కోలీవుడ్ హీరో, నిర్మాత విశాల్కు మద్రాస్ హైకోర్ట్ బిగ్ షాకిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు సంబంధించిన కేసులో విశాల్కు చుక్కెదురైంది. డబ్బులు చెల్లించేందుకు మరింత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఈ కేసులో మొదట లైకాకు చెల్లించాల్సిన రూ.21.29 కోట్లను 30శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. విశాల్ రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లు చెల్లించేందుకు ఆరు వారాల గడువు కావాలని విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం అందుకు విముఖత వ్యక్తం చేస్తూ విశాల్ పిటిషన్ను కొట్టివేసింది. కాగా.. సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని.. ఆ డబ్బు తిరిగి చెల్లించలేదంటూ 2022లో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.


