
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ మూవీ 'కిష్కింధపురి'(Kishkindhapuri). కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం రూ. 30 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది.
తాజాగా ఈ మూవీ నుంచి థీమ్ సాంగ్ను రిలీజ్ చేశారు. కిష్కింధపురి థీమ్ పేరుతో ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు చైతన భరద్వాజ్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమాను దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 వేదికగా అక్టోబర్ 17 నుంచి అందుబాటులోకి వచ్చేసింది.