మాటల రచయితగా మారిన సింగర్
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ మాటల రచయితగా అవతారమెత్తాడు. ఇప్పటివరకు పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించిన సాగర్.. ఇకపై మాటలతోనూ పలకరించనున్నాడు. తన సోదరుడు డైలాగ్ రైటర్గా మారిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
సింగర్గా ఉన్న తన సోదరుడు ‘రాక్షసుడు’ చిత్రంతో మాటల రచయితగా మారాడని.. ఈ విషయాన్ని పంచుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమ తండ్రి (రచయిత సత్యమూర్తి) వారసత్వాన్ని కొనసాగించేందుకు అందరి ఆశీస్సులు కావాలని ట్విటర్ వేదికగా కోరారు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరణ్ కాంబోలో తమిళ సూపర్హిట్ రాక్షసన్కు రీమేక్గా ‘రాక్షసుడు’ చిత్రం తెరకెక్కుతోంది.
Am Glad 2 share dat my brother @sagar_singer whom U all know as a SINGER is bein introduced as a DIALOGUE WRITER in #RAKSHASUDU 😁🎶
Need all ur blessings 4 him to take up my Father’s Love 4 Writing n continue his Legacy🙏🏻❤️@BSaiSreenivas @anupamahere https://t.co/HbgmZO1rt7
— DEVI SRI PRASAD (@ThisIsDSP) June 8, 2019