
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’. ఈ హారర్, మిస్టరీ, ఎమోషనల్ మూవీని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించారు.

కాగా ‘కిష్కిందపురి’ సినిమాను సెప్టెంబరు 12న రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘థ్రిల్, ఎమోషన్స్ కలగలిసిన ఓ కొత్త తరహా అనుభూతిని ఈ సినిమా ప్రేక్షకులకు అందిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: సామ్ సీఎస్.