మహబూబ్నగర్ జిల్లా మాగనూర్ మండల పరిధిలోగల మారుతీనగర్లో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి, 8మందిని అదుపులోకి తీసుకున్నారు.
మాగనూర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్ జిల్లా మాగనూర్ మండల పరిధిలోగల మారుతీనగర్లో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి, 8మందిని అదుపులోకి తీసుకున్నారు.
మారుతీ నగర్లోని బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారని సమాచారంతో మంగళవారం వేకువజామున ఎస్.ఐ. ఫరాద్ హుసేన్ తన సిబ్బందితో దాడి చేశారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.32, 440 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.