హైదరాబాద్: నగరంలోని బోరబండ ప్రాంతంలో యువతిపై కత్తితో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో హిచ్ హోటల్ సమీపంలో చంపాపేటకు చెందిన కె. చంటి బోరబండకు చెందిన రమ్యశ్రీ మైనర్ బాలికపై కత్తితో దాడి చేశాడు. దీంతో యువతి స్వల్పంగా గాయపడింది. అనంతరం నిందితుడు, బాధితురాలిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఈ దాడికి గల కారణాలు, ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, ఘటన వెనుక అసలు పరిస్థితులేంటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


