జిల్లాలో ఎక్కడో ఒకచోట పేకాట శిబిరాలు వెలుస్తూనే ఉన్నాయి. పోలీసుల కంటపడకుండా ఇలాంటి శిబిరాలను యదేచ్ఛగా కొనసాగుతున్నాయి.
గుంటూరు: జిల్లాలో ఎక్కడో ఒకచోట పేకాట శిబిరాలు వెలుస్తూనే ఉన్నాయి. పోలీసుల కంటపడకుండా ఇలాంటి శిబిరాలను యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని తిప్పలవారిపాలెం మండలం సత్యనారాయణపురంలో పేకాట శిబిరాలపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురిని పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 1.69లక్షల రూపాయల నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.