జెట్తో పెన్ స్టూడియోస్ లాంటి నిర్మాణసంస్థ మా అబ్బాయితో సినిమా నిర్మించడం నాకు గర్వంగా ఉంది’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. -
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు.. ఏడాదిన్నరపాటు ఇంట్లోనే ఉన్నా: హీరో
అల్లుడు శీను సినిమాతో హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా హిట్ అయినప్పటికీ దాదాపు రెండేళ్ల తర్వాతే మళ్లీ వెండితెరపై కనిపించాడు. తెలుగులో అల్లుడు అదుర్స్ సినిమాలో చివరగా నటించిన బెల్లంకొండ ప్రస్తుతం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన ఛత్రపతి హిందీ రీమేక్ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హీరో. 'నా తండ్రి నిర్మాత కావడం వల్లే నేను సినిమాల్లోకి చాలా సులభంగా రాగలిగానని అందరూ అనుకుంటారు. అది నిజమే, కానీ నేను హార్డ్ వర్క్ చేయడం వల్లే ఇక్కడ ఉన్నాను. నా తొలి సినిమా అల్లుడు శీను బ్లాక్బస్టర్ హిట్. ఆ సినిమాకు నాన్న నిర్మాత. ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారు. మరి నా తొలి సినిమాలో నటించేందుకు సమంత, తమన్నా ఎందుకు ఒప్పుకున్నారు? నేను వారికి 5 నిమిషాల డ్యాన్స్, 5 నిమిషాల యాక్టింగ్, 5 నిమిషాల యాక్షన్ వీడియోలన్నింటినీ కలిసి ఒక డెమో వీడియో క్రియేట్ చేసి వారికి పంపించాను. అది చూసిన తర్వాతే వాళ్లు సినిమా ఓకే చేశారు. ఆ సినిమా సక్సెస్ అయింది. కానీ అప్పటికే మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నాన్న డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన 8 సినిమాలన్నీ నష్టాలు తెచ్చిపెట్టాయి. ఆ సమయంలో నాపై ఒత్తిడి పెరిగింది. ఫస్ట్ సినిమా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి, కానీ తిరస్కరించాను. అలా ఏడాదిన్నర పాటు ఇంట్లోనే కూర్చుండిపోయాను. ఆ తర్వాత తక్కువ బడ్జెట్లో రెండో సినిమా చేశాను. బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన జయ జానకీ నాయక చిత్రంతో అన్ని విధాలుగా నిలదొక్కుకున్నాను' అని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. చదవండి: ఇంటి గడప దాటడానికి కూడా పోరాటం చేయాల్సి వస్తోంది -
రష్మిక మందన్న డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన అల్లుడు శ్రీనివాస్
-
రష్మికతో డేటింగ్.. స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్
ఛత్రపతి సినిమాతో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ తరచూ ముంబై వెళ్లి వస్తున్న విషయం తెలిసిందే! ఈ క్రమంలో కొన్నిసార్లు ముంబై ఎయిర్పోర్టులో రష్మికతో కలిసి కనిపించాడు. దీంట్లో అనుమానించడానికేం ఉంది, వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అని సౌత్ మీడియా లైట్ తీసుకుంది. కానీ బాలీవుడ్ మాత్రం వాళ్లిద్దరి మధ్య ఇంకేదో ఉందని, బహుశా డేటింగ్ చేస్తున్నారేమోనని కథనాలు రాసేసింది. అంతేకాదు, బెల్లంకొండ కోసం విజయ్ దేవరకొండకు బ్రేకప్ చెప్పిందని వార్త అల్లేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ రూమర్లపై స్పందించాడు. 'మేమిద్దరం కలుసుకోవడమే గగనమైపోయింది.. అలాంటిది మీరు ఏకంగా డేటింగ్ అనేస్తున్నారేంటి? మేము ప్రేమలో ఉన్నామనేది పచ్చి అబద్ధం. మేము మంచి స్నేహితులం మాత్రమే! కాకపోతే మా వృత్తిరీత్యా మేము తరచూ హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సి వస్తోంది. అయినా కూడా కలిసి ఎప్పుడూ ప్రయాణించలేదు. కానీ అనుకోకుండా చాలా సార్లు ఎయిర్పోర్టులో ఒకరికొకరం తారసపడ్డాం. ఈ క్రమంలో బహుశా ఒకటీ, రెండుసార్లు మీడియాకు కనిపించామనుకుంటా! అంతే' అని చెప్పుకొచ్చాడు. దీంతో బెల్లంకొండ- రష్మిక డేటింగ్ అంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలకు చెక్ పడినట్లైంది. చదవండి: బాక్సాఫీస్ను ఆవహించేందుకు వస్తున్న ఆత్మకథలు -
ఈ నెలలోనే ఛత్రపతి
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఛత్రపతి’. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. నుష్రత్ బరుచ్చా హీరోయిన్గా నటించారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ (2005)ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో పెన్ స్టూడియోస్పై ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ని విడుదల చేశారు మేకర్స్. ‘‘తెలుగు ‘ఛత్రపతి’ సినిమా బ్యాక్డ్రాప్ని మార్చి, యాక్షన్ ఎంటర్టైనర్గా హిందీ ‘ఛత్రపతి’ని తెరకెక్కించారు వినాయక్. శ్రీనివాస్ రగ్డ్ అండ్ మాస్ లుక్లో కనిపిస్తాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించాడు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నిజార్ అలీ షఫీ, సంగీతం: తనిష్క్ బాగ్చి, వరల్డ్ వైడ్ విడుదల: పెన్ మరుధర్ సినీ ఎంటర్టైన్మెంట్. -
ఊర మాస్ సినిమాలతో బాలీవుడ్ ఎంట్రీ..
-
ఒకరితో బ్రేకప్!.. ఇంకొకరితో స్టార్టప్!.. ఏది నిజం..?
-
హిందీలో సినిమాలు చేస్తున్న తెలుగు స్టార్స్.. ప్రభాస్ ఒక్కడే కాదు, చరణ్, తారక్..
పాన్ ఇండియా ఫార్ములా భాషాపరమైన హద్దులను చెరిపేసింది. ఒక భాషలో రూపొందించిన చిత్రాలను ఇతర భాషల్లో అనువదించి, విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోలకు కూడా హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ ‘ఆజా రాజా’ (రా రాజా) అంటూ తెలుగు హీరోలతో స్ట్రయిట్ హిందీ చిత్రాలు నిర్మించడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం తెలుగు స్టార్స్ చేస్తున్న హిందీ స్ట్రయిట్ ఫిలింస్ విశేషాలు తెలుసుకుందాం.. రవితేజ హీరోగా నటించిన పలు హిట్ సినిమాలు హిందీలో డబ్బింగ్ అయి, అక్కడి బుల్లితెరపై అడపాదడపా ప్రదర్శితమవుతున్నాయి. ఆ విధంగా హిందీ ప్రేక్షకుల్లో రవితేజకు మంచి పాపులారిటీ ఉంది. ఇప్పుడు స్ట్రయిట్గా రవితేజ బాలీవుడ్కు వెళ్లనున్నట్లు టాలీవుడ్ టాక్. తమిళ హిట్ ఫిల్మ్ ‘మానాడు’ రీమేక్లో (హిందీ, తెలుగు) రవితేజ, బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ కలిసి నటించనున్నారట. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని హీరో రానా, ఏషియన్ సునీల్ నిర్మిస్తారట. ► ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకోవడంలో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాత ఆదిత్యా చోప్రా ఫస్ట్ సక్సెస్ అయ్యారు. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించనున్న స్పై మూవీ ‘వార్ 2’లో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ‘బ్రహ్మాస్త్రం’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ప్రస్తుతం బీ టౌన్లో బలంగా వినిపిస్తున్న ఈ వార్తలు నిజమైతే ఎన్టీఆర్ నటించే తొలి స్ట్రయిట్ హిందీ చిత్రం ఇదే అవుతుంది. ► బాలీవుడ్లో అల్లు అర్జున్ ఎంట్రీ గురించిన టాక్ ఎప్పట్నుంచో ఉంది. అల్లు అర్జున్తో ఓ హిందీ సినిమా చేయాలని బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ ప్రయత్నించారు... కుదర్లేదు. ఆ తర్వాత దర్శక–నిర్మాత సంజయ్లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సమావేశమవగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ అల్లు అర్జున్తో స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ చేసే అవకాశం టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్కు లభించింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. టీ సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ప్రణవ్ రెడ్డి వంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ► దేశభక్తి నేపథ్యంతో కూడిన చిత్రంతో బాలీవుడ్కు పరిచయం అవుతున్నారు వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్సింగ్ను దర్శకునిగా పరిచయం చేస్తూ, సోనీ పిక్చర్స్ ఇండియా, రెనైసాన్స్ పిక్చర్స్ పతాకంపై సందీప్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ జెట్ పైలెట్గా చేస్తున్నారు. ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ► బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు హిందీ వ్యూయర్స్లో క్రేజ్ ఉంది. శ్రీనివాస్ హీరోగా నటించిన ‘జయ జానకి నాయక’ హిందీ వెర్షన్కు యూట్యూబ్లో 700 మిలియన్ వ్యూస్ రావడమే ఇందుకు నిదర్శనం. సాయి శ్రీనివాస్ నటించిన తెలుగు చిత్రాల హిందీ అనువాదాలకు అక్కడి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. దీంతో ‘ఛత్రపతి’గా బాలీవుడ్కు వెళ్తున్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఛత్రపతి’ సినిమాకి రీమేక్ ఇది. అదే టైటిల్తో హిందీలో రీమేక్ అయిన ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. జయంతి లాల్ గడ నిర్మించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. మరికొందరు తెలుగు స్టార్స్ కూడా హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్స్ చేసే చాన్స్ ఉంది. ‘బాహుబలి’ సక్సెస్తో లేటెస్ట్ జనరేషన్లో పాన్ ఇండియా స్టార్గా పేరు తెచ్చుకున్న తొలి హీరోగా ప్రభాస్ను చెప్పుకోవచ్చు. ఆ చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాల బడ్జెట్స్ పెరిగాయి. బాలీవుడ్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ప్రభాస్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భూషణ్కుమార్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. రామాయణంగా ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. అలాగే ప్రభాస్ హీరోగా కమిటైన మరో చిత్రం ‘స్పిరిట్’. ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్ భూషణ్కుమార్, భద్రకాళి పిక్చర్స్ సందీప్రెడ్డి వంగా, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. 2024 చివర్లో ఈ సినిమా సెట్స్పైకి వెళుతుందని టాక్. దాదాపు పదేళ్ల క్రితమే హిందీలో ‘జంజీర్’ (తెలుగులో ‘తుఫాన్’)తో ఎంట్రీ ఇచ్చారు రామ్చరణ్. ఆ తర్వాత తెలుగు చిత్రాలకే పరిమితం అయ్యారు చరణ్. అయితే గత ఏడాది విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’లో ఓ హీరోగా నటించిన రామ్చరణ్కు బాలీవుడ్లో సూపర్ క్రేజ్ దక్కింది. హిందీలో స్ట్రయిట్ చిత్రాలు చేసే దిశగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పదేళ్ల తర్వాత ఓ గెస్ట్ రోల్లో హిందీ తెరపై కనిపించనున్నారు చరణ్. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ నటించిన ‘కిసీ కా భాయ్ కీసీ కా జాన్’ చిత్రంలో రామ్చరణ్ గెస్ట్ రోల్ చేశారు. ఈద్ సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రం రిలీజ్ కానుంది. మరోవైపు స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ చేసేందుకు కూడా చరణ్ కొన్ని కథలు విన్నారు. -
విజయ్ దేవరకొండకు బ్రేకప్ చెప్పిన రష్మిక మందన్నా?
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడం.. అదంతా తూచ్ అని ఇద్దరూ కొట్టిపారేయడం.. చివరికి జంటగా కనిపించడం సదా మామూలే! మేమిద్దరం మంచి ఫ్రెంట్స్ అంటారు వాళ్లు.. కాదు కాదు, మీరు కచ్చితంగా ప్రేమికులే అంటారు అభిమానులు. రీల్ లైఫ్లోని గీతాగోవిందం రియల్ లైఫ్లో కూడా ఒక్కటైతే చూడాలని ఉందని తహతహలాడుతుంటారు. కానీ వాళ్లు మాత్రం ఎప్పుడూ ఓపెన్ అయింది లేదు. అయితే తాజాగా రష్మిక.. విజయ్కు బ్రేక్ చెప్పిందని ఇప్పుడు మరో హీరోకు దగ్గరైందంటూ బీటౌన్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ ఆ మరో హీరో ఎవరో కాదు, మన తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాసే! వీరిద్దరూ రెండుమూడు సార్లు కలిసి కనిపించడం పాపం.. ప్రేమ మొదలైందంటూ కథనాలు అల్లేస్తున్నారు. ఏకంగా విజయ్కే బ్రేకప్ చెప్పిందని వార్తలు ప్రచారం చేస్తున్నారు. రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ మధ్య తరచూ కలుస్తున్న విషయం వాస్తవమే కానీ వారిది కేవలం స్నేహం మాత్రమే! అంతకు మించి అంటే ఒప్పుకునేది లేదంటున్నారు అభిమానులు. అయినా సరే కొందరు నెటిజన్లు మాత్రం వీరి వ్యవహారం ఏదో తేడాగా ఉందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రష్మిక చివరిసారిగా వారిసు చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె సందీప్రెడ్డి వంగా డైరెక్షన్లో యానిమల్ మూవీ చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికి వస్తే అతడు ఛత్రపతి సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. -
రేర్ రికార్డ్ నెలకొల్పిన జయ జానకి నాయక
-
ప్రభాస్ సినిమా రీమేక్ కష్టాలు బెల్లంకొండపై తీవ్రంగా ట్రోల్
-
ముంబై ఎయిర్ పోర్ట్లో రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్ సందడి
-
ప్రపంచ రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ మూవీ!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన చిత్రం జయ జానకి నాయక. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 709 మిలియన్ల వ్యూస్తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. ఏకంగా హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 702 మిలియన్ల వ్యూస్తో రెండోస్థానంలో నిలిచింది. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
బాలీవుడ్పై ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ.. ఛత్రపతి రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్కు మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తున్నాడు. వి.వి వినాయక్ రీమేక్కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను వేసవి కానుకగా మే12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. కండలు తిరిగిన దేహంతో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ అంచనాలను పెంచేస్తుంది. మరి ఈ సినిమాతో బెల్లంకొండ సక్సెస్ అందుకుంటారా? లేదా అన్నది చూడాల్సి ఉంది. The wait is over #Chatrapathi in cinemas on 12th May, 2023. Cannot wait to show you all our hardwork & this action-packed dhamaka.🔥 Written by the one and only #VijayendraPrasad, directed by #VVVinayak.@Penmovies #Bss9 pic.twitter.com/VSLYTWQkrT — Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 27, 2023 -
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు
తిరుమల : తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. దీంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్ట్ దాతలు, ఇతర ట్రస్ట్ల దాతలకు దర్శన టికెట్లను రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. గదులకు సంబంధించి 50 శాతం ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గదులను ఆఫ్లైన్లో తిరుమలలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయిస్తారు. అక్టోబర్ ఒకటో తేదీన గరుడసేవ కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్ల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఆన్లైన్, ఆఫ్లైన్లో గదుల కేటాయింపును నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 71,158 మంది స్వామిని దర్శించుకోగా.. 27,968 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.3.73 కోట్లు సమర్పించుకున్నారు. దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. మరోవైపు సోమవారం శ్రీవారిని సినీనటుడు బెల్లంకొండ శ్రీనివాస్, సినీనటి మాళవిక నాయర్, హాస్య నటుడు బ్రహ్మానందం, నేషనల్ చెస్ చాంపియన్ గూకేష్ దర్శించుకున్నారు. (క్లిక్: అహ్మదాబాద్లో శ్రీవారి ఆలయానికి భూమి) -
శరణ్ది మా ఊరే.. కావాలనే చీటింగ్ కేసు : బెల్లంకొండ సురేశ్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్, అతని తనయుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్పై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమా తీయడానికి డబ్బులు అవసరమంటూ తన దగ్గర నుంచి రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్కు చెందిన శరణ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.ప్రస్తుతం ఈ ఇష్యూ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చీటింగ్ కేసుపై బెల్లంకొండ సురేశ్ స్పందించారు. తనను, తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగంగా చీటింగ కేసు నమోదైందని ఆయన ఆరోపించారు. శరణ్ తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. ‘కొంతమంది కావాలనే నాపై, నా కొడుకుపై కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శరణ్ నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి. శరణ్తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారు . నాకు డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టక పోతే పరువునష్ట దావా వేస్తా .బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడ్తున్నారు. శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటా. నాకు కోర్టు నుండి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదు. నా పై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారు.నా పై చేసిన ఆరోపణల పై ఆధారాలు ఉంటే ఇవ్వాలని శరణ్ కు నోటీసులు ఇచ్చారు. శరణ్ది మా ఊరే. పదేళ్ల క్రితం పరిచయమయ్యాడు. సినిమా టికెట్ల కోసం అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇలా నాపై ఆరోపణలు చేస్తున్నాడు. అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు. అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’అని బెల్లంకొండ అన్నారు. -
కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ హీరో
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు (సోమవారం) తన పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. ఉదయం విఐపి దర్శనంలో కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ నేడు తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకొన్నానని అన్నారు. ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారిన సినిమా టికెట్లు ధరలపై స్పందించడానికి నిరాకరించారు. -
గజదొంగ బయోపిక్లో బెల్లంకొండ.. టైటిల్ ఇదే
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అల్లుడు శ్రీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో..తొలి మూవీతోనే సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాస్కు సరైన హిట్ లభించలేదు. దీంతో ఈ యంగ్ మీరో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో బ్లాక్బస్టర్ అయిన `ఛత్రపతి` బాలీవుడ్ రీమేక్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ యంగ్ హీరో మరో ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి ‘స్టూవర్ట్పురం దొంగ’ అనే పేరుని ఖరారు చేస్తూ టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. 1970 కాలంలో స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ గజదొంగ `టైగర్ నాగేశ్వర రావు` బయోపిక్ ఇది. నాగేశ్వరరావు తన జీవిత కాలంలో పోలీసుల నుంచి జైళ్ల నుంచి ఎన్నోసార్లు చాక చాక్యంగా తప్పించుకున్నాడు. చెన్నై జైలు నుంచి నాగేశ్వరరావు తప్పించుకున్న తీరుతో ఆయనకు `టైగర్` అనే పేరు వచ్చింది. పోలీసులను ముప్ప తిప్పలు పెట్టిన ఈ దొంగ 1987లో పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఈ విషయాలతో `స్టూవర్టుపురం దొంగ` సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ఎ.ఎస్. దర్శకత్వం వహించగా, ప్రెస్టీజియస్ బ్యానర్ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 1970-80 బ్యాక్డ్రాప్లో తెరకెక్కబోతున్న ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ కోసం ప్రముఖ టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
RR vs PBKS: పంజాబ్పై రాజస్తాన్ గెలిస్తే!
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement