breaking news
Sai Krishna
-
సాయి కృష్ణని ఎంత క్రూరంగా చంపారో చూశాడు కనుకనే క్రాంతి కుమార్ ఆ పని చేసాడు
-
హస్తికలు వెలికితీయండి... సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై NHRC ఆగ్రహం
-
కర్త, కర్మ, క్రియ CP రాజశేఖర్ బాబే...! హైకోర్టు న్యాయమూర్తికి నా విన్నపం ఇదే
-
Big Update: సాయి కృష్ణ శవం మాయం చేసింది.. హెడ్ కానిస్టేబుల్ అశోక్
-
100 మంది ఉన్న పోలీసు స్టేషన్ లో సాయి కృష్ణను చంపడం ఒక్కరు కూడా చూడరా?
-
లోకేశ్, అనిత, పవన్.. పోలీసు శాఖకు పట్టిన చీడ.. కృష్ణలంక రాక్షసులు
-
సాయికృష్ణ లాకప్డెత్పై తల్లి న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో అతడి తల్లి విజయలక్ష్మి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అదృశ్యమైన తన కుమారుడి ఆచూకీ తెలుసుకుని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని ఇప్పటికే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తున్న విజయలక్ష్మి తాజాగా మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. తన కుమారుడి లాకప్డెత్ కేసు దర్యాప్తు బాధ్యతలను స్థానిక పోలీసుల నుంచి తప్పించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా న్యాయస్థానం సరైనదని భావించే మరేదైనా ఇతర సమర్థవంతమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అభ్యరి్థస్తూ ఆమె హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్వతంత్ర దర్యాప్తు కేవలం ఆ సంస్థ పరిధిలోనే కాకుండా పూర్తి స్థాయిలో కోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగేలా చూడాలని ఆమె హైకోర్టుకు విన్నవించారు. సాయికృష్ణ ఏ పరిస్థితులలో మాయమయ్యాడు? దీని వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఎటువంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ సుభేందు శమంతో ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. 40 రోజుల పాటు కమిషనర్ మౌనంగా ఉన్నారంటే అర్థమేంటి..? ‘కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది, టాస్్కఫోర్స్ అధికారులు సాయికృష్ణ అదృశ్యం, సాక్ష్యాల నాశనంలో స్వయంగా భాగస్వాములుగా ఉన్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నిందితులుగా ఉన్న అదే పోలీస్ శాఖే ఈ కేసును విచారిస్తే న్యాయం జరగదు. ఉన్నతాధికారులను కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాకు న్యాయం జరగాలంటే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడమే ఏకైక మార్గం. తన అధికార పరిధిలో ఒక వ్యక్తి అదృశ్యం కావడం, పోలీస్ కస్టడీలో మరణం లాంటి తీవ్రమైన ఘటన జరిగితే కనీసం 7 రోజుల్లోగా ఆ ప్రాంత పోలీసు అధిపతి అయిన కమిషనర్కు పూర్తి సమాచారం తెలిసిపోతుంది. కానీ ఈ కేసులో సదరు కమిషనర్ 40 రోజుల పాటు పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘకాలం కమిషనర్ స్పందించకపోవడం దేనిని సూచిస్తోందంటే.. ఈ నేరంలో లేదా ఈ విషయాన్ని తొక్కిపెట్టడంలో కేవలం కింది స్థాయి సిబ్బందే కాకుండా ఉన్నత స్థాయి అధికారుల హస్తం కూడా ఉందనే బలమైన అనుమానాలకు తావిస్తోంది. ఈ కుట్రలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్ద అధికారుల ప్రమేయం ఉన్నప్పుడు న్యాయం జరుగుతుందని ఆశించడంలో అర్థమే లేదు. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా స్థానిక పోలీసుల దర్యాప్తును నమ్మడానికి వీల్లేదు కాబట్టి, హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని ఈ కేసును సీబీఐకి అప్పగించాలి’ అని సాయికృష్ణ తల్లి హైకోర్టును అభ్యర్థించారు. హైకోర్టుకు ఏదో ఒకటి చెప్పి కేసును మూసేయించాలని చూస్తున్నారు.. ‘ప్రస్తుత దర్యాప్తు కేవలం ఒక్క పోలీస్ అధికారి (నాగరాజు) చుట్టూనే తిరుగుతోంది. కానీ అసలు నిజం ఏమిటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది మొత్తం సాయికృష్ణ అదృశ్యం ఘటనలో భాగస్వాములయ్యారు. సాయికృష్ణ ప్రాణాలు తీసి అతడి శరీరాన్ని ఎప్పటికీ దొరకకుండా మాయం చేయాలనే క్రూరమైన ఉద్దేశంతో వీరంతా కలిసి పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఈ కుట్రను పూర్తిగా ఛేదించడం లేదు. నేరంలో భాగమైన కృష్ణలంక స్టేషన్ సిబ్బంది అందరినీ వదిలేసి, కేవలం ఆ ఒక్క నిందితుడి నుంచి మాత్రమే సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. తాము దర్యాప్తు చేస్తున్నట్లు హైకోర్టుకు ఏదో ఒక నివేదిక సమర్పించి తద్వారా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ను మూసివేయించాలని చూస్తున్నారు. ఒకసారి కోర్టులో ఈ పిటిషన్ మూసివేస్తే ఈ కేసు భవిష్యత్తులో ఎప్పటికీ వెలుగులోకి రాకుండా పూర్తిగా అణచివేయవచ్చని, దోషులను శాశ్వతంగా తప్పించవచ్చని పోలీసులు భావిస్తున్నారు’ అని ఆమె తన పిటిషన్లో ఆరోపించారు. ఫిర్యాదు చేసిన 45 రోజుల తరువాత కేసు నమోదు చేశారు... ‘సాయికృష్ణ అదృశ్యంపై నేను మే 28నే విజయవాడ పోలీస్ కమిషనర్కు అధికారికంగా ఫిర్యాదు చేశా. ఒక పౌరుడి ప్రాణానికి సంబంధించిన ఇంతటి తీవ్రమైన విషయంపై, అది కూడా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ పెండింగ్లో ఉన్నప్పటికీ, పోలీసులు జూన్ 19 వరకు కేసు నమోదు చేయకపోవడం వెనుక వారి ఉద్దేశాలు స్పష్టమవుతున్నాయి. కేసు నమోదు చేయడానికి దాదాపు 45 రోజులకు పైగా సుదీర్ఘ జాప్యం జరిగింది. ఈ 45 రోజుల కాలంలో బాధితుడి తల్లిగా నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కదలని యంత్రాంగం, కేవలం ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాతే దిగివచ్చి కేసు నమోదు చేసింది. ఒక వ్యక్తి అదృశ్యమైన వెంటనే ప్రాథమిక చర్యలు చేపట్టాల్సిన పోలీసులు 45 రోజుల పాటు మౌనంగా ఉండి, కోర్టు జోక్యం తరువాతే దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పడం వారి నిబద్ధతను శంకిస్తోంది. సాయికృష్ణ అదృశ్యమైన తొలి రోజుల్లోనే గాలింపు ప్రారంభించకుండా కేసును కోర్టు విచారణ వరకు లాగడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటంటే.. ఈలోపు పోలీసులకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేయడమే’ అని సాయికృష్ణ తల్లి నివేదించారు. హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే దర్యాప్తు చేయడమా..? ‘సాయికృష్ణ పోలీసు కస్టడీలో దారుణమైన హింసను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాతే అతడిని మాయం చేశారు. ఇదంతా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలోనే జరిగింది. చట్టంలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఎవరూ కూడా తమ సొంత కేసులో తామే న్యాయమూర్తిగా లేదా దర్యాప్తు అధికారిగా ఉండకూడదు. ఎవరిపై అయితే హత్యానేరం లేదా అక్రమ నిర్బంధం ఆరోపణలు ఉన్నాయో, వారికే దర్యాప్తు చేసే అధికారం ఇస్తే వారు తమ తప్పులను తామే ఎలా ఒప్పుకుంటారు? నిందితులుగా ఉన్న పోలీస్ యంత్రాంగాన్నే ఈ కేసును దర్యాప్తు చేయడానికి అనుమతిస్తే, అది ‘నిష్పక్షపాత, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తు లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది’ అని విజయలక్ష్మి తన పిటిషన్లో పేర్కొన్నారు. కంటి తుడుపు సిట్ దర్యాప్తుతో ఉపయోగం లేదు... ‘సాయికృష్ణ ఆచూకీ కనిపెట్టడానికి సిట్ను ఏర్పాటు చేశామని పోలీసులు కోర్టు ముందు కేవలం మాటల్లోనే చెబుతున్నారు. కానీ, ఆ మాటలకు తగ్గట్టుగా ఎలాంటి చట్టపరమైన ఆధారాలను, నివేదికలను వారు ఇప్పటివరకు కోర్టుకు సమర్పించలేదు. హైకోర్టు విచారణ ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా, పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఒకవేళ వారు నిజంగానే నిజాయితీగా దర్యాప్తు చేస్తుంటే, ఆ నిజాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలపడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? సాయికృష్ణ అసలు ఏ పరిస్థితులలో మాయమయ్యాడు? అనే దానికి సంబంధించిన వాస్తవాలను పోలీసులు కోర్టుకు చెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అందుకే ఈ కంటితుడుపు సిట్ దర్యాప్తులను పక్కనబెట్టి కేసును తక్షణమే సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థకు అప్పగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. కోర్టు ఆ దిశగా తగిన ఆదేశాలు జారీ చేయాలి’ అని విజయలక్ష్మి తన పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించారు. ఉన్నతాధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదు..? ‘ఒకవేళ కింది స్థాయి పోలీస్ సిబ్బంది సాయి కృష్ణ అరెస్ట్, అదృశ్యం గురించి తమ పైఅధికారులకు ముందే సమాచారం అందించి ఉంటే... అంతటి తీవ్రమైన విషయంలో ఆ ఉన్నతాధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదు? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే.. వారు కూడా ఈ నేరాన్ని లోపల సమరి్థస్తూ, దాచడానికి ప్రయత్నించారు. ఒకవేళ కింది స్థాయి సిబ్బంది ఈ విషయాన్ని తమ పైఅధికారులకు చెప్పకుండా దాచిపెట్టి ఉంటే... అది నిజాలను తీవ్రంగా తొక్కిపెట్టడం, తమ అధికారిక విధులను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలం కావడం కిందకే వస్తుంది. ఒక పౌరుడి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు ఆ విషయాన్ని దాచగలిగారంటే అక్కడ పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు’ అని విజయలక్ష్మి పేర్కొన్నారు.ఉద్దేశపూర్వకంగానే హైకోర్టును తప్పుదోవ పట్టించారు... ‘సాయికృష్ణ అదృశ్యంపై నేను దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. సాయికృష్ణ అసలు ఎవరి కస్టడీలో ఉన్నాడు? అతడిని ఎక్కడ నిర్బంధించారు..? ప్రస్తుతం అతడి పరిస్థితి ఏమిటి? అనే విషయాలపై అప్పుడు కూడా కనీస సమాచారాన్ని పోలీసులు హైకోర్టుకు వెల్లడించలేదు. ఆ తర్వాత సిట్ తన రిమాండ్ రిపోర్టులో సాయికృష్ణను మే 6నే కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, స్పష్టమైన ఆధారాలు దొరికాయని పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే జూన్ 2 నుండి కోర్టు విచారణల సమయంలో సాయికృష్ణ అక్రమ నిర్భంధం గురించి, అదృశ్యం గురించి పోలీసులు ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థానాన్ని సైతం పక్కదారి పట్టించారని స్పష్టమవుతోంది’ అని ఆమె నివేదించారు. ముందస్తు ప్రణాళికతోనే సాక్ష్యాలను నాశనం చేశారు...‘సాయికృష్ణను ఈ ఏడాది మే 6న ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్కు తరలించి పోలీస్ కస్టడీలోనే ఉంచారు. దీనిని సిట్ రిమాండ్ రిపోర్ట్ ధృవీకరిస్తోంది. చట్ట ప్రకారం ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా స్థానిక మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. కానీ సాయికృష్ణ్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా పోలీసులు చట్టాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. సాయికృష్ణను స్టేషన్కు తీసుకువచ్చిన కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు డిలీట్ చేశారు. ఇది కస్టడీలో అతడిపై జరిగిన హింసను, మరణాన్ని దాచడానికి పోలీసులు అంతా కలిసి సాక్ష్యాలను ముందస్తు ప్రణాళికతో నాశనం చేశారనడానికి బలమైన ఆధారం’ అని విజయలక్ష్మి తన అనుబంధ పిటిషన్లో స్పష్టం చేశారు. -
కీలక పరిణామం.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సాయికృష్ణ తల్లి
విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అతడి తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చేవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు. మొదట అదృశ్యం కేసుగా నమోదైంది ఈ వ్యవహారం. ఆ తర్వాత కస్టడీలో మృతి చెందాడన్న ఆరోపణలు వచ్చాయి.సాయికృష్ణను 2026 మే నెలలో ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు నాన్-బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో అదుపులోకి తీసుకువచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకపోవడంతో పాటు ఇంటికి కూడా రాకపోవడంతో, అతని తల్లి విజయలక్ష్మి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు కస్టడీలోనే తన కుమారుడిని హింసించి చంపేశారని, ఆ తర్వాత ఆధారాలు మాయం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. -
సాయికృష్ణ లాకప్డెత్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
ఢిల్లీ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. పోలీసుల అధికార దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్కు ఎన్హెబ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వారంలోగా ఘటనపై యాక్షన్ టేకెన్ రిపోర్టు పంపాలని ఆదేశించింది సిట్ దర్యాప్తు వివరాలు, పోలీసులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.పోలీసు స్టేషన్లో డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ రికవరీ చేయాలి. గాదె సాయి కృష్ణ అస్థికలను కనుగొనాలి. సాయికృష్ణ తల్లికి రక్షణ కల్పించాలి. ఈ ఘటనలో సాక్షులను కాపాడాలి. బాధితులకు ఇచ్చిన మధ్యంతర నష్టపరిహారం సహాయం వివరాలను అందజేయాలి’’ ఎన్హెచ్ఆర్సీ కోరింది. తదుపరి విచారణ వారం తర్వాత చేపడతామని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. -
సాయి కృష్ణ తల్లి ఓడిపోవడం ఖాయం ఎందుకంటే..! అడ్వొకేట్స్ సంచలన నిజాలు
-
పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారా ? సీఐ నాగరాజు జాగ్రత్త
-
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. ఇద్దరు పై అనుమానాలు
-
పెద్దలకు తెలిసే జరిగిందా..? సాయికృష్ణ కేసులో బిగుస్తున్న ఉచ్చు
-
సాయికృష్ణ కేసులో పెద్ద తలకాయలు.. కమిషనర్, కలెక్టర్ మెడకు ఉచ్చు.. కోర్టు నోటీసులు
-
CI నాగరాజును కాపాడేందుకు సిద్ధార్థ లూథ్రా.. కారుమూరి షాకింగ్ రియాక్షన్
-
CI నాగరాజు గారు జైల్లో మీరు జాగ్రత.. ఎందుకు చెప్తున్నాను అంటే...!
-
ఈ సిట్ మాకొద్దు.. జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే.. సాయికృష్ణ తల్లి పిటిషన్
-
జాగ్రత్త నాగరాజు.. నిన్ను జైల్లోనే...! CIపై చంద్రబాబు బిగ్ స్కెచ్..!?
-
సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ
-
CI నాగరాజు అరెస్ట్ అంతా డ్రామానా? రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు అన్ని మాయం
-
సాయికృష్ణ ను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందటే..?
-
సిగ్గులేదా పవన్ కళ్యాణ్... నువ్వింతలా దిగజారిపోతావ్ అని జన్మలో అనుకోలేదు
-
CI నాగరాజు పాత్రదారుడు మాత్రమే... సూత్రదారులు ఎవరంటే...? పొన్నవోలు కీలక వ్యాఖ్యలు
-
సీఐ నాగరాజు వెనుక సీపీ రాజశేఖర్..! సాయికృష్ణ శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!
-
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
-
నిజాన్ని దాచలేరు.. తప్పు ఒప్పుకున్న CI నాగరాజు
-
ఇప్పటికైనా నా బిడ్డ బూడిద ఇవ్వండి!
లబ్బీపేట(విజయవాడ తూర్పు): ‘నా కొడుకును చూపిస్తామన్న పోలీసులు చివరకు చంపేసి శ్మశానంలో కాల్చేశారు. ఇప్పటికైనా నా బిడ్ద బూడిద ఇవ్వండి. కర్మకాండలు చేసుకుంటా’ అని విజయవాడలోని కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకుని పోలీస్ కస్టడీలోనే కొట్టి చంపారన్నది నిజమైందని, తాను మొదటి నుంచి అదే చెబుతున్నానని అన్నారు. సీఐ నాగరాజుతో పాటు ఆయనకు సహకరించిన మిగతా వారందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ బిడ్డను స్టేషన్లోనే కొట్టి చంపేసి మూటకట్టి శ్మశానానికి తీసుకెళ్లి కాల్చేశారని, కనీసం బూడిద కూడా ఇవ్వలేదని, ఇదేమైనా న్యాయంగా ఉందా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ‘ఈరోజు నేను కుమిలిపోతున్నాను. నా బిడ్డ ఎక్కడ. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత అన్యాయం చేశారు పోలీసులు. నా బిడ్డను అంత చిత్రవధ చేసి చంపిన వాళ్లందరికీ శిక్ష పడాలి. అందరూ కలిసి కొట్టి కొట్టి చంపేశారు. నన్ను స్టేషన్కు కూడా రానివ్వకుండా వాడిని ఎక్కడికో తీసుకెళ్లి హతమార్చారు. అలా చేయాల్సిన అవసరం ఏమొచి్చంది. వాడి వయసెంత. మీ పోలీసుల వయసెంత. అంత చిన్న బిడ్డను చిత్రవధ చేశారు. వాళ్లకు తగిన శిక్ష పడాలి. నాకు అదే కావాలి’ అని వాపోయారు. మీడియాను చూపిస్తూ ‘నాకు మీరే న్యాయం చేయాలి’ అని వేడుకున్నారు. -
ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించేసింది! రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ హత్య కేసును నీరుగార్చేందుకు పక్కా పన్నాగానికి తెగబడింది. ఈ హత్య వెనుక సూత్రధారులు, పాత్రధారులను కాపాడేందుకు కుతంత్రం పన్నింది. ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్, బిగ్బాస్తో సహా అందరినీ ఈ కేసు నుంచి తప్పించింది. అందుకు ఈ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సాధనంగా చేసుకుంది. సాయికృష్ణ లాకప్ హత్యకు సంబంధించిన కనీస వివరాలు, దర్యాప్తులో పాటించాల్సిన ప్రాథమిక నియమాలను కూడా పట్టించుకోకుండా ‘సిట్’ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు సాయికృష్ణ హత్యకు గురైనట్లు సూటిగా పేర్కొనని సిట్... దర్యాప్తులో కీలకమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి తూతూమంత్రంగా రిమాండ్ రిపోర్టును రూపొందించడం వెనుక ప్రభుత్వ పెద్దల కుతంత్రం ఉందన్నది స్పష్టమవుతోంది. అసలు సాయికృష్ణను ఎప్పుడు హత్య చేశారు..? హత్యాయుధం.. సమయం.. మృతదేహం తరలింపు.. అవశేషాల గుర్తింపు.. ప్రత్యక్ష సాక్షులు, కీలకమైన పోలీసు రిజిస్టర్లు, రికార్డులు... వాటిని పర్యవేక్షించాల్సిన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు... సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ బాధ్యులు.. సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్ స్వాధీనం..! ఇలా ఏ అంశాలను కూడా ప్రస్తావించకుండానే, వాటి గురించి పేర్కొనకుండానే రిమాండ్ రిపోర్టును సమర్పించడం విభ్రాంతి కలిగిస్తోంది. ప్రధానంగా సాయికృష్ణను లాకప్లోనే హత్య చేయడం వెనుక కుట్ర కోణం ఏమిటన్నది పట్టించుకోకపోవడం గమనార్హం. తద్వారా ఈ కేసులో ఎవరో కీలక ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్, బిగ్బాస్లను కాపాడాలన్నదే ప్రభుత్వ పన్నాగమన్నది తేటతెల్లమవుతోంది. సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా బట్టబయలైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది....హత్య వివరాలే లేకుండా రిమాండ్ రిపోర్టా?కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ మరణం కేసును న్యాయ విచారణలో బలహీనపరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అసలు సాయికృష్ణ హత్యకు గురయ్యారని సూటిగా పేర్కొనలేదు. హత్యకు గురై ఉంటారని మొక్కుబడిగా పేర్కొంటూ ఆయన్ని హతుడు (డిసీజ్డ్)అని పేర్కొంది. కానీ ఆయన్ని ఎప్పుడు, ఎక్కడ ఎలా హత్య చేశారు? అనే కనీస వివరాలను రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనలేదు. అంటే.. నేర ప్రదేశం, సమయం, నేరం చేసిన విధానం గురించి అసలు ప్రస్తావించనేలేదు. టాస్క్ఫోర్స్ అధికారులు సాయికృష్ణను కృష్ణలంక పోలీసులకు అప్పగించిన తరువాత.. వివరాలన్నీ అగమ్యగోచరమే. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన సాయికృష్ణ తరువాత ఏమయ్యారన్నది సిట్ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించనే లేదు. ఆయన ప్రాణాలతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లారా...? లేదా ఆయన మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తరలించారా? అనే కీలక అంశాన్ని పేర్కొనాల్సిన కనీస బాధ్యతను కూడా సిట్ అధికారులు విస్మరించారు. అసలు సాయికృష్ణ లాకప్లో హత్యకు గురయ్యారనే విషయాన్నే రిమాండ్ రిపోర్ట్లో సూటిగా ఎక్కడా ప్రస్తావించకపోవడం విస్మయపరుస్తోంది. లాకప్లో హత్యకు గురైనట్టు భావిస్తున్నామని మాత్రమే పేర్కొంది. హత్య ప్రదేశం, సమయం, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అన్నవి ఈ కేసులో ప్రధానమైనవి. ఆ మూడు కీలక అంశాల గురించి రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. సాయికృష్ణ మృతదేహాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులను కూడా సిట్ గుర్తించనే లేదు. తద్వారా సాయికృష్ణను లాకప్లో హత్య చేశారని నిరూపించడానికి కీలక ఆధారం లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త పడినట్టు స్పష్టమవుతోంది. అంటే సాయికృష్ణ అసలు హత్యకు గురయ్యారా లేదా అనే సందేహానికి బలం చేకూర్చేందుకు ప్రభుత్వం ముందుగానే కుట్రకు బరితెగించింది. అంతగా ఈ కేసును నీరుగార్చాలని ప్రభుత్వ పెద్దలు ఎందుకు భావిస్తున్నట్లు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రత్యక్ష సాక్షులే లేకుండా చేసే కుతంత్రంఇక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకుండా చేయాలన్న ముందస్తు పన్నాగంతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం బాధితుడి తల్లితోపాటు ఎస్సైను మాత్రమే ప్రత్యక్ష సాక్షిగా పేర్కొనడం విడ్డూరంగా ఉంది. పోలీసులు కొడుతున్న దెబ్బలకు తన కుమారుడు ఆర్తనాదాలు చేయటాన్ని తాను విన్నట్లు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పారని ప్రస్తావించారు. బాధితుడి తల్లి ఫిర్యాదుదారు కాబట్టి ఆమె సాక్ష్యం న్యాయస్థానంలో చెల్లదు. ఆ ఎస్సై కూడా తాను మే 6 – 8వ తేదీల మధ్య సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూశానని చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. న్యాయ విచారణ సమయంలో ఆయన మాట మార్చే అవకాశాలు ఉన్నాయి. మరి అన్ని రోజులపాటు పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించిన అంతమంది ఇతర అధికారులు, పోలీసులను ప్రత్యక్ష సాక్షులుగా ఎందుకు పేర్కొన లేదన్నది కీలకంగా మారింది. సాయికృష్ణ మృతదేహం పోలీసు స్టేషన్ నుంచి మాయమైంది. ఆ పని కేవలం ఒక్క మనిషి చేయడం అసాధ్యం! మరి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? అనేది సిట్ పట్టించుకోలేదు. సరైన సాక్ష్యాలు లేకుండా సిట్ తూతూ మంత్రంగా రిపోర్ట్ రిపోర్ట్ రూపొందించడం ద్వారా ఈ కేసు నుంచి ఎవర్ని కాపాడేందుకు యత్నిస్తోందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కీలక రిజిస్టర్లు, రికార్డుల వివరాలే లేకుండా రిమాండ్ రిపోర్టా...!సాయికృష్ణ లాకప్ మరణం కేసును నీరుగార్చేందుకు సిట్ పక్కాగా రంగంలోకి దిగింది. ప్రధాన బాధ్యుడైన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు టాస్క్ఫోర్స్ అధికారిని ఈ కేసు నుంచి తప్పించాలన్న కుట్ర బయటపడింది. తద్వారా వారిద్దరి వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలను కాపాడాలన్న లక్ష్యంతో వ్యవహరించింది. సాయికృష్ణను టాస్క్ఫోర్స్ అధికారులు మార్కాపురంలో అదుపులోకి తీసుకుని సీఐ నాగరాజుకు అప్పగించినట్టు సిట్ పేర్కొంది. కానీ ఆ తరువాత పరిణామాలపై మాత్రం మౌనంగా ఉండిపోవడం గమనార్హం. ప్రధానంగా ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న తరువాత నిబంధనల ప్రకారం నమోదు చేయాల్సిన కీలక రిజిస్టర్లు, రికార్డులను సిట్ కనీసం పరిశీలించలేదు. తమ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించనూ లేదు. వాటిని రోజూ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన సీపీ రాజశేఖర్బాబు ఎందుకు తన బాధ్యతను విస్మరించారనే కోణంలో దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. ఆ కీలక అంశాలు ఇవీ...» పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల లాకప్లలో ఉన్న వారి వివరాలతో లాకప్ డెయిరీ సర్వీస్రిజిస్టర్(డీఎస్ఆర్)ను సీపీకి సమర్పిస్తారు. నిందితులను లాకప్లో పెట్టిన తేదీ, సమయం, సంబంధిత పోలీసు అధికారి తదితర వివరాలు అందులో ఉంటాయి. 24 గంటలు మించి ఎవరూ లాకప్లో ఉండకుండా.. న్యాయస్థానంలో హాజరుపరిచారా లేదా? అన్నది సీపీ పరిశీలించాలి. మరి సాయికృష్ణను రోజుల తరబడి అక్రమంగా లాకప్లో ఉంచితే ఆ విషయాన్ని సీపీ ఎందుకు పట్టించుకోలేదు? అవేవీ పరిశీలించకుండానే డీఎస్ఆర్ను ఆమోదించారా? అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అంటే సీపీకి తెలిసే సాయికృష్ణను రోజుల తరబడి అక్రమంగా లాకప్లో ఉంచారన్నది స్పష్టమవుతోంది. » ఇక పోలీస్ స్టేషన్లలో స్టేషన్ ఆఫీసర్లు, జనరల్ డ్యూటీ ఇన్చార్జ్లు, సెంట్రీలు ప్రతి ఆరు నుంచి 12 గంటల మధ్య షిఫ్ట్లు మారుతూ ఉంటారు. అలా షిఫ్ట్ మారే సమయంలో లాకప్లో ఉన్న వారి వివరాలను జనరల్ డైరీలో రాయాలి. మరి సాయికృష్ణను ఉంచిన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీ వివరాలను సిట్ ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించ లేదు? జనరల్ డైరీ, స్టేషన్ డైరీ, లాకప్ రిజిస్టర్, కస్టడీ రిజిస్టర్, ప్రిజనర్ మూవ్మెంట్ రిజిస్టర్, విజిటర్స్ రిజిస్టర్, సెంట్రీ రిజిస్టర్, అరెస్టు రికార్డులు ఇవన్నీ కీలకం. వాటిని పరిశీలించకుండా వాటి ప్రస్తావనే లేకుండా రిమాండ్ రిపోర్ట్ రూపొందించడం ద్వారా ఈకేసును నీరుగార్చేందుకు కుట్ర పన్నారన్నది స్పష్టమవుతోంది. » సాయికృష్ణకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారంట్ (ఎన్బీడబ్ల్యూ) పెండింగ్లో ఉన్నందునే టాస్క్ఫోర్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. మరి పెండింగ్లో ఉన్న ఎన్బీడబ్ల్యూలు, వాటిపై తీసుకున్న చర్యలను పోలీస్ కమిషనర్కు ప్రతి రోజూ నివేదిస్తారు. మరి సాయికృష్ణను ఎన్బీడబ్ల్యూ జారీ చేసి అదుపులోకి తీసుకుంటే ఆ విషయాన్ని సీపీకి సమర్పించే రోజువారీ నివేదికలో ప్రస్తావించాలి కదా? మరి ఈ అంశాన్ని ఆయన ఎందుకు పట్టించుకోలేదు? సాయికృష్ణకు ఎన్బీడబ్లూ జారీ చేసి అదుపులోకి తీసుకున్నారా...? తీసుకుంటే న్యాయస్థానంలో ఎప్పుడు ప్రవేశపెడతారు? అని ప్రశ్నించాలి కదా. మరి ఆయన ఎందుకు బాధ్యతాయుతంగా స్పందించలేదు? అంటే ఆయనకు తెలిసే సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రస్తావన రిమాండ్ నివేదికలో పేర్కొనలేదా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.సాయికృష్ణను ఎక్కడ దహనం చేశారో ఎందుకు వెల్లడించలేదు?సాయికృష్ణను ఎలా కనుమరుగు చేశారన్నది కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆయన మృతదేహం అనే అత్యంత కీలకమైన అంశాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. మృతదేహాన్ని ఎలా మాయం చేశారనే విషయాన్నే సిట్ అధికారులు ప్రస్తావించనే లేదు. సాయికృష్ణ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసేశారు అనే కోణంలో సిట్ అధికారులు ఎందుకు దర్యాప్తు చేయడంలేదు? ఆయన మృతదేహాన్ని దహనం చేశారని భావిస్తున్న ప్రదేశాన్ని ఎందుకు గుర్తించ లేదు? వాస్తవానికి సాయికృష్ణను దహనం చేసిన ప్రదేశాన్ని గుర్తించి... అక్కడ అవశేషాలను సేకరించాల్సిన బాధ్యత సిట్ అధికారులపై ఉంది. ప్రధానంగా దంతపు అవశేషాలు అత్యంత కీలకం. మృతదేహాన్ని దహనం చేసినా దంతపు అవశేషాలు మిగిలే ఉంటాయి. వాటి నుంచి డీఎన్ఏ నమూనాలను పరీక్షించి నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించాలి. ఇంతటి కీలకమైన అంశాన్ని పోలీసులు ఎందుకు విస్మరించారన్నది సందేహాస్పదంగా మారింది. అంటే సాయికృష్ణ లాకప్ మరణం కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా బలహీనపరచాలన్నది పోలీసుల లక్ష్యమని స్పష్టమవుతోంది. తద్వారా ఈ హత్య వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులను రక్షించాలన్నదే అసలు ఉద్దేశమని తెలుస్తోంది.క్రిమినల్ కుట్ర కోణాన్నే పట్టించుకోని సిట్ ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే...సాయికృష్ణ లాకప్ హత్య వెనుక ప్రభుత్వ పెద్దలు, ప్రధాన సూత్రధారులను తప్పించేందుకు సిట్ అధికారులు బరితెగించారు. అసలు సాయికృష్ణ హత్య వెనుక కుట్రకోణం ఉందనే విషయాన్నే పట్టించుకోకపోవడమే అందుకు తార్కాణం. అందుకే సాయికృష్ణను ఎందుకు హత్య చేసి ఉంటారు? అనే కోణంలో కనీసం దర్యాప్తు చేయలేదు. విజయవాడకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన ఓ భూ వివాదం, విజయవాడలో ఓ ప్రైవేటు ఆర్థిక సంస్థలో నిధుల వ్యవహారంలో రెండువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయని... ఆ వ్యవహారాలను కప్పిపుచ్చేందుకే సాయికృష్ణను లాకప్లో హత్య చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి సిట్ ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదన్నది కీలకంగా మారింది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తే టీడీపీ ప్రజాప్రతినిధితోపాటు అందుకు సహకరించిన విజయవాడ పోలీస్ బాస్తోపాటు బిగ్బాస్ పాత్ర బయటపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే అసలు సాయికృష్ణ హత్య వెనుక కుట్ర కోణాన్నే విస్మరిస్తే... ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించవచ్చన్నది సిట్ ఉద్దేశం కావచ్చని చెబుతున్నారు.న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకేనా...!సాయికృష్ణ మిస్సింగ్ విషయంలో సీఐ నాగరాజుతోపాటు పోలీసులు న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించారు. హెబియస్ కార్పస్ లాంటి కీలకమైన పిటిషన్కు సంబంధించి న్యాయస్థానానికి సమర్పించే అధికారిక నివేదికపై సీపీ రాజశేఖర్బాబుకు ముందే సమాచారం ఉంటుంది. ఆయన ఆమోదంతోనే న్యాయస్థానానికి నివేదిక ఇస్తారు. కాగా హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సమయంలో సాయికృష్ణ ఆచూకీ తమకు తెలియదని సీఐ నాగరాజుతోపాటు విజయవాడ పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. కానీ సిట్ రిమాండ్ రిపోర్ట్ అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. సాయికృష్ణను టాస్క్ఫోర్స్ పోలీసులు తనకు మే 6న అప్పగించినట్టు నాగరాజు పేర్కొన్నారని చెప్పారు. ఇక్కడ రెండు ప్రధాన సందేహాలు తలెత్తుతున్నాయి...» సాయికృష్ణ ఆచూకీ తమకు తెలియదని కొద్ది రోజుల క్రితం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో ఉద్దేశపూర్వకంగానే అవాస్తవాలు చెప్పారా..? అలా చెబితే అందుకు సీపీతోపాటు విజయవాడ పోలీసులు బాధ్యులు అవుతారు. » లేదా... టాస్క్ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను సీఐ నాగరాజుకు అప్పగించినట్టు ప్రస్తుతం చెబుతున్న రికార్డులు ట్యాంపర్ చేసి ఉండవచ్చు. అధికారిక రికార్డులను ట్యాంపర్ చేయడం తీవ్రమైన నేరం. అందుకు సీపీ రాజశేఖర్బాబు, టాస్క్ఫోర్స్ అధికారులు కూడా బాధ్యులు అవుతారు.ఈ రెండింటిలో ఏది వాస్తవం..? ఏది అవాస్తవం..? అన్నది తేలాల్సి ఉంది.సీసీ టీవీ బ్యాకప్ ఫుటేజీని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ టీవీ కెమెరా ఫుటేజీ ధ్వంసమైనట్లు సిట్ పేర్కొంది. కానీ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ల సీసీ టీవీ ఫుటేజీ డీజీపీ కార్యాలయంలో ఉంటుంది. ఆ బ్యాకప్ నుంచి ఫుటేజీని సిట్ అధికారులు ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నది కీలకంగా మారింది. ఆ ఫుటేజీ కావాలని సిట్ అధికారులు ఆ ప్రాజెక్టు నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థకు లేఖ రాశారు. కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల మెమోరీ డ్యూరేషన్ యూనిట్లు అవసరమని... ఆ మెమోరీ సమకూరిస్తే తాము అందిస్తామని ఆ ప్రైవేటు సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది.కాలయాపన చేసేందుకే సిట్ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్ డీజీపీ కార్యాలయంలోనే ఉంది. సిట్ అధికారులు వెంటనే వెళ్లి ఆ బ్యాకప్ను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?.. వారిని అడ్డుకుంటున్నది ఎవరు? ప్రైవేటు సంస్థ ఇచ్చేంతవరకు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? వెంటనే వచ్చి స్వాధీనం చేసుకోవాలని డీజీపీ ఎందుకు ఆదేశించడం లేదు? ఈలోగా బ్యాకప్ ఫుటేజీ కూడా మాయం చేసే కుట్ర దాగుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. పోలీసు ప్రధాన కార్యాలయంలో బ్యాకప్ ఫుటేజీ కూడా గల్లంతు అయితే అందుకు డీజీపీతోపాటు యావత్ పోలీసు ఐటీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాయికృష్ణ హత్యకు గురయ్యారని స్పష్టంగా పేర్కొన లేదు. పోస్ట్మార్టం, మెడికల్ రికార్డులు లేనే లేవు. మృతదేహాన్ని ఏం చేశారన్నదీ చెప్పలేదు. మృతదేహం అవశేషాలు గుర్తించలేదు. ఎటువంటి అధికారిక రిజిస్టర్టు, రికార్డుల వివరాలు పేర్కొన లేదు. ప్రత్యక్ష సాక్షుల ప్రస్తావనే లేదు. హత్య వెనుక కుట్ర కోణంపై దర్యాప్తే లేదు. వెరసి సాయికృష్ణ లాకప్ హత్య కేసును నీరుగార్చి సూత్రధారులు, పాత్రధారులను కాపాడేందుకు సిట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బరితెగించిందన్నది స్పష్టమవుతోంది. -
CI నాగరాజు ఫోన్ ఎక్కడ..? శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!
-
‘సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్లాడా?’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిందని మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణపై ఆయన బుధవారం తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పోలీస్స్టేషన్లోనే మర్డర్ చేస్తే ఒక్క అధికారి కానీ, మంత్రికానీ అడగలేదు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లి పరామర్శిస్తే గాని ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సాయికృష్ణ మృతదేహం ఏమైందో చెప్పలేని పరిస్థితుల్లో అధికారులున్నారు. ఈఘటనలో చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాలి. సామాన్యుడి ప్రాణం పోతే పట్టించుకోరా?సాయికృష్ణ ఘటనకు ఎవరు రాజకీయ రంగు పులిమారు. చంద్రబాబూ.. మిమ్మల్ని ప్రజలు ఖబడ్దార్ అంటున్నారు. మీ పాలన ఎప్పుడు పోతుందో అని ప్రజలు రోజులు లెక్కపెడుతున్నారు.మీరు మోదీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు. రౌడీషీటర్ అని ఆరోపిస్తున్నారు.. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా?.కోర్టులో హాజరు పరిచి శిక్ష విధించేలా చేయండి. సాయికృష్ణ కేసులో ఇవాళ జరిగిందా డొల్ల విచారణే. సీపీ నేతృత్వంలోనే టాస్క్ ఫోర్స్ నడుస్తోంది. విచారణలో సీపీ పేరు రాకపోవడం దుర్మార్గం. కృష్ణలంక పీఎస్ పరిధిలోకి వచ్చే ఏసీపీని మీరెందుకు విచారించలేదు.17మంది సాక్షులను విచారించామని చెబుతున్నారు. సిట్ అధికారులు ఈ 17మందితోనే ఎందుకు ఆగిపోయారు.సిట్ విచారణలో సాయికృష్ణను కొట్టి చంపింది ఒక్క సీఐ నాగరాజేనా?. మిగితావారు ఈ కేసులో లేరా?. సీఐ నాగరాజుకు ఎవరు సాయం చేశారు? డెడ్ బాడీని ఎవరు మాయం చేశారు. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్లాడా?. సిట్ విచారణలో ఈ అంశాలన్నీ ఎందుకు తేల్చలేదు. పీఎస్లో ఫుటేజీ మాయం చేస్తే.. బయటి ఫుటేజీ అయినా ఉండాలి కదా?. అంటే ఎవరూ లేని సమయంలో స్టేషన్లోనే మృతదేహాన్ని పాతి పెట్టారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. -
బయటపడ్డ సాయికృష్ణ మరదలి సంచలన ఆడియో
-
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్, రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా 17 మంది
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం ..
-
నేనే చంపా..! రిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు ఇవే
-
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. CI నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన నిజాలు..!
-
సాయికృష్ణను లాకప్ డెత్ చేశారు.. మిస్సింగ్ కేసు కాదు.. రిపోర్ట్ లో సంచలన నిజాలు
-
నాగరాజుతో డీల్..? పెద్దల పేర్లు సేఫ్ ..?
-
సీఐ నాగరాజు మామూలోడు కాదు.. 200 కోట్ల ఆస్తులు సంపాదించాడు
-
సాయికృష్ణను లాకప్ డెత్ చేశారు: కోర్టులో సిట్
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసు మిస్టరీ అధికారికంగా వీడింది. సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, అది కస్టడీయల్ డెత్ కేసుగా పేర్కొంటూ దర్యాప్తు బృందం కోర్టుకు నివేదిక సమర్పించింది. అలాగే ఈ కేసులో అరెస్టయిన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (2nd AJM) కోర్టులో ఈ కేసు నిందితుడు సీఐ(సస్పెండెడ్) నాగరాజును హాజరుపరిచిన సిట్ అధికారులు.. దర్యాప్తులో వెలుగుచూసిన పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టుకు సిట్ చెప్పిన షాకింగ్ నిజాలుసాయికృష్ణను తీసుకెళ్లి మాయం చేశారుసాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేశాంమొత్తం 17 మంది సాక్షులను విచారించాంమే 6న సాయికృష్ణను మార్కాపురంలో అరెస్ట్ చేశారుఅదే తేదీన టాస్క్ఫోర్స్ పోలీసులు సీఐ నాగరాజుకు అప్పగించారునాగరాజు 24 గంటల్లోపు సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టలేదునాన్బెయిలబుల్ వారెంట్ ఉన్నా కూడా కోర్టులో ప్రవేశపెట్టలేదుసాయికృష్ణను నాగరాజు కస్టడీలో ఉండగా పీఎస్లో చూసినట్లు ఓ ఎస్సై వాంగ్మూలం ఇచ్చాడుమృతదేహాన్ని కూడా చూసినట్లు తర్వాత అదే ఎస్సై స్టేట్మెంట్ ఇచ్చాడుసాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాక.. డెడ్బాడీని మాయం చేశారుకృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీఫుటేజీ లేదుమే 1 నుంచి జూన్ 1 దాకా ఫుటేజీలు లేవువాటిని ఎవరు? ఎందుకు మాయం ఎందుకు చేశారనేది తేలాల్సి ఉందిఅయితే మే 6-8 తేదీల మధ్య.. ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ డెలివరీ బాయ్ సాయికృష్ణను చూసినట్లు చెప్పాడుఇతర సాక్ష్యాలను పరిశీలించాకే.. కస్టోడియల్ డెత్గా నిర్ధారించుకున్నాంఈ కేసులో నిందితుడైన నాగరాజును అరెస్ట్ చేశాంఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదుఅక్రమ నిర్బంధం, పోలీస్ కస్టడీలో మరణం.. డెడ్బాడీ మాయం చేశారుహైకోర్టులో నిజాలు దాచి అత్యంత తీవ్రమైన నేరం చేశారుఆధారాలు మాయం కావడం సహా అన్నింటికీ నాగరాజే కారణమని భావిస్తున్నాంసిట్ తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది ప్రకారం.. మార్కాపురంలో టాస్క్ఫోర్స్ పోలీసులు గాదె సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) ఉన్నప్పటికీ, చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచలేదని తెలిపారు. ఇది కోర్టు ధిక్కరణ (Contempt of Court) కిందకు వస్తుందని పేర్కొన్నారు.అలాగే దర్యాప్తులో సాయికృష్ణ పోలీసుల అదుపులో ఉండగానే మృతి చెందినట్లు ఆధారాలు లభించాయని సిట్ కోర్టుకు వెల్లడించారు. మృతి విషయాన్ని మెజిస్ట్రేట్కు తెలియపర్చకుండా.. మృతదేహాం మాయం చేశారని తెలిపారు. అయితే సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారన్న ఆరోపణలకు ఆధారాలేమిటని న్యాయమూర్తి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. నాగరాజు నుంచి కీలక ప్రశ్నలకు సమాధానం దొరకలేదని సిట్ కోర్టుకు తెలిపింది. సాయికృష్ణను ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు?లాకప్ డెత్ తర్వాత సాయికృష్ణ డెడ్బాడీని ఏం చేశారు?పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని ఎందుకు మాయం చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందన సిట్ కోర్టుకు తెలిపింది. అందుకే మరింత దర్యాప్తు అవసరమని పేర్కొంది.నాగరాజుకు రిమాండ్రిమాండ్ రిపోర్ట్ నేపథ్యంలో.. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు నిందితుడు నాగరాజుకు 14 రోజుల రిమాండ్ను విధించింది కోర్టు. జులై 8న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టమని సిట్ను ఆదేశించింది. దీంతో అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.ఇదిలా ఉండగా, తన కుమారుడు కనిపించడం లేదంటూ సాయికృష్ణ తల్లి ఇప్పటికే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ, సిట్ దర్యాప్తు, తాజాగా కోర్టులో వెల్లడైన అంశాలు కేసును మరింత కీలక దశకు తీసుకెళ్లాయి. సీఐ(సస్పెండెడ్) నాగరాజు రిమాండ్ రిపోర్టులో నమోదైన అంశాలు, సిట్ కోర్టుకు సమర్పించిన వివరాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
పెద్దల ఆదేశాలతో.. సిట్ ప్రశ్నలకు నాగరాజు మౌనం
-
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు
-
నా ముందే నా కొడుకుని కొట్టారు.. విజయలక్ష్మి కంప్లైంట్ తో కొత్త ట్విస్ట్..
-
అరెస్ట్ డ్రామా... CI నాగరాజుకి జనసేన MLA సీటు కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
పేరు చెప్పొద్దు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం..! సీఐ నాగరాజు కు బిగ్ ఆఫర్..
-
సాయి కృష్ణ కేసులో మరో సంచలన మలుపు!
సాక్షి, విజయవాడ: సంచలనం రేపిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు.. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు.. కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజు అధికారులు ఐదు గంటలపాటు ప్రశ్నించినా మౌనం వహించినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టుకు సిట్ ఎలాంటి సమగ్ర దర్యాప్తు నివేదికను సమర్పిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ వెలుగులోకి రావడం మరింత కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ “సాయి కృష్ణ ఎక్కడ?” అన్న ప్రశ్న చుట్టూ తిరిగిన వ్యవహారం ఇప్పుడు “సాయి కృష్ణ బతికే లేడు” అనే విషయాన్ని ధృవీకరించే దిశగా వెళ్తోంది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, అనంతరం ఆధారాలు లేకుండా శవాన్ని తగులబెట్టారని ఆరోపిస్తూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఫిర్యాదులో ఏముంది?ఈ నెల 19వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయి కృష్ణను మే నెల మొదటి వారంలో పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) కేసు పేరుతో కృష్ణలంక, మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించారని, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.దండ రెడీ చేసుకో..విజయలక్ష్మి చేసిన ఫిర్యాదులో సీఐ నాగరాజుపై సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన తర్వాత సీఐ నాగరాజు తనతో “నీ కొడుకుని చంపేస్తాం.. దండ రెడీ చేసుకో” అని చెప్పారని విజయలక్ష్మి ఆరోపించారు. అలాగే లాకప్లో సాయి కృష్ణను తీవ్రంగా కొడుతున్న సమయంలో అతడి అరుపులు, కేకలు తాను స్వయంగా విన్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడిని తనతో పంపించాలని కోరగా.. సీఐ నాగరాజు తనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.అందుకే హైకోర్టుకు.. సాయి కృష్ణ ఆచూకీ లభించకపోవడంతో తన కుమార్తె ద్వారా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్లు విజయలక్ష్మి తన ఫిర్యాదులో వివరించారు. అయితే అప్పటికే సాయి కృష్ణ మరణించాడని, ఆ విషయం బయటపడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో అతడి మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా తగులబెట్టారని ఆరోపించారు. తన కొడుకును కిరాతకంగా చంపిన నాగరాజును కఠినంగా శిక్షించాల్సిందేనని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐ నాగరాజుపై అక్రమ నిర్బంధం, ఆధారాలను నాశనం చేయడం, హత్యాయత్నం తదితర అభియోగాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.విచారణలో నాగరాజు ఏమైనా కీలక విషయాలు వెల్లడించాడా? సాయి కృష్ణ ఆచూకీపై స్పష్టత ఇచ్చాడా? ఎవరు చెబితే ఇదంతా చేశాడు?.. సీసీటీవీ పుటేజీ ఎందుకు మాయం చేశాడు?.. అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో నాగరాజుకు రాజకీయ భవిష్యత్తుపై హామీలు ఇచ్చారని, అందుకే విచారణలో పూర్తిగా నోరు విప్పడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సాక్ష్యాలు ఎలా మాయం చేసారంటే...
-
ఈ కేసులో ఆఖరిగా వచ్చే తీర్పు ఇదే.. వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
CI నాగరాజు మామూలోడు కాదు.. ఆ రోజు స్టేషన్ లో జరిగింది ఇదే
-
ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం.. ఎవరి పేర్లూ చెప్పొద్దు
సాక్షి, అమరావతి : ‘వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం.. మిత్రపక్షం అందుకు సిద్ధంగా ఉంది. కాపు యువకుడు సాయికృష్ణ లాకప్లో అదృశ్యం వెనుక సూత్రధారుల పేర్లు బయటపెటొద్దు.’ – ఇదీ సీఐ నాగరాజుకు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆఫర్.సాయికృష్ణను కనుమరుగు చేయడానికి ప్రధాన కారణమైన భూ, ఆర్థిక వ్యవహారాలను వెల్లడించవద్దని, అందులో సూత్రధారులైన పోలీస్ బాస్, బిగ్బాస్తోపాటు అధికార పార్టీ కీలక నేతల పేర్లు బయటపెట్టవద్దని ప్రభుత్వ పెద్దలు షరతు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాగరాజుకు సన్నిహితుడైన రిటైర్డ్ డీజీపీ ఈ మేరకు రాయబారం నడిపినట్లు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. డీల్ కుదరడంతోనే సీఐ నాగరాజు అజ్ఞాతం వీడి, అరెస్టుకు సహకరించినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సీఐ నాగరాజు అరెస్టుకు ముందు తెరవెనుక సాగిన వ్యవహారాలు ఇలా ఉన్నాయి.నేను ఒప్పుకోను.. అందరిపేర్లు బయటపెడతా – ఎదురుతిరిగిన సీఐ నాగరాజుకాపు యువకుడు సాయికృష్ణను లాకప్లోనే కనుమరుగు చేసిన వ్యవహారాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేయాలని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారు. టీడీపీ కీలక నేతల భూ దందాలు, ప్రైవేటు ఆర్థిక సంస్థ అక్రమాలకు సంబంధించిన ఇరువర్గాల మధ్య విభేదాల నేపథ్యంతోనే సాయికృష్ణను టాస్క్ఫోర్స్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ పెద్దలకు కంటిలో నలుసుగా మారిన సాయికృష్ణను అడ్డు తొలగించుకునేందుకు విజయవాడ పోలీస్ బాస్తోపాటు బిగ్బాస్ డైరెక్షన్లో కథ నడిపించారు. టాస్క్ఫోర్స్ అధికారి ఉత్తరాంధ్ర మంత్రికి సమీప బంధువు కాగా, చినబాబుకు నమ్మిన బంటు పోలీస్ బాస్. బిగ్బాస్ ఆమోదంతో గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేశామనుకున్న ఈ వ్యవహారం సాయికృష్ణ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో బట్టబయలైంది. దాంతో సాయికృష్ణ అదృశ్యం ఉదంతాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేసి.. ప్రభుత్వ పెద్దలు, బాస్, బిగ్బాస్లను రక్షించేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. తద్వారా ఈ వ్యవహారానికి కేంద్ర బిందువైన టీడీపీ కీలక నేతల భూ, ఆర్థిక వ్యవహారాలను కప్పిపుచ్చాలన్నది ఎత్తుగడ.అందుకే ఈ కేసులో ఏ1, ఏ2గా ఉండాల్సిన బాస్, టాస్క్ఫోర్స్ అధికారులను తప్పించి కేవలం సీఐ నాగరాజు వరకే ఎఫ్ఐఆర్ను పరిమితం చేశారు. అయితే ఈ ఎత్తుగడ పట్ల సీఐ నాగరాజు తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో తనను ఒక్కడిని ఇరికించి.. పెద్దలు అందరూ తప్పించుకోవాలని యత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఆయన ప్రభుత్వ, పోలీసు పెద్దలకు ఝలక్ ఇచ్చారు. ‘అసలు సాయికృష్ణను అదుపులోకి తీసుకుంది టాస్క్ఫోర్స్ పోలీసులు.. టాస్క్ఫోర్స్ సీపీ ఆధీనంలో పని చేస్తుంది. అందువల్ల ఈ వ్యవహారంతో నాకేం సంబంధం లేదు’ అని సీఐ వాదించినట్టు సమాచారం. టాస్క్ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి గానీ, తనకు అప్పగించినట్టు ఉన్నాయా.. అని ఆయన ప్రశ్నించడంతో ప్రభుత్వ, పోలీసు పెద్దలు షాక్కు గురయ్యారని తెలిసింది. నాగరాజు ఈ మాటలకే కట్టుబడితే తమ బండారం బయటపడుతుందని వారు ఆందోళన చెందారు. రిటైర్డ్ డీజీపీ ద్వారా రాయబారంసీఐ వైఖరితో దిమ్మ తిరిగిపోయిన ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీని రంగంలోకి దింపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరించిన ఆయనతో నాగరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉందని సమాచారం. అందుకే అజ్ఞాతంలో ఉన్న నాగరాజుతో సంప్రదింపుల బాధ్యతను ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీకి అప్పగించారు. ఈ కేసులో సహకరిస్తే తాము ఇచ్చే ఆఫర్ను కూడా వెల్లడించారు. దాంతో రిటైర్డ్ డీజీపీ.. సీఐ నాగరాజుతో సంప్రదింపులు జరిపారు. ఈ కేసులో ప్రభుత్వానికి సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే విషయాన్ని తెలిపారు. అందుకు మిత్రపక్షం సమ్మతించినట్టు చెప్పారు. మిత్రపక్ష అగ్రనేత సీఐ నాగరాజుకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల వ్యయాన్ని కూడా ప్రధాన అధికార పార్టీనే సమకూరుస్తుందన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన ఈ కేసులో మాత్రం సహకరించాలని, ఎవరి పేర్లూ బయట పెట్టవద్దన్నది షరతుగా చెప్పారు. ప్రస్తుతం అరెస్టు అయితే త్వరగా బెయిల్పై విడుదల అయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, అనంతరం ఈ కేసును నీరుగార్చేందుకు చేయాల్సిందంతా చేస్తుందని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఫలించినట్టు పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఐ నాగరాజును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వాస్తవానికి సోమవారమే ఆయన్ను అరెస్టు చేయాలని భావించారు. కానీ ఆయన ఎదురు తిరగడంతో సాధ్యం కాలేదు. రిటైర్డ్ డీజీపీ రాయబారంతో డీల్ కుదరడంతోనే సీఐ నాగరాజు అరెస్టుకు సహకరించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీఐ నాగరాజుకు ప్రజా మద్దతు ఉందనేలా ప్రభుత్వం తెరవెనుక నుంచి డ్రామాకు తెరతీసింది. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ శ్రేణులను ఉసిగొల్పి ఆందోళనలు చేయిస్తుండటం గమనార్హం. -
సీఐ నాగరాజును మరోసారి విచారిస్తున్న సిట్
విజయవాడ: సీఐ నాగరాజును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరోసారి విచారిస్తోంది. కమాండ్ కంట్రోల్ వద్దకి అధికారులు మళ్లీ చేరుకున్నారు. ఇప్పటికే మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయికృష్ణను 6 గంటలపాటు విచారించింది సిట్.. అనంతరం, రెండు గంటల విరామం తర్వాత మళ్లీ విచారణ ప్రారంభించింది. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ఆరా తీసింది. ఇప్పటికే సేకరించిన వివరాలతో క్రాస్ వెరిఫికేషన్ చేస్తోంది. సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు అడుగుతోంది. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాయి కృష్ణ హత్య కేసులో సిట్ సీఐ నాగరాజును ఇవాళ తొలిసారి విచారించిన అనంతరం కమాండ్ కంట్రోల్ నుంచి సిట్ చీఫ్ ఐజీ రవి ప్రకాశ్ వెళ్లిపోయారు. నివేదికను సిద్ధం చేసినట్లు సిట్ బృందం చెబుతోంది. నేటి రాత్రి లేదంటే రేపు ఉదయం సీఐ నాగరాజుని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
సిట్ ప్రశ్నలకు CI నాగరాజు షాకింగ్ సమాధానాలు
-
తప్పు ఒప్పుకున్న CI నాగరాజు..? ఎవరెవరి పేర్లు బయటకొస్తాయి?
-
రూట్ మార్చిన పోలీసులు... ఎక్కడికి తీసుకెళ్తారు అనే దానిపై ఉత్కంఠ
-
ఒకరు కాదు ఇద్దరు కాదు.. 28 మంది వరకు ఈ కేసులో నిందితులు ఉన్నారు
-
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్..!
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్, సీసీ పుటేజ్ మాయం ఎందుకు చేసారంటే ..!
-
రాత్రి 2 మృతదేహాలు వస్తే.. పోలీసుల ఒత్తిడితో దహనం చేశాం
-
సాయికృష్ణ కేసు: సీఐ నాగరాజు అరెస్ట్!
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ క్రమంలో అతని నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్.. మంగళవారం నాగరాజు నివాసానికి వెళ్లింది. పోలీసుల రాకను గమనించిన నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు అక్కడ తోపులాట, వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు.అయితే తమ విధులకు ఆటంకం కలిగించిన అనుచరులను పోలీసులు చెదరగొట్టగా.. సిట్ అధికారులు నాగరాజు ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం.. నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ కోసం నాగరాజును పోలీస్ గెస్ట్హౌజ్కు తరలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అక్కడ వైద్యపరీక్షల అనంతరం.. కోర్టులో ప్రవేశపెట్టే చాన్స్ ఉంది. నాగరాజు అరెస్ట్పై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అనే యువకుడి మిస్సింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు లాకప్ డెత్ చేసి ఉంటారనే అనుమానాల నడుమ.. ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణతో పాటు, సంబంధిత వ్యక్తుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ కేసులో కీలక ఆధారమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని నాగరాజు మాయం చేసినట్లు.. లాకప్డెత్ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బూడిద చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ కాపు నేతలంతా భేటీ అయితే చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ఉలిక్కిపాటు ఎందుకని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఇండియాలోనే అరుదైన కేసుగా అభివర్ణిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారాయన. మంగళవారం గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను చాలా స్పష్టంగా చెబుతున్నా.. సాయికృష్ణను చంపేశారు. ఎవరో పెద్ద నేరస్థుడిని రక్షించేందుకు అతన్ని బలి చేశారు. సీబీఐ దర్యాప్తు జరిగితేనే నిజాలు బయటకు వస్తాయి అని అంబటి వ్యాఖ్యానించారు. ఇది దేశంలోనే అరుదైన కేసు. బుర్రలేని జనసేనవాళ్లు సాయికృష్ణను చంపడం కరెక్టేనని మాట్లాడుతున్నారు సాయికృష్ణ మీద 2 కేసులే ఉన్నాయి. కానీ, పవన్ కల్యాణ్ 22 కేసులు ఉన్నాయని అంటున్నారు. శిక్షించడానికి పోలీసులు ఎవరు? శిక్షలు చట్టబద్ధంగా ఉండాలి. నేను సాయికృష్ణను కొట్టారని ఫొటోలు ఇచ్చాను. ఒకవేళ అతను బతికి ఉంటే చెప్పండి.... సాయికృష్ణ లాకప్ డెత్ కేసును మేకప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. చట్ట ప్రకారం.. 18 నెలలపాటు సీసీటీవీ ఫుటేజీలు భద్రపరచాలి. కానీ, కృష్ణలంక పీఎస్లో సీసీ ఫుటేజీ మాయం కావడం ఆందోళనకరమైన విషయం. ఈ విషయాన్ని ఎల్లో మీడియా సైతం ప్రచురించింది. నిందిత పోలీసులను కాపాడటానికే సీసీటీవీ ఫుటేజీలు మాయం చేశారు. .. జనసేన నేతలు కల్లు తాగిన కోతుల్లా చిందులు వేస్తున్నారు. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఈ హత్యాకాండకు, సీఐ నాగరాజుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీలోని కాపు నేతలే ఎందుకు మాట్లాడుతున్నారు?. మిగతా కులాల నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? అని అంబటి ప్రశ్నించారు... చంపడం, బూడిద చేయడం.. సాక్ష్యాధారాలు లేకుండా చేయడం.. ఇదేంటి?. ఎవరో పెద్ద నేరస్థుడిని కాపాడడానికే సాయికృష్ణను బలిచేశారు. చంద్రబాబు వేసిన సిట్తో ఏం ఒరగదు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలి. సీబీఐ, ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. బాధితులకు న్యాయం జరుగుతుంది’’ అని అంబటి తేల్చి చెప్పారు. -
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, విజయవాడ: సంచలనం రేపిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలుగా భావిస్తున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. ఈ వ్యవహారంలో సస్పెండైన సీఐ నాగరాజు పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.దర్యాప్తులో భాగంగా పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ రికార్డులను పరిశీలించిన సిట్ అధికారులు, మే 1 నుంచి జూన్ 1 వరకు ఉండాల్సిన ఫుటేజ్ పూర్తిగా అందుబాటులో లేకపోవడాన్నిగుర్తించినట్లు సమాచారం. నెల రోజుల వ్యవధిలో.. కేవలం రెండు రోజుల ఫుటేజ్ మాత్రమే భద్రంగా ఉంచబడినట్లు తేలింది. మిగతా రికార్డులు ఉద్దేశపూర్వకంగానే తొలగించబడ్డాయా? గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలనే ప్లాన్ చేశారా? నాగరాజే వీటి వెనుక ఉన్నాడా? అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు.ఇటీవల పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే సీసీటీవీ దృశ్యాలను కనీసం నెల రోజుల పాటు భద్రపరచాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాలకు ముందే మే నెలకు సంబంధించిన ఫుటేజ్ తొలగించబడినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఇది సాధారణ సాంకేతిక లోపమా లేదంటే కీలక ఆధారాలను చెరిపివేసే ప్రయత్నమా? అనే దానిపై విచారణ ముమ్మరమైంది.సాయికృష్ణ కేసు దర్యాప్తుకు ఈ సీసీటీవీ దృశ్యాలు అత్యంత కీలకమని భావిస్తున్నారు. బాధితుడు పోలీస్ స్టేషన్కు వచ్చిన సందర్భాలు, అక్కడ జరిగిన పరిణామాలు, పోలీసుల వ్యవహార శైలి వంటి అంశాలపై స్పష్టత ఇవ్వగల ఆధారాలు ఇవేనని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ ఫుటేజ్ లేకపోవడం కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఐ నాగరాజే ఉద్దేశపూర్వకంగా వాటిని మాయం చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అలాగే.. సాయికృష్ణ కేసులో కీలక ఆధారాలు అందుబాటులో లేకుండా పోవడంతో అప్పటి పోలీసు అధికారుల పాత్ర, కేసు నిర్వహణ తీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీ ఫుటేజ్ మాయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన సిట్, బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం సాయికృష్ణ కేసులో మరో కీలక మలుపుగా మారింది. -
కాపు యువకుని లాకప్డెత్ కేసు సీబీఐకి అప్పగించండి
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సాయికృష్ణ లాకప్డెత్కు సంబంధించిన రికార్డులన్నింటినీ భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రొపర్టీ అండ్ ఎని్వరాన్మెంటల్ రైట్స్ సంయుక్త కార్యదర్శి దాడిశెట్టి వీరబాబు సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘సాయికృష్ణ కేసు దర్యాప్తులో ప్రభుత్వ అధికారులు, పోలీసులు చూపుతున్న ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో పారదర్శక, నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరపకపోవడమన్నది రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను హరించడమే అవుతుంది. పోలీసుల చర్యలను ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. ఈ కేసులో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై ముఖ్యంగా అధికారులు, రాజకీయ పెద్దలు పాత్రపై పక్షపాతానికి తావు లేకుండా, స్వతంత్రంగా విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలి. స్థానిక పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదు. కాబట్టి నిష్పక్షపాత దర్యాప్తుతో పాటు వాస్తవాలు వెలుగులోకి రావడానికి కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గం.సాయికృష్ణ కేసుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంటరీ, ఎల్రక్టానిక్, డిజిటల్, ఫోరెన్సిక్, శాస్త్రీయ ఆధారాలను వెంటనే భద్రపరచేలా ఆదేశాలు ఇవ్వాలి. సీసీటీవీ ఫుటేజీ, జనరల్ డైరీ ఎంట్రీలు, స్టేషన్ హౌస్ రికార్డులు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ ఫోన్ డేటా, లొకేషన్ డేటా, హాస్పిటల్ రికార్డులు, పోస్ట్మార్టం రికార్డులు, ఫోరెన్సిక్ సామాగ్రి, పోలీసు వాహనాల రాకపోకల రికార్డులను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలి. ఈ ఘటనతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం ఉన్న ఏ పోలీస్ అధికారిని కూడా దర్యాప్తులో పాలుపంచుకోకుండా, దర్యాప్తును పర్యవేక్షించకుండా ఆదేశాలు జారీ చేయాలి. ఈ వ్యాజ్యం తేలేంత వరకు, కేసును అధికారికంగా సీబీఐకి బదిలీ చేసే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉండేందుకు తక్షణ రక్షణ ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. స్వయంగా పోలీస్ అధికారులపైనే ఆరోపణలు వచ్చినప్పుడు, స్థానిక పోలీసులు జరిపే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం లేనప్పుడు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరవచ్చునని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిన విషయాన్ని పిటిషనర్ పిల్లో ప్రస్తావించారు. ‘సాయికృష్ణ లాకప్డెత్కు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేవలం ఒక్క అధికారిపైనే చర్యలు చేపట్టారు. వాస్తవానికి ప్రజలు, మీడియా సమాచారం ప్రకారం ఈ ఘోరంలో పలువురు పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని స్పష్టమవుతోంది. స్వయంగా రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన అధికారులపైనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు.. రాష్ట్ర పోలీసులే ఈ దర్యాప్తును కొనసాగించడం అసమంజసం’’ అని వీరబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. కొట్టి చంపేశారు... ‘సాయికృష్ణను విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు మే 9వ తేదీన ఓ నాన్బెయిలబుల్ వారెంట్ అమలుకు సంబంధించి మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టకుండా అతడిని మొదట కృష్ణలంక, టాస్్కఫోర్స్ పోలీస్ స్టేషన్లలో రెండు రోజులు ఉంచారు. ఆ తర్వాత విజయవాడ బెంజ్ రోడ్లోని ఒక ప్రైవేట్ హోటల్కు తరలించి, మే 23 వరకు తీవ్రంగా హింసించారు. విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిపి దాదాపు 12 మంది పోలీసులు ఈ హత్య ప్రణాళికలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం మాకుంది.కృష్ణలంక, టాస్్కఫోర్స్ పోలీసుల దాడి కారణంగా సాయికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని మొదట విజయవాడలోని ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత మణిపాల్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఒక రోజు చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మళ్లీ హోటల్ గదికే తీసుకెళ్లి, ఒక డాక్టర్తో ప్రథమ చికిత్స చేయించారు. చివరికి సాయికృష్ణ గాయాలు తట్టుకోలేక మరణించాడు. సాయికృష్ణ మరణించిన తర్వాత, కృష్ణలంక పోలీసులు శవాన్ని మాయం చేయడానికి ప్లాన్ చేశారు.ప్రజలను నమ్మించడానికి, ఆ మృతదేహాన్ని విజయవాడ బస్టాండ్లోని ప్లాట్ నంబర్ 43 వద్ద పడేశారు. అది గుర్తుతెలియని శవంగా భ్రమింపజేసి, మున్సిపల్ అధికారుల సహాయంతో తప్పుడు పంచనామా రికార్డులు సృష్టించారు. స్మశానవాటిక సిబ్బందిని లొంగతీసుకుని, మే 24న మున్సిపల్ కార్పొరేషన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసేశారు. కొడుకు జాడ కోసం తల్లి తీవ్రంగా ప్రయత్నించి, చివరికి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ సమయంలో పోలీసులు తాము అసలు సాయికృష్ణను అరెస్టు చేయలేదని అబద్ధం చెబుతూ, మే 29 వరకు సమయం కోరారు.కానీ ఈ లోపే, విచారణ పేరుతో పోలీసులు అతన్ని కొట్టి చంపేశారనే నిజం బయటపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం సాయికృష్ణ తల్లి సంతృప్తి చెందారు. ఈ విషయాన్ని ఇకపై పెద్దది చేయవద్దని ఆమెను ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా కోరుతున్నారు. అయితే, ఒక బాధ్యతగల పౌరుడిగా వాస్తవాలు వెలుగులోకి రావాలన్న ఉద్దేశంతో సాయికృష్ణ లాకప్డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నా. అందులో భాగంగానే ఈ పిల్ దాఖలు చేస్తున్నా.’ అని వీరబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. -
వ్యక్తిని చంపి బూడిదైన ఇవ్వరా?: కన్నబాబు
సాక్షి, కాకినాడ: ఒక వ్యక్తిని చంపి అతని బూడిదకూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమైన విషయమని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. సాయికృష్ణ కేసుపై కాకినాడలో ఆయన ఈ రోజు ( సోమవారం) మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సొంత రాజ్యాంగం అమలు చేస్తోందని దుయ్యబట్టారు.సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని ఇటీవల జరిగిన ఐదుగురి హత్యలు పోలీసుల చేసిన హత్యలేనన్నారు. సాయికృష్ణపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఎమ్మెల్యే పంతం నానాజీ సంస్కార హీనంగా దిగజారి మాట్లాడుతున్నారన్నారు. పంతం నానాజీ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి పంతం నానాజీకి లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు.? కాపుల గురించి మాట్లాడిన నేతలపై నీచంగా మాట్లాడితే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదని ఆవిషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్, రైతో భరోసా బాధితులు అధికంగా కాపు నేతలే ఉన్నారని ఈ అంశంలో కాపు నేతలంతా కలిసి మాట్లాడుకుంటే మీకొచ్చిన నొప్పేంటి అని ప్రశ్నించారు. కాపులకు జరుగుతున్న అన్యాయాల గురించి కూటమి నేతలు ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. -
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు
-
శవం మీద పేలాలు వేరుకునే వాడివి.. నీది ఒక బ్రతుకేనా...
-
కూటమి సీక్రెట్ ప్లాన్..! సాయి కృష్ణ కేసు వెనుక ఎంపీ, పోలీస్ మధ్య భారీ డీల్
-
పక్క ప్లాన్ చేసి చంపేశారు ... దీనివెనుక చాలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు..
-
సిగ్గులేదా..? కులం పేరు చెప్పి ఆడుకున్నప్పుడు.. నీ బ్రతుకంతా భజన చేయడమే..!
-
పవన్ టార్గెట్ ఎవరు..? సీఐ నాగరాజును ఎందుకు విచారించట్లేదు..?
-
లాకప్డెత్ సాక్షిగా హైడ్రామా..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంచలనం సృష్టిస్తున్న సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సరికొత్త డ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా మరోవైపు పోలీసు బాస్ను కాపాడేందుకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. సాక్ష్యాలు, ఆధారాలు ధ్వంసమయ్యాక 40 రోజుల తరువాత తాపీగా సిట్ ఏర్పాటు పేరుతో చేతులు దులుపుకొంటోంది. ఈ ఘటనను సీఐ నాగరాజుకు ఆపాదించి తూతూమంత్రంగా దర్యాప్తు ముగించే యత్నం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మంటగలిసి పోవడంతో దీన్ని కప్పిపుచ్చేందుకు సర్కారు పడరాని పాట్లు పడుతోంది. సాయికృష్ణ ఉదంతంపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘ఎవరో కులం వాడు క్రిమినల్ పనులు చేస్తే నేను బాధ్యత వహించాలా? ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పరా..?’ అంటూ సాయికృష్ణ మిస్సింగ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో సాయికృష్ణ కుటుంబం జనసేన తరపున పని చేయలేదా? అని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఏమైంది? తొలుత తాము సాయికృష్ణను తీసుకురాలేదని బుకాయించినా తరువాత విధిలేని పరిస్థితుల్లో టాస్్కఫోర్స్, కృష్ణలంక పోలీసులు కలిసి వెళ్లి మార్కాపురం నుంచి మే 9న సాయికృష్ణను విజయవాడకు తెచ్చామని ఒప్పుకోక తప్పలేదు. ఈ విషయాన్ని ఇప్పటికే విచారణాధికారి ఎదుట వెల్లడించినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దలకు, పోలీసు బాస్కు ముందుగానే దీనిపై సమాచారం ఉందని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చామని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, 70 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ప్రత్యేకించి విజయవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వాడటంలో దిట్టలు అని, నగరంలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎన్నో కేసులు చేధించామని ప్రకటించే ఉన్నతాధికారులు సాయికృష్ణ ఆచూకీపై నోరు మెదపకపోవడం సందేహాలకు దారి తీస్తోంది. దీన్నిబట్టి ఈ వ్యవహారం అంతా ప్రభుత్వ పెద్దలు, పోలీసు బాస్ కనుసన్నల్లోనే జరిగినట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. కరుడు గట్టిన నేరస్తుల నుంచి సమాచారాన్ని రాబట్టే పోలీసులు సాయికృష్ణ అదృశ్యంపై వివరాలను సేకరించడం పెద్ద కష్టమేమి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కానిస్టేబుళ్లను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టి సారించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్ డీల్ వ్యవహారమేనా..! సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చి రోజుల తరబడి థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏముందనే కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక భూ వివాదం దీనికి కారణమని.. ఎంపీ, పోలీసుబాస్ పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రాంతి కుమార్ ఆత్మహత్య... సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియోలో వెల్లడించినా ఇంతవరకు దీనిపై పోలీసులు విచారణ చేపట్టలేదు. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారకుడైన సీఐ నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సీఐ ఇంటి వద్ద హైడ్రామా.. తనపై కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు సీఐ నాగరాజు ఇంటి వద్ద హైడ్రామా నడుపుతున్నారు. సీఐపై చర్యలు తీసుకోవద్దంటూ కొందరు యువకులు, మహిళలను పోగు చేసి ఆదివారం ఆందోళన చేయించారు. కొందరు పోలీసులు నాగరాజు ఇంటికి చేరుకుని విచారణ పేరుతో మంతనాలు సాగించారు. ఇక సాయంత్రం ధర్నా చౌక్ ప్రాంతం వద్ద సీఐకు అనుకూలంగా ధర్నా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినా పోలీస్ బాసులు వారించడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం గమనార్హం. ఇవన్నీ కేసును పక్క దారి పట్టించేందుకు చేస్తున్న కుట్రలేనని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. -
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
-
సాయి కృష్ణ కేసులో సిట్ ఏర్పాటు.. CI నాగరాజు అరెస్ట్..?
-
సాయికృష్ణది లాకప్ డెత్ కాదు.. ప్రీ ప్లాన్డ్ మర్డర్..
-
కానిస్టేబుల్ ఇంట్లో సీఐ నాగరాజు.. అరెస్ట్కు రంగం సిద్దం?
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు సంబంధించిన పరిణామాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. కేసు విచారణ కొనసాగుతున్న వేళ ఆయన గత మూడు రోజులుగా ఓ కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజు అరెస్ట్కు సిద్ధమైనట్టు తెలుస్తోంది.అయితే, సీఐ నాగరాజును ఈరోజు పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా, సాయికృష్ణ కేసులో టాస్క్ఫోర్స్ అధికారులు లత కుమారి, సీఐ శ్రీధర్ విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా, కేసులో నిందితుడిగా ఉన్న ఓ పోలీసు అధికారి.. కోర్టు సిబ్బంది ఇంట్లో ఆశ్రయం పొందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాగరాజు అక్కడ ఎందుకు ఉంటున్నారు? ఆయనకు ఎలాంటి సహకారం అందుతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇదిలా ఉండగా.. సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవి ప్రకాశ్, సభ్యులుగా పశ్చిమగోదావరి, అల్లూరి జిల్లా, బాటప్ల అదనపు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. మరోవైపు.. ఈ కేసులో రెండు రోజుల నుంచి దర్యాప్తు బృందాలు టాస్క్ఫోర్స్, కృష్ణలంక స్టేషన్ సిబ్బందిని విచారిస్తున్నారు. వీరి నుంచి స్టేట్మెంట్ల రూపంలో వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం శనివారం కూడా కృష్ణలంక స్టేషన్లో స్టేట్మెంట్లు నమోదు చేశారు. -
లాకప్ డెత్ కేసులో రోజుకో మలుపు.. మలయాళం సినిమాను మించిన క్రైమ్ థ్రిల్లర్
-
సాయి కృష్ణ కేసు వెనుక ఉన్న బడా బాబులను కాపాడటం కోసం ఈ కేసుకు "మేకప్" వేస్తున్నారు
-
సాయి కృష్ణ ను ఎందుకు.. ఎవరు చంపారంటే? వెంకట్ రెడ్డి సంచలన నిజాలు
-
సాయి కృష్ణ కేసులో సిట్ ఏర్పాటు
సాక్షి, విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవి ప్రకాష్ ఉండగా.. సభ్యులుగా పశ్చిమగోదావరి ఎస్పీ అద్నాన్ నయీం షమీ, అల్లూరు సీతారామరాజు ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ SP ఎల్ సుధాకర్ని నియమించింది. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మే 9న అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, హింసించి చంపేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కాగా సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు.. అక్కడ పని చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్డెత్ చేసిన అనంతరం ఇక్కడే ఖననం/అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని దహనానికి అవకాశం లేదని ఇంచార్జి బాషా చెప్పినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వచేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు.ఈ వ్యవహారం.. గాదె సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తోంది. అనాథ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్ను పూర్తిగా పాటించారా లేదా? రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాలు, ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా? అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. -
సాయి కృష్ణ కేసులో బిగ్ రివీల్.. బైక్ పై తీసుకెళ్లి దహనం చేసిన చోటు ఇదేనా..
-
పక్కా ప్లాన్.. సూత్రధారులు ఎస్కేప్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం రేపిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్, కనుమరుగు వ్యవహారం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. సీఐ నాగరాజు ఒక్కడినే బాధితుడిగా చేసి, మిగిలిన ప్రభుత్వ, పోలీసు పెద్దలను కేసు నుంచి తప్పించేందుకు బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొనే సమయంలోనే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. గంటల తరబడి చర్చించి, పోలీసు పెద్దలకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు. అక్రమ నిర్భందం గురించి దాచి ఉంచినందుకు 127(6) సెక్షన్ను జోడించారు. కరకట్ట బంగ్లా డైరెక్షన్లోనే ఈ కేసులో దర్యాప్తు సాగుతోందని తెలుస్తోంది. దీంతో విచారణాధికారులు సైతం మొదటి రోజు సీఐ ఒక్కడినే బాధ్యుడిగా చేసేలా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు రికార్డు చేశారు. టాస్క్ ఫోర్స్ ఏడీసీపీని విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను ఎప్పుడు తీసుకు వచ్చారు.. ఇందు కోసం ఎవరిని పంపించారు.. విజయవాడకు తీసుకొచ్చాక ఎవరికి అప్పగించారు.. అని ప్రశ్నించినట్లు తెలిసింది. పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేసేందుకు సిబ్బందిని పంపించినట్లు ఆమె వివరించినట్లు సమాచారం. దీంతో సాయికృష్ణను తీసుకు వచ్చిన నలుగురు కానిస్టేబుళ్లనూ ప్రశ్నించారు. వీరు ఏం చెప్పారన్నదే ఈ కేసులో కీలకం కానుంది. సాయికృష్ణ మార్కాపురం నుంచి తెచ్చి, సీఐ నాగరాజుకు అప్పగించామనే ఆధారాలను ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లు సమాచారం. కోర్టులో ఒకలా.. దర్యాప్తులో మరోలాసాయికృష్ణ కుటుంబ సభ్యులు ‘మా కొడుకును చూపండయ్యా..’ అని వేడుకొంటూ పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగినా ఖాకీలు కనికరించలేదు. ‘నీకొడుకు లేడు.. ఫొటోకు దండేసుకో’ అంటూ సీఐ హేళనగా మాట్లాడారని తల్లి కన్నీటి పర్యంతమైంది. దీంతో జూన్ 2న కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 4న విచారణకు వచ్చింది. జూన్ 15వ తేదీన సాయికృష్ణను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. అయితే పోలీసుల తరఫున వాదనలు వినిపించిన ఏజీపీ కృష్ణ ప్రణీత్.. సాయికృష్ణ అచూకీ తెలియదని, అందుకే కోర్టు ముందు హాజరు పరచలేదని తెలిపారు. అతన్ని వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అయితే ప్రస్తుతం మార్కాపురం నుంచి విజయవాడకు తెచ్చినట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు విచారణ అధికారికి ఇచ్చిన సమాచారం కీలకమవుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండానే సాయికృష్ణ అచూకీ తెలియలేదని ఏజీపీ కోర్టుకు ఎలా నివేదిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది లా ఉండగా సాయికృష్ణను తెచ్చి రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో కాకుండా, బయట హోటల్లో ఉంచి.. కొట్టి చంపి, దహనం చేయడం వెనుక ఓ పెద్ద సెటిల్మెంట్ వ్యవహారమే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ, పోలీసు పెద్దల హస్తం ఉండటం వల్లే ఇలా చేశారని విశ్వసనీయంగా తెలిసింది.40 రోజులు ఎలా మేనేజ్ చేశారు?సాయికృష్ణ మృతి చెందాక.. అనాథ శవంగా చిత్రీకరించి కృష్ణలంక స్వర్గపురి (విద్యుత్ శ్మశాన వాటిక)లో దహనం చేశారనే ఆరోపణల నేపథ్యంలో విచారణాధికారులు అక్కడి సీసీ పుటేజీ, అక్కడి నిబంధనల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఎలా దహనం చేశారన్న దానిపై ఆరా తీశారు. అయితే అనాథ శవాలను దహనం చేసినప్పుడు నిబంధనల ప్రకారం బూడిద ఇవ్వాల్సిన అవసరం లేదని స్వర్గపురి సిబ్బంది చెబుతున్నారు.అందుకే పోలీసులు ఇలా స్కెచ్ వేశారని సమాచారం. మొత్తంగా ఈ కేసులో సూత్రధారులను రక్షించేలా పక్కా ప్రణాళికతో దర్యాప్తు సాగుతోందని పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఈ విషయం 40 రోజులపాటు మేనేజ్ చేశారంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీలకు.. నగర పోలీస్బాస్ చెప్పకుండా ఎలా ఉంటారని పోలీసు శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ చెప్పకుండా దాచి ఉంచారనుకుంటే అది నేరమే అని చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శకు వచ్చి ఉండకపోతే ఈ కేసు తెరమరుగయ్యేదని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ రాక వల్లే ప్రభుత్వంలో ఒక్కసారిగా చలనం వచ్చిందని, ప్రజల్లో చులకనై పోతామనే భయంతో ఆగమేఘాలపై సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ, సీఎస్, సీపీలు సమీక్షలు.. సీఐ సస్పెండ్, కేసు నమోదు.. ఇలా అన్నీ చకచకా జరిగిపోవడం తెలిసిందే. -
గుంటూరులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
సాక్షి, గుంటూరు: నగరంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కొరిటపాడు లైబ్రరీ సెంటర్ నుండి లాడ్జి సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘క్రాంతికుమార్ మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ పోలీసు దెబ్బలకు తట్టుకోలేక చనిపోయారు. రక్షించాల్సిన పోలీసులే హతమార్చుతున్నారు. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటాడట. 49 రోజుల క్రితం సంఘటన జరిగితే ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదు?. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, వైఎస్ జగన్ వారి ఇంటికి వెళ్లేదాకా ప్రభుత్వం పట్టించుకోదా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘పోలీసులు నమోదు చేసున కేసు కోర్టులో నిలబడదు. లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెల 28న విజయలక్ష్మి ఒక ఫిర్యాదు చేశారు. అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ దాన్ని కాదని మొన్న హడావుడిగా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు?. సీఐ నాగరాజును బలి చేయటానికి హడావుడిగా కేసు నమోదు చేశారు. జడా శ్రవణ్ కుమార్ చాలా స్పష్టంగా సాయికృష్ణ కేసు వివరించారు. సాయికృష్ణ హత్య సీపీ, డీజీపీకి తెలియకుండానే జరిగిందా?..క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు కూడా నిలపడకుండా చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో పెద్దపెద్ద వారి ప్రమేయం ఉంది. 29న కోర్టులో సాయికృష్ణను హాజరు పరుస్తారా?. కనీసం బూడిద కూడా దొరక్కుండా చేశారు. నేరాంగీకారం జరిగితే తప్ప ఇది మర్డర్ కేసుగా నిలబడదు. కాపులను చంపి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారా?. కాపులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.‘‘పోలీసు స్టేషన్కు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. సాయికృష్ణ వ్యవహారం వెనుక ఉన్న బడా బాబులు బయటకు రావాలి. సీఐ నాగరాజు పాత్ర ఒక్కటే సాయికృష్ణ కేసులో లేదు. సీబిఐ విచారణలో మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. రాజమండ్రి ఎస్పీ విచారణలో వాస్తవాలు వెల్లడవ్వవు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
జరిగింది ఇదే.. స్వర్గపురి ఎలక్ట్రిక్ ఫర్నిష్ ఆపరేటర్ షాకింగ్ నిజాలు..
-
ఆ రోజు జరిగింది ఇదే.. స్వర్గపురి శ్మశానవాటిక నిర్వాహకుడు
-
సాయికృష్ణ కేసు.. పోలీసుల అదుపులో బాషా!
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు.. అక్కడ పని చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్డెత్ చేసిన అనంతరం ఇక్కడే ఖననం/అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని దహనానికి అవకాశం లేదని ఇంచార్జి బాషా చెప్పినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వచేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు.ఈ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న గాదె సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తోంది. అనాధ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్ను పూర్తిగా పాటించారా లేదా? రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాలు, ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా? అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు.విచారణలో భాగంగా ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అతడి మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకుని సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో సాంకేతికంగా పరిశీలిస్తున్నారు. శ్మశాన వాటికలో విధి నిర్వహణలో ఏమైనా లోపాలు జరిగాయా? నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
కృష్ణలంక స్మశాన వాటికలో సాయికృష్ణ అస్థికలు..?
-
సాయి కృష్ణ లాకప్ డెత్ శాంపిల్స్ ల్యాబ్ కు తరలింపు...
-
సాయి కృష్ణ తల్లి చంద్రబాబును కలవడంపై.. రాజేశ్వర్ రెడ్డి షాకింగ్ నిజాలు.
-
నీ గబ్బర్ సింగ్ సినిమా చూసి..నాగరాజు రెచ్చిపోయినట్టున్నాడు పవన్ ను ఏకిపారేసిన జడ శ్రవణ్
-
ఈ కేసులో న్యాయం జరిగే ప్రసక్తే లేదు..చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్
-
చంపిన తరువాత ఎందుకు కాల్చారు అంటే, అడ్వకేట్ బాల సంచలనం కామెంట్స్
-
కృష్ణలంక PSలో ఏం జరిగిందంటే! సీన్ టు సీన్ విశ్లేషణ..
-
Ambati: వీళ్ళందరూ హంతకులే..!
-
సాయి కృష్ణను ఎలా ఎప్పుడు చంపారో మొత్తం చెప్పిన జడ శ్రవణ్
-
రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు
-
‘సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా’
సాక్షి, విజయవాడ: ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాజ్యం వేస్తానని తెలిపారు. ఇది లాకప్ డెత్ కాదని.. ప్రీ ప్లాన్ మర్డర్ అన్న శ్రవణ్.. ల్యాండ్ సెటిల్మెంట్ కారణంగానే ఈ హత్య జరిగిందని.. ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలను బయట పెడతానన్నారు.‘‘సాయికృష్ణను ఈ నెల 8న మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొచ్చారు. ఒకరోజు మాత్రమే కృష్ణలంక పీఎస్లో ఉంచారు. 9వ తేదీ ఉదయం సాయికృష్ణను టాస్క్ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లారు. కృష్ణలంక పీఎస్, టాస్క్ఫోర్స్ ఆఫీసుల్లో సీసీ ఫుటేజ్లను జాగ్రత్త పరచాలి. సీసీ ఫుటేజ్ మాత్రమే నిందితులను పట్టించే ప్రాథమిక సమాచారం. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి ఓ ప్రైవేట్ హోటల్కు తీసుకెళ్లారు. ప్రైవేట్ హోటల్ రూమ్ 302లో సాయికృష్ణను చిత్రహింసకు గురిచేశారు. సాయికృష్ణను పగలంతా టాస్క్ఫోర్స్ పోలీసులు, రాత్రి సీఐ నాగరాజు హింసించారు..సాయికృష్ణను ఎందుకు హింసించారో.. ఏమి చెప్పమని కొట్టారో తెలియాలి.. సీఐ నాగరాజు పేరుమీదే హోటల్ రూమ్ బుక్ అయ్యింది. హోటల్ ఎంట్రీలో కూడా సీఐ నాగరాజు పేరుంది. సాయికృష్ణను విపరీతంగా కొట్టడంతో దవడ పగిలిపోయింది. 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. సాయికృష్ణ చనిపోతాడని డాక్టర్లు చికిత్స చేయడానికి నిరాకరించారు. సాయికృష్ణను మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయికృష్ణకు సివిల్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశారు. మణిపాల్ ఆసుపత్రిలో కూడా చేతులెత్తేయడంతో మళ్లీ హోటల్కు తీసుకెళ్లారు. ఆర్ఎంపీతో సాయికృష్ణకు వైద్యం చేయించారు. హోటల్లో సీసీ ఫుటేజ్ను తప్పకుండా జాగ్రత్తపరచాల్సి ఉంది’’ అని జడ శ్రవణ్ పేర్కొన్నారు. -
రికార్డెన అసలు నిజం, విచారణలో బయటకు రాబోతున్న సంచలన నిజాలు..!
-
గుడివాడకు నోటీస్ ఇచ్చిన హోం మంత్రి, సాయికృష్ణ కేసు మీద డీజీపీ, సీపీకి ఎందుకు ఇవ్వలేదు
-
హోటల్లో రెండు రోజులు చిత్రహింసలు పెట్టి CIకి అప్పగించారు..! అంబటి షాకింగ్ కామెంట్స్
-
అనితను ఛీ కొడుతున్న టీడీపీ కీలక నేతలు?
-
‘సాయికృష్ణ కేసును చంద్రబాబు తొక్కేద్దామనుకున్నారు’
సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసుల దుర్మార్గాలపై తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నించారు.‘‘గత నెల 28నే అడ్వకేట్ కనకదుర్గ ఫిర్యాదు చేశారు. అయినా సరే పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు?. వైఎస్ జగన్ వెళ్తేగానీ సీఐ మీద కేసు నమోదు చేయరా?. లాకప్ డెత్ జరిగినట్టు ప్రభుత్వం అంగీకరించింది. సాయికృష్ణ పిన్ని కనకదుర్గ హైకోర్టులో పిల్ వేశారు. ఇక్కడ్నుంచే అసలు కథ ప్రారంభమైంది. సీఐ నాగరాజు మీద కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తే సరిపోదు. పేరిపోగు క్రాంతికుమార్ కూడా సీఐ టార్చర్ వలనే ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాల వెనుక సీఐతోపాటు చాలామంది అధికారులు ఉన్నారు. వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.‘‘సాయికృష్ణ చనిపోయిన ఫోటో, కాళ్ల మీద గాయాలు ఉన్న ఫోటోలు ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి అవన్నీ ఫేక్ ఫోటోలు అంటున్నారు. అవి ఫేక్ ఫోటోలు అయితే సాయికృష్ణను చూపించండి. నేను చూపినవి ఫేక్ ఫోటోలైతే నా మీద కేసు పెట్టుకోవచ్చు. తాము జనసేన పార్టీ అని సాయికృష్ణ కుటుంబ సభ్యులే చెప్పారు. అలాంటి కార్యకర్త ఇంటికెళ్లి కనీసం పరామర్శించలేదు. పైగా రాజీ చేయాలని చూడటం సిగ్గుచేటు. ఆ తల్లి అడిగిన సాయికృష్ణ భస్మం అయినా ఇవ్వండి. జనసేన నాయకులుగా ఉండి ఏం ప్రయోజనం?’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘మీకు చేతగాని పని మేము చేస్తే బురద జల్లుతారా?. సాయికృష్ణ కేసులో మిగిలిన పాత్రధారులంతా బయటకు రావాలి. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సీబీఐ విచారణ చేయాలి. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండొచ్చు. కానీ పోలీసు వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ పోకడలపై మా పోరాటం ఆగదు’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. -
సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు.. అసలు ఏం చేశారు?
-
CPM నేతల ముందు సాయి కృష్ణ మేనమామ భావోద్వేగం
-
‘ఫిర్యాదు చేసినప్పుడే సీపీ, డీజీపీ ఎందుకు స్పందించలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీతో పాటు ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడమే మీ పనా? అంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల భాష సంస్కార హీనంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయామని పోలీస్ అధికారులే చెబుతున్న పరిస్ధితి నెలకొందని ఆయన ధ్వజమెత్తారు.‘‘సాయికృష్ణ తల్లిదండ్రులు సీపీకి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు?. సాయికృష్ణ లాకప్ డెత్పై సీఎం, హోం మంత్రి ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్తే తెల్లారేలోపు ఎఫ్ఐఆర్ వేశారు. మేకప్ కోసం మాజీ మంత్రి అమర్నాథ్కు నోటీసు ఇచ్చిన హోంమంత్రి.. సాయికృష్ణ లాకప్ డెత్ మీద డీజీపీ,సీపీకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఆక్వా రంగంలో ఒక మాఫియా తయారైంది. ఫీడ్, సీడ్, ఎగుమతుల్లో మాఫియా. రైతు పరిస్ధితి చాలా దయనీయంగా ఉంది. వైఎస్ జగన్ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగొట్టింది. రెండో ఏడాది 7 లక్షల మందికి కోత విధించారు. ఒక్క కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. మోంథా తుపాను బాధితులకు ఇవాళ్టీకి సాయం అందించలేదు...రైతులకు సున్నా వడ్డీ ఏదీ?. 393 మంది రైతులు ఒక ఏడాదిలో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత పంటల బీమా పథకం ఎత్తేశారు. పొగాకు రైతులు ఇవాళ ఒంగోలులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తున్నారు. రైతులకు కార్డు ఇచ్చి.. యూరియా, ఎరువులకు కోత పెట్టారు. కౌలు రైతులు, గిరిజన రైతులు, దేవాదాయ శాఖ రైతులకు కార్డులు లేవు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన కౌలు గుర్తింపు కార్డులను చంద్రబాబు తుంగలోకి తొక్కేశారు. ఎరువులు కావాలంటే.. రూ.15-20 వేలు పెట్టి రైతులు స్మార్ట్ ఫోన్ కొనాలి. రైతును రోడ్డున పడేశారు. ఎరువు కావాలన్న.. విత్తనం కావాలన్న ఎవర్నికలవాలో తెలియదు. రైతులకు ఏం కావాలో తెలుసుకోకుండా.. మేకప్లపై డిస్కషన్లు పెడుతున్నారు’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
CBI ఎంక్వైరీకి రెడీనా హోమ్ మినిస్టర్ గారు
-
మరి సీఐ వెనక ఉన్న బాస్ ల సంగతేంటి..? సెక్షన్-238 కేసులో కీలకం..!
-
Asha Kiran: క్రిమినల్ అయితే చంపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు
-
ACPతో సంచలన విషయాలు చెప్పిన సాయి కృష్ణ మేనమామ
-
సాయి కృష్ణ ఎక్కడ అని అడిగితే ACP మాకు చెప్పిన సమాధానం..
-
సాయికృష్ణ కేసు: సీన్ లోకి ఏసీపీ.. దర్యాప్తు ముమ్మరం!
-
సాయి కృష్ణ తల్లి స్టేట్మెంట్ రికార్డు చేసిన ACP
-
కేసులుంటే చంపేస్తారా ? CPM నేతలు సంచలన కామెంట్స్
-
సాయి కృష్ణ కేసుపై ACP ఫస్ట్ రియాక్షన్
-
ఫోరెన్సిక్ టీమ్ కి కీలక ఆధారాలు ఇవే!
-
కృష్ణ లంక పోలీస్ స్టేషన్ కు ఫోరెన్సిక్ టీమ్
-
ACP: ఫోటో రెడీ చేసుకుని దండేసుకో.. ఏంటి సార్ ఈ దారుణం..!
-
IPS చదివింది రాజకీయ నాయకులకు ఊడిగం చేయడానికా..
-
చనిపోయింది ఒకరు కాదు.. ఇద్దరు.. సాయికృష్ణ తల్లితో విచారణ బృందం..
-
సాయికృష్ణ ఇంటికి ఏసీపీ బృందం.. కృష్ణలంకకు ఫోరెన్సిక్ టీమ్
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఒక పోలీసు అధికారిపైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. కాగా, కేసు విచారణ నిమిత్తం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దైవ ప్రసాద్ బృందం శుక్రవారం ఉదయం సాయికృష్ణ నివాసానికి చేరుకుంది.ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐల బృందం.. సాయికృష్ణ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. అయితే, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆసుపత్రికి వెళ్లడంతో వారి నివాసంలోనే పోలీసుల బృందం కాసేపు వేచి ఉన్నారు. ఈ క్రమంలో విచారణ అధికారి ఏసీపీ దైవ ప్రసాద్తో సాయికృష్ణ మేనమామ మాట్లాడుతూ.. సీఐ చంపింది.. ఒకరిని కాదు.. ఇద్దరినీ అంటూ మండిపడినట్టు సమాచారం. సాయికృష్ణని భౌతికంగా చంపితే.. అతడి తల్లిని మానసికంగా చంపారు అంటూ ఘాటుగా స్పందించినట్టు తెలిపింది. మరోవైపు.. కాసేపటి క్రితమే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు ఫోరెన్సిక్ టీమ్ చేరుకుంది. సాయికృష్ణ కేసులో ఆధారాల సేకరణపై ఫోరెన్సిక్ టీమ్ దృష్టిపెట్టింది.ఇదిలా ఉండగా.. సాయికృష్ణ ఇంటికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శకు వెళ్లిన తర్వాతే ఈ కేసులో.. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగాల్లో కదలికలు రావడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి 11గంటల సమయంలో బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి పిలుపు వెళ్లింది. ఆ తర్వాతే సీఐ నాగరాజుపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా.. అప్పటికప్పుడే నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఫిర్యాదును కమిషనర్ స్వయంగా స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదు కాపీని విజయలక్ష్మికి అందజేశారు. సీఐ నాగరాజుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం గమనార్హం. క్రైమ్ నంబర్ 107/2026గా నమోదైన ఈ కేసులో .. బీఎన్ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1)తో పాటు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 238 కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. -
‘సీఐపై కేసు.. సాయికృష్ణను చంపేశామని సర్కార్ ఒప్పుకుంది’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేశారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.సాయికృష్ణ కేసు విషయమై తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. రెండు మూడు కేసులు ఉంటే చంపి బూడిద చేస్తారా?. చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు?. సీఐ మీద కేసు పెట్టడం ద్వారా సాయికృష్ణను చంపేశామని ప్రభుత్వం ఒప్పుకుంది. సాయికృష్ణ తల్లి శోకం మీ కంటికి కనిపించడం లేదా?. ఆ తల్లి కన్నీరు చూసి రాష్ట్ర ప్రజానీకం తల్లడిల్లిపోతుంది.సాయికృష్ణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాయి కృష్ణ ఉదంతం పోలీసులకు కనువిప్పు కావాలి. సాయికృష్ణ హత్య వ్యవహారంలో A1గా చంద్రబాబును పెట్టాలి. లోకేష్, అనిత, డీజీపీ, సీపీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మన రాష్ట్రానికి చేతకాని సీఎం అధికారంలో ఉన్నారు. లాకప్ డెత్ జరిగితే మేకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. -
సాయి కృష్ణ ఇంటికి ACP.. జగన్ దెబ్బకు దిగొచ్చిన పోలీసులు
-
సాయికృష్ణ కేసు వెనుక.. జనం తిరగబడితే తట్టుకోలేరు.. చివరికి జరిగేది ఇదే..
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!
-
ఇక నా కొడుకు లేడయ్యా... సాయి కృష్ణ తల్లిని ఓదార్చిన YS జగన్
-
వైఎస్ జగన్ రాకతో CI నాగరాజుపై కేసు నమోదు
-
రాజకీయాల కోసం కాదు ఆ తల్లి కన్నీరుని చూసి గుండెమండి.. అంబటి రాంబాబు ఎమోషనల్
-
నేరంలో CI, ACP, DGPకి కూడా భాగం ఉంది..
-
సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే... గిగ్ వర్కర్ సాయికృష్ణ లాకప్డెత్ ఘటనలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
-
మనిషిని చంపే హక్కు నీకెవడిచ్చాడు? సాయి కృష్ణ కేసులో మొదటి ముద్దాయి చంద్రబాబు..!
-
పోలీసుల గుట్టు రట్టు.. సాయికృష్ణ కేసులో సంచలన నిజాలు
-
నా కొడుకు ఇక లేడయ్యా..
సాక్షి, అమరావతి: పోలీసులు మా అబ్బాయిని కొడుతుంటే ఆ అరుపులు వినిపించాయి. ఏడెనిమిది మంది కొట్టి.. చంపేసేంతటి తప్పు ఏంచేశాడయ్యా.. పోలీసులు అన్యాయంగా మా పిల్లాడిని పొట్టన పెట్టుకున్నారయ్యా..’ అంటూ లాకప్డెత్ అయిన సాయికృష్ణ తల్లి కన్నీటి పర్యంతమైంది. గురువారం సాయంత్రం సాయికృష్ణ తల్లిని, కుటుంబ సభ్యులను విజయవాడ కృష్ణలంకలోని వారి నివాసంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కన్నీరు మున్నీరు అవుతూ, బొంగురు పోయిన కంఠంతో, తన కొడుకును ఏవిధంగా పోలీసులు కొట్టి చంపారో పూసగుచ్చినట్లు వివరించారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి మే 9న సాయికృష్ణను తీసుకొచ్చారు. అక్కడ స్టేషన్లో ఉంచారని కొంత మంది కుర్రాళ్లు చెబితే అక్కడి వెళ్లి, మా కొడును చూపండయ్యా అని వేడుకున్నాను. అక్కడ కానిస్టేబుల్ ఓ సమాధానం, ఎస్సై మరో సమాధానం ఇచ్చారు. పైన ఉన్నాడని, రేపు ఇంటికి పంపుతామని చెప్పారు. ఆ తర్వాత పలుమార్లు ఎండలో స్టేషన్ చుట్టూ తిరిగాను. స్టేషన్కు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న యువకులు సైగలు చేశారు. కానీ నాకు సరిగా కనిపించలేదు. మా అబ్బాయి అరుపులు వినిపించాయి.పైకి వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ లాకప్లో ఉన్న వారు మావాడిని ఏవిధంగా కొట్టింది చెప్పారు. కాళ్ల గోళ్లు పీకేసి, ఆర్ఎంపీ డాక్టర్తో కట్టు కట్టించారని, కాళ్లకు ఇంజక్షన్లు వేయడంతో కాళ్లు పని చేయకుండా పోయాయని తెలిపారు. మెడలు విరిచారని చెప్పారు. అమ్మను చూపించండని వేడుకొంటున్నా కనికరించకుండా బలవంతంగా ఇద్దరు కానిస్టేబుళ్లు పిల్లాడిని ఈడ్చుకొని వెళ్లి రూంలో పడేశారు. ఆ తర్వాత సాయికృష్ణ గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పలేదు. చివరకు డౌట్ వచ్చి డీజీపీకి ఫిర్యాదు చేశాం.ఆ ఫిర్యాదు సీపీ వద్దకు వచ్చింది. అప్పుడు పోలీసులు వచ్చి అయిందేదో అయ్యింది.. రాజీ చేసుకుందామని దూతలను పంపారు. ఆ దూత తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అమ్మిశెట్టి వాసు. దీంతో మాకు పూర్తి డౌట్ వచ్చింది. జూన్ 2వ తేదిన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. నాకు ఏమీ వద్దయ్యా.. నా కొడుకును చంపిన వారందరినీ శిక్షించాలి. ఒక్కగానొక్క కొడుకును ఏడెనిమిది మంది కొట్టి చంపేంత తప్పు ఏమి చేశాడు? శవం లేకపోతే కనీసం బూడిదైనా ఇప్పించండని అడిగినా పట్టించుకోలేదు. సీఐ నాగరాజు మా కుమారుడిని చంపేస్తానని ముందే చెప్పాడు. అన్నంత పనీ చేశాడు. ఫొటో చేయించి దండేసుకో అని హేళనగా మాట్లాడాడు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. తాము అన్ని విధాల అండగా ఉంటామని ఆ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు.. ఈ ఘటన గురించి సాయికృష్ణ మేనమామలు ముళ్లపూడి నవరంగ్, నాగేశ్వరరావు, సోదరి విజయలక్ష్మి, న్యాయవాది అయిన పినతల్లి కనకదుర్గ జగన్కు వివరించారు. ‘సాయికృష్ణ లాంటి వారు సీఐ నాగరాజు చేతిలో దెబ్బతిని చాలా మంది చనిపోయారు. ఆయన పోలీసు స్టేషన్కు రమ్మన్నారంటే చాలు ఈ ప్రాంతంలో యువకులు హడలి పోతున్నారు. ఆయనకొట్టే కొట్టుడును తటుకోలేక పారిపోతున్నారు. మా అబ్బాయి కూడా చాలా రోజులుగా ఇక్కడ లేడు. గిగ్ వర్కర్గా జొమాటోలో పని చేస్తున్నాడు. అలాంటి వాడిని ఇక్కడికి తెచ్చి చంపేశారు.ఇదంతా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే జరిగింది’ అని చెప్పారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మేనమామ నవరంగ్ మే 21న సీఐ నాగరాజు వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ వీడియోను చూపించారు. దీంతో పాటు సాయికృష్ణను కొడుతుంటే చూసిన ఓ అబ్బాయి సెల్ఫీ వీడియోను జగన్కు చూపించారు.ఆ వీడియోలో ఏముంది అంటే.. నాకళ్లారా చూశా.. లాకప్లోనే ఉన్నాడు: ప్రత్యక్ష సాక్షి మహంకాళి చందు‘నా పేరు మహంకాళి చందు అలియాస్ పూరి.. గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి అనే వ్యక్తిని కృష్ణలంక పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్లో ఉన్నా. ఆ రోజు ఏం చేశారో నాకు తెలుసు. ఒక తల్లికి జరిగిన నష్టం.. మరో తల్లికి కలిగిన కష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఆరోజు ఏం జరిగిందో చెబుతున్నా.. ఈ వీడియో తీస్తున్నందుకు నాకు భయం వేస్తోంది. కానీ ధైర్యం చేసి చెబుతున్నా.. నేను లాకప్లో ఉండగా అతన్ని తెచ్చి చిత్రహింసలు పెట్టారు. అది నేను చూశాను. దాని గురించి బయటకు వచ్చి చెబుదామనుకున్నా చాలాసార్లు.. నాకు జరిగింది జువైనల్ కోర్టు దగ్గరకు వెళ్లి లాయర్లకు చెబితే పోలీసులకే సపోర్టు చేశారు.అందుకే ఎవరికీ చెప్పలేదు. అన్యాయంగా చంపేసి నీ కొడుకును చంపేశామని చెప్పడం న్యాయం కాదు. పైగా సాయి గురించి జనాలకు చెడ్డగా చెబుతున్నారు.. అతను అమ్మాయిలను ఏడిపించాడని ప్రచారం చేస్తున్నారు. మరి ఏ అమ్మాయి అయినా ఫిర్యాదు చేసిందా? పోలీసుల థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందంటే.. శరీరంపై కొన్ని చోట్ల కరెంట్ షాక్ ఇస్తారు. దాని గురించి కోర్టులో చెప్పకూడదని బెదిరిస్తారు. ఏది ఏమైనా చంపే హక్కు వారికి లేదు. తప్పు చేసిన వాడిని జైల్లో పెట్టాలి. అంతే. ఏ శిక్ష వేయాలో కోర్టు నిర్ణయిస్తుంది. బాబురావు, నాని ఆ రోజు సాయిని పట్టుకుని కొడుతున్నారు.సీలింగ్ తెగిపోయిందని చెబుతున్నా సీఐ వినలేదు. ఆ తర్వాత ఆ రోజు నన్ను, మిగతా వాళ్లను స్టేషన్ నుంచి బయటకు పంపారు. సీఐ నాగరాజు చాలా చేశారు. బయటకు రాలేదు. ఒక తల్లిగా ఆమె ఎంత బాధ పడుతుందో అందరూ చూస్తున్నాం. బాబురావు మనుషులను ఎంత దారుణంగా కొడతాడో చాలా మంది దగ్గర వీడియోలు ఉన్నాయి. నాకు ఒక అవకాశం ఇస్తే మీడియా ముందుకు వస్తా.. చాలా మంది నిన్ను చంపుతారు.. వీడియో చేయొద్దు అని నాకు చెబుతున్నారు.. ఏం జరిగినా నష్టం లేదు. నా తల్లికి కూడా ఇదే జరుగుద్ది.ఏపీలో న్యాయం బతకాలి’ అని మహంకాళి ఆ వీడియోలో చెప్పాడు. కాగా, సాయికృష్ణ కుటుంబ పరామర్శలో జగన్ వెంట వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్కుమార్, సింహాద్రి రమేష్, పార్టీ నేతలు వంగవీటి నరేంద్ర, రామిరెడ్డి, కొండారెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, ఆళ్ల చెల్లారావు, పుప్పాలకుమారి, అవుతు శైలజారెడ్డి తదితరులు ఉన్నారు. -
సీబీఐ దర్యాప్తు జరగాలి
సాక్షి, అమరావతి: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్డెత్కు గురైన గిగ్ వర్కర్ సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని, అందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో విజయవాడ కమిషనర్తో పాటు, రాష్ట్ర డీజీపీకి కూడా ప్రమేయం ఉందన్నారు. కేవలం కంటి తుడుపుగా సీఐని సస్పెండ్ చేశారని, విజయవాడ సీపీ, డీజీపీతో సహా బాధ్యులందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలని తేల్చి చెప్పారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్డెత్కు గురైన గాదె సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను గురువారం ఆయన పరామర్శించారు. కృష్ణలంకలో ఉంటున్న వారి ఇంటికి వెళ్లి జరిగిన దారుణం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతి ఒక్కరూ ఆలోచించాలివిజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్ కూడా ఉంది. ఇక్కడే ఏసీపీ పరిధి. ఇదే పరిధిలోనే కృష్ణలంక పోలీసు స్టేషన్ ఉంది. ఇదే పోలీసు స్టేషన్ పరిధిలోనే ఈ తల్లి (జగన్ పక్కనే ఉన్న సాయికృష్ణ తల్లి) ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెబుతూ రోదిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరినీ ఒకటే ఆలోచన చేయమని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంత మంది పోలీసులు, వీరు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్కు వెళ్లడానికి భయపడే పరిస్ధితి నెలకొంది. అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. అందరూ కూడబలుక్కుని ఒకరినొకరు ఎలా వెనకేసుకు వస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం. ‘పోలీసులు చెబుతున్నట్లు నా కొడుకు దోపిడీలు, దొంగతనాలు చేసి కోట్లు గడిస్తే, ఒక గిగ్ వర్కర్గా ఎందుకు పని చేస్తాడు బాబూ..’ అని ఆ తల్లి తన గోడు వెళ్లబోసుకుంది. ఆ కుటుంబం పరిస్థితి అంత దారుణంగా ఉంది.‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో’ అన్న పోలీసులు ఆ రోజు (మే 9) నుంచే సాయికృష్ణ తల్లి పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగితే, ‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో..’ అంటూ ఈ తల్లిని సీఐ హేళనగా మాట్లాడారు. ఆ రోజు నుంచి ప్రతి రోజూ ఆ స్టేషన్లో జరుగుతున్న విషయాల మీద మిగతా వాళ్లు సమాచారం ఇస్తుంటే, తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని ఆ తల్లికి అర్థమైంది. దీంతో ప్రతి రోజూ అదే పోలీసు స్టేషన్కు వెళ్లి నా కొడుకును నాకు చూపించమని బాధ పడిన పరిస్థితులు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఈ ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మ అయిన లాయర్ డీజీపీ ఆఫీసుకు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏమైంది? చివరికి చెత్త బుట్టలోకి వెళ్లింది. డీజీపీ ఫిర్యాదును సీపీకి పంపించడం, సీపీ యాక్షన్ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారు.హైకోర్టును ఆశ్రయించాక ఒప్పుకున్నారుతన కుమారుడికి ఏదో జరిగిందని ఆ తల్లికి అర్థమై.. తన కొడుకు కనిపించడం లేదు, వీళ్లు ఏదో చేశారని జూన్ 2న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. అప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడంతో పాటు, మన లాంటి వాళ్లంతా ఆ తల్లికి అండగా నిలబడితే గత్యంతరం లేక ఈ రోజు సీఐపై చర్యలు తీసుకున్నారు. చంపేశాడనే కదా సీఐని సస్పెండ్ చేసింది! అంటే ఒకే పోలీసు స్టేషన్లోనే, ఆ సీఐని కాపాడుతూ ఏసీపీ, ఏసీపీని కాపాడుతూ కమిషనర్, కమిషనర్ను కాపాడుతూ డీజీపీ.. ఇలా అందరికీ తెలిసి ఆ స్టేషన్లో జరిగింది ఒక హత్య మాత్రమే కాదు. పోలీసు స్టేషన్లలో ఇలా కొడుతూ ఒకరి చావుకు కారణమైతే, ఇంకొకరు ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నేను ఒకటే చెబుతున్నా. సస్పెన్షన్ అంటే ఏంటి? టెంపరరీగా ఒక పోలీసు అధికారిని డ్యూటీ నుంచి తప్పించడం. అంటే.. గోళ్లు పీకి, చిత్ర హింసలు చేసి హత్య చేస్తే ఆ వ్యక్తిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. ఇదా చేయాల్సింది? అది కూడా ఇంత పెద్ద ఇష్యూ జరిగి బయటికి వస్తే ఆ సస్పెన్షన్ చేశారు. ఇది బయటికి రాకపోయుంటే ఆ ఆలోచన కూడా వచ్చేది కాదు.కృష్ణలంకలో జనానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది కదా..ఇంత పెద్ద హేయమైన కార్యక్రమం జరిగిందంటే..ఆ సీఐని, బాధ్యుడైన కమిషనర్ను, డీజీపీని మర్డర్ కేసు పెట్టి ఛార్జ్ చేయాల్సింది పోయి కేవలం సీఐని సస్పెన్షన్ మాత్రమే చేశారు. అంటే అందరూ పకడ్బందీగా, కలిసికట్టుగా నేరం చేసి.. తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా, టెంపరరీగా ఓ అధికారిని తప్పించారు. ఇదా మనం ఈ రాష్ట్రంలో చూడాల్సింది? ఆ పిల్లాడి వయసు 23 ఏళ్లు. అంటే వీళ్లంతా చిన్న పిల్లలే. తెలిసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు. కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని సమన్ జారీ చేసింది. పోలీసులు చేయాల్సింది ఏంటి? ఆ పిల్లాడిని కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఆ పిల్లాడు తప్పు చేశాడా, లేదా అన్నది విచారణ చేసి కోర్టు నిర్ధారిస్తుంది. ఆ తర్వాత తప్పు జరిగిందని తేలితే కోర్టు శిక్ష వేస్తుంది. కానీ ఇక్కడ కోర్టు పాత్ర లేదు. వీళ్లే తమ చేతుల్లోకి తీసుకుని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమయ్యారు.సీఐ మాత్రమే బాధ్యుడు కాదుసీఐ, ఏసీపీ, కమిషనర్ దగ్గరి నుంచి డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యలు చేపట్టి, కేవలం సస్పెన్షన్తో సరిపెడితే వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఫుల్ స్టాప్ పడాలంటే దీని మీద సీబీఐ దర్యాప్తు జరగాలి. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది బయటికి రావాలి. ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు డిలే జరిగింది? సస్పెన్షన్ మాత్రమే చేసి టెంపరరీగా సీఐని ఉద్యోగం నుంచి పక్కన బెట్టారంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రైమ్లో సీఐ ఒక్కడే కాదు.. ఏసీపీ, సీపీ, డీజీపీ ఇన్వాల్స్ అయి ఉన్నారు. అందుకే సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాం. న్యాయ పోరాటంలో ఈ తల్లికి, చనిపోయిన మరో పిల్లాడి కుటుంబానికి వైఎస్సాసీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం.మే నెలలోనే రెండు ఘటనలుమే నెలలో సాయికృష్ణది ఓ ఘటన అయితే, క్రాంతికుమార్ అనే మరో యువకుడిది ఆత్మహత్య ఘటన. పలానా పోలీసు స్టేషన్ పరిధిలో పలానా సీఐ రోజూ నన్ను కొడుతున్నాడు.. నేను తట్టుకోలేకపోతున్నాను.. నా చావుకు కారణం ఆ సీఐ.. అని మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. (కృష్ణలంక సీఐ వేధిస్తున్నాడని, తన చావుకు సీఐ కారణమని మరణ వాంగ్మూలం ఇస్తూ క్రాంతికుమార్ విడుదల చేసిన సెల్ఫీ వీడియోను మీడియా ఎదుట జగన్ ప్రదర్శించారు).సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేమే 9వ తేదీ నుంచి రెండు మర్డర్ ఘటనలు జరిగితే ఇప్పుడు జూన్లో బయటికి వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా అరెస్టులు కూడా చేయకుండా సస్పెన్షన్లు చేస్తున్నారు. ఏ విధంగా వీళ్లంతా నేరాన్ని బయటికి రాకుండా చేస్తున్నారో అర్థం అవుతోంది. ఈ తల్లి దగ్గరకు పంచాయతీలు చేసి, సర్దుబాట్లు చేసుకునేందుకు బేరసారాలు చేస్తూ.. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఇన్ఛార్జ్లు వచ్చి మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్ధితులు ఉన్నాయో గమనించాలి. కమిషనర్, డీజీపీ వంటి వంటి వ్యక్తులు పూర్తిగా ఇన్వాల్స్ అయ్యి.. నేరం చేయించారని కనిపిస్తున్నా, ఓ ఎస్పీ స్థాయి అధికారికి వీళ్లు దర్యాప్తు చేయడానికి బాధ్యత అప్పగించారట! అంటే వీళ్లు లా అండ్ ఆర్డర్తో, ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారనే దానికి ఇది ఇంకొక నిదర్శనం. అందుకే సీఐ మొదలు ఏసీపీ, కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి వరకూ అందరూ నిర్లక్ష్యపు వైఖరితో ఉన్నారు కాబట్టి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే. దోషులు ఎవరో తెలిసి కూడా ఎలా కాపాడుతున్నారు.. ఎందుకు ఇలాంటి లాకప్ డెత్లు జరుగుతున్నాయో తెలియాలంటే సీబీఐ విచారించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
వదిలిపెట్టను..! ఫోటోకు దండే...!? CIకి జగన్ మాస్ వార్నింగ్
-
ఎవడి అండతో రెచ్చిపోతున్నారు? చంద్రబాబుపై జగన్ ఫైర్
-
ప్రత్యక్ష సాక్షి వీడియోను జగన్కు చూపించిన సాయి కృష్ణ తల్లి
-
జగన్ ముందు ఏడ్చేసిన సాయి కృష్ణ తల్లి
-
సాయి కృష్ణ తల్లిని ఓదార్చిన YS జగన్
-
LIVE: YS Jagan గాదె సాయికృష్ణ ఇంటికి..
-
సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలవనున్న వైఎస్ జగన్
-
సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: కృష్ణలంకలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మిని పరామర్శించి ఓదార్చారు. సాయికృష్ణ అదృశ్యం, పోలీసుల వైఖరిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ జగన్ తెలిపారు.అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున దారుణ ఘటన జరిగిందని.. సీపీ, ఏసీసీ, సీఐ కూడా ఇందులో ఉన్నారని.. డీజీపీకి కూడా దీంతో సంబంధం ఉందన్నారు. ‘‘మే 9న సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లారు. తన కొడుకు ఎక్కడున్నాడని ఈ తల్లి పోలీసులను అడిగింది. కొడుకును చూపించమని పోలీస్స్టేషన్కు వెళ్లని రోజు లేదు. నీ కొడుకు ఫొటోకు దండ వేసుకోమని ఆ తల్లికి చెప్పారు. ..బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను చెత్తబుట్టలో వేశారు. సాయికృష్ణ తల్లితో బేరసారాలు చేశారు. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేసింది. బాధితులకు మేం సపోర్ట్గా నిలబడ్డాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘గత్యంతరం లేక సీఐని సస్పెండ్ చేశారు. చంపారని ఒప్పుకున్నారు కాబట్టే సీఐని సస్పెండ్ చేశారు. ఒకరి కాదు.. ఇద్దరి చావుకు సీఐ నాగరాజు కారణమయ్యాడు. చంద్రబాబు మాత్రం అతన్ని కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు. సీపీ, ఏసీసీ, డీజీపీపై మర్డర్కేసు పెట్టాల్సింది పోయి.. కేవలం సీఐ నాగారాజును సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. సాయికృష్ణ తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయి. కానీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపేశారు. సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.‘‘కంటితుడుపుగా సీఐ నాగారాజును మాత్రమే సస్పెండ్ చేశారు. ఈ క్రైమ్లో సీఐ ఒక్కడినే బాధ్యుడిని చేయడం కాదు. నేరంలో సీపీ, ఏసీపీ, డీజీపీకి కూడా భాగం ఉంది. వీళ్లందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
నా కళ్లారా చూశా లాక్అప్లోనే ఉన్నా, ప్రత్యక్ష సాక్షి షాకింగ్ నిజాలు
-
జైల్లో ఖైదీలు చెప్పిన మాటలు వింటుంటే ...అంబటి సంచలనం
-
సాయికృష్ణ కేసులో వాటిని భద్రపరచాలని కోర్టు ఆదేశం
విజయవాడ రెండో ఏజేఎం కోర్టు గాదె సాయికృష్ణ కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశించింది. సీసీ ఫుటేజ్తో పాటు కాల్డేటాను కూడా భద్రపరచాలని కోర్టు చెప్పింది. కాగా, గాదె సాయి కృష్ణ లాకప్ డెత్కు గురయ్యారనే వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. గాదె సాయి కృష్ణ నెల రోజుల క్రితం కనపడకుండాపోయారు. ఆయన ఆచూకీ గల్లంతయిన కేసుపై ఇటీవల ఏపీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. ఆ సమయంలో న్యాయస్థానం సీఐ నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 29లోగా బాధితుడిని హైకోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. లేకపోతే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని చెప్పింది. కాగా, విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని.. మార్కాపురం జిల్లాకు చెందిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మీడియాకు చెప్పారు. -
సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన YSRCP నేతలు
-
రాజశేఖర బాబు కమిషనర్ అయ్యాక అరాచకాలు పెరిగాయి
-
‘వారికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?’
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగి చాలా రోజులైందని.. వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ(గురువారం) కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి నరేంద్ర పరామర్శించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారు. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణను కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారు. విజయలక్ష్మి చెల్లి దుర్గ డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ వద్దకు వెళితే అడ్డుపడ్డారు. హెబియస్ కార్పస్ వేయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. జూన్ 15వ తేదీన కోర్టు ఆర్డర్ వచ్చాక మా దృష్టికి తెలిసింది. సాయికృష్ణ కుటుంబం మాకు బాగా తెలిసిన వారే..సాయికృష్ణ పై ఓ వర్గం మీడియా దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. కేసులున్నంత మాత్రాన చంపేస్తారా?. కసబ్ను కూడా విచారించాకే శిక్ష విధించారు. సాయికృష్ణ డెడ్బాడీ లేకుండా చేశారు. కనీసం బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకుంటోంది. సాయికృష్ణ కుటుంబం మా పార్టీ కాదు. అయినా మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మేం రాజకీయాలు చేయాలంటే చాలా అంశాలున్నాయి..సాయికృష్ణ అంశాన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగా అందరూ సాయికృష్ణ కుటుంబం కోసం కలిసిరావాలి. పోలీసుల దుర్మార్గపు చర్యలను నిలదీద్దాం. మేం ఆ కుటుంబానికి అండగా ఉంటాం. నేను విడుదల చేసిన ఫోటోలు సాయికృష్ణవి కాకపోతే అతన్ని తీసుకురండి. మానవసమాజం తలదించుకునే ఘటన ఇది.ఇలాంటి ఘటనలను పౌరసమాజం కచ్చితంగా స్పందించాలి. పోలీస్ కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వానికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?. అందరికీ తెలిసే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి. పోలీసు విచారణతో న్యాయం జరగదు. సీబిఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేసినట్లే కేసును కూడా బూడిద చేయాలని చూస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళతాం. సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతోనే నేరం సగం అంగీకరించారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
రాజకీయ నేతల హస్తం ఉన్నదని బలంగా చెపుతున్న సాయి కృష్ణ తల్లి
-
సీఐకి డైరెక్షన్ ఇచ్చిన కూటమి నాయకుడు..!? హత్య వెనుక ప్రభుత్వ హస్తం..?
-
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో బాసు, బిగ్ బాసే సూత్రధారులు
-
సాయి కృష్ణ ఫోటోలు నాకు ఎలా వచ్చాయో తెలుసా..
-
వాడిని నీ రూమ్ లో ఎంత హింసించావో చెప్పనా


