breaking news
ICC Womens ODI Cricket World Cup
-
ఓడినా.. గెలిచినా ఒకటే పాట? ఇదెక్కడి న్యాయం?
ఐసీసీ మహిళ ప్రపంచకప్-2025 విజేతగా హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిన మన అమ్మాయిల జట్టు.. తొలి వరల్డ్ కప్ టైటిల్ను ముద్దాడింది.స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో ఈ ప్రతిష్టత్మక ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. ఈ చారిత్రక విజయాన్ని యావత్ దేశం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం స్వయంగా భారత క్రికెటర్లను కలిసి అభినందించారు.ఈ గెలుపు సంబరాల మధ్య మాజీ భారత కెప్టెన్ శాంత రంగస్వామి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరిచాయి. హర్మన్ప్రీత్ కెప్టెన్సీ నుంచి వైదొలగి బ్యాటింగ్, ఫీల్డింగ్పై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. దీర్ఘకాలిక భవిష్యత్తు దృష్ట్యా కెప్టెన్సీ మార్పు అనివార్యమని శాంత రంగస్వామి అభిప్రాయపడ్డారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై మాజీ భారత కెప్టెన్ అంజుమ్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది."ప్రతీ ప్రపంచకప్ తర్వాత ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి. గత నాలుగైదు ప్రపంచకప్లను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా ఆర్దమవుతోంది. భారత్ ఓడిపోతే హర్మన్ను కెప్టెన్సీ తప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు గెలిచినా కూడా అదే పాట పడుతున్నారు. ఇదెక్కడి న్యాయం. ఈ తొలి ప్రపంచకప్ గెలిచిన క్షణాలను అస్వాదిస్తున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకారం. కాబట్టి దీనిపై ఎక్కువగా మాట్లాడాలనుకోవడంలేదు. హర్మన్తో నాకు మంచి అనుబంధం ఉంది. దేశవాళీ క్రికెట్లో ఆమె మాతో కలిసి ఆడింది. అప్పుడే తనలోని టాలెంట్ను గమనించాను. అండర్-19 ప్లేయర్గా ఉన్నప్పుడే ఆమె భారీ షాట్లు ఆడేది. ఆమె ఒక మ్యాచ్ విన్నర్. అందుకే హర్మన్ కెప్టెన్గా కొనసాగాలని నేను చెబుతా ఉంటా అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా పేర్కొన్నారు.చదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా? -
ఐసీసీ కీలక నిర్ణయం
దుబాయ్: మహిళా క్రికెట్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి మహిళల వన్డే వరల్డ్ కప్లో జట్ల సంఖ్యను ఎనిమిది నుంచి పదికి పెంచాలని నిర్ణయించింది. దుబాయ్లో జరుగుతున్న ఐసీసీ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు బోర్డు తీసుకుంది.ఇకపై ఐసీసీలోని అసోసియేట్ దేశాలకు ఇచ్చే నిధులను 10 శాతం పెంచనున్నారు. అమెరికా క్రికెట్ బోర్డుపై నిషేధం ఉన్నా... దాని ప్రభావం ఆటగాళ్లపై పడరాదని భావిస్తూ మ్యాచ్ల నిర్వహణకు తగిన చర్యలు తీసుకునేందుకు కూడా ఐసీసీ సిద్ధమైంది. క్రికెట్ భాగంగా ఉన్న 2028 ఒలింపిక్స్ అమెరికాలో జరగనుండటం కూడా దీనికి కారణం.మరోవైపు.. ఐసీసీ మహిళల క్రికెట్ కమిటీలో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj)కు చోటు కల్పించారు. యాష్లీ డిసిల్వా, అమోల్ మజుందార్, చార్లెట్ ఎడ్వర్డ్స్, స్టెల్లా సియాలె ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు. రికార్డు రేటింగ్స్... ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ వీక్షణపరంగా డిజిటల్ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 446 మిలియన్ల మంది వీక్షకులు ఈ టోర్నీని జియో హాట్స్టార్లో చూసినట్లు ప్రసారకర్తలు వెల్లడించారు. ఇది మహిళల క్రికెట్లో అత్యధికమని పేర్కొంది.మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ (IND vs SA) మ్యాచ్ కూడా కొత్త రికార్డు నమోదు చేసింది. ఫైనల్ను 185 మిలియన్ల మంది డిజిటల్ ప్లాట్ఫామ్పై వీక్షించారని... 2024 టీ20 పురుషుల వరల్డ్ కప్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్తో ఇది సమానమని నిర్వాహకులు ప్రకటించడం విశేషం. -
శ్రీ చరణికి భారీ నజరానా..
భారత మహిళా క్రికెటర్, వరల్డ్కప్ విన్నర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కడపకు చెందిన శ్రీచరణికి 2.5 కోట్ల నగదు బహుమతితో పాటు గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అదేవిధంగా తన సొంత ఊరిలో ఇంటి స్ధలాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వనుంది.శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరంకు చేరుకున్న శ్రీ చరణి.. విమానశ్రయం నుంచి ర్యాలీగా వెళ్లి ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసింది. ఆమె వెంట భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉంది. ఈ సందర్భంగా చరణిని చంద్రబాబు అభినందించారు."వరల్డ్కప్ టోర్నీలో వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. జట్టు మొత్తంగా కలిసికట్టుగా రాణించడంతోనే వరల్డ్కప్ కల మాకు సాధ్యమైంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎల్లప్పుడూ నా వెంట ఉంటుంది. అదేవిధంగా మా ఫ్యామిలీ కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ముందు చాలా ఉంది" అని శ్రీచరణి మీడియా సమావేశంలో పేర్కొంది. కాగా భారత్ తొలి వన్డే వరల్డ్కప్ టైటిల్ను సొంతం చేసుకోవడంతో ఈ తెలుగు తేజంది కీలక పాత్ర. -
గన్నవరం చేరుకున్న వరల్డ్కప్ విన్నర్ శ్రీచరణి..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచిన భారత జట్టు సభ్యురాలు, ఆంధ్ర క్రికెటర్ శ్రీచరణి శుక్రవారం ఉదయం గన్నవరంకు చేరుకుంది. గన్నవరం విమానశ్రయంలో ఆమెకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు, మంత్రులు అనిత, సవిత, రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని ఘనస్వాగతం పలికారు.చరణిని అభినందించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎయిర్పోర్ట్ వద్దకు వచ్చారు. శ్రీ చరణి గన్నవరం నుండి ర్యాలీగా ఉండవల్లికి చేరుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, మంత్రి లోకేష్ను చరణి కలవనుంది. ఆ తర్వాత మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను చరణి సందర్శించనుంది.కాగా భారత మహిళల జట్టు తొలి వరల్డ్కప్ను సొంతం చేసుకోవడంలో చరణిది కీలక పాత్ర. టోర్నీ అసాంతం చరణి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి ఫైనల్ మ్యాచ్లోనూ బంతితో మ్యాజిక్ చేసింది. ఈ 50 ఓవర్ల ప్రపంచకప్లో 9 మ్యాచ్లు ఆడిన శ్రీ చరణి 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీసింది. దీప్తీ శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో చరణి నిలిచింది. -
కడప నుంచి వరల్డ్ కప్ దాకా.. శెభాష్ శ్రీచరణి
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఛాంపియన్గా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించినన భారత జట్టు.. తమ 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే ఈ చారిత్రత్మక విజయంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణిది కీలక పాత్ర. టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచి భారత్కు తొలి వన్డే వరల్డ్కప్ను అందించింది. ఈ 50 ఓవర్ల ప్రపంచకప్లో 9 మ్యాచ్లు ఆడిన శ్రీ చరణి 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీసింది. దీప్తీ శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో చరణి నిలిచింది. దీంతో ఈ కడప అమ్మాయిపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.పల్లెటూర్ నుంచి వరల్డ్ ఛాంపియన్గా..ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా క్రీడా రంగంలో పెద్దగా పేరున్న ప్రాంతం కాదు. కానీ ఈ జిల్లాలోని వీరపునాయిని మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన నల్లపురెడ్డి శ్రీ చరణి.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పురుషుల లేదా మహిళల క్రికెట్లో ప్రపంచ కప్లో ఆడిన మొట్టమొదటి క్రీడాకారిణిగా నిలిచింది. కానీ, ఆమె ప్రయాణం అనేక కష్ట నష్టాల మధ్య సాగింది.21 ఏళ్ల ఈ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చిన్నతనంలో ఆమె బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్లో ప్రతిభ చూపింది. అయితే 16 ఏళ్ల వయస్సులో మాత్రమే ఆమె క్రికెట్ను సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి ఆమె మావయ్య కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన కారణం.ఆమె క్రికెట్ను ఎంచుకోకపోవడానికి ప్రధాన అడ్డంకులు ఆర్థిక సమస్యలు, కుటుంబం నుంచి మొదట్లో వచ్చిన వ్యతిరేకత. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. క్రికెట్ జట్టు ఎక్కువగా పురుషుల క్రీడ కావడంతో ఆమె తండ్రి మొదట్లో చరణి నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు.తండ్రిని ఒప్పించడానికి ఆమెకు ఏడాది కాలం పట్టింది. చరణి చెప్పిన ప్రకారం.. ఆమె క్రీడా జీవితాన్ని ప్రారంభించే సమయంలో తన కుటుంబం అప్పులతో బాధపడేది. అయినప్పటికీ ఆ కష్టాలు తన ఆటపై ప్రభావం చూపకుండా ఆమె తల్లిదండ్రులు సహకరించారు.క్రీడా జీవితం ప్రారంభంలో శ్రీ చరణి మొదట ఫాస్ట్ బౌలర్గా శిక్షణ పొందింది. ఫాస్ట్ బౌలింగ్లో వికెట్లు లభించకపోవడంతో స్పిన్ బౌలింగ్ను ప్రయత్నించగా బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్గా మారింది. కడప లాంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడింది. అంతర్జాతీయ క్రికెట్కు ఎంపిక కావడం ఆమె అచంచలమైన పట్టుదలకు, కష్టపడే తత్వానికి నిదర్శనం. ఆర్థిక కష్టాలు ఆమె ఆశయాన్ని ఆపలేకపోయాయి. -
చెల్లి కోసం అన్న త్యాగం.. ఇప్పుడు ఏకంగా వరల్డ్కప్నే
భారత మహిళల జట్టు ప్రపంచాన్ని జయించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన తుది పోరులో 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసిన హర్మన్ సేన.. సరికొత్త వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది. మన అమ్మాయిలు తమ అద్బుత పోరాటంతో విశ్వవేదికపై భారత జెండాను రెపరెపాలడించారు. ఒకే ఒక్క విజయంతో 140 కోట్ల మంది భారతీయులను తలెత్తుకునేలా చేశారు. కాగా ఈ చారిత్రత్మక విజయంలో స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్లో రేణుకా వికెట్లు పడగొట్టనప్పటికి.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. పవర్ ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ ప్రోటీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన రేణుకా.. డెత్ ఓవర్లలోనూ తన పేస్ బౌలింగ్తో సత్తాచాటింది.మొత్తంగా టోర్నీలో రేణుకా మూడు వికెట్లు పడగొట్టింది. అయితే రేణుకా సక్సెస్ వెనక ఆమె తల్లి సునీత కష్టం దాగి ఉంది. రేణుకా చిన్నతనంలోనే తన తండ్రి మరణించినప్పటికి.. తల్లి సునీత అన్ని తానే అయ్యి బిడ్డలను ఈ స్ధాయికి చేర్చింది.తండ్రి కలను నేరవేర్చిన రేణుకా.."మా ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పిల్లల్లో ఎవరో ఒకరిని కబడ్డీ ప్లేయర్గా లేదా క్రికెటర్గా చూడాలని కలలు కన్నారు. కేహర్ సింగ్ ఇప్పుడు మాతో లేనప్పటికీ, మా అమ్మాయి తన కలను నెరవేర్చింది. చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు రావడం లేదు. రేణుకకు చిన్న తనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ.తన స్కూల్డేస్లో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. చెక్క బ్యాట్, వస్త్రాలతో చేసిన బాల్తో రోడ్డుపక్కన ఆడుతుండేది. ఫైనల్ మ్యాచ్కు ముందు ఆమెతో నేను మాట్లాడాను. ఈ రోజు(ఫైనల్లో) నీ కోసం కాదు.. దేశం కోసం ఆడు. ప్రపంచ కప్ గెలుచుకురా అని చెప్పాను. మా అమ్మాయి ఈ రోజు ఈ స్థాయికి చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మాయిలందరూ ఈ విధంగానే ముందుకు సాగాలి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని.. నేను ఆ దేవుణ్ని ప్రార్ధిస్తున్నానని రేణుకా తల్లి సునీత" ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.చెల్లి కోసం అన్న త్యాగం..కాగా రేణుక తండ్రి కెహర్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అండ్ ప్రజా ఆరోగ్య శాఖలో పనిచేసేవారు. అయితే రేణుకకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే కెహర్ సింగ్ ఠాకూర్ మరణించారు. అయితే కెహర్కు కూడా క్రికెట్ అంటే పిచ్చి. అందుకే భారత స్టార్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పేరు వచ్చేలా తన కుమారుడికి వినోద్ ఠాకూర్ అని పేరు కెహర్ పెట్టాడు.అయితే వినోద్ ఠాకూర్ కూడా క్రికెటర్ కావాలని కలలు కానేవాడంట. కానీ తన చెల్లి కోసం వినోద్ తన కలను వదులుకున్నాడు. ఆర్ధిక కష్టాలు ఉండడంతో తనకు బదులుగా రేణుకాను క్రికెట్ ఆకాడమీలో జాయిన్ చేయాలని తల్లిని వినోద్ ఠాకూర్ సూచించాడు. అయితే రేణుకాలో టాలెంట్ను గుర్తించింది మాత్రం ఆమె మామయ్య భూపిందర్ ఠాకూర్.ఆయన రేణుకాకు అన్ని విధాలగా మద్దతుగా నిలిచాడని ఆమె తల్లి సునీత స్పష్టం చేసింది. ధర్మశాల క్రికెట్ అకాడమీలో రేణుకాను భూపిందర్ చేర్చాడు. అక్కడ నుంచే ఆమె క్రికెట్ కెరీర్ ప్రారంభమైంది.చదవండి: Amanjot Kaur: మ్యాచ్ను మలుపు తిప్పిన క్యాచ్..! అమన్ వెనుక కన్నీటి గాథ -
ఫైనల్లో హైయెస్ట్ రన్ ఛేజ్ ఎంతో తెలుసా?
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్ షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87), దీప్తి శర్మ(58 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 58 ) రాణించగా.. స్మృతి మంధాన(58 బంతుల్లో 45), రిచా ఘోష్(24 బంతుల్లో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రయాన్, డిక్లార్క్, మబ్లా తలా వికెట్ సాధించారు. కాగా భారత్ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు వరల్డ్కప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్పై ఆసీస్ 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ ఫైనల్లో ఛేదించిన అత్యధిక లక్ష్యాలపై ఓ లుక్కేద్దాం. మహిళల వన్డే వరల్డకప్ ఫైనల్లో ఛేజ్ చేసిన హైయెస్ట్ టోటల్ 167గా ఉంది. 2009 వరల్డ్కప్లో నార్త్ సిడ్నీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఈ లక్ష్యాన్ని చేధించింది. మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్లో కేవలం నాలుగు మాత్రమే విజయవంతమైన రన్-ఛేజింగ్లు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన పది ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మరి ఇప్పుడు భారత్ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందో లేదా సౌతాఫ్రికా చరిత్రను తిరగరాస్తుందో వేచి చూడాలి.మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్లో అత్యధిక లక్ష్య చేధనలు ఇవే..సంఖ్యపరుగుల ఛేదనజట్టుప్రత్యర్థిఫైనల్ సంవత్సరం1167ఇంగ్లండ్ న్యూజిలాండ్20092165ఆస్ట్రేలియాన్యూజిలాండ్19973152ఆస్ట్రేలియా ఇంగ్లండ్ 19824128ఆస్ట్రేలియా ఇంగ్లండ్1988 -
టీమిండియా కెప్టెన్ వరల్డ్ రికార్డు..
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీవ్ర నిరాశపరిచింది. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన హర్మన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.దీప్తి శర్మతో కలిసి కాసేపు క్రీజులో నిలబడినప్పటికి తన మార్క్ చూపించడంలో మాత్రం విఫలమైంది. 29 బంతుల్లో 20 పరుగులు చేసిన హర్మన్.. సఫారీ స్పిన్నర్ మలాబా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్లో హర్మన్ విఫలమైనప్పటికి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. చరిత్ర సృష్టించిన హర్మన్..మహిళల ప్రపంచ కప్ నాకౌట్లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా హర్మన్ చరిత్ర సృష్టించింది. వరల్డ్కప్లో నాలుగు నాకౌట్ మ్యాచ్లు ఆడిన హర్మన్.. 331 పరుగులు చేసింది.ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ పేరిట ఉండేది. బెలిండా తన కెరీర్లో వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్లలో 330 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో బెలిండా ఆల్టైమ్ రికార్డును హర్మన్ బ్రేక్ చేసింది.చదవండి: World cup 2025: మొన్నటివరకు జట్టులో నో ఛాన్స్! ఇప్పుడు ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ -
మొన్నటివరకు జట్టులో నో ఛాన్స్! ఇప్పుడు ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్
నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. సెమీస్లో విఫలమైన షఫాలీ.. తుది పోరులో మాత్రం తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తనదైన షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. స్మృతి మంధానతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. మంధానతో కలిసి తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన షఫాలీ వర్మ.. ఆ తర్వాత రోడ్రిగ్స్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది.ఓ దశలో సునాయసంగా సెంచరీ చేసేలా కన్పించిన ఈ విధ్వంసకర ఓపెనర్, భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయింది. మొత్తంగా 78 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87 పరుగులు చేసింది. కాగా వాస్తవానికి వరల్డ్ కప్ జట్టులో షఫాలీ వర్మకు చోటు లేదు.స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో.. షఫాలీకి సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. తనకు లభించిన అవకాశాన్ని ఈ హర్యానా క్రికెటర్ అందిపుచ్చుకుంది. ఈ మెరుపు ఇన్నింగ్స్తో షఫాలీ వర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ప్రపంచ కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్గా షఫాలీ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ప్లేయర్ పూనమ్ రౌత్ పేరిట ఉండేది. 2017 ప్రపంచకప్ ఫైనల్లో పూనమ్ 86 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో పూనమ్ ఆల్టైమ్ రికార్డును వర్మ బ్రేక్చేసింది.చదవండి: IND vs AUS: అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! ఒంటి చేత్తో గెలిపించాడుA shot that leaves you going 😯😳🤯We’re witnessing vintage #ShafaliVerma, delivering on the grandest stage, just when it matters the most! 👏🏻👍🏻#CWC25 Final 👉 #INDvSA, LIVE NOW 👉 https://t.co/gGh9yFhTix pic.twitter.com/1mwc8WsLH9— Star Sports (@StarSportsIndia) November 2, 2025 -
సెమీస్లో గెలిస్తే సంబరమే..! కానీ ఫైనల్లో ఆ తప్పులు చేశారంటే?
భారత మహిళల జట్టు.. తమ 47 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్లో ఆదివారం సౌతాఫ్రికాతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈసారి మనం మహిళల క్రికెట్లో సరికొత్త వరల్డ్ ఛాంపియన్ చూడబోతున్నాము. ఎందుకంటే, భారత్ కానీ, దక్షిణాఫ్రికా కానీ ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఒక్కసారి కూడా గెలవలేదు. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి సౌతాఫ్రికా ఫైనల్కు చేరగా.. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి టీమిండియా ముచ్చటగా మూడోసారి తుది పోరుకు అర్హత సాధించింది. అయితే సెమీస్లో భారత అమ్మాయిల జట్టు రికార్డు విజయం సాధించినప్పటికి.. ఫైనల్కు ముందు సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయి.ఫీల్డింగ్ మారుతుందా?ఈ మెగా టోర్నీలో టీమిండియా బ్యాటింగ్ పరంగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికి.. ఫీల్డింగ్, బౌలింగ్లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తోంది. భారత జట్టు ఫీల్డింగ్ మ్యాచ్కు మ్యాచ్కు దిగజారుతోంది. ఈ టోర్నమెంట్లో భారత్ ఇప్పటివరకు 18 క్యాచ్లు జారవిడిచింది. అత్యధిక క్యాచ్లు విడిచిపెట్టిన జాబితాలో హర్మన్ సేన అగ్రస్దానంలో నిలిచింది.ఆసీస్తో సెమీస్లో హర్మన్ ప్రీత్ కౌర్ సైతం సునాయస క్యాచ్ను జారవిడించింది. మిస్ఫీల్డ్స్, ఓవర్ త్రోల రూపంలో మన అమ్మాయిల జట్టు భారీగా పరుగులు సమర్పించుకుంటుంది. ఈ ఈవెంట్లో ఇప్పుటివరకు భారత్ మొత్తం 74 మిస్ఫీల్డ్స్ (అన్ని జట్లలో అత్యధికం) చేశారు. 6 ఓవర్త్రోలు కూడా ఉన్నాయి. సెమీస్లో మిస్ఫీల్డ్స్, ఓవర్ త్రోల ద్వారానే భారత్ 22 అదనపు పరుగులు ఇచ్చింది. కనీసం ఫైనల్ మ్యాచ్లో భారత్ మెరుగైన ఫీల్డింగ్ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.డెత్ బౌలింగ్ కష్టాలు..బౌలింగ్ విభాగంలో కూడా భారత్ చాలా బలహీనంగా కన్పిస్తోంది. ఆసీస్తో జరిగిన సెమీఫైనల్లో ఒక్క శ్రీ చరణి మినహా మిగితా బౌలర్లంతా తేలిపోయారు. ఆఖరికి దీప్తి శర్మ వంటి స్టార్ స్పిన్నర్ సైతం భారీగా పరుగులు సమర్పించుకుంది.రేణుకా సింగ్ వంటి స్టార్ పేసర్ జట్టులో ఉన్నప్పటికి ఆరంభంలో పిచ్ స్వింగ్కు అనుకూలించకపోతే ఆమె ఒక సాధారణ బౌలర్గా మారిపోతుంది. అంతేకాకుండా సెమీఫైనల్లో హర్లీన్ డియోల్ వంటి స్టార్ బ్యాటర్ను పక్కన పెట్టిమరి రాధా యాదవ్ను తీసుకొచ్చారు. కానీ ఆమె కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. క్రాంతి గౌడ్ యువ ఫాస్ట్ బౌలర్ ఆడపదడప ప్రదర్శనలు చేస్తున్నప్పటికి.. ఫైనల్ వంటి హైవోల్టేజ్ మ్యాచ్లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. ఇక భారత జట్టులో డెత్ బౌలింగ్ లేమి స్పష్టంగా కన్పిస్తోంది.భారత జట్టులో డెత్ ఓవర్లలో కట్టడి చేయగలిగే బౌలర్లే లేరు. రేణుకా గానీ, గౌడ్ గానీ డెత్ బౌలర్లు కాదు. దీప్తి శర్మపైనే అతిగా ఆధారపడటం ఒక పెద్ద సమస్యగా మారింది. లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఈ విషయం తేటతెల్లమైంది. 251 పరుగుల లక్ష్య చేధనలో సఫారీలు 81/5 తో కష్టాల్లో ఉన్నప్పటికీ.. భారత్ బౌలర్లు మాత్రం వారిని ఆలౌట్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆ మ్యాచ్లో భారత్ అనుహ్య ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఫైనల్లో అదే సౌతాఫ్రికాపై మన బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి. బౌలింగ్, ఫీల్డింగ్లో భారత్ మెరుగ్గా రాణిస్తే తొలి వరల్డ్కప్ టైటిల్ను సొంతం చేసుకోవడం ఖాయమనే చెప్పాలి. ఇక బ్యాటింగ్లో యువ ఓపెనర్ షెఫాలీ వర్మ బ్యాట్ ఝూళిపించాల్సి ఉంది. రెగ్యూలర్ ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో షెఫాలీకి అవకాశం లభించింది. కానీ ఆసీస్తో జరిగిన సెమీఫైనల్లో ఆమె కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటైంది.అదేవిధంగా లీగ్ దశలో దుమ్ములేపిన స్మృతి మంధాన కీలకమైన ఫైనల్లో తన బ్యాట్కు పనిచెప్పాలి. ఆమె కూడా సెమీస్లో విఫలమైంది. మిడిలార్డర్లో రోడ్రిగ్స్, హర్మన్ వంటి ప్లేయర్లు మరోసారి చెలరేగాల్సిన అవసరముంది.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపం అక్కడ చూపించేస్తున్నాడు -
ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు.. రద్దైతే విజేత ఎవరు..?
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(నవంబర్ 2) నవీ ముంబై వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా-భారత్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ను చిత్తు చేసి ప్రోటీస్ తొలిసారి తుది పోరుకు అర్హత సాధించగా.. రెండో సెమీస్లో ఆసీస్ను ఓడించి భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది.తుది పోరులో ఈ రెండు టీమ్స్లో ఏది గెలిచినా చరిత్రే కానుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గానీ భారత్ ఒక్కసారి కూడా వన్డే వరల్డ్కప్ టైటిల్ను సొంతం చేసుకోలేదు. తొలి టైటిల్ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.అయితే ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఫైనల్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో 30-60 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. ఈ క్రమంలో ఇరు జట్లు అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని చర్చించుకుంటున్నారు.రిజర్వ్ డే..ఈ ఫైనల్ మ్యాచ్కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. ఆదివారం (నవంబర్ 2) నాడు కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే.. రిజర్వ్ డే అయిన సోమవారం(నవంబర్ 3) ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. మరోవైపు ఆదివారం టాస్ పడ్డాక.. వర్షం అటంకం కలిగించి మ్యాచ్ ప్రారంభం కాకపోతే, మళ్లీ తాజాగా రిజర్వ్డే సోమవారం రోజు టాస్ నిర్వహిస్తారు. మ్యాచ్ రద్దు అయితే?కాగా ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎలాగైనా తేల్చేందుకు ఐసీసీ అదనంగా 120నిమిషాలు సమయం కేటాయించింది. ఈ ఎక్స్ట్రా సమయం మ్యాచ్డేతో పాటు రిజర్వ్డేకు కూడా వర్తిస్తోంది. అయితే రిజర్వ్డే రోజు కూడా ఆటసాధ్య పడకపోతే.. రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.దక్షిణాఫ్రికా, భారత్ రెండు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటున్నాయి. కాగా డక్వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను నిర్ణయించాల్సి వస్తే ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల చొప్పున అయిన బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
IND W Vs AUS W: రికార్డ్ చేజింగ్.. వరల్డ్ కప్ ఫైనల్లోకి భారత్ (చిత్రాలు)
-
జెమీమా తుఝే సలామ్
అద్భుతం అనే మాట చాలా చిన్నదిగా అనిపిస్తోంది... ఈ అసాధారణ ప్రదర్శనను వర్ణించాలంటే అది సరిపోదు... ఎదురుగా ఉన్నది ఎదురు లేకుండా సాగుతున్న ప్రత్యర్థి... డిఫెండింగ్ చాంపియన్... ఎలాంటి స్థితిలోనైనా మ్యాచ్ను గెలుచుకునే తత్వం... మన ముందు ఏకంగా 339 పరుగుల లక్ష్యం...మహిళల వన్డే చరిత్రలో ఏ జట్టూ ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు... షఫాలీ విఫలం కాగా, టాప్ బ్యాటర్ స్మృతి ఆరంభంలోనే వెనుదిరిగింది... కానీ జెమీమా, హర్మన్ గట్టిగా నిలబడ్డారు... ఒత్తిడిని దరి చేరనీయకుండా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్లారు... కీలక సమయాల్లో ఆసీస్ మళ్లీ పైచేయి సాధిస్తూ సవాల్ విసురుతోంది... గతంలో ఎన్నో సార్లు ఇలాంటి సందర్భాల్లో కుప్పకూలిన జ్ఞాపకాలు... గెలుపునకు చేరువవుతున్నట్లే కనిపించింది... కానీ ఒక్కో వికెట్ పడుతుండటంతో ఉత్కంఠ... కానీ చివరకు అమన్జోత్ షాట్తో టీమ్లో సంబరాలు... పైకి కఠినంగా కనిపించే కెప్టెన్ కూడా కన్నీళ్లపర్యంతం... అంతటా ఆనందం, ఆనందబాష్పాలు...ఏడేళ్ల వన్డే కెరీర్... తొలి వన్డే ప్రపంచ కప్... టోర్నీకి ముందు చక్కటి ఫామ్... కెరీర్లో రెండు సెంచరీలు ఈ ఏడాదే వచ్చాయి... అయితే వరల్డ్ కప్లో వరుస వైఫల్యాలు... తొలి 3 మ్యాచ్లలో 2 డకౌట్లు... మీడియాతో మాట్లాడినంత సేపు కూడా క్రీజ్లో నిలవడం లేదని వ్యాఖ్యలు... ఆటకంటే పాటలు, డ్యాన్స్లపైనే దృష్టి అనే విమర్శలు... ఒక మ్యాచ్లో ఆడించకుండా పక్కన పెట్టేశారు కూడా... కానీ జెమీమా రోడ్రిగ్స్ తన జీవితంలో అత్యంత విలువైన ఆటను అసలు వేదికపై ఆడింది. తీవ్ర ఒత్తిడి ఉండే నాకౌట్ మ్యాచ్లో రెండో ఓవర్లోనే క్రీజ్లోకి... గతంలో కీలక సమయాల్లో మ్యాచ్ను కోల్పోయిన గుర్తులు... కానీ ఆమె ‘జెమ్’లాంటి ప్రదర్శనతో తన విలువను చూపించింది. శతకాన్ని దాటి అలసటతో బాధపడుతున్నా చివరి వరకు పోరాడింది.. మరచిపోలేని చిరస్మరణీయ ఇన్నింగ్స్తో చరిత్రలో తన పేరు లిఖించుకుంది. నవీ ముంబై: వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. అసాధారణ ప్రదర్శనతో ఆ్రస్టేలియాపై ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు ఆఖరి పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఫోబ్ లిచ్ఫీల్డ్ (93 బంతుల్లో 119; 17 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ సాధించగా...ఎలైస్ పెరీ (88 బంతుల్లో 77; 6 ఫోర్లు, 2 సిక్స్లు), యాష్లీ గార్డ్నర్ (45 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లకు 341 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 127 నాటౌట్; 14 ఫోర్లు) అద్భుత శతకానికి కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 89; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అండగా నిలిచింది. వీరిద్దరు 156 బంతుల్లోనే 167 పరుగులు జోడించారు. భారత్ జోరు... టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన షఫాలీ వర్మ (5 బంతుల్లో 10; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... స్మృతి మంధాన (24 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా హీలీ చక్కటి క్యాచ్కు వెనుదిరిగింది. కానీ ఈ దశలో జత కలిసిన జెమీమా, హర్మన్ అసాధారణ పట్టుదల కనబర్చారు. 57 బంతుల్లో జెమీమా, 65 బంతుల్లో హర్మన్ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. భారీ భాగ స్వామ్యం తర్వాత ఎట్టకేలకు హర్మన్ను అవుట్ చేయడంలో ఆసీస్ సఫలమైంది. అయితే జెమీమా మాత్రం ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. 115 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న ఆమె... దీప్తి శర్మ (17 బంతుల్లో 24; 3 ఫోర్లు), రిచా (16 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు), అమన్జోత్ (8 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో జట్టును విజయం దిశగా నడిపించింది. 339 మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇదే ప్రపంచకప్లో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆ్రస్టేలియా ఛేదించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆసీస్ పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది.‘కప్’ వదిలేసిన హీలీ... జెమీమా అద్భుత ఇన్నింగ్స్కు అదృష్టం కూడా కలిసొచ్చింది. 61 పరుగుల వద్ద ఆమె ఇచి్చన కష్టసాధ్యమైన క్యాచ్ను వదిలేసిన హీలీ, ఆ తర్వాత 82 వద్ద జీవితంలో మర్చిపోలేని తప్పు చేసింది. జెమీమా స్వీప్ చేయగా బంతి అక్కడే గాల్లోకి లేచింది. ఈ అతి సునాయాస క్యాచ్ను హీలీ జారవిడిచింది. 41 బంతుల్లో భారత్ 55 పరుగులు చేయాల్సిన స్థితిలో తాలియా (జెమీమా స్కోరు 106) మరో సునాయాస క్యాచ్ వదిలేసింది. ఈ దశలో జెమీమా అవుటైనా...పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేదేమో! స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (బి) క్రాంతి 5; లిచ్ఫీల్డ్ (బి) అమన్జోత్ 119; పెరీ (బి) రాధ 77; మూనీ (సి) జెమీమా (బి) శ్రీచరణి 24; సదర్లాండ్ (సి అండ్ బి) శ్రీచరణి 3; గార్డ్నర్ (రనౌట్) 63; తాలియా మెక్గ్రాత్ (రనౌట్) 12; కిమ్ గార్త్ (రనౌట్) 17; అలానా కింగ్ (సి) రిచా (బి) దీప్తి 4; మోలినో (బి) దీప్తి 0; షుట్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 338. వికెట్ల పతనం: 1–25, 2–180, 3–220, 4–228, 5–243, 6–265, 7–331, 8–336, 9–336, 10–338. బౌలింగ్: రేణుక 8–0–39–0, క్రాంతి 6–0–58–1, శ్రీచరణి 10–0–49–2, దీప్తి 9.5–0–73–2, అమన్జోత్ 8–0–51–1, రాధ 8–0–66–1. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (ఎల్బీ) (బి) గార్త్ 10; స్మృతి (సి) హీలీ (బి) గార్త్ 24; జెమీమా (నాటౌట్) 127; హర్మన్ (సి) గార్డ్నర్ (బి) సదర్లాండ్ 89; దీప్తి (రనౌట్) 24; రిచా (సి) గార్త్ (బి) సదర్లాండ్ 26; అమన్జోత్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 26; మొత్తం (48.3 ఓవర్లలో 5 వికెట్లకు) 341. వికెట్ల పతనం: 1–13, 2–59, 3–226, 4–264, 5–310. బౌలింగ్: షుట్ 6–0–40–0, గార్త్ 7–0–46–2, గార్డ్నర్ 8–0–55–0, మోలినో 6.3–0–44–0, సదర్లాండ్ 10–0–69–2, అలానా 9–0–58–0, తాలియా 2–0–19–0. -
టీమిండియా కొంపముంచిన చెత్త ఫీల్డింగ్..
మహిళల వన్డే వరల్డ్కప్-2025లో భాగంగా భారత్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఉతికారేశారు.లిచ్ఫీల్డ్ సూపర్ సెంచరీ..తొలుత ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ మెరుపు సెంచరీతో చెలరేగింది. 22 ఏళ్ల లిచ్ఫీల్డ్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించింది. 93 బంతులు ఎదుర్కొన్న లిచ్ఫీల్డ్.. 17 ఫోర్లు, 3 సిక్స్లతో 119 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎల్లీస్ పెర్రీ(88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 77), గార్డెనర్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.బౌలర్లు విఫలం..ఈ కీలక పోరులో భారత బౌలర్లు చెతులేత్తేశారు. స్పిన్నర్ శ్రీచరణి మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీనియర్ ఆల్రౌండర్ దీప్తీ శర్మ బంతితో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 9.5 ఓవర్లు బౌలిగ్ చేసిన దీప్తీ.. రెండు వికెట్లు పడగొట్టినప్పటికి ఏకంగా 73 పరుగులు సమర్పించుకుంది. ఆమెతో పాటు రాధా యాదవ్, అమన్ జ్యోత్ కౌర్ కూడా భారీగా పరుగులిచ్చారు. భారత బౌలింగ్ను కంగారులు ఓ ఆట ఆడుకున్నారు. చరణి మాత్రం తన 10 ఓవర్ల కోటాలో 49 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించింది.చెత్త ఫీల్డింగ్..ఇక ఫీల్డింగ్లో టీమిండియా తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మ్యాచ్లో కూడా ఫీల్డింగ్లో భారత్ తీవ్ర నిరాశపరిచింది. తొలుత హర్మన్ ప్రీత్ విడిచిపెట్టిన క్యాచ్ నుంచి మొదలైన ఫీల్డింగ్ కష్టాలు మ్యాచ్ ఆఖరి వరకు కొనసాగాయి. ఈ మ్యాచ్లో మిస్ ఫీల్డ్స్, బంతిని సరిగ్గా అందుకోకపోవడం, ఓవర్ త్రోస్ వంటి తప్పిదాలను భారత ఫీల్డర్లు చేశారు. అందుకు భారత్ భారీ మూల్యం చెల్సించుకోవాల్సి వచ్చింది. టీమిండియా ప్లేయర్లు సరిగ్గా ఫీల్డింగ్ చేసి ఉంటే ఆసీస్ స్కోర్ 300 పరుగుల మార్క్ను దాటకపోయేది.ఈ టోర్నీలో భారత జట్టు ఫీల్డింగ్ గణాంకాలు పట్టిన క్యాచ్లు- 35 వదిలేసిన క్యాచ్లు-18 క్యాచింగ్ సామర్థ్యం- 66% మిస్ అయిన స్టంపింగ్లు- 3 మిస్ఫీల్డ్లు - 74 ఓవర్త్రోలు అయిన బంతులు- 6 చదవండి: IND vs SA: టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ ఫెయిల్! అయినా భారీ స్కోర్ -
భారత బౌలర్లను ఉతికారేసిన 22 ఏళ్ల ఆసీస్ బ్యాటర్
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా భారత్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. ఈ కీలక పోరులో 22 ఏళ్ల లిచ్ఫీల్డ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. భారత బౌలర్లను ఉతికారేసింది.దీప్తీ శర్మ వంటి స్టార్ స్పిన్నర్ను సైతం లిచ్ఫీల్డ్ విడిచిపెట్టలేదు. రివర్స్ స్వీప్, స్కూప్ షాట్లతో ఈ ఆసీస్ యువ సంచలనం అలరించింది. ఆమె పెర్రీతో కలిసి రెండో వికెట్కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన లిచ్ఫీల్డ్.. కేవలం 77 బంతుల్లోనే తన మూడో వన్డే సెంచరీ మార్క్ను అందుకుంది.ఆమెకు ఇదే తొలి వరల్డ్ కప్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్గా 93 బంతులు ఎదుర్కొన్న లిచ్ఫీల్డ్.. 17 ఫోర్లు, 3 సిక్స్లతో 119 పరుగులు చేసింది. దీంతో మహిళల వన్డే వరల్డ్కప్ నాకౌట్స్లో సెంచరీ చేసిన మూడో ఆసీస్ ప్లేయర్గా లిచ్ఫీల్డ్ నిలిచింది. ఆమె కంటే ముందు హీలీ, కరెన్ రోల్టన్ ఈ ఫీట్ సాధించారు.అదే విధంగా మహిళల వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్గా లిచ్ఫీల్డ్ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు హర్మన్ ప్రీత్ కౌర్ పేరిట ఉండేది. 2017 ప్రపంచకప్ సెమీస్లో ఆసీస్పై హర్మన్ 90 బంతుల్లో సెంచరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కేవలం 77 బంతుల్లోనే శతక్కొట్టిన లిచ్ఫీల్డ్.. హర్మన్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.WHAT A SHOT BY 22 YEAR OLD PHOEBE LITCHFIELD AGAINST DEEPTI SHARMA.🔥- Phoebe Litchfield & Ellyse Perry dominating Indian bowlers Kranti Gaud, Radha, Amanjot Kaur.🥶pic.twitter.com/WpHTXWA0AC— MANU. (@IMManu_18) October 30, 2025 -
జెమీమా వీరోచిత పోరాటం.. ఫైనల్లో భారత్
ఉత్కంఠపోరులో భారత్ గెలుపు..మహిళల వన్డే ప్రపంచకప్-2025 ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. గురువారం నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో 5 వికెట్ల తేడాతో టీమిండియా సంచలన విజయం సాధించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 48.3 ఓవర్లలో చేధించింది. దీంతో ముచ్చటగా మూడో సారి మన అమ్మాయిల జట్టు ప్రపంచకప్ ఫైనల్కు అర్హత సాధించింది. భారత విజయంలో జెమీమా రోడ్రిగ్స్ది కీలక పాత్ర. భారీ లక్ష్య చేధనలో రోడ్రిగ్స్ విరోచిత శతకంతో చెలరేగింది. 134 బంతులు ఎదుర్కొన్న రోడ్రిగ్స్.. 14 ఫోర్ల సాయంతో 127 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్ప్రీత్ కౌర్ (89; 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడింది.ఐదవ వికెట్ డౌన్..రిచా ఘోష్ రూపంలో భారత్ ఐదవ వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన రిచా. క్యాచ్ అవుట్ అయింది. రోడ్రిగ్స్ సెంచరీ..ఆసీస్తో జరుగుతున్న సెమీఫైనల్లో రోడ్రిగ్స్ అద్బుతమైన సెంచరీతో మెరిసింది. 43 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. క్రీజులో రోడ్రిగ్స్(106), రిచా ఘోష్(8) ఉన్నారు. భారత్ విజయానికి 42 బంతుల్లో 55 పరుగులు కావాలి.నాలుగో వికెట్ డౌన్..దీప్తీ శర్మ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన దీప్తీ.. రనౌట్ రూపంలో వెనుదిరిగింది. బారత విజయానికి 54 బంతుల్లో 75 పరుగులు కావాలి. క్రీజులో రోడ్రిగ్స్(96) ఉంది.భారత్ మూడో వికెట్ డౌన్..226 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. సదర్లాండ్ బౌలింగ్లో ఔటైంది. దీంతో 167 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 38 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. భారత విజయానికి 72 బంతుల్లో 98 పరుగులు కావాలి. క్రీజులో రోడ్రిగ్స్(90), దీప్తీ(10) ఉన్నారు.రసవత్తరంగా భారత్-ఆసీస్ సెమీఫైనల్భారత్-ఆస్ట్రేలియా మధ్య సెకెండ్ సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. 339 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా అద్బుతంగా పోరాడుతోంది. 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. రోడ్రిగ్స్, హర్మన్ కలిసి మూడో వికెట్కు 167 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత విజయానికి ఇంకా 113 పరుగులు కావాలి. జేమిమా రోడ్రిగ్స్(85), హర్మన్ ప్రీత్ కౌర్(89) ఉన్నారు.హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీఆసీస్తో జరుగుతున్న సెమీఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్బుత ఇన్నింగ్స్ ఆడుతోంది. 65 బంతుల్లో తన ఆర్ధ శతకాన్ని హర్మన్ పూర్తి చేసుకుంది. 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రోడ్రిగ్స్, హర్మన్ కలిసి మూడో వికెట్కు 130 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత విజయానికి ఇంకా 120 బంతుల్లో 150 పరుగులు కావాలి.రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ..టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు జేమిమా రోడ్రిగ్స్(54), హర్మన్(25) ప్రీత్ కౌర్ నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్ 58 బంతుల్లో తన ఆర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. 21 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల కోల్పోయి 124 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి ఇంకా 215 పరుగులు కావాలి.టీమిండియా రెండో వికెట్ డౌన్..స్మృతి మంధాన రూపంలో టీమిండియా రెండు వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన మంధాన.. కిమ్ గార్త్ బౌలింగ్లో ఔటైంది. 10 ఓవర్లకు భారత్ స్కోర్:66-2, క్రీజులో రోడ్రిగ్స్(24), హర్మన్ప్రీత్ కౌర్(2) ఉన్నారు.టీమిండియాకు భారీ షాక్..339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోని గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ.. గార్త్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయింది. 6 ఓవర్లు ఆసీస్ స్కోర్: 38/1. క్రీజులో మంధాన(14), రోడ్రిగ్స్(8) ఉన్నారు.భారత బౌలర్లు విఫలం.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ముంబై వేదికగా భారత్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఫోబ్ లిచ్ఫీల్డ్(17 ఫోర్లు, 3 సిక్స్లతో 119) శతక్కొట్టగా.. ఎల్లీస్ పెర్రీ(88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 77), గార్డెనర్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో శ్రీచరణి, దీప్తీ శర్మ తలా రెండు వికెట్లు సాధించగా.. రాధా యాదవ్, అమన్జ్యోత్ కౌర్, క్రాంతి గౌడ్ తలా వికెట్ పడగొట్టారు.కమ్బ్యాక్ ఇచ్చిన భారత బౌలర్లు..భారత బౌలర్లు కమ్బ్యాక్ ఇచ్చారు. వరుస క్రమంలో ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత చరణి బౌలింగ్లో సదర్లాండ్(3) ఔట్ కాగా.. ఆ తర్వాత రాధా యాదవ్ బౌలింగ్లో పెర్రీ(77) క్లీన్ బౌల్డ్ అయ్యింది. 41 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 260/5ఆసీస్ మూడో వికెట్ డౌన్..220 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన బెత్ మూనీ.. శ్రీచరణి బౌలింగ్లో ఔటైంది. 35 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 225-3ఆసీస్ రెండో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా ఎట్టకేలకు రెండో వికెట్ కోల్పోయింది. 119 పరుగులు చేసిన లిచ్ఫీల్డ్.. అమన్ జ్యోత్ కౌర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో 155 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 27.2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 180-2లిచ్ఫీల్డ్ సెంచరీ..భారత్తో జరుగుతున్న సెమీఫైనల్లో ఆసీస్ యువ సంచలనం లిచ్ఫీల్డ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. కేవలం77 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను ఆమె అందుకుంది. 24 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో లిచ్ఫీల్డ్తో పాటు పెర్రీ(40) ఉన్నారు.18 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోరు: 115-1పెర్రీ 36, లిచ్ఫీల్డ్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.10 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 72/110 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజులో లిచ్ఫీల్డ్(46), పెర్రీ(18) ఉన్నారు.ఆసీస్ తొలి వికెట్ డౌన్..25 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కెప్టెన్ అలీసా హీలీ.. క్రాంతి గౌడ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. అయితే ఆమె ఔటైన వెంటనే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆటను అంపైర్లు నిలిపివేశారు.దూకుడుగా ఆడుతున్న ఆసీస్..టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో లిచ్ఫీల్డ్(17), హీలీ(4) ఉన్నారు. రేణుకా బౌలింగ్లో హీలీ ఇచ్చిన సునాయస క్యాచ్ను కెప్టెన్ హర్మన్ జారవిడిచింది.ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 సెకెండ్ సెమీఫైనల్లో భాగంగా గురువారం నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ అలీస్సా హీలీ తిరిగి జట్టులోకి వచ్చింది.భారత్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. అదేవిధంగా భారత్ కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్లో రెండు మార్పులు చేసింది. రిచా ఘోష్, షఫాలీ వర్మ తుదిజట్టులోకి వచ్చారు. స్టార్ బ్యాటర్ హర్లీన్ డియోల్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.తుదిజట్లు భారత్షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమన్జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.ఆస్ట్రేలియాఫోబ్ లిచ్ఫీల్డ్, అలిసా హేలీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డ్నర్, తహ్లియా మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగన్ షట్. -
దక్షిణాఫ్రికా ధమాకా
గువాహటి: ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు అనుకున్నది సాధించింది. వన్డే ప్రపంచకప్లో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నాలుగుసార్లు చాంపియన్ ఇంగ్లండ్ జట్టుతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 125 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాట్తో కెపె్టన్ లారా వోల్వార్ట్ (143 బంతుల్లో 169; 20 ఫోర్లు, 4 సిక్స్లు)... బంతితో మరిజాన్ కాప్ (5/20) అదరగొట్టి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. మొదట దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 319 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వోల్వర్ట్ అసాధారణ ఆటతీరుతో ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టింది. బ్రిట్స్ (65 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), మరిజాన్ కాప్ (42; 4 ఫోర్లు, 1 సిక్స్), ట్రియాన్ (33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బౌలర్ల ధాటికి స్కోరు బోర్డుపై ఒక పరుగుకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆ తర్వాత కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ నటాలియా సివర్ బ్రంట్ (76 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్), అలీస్ కాప్సీ (71 బంతుల్లో 50; 6 ఫోర్లు) పోరాడారు. అమీ జోన్స్ (0), బ్యూమౌంట్ (0), హీథర్ నైట్ (0) డకౌట్ కావడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. డంక్లీ (2), చార్లీ డీన్ (0) కూడా విఫలమయ్యారు. నేడు భారత్, ఆ్రస్టేలియా మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికా తలపడనుంది. -
కంగారు పడతారా? కంగారు పెట్టిస్తారా?
మహిళల వన్డే ప్రపంచకప్-2025లో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా గురువారం ముంబై వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి మూడో సారి ఫైనల్లో అడుగుపెట్టాలని హర్మన్ సేన భావిస్తోంది. 2017 ప్రపంచకప్ సెమీఫైనల్ నాటి ఫలితాన్నే రిపీట్ చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.మరోవైపు ఆసీస్ అమ్మాయిలు మాత్రం రికార్డు స్దాయిలో పదో సారి ఫైనల్కు చేరాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలబలాలపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీలో ఈ రెండు జట్లు ఇప్పటికే లీగ్ దశలో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా నిర్దేశించిన 330 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించి ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత్ బ్యాటింగ్లో సత్తాచాటినప్పటికి బౌలింగ్లో మాత్రం తేలిపోయింది.భారత్కు బిగ్ షాక్.. ఆసీస్కు జోష్సెమీఫైనల్కు ముందు భారత్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అద్బుతమైన ఫామ్లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ ప్రతికా రావల్ గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగింది. దీంతో ఆమె స్దానంలో విధ్వంసకర బ్యాటర్ షెఫాలీ వర్మ తిరిగి జట్టులోకి వచ్చింది. ఛాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన షెఫాలీ ఎలా రాణిస్తుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు గాయం కారణంగా గత రెండు మ్యాచ్లకు దూరమైన ఆసీస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ అలీసా హీలీ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించింది. దీంతో భారత్తో జరగనున్న సెమీఫైనల్లో ఆమె ఆడడం దాదాపు ఖాయమైంది. హీలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. లీగ్ దశలో భారత్తో జరిగిన మ్యాచ్లో ఆమె భారీ శతకం(142)తో చెలరేగింది.బలంగా ఆసీస్ బ్యాటింగ్ లైనప్భారత్తో పోలిస్తే ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కన్పిస్తోంది. టాప్ ఆర్డర్ విఫలమైనా.. మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్లో పరుగులు సాధించే సత్తా ఉన్న ప్లేయర్లు ఆసీస్ జట్టులో ఉన్నారు. అలీసా హీలీ, బెత్ మూనీ, మెక్గ్రాత్, గార్డెనర్, పెర్రీ వంటి స్టార్ ప్లేయర్లు చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా కంగారులు బలంగా ఉన్నారు. మెగాన్ షూట్, అలానా కింగ్, గార్డెనర్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లు ఆసీస్ వద్ద ఉన్నారు.స్మృతి చెలరేగుతుందా?ఇక ఆసీస్తో సెమీఫైనల్ నేపథ్యంలో అందరి కళ్లు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానపైనే ఉన్నాయి. అద్బుతమైన ఫామ్లో ఉన్న మంధాన కీలకమైన సెమీస్లో ఎలా రాణిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టోర్నీ ఆరంభంలో తడబడిన మంధాన.. ఆ తర్వాత మాత్రం సూపర్ కమ్బ్యాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన మంధాన, 60.8 సగటుతో 365 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, రెండు ఆర్ధ శతకాలు ఉన్నాయి. ఆసీస్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 80 పరుగులతో సత్తాచాటింది. ఇప్పుడు నాకౌట్ మ్యాచ్లో కూడా అదే జోరును కొనసాగించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. కానీ మంధానకు ఆసీస్ స్టార్ పేసర్ మెగాన్ షూట్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. కొత్త బంతితో బౌలింగ్ చేసే షూట్.. మంధానాను ఇప్పటివరకు వన్డేల్లో 4 సార్లు అవుట్ చేసింది. మంధానతో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ బ్యాట్ ఝుళిపిస్తే భారత్కు తిరిగుండదు. మిడిలార్డర్లో రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్, రిచా ఘోష్లు తమ బ్యాట్కు పనిచెప్పాల్సిందే. అప్పుడే ఆసీస్ వంటి పటిష్టమైన జట్టును మన అమ్మాయిలు ఆపగలరు. బౌలింగ్లో భారత్కు రేణుకా సింగ్, దీప్తీ శర్మ, రాధా యాదవ్ కీలకం కానున్నారు. ఆసీపై స్పిన్నర్ రాధా యాదవ్కు మంచి రికార్డు ఉంది.ఆసీస్దే పైచేయి..భారత్-ఆస్ట్రేలియా ఇప్పటివరకు మూడు సార్లు వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలో తలపడ్డాయి. ఆసీస్ రెండింట విజయం సాధించగా.. భారత్ ఒక్క మ్యాచ్లో గెలుపొందింది. 2017 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మహిళలపై భారత్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 171 పరుగుల చారిత్రత్మక ఇన్నింగ్స్ ఆడింది.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు -
భారీ సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గౌహతి వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది.ఓపెనర్గా బరిలోకి దిగిన వోల్వార్డ్ ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేసింది. ఆమె కేవలం 115 బంతుల్లోనే తన పదివ వన్డే సెంచరీ మార్క్ను అందుకుంది. సెంచరీ పూర్తియ్యాక లారా మరింత చెలరేగిపోయింది. 47వ ఓవర్ వేసిన స్మిత్ బౌలింగ్లో వోల్వార్డ్ ఏకంగా 20 పరుగులు పిండుకుంది. మొత్తంగా 143 బంతులు ఎదుర్కొన్న లారా వోల్వార్డ్.. 20 ఫోర్లు, 4 సిక్స్లతో 169 పరుగులు చేసింది. ఆమెతో పాటు టాజ్మిన్ బ్రిట్స్(45), కాప్(42), ట్రయాన్(33) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సోఫీ ఎక్లెస్టోన్ 4 వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్ రెండు, నాట్ స్కీవర్ ఒక్క వికెట్ సాధించారు. రెండో జట్టుగా రికార్డు..కాగా వన్డే వరల్డ్కప్ చరిత్రలో సౌతాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇంతకుముందు ప్రస్తుత వరల్డ్కప్లోనే పాకిస్తాన్పై 312 పరుగులు ప్రోటీస్ సాధించింది.అదేవిధంగా వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్లలో రెండో అత్యధిక టోటల్ నెలకొల్పిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ఈ జాబితాలో ఆసీస్ అగ్రస్ధానంలో ఉంది. 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్పై ఆసీస్ ఏకంగా 356 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు -
ఆస్ట్రేలియా క్రికెటర్లకు సారీ చెప్పిన బీసీసీఐ..
వన్డే వరల్డ్కప్లో ఆడేందుకు వచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ ఆకతాయి వేధింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సభ్యులు ఇద్దరూ గురువారం రాత్రి హోటల్కు తిరిగి వస్తుండగా.. ఇండోర్లోని ఖజ్రానా రోడ్ వద్ద ఓ వ్యక్తి వారి వెంటపడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే సదరు క్రికెటర్లు జట్టు మేనేజర్కు సమాచారం అందించారు. అతడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీలుసు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఖజ్రానాకు చెందిన 30 ఏళ్ల అకీల్ను నిందుతుడిగా గుర్తించారు. ప్రస్తుతం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇంతకుముందు కూడా అతడిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. "ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. భారత్ అతిథిలను గౌరవించే దేశంగా పేరుగాంచినది. ఇటువంటి ఘటనలు దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఎవరిపట్ల కూడా ఇలా ప్రవర్తించకూడదు. ఆసీస్ క్రికెటర్లకు ఇలా జరిగినందుకు మేము చింతిస్తున్నాము. నిందితుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నందుకు సంతోషిస్తున్నాము.ఈ వన్డే ప్రపంచ కప్లో ఆడేందుకు వచ్చిన అన్ని జట్లకు ఇప్పటికే పూర్తి స్ధాయి భద్రతను కల్పించాము. ఇకపై సెక్యూరిటీ మరింత పెంచుతాము. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము." అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) పీటీఐతో పేర్కొన్నారు. కాగా అక్టోబర్ 30న జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.చదవండి: భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా -
ఆస్ట్రేలియా క్రికెటర్ వరల్డ్ రికార్డు.. ఒకే మ్యాచ్లో 7 వికెట్లు
మహిళల ప్రపంచకప్-2025లో సంచలనం నమోదైంది. ఇండోర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ అలానా కింగ్ 7 వికెట్లతో చెలరేగింది. ఆమె స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ప్రోటీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా అమ్మాయిల జట్టు.. కింగ్ బౌలింగ్ ధాటికి 16.5 ఓవర్లలో కేవలం 97 పరుగులకే కుప్పకూలింది. మొత్తంగా 7 ఓవర్లు బౌలింగ్ చేసిన కింగ్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో కింగ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.కింగ్ ప్రపంచ రికార్డు..👉మహిళల ప్రపంచ కప్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్గా కింగ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు జాకీ లార్డ్ పేరిట ఉండేది. 1982 ప్రపంచకప్లో లార్డ్ భారత్పై 10 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. తాజా మ్యాచ్తో 33 ఏళ్ల ఆల్టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేసింది.మహిళల వరల్డ్ కప్లో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్7/18 – అలానా కింగ్ (Alana King) vs సౌతాఫ్రికా, 20256/10 – జాకీ లార్డ్ (Jackie Lord) vs ఇండియా, 19826/20 – గ్లెనిస్ పేజ్ (Glenys Page) vs ట్రినిడాడ్ & టొబాగో, 19736/36 – సోఫీ ఎక్ల్స్టోన్ (Sophie Ecclestone) vs సౌతాఫ్రికా, 20226/46 – అన్యా ష్రబ్సోల్ (Anya Shrubsole) vs ఇండియా, 2017👉అదేవిధంగా మహిళల వన్డే క్రికెట్లో అత్యంతవేగంగా ఫైవ్ వికెట్ హాల్(బంతుల పరంగా) సాధించిన బౌలర్గా కింగ్ నిలిచింది. కింగ్ కేవలం 21 బంతుల్లోనే ఈ ఫీట్ను అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 98 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ అమ్మాయిల జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.చదవండి: #ViratKohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో హర్మన్ సేన ఆల్రౌండ్షోతో అదరగొట్టింది.వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిల జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(109), ప్రతికా రావల్(122) అద్భుతమైన సెంచరీలతో సత్తాచాటగా.. జెమీమా రోడ్రిగ్స్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్ణయించారు. కానీ న్యూజిలాండ్ లక్ష్య చేధనలో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఈ ఓటమితో కివీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్లో అదరగొట్టిన భారత మహిళల జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఆసీస్ రికార్డు బ్రేక్..మహిళల వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్పై అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లోనే ఇండోర్ వేదికగా కివీస్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 326 పరుగులు చేసింది. తాజా మ్యాచ్లో 340 రన్స్ చేసిన టీమిండియా.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది.చదవండి: రోహిత్ నీకు ఇది ఫేర్వెల్ మ్యాచా? ఒక్క ఫోటో అయినా పెట్టు: గంభీర్ -
4 బంతుల్లో 4 వికెట్లు.. ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ ఓటమి
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ముంబై వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై 7 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. 203 పరుగుల లక్ష్య చేధనలో అద్భుతంగా పోరాడిన బంగ్లా బ్యాటర్లు.. ఆఖరిలో చేతులుత్తేయడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.బంగ్లా విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్ వేసే బాధ్యతను శ్రీలంక కెప్టెన్ చమిరి అతపట్టు తీసుకుంది. చివరి ఓవర్లో అతపట్టు అద్భుతం చేసింది. తొలి బంతికే రబేయా ఖాన్ ఎల్బీగా ఔటయ్యింది. రెండో బంతికి నిహిదా అక్తర్ రనౌట్. మూడో బంతికి సుల్తానా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.మళ్లీ నాలుగో బంతికి మరుఫా అక్తర్ ఎల్బీగా వెనుదిరిగింది. లంక కెప్టెన్ దెబ్బకు బంగ్లా జట్టు వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. ఆఖరి రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చేంది. దీంతో బంగ్లా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది.బంగ్లా బ్యాటర్లలో షర్మిన్ అక్తర్(64),నిగర్ సుల్తానా(77) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరూ ఔటైన తర్వాత మ్యాచ్ శ్రీలంక వైపు మలుపు తిరిగింది. లంక బౌలర్లలో చమిరి ఆతపట్టు నాలుగు వికెట్లు పడగొట్టగా.. కుమారి రెండు, ప్రభోధిని ఓ వికెట్ సాధించారు.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో హాసిని పెరీరా(85) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆతపట్టు(46),నీలాక్షి డిసిల్వా(37) రాణించారు. బంగ్లా బౌలర్లలో షోరినా అక్తర్ మూడు, రబియా ఖాన్ రెండు వికెట్లు పడగొట్టారు.ఈ ఓటమితో బంగ్లా జట్టు సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే.చదవండి: రిజ్వాన్పై వేటు.. పాకిస్తాన్కు కొత్త కెప్టెన్! ఎవరంటే? -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైనప్పటికి... కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హర్మన్.. మరో సీనియర్ ప్లేయర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. మొత్తంగా 70 బంతులు ఎదుర్కొన్న కౌర్.. 10 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. మంధానతో కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు బాట వేసింది. కానీ తర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేయండంతో భారత్ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.హర్మన్ సాధించిన రికార్డులు ఇవే..👉మహిళల ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్గా ఆమె నిలిచింది. ఆమె కెరీర్లో ఇది ఐదవ ప్రపంచకప్. ఇప్పటివరకు హర్మన్ 31 మ్యాచ్లలో 1017 పరుగులు సాధించింది. ఇందులో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫీట్ హర్మన్ కంటే మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సాధించింది. ఓవరాల్గా ఈ జాబితాలో హర్మన్ ఏడో స్దానంలో ఉంది.👉అదేవిధంగా మహిళల వన్డే వరల్డ్కప్లో నెంబర్ 4 లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి 1000 పరుగుల మైలురాయిని చేరిన తొలి ప్లేయర్గా ప్రపంచరికార్డు హర్మన్ నెలకొల్పింది.👉మహిళల వన్డేల్లో నాలుగో స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో (4289) అత్యధిక పరుగులు చేసిన జాబితాలో హర్మన్ప్రీత్ అగ్రస్థానంలో ఉంది. నాట్ స్కైవర్ 4205 పరుగులతో రెండవ స్థానంలో ఉంది.చదవండి: మా ఓటమికి కారణమదే.. చాలా బాధగా ఉంది: టీమిండియా కెప్టెన్ -
మా ఓటమికి కారణమదే.. చాలా బాధగా ఉంది: టీమిండియా కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 289 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చివరి ఓవర్లలో తడబడిన భారత జట్టు.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకుంది.ఇది భారత్కు వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్లను గెలిస్తేనే మన అమ్మాయిల జట్టు నేరుగా సెమీఫైనల్స్కు ఆర్హత సాధించనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్పందించింది. స్మృతి మంధాన వికెట్తో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు టర్న్ అయిందని హర్మన్ చెప్పుకొచ్చింది."గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. స్మృతీ మంధాన వికెట్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు మేము గేమ్లో ఉన్నాము. ఈజీగా గెలుస్తామనుకున్నాము. మంధాన వికెట్ పడిన తర్వాతే మేము పట్టు కోల్పోయాము. కానీ ఇంగ్లండ్ బౌలర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి.వారు ఆఖరి వరకు అద్భుతంగా బౌలింగ్ చేసి మాపై ఒత్తడి పెంచారు. వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నారు. ఈ మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. ప్రతీది మేము అనుకున్నట్లు సాగింది. కానీ చివరి ఐదు-ఆరు ఓవర్లలో విఫలమయ్యాము. నిజంగా మాకు ఇది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. గత కొంతకాలంగా మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగిస్తున్నాము. కానీ దురదృష్టవశాత్తూ ఓడిపోతున్నాము. మాకు తదుపరి మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి విజయం సాధిస్తాము అని ఆశిస్తున్నాను.ఈ మ్యాచ్లో బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు. నాట్ స్కీవర్, హీథర్ క్రీజులో ఉన్నప్పుడు ఇంగ్లండ్ భారీ స్కోర్ చేస్తుందని భావించాము. కానీ మా బౌలర్లు కమ్బ్యాక్ ఇచ్చి వారిని 300 పరుగులలోపు కట్టడి చేశారు. కానీ బౌలింగ్లో కూడా చివరి ఐదు ఓవర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నాము. మేము ఈ విషయంపై డ్రెస్సింగ్ రూమ్లో చర్చించుకుంటున్నాము. ఈ మ్యాచ్లో అదనపు బౌలర్తో ఆడాలనుకున్నాము. అందుకే జెమిమా స్దానంలో రేణుకాను ఆడించాలనుకున్నాము. స్మతి, నేనూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాము. ఆ తర్వాత రిచా, అమన్ జోత్, దీప్తి లాంటి ప్లేయరర్లు ఉండడంతో ఈజీగా గెలుస్తామనుకున్నాము. ఏదేమైనప్పటికి ఈరోజు అదృష్టం మా వైపు లేదు. తర్వాత మ్యాచ్లో తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం ఉంది అని హర్మన్ పేర్కొంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
పాకిస్తాన్కు ఊహించని షాక్.. గెలిచే మ్యాచ్లో కూడా!
మహిళల వన్డే వరల్డ్ కప్లో కొలంబో వేదికగా ముచ్చటగా మూడో మ్యాచ్ వాన బారిన పడింది. బుధవారం పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. వాన కారణంగా మ్యాచ్ను ముందుగానే 31 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 31 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. చార్లీ డీన్ (33) టాప్ స్కోరర్గా నిలవగా, మిగతావారంతా విఫలమయ్యారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా (4/27) ప్రత్యరి్థని దెబ్బ కొట్టగా, సాదియా ఇక్బాల్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి పాక్ 6.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఈ దశలో వచ్యిన వాన ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేయక తప్పలేదు. సునయాసంగా గెలిచే మ్యాచ్లో పాక్ను వరుణుడు దెబ్బకొట్టాడు.ఈ ఫలితం తర్వాత ప్రతీ జట్టు సరిగ్గా నాలుగేసి మ్యాచ్లు ఆడగా...ఇంగ్లండ్ (7 పాయింట్లు), ఆ్రస్టేలియా (7), దక్షిణాఫ్రికా (6), భారత్ (4) జట్లు తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో నేడు జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఆ్రస్టేలియా తలపడుతుంది. -
భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా?
వారిద్దరూ వరల్డ్ క్రికెట్లో పవర్ ఫుల్ జోడీ. ఒకరేమో తన యార్కర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపించే ఫాస్ట్ బౌలర్.. మరొకరు తన బ్యాటింగ్తో బౌలర్లకు చెమటలు పట్టించే డేంజరస్ ప్లేయర్. ముఖ్యంగా ఈ జంటకు ప్రత్యర్ధి భారత్ అయితే చాలు పూనకాలు వచ్చేస్తాయి. అతడు రెండేళ్ల కిందట తన బౌలింగ్తో వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియాకు గుండె కోత మిగల్చగా.. ఇప్పుడు అతడి భార్య మెరుపు బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించింది. ఈపాటికే ఆ స్టార్ జంట ఎవరన్నది మీకు ఆర్ధమై ఉంటుంది. వారిద్దరూ ఎవరో కాదు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు మిచెల్ స్టార్క్, అతడి భార్య అలీసా హీలీ. ఆసీస్ మెన్స్ టీమ్లో స్టార్క్ కీలక సభ్యునిగా కొనసాగుతుంటే.. మహిళల జట్టు కెప్టెన్గా హీలీ వ్యవహరిస్తోంది.హీలీ సూపర్ సెంచరీ..మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో హీలీ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు దారుణ ప్రదర్శన కనబరిచిన అలిస్సా .. భారత్పై మాత్రం విశ్వరూపాన్ని చూపించింది. 331 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించింది. కేవలం 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్లతో 142 పరుగులు చేసి మ్యాచ్ను భారత్ నుంచి లాగేసుకుంది. ఆమె ఇన్నింగ్స్కు భారత అభిమానులు సైతం ఫిదా అయిపోయారు. ఆమె విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆసీస్ లక్ష్యాన్ని 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ వరల్డ్కప్లో ఆసీస్కు ఇది వరుసగా మూడో విజయం. అంతేకాకుండా మహిళల వన్డేలో అత్యధిక పరుగులు చేధించిన జట్టుగా కంగారులు నిలిచారు.కెప్టెన్గా అదుర్స్..ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా 2023లో హీలీ నియమించబడింది. అయితే అంతకుముందు చాలా మ్యాచ్లలో తాత్కాలిక కెప్టెన్గా ఆమె వ్యవహరించింది. మాగ్ లానింగ్ రిటైర్మెంట్ తర్వాత ఫుల్ టైమ్ కెప్టెన్గా హీలీ బాధ్యతలు స్వీకరించింది. ఆమె కెప్టెన్సీలో 55 మ్యాచ్లు ఆడిన ఆసీస్..42 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్లో టైటిల్ ఫేవరేట్గా ఆసీస్ బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.ప్రేమించి పెళ్లాడి..మిచెల్ స్టార్క్, హీలీది ప్రేమ వివాహం. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత వీరు 2016లో పెళ్లి చేసుకున్నారు. సిడ్నీకి చెందిన వీరిద్దరికి 9 ఏళ్ల వయస్సు నుంచే పరిచయం ఉంది. వారిద్దరూ అండర్-10 క్రికెట్ టోర్నీల్లో ఒకే జట్టు ప్రాతినిథ్యం వహించేవారు. 15 ఏళ్ల వరకు ఒకే టీంకు ఆడిన వీరు అనంతరం విడిపోయారు. పురుషుల జట్టుకు ఆడేందుకు స్టార్క్ వెళ్లగా... మహిళల జట్టుకు ఆడేందుకు హేలీ సిద్ధమైంది. 2013లో స్టార్క్ హేలీపై తన ప్రేమను బయటపెట్టాడు. అందుకు హీలీ కూడా ఓకే చెప్పడంతో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. -
ఒకే ఒక తప్పు.. అదే మా కొంపముంచింది: టీమిండియా కెప్టెన్
మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్పై మూడు వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. 331 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు.ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ అలీసా హీలీ(142) అద్భుత శతకంతో మెరిసింది. భారత బౌలర్లలో శ్రీచరణి మూడు, దీప్తి శర్మ, అమన్ జ్యోత్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 80) ప్రతికా రావల్(96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 75) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆసీస్ బౌలర్ సదర్లాండ్ 5 వికెట్లతో సత్తాచాటింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించింది. తొలుత బ్యాటింగ్లో అదనంగా కొన్ని పరుగులు సాధించి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది అని ఆమె చెప్పుకొచ్చింది."ఈ మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణించాము. కానీ ఆఖరిలో మా రిథమ్ను కోల్పోయాము. అదనంగా మరో 30–40 పరుగులు చేసింటే మేమే విజయం సాధించేవాళ్లం. చివరి 6–7 ఓవర్లలో వికెట్లు వరుసగా కోల్పోవడం వల్ల మేము అనుకున్న టార్గెట్ను సెట్ చేయలేకపోయాము.ఓపెనర్లు మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికి మేము సరిగా ఉపయోగించుకోలేకపోయాం. గత మూడు మ్యాచ్ల్లో మేం మిడిల్ ఓవర్లలో సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. కానీ లోయరార్డర్ బాధ్యత తీసుకొని జట్టును గట్టెక్కించింది.కానీ ఈ రోజు మాత్రం 40 ఓవర్ల వరకు మా బ్యాటింగ్ బాగుంది. చివరి ఓవర్లలో మేము మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాము. ఆటలో ఇలాంటివి సహజంగా జరగుతూనే ఉంటాయి. ప్రతి మ్యాచ్లో 100 శాతం రాణించడం సాధ్యం కాదు. కానీ తిరిగి ఎలా పుంజుకున్నామన్నది ముఖ్యం. తదుపరి రెండు మ్యాచ్లు మాకు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్లో మేము ఓటమిపాలైనప్పటికి మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి. చరణి ప్రదర్శనపై మాట్లాడుతూ.. ఆమె నిజంగా అద్భుతం. జట్టుకి అవసరమైనప్పుడు ప్రతీసారి చరణి ముందుంటుంది. హీలీ లాంటి బ్యాటర్కి కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగింది. ఆమెపై మాకు చాలా నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితులలోనైనా మాకు వికెట్ అందించగలదు. మా జట్టు కాంబనేషన్ గురించి ఎటువంటి చర్చ అవసరం లేదు. ఎందుకంటే ఈ కాంబినేషన్తోనే మేం విజయాలు సాధించాం. ఒకట్రెండు ఓటములతో ఈ కాంబినేషన్ సరి కాదని నేను అనుకోవడం లేదు. మా తదుపరి మ్యాచ్లపై దృష్టిపెడతాము అని హర్మన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొంది.చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
మహిళల ప్రపంచకప్-2025లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఆదివారం వైజాగ్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 331 పరుగుల భారీ లక్ష్య చేధనలో కంగారుల కెప్టెన్ అలీసా హీలీ అద్భుత సెంచరీతో చెలరేగింది.107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 142 పరుగులు చేసిన హీలీ.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఫలితంగా భారీ టార్గెట్ను ఆసీస్ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. హీలీతో పాటు లీచ్ ఫీల్డ్(40), పెర్రీ(47), గార్డనర్(45) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.భారత బౌలర్లు ఆఖరిలో పోరాడినప్పటికి జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.ఆసీస్ వరల్డ్ రికార్డు..ఈ విజయంతో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. శ్రీలంక జట్టులో 2024లో దక్షిణాఫ్రికాపై 302 పరుగుల టార్గెట్ను ఛేజ్ చేసింది. ఈ మ్యాచ్లో లంక కెప్టెన్ చమారి అటపత్తు (195* పరుగులు) భారీ శతకంతో మెరిసింది. అయితే తాజా మ్యాచ్తో లంక ఆల్టైమ్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది.మహిళల వన్డే క్రికెట్లో హైయిస్ట్ ఛేజింగ్లు ఇవే..1.ఆస్ట్రేలియా-భారత్(ప్రత్యర్ధి)-331/7 2.శ్రీలంక - దక్షిణాఫ్రికా (ప్రత్యర్ధి) -302/4 3.ఆస్ట్రేలియా -న్యూజిలాండ్ (ప్రత్యర్ధి)-289 4.ఆస్ట్రేలియా-భారత్ (ప్రత్యర్ధి)-283 5.ఆస్ట్రేలియా -భారత్ (ప్రత్యర్ధి)-282చదవండి: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ఆసియాలో తొలి బ్యాటర్ -
టీమిండియాపై ఓవరాక్షన్.. కట్ చేస్తే! ఊహించని షాకిచ్చిన ఐసీసీ
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గురువారం భారత్తో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటమి తప్పదు అనుకున్న చోట నాడిన్ డి క్లెర్క్ అద్బుతం చేసింది. కేవలం 54 బంతుల్లోనే 84 పరుగులు చేసి ప్రోటీస్కు మరుపురాని విజయాన్ని అందించింది.అయితే గెలుపు జోష్లో ఉన్న సౌతాఫ్రికా స్టార్ బౌలర్ నోన్కులులెకో మ్లాబాకు ఐసీసీ ఊహించని షాకిచ్చింది. తమ ప్రవర్తన నియమావళిని ఉల్లఘించినందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది.ఆమె మ్యాచ్ ఫీజులో ఎటువంటి కోత విధించనప్పటికి.. ఓ డిమెరిట్ పాయింట్ మాత్రం ఆమె ఖాతాలో చేరింది. 24 నెలల్లో ఇది ఆమెకు మొదటి డీమెరిట్ పాయింట్ కాబట్టి సౌతాఫ్రికా మెనెజ్మెంట్ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అసలేమి జరిగిందంటే?ఈ మ్యాచ్లో మ్లాబా తన స్పిన్ మ్యాజిక్తో భారత టాపార్డర్ను దెబ్బతీసింది. స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ను వెంటవెంటనే పెవిలియన్కు పంపింది. అయితే 17వ ఓవర్లో హర్లీన్ డియోల్ను ఔట్ చేసిన తర్వాత మ్లాబా ఆమె వైపు చూస్తూ “గుడ్బై” అంటూ తన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసింది.ఆమె మరీ అంత దూకుడుగా వ్యవహరించికపోయినప్పటికి.. ఐసీసీ మాత్రం ఆమె ప్రవర్తను కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆమెను ఐసీసీ మందలించింది. ఈ మెగా టోర్నీలో మ్లాబా ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి 6 వికెట్లు పడగొట్టింది.చదవండి: BAN vs AFG: ఐదేసిన రషీద్ ఖాన్.. బంగ్లాదేశ్ను చిత్తు చేసిన అఫ్గాన్ -
చరిత్ర సృష్టించిన రిచా ఘోష్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
భారత మహిళల జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ మరోసారి సత్తాచాటింది. మహిళల ప్రపంచకప్లో వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో రిచా విధ్వంసం సృష్టించింది. విశాఖ మైదానంలో బౌండరీల మోత మ్రోగించింది. ఓపెనర్లు ప్రతికా రావెల్, స్మృతి మంధాన తొలి వికెట్కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఆ తర్వాత వరుస క్రమంలో భారత్ వికెట్లు కోల్పోయింది. దీంతో ఉమెన్ ఇన్ బ్లూ 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రిచా తన అద్బుత పోరాటంతో జట్టును ఆదుకుంది. తన ఫైటింగ్ నాక్తో 102/6 నుంచి 251 వరకూ టీమిండియాకు మెరుగైన స్కోర్ అందించింది.లేడి ధోనిగా పేరు గాంచిన రిచా ఘోష్ కేవలం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 94 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్కు అంతా ఫిదా అయిపోయారు. ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిచా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.రిచా సాధించిన రికార్డులు ఇవే..👉మహిళల వన్డే క్రికెట్లో ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి ప్లేయర్గా రిచా వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు సౌతాఫ్రికా ప్లేయర్ క్లోయ్ ట్రయాన్ పేరిట ఉండేది. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ట్రయాన్ ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి 74 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో ట్రయాన్ ఆల్టైమ్ రికార్డును రిచా బ్రేక్ చేసింది.👉వన్డేల్లో అత్యంత వేగంగా(బంతులు పరంగా) 1000 పరుగుల మార్క్ అందుకున్న భారత మహిళ క్రికెటర్ రిచా నిలిచింది. ఘోష్ కేవలం 1010 బంతుల్లోనే ఈ ఫీట్ అందుకుంది. ఓవరాల్గా మహిళల క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్గా ఆమె నిలిచింది. తొలి స్దానంలో ఆసీస్కు చెందిన యాష్ గార్డనర్(917) ఉంది.👉మహిళల వన్డే ప్రపంచకప్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వికెట్ కీపర్గా రిచా రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఫౌజీహ్ ఖలీలి పేరిట ఉండేది. 1982 ప్రపంచ కప్లో ఇంగ్లండ్పై ఫౌజీహ్ 88 పరుగులు సాధించారు. ఈ మ్యాచ్లో కీలక నాక్ ఆడిన రిచా.. 43 ఏళ్ల ఫౌజీహ్ రికార్డు బ్రేక్ చేసింది.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ డబుల్ సెంచరీ -
టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ డబుల్ సెంచరీ
సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో వోల్వార్డ్ 200 మ్యాచ్ల మైలు రాయిని అందుకుంది. మహిళల ప్రపంచకప్-2025లో వైజాగ్ వేదికగా భారత్తో మ్యాచ్ సందర్భంగా వోల్వార్డ్ ఈ ఫీట్ సాధించింది.2016లో సౌతాఫ్రికా తరపున ఇంటర్ననేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టిన లారా.. ఇప్పటివరకు 4 టెస్టులు, 112 వన్డేలు, 83 టీ20లు ఆడింది. 26 ఏళ్ల లారా గతేడాది సౌతాఫ్రికా ఆల్ఫార్మాట్ కెప్టెన్గా ఎంపికైంది. 2024 టీ20 వరల్డ్ కప్లో సౌతాఫ్రికాను ఫైనల్కు వోల్వార్డ్ చేర్చింది.అంతర్జాతీయ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడవ మహిళా క్రికెటర్గా ఆమె కొనసాగుతోంది. ఆమె కెరీర్లో ఇప్పటివరకు 9 వన్డే సెంచరీలు, టీ20, టెస్టుల్లో ఒక్కో శతకం సాధించింది. ఓవరాల్గా తన అంతర్జాతీయ కెరీర్లో 7013 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్ అద్బుతమైన పోరాటం కనబరిచింది. కేవలం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్స్లతో 94 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్రతికా రావల్(37), స్నేహ్ రాణా(33) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్లోయ్ ట్రయాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, మల్బా, నాడిన్ డి క్లెర్క్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.చదవండి: డబ్ల్యూపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! నిబంధనలు ఇవే? -
IND vs SA: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్..
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) అరుదైన ఘనత సాధించింది. మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రెండో ప్లేయర్గా హర్మన్ చరిత్ర సృష్టించింది. హర్మన్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లో కలిపి 343 మ్యాచ్లు ఆడింది.ఐసీసీ మహిళల ప్రపంచకప్( ICC Womens World Cup 2025)లో వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో హర్మన్ ఈ ఫీట్ సాధించింది. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సుజీ బేట్స్(350) అగ్రస్దానంలో ఉంది. బేట్స్ ఇటీవలే న్యూజిలాండ్పై తన 350 మ్యాచ్ను పూర్తి చేసుకుంది.కాగా 2009లో భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్మన్.. ప్లేయర్గా, కెప్టెన్గా తన సేవలను అందిస్తోంది. ఇప్పటివరకు 154 వన్డేలు, 182 టీ20లు, 6 టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత 2022 నుంచి భారత మహిళల జట్టు ఫుల్ టైమ్ కెప్టెన్గా హర్మన్ కొనసాగుతోంది.100కి పైగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తొలి భారత మహిళా క్రికెటర్ కూడా హర్మాన్ ప్రీత్నే కావడం విశేషం. అదేవిధంగా టీ20ల్లో 3000కి పైగా పరుగులు చేసిన ఏకైక భారత మహిళా క్రికెటర్గా కూడా కౌర్ రికార్డు సాధించింది. వన్డేల్లో ఏడు సెంచరీలు, ఓ టీ20 సెంచరీ ఆమె పేరిట ఉంది.చదవండి: అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కాదు: అశ్విన్ ఫైర్ -
మా ఓటమికి కారణమదే.. లేదంటే ఈజీగా గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్లో కొలంబో వేదికగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో 88 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ ఓటమి పాలైంది. బౌలింగ్లో పర్వాలేదన్పించిన పాక్ జట్టు.. బ్యాటింగ్లో మాత్రం తేలిపోయింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 43 ఓవర్లలో 159 రన్స్కే కుప్పకూలింది.యువ ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్, సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు స్నేహ్ రాణా రెండు వికెట్లు తీశారు. పాక్ బ్యాటర్లలో సిద్రా అమిన్ (106 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది.అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగుల వద్ద ఆలౌటైంది. హర్లీన్ డియోల్ (65 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా.. రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడింది. మహిళల వన్డేల్లో పాక్పై భారత్కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. అయితే ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్పందించింది. ప్రత్యర్ధి భారత జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విఫలమయ్యామని సనా చెప్పుకొచ్చింది."పవర్ప్లేలో మేము చాలా పరుగులు ఇచ్చాము. అదే విధంగా డెత్ ఓవర్లలో మేము మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయాము. నేను బౌలింగ్ చేసినప్పుడు బంతి స్వింగ్ అవుతున్నట్లు అన్పించింది. కానీ డయానా బేగ్ మాత్రం సీమ్, స్వింగ్ మధ్య కాస్త కన్ఫూజన్కు గురైంది.నేను మాత్రం బంతి స్వింగ్ అవుతుందని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని నేను పదేపదే చెబుతునే ఉన్నాను. మా తదుపరి మ్యాచ్లో ఆమె మెరుగ్గా రాణిస్తుందని అశిస్తున్నాను. తొలుత భారత్ను 200 కంటే తక్కువ పరుగులకు పరిమితం చేసి ఉంటే బాగుండేది. ఆ టోటల్ను మేము సులువుగా చేధించేవాళ్లం.అయితే బ్యాటింగ్లో మేము కాస్త తడబడ్డాము. కానీ మా బ్యాటింగ్ లైనప్ అద్బుతంగా ఉంది. టాప్ 5లో మంచి బ్యాటర్లు ఉన్నారు. మా తర్వాతి మ్యాచ్లో రాణిస్తారని భావిస్తున్నారు. బ్యాటింగ్లో భాగస్వామ్యాలు నెలకొల్పడం అవసరం. ఈ మ్యాచ్లో మేడు అది చేయలేకపోయాము. అయితే సిద్రా పోరాటం గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే. ఆమె నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తుంది. మా జట్టులో సిద్రా కీలక సభ్యురాలు" అని సనా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొంది. ఈ మ్యాచ్లో బేగ్ నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికి 69 పరుగులు సమర్పించుకుంది.చదవండి: IND vs AUS: ఒకప్పుడు కోహ్లితో కలిసి ఆడారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అంపైర్లగా! -
తగ్గే సమస్యే లేదు.. తెగేసి చెప్పిన భారత్
-
సౌతాఫ్రికా చిత్తు.. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో మహిళలతో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా దారుణ ప్రదర్శన కనబరిచింది.ఇంగ్లీష్ జట్టు బౌలర్ల దాటికి సౌతాఫ్రికా అమ్మాయిలు విలవిల్లాడారు. దక్షిణాఫ్రికా 20.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బ్యాటర్లలో మొత్తం పది మంది సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. సినాలో జాఫ్తా(22) టాప్ స్కోరర్గా నిలిచింది.ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ మూడు వికెట్లతో సౌతాఫ్రికాను దెబ్బతీయగా.. స్కివర్ బ్రంట్, ఎకిలిస్టోన్, డీన్ తలా రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 14.1 ఓవర్లలో చేధించింది.ఓపెనర్లు టామీ బ్యూమాంట్(21), అమీ జోన్స్(40) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. మూడు వికెట్లతో సత్తాచాటిన స్మిత్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచింది. వన్డేల్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇదే తొలిసారి.చదవండి: ఆసియాకప్ ట్రోఫీని భారత్కు ఇవ్వొద్దు.. ఆ మొండితనం ఏంటి?: పాక్ మాజీ క్రికెటర్ -
నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ బౌలర్లు.. 69 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా 20.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది.దక్షిణాఫ్రికా బ్యాటర్లలో సినాలో జాఫ్తా(22) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా పది మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వికెట్ల పతనం మొదలైంది. లిన్సే స్మిత్ మూడు వికెట్లతో సౌతాఫ్రికాను దెబ్బతీయగా.. స్కివర్ బ్రంట్, ఎకిలిస్టోన్, డీన్ తలా రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ మ్యాచ్లో దారుణ ప్రదర్శన కనబరిచిన సౌతాఫ్రికా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్లో అత్యల్ప టోటల్ను నమోదు చేసిన రెండో జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్ధానంలో ఉంది. న్యూజిలాండ్ 2009 ప్రపంచకప్లో 51 పరుగులకే ఆలౌటైంది.ఇంగ్లండ్టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఎమ్మా లాంబ్, ఆలిస్ కాప్సే, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్సౌతాఫ్రికాలారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, మారిజానే కాప్, అన్నేకే బాష్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, మసాబాటా క్లాస్, అయాబొంగా ఖాకా, నాంకులులేకో మ్లాబా -
వరల్డ్కప్లో ఆస్ట్రేలియా బోణీ.. న్యూజిలాండ్ చిత్తు
మహిళలవన్డే వరల్డ్కప్ క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. బుధవారం ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆ్రస్టేలియా 89 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యాష్లే గార్డ్నర్ (83 బంతుల్లో 115; 16 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి సెంచరీ సాధించింది. ఆమెతో పాటు ఫోబ్ లిచ్ఫీల్డ్(45), పెర్రీ(33), కిమ్ గార్త్(38) రాణించారు. స్టార్ ప్లేయర్లు బెత్ మూనీ(5), సదర్లాండ్(5), హీలీ(19) నిరాశపరిచారు.న్యూజిలాండ్ బౌలర్లలో లీ తహుహు, జెస్ కెర్ 3 వికెట్ల చొప్పున... బ్రీ ఇలింగ్, అమెలియా కెర్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 43.2 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ సోఫీ డివైన్ (112 బంతుల్లో 111; 12 ఫోర్లు, 3 సిక్స్లు) వీరోచిత సెంచరీ సాధించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో సోఫీ, అనాబెల్ 3 వికెట్ల చొప్పున తీశారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్తో పాకిస్తాన్ తలపడుతుంది.చదవండి: క్లీన్స్వీప్పై భారత్ గురి -
గార్డనర్ సూపర్ సెంచరీ.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా ఇండోర్ వేదికగా శ్రీలకంతో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 326 పరుగుల భారీ స్కోర్కు ఆలౌటైంది.ఆసీస్ బ్యాటర్లలో స్టార్ ఆల్రౌండర్ ఆష్లీ గార్డనర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన ఆసీస్ను గార్డరన్ తన విరోచిత పోరాటంతో ఆదుకున్నారు. లోయార్డర్ బ్యాటర్ కిమ్ గార్త్తో కలిసి ఏభై పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని గార్డనర్ నెలకొల్పారు. మొత్తంగా 83 బంతులు ఎదుర్కొన్న గార్డనర్.. 16 ఫోర్లు, ఒక సిక్సర్తో 115 పరుగులు చేసి ఔటయ్యారు. ఆమెతో పాటు ఫోబ్ లిచ్ఫీల్డ్(45), పెర్రీ(33), కిమ్ గార్త్(38) రాణించారు. స్టార్ ప్లేయర్లు బెత్ మూనీ(5), సదర్లాండ్(5), హీలీ(19) నిరాశపరిచారు.న్యూజిలాండ్ బౌలర్లలో లియా తహుహు, జెస్ కేర్ తలా మూడు వికెట్లు సాధించగా.. ఈల్లింగ్, అమీలియా కేర్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే లక్ష్య చేధనలో వైట్ ఫెర్న్స్ జట్టు తడబడుతోంది. 0 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ కష్టాల్లో పడింది.చదవండి: IND vs AUS: ఆసీస్పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్ -
రేపే బంగ్లా-పాక్ మ్యాచ్.. అంతలోనే హెడ్ కోచ్కు బ్రెయిన్ స్ట్రోక్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో బంగ్లాదేశ్ జట్టు తమ తొలి మ్యాచ్లో ఆక్టోబర్న పాకిస్తాన్తో తలపడేందుకు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ మహిళల జట్టుకు ఊహించని షాక్ తగలింది. ఆ జట్టు హెడ్ కోచ్ సర్వర్ ఇమ్రాన్ బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యాడు.అతడిని సోమవారం అస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది ఈ విషయాన్ని బంగ్లా టీమ్ మేనేజర్ ఎస్ఎం గోలం ఫయాజ్ ధృవీకరించారు. "ఇమ్రాన్ సర్వర్కు కొన్ని రోజుల క్రితం తల తిరుగుతున్నట్లు అన్పించింది. సోమవారం ఆయనకు ఆ సమస్య ఎక్కువైంది. వెంటనే సర్వర్ను అస్పత్రికి తీసుకెళ్లాము. సీటీ స్కాన్లో అతడికి స్వల్ప బ్రెయిన్ స్ట్రోక్ ఉందని వైద్యులు గుర్తించారు" అని ఫయాజ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇమ్రాన్ అస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యాడు. అతడు ప్రస్తుతం టీమ్ హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు అతడు టీమ్తో కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంక మాజీ కెప్టెన్ హషన్ తిలకరత్నే స్థానంలో ఇమ్రాన్ ఈ ఏడాది ఆరంభంలో బంగ్లా మహిళల జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. 66 ఏళ్ల ఇమ్రాన్కు బంగ్లాదేశ్ క్రికెట్లో ప్రత్యేక స్ధానం ఉంది. 2000లో బంగ్లాదేశ్ పురుషుల జట్టు తొలి టెస్ట్ మ్యాచ్లో కోచ్గా అతడు పనిచేశాడు. అతడి గైడెన్స్లోనే బంగ్లాదేశ్ మహిళల జట్టు ఈ ఏడాది వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించింది. బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నమెంట్లో పాల్గొనడం ఇది రెండవసారి. ప్రధాన టోర్నీలో కూడా సత్తాచాటాలని బంగ్లా జట్టు ఉవ్విళ్లూరుతోంది.ప్రపంచకప్కు బంగ్లాదేశ్ జట్టునిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్), నహిదా అక్టర్ (వైస్ కెప్టెన్), ఫర్జానా హక్, రుబ్యా హైదర్ ఝెలిక్, షర్మిన్ అక్తర్ సుప్తా, శోభనా మోస్తరీ, రీతు మోని, షోర్నా అక్తర్, ఫాహిమా ఖాతున్, రబెయా ఖాన్, మరుఫా అక్తర్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, మరుఫా అక్తర్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, షంజిదా అక్తర్, నిషితా అక్టర్ నిషి, సుమయ్యా అక్టర్ -
World Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepthi Sharma) చరిత్ర సృష్టించింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో అర్ద సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో (ICC Women's World Cup 2025) భాగంగా నిన్న (సెప్టెంబర్ 30) శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో (India vs Sri Lanka) దీప్తి ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్లో జట్టుకు చాలా ముఖ్యమైన అర్ద సెంచరీ (53) సాధించి, అనంతరం బౌలింగ్లోనూ సత్తా చాటి 3 వికెట్లు (10-1-54-3) తీసింది. దీప్తితో పాటు అమన్జోత్ కౌర్ (57, 6-0-37-1), స్నేహ్ రాణా (28 నాటౌట్, 10-0-32-2) కూడా రాణించడంతో ఈ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది.124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో దీప్తి వ్యక్తిగతంగా రాణించడమే కాకుండా టెయిలెండర్లతో అమూల్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. అమన్జోత్తో కలిసి ఏడో వికెట్కు 103 పరుగులు, స్నేహ్ రాణాతో ఎనిమిదో వికెట్కు 42 పరుగులు జోడించి భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది.అనంతరం బౌలింగ్లో అతి కీలకమైన చమారీ ఆటపట్టు (43) వికెట్తో పాటు కవిష దిల్హరి (15), వికెట్కీపర్ అనుష్క సంజీవని (6) వికెట్లు తీసి శ్రీలంకను చావుదెబ్బ కొట్టింది. శ్రీలంకపై గెలుపుతో టీమిండియా 2025 ప్రపంచ కప్ను ఘనంగా ప్రారంభించింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబో వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..భారత్- 269/8- వర్షం కారణంగా మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించారుశ్రీలంక- 211 ఆలౌట్- డక్వర్త్ లూయిస్ పద్దతిన 59 పరుగుల తేడాతో భారత్ విజయంరెండో స్థానానికి ఎగబాకిన దీప్తిఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసిన అనంతరం దీప్తి శర్మ మరో ఘనత కూడా సాధించింది. వన్డేల్లో రెండో అత్యధిక వికెట్లు సాధించిన భారత మహిళా క్రికెటర్గా నిలిచింది. ఈ క్రమంలో నీతూ డేవిడ్ను వెనక్కు నెట్టింది. ఈ జాబితాలో జులన్ గోస్వామి టాప్లో ఉంది.భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు..255 - జులన్ గోస్వామి143 - దీప్తి శర్మ141 - నీతూ డేవిడ్100 - నూషిన్ అల్ ఖదీర్99 - రాజేశ్వరి గైక్వాడ్చదవండి: IND VS AUS: విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ -
శ్రీలంకతో తొలి మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! తెలుగమ్మాయికి చోటు
మహిళల టీ20 ప్రపంచకప్-2025కు తెరలేచింది. తొలి మ్యాచ్లో గౌహతి వేదికగా భారత్-శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చామరి అథపట్టు తొలుత హర్మన్ సేనను బ్యాటింగ్కు ఆహ్హనించింది.తొలి పోరుకు భారత స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ దూరమైంది. 29 ఏళ్ల రేణుకా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ టాస్ సందర్భంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆటగాళ్లంతా ఫిట్గా ఉన్నారని, కాంబినేషన్ పరంగా తుది జట్టును ఎంపిక చేశామని పేర్కొనడం గమనార్హం.అయితే కాలిమడమ గాయం నుంచి కోలుకున్న రేణుకా ఇటీవలే ఆస్ట్రేలియా సిరీస్తో తిరిగి కమ్బ్యాక్ ఇచ్చింది. ఆ సిరీస్లో మొత్తం మ్యాచ్లు ఆడిన రేణుకా.. ఈ మెగా టోర్నీకి ముందు వార్మప్ మ్యాచ్లలో కూడా భాగమైంది. అయితే తొలి పోరుకు దూరమైనప్పటికి తదుపరి మ్యాచ్లలో రేణుకా ఆడే అవకాశముంది. మరోవైపు ప్లేయింగ్ ఎలెవన్లో తెలుగు అమ్మాయి శ్రీ చరణికి చోటు దక్కింది. కడపకు చెందిన చరణి ఇటీవల కాలంలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ క్రమంలోనే వరల్డ్కప్ జట్టులో ఈ యువ ఆఫ్ స్పిన్నర్ భాగమైంది. కాగా ఈ మ్యాచ్లో భారత్ కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే బరిలోకి దిగింది. అమన్ జ్యోత్ కౌర్, క్రాంతి గౌడ్ పేస్ బౌలర్లగా ఉన్నారు. మొత్తం ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు.శ్రీలంక మహిళల ప్లేయింగ్ XI: చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్ కీపర్), అచ్చిని కులసూర్య, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోధని, ఇనోకా రనవీరభారత మహిళల తుది జట్టు : ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
ODI World Cup 2025: శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మహిళల ప్రపంచ కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా సీనియర్ క్రికెటర్ చమరి అటపత్తు వ్యవహరించనుంది. అదేవిధంగా ఈ వరల్డ్కప్ జట్టులో హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఉదేశిక ప్రబోధని వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నారు. 27 ఏళ్ల హర్షిత గత కొన్నాళ్లగా శ్రీలంక జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతోంది. హర్షిత 41 వన్డేల్లో 1,075 పరుగులు చేసింది. గతేడాది జరిగిన ఆసియాకప్ ఫైనల్లో భారత్పై హర్షిత అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. దీంతో 2024 ఆగస్టు నెలకు గాను సిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఆమె ఎంపికైంది. అదేవిధంగా యువ పేస్ సంచలనం దేవ్మి విహంగాకు ఈ జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్లో శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ముక్కోణపు వన్డే సిరీస్లో దేవ్మి విహంగా 11 వికెట్లతో సత్తాచాటింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్లో గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్తో శ్రీలంక తలపడనుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది.మహిళల వన్డే ప్రపంచకప్కు శ్రీలంక జట్టుచమరి అతపత్తు (కెప్టెన్), హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని, ఇమేషా దులాని, దేవీ విహంగా, పియుమి వత్సల, ఇనోకా రణవీర, సుగండిక కుమారి, ఉద, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోదని, మల్కీ మదర, అచ్చిని కులసూర్యమహిళల వన్డే ప్రపంచకప్కు భారత జట్టు:హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమన్జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యస్తిక భాటియా (వికెట్ కీపర్), స్నేహ్ రాణా -
World Cup 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఈజ్ బ్యాక్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ అలిస్సా హీలీ తిరిగి టీమ్లోకి వచ్చింది. దీంతో ఈ మెగా టోర్నీలో ఆసీస్ జట్టుకు హీలీ నాయకత్వం వహించనుంది.ఇది ఆమెకు మూడో వన్డే ప్రపంచకప్ కావడం గమనార్హం. ఇక ఈ జట్టులో ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, యాష్ గార్డ్నర్, తహ్లియా మెక్గ్రాత్, మేగాన్ షుట్, వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అదేవిధంగా స్టార్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. దీంతో ఆసీస్ స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది.స్పిన్ యూనిట్లో మోలినెక్స్తో పాటు అలానా కింగ్, జార్జియా వేర్హామ్ కూడా ఉన్నారు. మరోవైపు యువ ఆటగాళ్లు జార్జియా వోల్, ఫోబ్ లిచ్ఫీల్డ్, వేర్హామ్, కిమ్ గార్త్ వంటి యువ ప్లేయర్లు తొలిసారి వన్డే ప్రపంచకప్లో ఆడనున్నారు.అయితే ఈ ప్రధాన టోర్నీకి ముందు భారత మహిళల జట్టుతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్లో కూడా ప్రపంచకప్కు ఎంపికైన ఆసీస్ జట్టే భాగం కానుంది. అదనంగా వికెట్ కీపర్ నికోల్ ఫాల్టమ్, ఆల్ రౌండర్ చార్లీ నాట్ భారత్తో సిరీస్లో ఆడనున్నారు.ఈ సిరీస్ ముగిశాక వీరిద్దరూ తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోనున్నారు. ఆసీస్ తమ వరల్డ్కప్ ప్రయణాన్ని ఆక్టోబర్ 1న న్యూజిలాండ్ మ్యాచ్తో ఆరంభించనుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. ఇప్పటికే రికార్డు స్దాయిలో ఏడు సార్లు ప్రపంచ కప్ విజేతగా ఆసీస్ నిలిచింది.వరల్డ్కప్కు ఆసీస్ జట్టుఅలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబ్ లిచ్ఫీల్డ్, సోఫీ మోలినెక్స్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.చదవండి: Asia Cup 2025: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్లుగా బాబర్ ఆజం, జైశ్వాల్ -
వన్డే వరల్డ్కప్కు టిక్కెట్లు విడుదల.. కేవలం రూ. 100 మాత్రమే
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2025కు రంగం సిద్దమైంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే మ్యాచ్లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను ఐసీసీ వెల్లడించింది. తాజాగా ఈ వన్డే వరల్డ్కప్కు సంబంధించిన మ్యాచ్ల టికెట్లను అందుబాటులో ఉంచినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఈ టోర్నీ మొత్తం ఐదు నగరాల్లో జరగనుంది. భారత్లోని గౌహతి, ఇండోర్, నవీ ముంబై, విశాఖపట్నం నాలుగు వేదికలు కాగా.. శ్రీలంకలోని కొలంబోని ప్రేమదాస స్టేడియం 11 మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది.ఐసీసీ కీలక నిర్ణయం..అయితే అభిమానులను భారీ సంఖ్యలో స్టేడియం రప్పించేందుకు అన్ని లీగ్ మ్యాచ్ల టిక్కెట్ల ధరను ఐసీసీ కేవలం రూ. 100 రూపాయలగా నిర్ణయించింది. మొదటి దశ టిక్కెట్ల అమ్మకాలు గురువారం (సెప్టెంబర్ 4) రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యాయి.అయితే ఫస్ట్ ఫేజ్లో కేవలం కేవలం గూగుల్ పే వినియోగదారులు మాత్రమే బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్కప్కు గూగల్ గ్లోబల్ పార్టనర్గా వ్యవహరిస్తోంది. ఇక రెండో దశ సెప్టెంబర్ 9న భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. సెకెండ్ ఫేజ్లో టిక్కెట్లు మొత్తం అందరికి అందుబాటులో ఉంటాయి.కాగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే పాకిస్తాన్-భారత్ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్లను ఇంకా విడుదల చేయలేదు. ఈ మ్యాచ్తో పాటు బంగ్లాదేశ్ vs పాకిస్తాన్, ఆస్ట్రేలియా vs శ్రీలంక టిక్కెట్లను కూడా ఇంకా అందుబాటులో ఉంచలేదు.కాగా ఈ టోర్నీ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 30ను గౌహతి వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనున్నారు. ఈ ఆరంభ వేడుకల్లో స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ సందడి చేయనుంది. వరల్డ్కప్ టిక్కెట్లు ఇంత తక్కువ ధరకు విక్రయించడం ఇదే తొలిసారి.చదవండి: గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే: ధోనిపై మరోసారి యువీ తండ్రి ఫైర్ -
ICC: వన్డే వరల్డ్కప్-2025 రివైజ్డ్ షెడ్యూల్ విడుదల
మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC ODI World Cup) టోర్నమెంట్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక అప్డేట్ అందించింది. టోర్నమెంట్ ఓపెనర్లో భాగంగా ఆతిథ్య దేశాలు భారత్- శ్రీలంక మధ్య జరిగే తొలి మ్యాచ్ వేదికను మార్చింది.తొలుత బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఈ వన్డేను నిర్వహించాలని భావించిన ఐసీసీ.. తాజాగా దీనిని గువాహటిలోని బర్సపరా స్టేడియానికి మార్చింది. అదే విధంగా.. ఈ మెగా టోర్నీలో బెంగళూరులో జరగాల్సిన మిగతా మ్యాచ్లన్నింటి వేదికను నవీ ముంబైకి తరలించింది.తొక్కిసలాటలో ప్రాణాలు పోయాయిఇటీవల ఐపీఎల్-2025 (IPL)లో విజేతగా నిలిచిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవం తొక్కిసలాటకు దారి తీసి.. పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న విషాదరకర ఘటన విదితమే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యంతో పాటు కర్ణాటక ప్రభుత్వం మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన దర్యాప్తులో తప్పంతా ఆర్సీబీదేనని తేలింది.నవీ ముంబైలో..ఇదిలా ఉంటే.. తొక్కిసలాట ఘటన తర్వాత.. చిన్నస్వామి స్టేడియంలో వరల్డ్కప్ మ్యాచ్లు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్లను నవీ ముంబైలో నిర్వహించాలని నిర్ణయించింది.ఐసీసీ తాజా ప్రకటన ప్రకారం.. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఐదు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్ దశలో మూడు, సెమీ ఫైనల్, ఫైనల్ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం ప్రకారం.. ఆ దేశ మహిళా జట్టు తటస్థ వేదికైన శ్రీలంకలోని కొలంబోలో మ్యాచ్లు ఆడనున్న విషయం తెలిసిందే.పాక్ జట్టు ఫైనల్ చేరితే?ఒకవేళ పాక్ జట్టు ఫైనల్ చేరితే మాత్రం నవీ ముంబై గాకుండా.. కొలంబోలో టైటిల్ పోరు జరుగుతుంది. ఇక బెంగళూరులో జరగాల్సిన భారత్ వర్సెస్ శ్రీలంక, ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా, భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లు మాత్రం నవీ ముంబైలో జరగడం ఖరారైంది.కాగా బెంగళూరు నుంచి వేదికను తరలించాల్సి వస్తే తిరువనంతపురంలో మ్యాచ్లు జరుగుతాయని వార్తలు వచ్చాయి. అయితే, నవీ ముంబై తాజాగా ఈ మ్యాచ్ల ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. కాగా సెప్టెంబరు 30న భారత్- శ్రీలంక మ్యాచ్తో గువాహటి వేదికగా వన్డే ప్రపంచకప్-2025 టోర్నీకి తెరలేవనుంది.వన్డే వరల్డ్కప్-2025లో టీమిండియా షెడ్యూల్ (అప్డేటెడ్)🏏సెప్టెంబరు 30- భారత్ వర్సెస్ శ్రీలంక- గువాహటి🏏అక్టోబరు 5- భారత్ వర్సెస్ పాకిస్తాన్- కొలంబో🏏అక్టోబరు 9- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా- విశాఖపట్నం🏏అక్టోబరు 12- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- విశాఖపట్నం🏏అక్టోబరు 19- భారత్ వర్సెస్ ఇంగ్లండ్- ఇండోర్🏏అక్టోబరు 23- భారత్ వర్సెస్ న్యూజిలాండ్- నవీ ముంబై🏏అక్టోబరు 26- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- నవీ ముంబై.నాకౌట్ స్టేజ్ షెడ్యూల్🏏అక్టోబరు 29- సెమీ ఫైనల్ 1- కొలంబో/గువాహటి🏏అక్టోబరు 30- సెమీ ఫైనల్ 2- నవీ ముంబై🏏నవంబరు 2- ఫైనల్- కొలంబో/నవీ ముంబైవన్డే వరల్డ్కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా. స్టాండ్బై: సయాలీ సత్ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి.చదవండి: సౌతాఫ్రికా స్టార్ సంచలనం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా చరిత్ర -
వన్డే ప్రపంచకప్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
మహిళల వన్డే ప్రపంచకప్-2025కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ నాట్ స్కైవర్-బ్రంట్ వ్యవహరించనుంది. ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్లో స్కైవర్-బ్రంట్ బ్రంట్ సారథ్యం వహించడం ఇదే తొలిసారి.అదేవిధంగా తొడ కండరాల గాయం కారణంగా గత కొన్ని నెలలగా ఆటకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ హీథర్ నైట్ తిరిగి జట్టులోకి వచ్చింది. నైట్ తిరిగి రావడంతో ఇంగ్లండ్ మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారింది. ఉపఖండ పరిస్థితులకు తగ్గట్టు సెలక్టర్లు ఎక్కవగా స్పిన్ విభాగంపై దృష్టిసారించారు.దీంతో స్పిన్నర్ల కోటాలో గ్లెన్, సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్, లిన్సే స్మిత్లకు చోటు దక్కింది. కాగా ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంక వేదికలగా జరగనుంది. ఇటీవల సిరీస్లలో నిరాశపరిచిన కేట్ క్రాస్, మైయా బౌచియర్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్ లకు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ అత్యంత అనుభవజ్ఞులైన బౌలర్లలో ఒకరిగా నిలిచిన క్రాస్.. గతేడాది నుంచి గాయాలు,పేలవ ఫామ్తో సతమతమవుతోంది. ఆమె స్ధానాన్ని యువ పేసర్ ఎమ్ ఆర్లోట్తో భర్తీ చేశారు. కాగా ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్లో అక్టోబర్ 3న బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఐదవ వన్డే ప్రపంచ కప్ టైటిలే లక్ష్యంగా ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది.మహిళల ప్రపంచ కప్ కోసం ఇంగ్లండ్ జట్టు: ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, అమీ జోన్స్, హీథర్ నైట్, ఎమ్మా లాంబ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), లిన్సే స్మిత్, డాని వ్యాట్-హాడ్జ్.చదవండి: సిరాజ్, రాహుల్ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్ -
ICC WC Qualifier: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..
వన్డే ప్రపంచకప్ ఆడాలన్న స్కాట్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. ఐసీసీ టోర్నీ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్కాటిష్ జట్టు ఓటమిపాలైంది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నీ (ICC Women's ODI World Cup) జరుగనున్న విషయం తెలిసిందే.ఒక్క వికెట్ తేడాతోఈ నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా ఇందుకు సంబంధించి క్వాలిఫయర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీ లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్ ఒక్క వికెట్ తేడాతో స్కాట్లాండ్ (Ireland Beat Scotland)ను ఓడించింది. ఒకవేళ ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ గెలిచి... శనివారం పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓడిపోతే స్కాట్లాండ్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించేది. కానీ స్కాట్లాండ్ ఆశలపై ఐర్లాండ్ నీళ్లు కుమ్మరించింది.కేథరీన్ బ్రైస్ అజేయ సెంచరీ వృథాలాహోర్ వేదికగా ఐర్లాండ్తో పోరులో ముందుగా బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 268 పరుగులు సాధించింది. కెప్టెన్ కేథరీన్ బ్రైస్ (Kathryn Bryce- 137 బంతుల్లో 131 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ చేసి స్కాట్లాండ్కు గౌరవప్రద స్కోరు అందించింది. నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..అనంతరం ఐర్లాండ్ జట్టు సరిగ్గా 50 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సారా ఫోర్బ్స్ (55; 6 ఫోర్లు), కెప్టెన్ గ్యాబీ లూయిస్ (61; 9 ఫోర్లు), లౌరా డెలానీ (57 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి ఐర్లాండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో స్కాట్లాండ్, ఐర్లాండ్ తమ ఐదు లీగ్ మ్యాచ్లను పూర్తి చేసుకొని నాలుగు పాయింట్లతో వరుసగా మూడో, నాలుగో స్థానంలో నిలిచాయి.పాక్ బెర్తు ఖరారుఇక చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ జట్టుతో పాకిస్తాన్.. థాయ్లాండ్ జట్టుతో వెస్టిండీస్ శనివారం తలపడతాయి. ఇదిలా ఉంటే.. హ్యాట్రిక్ విజయాలతో పాకిస్తాన్ ఇప్పటికే వరల్డ్కప్కు అర్హత పొందగా... రెండో బెర్త్ కోసం బంగ్లాదేశ్, వెస్టిండీస్ రేసులో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చదవండి: BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం -
ICC Women's World Cup 2022: భారీ విజయం.. ఓటమన్నదే ఎరుగదు.. జగజ్జేతగా ఆస్ట్రేలియా
ICC Women's World Cup 2022 Winner Australia: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022 విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ను మట్టి కరిపించి జగజ్జేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ను 71 పరుగుల భారీ తేడాతో ఓడించి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో ఓటమన్నదే ఎరుగని మెగ్ లానింగ్ బృందం అజేయ రికార్డును కొనసాగిస్తూ టైటిల్ను సొంతం చేసుకుంది. అలిస్సా హేలీ విధ్వంసం టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఓపెనర్లు రాచెల్ హేన్స్(93 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు), అలిస్సా హేలీ(138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు) ఘనమైన ఆరంభం అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) స్టార్ బ్యాటర్ బెత్మూనీ సైతం అర్ధ సెంచరీ(47 బంతుల్లోనే 62 పరుగులు) సాధించింది. ఇక హేలీ అవుటైన తర్వాత ఇంగ్లండ్ వరుసగా వికెట్లు తీసినా ఫలితం లేకుండా పోయింది. హేలీ విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆదిలోనే గట్టి షాక్.. అయినా ఆమె ఒక్కతే భారీ లక్ష్యంతో బరిలోని దిగిన ఇంగ్లండ్కు ఆసీస్ బౌలర్ మేగన్ షట్ ఆరంభంలోనే గట్టిషాకిచ్చింది. ఓపెనర్లు టామీ బీమౌంట్(27), డానియెల్ వ్యాట్(4) వికెట్లు కూల్చి మానసికంగా వారిని దెబ్బకొట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే వరుసగా వికెట్లు పడుతున్నా ఇంగ్లండ్ బ్యాటర్ నటాలీ సీవర్ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఆమె 121 బంతులు ఎదుర్కొని 148 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అయితే, మరో ఎండ్ నుంచి సహకారం అందకపోవడంతో నటాలీ ఒంటరి పోరాటం వృథా అయింది. 43.4 ఓవర్లలో 285 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ఏడోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఆసీస్కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన అలిస్సా హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 ఫైనల్ విజేత ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా స్కోర్లు ఆసీస్- 356/5 (50) ఇంగ్లండ్- 285 (43.4) -
WC 2022 Final: ఆడం గిల్క్రిస్ట్ రికార్డు బద్దలు కొట్టిన అలిస్సా హేలీ..
ICC Women World Cup 2022 Final Aus Vs Eng- Alyssa Healy: ఐసీసీ మహిళా వరల్డ్కప్-2022 టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హేలీ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడింది. కేవలం 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి వారికి పీడకలను మిగిల్చింది. అలిస్సా ఏకంగా 26 ఫోర్లు బాదిందంటే ఆ బౌలర్ల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో తన అద్భుత ఇన్నింగ్స్తో అలిస్సా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆడం గిల్క్రిస్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ల జాబితాలో ప్రథమస్థానంలో నిలిచింది. క్రికెట్ దిగ్గజాలు ఆడం గిల్క్రిస్ట్, రిక్కీ పాంటింగ్, వివియన్ రిచర్డ్స్ను వెనక్కి నెట్టింది. తద్వారా ప్రపంచకప్ ఫైనల్లో అరుదైన ఫీట్తో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే హేలీ అద్భుత ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్లు 1. అలిస్సా హేలీ(ఆస్ట్రేలియా)- 170 పరుగులు- ప్రత్యర్థి ఇంగ్లండ్- 2022 2. ఆడం గిల్క్రిస్ట్(ఆస్ట్రేలియా)- 149 పరుగులు- ప్రత్యర్థి శ్రీలంక-2007 3. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 140 పరుగులు(నాటౌట్)- ప్రత్యర్థి ఇండియా- 2003 4. వివియన్ రిచర్డ్స్(వెస్టిండీస్)- 138 పరుగులు(నాటౌట్)- ప్రత్యర్థి ఇంగ్లండ్- 1979 చదవండి: IPL 2022: ఢిల్లీ జట్టుకు గుడ్న్యూస్.. వాళ్లిద్దరూ జట్టులోకి రానున్నారన్న పాంటింగ్! -
WC 2022 Final: హేలీ ఊచకోత.. పాపం ఇంగ్లండ్ బౌలర్లు
Update: ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 విజేతగా ఆస్ట్రేలియా అవతరించింది. ఇంగ్లండ్ను 71 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ICC Women's World Cup 2022 Final: ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 ఫైనల్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అలిస్సా హేలీ మెరుపు ఇన్నింగ్స్తో ప్రత్యర్థి ఇంగ్లండ్ ముందు 357 పరుగుల లక్ష్యాన్ని విధించింది. న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం నాటి వరల్డ్కప్ ఫైనల్లో.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు ఓపెనర్లు రాచెల్ హేన్స్(93 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు), అలిస్సా హేలీ(138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వన్డౌన్లో వచ్చిన బెత్మూనీ సైతం 47 బంతుల్లోనే 62 పరుగులు సాధించింది. హేలీ అవుటైన తర్వాత వరుసగా వికెట్లు పడ్డా.. అప్పటికే ఇంగ్లండ్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హేలీ విజృంభణతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) తద్వారా కొండంత లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుకు ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో అన్య శ్రుబ్సోలేకు మూడు, సోఫీ ఎక్లిస్టోన్కు ఒక వికెట్ దక్కాయి. ఇక ఆసీస్ బ్యాటర్ యాష్లీ గార్డ్నర్ రనౌట్గా వెనుదిరిగింది. ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా సాధించిన స్కోరు: 356/5 (50). View this post on Instagram A post shared by ICC (@icc) -
భారత్కు రెండో గెలుపు
కొలంబో: ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. థాయ్లాండ్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. భారత బౌలర్లు మాన్సి జోషి (3/4), దీప్తి శర్మ (2/8), పూనమ్ యాదవ్ (2/10), రాజేశ్వరి (2/18) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్లాండ్ 29.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. భారత్ 12.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసి గెలిచింది.


