MAD Movie
-
మ్యాడ్ సినిమాతో ఫేమ్.. నటుడిపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు!
నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు రవి ఆంథోని. ఈ పేరు మ్యాడ్ మూవీతో ఫేమస్ అయినా మ్యాడ్ స్క్వేర్తో మరోసారి మార్మోగిపోయింది. టాలెంట్ ఉంటే సినీ ప్రేక్షకులు ఎంత దూరమైనా ఒక నటుడిని తీసుకెళ్లగలరు అని మరోసారి రుజువు చేశారు.ఆంథోనీ అసలు పేరు రవి ఆంథోనీ. స్క్రీన్ నేమ్ ఆంథోనీగా అందరికి సుపరిచితుడు. తన కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్తోనే ఆడియన్స్ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇటీవల జరిగిన మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆంథోనీ నటనకి ఫిదా అయ్యానని తెలిపారు. అతని నటనకి మంచి భవిష్యత్తు కూడా ఉందని అన్నారు. ప్రస్తుతం ఆంథోనీ పలు సినిమాల్లో నటిస్తూ.. మరిన్ని ప్రాజెక్టులు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. -
సిద్దు నేను బెస్ట్ ఫ్రెండ్.. వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే..
-
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే హిట్ అయిన కథలకు కొనసాగింపుగా రెండు లేదా మూడు భాగాలుగా సినిమా తీయడానికి, అదేవిధంగా ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. పైగా సీక్వెల్స్ చిత్రాలకు అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో ఫుల్ క్రేజ్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఫుల్గా ఉంటున్నాయి.దీంతో సీక్వెల్స్ తీయడానికి దర్శక–నిర్మాతలు, హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా సై అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు మూడో భాగంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా, మరికొన్ని చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అదే విధంగా ఇంకొన్ని సినిమాలకు మూడో భాగం ఉంటుందని ప్రకటించారు మేకర్స్. ‘ట్రిపుల్ ట్రీట్’ అంటూ ముచ్చటగా మూడో భాగంతో రానున్న ఆ సీక్వెల్స్ విశేషాలేంటో చూద్దాం. పుష్పరాజ్... తగ్గేదే లే హీరో అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్లది హిట్ కాంబినేషన్ . వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఆర్య’ (2004) సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం సాధించింది. దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై పాన్ ఇండియా హిట్గా నిలిచింది. పుష్పరాజ్గా తన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్గా ఇదే కాంబోలో వచ్చిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు తారస్థాయిలో ఉండేవి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటూ బ్లాక్బస్టర్ అందుకుంది ‘పుష్ప 2: ది రూల్’. 2024 డిసెంబరు 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఈ సీక్వెల్లో మూడో భాగం ఉంటుందని ‘పుష్ప 2: ది రూల్’ ప్రమోషన్స్లో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.మూడో భాగానికి ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్ని కూడా ఖరారు చేశారనే వార్తలు వినిపించాయి. అదేవిధంగా అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలకు సీక్వెల్గా ‘ఆర్య 3’ మూవీ ఉంటుందట. ఈ విషయాన్ని కూడా సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకులు త్రివిక్రమ్, అట్లీ సినిమాలు కమిట్ అయ్యారు. ఆ రెండు సినిమాల తర్వాతే సుకుమార్ కాంబినేషన్లో మూవీ ఉంటుందని ఊహించవచ్చు. మరి ‘పుష్ప’ మూడో భాగం, ‘ఆర్య 3’.. ఈ రెండిట్లో ఏది ముందుగా సెట్స్పైకి వెళుతుందనేది తెలియాలంటే చాలా సమయం పట్టవచ్చని ఫిల్మ్నగర్ టాక్. అర్జున్ సర్కార్ వస్తున్నాడు‘క్రిమినల్స్ ఉంటే భూమ్మీద పదడుగుల సెల్లో ఉండాలి... లేకుంటే భూమిలో ఆరడుగుల గుంతలో ఉండాలి’, ‘జనాల మధ్య ఉంటే అర్జున్... మృగాల మధ్య ఉంటే సర్కార్’ అంటున్నారు నాని (Nani). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్: ది సెకండ్ కేస్’ (2022) వంటి హిట్ చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను (Sailesh Kolanu) మూడో భాగాన్ని కూడా తెరకెక్కించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమాపై నిర్మించిన నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించడం విశేషం. ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్ ప్రొడక్షన్స్తో కలిసి వాల్పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్గా నాని కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో తొలి, మలి భాగాల్లానే మూడో భాగంతోనూ హ్యాట్రిక్ హిట్ అందుకుంటామనే బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. కాగా ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం ఏడు భాగాలు ఉంటాయని డైరెక్టర్ శైలేష్ కొలను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నాలుగురెట్ల నవ్వులు హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)లది సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా ఈ జనవరి 14న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. దాదాపు రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి వెంకటేశ్ కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2019 జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 2’ కాంబినేషన్లోనే ఆ మూవీకి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి విజయం సాధించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన తొలి, ద్వితీయ భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్–4’ మూవీ ఉంటుందని ‘ఎఫ్ 3’ చిత్రం ఎండింగ్లో ప్రకటించారు మేకర్స్. అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. కానీ, ఈ గ్యాప్లో వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అందుకుంది.ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్కి వెళ్లే అవకాశాలున్నాయని ఫిల్మ్నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’లతో పోలిస్తే ‘ఎఫ్ –4’లో నవ్వులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్తో పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని సమాచారం. మరి... ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వేచి చూడాలి. ఓదెల 3 హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజ ద్వితీయ భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి.మధు నిర్మించిన ఈ మూవీ గురువారం (ఏప్రిల్ 17న) విడుదలైంది. తొలిసారి నాగసాధువు భైరవి పాత్రలో తమన్నా నటించారు. ప్రేతాత్మ తిరుపతిగా వశిష్ఠ నటించారు. ఈ మూవీలో తమన్నా నటన హైలైట్గా నిలిచింది. ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఓటీటీలో విడుదలైనా మంచి హిట్గా నిలవడంతో ‘ఓదెల 2’పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది. కాగా ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ఓదెల 3’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించడం విశేషం.తొలి, మలి భాగాలకు మించి... హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన ‘కార్తికేయ 2’ 2022 ఆగస్టు 13న విడుదలై పాన్ ఇండియా హిట్ అందుకుంది. అంతేకాదు... రూ. 100కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం విశేషం. ఈ కోవలోనే ‘కార్తికేయ 3’ ఉంటుందని దర్శకుడు చందు మొండేటి, నిఖిల్ సిద్ధార్థ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో ‘కార్తికేయ 3’పై అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, క్రేజ్ నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ మూవీ తొలి, ద్వితీయ భాగాలకు మించి అద్భుతంగా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. నాగచైతన్య హీరోగా ‘తండేల్’ సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్న చందు మొండేటి ప్రస్తుతం ‘కార్తికేయ 3’కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్పై పని చేస్తున్నారు. అదేవిధంగా నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమా చేస్తున్నారు. మరి ‘కార్తికేయ 3’ పట్టాలెక్కే సమయం ఎప్పుడు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. టిల్లు క్యూబ్‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాలతో ప్రేక్షకులను తనదైన యాటిట్యూడ్, మేనరిజమ్తో నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ ఫ్రాంచైజీలో రూపొందనున్న మూడో చిత్రం ‘టిల్లు క్యూబ్’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్గా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. 2024 మార్చి 29న రిలీజైన ఈ మూవీ తొలి భాగం మంచి హిట్గా నిలిచింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ రూ.వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్నట్లు యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి తొలి, మలి భాగాలకు దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ, మల్లిక్ రామ్ కాకుండా కల్యాణ్ శంకర్(మ్యాడ్ ఫేమ్) దర్శకత్వం వహించనుండటం విశేషం. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు... ‘టిల్లు క్యూబ్’లో హీరో పాత్రను సూపర్ హీరోగా చూపించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘టిల్లు క్యూబ్’ చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి. మూడో పొలిమేరలో... ‘సత్యం’ రాజేశ్ కీలక పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు మంచి విజయం సాధించాయి. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో 'పొలిమేర 3’ (Polimera 3 Movie) రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తొలి, మలి భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు. చిత్రయూనిట్ విడుదల చేసిన ‘పొలిమేర 3’ వీడియో గ్లింప్స్ చూస్తే మొదటి, ద్వితీయ భాగంతో పోలిస్తే ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు మరిన్ని ఉంటాయని తెలుస్తోంది.మూడోసారి మత్తు వదలరా... ‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ చిత్రాల ఫ్రాంచైజీలో రూపొందనున్న చిత్రం ‘మత్తు వదలరా 3’. శ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో విడుదలై హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. తొలి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రానా రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 13న విడుదలై హిట్గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్రయూనిట్. అయితే వెంటనే షూటింగ్ ఉండదని దర్శకుడు రితేష్ రానా ప్రకటించారు. మరి ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవ్వులు మూడింతలు సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం 2023 అక్టోబరు 6న రిలీజై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ‘మ్యాడ్’ కాంబినేషన్లోనే ఈ మూవీకి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. తొలి భాగం హిట్తో ద్వితీయ భాగంపై అంచనాలు నెలకొన్నాయి. ఈ మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్మీట్కి హీరో ఎన్టీఆర్ రావడం విశేషం. కాగా ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలకు సీక్వెల్గా ‘మ్యాడ్ 3’ కచ్చితంగా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లేందుకు సమయం పడుతుందని స్పష్టం చేశారు. పై సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా మూడో భాగం రానున్నాయి.చదవండి: నలుగురికిపైగా హీరోయిన్లు.. అందులో తమన్నా కూడా! -
'నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి'.. మ్యాడ్ స్క్వేర్ ఫుల్ సాంగ్ చూశారా?
ఇటీవల యూత్ను ఫుల్గా అలరించిన కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ కీలక పాత్రల్లో మెప్పించారు. గతంలో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ను అలరించింది.తాజాగా ఈ సినిమాలో క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. స్వాతిరెడ్డి అంటూ సాగే పాట ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్లో హీరోయిన్ రెబా మోనికా జాన్ తన డ్యాన్స్తో అదరగొట్టింది. ఈ పాటలో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ తమ స్టెప్పులతో అలరించారు. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. రిలీజ్కు ముందే క్రేజ్ దక్కించుకున్న ఈ సూపర్ హిట్ సాంగ్ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. -
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్.. పిల్లలతో టాలీవుడ్ నిర్మాత సెలబ్రేషన్స్
ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. గతంలో వచ్చిన మ్యాడ్కు సీక్వెల్గా డబుల్ మ్యాడ్నెస్తో ప్రేక్షకుల ముందుకొచ్చారుయ. ఈ చిత్రాన్ని కల్యాణ్ శంకర్ డైరెక్షన్లో తెరెకెక్కించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో గ్రాండ్గా సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. శిల్పాకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.అయితే తాజాగా మరోసారి మ్యాడ్ స్క్వేర్ సక్కెస్ను సెలబ్రేట్ చేసుకున్నారు టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర హారిక. హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీలో ఉన్న అనాథ పిల్లలతో కలిసి కేక్ను కట్ చేసింది. అక్కడే ఉన్న పిల్లలతో సరదాగా కాసేపు ముచ్చటించింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది.Producer #HarikaSuryadevara celebrated the success of #MadSquare with the Helping Hands community! Here are some beautiful moments from her visit. ✨#BlockbusterMaxxMadSquare in cinemas now! 🫶 pic.twitter.com/IxntxhsD4T— Sithara Entertainments (@SitharaEnts) April 9, 2025 -
అతను లేకపోతే మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యేది కాదేమో?: జూనియర్ ఎన్టీఆర్
మ్యాడ్ స్క్వేర్ మూవీతో మరో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కల్యాణ్ శంకర్. గతంలో వచ్చిన మ్యాడ్కు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ నిర్వహించింది. హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యాట్ టీమ్ను ఉద్దేశించిన ఎన్టీఆర్ మాట్లాడారు. మ్యాడ్ స్క్వేర్ టీమ్పై ప్రశంసలు కురిపించారు .జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నవ్వించడం అనేది ఒక పెద్ద వరం. అలా మనల్ని ఎప్పుడు నవ్వించడానికి మనకు కల్యాణ్ శంకర్ దొరికాడు. దర్శకుడికి నచ్చినట్లుగా మీరు చేయడం కూడా గొప్ప వరం. ఈ సినిమాలో లడ్డు(విష్ణు) లేకపోతే హిట్ అయ్యేది కాదేమో. అతను ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు. కానీ సినిమాలో అలా చేశాడు. సంగీత్ శోభన్ను చూసి ఆయన కుటుంబం అంతా గర్వపడుతున్నారు. రామ్ నితిన్.. నేను ఎలా ఉండేవాన్నో అలానే ఉన్నారు. కెమెరా ముందు నిలబడటం అంతా ఈజీ కాదు. కామెడీని పండించడం చాలా కష్టమైన పని. రామ్ నితిన్ నీకు మంచి భవిష్యత్తు ఉంది' అని అన్నారు.బామర్ది నార్నే నితిన్ గురించి మాట్లాడుతూ..'2011లో నాకు పెళ్లైంది. అప్పుడు నార్నే నితిన్ చిన్న పిల్లవాడు. మొదట నాతో మాట్లాడేవాడు కాదు. వీడు ధైర్యం చేసి మొట్టమొదటిసారి చెప్పిన మాట బావ నేను యాక్టర్ అవుతానని. అంతే ధైర్యంగా నీ సావు నువ్వు చావు.. నా సపోర్ట్ అయితే నీకు ఉండదు అని చెప్పా. ఆ తర్వాత అతని కెరీర్పై నాకు భయం ఉండేది. నాకు ఏమి చెప్పొద్దు అనేవాడిని. ఏరోజు నన్ను ఏది అడగలేదు. ఈ రోజు తనను చూసి చాలా గర్వంగా ఉంది. మంచి దర్శకులు, నిర్మాతలతో పనిచేశాడు. కచ్చితంగా వారిని గుర్తు పెట్టుకో. నిన్ను నువ్వు నమ్ముకో. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంటికెళ్లాక మరోసారి నీతో మాట్లాడతా.' అంటూ సరదాగా మాట్లాడారు. -
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఆయన డైరెక్టరా? డ్యాన్స్ మాస్టరా?
ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ సారి డబుల్ మ్యాడ్నెస్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతంలో వచ్చిన మ్యాడ్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించారు.ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో ఈ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తనలోని మరో టాలెంట్ను బయటపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాయిరే నాయిరే అనే సాంగ్కు డ్యాన్స్తో అదరగొట్టారు. వేదికపై స్టెప్పులు వేస్తూ అభిమానులను ఊర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Director #KalyanShankar sets the stage on fire with #JrNTR's 'Nairey Nairey'. pic.twitter.com/mixonqAiR7— Suresh PRO (@SureshPRO_) April 4, 2025 -
'మ్యాడ్ స్క్వేర్'కి భారీ వసూళ్లు ఎందుకు వస్తున్నాయంటే..: నాగవంశీ
‘మ్యాడ్ స్క్వేర్ విడుదలకు ముందే.. కథ, లాజిక్స్ ని పక్కన పెట్టి ఈ సినిమాని చూడమని మేము కోరాం. ప్రేక్షకులు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, కేవలం నవ్వుకోవడానికి ఈ సినిమాని చూస్తున్నారు. అందుకే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయి’ అని అన్నారు నిర్మాత నాగవంశీ. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రూ.69.4 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినిమా భారీ విజయం సాధించడంతో నాగవంశీ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..సినిమా విడుదలైన నాలుగైదు రోజుల్లోనే మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాల బాట పట్టడం సంతోషంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లను దృష్టిలో ఉంచుకొని, మొదటి వారాంతం కొన్ని చోట్ల టికెట్ ధరలను పెంచడం జరిగింది. మొదటి వారాంతం వచ్చిన వసూళ్లతో అందరూ సంతోషంగా ఉన్నాం. అందుకే ఈరోజు అన్ని చోట్లా సాధారణ టికెట్ ధరలతోనే సినిమాని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి, కుటుంబ ప్రేక్షకులు మరింత మంది మా సినిమాని చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.సీక్వెల్ హైప్ తో ఆడటానికి ఇది పెద్ద హీరో సినిమా కాదు, భారీ బడ్జెట్ సినిమా కాదు. అయినా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. దానికి కారణం వినోదం. మేము స్వయంగా థియేటర్లకు వెళ్లి చూశాము. ప్రేక్షకులు సినిమా చూస్తూ, ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.సెకండ్ హాఫ్ డల్ అయిందని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ, నిజానికి ప్రేక్షకులు సెకండ్ హాఫ్ నే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. సునీల్ గారి ట్రాక్ అందరికీ బాగా నచ్చింది.ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఎలాగైతే మూడు నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిందో.. మ్యాడ్ స్క్వేర్ కూడా నాలుగు రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.రివ్యూ అనేది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నచ్చితే నచ్చిందని రాస్తారు, లేదంటే నచ్చలేదని రాస్తారు. అందులో తప్పు లేదు. అలా నిజాయితీగా ఇచ్చే రివ్యూలను మేము స్వాగతిస్తాము. కానీ, కొందరు సినిమాని చంపేయాలనే ఉద్దేశంతో.. రివ్యూ రాసి ఊరుకోకుండా, అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది తప్పు. సినిమా బతికితేనే, అందరం బాగుంటాం అనే విషయాన్ని గ్రహించాలి. -
సెన్సార్ పూర్తి చేసుకున్న మ్యాడ్ స్క్వేర్.. ఇక థియేటర్లలో నవ్వులే!
గతంలో బాక్సాఫీస్ వద్ద యూత్ను అలరించిన సినిమా మ్యాడ్. ఈ సినిమాకు సీక్వెల్గా వస్తోన్న మ్యాడ్ స్క్వేర్తో మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మన యంగ్ హీరోలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్. ఈ చిత్రాన్ని కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే మ్యాడ్ మూవీ మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. మ్యాడ్ స్క్వేర్ సెన్సార్ పూర్తయినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ సినిమా మార్చి 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.Manaki yedi thinnaga jaragavu gaa…Idhi anthe …Mission Censor: Completed ☑️#MADSquare certified U/A for a fun packed theatrical ride ❤️Theatres lo kooda anni light lu velige entertainment tho siddam 😎In cinemas worldwide from MARCH 28th! 🥳@NarneNithiin… pic.twitter.com/HRDODIX4ib— Sithara Entertainments (@SitharaEnts) March 24, 2025 -
జాన్వీ కపూర్ ఫాదర్తో ఎవరైనా పెట్టుకుంటారా?.. నిర్మాత నాగవంశీ కామెంట్స్
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ మూవీని 2023లో వచ్చిన మ్యాడ్కు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే థియేటర్లలో కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే వచ్చార్రోయ్.. మళ్లొచ్చార్రోయ్ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రనిర్మాత సూర్య దేవర నాగవంశీ, డైరెక్టర్ కల్యాణ్ శంకర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరిని సంగీత్ శోభన్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. వీరి మధ్య జరిదిన సరదా సంభాషణలో బోనీకపూర్ అంశం తెరపైకి వచ్చింది. బోనీ కపూర్తో జరిగిన డిబేట్లో ఆయనను కొంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడారని వార్తలొచ్చాయి. ఇంతకీ అక్కడ అసలేం జరిగిందని సంగీత్ శోభన్ ప్రశ్నించారు.దీనిపై నాగవంశీ స్పందిస్తూ..'అసలు అక్కడ ఏం జరిగిందనేది పక్కన పెడితే.. జాన్వీ కపూర్ లాంటి అమ్మాయికి ఫాదర్ ఆయన. అలాంటి వ్యక్తితో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా? అలాంటి వ్యక్తిని ఎవరైనా డిస్రెస్పెర్ట్ చేస్తారా? అది కూడా ఆలోచించకుండా నేను బోనీ కపూర్ను గౌరవించలేదని అంటున్నారు' అంటూ సరదాగా సమాధానమిచ్చారు.కాగా.. ముంబయిలో జరిగిన నిర్మాతల డిబేట్లో బాలీవుడ్, దక్షిణాది సినిమాల విషయంలో గతంలో నాగవంశీ మాట్లాడారు. నిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. అయితే నాగవంశీ వ్యాఖ్యలను బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఖండించారు. -
'వచ్చార్రోయి.. మళ్లొచ్చార్రోయ్..వీళ్లకు హారతి పట్టండ్రోయ్'
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు వచ్చేస్తున్నారు. గతంలో మ్యాడ్ మూవీతో ప్రేక్షకులకు మ్యాడ్నెస్ తెప్పించిన వీళ్లు.. మరోసారి అంతకుమించి ట్రీట్ ఇవ్వనున్నారు. ఈ సినిమాకు కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ను తెరకెక్కించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం యూత్పుల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఈ నెలలోనే థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు.(ఇది చదవండి: రెట్టింపు వినోదంతో 'మ్యాడ్2' టీజర్)ఇప్పటికే 'మ్యాడ్ స్క్వేర్' నుంచి విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు కూడా ఆడియన్స్ను ఊపేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో సాంగ్ 'వచ్చార్రోయ్' ఆడియన్స్కు మరింత గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో తనదైన ప్రత్యేక శైలి సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. "ఏసుకోండ్రా మీమ్స్.. చేసుకోండ్రా రీల్స్.. రాసుకోండ్రా హెడ్ లైన్స్.. ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్" లాంటి లిరిక్స్తో అందరినీ అలరించేలా ఉంది.కాగా.. ఈ పాటకు కేవీ అనుదీప్ లిరిక్స్ అందించగా.. భీమ్స్ సిసిరోలియో ఆలపించారు. తాజాగా విడుదలైన సాంగ్ ప్రేక్షకులకు జోష్ తెప్పిస్తోంది. కాగా.. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానుంది. They are back to come and rock 😎🔥#Vaccharroi is out now to celebrate the arrival of the MAD TRIO ❤️🔥— https://t.co/563V9p6Z0GA double dose of Seetimaar madness and a euphoric experience awaits on the Big Screens 💥💥#MADSquare in cinemas worldwide from MARCH 28th! 🕺🥳… pic.twitter.com/75udzExUF9— Sithara Entertainments (@SitharaEnts) March 18, 2025 -
'మ్యాడ్ స్క్వేర్' డేట్ మారింది.. కొత్త తేదీ ఇదే
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో ఫన్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్లో కామెడీ పంచులు ఆడియన్స్కు నవ్వులు తెప్పిస్తున్నాయి. గతంలో విడుదలైన అభిమానులను అలరించిన మ్యాడ్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చిలోనే రిలీజ్ కానుంది.అయితే టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు. మొదట అనుకున్న తేదీలో మ్యాడ్ స్క్వేర్ విడుదల కావడం లేదని వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 29న రిలీజ్ చేయడం లేదని తెలిపారు. ఆ రోజు అమావాస్య ఉన్నందున ఒక రోజు ముందుగానే మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే అదే రోజు నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్హుడ్ కూడా విడుదల కానుందని నాగవంశీ తెలిపారు. రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుములకు నాగవంశీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.లాజిక్స్ వెతకొద్దు..కాగా.. ఇటీవల మ్యాడ్ స్క్వేర్ మూవీపై ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. మ్యాడ్-2 చిత్రం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యాడ్లాగే ఇందులో కూడా ఎలాంటి కథ ఉండదని తెలిపారు. కేవలం రెండు గంటలు నవ్వుకోవడానికి థియేటర్లకు రండి అని విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్ చదువుకుని ఉద్యోగం చేయకూడదనుకున్న ముగ్గురు వెధవలు ఒక మంచోడిని వెధవను చేసే కథే మ్యాడ్ స్క్వేర్. ఈ సారి హైదరాబాద్లో చేసిన అరాచకాలు అయిపోయాయని.. స్టోరీని గోవాకు మార్చామని తెలిపారు. ఈ సినిమా అంతా ఫన్.. ఎలాంటి లాజిక్స్ వెతకొద్దు.. ముందే క్లియర్గా చెబుతున్నాని పేర్కొన్నారు. ఇది మిస్సయింది.. అది మిస్సయింది లాంటి అడొగద్దు.. నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్కు రండి అని నాగవంశీ టాలీవుడ్ అభిమానులకు సూచించారు. With the request and support of our esteemed distributors, #MADSquare is arriving a day earlier – March 28th. Since March 29th falls on Amavasya…Our distributors felt it was best to advance the release and we are happy to oblige.Apart from that, there was never any intention… pic.twitter.com/B78xeh64jM— Naga Vamsi (@vamsi84) March 2, 2025 -
‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
ముందే చెప్తున్నా.. మా సినిమాలో లాజిక్స్ వెతకొద్దు: నాగవంశీ
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో ఫన్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్. గతంలో విడుదలైన అభిమానులను అలరించిన మ్యాడ్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. మ్యాడ్-2 చిత్రం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యాడ్లాగే ఇందులో కూడా ఎలాంటి కథ ఉండదని తెలిపారు. కేవలం రెండు గంటలు నవ్వుకోవడానికి థియేటర్లకు రండి అని విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్ చదువుకుని ఉద్యోగం చేయకూడదనుకున్న ముగ్గురు వెధవలు ఒక మంచోడిని వెధవను చేసే కథే మ్యాడ్ స్క్వేర్. ఈ సారి హైదరాబాద్లో చేసిన అరాచకాలు అయిపోయాయని.. స్టోరీని గోవాకు మార్చామని అన్నారు. ఈ సినిమా అంతా ఫన్.. ఎలాంటి లాజిక్స్ వెతకొద్దు.. ముందే క్లియర్గా చెబుతున్నాని పేర్కొన్నారు. ఇది మిస్సయింది.. అది మిస్సయింది లాంటి అడొగద్దు.. నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్కు రండి అని నాగవంశీ టాలీవుడ్ అభిమానులకు సూచించారు.గతంలో వచ్చిన మ్యాడ్ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్గా 'మ్యాడ్ స్క్వేర్'ను మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు, టీజర్తో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. మ్యాడ్ సినిమా లాగే ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందును ఫ్యాన్స్కు అందించనున్నారు. టీజర్లో వారి అల్లరి, పంచ్ డైలాగ్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది. డైరెక్టర్లు మైక్ పట్టుకొని అతి వాగొద్దుఇందులో కథ లేదు లాజిక్ లేదు- Producer #NagaVamsi#MadSquare #TeluguFilmNagar pic.twitter.com/w9BYDaqWHj— Telugu FilmNagar (@telugufilmnagar) February 28, 2025 -
రెట్టింపు వినోదంతో 'మ్యాడ్2' టీజర్
బాక్సాఫీస్ వద్ద రెట్టింపు వినోదాన్ని 'మ్యాడ్2' సినిమాతో పంచేందుకు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ సిద్దంగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది. ఇదే కాంబినేషన్లోనే రూపొందిన హిట్ ఫిల్మ్ ‘మ్యాడ్ (2023)’కు సీక్వెల్గా ‘మ్యాడ్ స్క్వేర్’ పేరుతో రూపొందుతోంది. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానుంది.గతంలో వచ్చిన మ్యాడ్ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్గా 'మ్యాడ్ స్క్వేర్'ను మేకర్స్ ప్రకటించారు. సినీ అభిమానులంతా ఈ మూవీ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా 'మ్యాడ్ స్క్వేర్' నుంచి టీజర్ విడుదలైంది. మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ (లడ్డు).. 'మ్యాడ్ స్క్వేర్'లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. టీజర్లో వారి అల్లరి, పంచ్ డైలాగ్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. -
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ చూశారా..?
'మ్యాడ్ స్క్వేర్' సినిమా నుంచి యూత్ను ఆకట్టుకునే సాంగ్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' పేరుతో సీక్వెల్ రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. 'నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి' అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. మ్యాడ్ సినిమాతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు సీక్వెల్ను కూడా హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. -
తొలి సినిమాతోనే క్రేజ్.. ఇప్పుడు ఐటమ్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్
తెలుగులో తొలి సినిమాతోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. 'సామజవరగమన' సినిమా విడుదలైన తర్వాత ఒక్కసారిగా రెబా మోనికా జాన్ పేరు భారీగా పాపులర్ అయింది. అయితే, ఈ సినిమా తర్వాత ఆమె ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ, ఆమె తెలుగులో ఒక స్పెషల్ సాంగ్లో కనిపించనున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.నార్నె నితిన్,సంగీత్ శోభన్, రామ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. కల్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలో రెబా మోనికా జాన్ ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం విడుదలై సూపర్ హిట్ అందుకున్న మ్యాడ్ సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రం రానుంది. అందుకే ఈ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో భారీగా బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ ప్రాజెక్ట్లోకి రెబా మోనికా ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెబా మోనికా జాన్ కన్నడలో ఎక్కువ సినిమాలు చేసింది. ఆపై తెలుగులో 'సామజవరగమన' ఛాన్స్ కొట్టేసి ఇక్కడ అభిమానులను సొంతం చేసుకుంది. విజయ్ నటించిన విజిల్ సినిమాలో ఈ బ్యూటీ నటనకు చాలామంది ఫిదా అయ్యారు. అందులో యాసిడ్దాడి బాధితురాలిగా ఆమె కనిపించింది. View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) -
'మ్యాడ్ స్క్వేర్' నుంచి సాంగ్ విడుదల
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' పేరుతో సీక్వెల్ రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. 'లడ్డు గాని పెళ్లి' అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. మ్యాడ్ సినిమాతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు సీక్వెల్ను కూడా హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. -
మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్
డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్నిషేక్ చేసింది. చాలా రోజుల తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్కు ఓ సాలిడ్ హిట్ అదించాడు టిల్లుగాడు. ఇదే జోష్లో మరో హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించింది సితార ఎంటర్టైన్మెంట్స్. గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్టయిన చిత్రం ‘మ్యాడ్’చిత్రానికి సీక్వెల్గా ‘మ్యాడ్ స్వ్కేర్’ ని ప్రకటించారు. 'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకరే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె , ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. -
Rewind 2023: బడ్జెట్తో పనిలేని బంపర్ హిట్స్
ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్గా నిలిచిన స్మాల్ మూవీస్పై ఓ లుక్కేద్దాం. బలగం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బేబి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్టాక్తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మ్యాడ్ అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్(అక్టోబర్ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. -
ఓటీటీలో అదరగొడుతున్న మ్యాడ్.. బ్లాక్బస్టర్ జవాన్ను వెనక్కు నెట్టేసింది!
వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఓ పాన్ ఇండియా సినిమాకు ఓ చిన్న సినిమా గట్టి పోటీనిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో దక్షిణాది తారలే ఎక్కువగా కనిపిస్తారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీయే. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో నవంబర్ 2న రిలీజ్ అయింది. అప్పుడే ఓటీటీ రిలీజైన మ్యాడ్ ఓటీటీలోనూ అదరగొడుతున్న ఈ సినిమా నిత్యం నెట్ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్లో చోటు దక్కించుకుంటోంది. అయితే ఈ సినిమాకు ఝలక్ ఇస్తోంది చిన్న చిత్రం మ్యాడ్. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపీక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లో హిట్ అయిన ఈ చిత్రం నవంబర్ 3 నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది. అటు జవాన్, ఇటు మ్యాడ్ను ఓటీటీ ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. టాప్ 10 చిత్రాల్లో మ్యాడ్ ఏ స్థానంలో ఉందంటే? ఇండియాలో నెట్ఫ్లిక్స్లో ఎక్కువమంది చూస్తున్న టాప్ 10 చిత్రాల్లో జవాన్ హిందీ వర్షన్ తొలి స్థానంలో నిలబడి తన ఆధిక్యతను చాటుకుంటోంది. కానీ తమిళ, తెలుగు వర్షన్లను మాత్రం మ్యాడ్ మూవీ వెనక్కు నెట్టేసింది. ఎక్కువమంది చూస్తున్న సినిమాల్లో మ్యాడ్ రెండో స్థానంలో నిలబడింది. జవాన్ తమిళ వర్షన్ మూడో స్థానంలో, తెలుగు వర్షన్ నాలుగో స్థానంలో నిలిచాయి డ్రీమ్ గర్ల్ 2.. ఐదో స్థానంలో ఉంది. చంద్రముఖి 2 పదో స్థానంలో ఊగిసలాడుతోంది. ఇది ఆదివారం నాటి లెక్కలు.. ఇది చూసిన అభిమానులు ఒక చిన్న తెలుగు సినిమా.. భారీ బడ్జెట్ మూవీ జవాన్కు గట్టి పోటీనే ఇస్తుందే అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఆ ఇద్దరి కాళ్లు మొక్కిన మెగా ఇంటి కోడలు.. ఇంతకీ వాళ్లెవరో తెలుసా? -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 28 సినిమాలు రిలీజ్
చాలామంది వీకెండ్లో థియేటర్కు వెళ్లి సినిమా చూసి కాలక్షేపం చేస్తుంటారు. అయితే రోజుకో సినిమా చూడాలంటే మాత్రం ఓటీటీని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదనే చెప్పాలి. అటు ఒక వారంలో థియేటర్లో ఎన్ని సినిమాలు రిలీజవుతున్నాయో అంతకు మించిన చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్ల కంటెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. మరి ఈ శుక్రవారం (నవంబర్ 3న) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయో చూసేద్దాం.. అలాగే స్ట్రీమింగ్ అవుతోంది అని రాసి ఉన్న సినిమాలు ఈ రోజే ఓటీటీలోకి వచ్చాయని అర్థం. అమెజాన్ ప్రైమ్ వీడియో ► తకేశి క్యాటిల్ గేమ్ షో - స్ట్రీమింగ్ అవుతోంది ► ఇన్విజిబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► రత్తం - నవంబర్ 3 ► PI మీనా (హిందీ సిరీస్) - నవంబర్ 3 హాట్స్టార్ ► స్కంద - నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ► కాఫీ విత్ కరణ్ షో రెండో ఎపిసోడ్ -స్ట్రీమింగ్ అవుతోంది ► లోకి రెండో సీజన్, ఐదవ ఎపిసోడ్ - స్ట్రీమింగ్ అవుతోంది ► ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 నెట్ఫ్లిక్స్ ► జవాన్ - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఆల్ ద లైట్ వి కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఒనిముషా (జపనీస్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► యునికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► మ్యాడ్ - నవంబర్ 3 ► బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► డైలీ డోస్ ఆఫ్ సన్షైన్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 3 ► ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) - నవంబర్ 3 ► న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► సెల్లింగ్ సన్సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 3 ► ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - నవంబర్ 3 సోనీలివ్ ► స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 బుక్ మై షో ► హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబర్ 3 ► మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► ద థీఫ్ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబర్ 3 ఆపిల్ ప్లస్ టీవీ ► ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 జియో సినిమా ► టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 3 చదవండి: ప్రతిసారి వెధవ పని చేయడం అలవాటు.. అమర్పై రతికా ఫైర్! -
MAD OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మ్యాడ్’.. స్ట్రీమింగ్ ఎక్కడ,ఎప్పుడు?
చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన మూవీ ‘మ్యాడ్’. కాలేజీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్తవారే అయినప్పటికీ ప్రచార చిత్రాలతో తొలి నుంచే మ్యాడ్పై హైప్ క్రియేట్ అయింది. అక్టోబర్ 6న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం..అంచనాలకు తగ్గట్టే మంచి విజయం సాధించింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్..తాజాగా రిలీజ్ డేట్ని ప్రకటించింది. నవంబర్ 3 నుంచి ఈ చిత్రం నెట్ఫిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేస్తూ..‘మిమ్మలందర్ని పిచ్చెక్కించే ఒక శుభవార్త. మ్యాడ్ చిత్రం నవంబర్ 3 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని రాసుకొచ్చింది. ‘మ్యాడ్’ కథేంటి? మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు.ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్ ఇంట్రావర్ట్గా ఉంటాడు. మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు. అశోక్ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో MAD(మనోజ్, అశోక్, దామోదర్) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ. Mimmalnandarini picchekinche oka subhavaartha. MAD cinema 3rd November nunchi Netflix lo stream avabothundhi. #MADonNetflix pic.twitter.com/m5xKGH1vwj — Netflix India South (@Netflix_INSouth) October 30, 2023 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
ఈ మధ్య కాలంలో థియేటర్లలో సరైన సినిమాలు పడటం లేదు. పలువురు యంగ్ హీరోలు.. కొత్త మూవీస్తో వచ్చినా సరే అనుకున్నంత రేంజులో హిట్స్ అయితే కొట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోనే అందరి దృష్టి ఓటీటీలపై పడుతోంది. డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లో కొత్త మూవీస్ ఏం వస్తున్నాయా? వాటిని ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఓ తెలుగు కామెడీ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏ సినిమా? తెలుగులో కామెడీ సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో అలరించిన సందర్భాలు తక్కువ. అలా అక్టోబరు తొలివారంలో అంటే 6వ తేదీన థియేటర్లలోకి వచ్చిన 'మ్యాడ్' చిత్రం.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా నిలిచింది. కథ పరంగా కొత్తగా ఏం లేనప్పటికీ చూస్తున్నంతసేపు నవ్వుకునేలా చేసింది. హిట్ టాక్తో పాటు మంచి వసూళ్లు కూడా సాధించింది. ఇప్పుడీ సినిమానే ఓటీటీలోకి రాబోతుందట. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్) ఓటీటీలోకి ఎప్పుడు? 'మ్యాడ్' ఓటీటీ హక్కుల్ని.. థియేటర్లలో విడుదలకు ముందే నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఈ ఓటీటీలో చాలావరకు సినిమాలన్నీ నెలరోజుల్లోనే కాస్త అటుఇటుగా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు 'మ్యాడ్' చిత్రాన్ని కూడా నవంబరు 3న ఓటీటీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. సో అదన్నమాట విషయం. 'మ్యాడ్' కథేంటి? మనోజ్, అశోక్, దామోదర్ ముగ్గురు ఇంజినీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్. వీళ్ల ముగ్గురికి మూడు లవ్ స్టోరీలు. అయితే వీళ్లు ఫ్రెండ్స్గా కలిసిన విధానం, వాళ్లకు ఏర్పడ్డ ప్రేమలు, హాస్టల్లో ర్యాగింగ్ సీన్స్.. ఇలా అన్నీ సరదాగా సాగిపోతుంటుంది. మరి ఈ కథలో చివరకు ఏమైంది? అనేది స్టోరీ. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ‘మ్యాడ్’ చిత్ర బృందం (ఫొటోలు)
-
MAD Movie:'మ్యాడ్'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బాక్సాఫీస్ విన్నర్ దిశగా మ్యాడ్! ఏ ఓటీటీలోకి రానుందంటే?
సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్.. కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి.. లేదంటే పాతదైనా కొత్తగా చెప్పాలి, జనాలను సీట్లకు అతుక్కుపోయేలా చేయాలి. కథలో లీనమయ్యేలా చేయాలి. మరీ ముఖ్యంగా ఆడియన్స్కు వినోదాన్ని అందించాలే తప్ప ఎక్కడా విసుగు పుట్టించకూడదు. ఏమాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులు నిర్మొహమాటంగా సినిమా ఫ్లాప్.. కాదుకాదు, అట్టర్ఫ్లాప్ అని తేల్చి పడేస్తారు. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రేక్షకుల తీర్పులో మాత్రం తేడా ఉండదు! అక్టోబర్ 6న దాదాపు 10 దాకా సినిమాలు విడుదలయ్యాయి. పది సినిమాలు.. ఫలితం ఎలా ఉందంటే? వీటిలో రూల్స్ రంజన్, మామా మశ్చీంద్ర, మంత్ ఆఫ్ మధు, ఏందిరా ఈ పంచాయితీ, గన్స్ ట్రాన్స్ యాక్షన్, అభిరామచంద్ర, మ్యాడ్.. ఇలా స్ట్రయిట్ సినిమాలున్నాయి. అలాగే క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800, సిద్దార్థ్ చిన్నా, ఎక్సార్సిస్ట్ అనే డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. 800, చిన్నా చిత్రాలు బాగానే ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవలేదు. మరి ఏ సినిమాకు జనాలు జై కొడుతున్నారో తెలుసా? మ్యాడ్. జాతిరత్నాలు తరహాలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతోంది. కలెక్షన్స్ డబుల్.. ఈ మూవీలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక సనిల్ కుమార్, గోపిక ఉద్యన్, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. మ్యాడ్ తొలి రోజు రూ.1.8 కోట్లు రాబట్టగా రెండో రోజు ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించింది. దాదాపు రూ.3 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మ్యాడ్ మూవీకి రెండు రోజుల్లోనే రూ.4.7 కోట్లు వచ్చిపడ్డాయి. బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్న ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. MADness unleashed! 🔥 Day 2 > Day 1 🤩#MAD Grosses over 𝟒.𝟕 𝐂𝐑 in 2 Days! 🥳 Experience the MAD Entertainer of the Year at cinemas near you now! 🕺 🎟 - https://t.co/IrUWNwCYws@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin #SangeethShobhan… pic.twitter.com/Jc5GxNBY61 — Sithara Entertainments (@SitharaEnts) October 8, 2023 చదవండి: బిగ్బాస్ హౌస్లోకి అంజలి పవన్? వీడియోతో క్లారిటీ ఇచ్చిన నటి -
'మ్యాడ్' సినిమాలో కామెడీతో ఇచ్చిపడేశాడు.. ఈ కుర్రాడెవరో తెలుసా?
ఈ శుక్రవారం చిన్నాపెద్దా కలిపి 10 వరకు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. వాటిలో ఇంజినీరింగ్ కాలేజీ, హాస్టల్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీసిన 'MAD' మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. జూ.ఎన్టీఆర్ బావమరిది హీరోగా పరిచయమైన ఈ సినిమాలో ఓ కుర్రాడు.. తన యాక్టింగ్, కామెడీతో ఇచ్చిపడేశాడు. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇంతకీ ఎవరతడు? అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ కుర్రాడి పేరు సంగీత్ శోభన్. ప్రస్తుతం టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోగా చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ వాళ్ల తమ్ముడే ఇతడు. ప్రభాస్తో 'వర్షం' లాంటి హిట్ సినిమా తీసిన శోభన్.. సంగీత్ నాన్న. ఇలా ఇండస్ట్రీతో చిన్నప్పటి నుంచే సంబంధం ఉంది. అలా చైల్డ్ ఆర్టిస్టుగా 2011లోనే 'గోల్కోండ హైస్కూల్' సినిమాలో యాక్ట్ చేశాడు. అందులో బొద్దుగా ఉండేది ఇతడే. అప్పుడు బ్రేక్ తీసుకుని పదేళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) వెండితెరపై 'మ్యాడ్' ఫస్ట్ సినిమా అయినప్పటికీ.. మూడేళ్ల క్రితమే 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' అనే వెబ్ సిరీస్లో సహాయ పాత్ర చేశాడు. దీనితోపాటు త్రీ రోజెస్, పిట్ట కథలు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ లాంటి తెలుగు వెబ్ సిరీసుల్లోనూ భాగమయ్యాడు. అలా ఓటీటీల్లో అదరగొట్టిన సంగీత్.. 'మ్యాడ్'లో అవకాశం దక్కించుకున్నాడు. దామోదర్ (డీడీ) అనే బీటెక్ చదివే కుర్రాడి పాత్రలో ఇరగ్గొట్టేశాడని చెప్పొచ్చు. త్వరలో 'ప్రేమ విమానం' అనే డైరెక్ట్ ఓటీటీ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్న సంగీత్ శోభన్.. మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తే మాత్రం మరో జాతిరత్నం కావడం గ్యారంటీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలా కామెడీతో హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్త కష్టపడితే సంగీత్.. ఆ లిస్టులోకి చేరడం పెద్ద విషయమేమి కాకపోవచ్చు! (ఇదీ చదవండి: ‘మ్యాడ్’ మూవీ రివ్యూ) -
‘మ్యాడ్’ మూవీ రివ్యూ
టైటిల్: మ్యాడ్ నటీనటులు: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి తదితరులు నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్ సమర్పణ: ఎస్. నాగ వంశీ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ:మ్దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: అక్టోబర్ 06, 2023 కథేంటంటే.. ఓ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథ ఇది. వివిధ ప్రాంతాలకు చెందిన మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు. ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్ ఇంట్రావర్ట్గా ఉంటాడు. మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు. అశోక్ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో MAD(మనోజ్, అశోక్, దామోదర్) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కాలేజీ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఎప్పుడూ ఎంటర్టైనింగ్గానే ఉంటాయి. ప్రెండ్షిప్, ర్యాగింగ్, ప్రేమ.. ఈ మూడు అంశాల చుట్టే కథ తిరిగినప్పటీకి..వినోదంలో కొత్తదనం ఉంటే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. మ్యాడ్ కూడా అదే కాన్సెప్ట్తో తెరకెక్కింది. లాజిక్స్ని పక్కకి పెట్టి.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వరుస పంచ్ డైలాగ్స్తో వినోదభరితంగా కథ ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఈ కథలో కొత్తదనం వెతికితే ఏమి కనిపించదు. కానీ సన్నివేశాలుగా విభజించి చూస్తే..ప్రతీదీ ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. కాలేజీలో ర్యాగింగ్.. సీనియర్లతో గొడవలు.. ఓ విషయంలో అంతా ఏకమై పక్క కాలేజీ వాళ్లతో పోటీపడడం.. ఇవన్నీ హ్యాపీడేస్ నుంచి మొన్నటి హాస్టల్ డేస్ వరకు చూసినవే. కానీ మ్యాడ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే.. కామెడీ కొత్తగా ఉండడం. కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా.. ఆడియన్స్ నవ్వులో అవి కొట్టుకుపోతాయి. ఇలాంటి కథలకు స్క్రీన్ప్లే రాయడం చాలా కష్టం. పైగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన వారంతా కొత్తవాళ్లే. అయినా కూడా వారి నుంచి దర్శకుడు తనకు కావాల్సినంత నటనను రాబట్టుకున్నాడు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. లడ్డు అనే వ్యక్తి మ్యాడ్ గ్యాంగ్ గురించి ఓ స్టూడెంట్కు వివరిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత వారంతా కాలేజీలో చేసిన రచ్చ, ప్రేమ స్టోరీలు.. ర్యాగింగ్.. ఇలా సరదాగా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ కూడా ఫస్ డోస్ మరింత పెరుగుతుంది. వెన్నెల కోసం డీడీ తన టీమ్తో కలిసి లేడీస్ హాస్టల్కి వెళ్లి చేసే రచ్చ.. థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. వెన్నెల ఎవరై ఉంటారనే క్యూరియాసిటీని చివరకు కొనసాగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అయితే సినిమాలో కామెడీ వర్కౌట్ అయినంతగా ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. అలాగే నార్నే నితిన్ ని కోసం యాక్షన్ సీక్వెన్స్ కూడా కథకు అతికినట్లుగా అనిపించాయి. బూతు డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ నవ్వులు పంచడంలో మాత్రం ఈ ‘మ్యాడ్’ గ్యాంగ్ సక్సెస్ అయింది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించవారంతా కొత్తవాళ్లే. అయినా ఈ విషయం తెరపై ఎక్కడా కనిపించారు. డీడీ పాత్రలో నటించిన సంగీత్ శోభన్..తనదైన కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. అశోక్ గా నార్నే నితిన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు కానీ.. ఆ సీన్స్ కథకి అతికించినట్లుగా అనిపిస్తాయి. ఇక లవర్బాయ్ మనోజ్గా రామ్ నితిన్ చక్కగా నటించాడు. హీరోయిన్స్ శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. లడ్డు పాత్రలో ‘టాక్సీవాలా’ విష్ణు జీవించేశాడు. అమాయకత్వంతో ఆయన పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. అనుదీప్ ఒక సీన్లో కనిపించి వెళ్తాడు. కాలేజీ ప్రిన్సిపల్గా రఘుబాబు, అతని పీఏగా రచ్చ రవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. భీమ్స్ సిసిరోలియోసి పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచాయి. పాటలు కథలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజిశెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
MAD Movie Pre-Release Event: మ్యాడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన దుల్కర్ సల్మాన్, శ్రీలీల (ఫోటోలు)
-
MAD Movie Theatrical Trailer Launch: మ్యాడ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన జూ.ఎన్టీఆర్ (ఫోటోలు)
-
థియేటర్లలోకి ఒకేరోజు 10 సినిమాలు.. మీరేం చూస్తారు?
ఎలా చూసుకున్నా సరే థియేటర్లలో ప్రతి శుక్రవారం ఒకటి రెండు అదీ కాదంటే ఓ మూడు సినిమాల వరకు రిలీజ్ అవుతుంటాయి. అంతకు మించి వస్తే మాత్రం థియేటర్ల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతిదీ సమస్య అవుతుంది. కానీ అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా ఈ శుక్రవారం ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇంతకీ వాటి సంగతేంటి? (ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!) ప్రతివారం ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు వీటికి పోటీ ఇచ్చేలా థియేటర్లలో ఈ శుక్రవారం దాదాపు 10 వరకు కొత్త మూవీస్ విడుదల కాబోతున్నాయి. వీటిలో 'మ్యాడ్', 'రూల్స్ రంజన్', 'మామా మశ్చీంద్ర', 'మంత్ ఆఫ్ మధు', 'ఏందిరా ఈ పంచాయతీ', 'అభిరామచంద్ర', 'గన్స్ ట్రాన్స్ యాక్షన్' లాంటి స్ట్రెయిట్ సినిమాలు ఉన్నాయి. పైన చెప్పిన చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టమనుకుంటే 800, చిన్నా, ఎక్సార్సిస్ట్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే తేదీకి బిగ్ స్క్రీన్పైకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఈ మొత్తం లిస్టులో కాలేజీ కామెడీ ఎంటర్టైనర్ స్టోరీతో తీసిన 'మ్యాడ్' కాస్త ఆసక్తి కలిగిస్తుంది. మిగతా వాటిపై పెద్దగా బజ్ లేదు. అయితే వీటిలో ఏది హిట్ అవుతుందో ఏంటనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగితే సరిపోతుంది. ఇంతకీ వీటిలో మీ ఛాయిస్ ఏంటి? (ఇదీ చదవండి: సల్మాన్ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి) -
'మ్యాడ్' సినిమా.. థియేటర్లలో నవ్వుల హంగామా
జూ.ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'మ్యాడ్'. ఈ చిత్రంలో సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రధారులే. ఈ కామెడీ ఎంటర్టైనర్ అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన యాక్టర్స్ పలు ఆసక్తికర విషయాల్ని షేర్ చేసుకున్నారు. (ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!) ఈ సినిమాలో 'హ్యాపీ డేస్' వైబ్స్ కనిపిస్తున్నాయి కదా? అనే ప్రశ్నకు బదులిచ్చిన సంగీత్ శోభన్.. 'హ్యాపీడేస్' రిలీజై 15 ఏళ్లు దాటింది. అది అప్పటి యూత్ సినిమా. కానీ మా చిత్రంలోని కామెడీ ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ని ఎంజాయ్ చేసే ట్రెండ్ ఈ తరానిది. 'మ్యాడ్'లో ఈ తరహా కామెడీ ఉంటుంది. థియేటర్స్లో ఫుల్ నవ్వులు హంగామా ఉంటుంది. ఈ సినిమాని 'జాతిరత్నాలు'తో పోల్చుతున్నారనే విషయమై మాట్లాడిన యాక్టర్స్.. జాతిరత్నాలు చిత్రానికి కేవీ అనుదీప్, మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ సంయుక్తంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అలా ఆ పోలిక వచ్చింది. నాగవంశీ కూడా ఈ మూవీ జాతిరత్నాలు తరహాలోనే అందరూ చూసి హాయిగా నవ్వుకునేలా ఉంటుందని చెప్పారు. దీంతో అందరూ జాతిరత్నాలతో పోల్చారు. మ్యాడ్లో అనుదీప్ సరదా పాత్రలో నటించారు. దర్శకుడికి మంచి ఫ్రెండ్ కాబట్టి ఆ రోల్ చేశారు. ప్రేక్షకులను పిచ్చెక్కించే హాస్యం ఉన్నందున 'మ్యాడ్' అని పేరు పెట్టినట్లు రామ్ నితిన్ తెలిపారు. (ఇదీ చదవండి: సల్మాన్ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి) -
'వీళ్లలో చదువుకునే ఫేస్ ఒక్కటైనా ఉందా?'.. ఆసక్తిగా మ్యాడ్ ట్రైలర్!
సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియ రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్. ఈ చిత్రాన్ని కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్ వేదికగా మ్యాడ్ ట్రైలర్ను విడుదల చేశారు. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!) ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్ 'మ్యాడ్ వెబ్ వచ్చేసింది.. ట్రైలర్ చూస్తే మొత్తం నవ్వులే నవ్వులు.. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని ఇంజినీరింగ్ కళాశాల నేపథ్యంలో సాగే కథతో రూపొందించారు. ట్రైలర్ చూస్తే యూత్ ఫుల్ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం నుంచి నవ్వులు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే ‘జాతి రత్నాలు’ చిత్రం కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెబితే.. టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. Loved the vibe of the film. #MAD trailer is a laugh riot. https://t.co/7jFRF4WsUX Superb energy @NarneNithiin #SangeethShobhan #RamNitin… All the best to director @kalyanshankar23, my brother @vamsi84, and the entire team for their release on 6th Oct. @gouripriyareddy… — Jr NTR (@tarak9999) October 3, 2023 -
సినిమా చూసి నవ్వకపోతే టికెట్ డబ్బులు ఇచ్చేస్తాం: నిర్మాత
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్. సూర్యదేవర నాగవంశీ ముందుడి మరీ ఈ నిర్మాణ సంస్థను నడిపిస్తున్నాడు. ఇప్పటికే పలు వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అదించిన ఈ నిర్మాణ సంస్థ..తాజాగా ‘మ్యాడ్’తో అలరించడానికి సిద్ధమైంది. ఎన్టీఆర్ బామ్మర్థి నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మ్యాడ్ గ్యాంగ్ ని పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. జాతి రత్నాలు సినిమా కంటె ఎక్కువగా ఈ చిత్రం నవ్విస్తుందన్నారు. జాతి రత్నాలు కంటే తక్కువగా ఈ సినిమా నవ్వించింది అని ప్రేక్షకులు ఫీల్ అయితే కచ్చితంగా వారి టిక్కెట్ డబ్బులు తిరిగి ఇస్తాను అంటూ నిర్మాత ఛాలెంజ్ చేశాడు. ‘సినిమా మీద నమ్మకంతో ఈ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది యూత్ఫుల్ సినిమా అయినప్పటికీ..కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ని గుర్తు చేయడానికి తీసిన సినిమా ఇది. లాజిక్ లు, ట్విస్ట్ లు ఏముండవు. సినిమా మొదలైనప్పటి నుండి చివరివరకు నవ్వుతూనే ఉంటారు. కుటుంబంతో కలిసి అందరూ ఆనందించదగ్గ సినిమా ఇది’ అని నాగవంశీ అన్నారు. -
సింగిల్గా ఉండు మామా..
‘హే సింగిల్గా ఉండు మామా.. గాళ్ఫ్రెండ్ ఎందుకు?..హైదరాబాద్.. సికింద్రాబాద్..పొరెంటబడితే నువ్వు బరాబాత్’ అంటూ మొదలవుతుంది ‘మ్యాడ్’ చిత్రంలోని ప్రౌడ్సే బోలో ఐయామ్ సింగిల్’ పాట. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సునీల్కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో ఎస్. హారిక, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్..’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సారథ్యంలో రఘురామ్ సాహిత్యం అందించారు. నకాష్ అజీజ్తో కలిసి భీమ్స్ సిసిరోలియో ఈ పాటను ఆలపించారు. -
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా ‘మ్యాడ్’..టీజర్ చూశారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. ఇంజనీరింగ్ కళాశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకుడు. తాజాగా ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు. ఈ కథ మొత్తం కాలేజ్ చుట్టూనే తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్, ప్రేమలు, కొట్లాటలు అన్నింటినీ ఇందులో చూపించారు. సుమారు నిమిషమున్నర ఉన్న ఈ మూవీ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ తో నిండిపోయింది. ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. షామ్దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.