
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఒక ఐలాండ్లో జరిగే జూదం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. కేఎస్కే చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రశాంతి చారులింగ హీరోయిన్గా, రాకింగ్ రాకేశ్ ముఖ్యపాత్రలో నటించారు. సునీత, రాజ్కుమార్ బృందావనం నిర్మించారు. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ చూస్తే కథలో అనేక థ్రిల్లింగ్ అంశాలతో పాటు ట్విస్ట్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.