పోలీసుల నుంచి పారిపోతూ..

UP youth dies while fleeing from Police  - Sakshi

లక్నో: పోలీసుల నుంచి పారిపోతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం చిత్రాకోట్‌ జిల్లాలో గురువారం జరిగింది. పేకాటాడుతున్న శిబిరంపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో భయంతో యువకులు పరిగెత్తారు. ఇందులో భోలా(19) అనే యువకుడు  గందరగోళంలో పక్కనున్న బావిలో పడిపోయాడు. బాధితుడిని బావిలో నుంచి తీసి స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. భోలా శరీరంపై గాయాలు ఉన్నాయని, అతన్ని తోటి స్నేహితులే బాగా కొట్టారని బోలా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top