తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్లు.. గొప్ప చిత్రాన్ని కాపాడతారు: బెల్లంకొండ | Bellamkonda Sai Srinivas Talks About Kishkindhapuri At Success Meet | Sakshi
Sakshi News home page

కిష్కింధపురికి ప్రేక్షకుల ప్రేమ దక్కింది

Sep 13 2025 12:28 PM | Updated on Sep 13 2025 1:10 PM

Bellamkonda Sai Srinivas Talks About Kishkindhapuri At Success Meet

‘‘కిష్కింధపురి’ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. గురువారం మూడు ప్రీమియర్‌ షోలు వేద్దామనుకుని, మొదలైన మా సినిమాకు 66 షోలు పడ్డాయి. ఆర్గానిక్‌గా మా సినిమా ఆడియన్స్‌కు చేరువైంది.  మా ‘కిష్కింధపురి’కి వారి ప్రేమ దక్కింది. ఈ ప్రేమ కొనసాగుతుంది. తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్ళు. గొప్ప చిత్రాన్ని కాపాడతారు’’ అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదలైంది.

 శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సినిమా  ప్రెస్‌ మీట్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలనే కృషితో చేసిన సినిమా ‘కిష్కింధపురి’. సాహుగారు ఎంతగానో సపోర్ట్‌ చేసి, ఈ సినిమాను నిర్మించారు. చేతన్‌ భరద్వాజ్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు’’ అన్నారు. 

‘‘మేము అనుకున్నదానికంటే డబుల్‌ ఇంపాక్ట్‌ రెస్పాన్స్‌ వస్తోంది. మా బ్యానర్‌లో మంచి సినిమా పడింది’’ అని తెలిపారు సాహు. ‘‘ఫస్ట్‌ టైమ్‌ హిట్‌ కొట్టినప్పుడు ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ మూమెంట్స్‌ని నేను లైఫ్‌ లాంగ్‌ గుర్తు పెట్టుకుంటాను’’ అని పేర్కొన్నారు కౌశిక్‌. ‘‘ప్రేక్షకుల స్పందన మా సినిమాకు గొప్ప బలాన్నిచ్చింది’’ అని చెప్పారు చేతన్‌ భరద్వాజ్‌.   

Advertisement
 
Advertisement
Advertisement