పేకాట స్ధావరాలపై దాడి: 19 మంది అరెస్టు | 19 gamblers arrested in attapur | Sakshi
Sakshi News home page

పేకాట స్ధావరాలపై దాడి: 19 మంది అరెస్టు

Jan 25 2016 10:19 AM | Updated on Aug 20 2018 4:27 PM

నగరంలోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో 19 మంది పేకాట రాయుళ్లను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు.

అత్తాపూర్: నగరంలోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో 19 మంది పేకాట రాయుళ్లను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇంద్రానగర్‌లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్‌ఐ నారాయణరెడ్డి సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 19 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10, 500 స్వాధీనం చేసుకున్నారు. అదే ఇంటి నుంచి మాంసం కత్తులను కూడా స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement