ఆకస్మిక దాడులు.. 6.5 కోట్ల నగదు పట్టివేత | crore rupees and gold recoverd in delhi new delhi | Sakshi
Sakshi News home page

ఆకస్మిక దాడులు.. 6.5 కోట్ల నగదు పట్టివేత

Oct 16 2016 10:10 PM | Updated on Sep 4 2017 5:25 PM

ఆకస్మిక దాడులు.. 6.5 కోట్ల నగదు పట్టివేత

ఆకస్మిక దాడులు.. 6.5 కోట్ల నగదు పట్టివేత

దేశ రాజధాని ఢిల్లీలో భారీగా హవాలా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీగా హవాలా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు వారి వద్ద నుంచి రూ.6.5 కోట్ల నగదుతో పాటు 21 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

తమకు అందిన సమాచారం మేరకు.. హవాలా నిర్వహించి మోసాలకు పాల్పడుతున్న స్థావరాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు ఓ అధికారి తెలిపారు. హవాలా గ్యాంగులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement