-
పేకాటపై వార్తలు, జర్నలిస్టుపై దాడి
దిస్పూర్: రాష్ట్రంలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని వార్తలు రాసిన ఓ జర్నలిస్టుపై జూదగాళ్లు మూకుమ్మడి దాడి చేశారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి చిత్రవధ చేశారు. ఈ సంఘటన గువాహటికి పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాలో జరిగింది. ప్రముఖ అస్సామీ దినపత్రిక ప్రతీదిన్లో రిపోర్టర్గా విధులు నిర్వర్తిస్తున్న కరుప్ జిల్లాకు చెందిన మిలన్ మహంత అనే జర్నలిస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో పేకాటపై వరుస కథనాలు రాశారు. దీంతో కక్ష్య పెంచుకున్న ఐదుగురు జూదగాళ్లు రిపోర్టర్పై ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జర్నలిస్టు మిలన్ మహంత్ మెడ, తల, చెవుల మీద గాయాలవగా.. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన నిందితులపై బారి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని మిగతావాళ్లు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
చీరాల పట్టణంలో విచ్చల విడిగా జూదం
ప్రకాశం, చీరాల రూరల్: భౌతికదూరం పాటించి కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయాలని ప్రచార మాధ్యమాల్లో ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... సమావేశాలు పెట్టి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా... కొందరు యువకులు అధికారుల సూచనలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఇష్టాను రీతిగా వ్యవహరిస్తూ కనీసం ముఖానికి మాస్కు కూడా ధరించకుండా వైరస్ను వ్యాప్తి చెందే విధంగా ఎక్కడ పడితే అక్కడ జూదాలు ఆడుతున్నారు. పోలీసులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నప్పటికీ జూదరులు ఏదో ఒకచోట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరికొందరు భౌతిక దూరం పాటించకుండా ద్విచక్ర వాహనాపై డబుల్స్, త్రిబుల్స్ రైడ్స్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. చీరాలలో జూద స్థావరాలు.. చీరాల వన్టౌన్ పరిధిలో దండుబాట, విఠల్ నగర్, ప్రకాశ్ నగర్, జయశంకర్ నగర్, ఉజిలిపేట, పాలేటి నగర్, జవహర్ నగర్, హరిప్రసాద్ నగర్, శ్రీరాంనగర్, కొత్తపాలెం వంటి ప్రాంతాలు, టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో జాన్పేట, జయంతిపేట, మరియమ్మ పేట, ఐక్యనగర్, విజయ నగర్ కాలనీ, రామ్నగర్, శాంతి నగర్, గాంధీ నగర్, ఆనంద పేట, శృంగారపేట, హారిస్ పేట, హయ్యర్పేట, థామస్ పేట, గంజిపాలెం, గొల్లపాలెం వంటి ప్రాంతాల్లో కొందరు యువకులు పేకాట, చింత పిక్కలాట, హౌసీ వంటి ఆటలాడుతున్నారు. కనీస జాగ్రత్తలూ లేవు.. ప్రభుత్వం లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఇప్పటిదాకా ఇళ్లకే పరిమితమైన యువకులు జూలు విదిల్చారు. ఆకతాయిలు వివిధ రకాల జూదాలపై దృష్టి సారించారు. ఎవరికి తోచిన విధంగా వారు కనీసం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి ఆటలాడుతూ స్థానికులకు భయాందోళనలు కలిగిస్తున్నారు. బుధవారం స్థానిక వైకుంఠపురం, విఠల్ నగర్, ప్రకాష్ నగర్లలో కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆటలాడుతున్న వారిని గమనించిన సాక్షి ఫోటోలు తీస్తుండగా ఆ యువకులు ముఖాలకు చేతులు అడ్డుపెడుతూ కాలికి బుద్ధి చెప్పారు. పోలీసులు గస్తీలు ముమ్మరం చేసి జూదాలను అరికట్టాలని స్థానికులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు. -
చర్చనీయాంశంగా ‘పచ్చ’పోలీసు
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసు శాఖలో ఓ ఇంటి దొంగ పెత్తనం మితిమీరింది. జిల్లా పోలీసు బాస్ తనదైన శైలిలో అరాచక శక్తుల ఆటకట్టించే ప్రయత్నం చేస్తున్నా.. ఆ ప్రణాళిక సమాచారం దాడులకు ముందే నేరగాళ్లకు చేరిపోతోంది. గత ఎన్నికల సమయంలోనూ ఈ ‘పచ్చ’ పోలీసు ఏకపక్షంగా వ్యవహరించిన తీరు ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ ఆయన పంథా ఇలాగే కొనసాగుతోంది. మామూళ్ల మత్తులో అక్రమార్కుల పట్ల ఆయన చూపుతున్న ‘విశ్వాసం’ పోలీసు శాఖ పరువును బజారున పడేస్తోంది. –సాక్షి ప్రతినిధి, అనంతపురం సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : నియోజకవర్గంలోని మట్కా డాన్ రషీద్తో పాటు క్రికెట్ బుకీలు దాడుల కంటే ముందుగానే అక్కడి నుంచి తప్పించుకుపోయారు. ప్రస్తుతం సదరు మట్కాడాన్ ఏకంగా గోవాలో మకాం వేశారు. పోలీసు శాఖ ఎంతో గోప్యంగా దాడులకు ప్లాన్ చేస్తున్నా.. సమాచారం అసాంఘిక శక్తులకు ముందుగానే చేరిపోతోంది. ఈ వ్యవహారంలో ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మట్కా డాన్లు.. క్రికెట్ బుకీలు.. అసాంఘిక శక్తులకు ఆయనో సమాచార కేంద్రం. పోలీసు శాఖ ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిపై దాడులు చేస్తుందో ముందుగానే తెలుసుకోవడం, సంబంధిత వ్యక్తులకు చేరవేసి తన పబ్బం గడుపుకోవడం గత కొంతకాలంగా జరిగిపోతోంది. మట్కా.. పేకాట.. బెట్టింగ్.. ఇతరత్రాలను సమూలంగా అరికట్టేందుకు జిల్లా పోలీసు బాస్ వాటి మూలాల్లోకి వెళుతున్నా, ప్రధాన నిర్వాహకులు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెనుక సొంత శాఖలోనే ఓ లీకు వీరుడు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మరీ దాడుల సమాచారం చేరవేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా.. తాడిపత్రి నియోజకవర్గంలోని మట్కా డాన్ రషీద్తో పాటు క్రికెట్ బుకీలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగలిగారని పోలీసు శాఖలోనే చర్చ జరుగుతోంది. గతంలో జిల్లావ్యాప్తంగా ఉన్న మట్కాడాన్లతో పాటు క్రికెట్ బుకీలు, గ్యాంబ్లర్ల భరతం పట్టేందుకు జిల్లా ఎస్పీ సత్యయేసు బాబు సిద్ధమయ్యారు. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మట్కాడాన్లు, క్రికెట్బుకీల జాబితాను పోలీసు ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లోని కీలకమైన అధికారులకు మాత్రమే ఈ సమాచారం ఉంది. సదరు వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు? ఏ విధంగా పట్టుకోవాలనే పక్కా ప్లాన్ను కూడా అధికారులు వేసుకున్నారు. సిద్ధం చేసిన జాబితాలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సదరు సమాచారాన్ని పోలీసు శాఖలోని ఓ లీకు వీరుడు నేరుగా ఆ మాజీ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి చేరవేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందువల్లే అక్రమార్కులు తప్పించుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నట్టు సమాచారం. పలు ఫిర్యాదులు.. వాస్తవానికి ముందస్తుగా సమాచారాన్ని లీకు చేసిన ఆరోపణలను ప్రధానంగా ఒక పోలీసు అధికారి ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా సదరు పోలీసు అధికారిపై గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అప్పట్లో పూర్తిగా అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరించారని కూడా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూడా అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరించి ప్రతీ సమాచారాన్ని చేరవేయడమే కాకుండా.. పార్టీ మారేందుకు ఎవరెవరు సిద్ధమవుతున్నారు? వారిని జారుకోకుండా చూసుకోవాలని కూడా సూచనలు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇలా పట్టుబడకుండా ఉన్న మట్కాడాన్ ప్రధానంగా గోవాలో మకాం వేయడంతో పాటు అప్పుడప్పుడూ తాడిపత్రికి కూడా వచ్చిపోతున్నారనే సమాచారం కూడా పోలీసుల వద్ద ఉంది. అయినప్పటికీ పట్టుకునేందుకు ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
పోలీసులకు సవాల్ విసిరిన పేకాట రాయుళ్లు..
మా భర్తలు ఉదయాన్నే పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ఎప్పుడో అర్ధరాత్రి వస్తున్నారు. 24 గంటలూ క్లబ్బుల్లోనే ఉండి మద్యం సేవిస్తూ.. పేకాటలోనే నిమగ్నమవుతున్నారు. ఉన్న ఆస్తులను తగలేస్తున్నారు. ఇంటి వ్యవహారాలు అసలు పట్టించుకోవడం లేదు. అత్యవసరమై ఫోన్ చేసినా స్పందించడం లేదు. పేకాట స్థావరాలను మూయించండి. – ఇదీ ఇటీవల కొందరు మహిళలు జిల్లా పోలీసు అధికారులకు ఫోన్ చేసి వెళ్లబోసుకున్న గోడు సాక్షి, పాలకొల్లు సెంట్రల్/భీమవరం: క్లబ్లు, టౌన్హాళ్లలోని పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో జూదరులు రూటుమార్చారు. పేరొందిన హోటళ్లు, ధనికులు నివాసముండే ప్రాంతాలను ఎంచుకుని జోరుగా పేకాట శిబిరాలు సాగిస్తున్నారు. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల తదితర ప్రాంతాల్లో యూత్క్లబ్లు, కాస్మోక్లబ్లు, టౌన్హాళ్లు ఉన్నాయి. వీటిలో ఎంతోకాలంగా పేకాట ఆడడం సహజంగా మారిపోయింది. ఎస్పీగా నవదీప్సింగ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో క్లబ్లపై దృష్టిసారించారు. దీంతో ఉద్యోగ విరమణ చేసిన వారు, కొంతమంది రాజకీయ నాయకులు, ధనికులు పెద్ద మొత్తంలో పేకాట ఆడే క్లబ్లు కొన్ని నెలలుగా దాదాపు మూతపడ్డాయి. పోలీసులు నిత్యం దాడులు చేస్తూ పేకాటను దాదాపుగా అరికట్టారనే చెప్పాలి. అయితే పేకాట ఆడడమే నిత్యకృత్యంగా మారిన వారు దానిని మానలేక కొత్తకొత్త స్థావరాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. కొంతకాలం పొరుగు రాష్ట్రాలకు వెళ్లినా.. పోలీసుల దాడులతో బెంబేలెత్తిన జూదరులు కొంతకాలం యానాం, ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి పేకాట ఆడినా.. ఇటీవల మళ్లీ రూటు మార్చి జిల్లాలోని పట్టణాల్లోనే ప్రత్యేక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. భీమవరం పట్టణంలో పేరొందిన హోటళ్లు, లాడ్జిల్లోనే పెద్ద ఎత్తున జూదం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ హోటళ్లలో అయితే పోలీసు దాడులుండవనే భావనతోనే వీటిని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ సమాచారం మేరకు ఇటీవల భీమవరంలోని పలు హోటళ్లల్లో పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చేసి వారినుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా అనేక చోట్ల పేకాట స్థావరాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. అలాగే ధనికులు నివాసం ఉండే ప్రాంతాల్లోని ఖాళీగా ఉన్న విశాలమైన గృహాలను ఆఫీసు కార్యకలపాలంటూ అద్దెకు తీసుకుని వాటిలో గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్నట్టు సమాచారం. పట్టుబడుతున్నది యువకులే! పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్నది అధికంగా యువకులేనని పోలీసులు చెబుతున్నారు. బడాబాబులూ పట్టుబడుతున్నా.. వారిని పోలీసులు తప్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసు సిబ్బంది జూదరులకు సహకరిస్తూ దాడుల్లో జరిగే అవకాశం ఉంటే ముందుగా వారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. పోలీసు శాఖ మరింత పకడ్బందీగా ముందుకెళ్తే పేకాటను పూర్తిగా అరికట్టవచ్చని, అయితే స్థానిక పోలీసు సిబ్బందితో కాకుండా పొరుగు స్టేషన్ల సిబ్బందితో దాడులు చేయిస్తే ప్రయోజనం ఉంటుందనే వాదన వినబడుతోంది. పాలకొల్లులో పోలీసులకే సవాల్! పాలకొల్లు టౌన్ హాలులో మంగళవారం పోలీసులు దాడి చేసి 16 మంది జూదరులను అరెస్ట్ చేశారు. గతంలో చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసినా క్లబ్ సభ్యులు వినకపోవడంతో ఆఖరికి పోలీసులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. దాడి చేసిన సమయంలో కొందరు జూదరులు గోడ దూకి పారిపోయారు. కొందరు పోలీసులను చూసినా కోతాట ఆడుతూనే ఉన్నారు. క్లబ్ సభ్యులు కొందరు తమకు కోర్టు అనుమతి ఉంది.. ఆడే దమ్ముంది.. మీకు ఆపే దమ్ముంటే ఆపుకోవచ్చని పోలీసులకు సవాల్ విసిరినట్టు సమాచారం. ఈ విషయం ఎస్పీ నవదీప్సింగ్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. టౌన్ హాలు వద్ద బుధవారం కూడా భారీగా పోలీసులను మోహరించారు. బుధవారం సాయంత్రం కొందరు సభ్యులు టౌన్హాల్ వద్దకు కార్లలో రావడంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేకించి కార్లలో ఇక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకుంటామని, వారు సరైన వివరాలు ఇస్తే వారి అడ్రస్లు తీసుకుని విడుదల చేస్తామని సీఐ ఆంజనేయులు తెలిపారు. కాయిన్లతో ఆట జిల్లాలోని క్లబ్బుల్లో నగదు ప్రత్యక్షంగా టేబుల్పై పెట్టకుండా అక్కడ ఉండే కౌంటర్లలో నగదు చెల్లించి దానికి సరిపడా కాయిన్లు తీసుకుంటారు. వాటితోనే ఆట కొనసాగిస్తారు. -
పోలీసుల నుంచి పారిపోతూ..
లక్నో: పోలీసుల నుంచి పారిపోతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం చిత్రాకోట్ జిల్లాలో గురువారం జరిగింది. పేకాటాడుతున్న శిబిరంపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో భయంతో యువకులు పరిగెత్తారు. ఇందులో భోలా(19) అనే యువకుడు గందరగోళంలో పక్కనున్న బావిలో పడిపోయాడు. బాధితుడిని బావిలో నుంచి తీసి స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. భోలా శరీరంపై గాయాలు ఉన్నాయని, అతన్ని తోటి స్నేహితులే బాగా కొట్టారని బోలా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement